Sri Sita Ramachandraswamy Temple
-
జగదభిరాముడికి పట్టాభిషేకం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి గురువారం పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం యాగశాలలో చతుఃస్థానార్చన హోమం జరిపారు. 10 గంటలకు శంఖు, చక్ర, ధనుర్బాణాలు ధరించిన సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తిని మేళతాళాలు, కోలాటం, భక్తుల జయజయ ధ్వానాల నడుమ పల్లకీ సేవగా తీసుకొచ్చి మిథిలా స్టేడియంలోని వేదికపై సింహాసనంలో కొలువుదీర్చారు. శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహించేందుకు వైదిక మంత్రాలతో వశిషు్టడు, వామనుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, విజయుడు, సుయజు్ఞడులను వేద పండితులు వరింపజేసుకున్నారు. మధ్యా హ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తాన బంగారు సింహాసనంపై స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, వజ్రకిరీటాలను స్వామివారికి ప్రదానం చేశారు. లక్ష్మీదేవిని ఆవా హన చేసి రాజముద్రికను కుడిచేతి వేలికి తొడిగారు. ఆ తర్వాత పూర్తి రాజ లాంఛనాలతో సామ్రాట్ కిరీటాన్ని శ్రీరాముడికి అలంకరించారు. రామదాసు చేయించిన పచ్చల పతకం శ్రీరాముడికి, చింతాకు పతకం సీతాదేవికి, రామ మాడను లక్ష్మణుడికి అలంకరించారు. స్వర్ణఛత్రం నీడలో ఎడమవైపు రాజఖడ్గం, కుడి వైపున రాజదండంతో శ్రీరాముడు దర్శ నం ఇవ్వగా, తిలకించిన భక్తులు పులకించిపోయారు. అనంతరం మండపత్రయంలో మంత్రించిన జలాలను శ్రీరాముడిపై ప్రోక్షణ చేస్తూ పట్టాభిషేకాన్ని పూర్తి చేశారు. చివరగా ముత్యాల దండతో ఆంజనేయుడికి పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలకు హాజరైన గవర్నర్ పట్టాభిషేక వేడుకకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువ్రస్తాలు సమ ర్పించారు. మొదట ఆలయానికి వచ్చిన గవర్నర్కు అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకోగా పండితులు వేదాశీర్వచనం అందచేశారు. పట్టాభిషేకం పూర్తి కావడంతో.. ఈనెల 23 వరకు జరిగే వసంత పక్ష ప్రయుక్త తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టాలు ముగిశాయి. రామరాజ్యమే ప్రతి ఒక్కరి ఆశయం కావాలి: గవర్నర్ రామరాజ్యం నిర్మించడమే ప్రతి ఒక్కరి ఆశయం కావాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. రామరాజ్యంలో ప్రతి ఒక్కరి హక్కులకు రక్షణ ఉంటుందని, తప్పులకు చోటులేదని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చెప్పారు. సమాజంలో కుటుంబాలు మరింత ఐక్యంగా ఉండాలని, తద్వారా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఎవరికీ అన్యాయం చేయకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. -
భద్రాద్రి మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి నలువైపులా మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఇటీవల జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ చైర్మన్ జీబీఎస్ రాజు దంపతులు స్వామివారి దర్శనానికి భద్రాచలం రాగా, భక్తుల సౌకర్యార్థం మాడవీధుల్లో శాశ్వత ప్రాతిపదికన గ్వాలియర్ షీట్లతో పందిరి నిర్మాణానికి సహకరించాలని ఆలయ ఈవో రమాదేవి కోరారు. దీంతో ప్రతిపా దనలు రూపొందించేందుకు జీఎంఆర్ సంస్థ ఇంజనీరింగ్ అధికారులను శనివారం భద్రాచ లం పంపించగా.. ఆలయ ఈఈ రవీందర్, ఏఈవోలతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. నాలుగు వైపులా 80 వేల చదరపు అడు గుల పందిరి నిర్మాణానికి రూ.8 కోట్లు ఖర్చవు తుందని అంచనా వేశారు. కాగా దక్షిణ భాగం నుంచి తూర్పు మెట్లు, వైకుంఠ ద్వారం వరకు తొలి విడతగా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
టీఎస్ఆర్టీసీ ఆఫర్.. ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్దమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేయనుంది. హైదరాబాద్లోని బస్ భవన్లో బుధవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. అనంతరం బిజినెస్ హెడ్ (లాజిస్టిక్స్) పి.సంతోష్ కుమార్కు రూ.116 చెల్లించి రశీదును ఆయన స్వీకరించారు. తొలి బుకింగ్ చేసుకుని తలంబ్రాల బుకింగ్ను ప్రారంభించారు. ‘భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని గత ఏడాది టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. తమ సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. గత ఏడాది దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను అందజేశాం. తద్వారా రూ.71 లక్షల రాబడి వచ్చింది. గత ఏడాది డిమాండ్ దృష్ట్యా ఈ శ్రీరామ నవమికి భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను కోరుకునే భక్తులకు అందజేయబోతున్నాం. ఈ సారి రాములోరి కల్యాణంతో పాటు 12 ఏళ్లకో సారి నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలి. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలన్నారు. తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లు భక్తుల వద్ద కూడా ఆర్డర్ను స్వీకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్ కుమార్, మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సి.టి.ఎం (ఎం అండ్ సి) విజయ్కుమార్, సీఎంఈ రఘునాథ రావు, సీఎఫ్ఎం విజయ పుష్ప, నల్లగొండ ఆర్ఎం శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. -
నరసింహావతారంలో భద్రాద్రి రాముడు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు సోమవారం నాలుగో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యస్వామి నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం బేడామండపంలో వేద పండితులు దివ్యప్రబంధనం పఠించాక, స్వామిని నరసింహావతారంలో ప్రత్యేకంగా అలంకరించి పల్లకీ సేవ నిర్వహిస్తూ మిథిలా స్టేడియంలోని వేదికపై కొలువు తీర్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా, అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య మంగళవారం వామనావతారంలో దర్శనమివ్వనున్నారు. -
భద్రాద్రి రామయ్యకు ముస్లిం భక్తుడి వితరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి గురువారం ఖమ్మానికి చెందిన రామయ్య భక్తుడు ఎస్కే జాన్ మహ్మద్ రూ.1,00,116 వితరణగా అందజేశారు. రామయ్య ఆలయాన్ని గతంలో కూడా పలువురు ముస్లిం భక్తులు సందర్శించి స్వామివారిని దర్శించుకున్న సందర్భాలున్నాయి. – భద్రాచలం -
కూకట్పల్లిలో... దేవాలయం శిఖర ప్రతిష్ట చేసిన చినజీయర్ స్వామి
కూకట్పల్లి: నగరంలోని కూకట్పల్లిలో ఉన్న 436 ఏళ్ల నాటి శ్రీ సీతా రామ చంద్రస్వామి దేవాలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమం సోమ వారం త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆలయానికి విచ్చేసిన చినజీయర్ స్వామికి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు, ఆలయ అధికారులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. గర్భగుడిలో యంత్ర ప్రతిష్టాపన తరువాత వెండి ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. యాగశాలలో పూర్ణాహుతి, మూల విరాట్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. -
భద్రాద్రిలో వైభవంగా ధ్వజారోహణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ధ్వజారోహణం కనుల పండువగా జరిగిం ది. నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్టాపన చేయ డమే కాక ఇతర పూజలు నిర్వహించారు. తొ లుత ప్రధానాలయం నుంచి వేద పండితు లు సమస్త లాంఛనాలతో తిరుకల్యాణ ఉత్స వమూర్తులైన శ్రీ సీతారామలక్ష్మణ స్వామి వారిని ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చే స్తూ ధ్వజస్తంభం వద్దకు తోడ్కొని వచ్చా రు. అనంతరం గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ జరిపి.. బ్రహ్మోత్సవ ర క్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆ హ్వానిం చి ఆరాధన చేశారు. అనంతరం శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రు డైన గరుత్మం తుడి పటాన్ని మంగళ వాయిద్య ఘోష మధ్య ధ్వజస్తంభంపై ఎగుర వేశారు. ఆ తర్వాత సంతానం లేనివారికి గరుడ ముద్దలను అం దజేశారు. ఈ ముద్ద తీసుకున్న వారికి సం తానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. -
శ్రీరామ నీ నామమెంతో రుచిరా..
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం భక్త రామదాసు 389వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం, చక్ర సిమెంట్స్, నేండ్రగంటి అలివేలు మంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో వివిధ నగరాల నుంచి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసులు రామయ్యతో పాటు భక్తరామదాసుకు నవరత్న ఘోష్టితో ‘స్వరార్చన’ జరిపారు. తొలుత రామదాసు ప్రతిమతో భద్రగిరి ప్రదక్షిణ, నగర సంకీర్తన, రామదాసుకు అభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా మూడు రోజుల పాటు నిర్వహించే రామదాసు జయంతి ఉత్సవాలను కరోనా ఆంక్షల నేపథ్యాన ఈసారి ఒకేరోజుకు పరిమితం చేశారు. -
Bhadrachalam: రామాలయంలో ఇక ‘పెళ్లిసందడి’
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఇకపై పెళ్లి బాజాలు మోగనున్నాయి. 2018 వరకు రామాలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఉపాలయం పక్కన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అనుమతి ఇచ్చేవారు. అనంతరం పలు కారణాలతో ఆలయ ప్రాంగణంలో శుభకార్యాలను నిరాకరించారు. భక్తుల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ, ఈలోపు కోవిడ్ కారణంగా అధికారులు నిర్ణయం తీసుకోలేకపోయారు. తాజాగా కరోనా నిబంధనలు సడలించడం, భక్తుల నుంచి సైతం విజ్ఞప్తులు పెరగడంతో ఆలయ ఈవో శివాజీ తాజాగా వైదిక కమిటీతో చర్చించారు. వైదిక కమిటీ, ఈవో తీసుకున్న నిర్ణయం మేరకు ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద రూ.1,116 చెల్లించి శుభకార్యాలు జరుపుకోవచ్చు. అలాగే, చిత్రకూట మండపంలోని విశాలమైన వేదిక వద్ద శుభకార్యాల నిర్వహణకు రూ.10,116 వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ శుభకార్యాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అల్పాహారం, భోజనాలకు మాత్రం అనుమతించరు. కాగా, వివాహాది శుభకార్యాల్లో అన్యమతాలకు చెందిన వస్తువులు, ఇతర సామగ్రి వినియోగించకుండా చూడాలని ఆలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఆదివారం సువర్ణపుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. ఆదివారంను పురష్కరించుకొని తొలుత అంతరాలయంలో మూలవరులకు అభిషేకం, అనంతరం సువర్ణపుష్పార్చనను గావించారు. ఆ తదుపరి బేడా మండపంలో నిత్య కల్యాణోత్సవంను కన్నులపండువగా జరిపారు. వేడుకలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని భద్రుని మండపంలో స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. పవిత్ర గోదావరి నది నుంచి అర్చకులు, ఆస్థాన విద్యాంశుల మంగళవాయిద్యాల నడుమ తీసుకొచ్చిన గోదావరి పుణ్య జలాలతో భద్రునిగుడి లో స్వామి వారిపాదుకుల వద్ద అభిషేకం నిర్వహించారు. శ్రీసీతారామచంద్రస్వామి వారి మూర్తులకు అంతరాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక పల్లకిపై మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయ ప్రాకార మండపంలో ఆశీనులు చేసిన స్వామివారికి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. శ్రీసీతారాముల వారికి ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య అర్చకులు అత్యంత వైభవోపేతంగా రామయ్యకు నిత్యకల్యాణం జరిపించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామి ప్రసాదాలను అందజేశారు. అదే విధంగా అంతరాలయంలో స్వామి వారి దర్శనం కల్పించారు. -
కల్యాణం.. కమనీయం
♦ వైభవంగా శ్రీసీతారాములవారి కల్యాణం ♦ లక్షలాది మంది భక్తులతో పులకరించిన భద్రాద్రి ♦ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఇంద్రకరణ్రెడ్డి సాక్షి, భద్రాచలం/కొత్తగూడెం: జై శ్రీరాం.. జై శ్రీరాం అంటూ భక్తుల జయజయ ధ్వానాలు.. వేద పండితుల మంత్రోచ్చారణలు, విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ భద్రాచల శ్రీసీతారాముల వారి కల్యాణం బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరిగిన కల్యాణానికి వేదికైన మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన అశేష భక్తజనంతో భద్రాద్రి పులకించింది. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించే వారు, తలనీలాల మొక్కు తీర్చుకునేవారితో గోదావరి తీరం నిండిపోయింది. పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ స్వల్ప అనారోగ్యం కారణంగా సీఎం కేసీఆర్ ఈ కల్యాణానికి హాజరుకాలేకపోయారు. దాంతో ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కేసీఆర్ కుటుంబం తరఫున ఆయన మనవడు, కేటీఆర్ కుమారుడైన హిమాన్షు.. రామచంద్రస్వామికి, సీతమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఇక భద్రాద్రి ఆలయ విశిష్టతను, వైకుంఠ రాముడి ప్రాశస్త్యాన్ని, భక్తరామదాసు సేవలను, ఆయన సీతారాములకు చేయించిన బంగారు ఆభరణాల ప్రాశస్త్యాన్ని ఆలయ వేద పండితులు వివరించడం భక్తులను ఆకట్టుకుంది. గోత్రం, ప్రవరలపై దుష్ప్రచారం వద్దు కల్యాణ సమయంలో సీతమ్మ, రామచంద్రస్వామి గోత్రం, ప్రవరలు చెçబుతున్న తీరుపై జరుగుతున్న ప్రచారాన్ని వేద పండితులు ఖండించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం ప్రాధాన్యతను, ప్రతిష్టను దెబ్బతీసేందుకే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని, అది వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రామచంద్రస్వామిని నారాయణుడిగా, సీతమ్మ తల్లిని లక్ష్మీదేవిగా భావించి భగవంతుడి గోత్రాలను చదువుతుంటామని, రాముడికి అచ్యుత గోత్రం, సీతమ్మ తల్లికి సౌభాగ్య గోత్రం చదివి లోక కల్యాణం జరిపిస్తామని వివరించారు. నేడు మహా పట్టాభిషేకం భద్రాచలంలోని మిథిలా స్టేడియం ప్రాంగణంలో కల్యాణోత్సవం జరిగిన మండపంలోనే గురువారం శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ వేడుక జరగనుంది. పట్టాభిషేక మహోత్సవానికి ప్రభుత్వం తరఫున గవర్నర్ నరసింహన్ విచ్చేసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా ఈ సీతారాముల కల్యాణ మహోత్సవానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జైశ్వాల్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల, ఎంపీ సీతారాంనాయక్, డీజీపీ అనురాగ్ శర్మ, టీటీడీ ఈవో సాంబశివరావు, దేవాదాయ కమిషనర్ శివశంకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
భద్రాద్రికి ఏడువేల మంది భక్తుల పాదయాత్ర
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఒక రోజు ముందే వేలమంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ కనిపించింది. వీరు ముందుగా పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆ తరువాత స్వామి వారి దర్శనానికి బారులుతీరారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏపీలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, రాజమండ్రి నుంచి పాదయాత్రగా దాదాపు 7000 మంది భక్తులు భద్రాచలం చేరుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం బేడా మండపంలో స్వామి వారి భజనలు చేశారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
నగల మాయంపై కొనసాగుతున్న విచారణ
సీసీ టీవీ పుటేజీల పరిశీలన భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బంగారు నగల మాయంపై విచారణ కొనసాగుతోంది. సీతమ్మ వారి పుస్తెలతాడు, లక్ష్మణస్వామి లాకెట్ మాయమై, పది రోజుల తర్వాత తిరిగి అదే చోట కనిపించిన వ్యవహారంలో కొంతమంది అర్చకులు, దేవస్థానం ఉద్యోగుల పాత్ర ఉందనే ప్రచారం సాగింది. దీనిపై డీఈ రవీందర్ను విచారణ అధికారిగా నియమించారు. గర్భగుడిలో నగలు భద్రపరిచే బీరువాలోకి ఎవరెవరు వెళ్లారో సీసీ టీవీ పుటేజీలను ఆదివారం పరిశీలించారు. పవిత్రోత్సవాలు ప్రారంభమైన ముందు రోజు ఓ అర్చకుడు నగలు భద్రపరచగా.. పవిత్రోత్సవాలు ముగిసిన తరువాత స్వామివారి కల్యాణం ప్రారంభించిన రోజున మరో అర్చకుడు నగలు బీరువాలోంచి తీసుకొచ్చినట్లుగా వెల్లడైంది. నగలు మాయమై, తిరిగి ప్రత్యక్షమైన రోజు వరకు మొత్తం 12 మంది అర్చకులు గర్భగుడిలోని బీరువా వద్దకు వెళ్లి వచ్చినట్లుగా సీసీ పుటేజీల్లో వెల్లడైనట్లు తెలిసింది. ఈవో రమేశ్బాబుతో చర్చించిన తర్వాత అర్చకుల నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే, దేవస్థానంలోని అధికారితోనే నగల మాయంపై విచారణ జరిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీతమ్మ పుస్తెల తాడు, లక్ష్మణుడి లాకెట్ను అమెరికాలోని ఓ ఆధ్యాత్మిక సంస్థకు అమ్మే క్రమంలోనే వాటిని మాయం చేశారని, ఇందులో దేవాదాయశాఖకు చెందిన ఓ కీలక వ్యక్తి ప్రమేయం కూడా ఉందనే ప్రచారం సాగింది. భక్తుల నుంచి వస్తున్న విమర్శలతో దీనిని మరుగున పరిచేందుకే దేవస్థానం అధికారులు విచారణకు ఇక్కడి అధికారిని నియమించారనే ఆరోపణలు వస్తున్నారుు. ఈ మొత్తం పరిణామాలపై తీవ్ర ఆవేదనతో ఉన్న కొంతమంది అర్చకులు త్వరలోనే దేవాదాయశాఖ ఉన్నతాధికారులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. వైదిక కమిటీలోని ఓ కీలక వ్యక్తి తన పదవికి రాజీనామా చేయటం కూడా చర్చనీయాంశంగా మారింది. -
భద్రాద్రిలో హీరో సంపూ, డీఐజీ పూజలు
భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామి వారిని వరంగల్ రేంజ్ డీఐజీ టి.ప్రభాకర్ రావు దంపతులు శుక్రవారం దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినీ హీరో సంపూర్ణేష్బాబు దేవస్థానానికి వచ్చి అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ లక్ష్మీతాయారమ్మ వారిని, ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. -
రాములోరి ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు
పట్టాభిషేకం తేదీలో మార్పు నిర్లక్ష్యంపై ఈఓ జ్యోతి సీరియస్ భద్రాచలం : భద్రాచలం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయట పడింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముద్రించిన ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు దొర్లాయి. శ్రీరామ మహా పట్టాభిషేక వైశిష్ట్యమును తెలియపరుస్తూ ఆహ్వానపత్రికలోని ఓ పేజీలో ముద్రించారు. అందులోనే పట్టాభిషేకం ఎప్పుడు నిర్వహించేది తెలుపుతూ తేదీని ముద్రించారు. వాస్తవంగా పట్టాభిషేకం ఈ నెల 16న జరగనుండగా, ఆహ్వాన పత్రికలో మాత్రం చైత్ర శుద్ధ దశమి ఆదివారం అనగా 29-03-2015న జరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలాదిగా ముద్రించిన ఆహ్వాన పత్రికలు ఇప్పటికే పంపిణీ మొదలైంది. రాష్ట్ర మంత్రులు, ఇతర ఉన్నతాధికారులకు వీటిని దేవస్థానం అధికారులు అందజేశారు. జిల్లాలో ఉన్న వివిధ ఆధ్వాత్మిక సంస్థల నిర్వాహకులకు ఈ పుస్తకాలు వెళ్లాయి. అదే విధంగా వీటిని మీడియాకు కూడా అందజేశారు. పట్టాభిషేకం నిర్వహణ తేదీ త ప్పుగా ముద్రితమైందనే విషయాన్ని మీడియా ప్రతినిధులు దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే తప్పిదాన్ని వారు గుర్తించారు. జరిగిన తప్పిదంపై దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆహ్వాన పత్రిక తయారీలో భాగస్వామ్యులైన వారి నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని భావిస్తున్న ఆమె సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల కాలంలో దేవస్థానంలో తరచు తప్పిదాలు జరుగుతున్నప్పటకీ, వాటిని ఎత్తి చూపేవారిపై ఆలయ పెద్దలు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. తాజాగా జరిగిన ఈ పరిణామాలపై వారు ఏ రీతిగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. -
మహాక్రతువులో దివ్యప్రబంధ విన్నపాలు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీరామ మహాక్రతువు శనివారం ఘనంగా జరిగింది. పది రోజులుగా నిర్వహిస్తున్న మహాక్రతువులో భాగంగా శనివారం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించి.. అష్టాక్షరి, ద్వాదశాక్షరి, షడాక్షరి, శ్రీరామ తారక శ్రీమంత్ర పునశ్చరణ హోమం నిర్వహించారు. హోమంలో అగ్ని ప్రతిష్ఠ చేసి వేద దివ్య ప్రబంధాది పారాయణాలు చేసి చతుష్టానార్చనలు, వేదాది విన్నపాలు చేశారు. శ్రీరామాయణం నుంచి 20 సర్గలను శ్లోక హవనం చేశారు. అనంతరం నిత్య పూర్ణాహుతి, భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం గావించారు. -
భద్రాద్రిలో వైభవంగా మహాక్రతువు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో మహాక్రతువు వైభవంగా కొనసాగుతోంది. భక్తరామదాసు కాలం నాటి విగ్రహాలకు బంగారు కవచం వేయనున్న నేపథ్యంలో శ్రీరామాయణ మహాక్రతువు నిర్వహిస్తున్నారు. వందేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులో భాగంగా చిత్రకూటమండపంలో శ్రీరామాయణ పారాయణం 20 సర్గలను పఠించారు. తిరువారాధన, ప్రాబోధిక చతుద్వారార్చన, చతుస్థానార్చన, వేదాది విన్నపాలు చేశారు. శ్లోక హవనం గావించి, నిత్య పూర్ణాహుతి ఇచ్చి బుధవారం నాటి కార్యక్రమానికి ముగింపు పలికారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. -
ఎంతో మంది చూపు...
- భద్రాద్రి దేవస్థానం పాలక మండలిపై కసరత్తు - దరఖాస్తుదారుల జాబితాపై పరిశీలన పూర్తి - భద్రాచలం నుంచి తలపడుతున్న 27 మంది.. - బయటి జిల్లాల నుంచీ పోటీ.. - మంత్రి తుమ్మల ఆశీస్సుల కోసం యత్నాలు భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పాలక మండలి ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాలక మండలిలో చోటు కల్పించాలని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమగ్ర వివరాలపై ఇప్పటికే పరిశీలన పూర్తయింది. దేవాదాయశాఖకు చెందిన ఓ ప్రత్యేక అధికారి అభ్యర్థుల వివరాలను సేకరించి, ఉన్నతాధికారులకు అందజేశారు. భద్రాచలం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ఎంపికయ్యేందుకు ఇలా రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలతో కూడిన జాబితా దేవాదాయశాఖ కమిషనర్కు చేరింది. విచారణ అనంతరం సిద్ధం చేసిన జాబితా నేడో రేపో దేవాదాయశాఖ నుంచి ప్రభుత్వానికి అందనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటారు. దసరాకు ముందే ప్రభుత్వం పాలక మండళ్లను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆశావాహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లోకల్ డిమాండ్ దేవస్థానం పాలకమండలిలో చోటు కల్పించాలని కోరుతూ భద్రాచలం నుంచి 27 దరఖాస్తులు అందారుు. గతంలో ట్రస్టుబోర్డు సభ్యులుగా పనిచేసిన వారితో పాటు వివిధ రంగాలకు చెందిన వారు, టీఆర్ఎస్ నేతలు దరఖాస్తు చేశారు. దేవస్థానం పాలక మండలిలో 9 మంది సభ్యులు ఉంటారు. ఇందులో ఒకరు చైర్మన్గా నియమితులవుతారు. వీరిలో దేవస్థానం ప్రధానార్చకుల్లో ఒకరిని నామినేటెడ్గా ఎంపిక చేయటం ఆనవారుుతీ. ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2011 నవంబర్లో భద్రాద్రి పాలక మండలిని నియమించారు. ఇది రెండేళ్ల పాటు కొనసాగింది. రాష్ట్ర విభజన జరిగాక ఇప్పటి వరకు పాలకమండలిని నియమించలేదు. ఎవరిని వరించేనో..! రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో భద్రాచలం దేవస్థానం పాలకమండలిలో చోటు కోసం గట్టి పోటీనే ఉంది. చైర్మన్ పదవి కోసం భద్రాద్రి వాసులే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల పందేరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కు తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పాలక మండలి చైర్మన్ రేసులో భద్రాచలానికి చెందిన ఓ విద్యాసంస్థల అధినేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రి తుమ్మలకు నమ్మినబంటు కావడంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఆయనకు ఒకింత ఎక్కువే కావడంతో అతని వైపు మొగ్గుచూపే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీనే ఉంది. ఆదాయం పెరుగుతున్నా అభివృద్ధి లేదు.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి ఏటేటా ఆదాయం పెరుగుతున్నా ఆ స్థారుులో అభివృద్ధి మాత్రం జరగటం లేదు. భక్తులిచ్చే కానుకులు, హుండీల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆలయంలో ఉత్సవాల నిర్వహణ, ఉద్యోగులు, సిబ్బంది జీతాలకు చెల్లించాలి. దీనివల్ల ఆశించిన స్థాయిలో ఆలయాభివృద్ధి జరుగటం లేదు. దేవస్థానానికి పాలక మండలి ఉంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రాబట్టే అవకాశం ఉంది. దాతల నుంచి వివిధ రూపాల్లో పనులు చేయించుకునేందుకు ప్రయత్నాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. పాలకమండలి ఉంటే ప్రయోజనాలనేకమనే వాదన భక్తుల నుంచి వినిపిస్తోంది. -
రామాలయంలో టిక్కెట్ల మాయాజాలం!
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన అవకతవకలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో ఇక్కడి ఉద్యోగుల బాగోతం బట్టబయలౌతుంది. రాములోరి సొమ్మును సొంతానికి వాడుకుంటున్న ఇంటిదొంగల ఆటకట్టించేందుకు ప్రస్తుత ఈవో కూరాకుల జ్యోతి ఒకింత కఠినంగానే వ్యవహరించేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. భద్రాచలం స్టోర్ నిర్వహణలో తలెత్తిన లోపాలు, పర్ణశాలలో మాయమైన సరుకులు, తాజాగా పర్ణశాలలో వెలుగులోకి వచ్చిన టిక్కెట్ల మాయాజాలం ఇలా వరుస ఘటనలు ఆలయానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నాయి. ఆయా విభాగాల అధికారులు సరిగా పర్యవేక్షణ చేయకపోవటంతోనే ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈవో జ్యోతి సెలువులో ఉన్న సమయంలో ఇంచార్జి ఈవోగా వ్యవహరించిన రమేష్బాబు భద్రాచలం స్టోర్ ఇంచార్జి, పర్ణశాలకు గుమస్తాలను సస్పెండ్ చేసిన సంగతి విధితమే. రెండు నెలల స్టాక్ నిల్వలను పుస్తకంలో నమోదు చేయలేదనే కారణంతో సెలవులో ఉనా, స్టోర్ ఇంచార్జిపై వేటు వేసిన అధికారులు, వరుస తప్పిదాలు బయటకు వస్తున్నా, పర్యవేక్షకులపై మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంలో ఏదో మతలబు దాగిఉందనే ప్రచారం జరుగుతుంది. రెండు నెలల పాటు స్టాక్ వివరాలను రికార్డుల్లో నమోదు చేయలేదనే విషయం ఈవోను గమనిస్తే కానీ వెలుగులోకి రాలేదు. ప్రతీ వారం దీనిపై పర్యవేక్షణ ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. అదేవిధంగా పర్ణశాలలో పుష్కరాలకు సంబంధించిన టిక్కెట్లును ఉద్యోగులకు పంపిణీ చేసిన సమయంలోనే ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకూ ఇచ్చామనేది నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ పుష్కరాలు గడిచి, నెల రోజుల తరువాత డబ్బులు జమ చేసే సమయంలో ఇవి బయటం పడటం పర్యవేక్షణ లేమిని వెల్లడి చేస్తుంది. ఈ మొత్తం పరిణామాలకు ఒక్కరే పర్యవేక్షకులు కాగా, జరిగిన లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆలయలోని మరికొంతమంది అధికారులు అతనికి వత్తాసు పలుకుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఈవో జ్యోతి ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. కాగా ఇదే విషయమై ఈవోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె ఫోన్కు అందుబాటులోకి రాలేదు. -
వైభవంగా రామయ్యకు పర్యంకోత్సవం
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి పర్యంకోత్సవం(16 రోజుల పండుగ) ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారి కల్యాణం తర్వాత పదహారో రోజున నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎడబాటు ఉత్సవం అని కూడా పేరు. పర్యంకోత్సవంలో భాగంగా స్వామి వారికి అభిషేకం జరిపించారు. ఉత్సవ పెరుమాళ్లను బేడా మండపం పైకి తీసుకొచ్చి నూతన పర్యంకోత్సవ కర్మాంగ స్నపనం చేశారు. ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన గావించారు. పుణ్య జలాలను స్వామి వారి మూలవరుల వద్దకు తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేసి.. వారితో బేడామండపంలోని ఉత్సవ పెరుమాళ్లకు అభిషేకం జరిపించారు. యాగశాలలో హోమం నిర్వహించారు. రాత్రికి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై తిరువీధి సేవ నిర్వహించారు. -
వైభవోపేతంగా ధ్వజారోహణం
-
‘రథం’పై రామయ్య
భక్తులతో కిటకిటలాడిన భద్రాద్రి నిత్య కల్యాణంలో 125 జంటలు భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆలయ అర్చకులు రథసప్తమి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రథసప్తమిని పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజామున అంతరాలయంలో మూలవరులు, ఉత్సవమూర్తులకు ఏకాంత అభిషేకం జరిపారు. స్వామివారికి నూతన పట్టు వస్త్రాలతో అర్చకులు అలంకరించా రు. సాయంత్రం సూర్యప్రభ వాహనంపై స్వామివారిని కొలువు తీర్చారు. మేలతాళాలు, వేద మంత్రాలు, భక్తుల కోలాటాల నడుమ తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు. వెండిరథోత్సవం, ఆలయ చుట్టు సేవలు నిర్వహించి ప్రత్యేక పూజ లు చేశారు. రథసప్తమి, వారంతపు సెలవులకు తోడు రిపబ్లిక్ డే సెలవు కూడా కలిసిరావడంతో భద్రాచలంలో సోమవారం భక్తుల తాకిడి పెరిగిం ది. రాష్ట్ర, ఏపీ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించా రు. క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకున్నారు. బేడామండపంలో స్వామివారికి నిర్వహించిన నిత్యకల్యాణంలో 125జంటలు పాల్గొన్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో నిత్యకల్యాణాన్ని కమనీయం గా జరిపారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తు లు పెద్దసంఖ్యలో రావడంతో లడ్డూ కౌంటర్ల వద్ద భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. -
భద్రాద్రిలో వైభవంగా రథోత్సవం
భద్రాద్రిలో వైభవంగా రథోత్సవం సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు యాగశాలలో మహా పూర్ణాహుతి నేడు విశ్వరూప సేవ భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం గురువారం సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినం, భీష్ముడు అంపశయ్య నుంచి లేచిన రోజు కావటంతో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక హోమం చేశారు.. మహా పూర్ణాహుతి ఇచ్చారు. సాయంత్రం రథోత్సవ వేడుక కోసం రథాన్ని పూలతో అలంకరించారు. రథం వద్ద 20 సేర్ల తెల్లప్రసాదాన్ని దిష్టికుంభంగా పోశారు. పుణ్యహవచనం గావించి రథానికి సంప్రోషణ చేశారు. రథం నలుదిక్కుల బలిహరణం, సంపదాద్యంను జరిపించి రథంపై ఉన్న రంగనాథస్వామి వక్షస్థలంపై ఆరోపణగావించారు. గర్భగుడిలో స్వామివారికి దర్భార్సేవ, వేదస్వస్తి అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ప్రత్యేక పల్లకిపై ఉంచారు. బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల నడుమ సకలరాజ లాంచనాలతో ఊరేగింపు నిర్వహించారు. తరువాత స్వామివారిని రథంపై ఉన్న ఊయల ఎక్కిం చారు. చక్కరపొంగలి నివేదన గావించి, హార తి ఇచ్చారు. అష్టోత్తర శ తనామార్చన చేశారు. రథంపై ఉన్న స్వామివారికి దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి ప్రత్యేక పూజలు చేశారు. వైభవంగా రథసేవ రథసేవకు బయలుదేరే ముందు స్వామివారికి ఈవో హారతి సమర్పించారు. ఆమె కూడా స్వయంగా రథం లాగారు. స్వామివారు కొలువుతీరిన రథాన్ని లాగితే సంసార బాధలు తొలగుతాయనే నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. స్వామివారి రథాన్ని లాగేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు. ఆలయం నుంచి రాజవీధి మీదుగా తాతగుడి వరకు స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. దారి పొడువునా భక్తులు స్వామివారికి నీరాజనాలు పలికారు. మొక్కు లు సమర్పించి ప్రసాదాలు స్వీకరించారు. తిరి గి ఆలయానికి చేరుకున్న తర్వాత స్వామివారికి ప్రణయకళోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రావణ్కుమార్, పర్యవేక్షకులు వెంకటప్పయ్య, పీవో టు ఈవో నిరంజన్, పీఆర్వో సాయిబాబా, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, సీతారామానుజాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, వేద పండితులు ప్రసాదావధాని, సన్యాసి శర్మ తదితరులు పాల్గొన్నారు. నేడు విశ్వరూప సేవ శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం విశ్వరూప సేవ నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో జరిగే ఈ వేడుకకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారితో పాటు ఆలయ పరివార దేవతలను ఒక చోటకు చేర్చి పూజలు నిర్వహించటం ఈ సేవ ప్రత్యేకత. కమనీయంగా సాగే ఈ వేడుకలో పాల్గొనేందుకు భ క్తులు ఎంతో ఆసక్తి చూపుతారు. దీనిలో పాల్గొనే భక్తులు రూ.1000 టికెట్టు తీసుకోవాలని దేవస్థానం ఈవో సూచించారు. -
హంస వాహనాధీశుడై..
గోదారిలో రామయ్య విహారం వైభవంగా తెప్పోత్సవం పల్లకి మోసిన మంత్రులు భద్రాచలం: గోదావరి నదీ తీరం భక్త జనంతో పులకించింది. హంసవాహనంపై శ్రీ సీతారామచంద్రస్వామి వారు విహరిస్తుంటే వీక్షించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. జయజయధ్వానాలు చేశారు. మిరిమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల్లో ప్రత్యేకంగా తయారు చేసిన హంసవాహనంపై స్వామివారు కొలువుదీరారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ నదిలో విహరించారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో బుధవారం నిర్వహించిన ఈ వేడుకకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న హాజరై స్వామివారి పల్లకిని స్వయంగా మోశారు. తెప్పోత్సవానికి ముందు స్వామివారు వివిధ పూజలు అందుకున్నారు. దర్భారు సేవ శ్రీ సీతారామచంద్రస్వామివారికి గర్భగుడిలో వేదపండితులు దర్భారు సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులకు విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం గావించారు. ఉదయం సేవాకాలం, శ్రీ తిరుమంగై ఆళ్వార్లు పరమపదోత్సవం చేశారు. మధ్యాహ్నం రాజభోగం, శాత్తు మురై, పూర్ణశరణాగతితో పగల్పత్తు ముగిసింది. గర్భగుడిలో ప్రభుత్వోత్సవం ( దర్భార్ సేవ) నిర్వహించారు. తెప్పోత్సవం.. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య తెప్పోత్సవం కోసం స్వామివారిని ఆలయం నుంచి ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకోచ్చారు. రాజాధిరాజ వాహనంపై గోదావరి నదిలో విహరించేందుకు బయలుదేరిన శ్రీ సీతారామచంద్రస్వామివారిని వీక్షించి తరించేందుకు దారి పొడవునా భక్తులు బారులు తీరారు. గోదావరి తీరంలో అర్చకులు ముందుగా పుణ్యజలాలతో హంసవాహనాన్ని సంప్రోక్షణ చేశారు. ఊరేగింపుగా వచ్చిన స్వామి వారిని హంసవాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి మాతకు వేదపండితులు చతుర్వేదాలు, నాళాయర్ దివ్యప్రబంధం, పంచసూత్రాలు, స్తోత్ర పాఠాలు చదివారు. మంగళహారతి, చక్రపొంగలి నివేదన చేశారు. రామనామ సంకీర్తనలు, భక్తుల కోలాహలం మధ్య స్వామివారి తెప్పోత్సవం వైభవంగా సాగింది. ఆకట్టుకున్న కోలాటం ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకున్న స్వామివారు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక పల్లకిపై ఊరేగింపుగా గోదారి తీరానికి బయలుదేరారు. రాజాధిరాజ వాహనంపై స్వామివారు వెళ్లే సమయంలో పల్లకి ముందు వివిధ కోలాట బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేద విద్యార్థుల కీర్తనలు, వికాస తరంగణి, శ్రీ కృష్ణ కోలాట భజన మండలితో పాటు వివిధ సంస్థలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం నుంచి గోదావరి స్నానఘట్టాల వరకు కోలాట బృందాల కీర్తనలతో స్వామివారి ఊరేగింపు వైభవంగా సాగింది. బాణసంచా వెలుగుల్లో... సాయంత్రం 5 గంటలకు స్వామివారు హంసవాహనంపై కొలువుదీరారు. వాహనం 6 గంటలకు బయలుదేరింది. గోదావరిలో స్వామివారు ఐదుసార్లు విహరించారు. నదిలో హంసవాహనం తిరుగుతున్నంత సేపు బాణసంచా వెలుగుల్లో ఆకాశం హరివిల్లైంది. తెప్పోత్సవ సమయానికి నదీ తీరం భక్తజనంతో పోటెత్తింది. స్వామివారి సేవలో మంత్రులు.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి భద్రాద్రిలో నిర్వహించిన తెప్పోత్సవానికి రాష్ట్రమంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న స్వామివారి పల్లకిని మోశారు. తెప్పోత్సవ వేడుకలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, సిర్పూర్ కాగజ్నగర్, అశ్వారావుపేట, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, తాటి వెంకటేశ్వర్లు, బాణోత్ మదన్లాల్, సున్నం రాజయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గడపల్లి కవిత, కలెక్టర్ ఇలంబరితి, జేసీ సురేంద్రమోహన్, జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసిం, ఐటీడీఏ పీవో దివ్య, ఆర్డీవో అంజయ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఏఈవో శ్రావణ్కుమార్, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండటం, రాష్ట్ర మంత్రుల రాకతో భద్రాచలం ఏఎస్పీ ప్రకాశ్రెడ్డి, ఓఎస్డీ జోవెల్డేవిస్ పర్యవేక్షణలో పోలీసుబందోబస్తు కట్టుదిట్టం చేశారు. -
భద్రాద్రి రాముడి తెప్పోత్సవం
పులకించిన గోదారి తీరం భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం స్వామి వారి తెప్పోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. పవిత్ర గోదావరి నదిలో హంసవాహనంపై విహరించిన స్వామి వారిని చూసిన భక్తులు పులకించిపోయారు. వెకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తజనుల రామనామస్మరణల మధ్య శ్రీసీతారామచంద్రస్వామి వారిని ఆలయం నుంచి ప్రత్యేక పల్లకిలో గోదావరి నదీ తీరానికి తీసుకొచ్చారు. స్వామి వారి పల్లకిని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న మోసి సేవలో పాల్గొన్నారు. అనంతరం గోదావరి నదిలో ప్రత్యేకంగా తయారు చేసిన హంసవాహనంపై స్వామి వారిని ఉంచి వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారికి హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు. బాణ సంచా వెలుగులతో శోభాయమానంగా సాగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వం చెందారు. స్వామి వారు తెప్పోత్సవంపై విహరిస్తున్నంత సేపూ గోదావరి తీరాన భక్తులు శ్రీరామ నామ జయజయ ధ్వానాలు చేశారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, సిర్పూర్ కాగజ్నగర్, అశ్వారావుపేట, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, తాటి వెంకటేశ్వర్లు, మదన్లాల్, సున్నం రాజయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గడపల్లి కవిత, కలెక్టర్ ఇలంబరితి, జేసీ సురేంద్రమోహన్, ఎస్పీ షాన్వాజ్ ఖాసీం, ఐటీడీఏ పీవో దివ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి పాల్గొన్నారు. -
రామయ్యకు నేడు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి మరో అరుదైన ఉత్సవం జరిపించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. ముత్యాలు పొదిగిన ఆభరణాలను స్వామి వారి మూర్తులకు అలంకరించి వారంలో ఒక రోజు ప్రత్యేక సేవను నిర్వహించనున్నారు. హైదరాబాద్కు చెందిన కె. పాండురంగారావు, మహాలక్ష్మి దంపతులు సుమారు రూ.5 లక్షల వ్యయంతో తయారు చేయించిన ముత్యాల ఆభరణాలను ఆదివారం దేవస్థానం అధికారులకు అందజేశారు. మక్మల్ వస్త్రంపై ముత్యాలతో స్వామివారి కిరీటం, చక్రం, వస్త్రం, శంకులను తయారు చేయించారు. ఆభరణాలను స్వామి వారి మూలమూర్తుల వద్ద ఉంచి అర్చకులు సంప్రోక్షణ జరిపించారు. నేటి నుంచి ప్రతి సోమవారం ఈ ఆభరణాలను స్వామి వారికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ముత్తంగి సేవగా అభివర్ణించే ఈ పూజల్లో భక్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఇందుకు ప్రత్యేకంగా టికెట్ ధరలను నిర్ణయించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వైభవంగా సహస్ర కలశాభిషేకం
మహాయజ్ఞంలో అద్భుత ఘట్టం భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ సమీపలోని మిథిలాస్టేడియం(కల్యాణమండపం)లో జరుగుతున్న శ్రీరామమహాయజ్ఞంలో గురువారం అద్భుత ఘట్టం నిర్వహించారు. 1,008 కలశాలతో పెరుమాళ్కు తిరుమంజనం( సహస్రకలశాభిషేకం) జరిపించారు. సాయంత్రం పెరుమాళ్ దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు తీసుకొచ్చిన ప్రమిదలు, ఒత్తులు, నూనె తదితర సామగ్రి స్వామి వారికి నివేదనగా ఇచ్చారు. శ్రీరామ మహాయజ్ఞంలో భాగంగా ముందుగా శ్రీఅష్టలక్ష్మీ పీఠం వ్యవస్థాపకుడు పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అష్టలక్ష్మీ శ్రీనివాస్ పెరుమాళ్ వారికి, శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు, అర్చకులు యజ్ఞ క్రతువును నిర్వహించారు. పెరుమాళ్ వారికి, శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఘనంగా అభిషేకం జరిపించారు. సాయంత్రం పెరుమాళ్ వారికి వైభవంగా దీపోత్సవం జరిపించారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరాముడి సేవలో తరలించాలి శ్రీరామమహాయజ్ఞంలో భాగంగా జరిగిన వేడుకలకు గురువారం తమిళనాడు శ్రీవిల్లివుత్తూర్కు చెందిన త్రిదండి శఠగోపి రామానుజ జీయర్ స్వామి హాజరయ్యారు. శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు జీయర్ స్వామికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. యాగశాలను సందర్శించిన జీయర్ స్వామి వారు పెరుమాళ్ వారిఅభిషేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ఆంజనేయలు, ఎస్సై మురళి హాజరై స్వామి వారి ప్రసాదాలను అందుకున్నారు. లయన్స్ క్లబ్ ప్రముఖులు కొండిశెట్టి బుజ్జి, కుంభంపాటి సురేష్కుమార్, తాళ్లూరి పంచాక్షరయ్య తదితరులు కూడా పూజల్లో పాల్గొన్నారు. నేడు లక్ష కుంకుమార్చన శ్రీరామమహాయజ్ఞంలో భాగంగా శుక్రవారం సీతమ్మతల్లికి సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. -
పాలన గాడిలో పడేనా..?
భద్రాచలం టౌన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పాలనా విభాగాలపై నూతన ఈఓ కూరాకుల జ్యోతి ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా అన్ని విభాగాల్లో నెలకొన్న వివాదాలు, ఆలయ అధికారుల నిర్లక్ష్యం తదితర సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ మూడు రోజులుగా ఆయా విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బకాయిదారులపై కఠిన వైఖరి.... ఆలయ అభివృద్ధిపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా రాముడి ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. ఈ మేరకు దేవస్థానానికి బకాయిలు ఉన్న వారి వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. విస్తా కాంప్లెక్స్, కొబ్చరి కాయలు దుకాణాలు, కొబ్బరి చిప్పలు, కళ్యాణకట్ట, ఫొటోగ్రాఫర్స్ వద్ద నుంచి మూడు సంవత్సరాలుగా సుమారు రూ. 1.20 కోట్లు రావాల్సి ఉన్నట్లు ఆమె గుర్తించారు. ఈ మేరకు ఆమె సోమవారం వారందరిని పిలిచి తక్షణమే ఆ బకాయిలను చెల్లించాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు వారిపై కఠిన వైఖరి అనుసరిస్తూనే బకాయిల వసూలు ద్వారా ఆలయ అభివృద్ధి సాధ్యం అవుతుందని వారికి వివరిస్తున్నారు. అలాగే దేవస్థాన ఉపాలయాలను ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సందర్భంలో అక్కడ విధుల్లో ఉండాల్సిన అర్చకులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు అర్చకులు, ఉద్యోగులు సకాలంలో హాజరై తమ విధులను నిర్వర్తించాల్సిందేనని, విధుల్లో ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా, అమర్యాదగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సిబ్బంది విధులకు తప్పకుండా తెల్లని వస్త్రాలతో రావాల్సిందేనని, డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. కమిషనర్ ఆర్డర్లు లేకుండా పనులా...? దేవస్థానం పరిధిలో నిర్వహించే పలు పనులకు కమిషనర్ ఆర్డర్లు కూడా లేవని ఆమె పరిశీలనలో తేలింది. దీంతో ఆమె సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం టెండర్లు జరిగి కమిషనర్ నుంచి ఆర్డర్లు అందిన తర్వాతే చేపట్టాల్సిన పనులు ఇమేమీ లేకుండానే చేయడం పట్ల ఈఓ జ్యోతి విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఆమె ఉన్నతాధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. అదేవిధంగా సీఆర్వో కార్యాలయంలో భక్తుల కోసం వసతి గృహాల ఖాళీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని, ఆ మేరకు బోర్డును సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇలా ఆలయంలోని పలు విభాగాలపై విడివిడిగా చర్చిస్తునే ఆలయ అభివృద్ధికు తీసుకోవల్సిన సూచనలను అందచేస్తూ ఈఓ జ్యోతి తనదైన మార్కును చూపించటానికి ప్రయత్నిస్తున్నారు. -
రామాలయంలో నేటి నుంచి బతకమ్మ వేడుకలు
భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థాన ప్రాంగణంలో బతకమ్మ వేడుకలను ఘనంగా బుధవారం నుంచి నిర్వహించనున్నట్లు ఈఓ టి.రమేష్బాబు, డీఈ రవీందర్ తెలిపారు. దేవస్థాన ప్రాంగణంలోని చిత్రకూట మండపం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో మహిళలు బతకమ్మలను ఆడేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అదేవిధంగా దేవస్థానం తరఫున ఒక బతకమ్మను సిద్ధం చేస్తున్నట్లు వారు చెప్పారు. బతకమ్మ ఉత్సవం, శరన్నవరాత్రులను పురష్కరించుకుని బుధవారం నుంచి ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నట్లు తెలిపారు. రేపటి నుంచి ఆలయంలో శరన్నవరాత్రులు ప్రారంభం రామాలయ ప్రాంగణంలోని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో గురువారం నుంచి శ్రీ శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని తొమ్మిది రోజులపాటు అలంకరిస్తారు. ఆదిలక్ష్మీ, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, మహాలక్ష్మి అలంకరణలో వరుసగా లక్ష్మీతాయారు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఈ తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8.30 నుంచి 9.30గంటల వరకు శ్రీ లక్ష్మీ అమ్మవారికి అభిషేకం, ఉదయం 7 నుంచి 11గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 5.30గంటల వరకు శ్రీరామయణ పారాయణం, ఉదయం. 10.30 నుంచి 11గంటల వరకు సంక్షిప్త రామాయణ హోమం, మధ్యాహ్నం 3 నుంచి 5.30గంటల వరకు శ్రీ లక్ష్మీతాయారు సన్నిధిలో సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 6.30 నుంచి 7.30గంటల వరకు విశేష దర్బారు సేవ, నివేదన, మహామంత్రపుష్పం, ప్రసాదగోష్టి, రాత్రి 7.30 నుంచి 8 గంటల వరకు శ్రీ వారి తిరువీధి సేవ ఉంటాయని తెలిపారు. అదేవిధంగా తొమ్మిది రోజుల పాటు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ పారాయణాల కొనసాగుతాయి. విజయదశమి, రామాయణ పారాయణ సమాప్తి సందర్భంగా అక్టోబర్ 10న ఉదయం 11.30 గంటలకు శ్రీరామ మహాపట్టాభిషేకం, పట్టణంలోని దసరా మండపంలో సాయంత్రం 4గంటలకు శమీ పూజ, శ్రీరామ లీలా మహోత్సవం ఉంటాయి. -
జ్యోతి పట్టు వీడేనా..?
భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ఈఓగా కూరాకుల జ్యోతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా నేటి వరకు ఆమె బాధ్యతలు స్వీకరించలేదు. భద్రాచలం వచ్చేందుకు ఆమె సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ‘పట్టు విడవకుండా’ ఆమె హైదరాబాద్లోనే ఉండేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో దేవాదాయశాఖలో మొన్నటి వరకు ఇన్చార్జ్ కమిషనర్గా, విజిలెన్స్ అధికారిణిగా ఉన్నతస్థాయి విధులు నిర్వహించిన ఆమెను ఆర్జేసీ కేడర్లో ఉన్న భద్రాచలం దేవస్థానం ఈఓగా బదిలీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు సమాచారం. అదీకాక అవినీతి ఆరోపణలతో పనిస్మెంట్గా ఆమెను భద్రాచలం బదిలీ చేసినట్లు ప్రచారం జరుగున్న నేపథ్యంలో ఇక్కడ విధుల్లో చేరేందుకు ఆమె సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. భద్రాచలం ఈఓగా బాధ్యతలు స్వీకరిస్తే ఆ తప్పులు ఒప్పుకున్నట్లు ఉంటుందని భావించిన ఆమె ఇక్కడికి వచ్చేందుకు ఇష్టపడడం లేదని, అవసరమైతే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరోపక్క తాను పని చేసిన ఇన్చార్జ్ కమిషనర్ పోస్టులో తెలంగాణకు చెందిన తనను కాదని ఆంధ్రకు చెందిన మహిళా అధికారిణిని నియమించడంతో ఆమె మరింత పట్టు పట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీరియస్గా ఉన్న ప్రభుత్వం, ఉన్నతాధికారులు భద్రాచలం వెళ్లేలా జ్యోతిపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆలయంలో పట్టు తప్పిన పాలన.. కొద్ది సంవత్సరాలుగా దేవస్థాన పరిపాలన అస్తవ్యస్తంగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆలయ బాధ్యతలు స్వీకరించిన ఈఓలు కుటుంబాలతో ఇక్కడ ఉండకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో వారంలో కొద్ది రోజులు మాత్రమే సిబ్బందికి, భక్తులకు అందుబాటులో ఉంటున్నారు. దీనిని అలుసుగా తీసుకున్న కొంతమంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆజాద్ ఈఓగా పనిచేసి వెళ్లిన తర్వాత వచ్చిన రామచంద్రమోహన్, బద్రినారాయణాచార్యులు, రఘునాథ్, ప్రస్తుతం ఇన్చార్జ్ ఈఓగా పని చేస్తున్న రమేష్బాబులు కూడా ఇక్కడ నివసించడం లేదు. ప్రస్తుతం ఇన్చార్జ్ ఈఓగా పని చేస్తున్న రమేష్బాబు వరంగల్ దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్గా పని చేస్తూ ఉండడంతో రామాలయంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదు. భక్తులకు, వీఐపీలకు, సిబ్బందికి అందుబాటులో లేకపోవడంతో దాని ప్రభావం పాలనపై పడుతోంది. దీనికి తోడు వచ్చిన ప్రతీ ఈఓ కూడా తనకు అనుకూలంగా ఉండేలా సిబ్బందిని మారుస్తున్నారు. దీంతో ఏ ఒక్క ఉద్యోగి కూడా ఒక్కో శాఖలో పూర్తిగా నాలుగు నెలలు కూడా పని చేయడం లేదు. దీని వల్ల సిబ్బంది కూడా ఏ శాఖపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పుష్కర ఏర్పాట్లపై ప్రభావం.. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూలై నెలలో జరుగనున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగనున్న ఈ పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుంభమేళాస్థాయిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పుష్కరాలకు ఇతర ప్రాంతాల కంటే భద్రాచలానికి అత్యధికంగా కోటిన్నర మంది వరకు వస్తారనే అంచనాతో అధికారులు ఉన్నారు. ఈ మేరకు కలెర్టర్ శ్రీనివాస శ్రీనరేష్, జేసీ సురేంద్రమోహన్లు ఇటీవల భద్రాచలంలో సమీక్ష ఏర్పాటు చేసి ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారు. ఈ పనులలో సింహభాగం బాధ్యత దేవస్థాన అధికారుల మీదే ఉంటుంది. అయితే ఈ ప్రణాళికలు, తదితర పనులను రామాలయ ఈఓ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈఓ రమేష్బాబు దేవాదాయ శాఖ డీసీగా బాధ్యతలు నిర్వహిస్తుండడంతో పూర్తిస్థాయిలో ఇటు దృష్టిసారించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు, అధికారులను పర్యవేక్షిస్తూ ఆలయ పాలనను గాడిలో పెట్టేందుకు పూర్తిస్థాయిలో విధులు నిర్వహించేందుకు ఈఓ అవసరం. అందుకు ఆర్జేసీ క్యాడర్లో ఉన్న అధికారి ఈఓగా రాకపోతే ఆ ప్రభావం పుష్కరాలపై పడుతుందని పలువురు పేర్కొంటున్నారు. -
రామా.. కానరావా..?
వేలేరుపాడు: భద్రాద్రి పేరుచెబితే అఖిలాండ భక్తకోటి మదిలో మెదిలేది శ్రీ సీతారామచంద్రస్వామివారి కల్యాణ వైభోగమే. రామయ్య కల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టేది మాత్రం మారుమూల శ్రీరామగిరి కొండకోనల్లోని పుట్టుస్వామి రాములోరి సమక్షంలోనే. పుట్టుస్వామికి తలంబ్రాల ప్రక్రియ ముగిస్తే గానీ భద్రాచలం రాములోరి పెళ్లి తంతు ప్రారంభం కాదు. అలాంటిది రాష్ట్ర విభజన జరిగాక చోటుచేసుకున్న పరిణామాల్లో ఈ ఇద్దరు స్వాములు చెరో దిక్కయ్యారు. భద్రాద్రి రాములోరు తెలంగాణ పరమైతే, శ్రీరామగిరి స్వామి వారు ఆంధ్ర వశమయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ పుణ్యాన పుట్టుస్వాముల వారి పుట్టిమునిగే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవంపై భక్తుల మదిలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈసారి జరగబోయే శ్రీరామనవమి పెళ్లి తంతు ఎక్కడ మొదలై ఎక్కడ ముగుస్తుందో? అంతుపట్టకుండా పోయింది. పురాణగాథ.. జిల్లాలో పుణ్యక్షేత్రాలుగా భద్రాద్రి రామాలయంతో పాటు వీఆర్పురం మండలంలోని శ్రీరామగిరి ఆలయం పేరొందాయి. ఈ రెండింటికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. భద్రాచలానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరామగిరిలో శ్రీ సీతారామాలయం ఉంది. సీతాన్వేషణలో భాగంగా ఈ ప్రాంతంలో శ్రీరాముడు ఏకశిల మీద తపస్సు చేశాడట. అందుకే ఇక్కడి స్వామిని యోగ రాముడని పిలుస్తుంటారు. ఇక్కడ గుడి వద్ద నిల్చుని చూస్తే, ఒక వైపు వాలి పర్వతం, మరో వైపు సుగ్రీవుని పర్వతం కన్పిస్తుంటాయి. ఇక్కడే వాలి, సుగ్రీవులకు యుద్ధాలు జరిగాయని, ఇక్కడే సుగ్రీవునికి, రామునికి మైత్రి కుదిరిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు జటాయువుకు దహనసంస్కారాలు చేసి, గోదావరి తీరాన పిండ ప్రదానం చేసే సమయంలో గోదావరి ఒడ్డునే ఉన్న పరుపు బండలపై ఉన్న పాదాలు, మోకాలి ముద్రల ఆనవాళ్లు ఇప్పటికీ భక్తులతో పూజలందుకుంటున్నాయి. రామలక్ష్మణుల టేకువృక్షాలూ కనుమరుగు.. రామలక్ష్మణులు అరణ్యవాసం చేసిన సమయంలో వారి స్వహస్తాలతో నాటిన రెండు టేకు వృక్షాలు శ్రీరామగిరికి 25 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతం దారపల్లి సమీపంలో ఉన్నాయి. వీటిని రామలక్ష్మణుల టేకు వృక్షాలుగా భక్తులు కొలుస్తున్నారు. భారీ కైవారంతో ఎత్తుగా ఉన్న ఈ వృక్షాలను నరకడానికి ఎవరూ సాహసిం చరు. ఎందుకంటే వీటిని తాకితే రక్తం కక్కుకొని చస్తారని అంటుంటారు. అందువల్లనే ఈ వృక్షాలను తాకేందుకు కూడా ప్రయత్నించరు. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ భారీ వృక్షాలపై పరిశోధనలు చేశారు. వేల సంవత్సరాల కాలంనాటి వృక్షాలుగా నిర్ధారించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేద్దామని ఆలోచనలు చేస్తున్న దశలోనే ఈ వృక్షాలు, ఈ చారిత్రక ప్రదేశం పోలవరం నీటిలో కనుమరుగుకానున్నా యి. శ్రీరామగిరిని నీట ముంచితే పాపం మూటగట్టుకోవాల్సి వస్తుందని జనం ఆందోళన చెందుతున్నారు. -
రామాలయ ఈవో బదిలీ
భద్రాచలం టౌన్: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో ఎం.రఘునాథ్ను బదిలీ చేస్తూ రాష్ట్రప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు జీవోనెం10ని విడుదల చేసింది. దేవాదాయ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న టీ.రమేష్బాబుకు భద్రాచలం దేవస్థానం ఇన్చార్జ్ బాధ్యతలను అప్పచెప్పింది. రచ్చకెక్కిన వివాదంతోనే... రామాలయ ఈవోగా 2013 మార్చి1న రఘునాథ్ బాధ్యతలను స్వీకరించారు. 2013, 2014 సంవత్సరాలలో శ్రీరామనవమి, 2014 ముక్కోటి ఉత్సవాలతో పాటు శబరి ఉత్సవాలను సైతం విజయవంతంగానే నిర్వహించారు. అయితే పరిపాలనాపరంగా ఉద్యోగులు, వేదపండితులు, అర్చకులతో ఈవోకు అనేకమార్లు విభేదాలు పొడచూపాయి. ఈనేపథ్యంలోనే ఆలయంలో ఉన్న వైదిక కమిటీని సైతం రద్దు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా తన మాట వినని వారికి మెమోలను జారీ చేశారనే ఆరోపణలను సైతం మూటగట్టుకున్నారు. కాగా, ఈవో వేధింపులకు పాల్పడుతున్నారని, ఆయనను సస్పెండ్ చేయాలంటూ ఆలయ ఉద్యోగులు, వేదపండిత ులు, అర్చకులు ఇటీవల ఆలయ ప్రాంగణంలో 9 రోజులు దీక్షలను చేశారు. ఈ దీక్షలకు టీజేఏసి నాయకులతో పాటు స్థానిక ప్రజా, కుల, ఉద్యోగ సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపా యి. దీనితో పాటు రామనారాయణ నామస్మరణను కావాలనే వివాదం చేశారంటూ వేదపండితులు దేవాదాయ శాఖ, ప్రభుత్వ అధికారులకు నివేదికలను అందచేశారు. ఈవోగా రఘునాథ్ బాధ్యతలు స్వీకరించనప్పటి నుంచి జరిగిన అనేక అభివృద్ధి పనులలో, టెండర్లలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, ఈవోపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటన్నింటిపై సమాలోచనలు చేసిన ప్రభుత్వం ఈవోను తిరిగి వెనక్కిరప్పించుకునేందుకే నిర్ణయించి జీవోను విడుదల చేసింది. దీంతో పాటుగా ఈవో ఆంధ్రా ప్రాంతానికి చెందిన అధికారి కావడంతో మరో 2, 3 నెలలోనైనా ఆంధ్రా ప్రాంతానికి పంపాల్సిందే కాబట్టి అప్పటి వరకైనా వివాదానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసినట్లు సమాచారం. రామాలయ ఈవోగా రఘునాథ్ 15 నెలలు పనిచేసిన కాలంలో ఉత్సవాలను విజయవంతం చేసి అభినందలను అందుకున్నా, ఉద్యోగులు, వేదపండితులతో సఖ్యత లేని కారణంగా వివాదాల ఈవోగా పేరుపడ్డారు. -
ఈవో x ఉద్యోగులు
భద్రాచలం, న్యూస్లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈవో రఘునాథ్, ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈవో వేధిస్తున్నార ని ఆరోపిస్తూ సహాయ నిరాకరణ చేపట్టిన ఉద్యోగులు, అర్చకు లు ఆందోళనను ఉధృతం చేశారు. ఈవో పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మం డపానికి ఎదురుగా ఆదివారం రిలే నిరాహార దీక్షలకు దిగారు. దేవస్థానం స్థానాచార్యులు కె.ఇ.స్థలశాయి, ఉపప్రధానార్చకులు కోటి రామస్వరూప్ రాఘవాచార్యులు, ఎస్.శ్రీనివాసాచార్యులు, అర్చకులు బి.రామకృష్ణబాబు, ఉద్యోగులు కె.సతీష్, టి.వెంకటరత్నం, కృష్ణమాచారి, వెంకన్న దీక్షల్లో కూర్చున్నారు. భక్తులకు అంతరాయం... ఉద్యోగులు, అర్చకులు రిలే నిరాహార దీక్ష చేస్తుండడంతో ఆదివారం భక్తులకు సంబంధించిన వీఐపీ బ్రేక్ దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో స్వామివారికి చేరువగా వెళ్లి పూజలు చేయించుకోవాలనుకున్న భక్తులు సాధారణ పూజలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరికొద్ది రోజుల్లో వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు, ఆదివారం కావటంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అయితే అందరికీ సరిపడా ప్రసాదం(పులిహార) అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఆలయ ఉద్యోగులంతా సహాయ నిరాకరణలో ఉండటంతో కార్యాలయ తలుపులు కూడా తెరుచుకో లేదు. ముదురుతున్న వివాదం... రామాలయంలో ఈవో, అర్చకులకు మధ్య తలెత్తిన వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. ఈవో వివిధ కారణాలతో ఉద్యోగులను వే ధిస్తున్నారనే ఆరోపణలు ఇప్పటి వరకూ వినిపించ గా, ఇది మత పరమైన అంశాలకు ముడిపడటంతో వివాదం మరింత రాజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈవో రఘునాధ్ కూడా ఈ విషయంలో గట్టి పట్టుదలతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధర్వణ వేదపండితులైన జి.మురళీ కృష్ణమాచార్యులను ఇక్కడి నుంచి బదిలీ చేయాలని దేవాదాయశాఖ కమిషనర్కు లేఖ రాసినట్లు ఈవోకు అనుకూలంగా ఉన్న అర్చకులు అంటున్నా రు. కాగా, మత పరమైన ఈ వివాదంలో ఆలయం బయట ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు కూడా కల్పించుకోవటంతో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంలో కల్పించుకొని వివాదం సమసిపోయేలా తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. దీక్షలకు జేఏసీ మద్దతు... అర్చకులు, ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను జేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు ప్రారంభించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ఉద్యోగులు, అర్చకులకు ఈవో ఇచ్చిన మెమోలను వెంటనే వెనక్కు తీసుకోవాలని, వారి న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులను ఈవో వేధిస్తున్నారనే విషయాన్ని ఇప్పటికే టీజేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఈవోపై తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరసింహరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన మెమోలను బేషరతుగా వెనక్కు తీసుకోవాలన్నారు. ఈవో ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు రవీందర్, నిరంజన్ కుమార్, పీఆర్వో సాయిబాబా పాల్గొన్నారు. కాగా దీక్షలకు పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు ఎస్కే గౌసుద్ధీన్, వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, బాలకృష్ణ సంఘీభావం తెలిపారు. -
చర్చలు మరోసారి విఫలం..
భద్రాచలం టౌన్, న్యూస్లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ ఈఓ, ఉద్యోగుల మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. వేధింపులకు పాల్పడుతున్న ఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థాన ంలో పని చేస్తున్న ఉద్యోగులు, వేదపండితులు, అర్చకులు, నాల్గవ తరగతి ఉద్యోగులు సమష్టిగా రిలే దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈఓ కక్షపూరితంగా ఉద్యోగులపై జారీ చేసిన మెమోలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆల య ఉద్యోగులు టీజేఏసీ నాయకుల ఆధ్వర్యం లో సహాయ నిరాకరణ చేస్తున్న విషయం విదితమే. ఈ విషయంపై ఈఓతో శుక్రవారం టీజేఏసీ నాయకులు చర్చలు జరిపారు. ఉద్యోగులు భేషరతుగా క్షమాపణ చెబితే మెమోలు ఉపసంహరించుకుంటానని ఈఓ తెలపడంతో ఉద్యోగుల నిరసన కొనసాగిస్తున్నారు. నాల్గవ రోజైన శనివారం చిత్రకూట మండపం వద్ద బైఠాయించి ఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈఓతో ఉద్యోగ సంఘ అధ్యక్షుడు చర్చలు మరోమారు విఫలం..... ఈ క్రమంలో దేవస్థాన ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నర్సింహారాజును ఈఓ మరోసారి క్యాంపు కార్యాలయంలో చర్చలు జరపటానికి ఆహ్వానించారు. ఈ చర్చలలో కేవలం ఇద్దరి ఉద్యోగులపై ఉన్న మెమోలను మాత్రమే ఉపసంహరించుకుంటానని తెలపడంతో నర్సింహారాజు తిరిగి వెనక్కి వచ్చారు. సాయంత్రం కూడా ఈఓ మరోసారి పిలిచి ఇదే విషయాన్ని పేర్కొనడంతో చర్చలు విఫలం అయ్యాయి. ఉద్యోగుల డిమాండ్లను పూర్తిస్థాయిలో అంగీకరిస్తేనే చర్చలకు ఆహ్వానించాలని, లేకుంటే వద్దని నర్సింహరాజు స్పష్టం చేశారు. డిమాండ్లను సాధించే వరకు విరమణ లేదు.... తమ డిమాండ్లు ఒప్పుకునే వరకు ఈఓతో చర్చలకు వెళ్లేది లేదని ఆలయ ఉద్యోగులు, సిబ్బంది నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. టీజేఏసీ డివిజన్ కన్వీనర్ మాట్లాడుతూ ఈఓ మోసపూరిత వైఖరికి తాము విసిగిపోయామని, అందుకే సహాయ నిరాకరణతో పాటు రిలే దీక్షలకు సిద్ధమయ్యామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వహిస్తూనే పరిపాలన స్తంభింపజేస్తామని అన్నారు. ఈఓగా రఘునాథ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగిన అన్ని పనులపై కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపితే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తాయని, ఈ విచారణ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరగాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈఓ ఉద్యోగుల పట్ల రాజీ మార్గంతో కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఈఓపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలనే నినాదంతో ఆదివారం రిలే దీక్షలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, బాలకృష్ణ, ఆలయ ఉద్యోగ సంఘ నాయకులు నర్సింహరాజు, రవీందర్, శ్రీనివాసరెడ్డి, నిరంజన్, సూపరింటెండెంట్ కనకదుర్గ, కత్తి శ్రీను, భాస్కర్, వెంకట్, సుబ్బారావు, స్థలశాయి స్థానాచార్యులు, వేదపండితులు హనుమత్శాస్త్రి, లింగాల రామకృష్ణ ప్రసాదఅవధాని, ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, సీతారామానుజాచార్యులు, ఉపప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయణచార్యులు, అర్చకులు మురళీకృష్ణమాచార్యులు, శ్రావణ్కుమారాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ముదిరిన వివాదం
భద్రాచలం, న్యూస్లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈవో, ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం మరింత రాజుకుంది. ఈవోకు వ్యతిరేకంగా ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు గురువారం కూడా పరిపాలనాపరమైన సేవలు నిలిపేసి సహాయ నిరాకరణ చేపట్టారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపం ఎదురుగా నిరసనకు దిగారు. ‘ఈవో డౌన్ డౌన్’, ‘ఉద్యోగులను వేధిస్తున్న ఈవోను సస్పెండ్ చేయాలి’ అని రాసిన ప్లకార్డులు చేబూనారు. ఈవోకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. స్వామి వారికి పూజలు, భక్తుల సందర్శనకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయంలోని అన్ని కేడర్ల ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరికి టీఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఇలా ఆందోళనకు దిగాల్సిన పరిస్థితులు ఏర్పడడం విచారకరమన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈవో ఇక్కడి ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరించినందునే సమస్య జటిలంగా మారిందని అన్నారు. దీనిని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటప్పయ్య మాట్లాడుతూ.. ఈవో రఘునాధ్ నిరంకుశ వైఖరి కారణంగా అనేకమంది ఉద్యోగులు మానసిక వ్యథతో ఉన్నారని అన్నారు. ఈవోను సస్పెండ్ చేసేంత వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు, ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు నరసింహరాజు, ఏఈవో శ్రావణ్ కమార్, ఏఈ రవీందర్, నిరంజన్ కుమార్, పీఆర్వో సాయిబాబా, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. మురళీ కృష్ణమాచార్యులు బదిలీకి లేఖ దేవస్థాన అధర్వణ వేద పండితులు జి.మురళీ కృష్ణమాచార్యులును ఇక్కడి నుంచి బదిలీ చేయాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్కు ఈవో రఘునాధ్ గత నెల 31న లేఖ రాశారు. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా మురళీ కృష్ణమాచార్యులు వ్యవహరిస్తున్నారని, ఈ కారణంగా దేవస్థానం ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఆ లేఖలో... ‘ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ‘శ్రీరామచంద్రస్వామినే వరాయ’ అనే పదాన్ని తొలగించి ‘రామనారాయణ వరాయ’ అంటూ ప్రవచనాలు చెప్పారు. ఈ ఏడాది జరిగిన స్వామి వారి కల్యాణోత్సవంలో ‘కల్యాణ వేడుకలో భద్రాచలములో కొలువైన శ్రీరామచంద్రుడు దశరధ తనయుడు రాముడు కాదని, అట్లు అనుకొనుచున్న రామ భక్తులు మూర్ఖులు, అవివేకులని, భద్రాద్రిలో కొలువున్న రాముడు వైకుంఠ రాముడనియు, రామ నారాయణుడనియు వ్యాఖ్యానించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. దీనిపై వివరణ కోరుతూ మెమో ఇవ్వగా, టీఎన్జీవో నాయకులను నా చాంబర్కు తీసుకొచ్చి అర గంటకు పైగా బయటకు వెళ్లనీయకుండా నిర్బంధించారు. పరిపాలనాపరమైన విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ వివాదాలకు కారణభూతుడవుతున్నారు. ఆయనను వెంటనే బదిలీ చేయాలి’’ అని ఉంది. ఈ లేఖ గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ లేఖపై ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు తీవ్రంగానే స్పందించారు. ఆర్థిక లావాదేవీలపై విచారణకు డిమాండ్ ఆలయ సంబంధ ఆర్థిక లావాదేవీల్లో ఈవోగా రఘునాథ్ అక్రమాలకు పాల్పడ్డారని వేద పండితులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ పనులను టెండర్లు లేకుండా తనకు అనుకూలమైన వారికి కట్టబెట్టారని, వారి నుంచి పెద్ద మొత్తంలో కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరాారు. సెలవులో ఈవో ఆలయ ఉద్యోగుల సహాయ నిరాకరణ నేపథ్యంలో ఈవో రఘునాధ్ రెండు రోజులపాటు సెలవు పెట్టారు. ఆయన బుధవారం రాత్రి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. -
వేధింపుల ఈఓ మాకొద్దు
భద్రాచలం, న్యూస్లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిపై ఉద్యోగులు తిరుగుబావుటా ఎగురవేశారు. ఏడాదికాలంగా ఉద్యోగులు, అర్చకులను ఈఓ రఘునాథ్ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ బుధవారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపానికి ఎదురుగా ఉద్యోగులు, అర్చకులు ధర్నాకు దిగారు. ఈఓ గో బ్యాక్, సంపాదిత సెలవులు మంజూరు చేయాలి, ఈఓ నిరంకుశత్వ వైఖరి నశించాలి, వేధింపులు ఆపాలి, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలి అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ దేవస్థాన ఉద్యోగులు, వేదపండితులు, అర్చకులు, నాల్గవ తరగతి ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. టీజేఏసీ కూడా రంగంలోకి దిగి ఉద్యోగులకు మద్దతుగా నిలిచింది. ఈ సందర్భంగా దేవస్థానం స్థానాచార్యులు కెఈ స్థలశాయి మాట్లాడుతూ ఈఓ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఆలయ సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మతపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కనీసం వేదపండితులు, అర్చకులతో చర్చించాలనే ఆలోచన చేయకపోవటంతో ఆలయ సంప్రదాయాలు కనుమరుగైపోయాయన్నారు. ఆలయ సంప్రదాయాలు తెలియని కొంతమంది మాటలు విని ఎంతో కాలంగా రాముని సేవలో తరిస్తున్న తమను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘భద్రాద్రి రాముడిని రామనారాయణుడి’గానే ఇప్పటి వరకూ కొలుస్తూ వచ్చామని, అయితే ప్రస్తుత ఈఓ రఘునాథ్, ఎవరో ఫిర్యాదు ఇచ్చారనే కారణంతో తగిన పరిశీలన లేకుండానే తమకు చార్జిమెమోలు ఇవ్వటం ఎంత వరకూ సమంజసమన్నారు. ఆయన తీవ్రంగా అవమానపరిచారన్నారు. గతేడాది జరిగిన శ్రీరామనవమి వేడుకలలో మహాపట్టాభిషేక వేదిక మార్చాలంటూ తమ ఒత్తిడి తీసుకొచ్చారని, దీనిని వ్యతిరేకించినందుకు వేదపండితులపై, ఉద్యోగులపై కక్ష కట్టి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది సంప్రదాయ వ్యతిరేకుల మాట విని, వారి ప్రలోభాలకు గురై తమను వేధింపులకు గురిచేస్తున్నందున ఇక సహించలేక రోడ్డుకెక్కామని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మాడవీధుల విస్తరణలో ఇల్లు కోల్పోయిన రామభద్రాచార్యులు అనే పరిచారికకు కలెక్టర్ హామీతో ఉద్యోగం ఇచ్చినప్పటికీ, నేటి వరకు ఆయనకు సర్వీసు రిజిస్టర్ను ప్రారంభించలేదని, అతనికంటే వెనుక వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగికి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పక్షపాత బుద్ధిని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యాలయానికి చెందిన విషయాలలో సైతం అనవసరంగా ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తూ వారిని మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆలయ ఏఈవో శ్రవణ్కుమార్ ఆరోపించారు. ఈఓతో వాగ్వాదం ఉదయం నుంచి ఆలయ ఉద్యోగులు ఆందోళన చేస్తుండగా...సాయంత్రానికి ఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు ఈఓతో చర్చించి.. ఉద్యోగులపై పనిభారం పెంచుతూ, ప్రశ్నించిన వారికి అక్రమంగా మెమోలను జారీ చేయటం సరైంది కాదన్నారు. వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరగా దీనిపై ఈవో ససేమిరా అన్నారు. అర్చకులకు జారీ చేసిన మెమోలను వెనక్కి తీసుకునేది లేదని, వాటికి వివరణ ఇవ్వాల్సిందేనన్నారు. ఈ సమయంలో ఈఓ, వేదపండితుల మధ్య కొంతసేపు మాటల యుద్ధం కొనసాగింది. సహనం కోల్పోయిన ఈఓ రఘునాథ్ తనతో వాదనకు దిగిన వేదపండితులను నోరు మూసుకోవాలని హెచ్చరించారు. దీంతో వేదపండితులు సైతం ఘాటుగానే స్పందించారు. ఇరు పక్షాల మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి చేయిదాటుతోందని గమనించిన టీజేఏసీ నాయకులు చల్లగుళ్ల నాగేశ్వరరావు కల్పించుకున్నారు. ఈఓ పంథాను మార్చుకోకపోతే ఉద్యోగులు ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదని, దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సహాయ నిరాకరణకు పిలుపు : ఈఓ తీరుతో విసుగుచెందిన ఆలయ ఉద్యోగులు, వేదపండితులు సహాయ నిరాకరణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం కల్పించుకొని ఈఓపై తగిన చర్యలు తీసుకునేంత వరకూ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని, పరిపాలన పరమైన పనులపై కూడా తగిన విచారణ జరిపించాలని ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కె.నరసింహారాజు అన్నారు. ఆందోళన కార్యక్రమంలో ఆలయ వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు, శ్రీనివాసరెడ్డి, నిరంజన్కుమార్, పోతుల శ్రీను, కత్తి శ్రీను, వెంకటప్పయ్య, కనకదుర్గ, నాగమణి, రామారావు, స్వర్ణ కుమారి, భాస్కర్, ఏఈ రవీందర్, టీజేఏసి నాయకులు వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, పూసం రవికమారి, ఐటీడీఏ రాంబాబు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
ఓ రామా.. ఏమిటీ దురవస్థ...!
భద్రాచలం టౌన్, న్యూస్లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఇరుముడులు సమర్పించేందుకు వచ్చిన హనుమాన్ భక్తులు గోదావరి స్నానఘాట్ల వద్ద తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోదావరి తీరంలో ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపించటంతో.. స్నానాలు చేయడానికి కూడా సంకోచించారు. అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలం వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయడంలో ఇటు రామాలయం, అటు పంచాయతీ అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. వారి నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. శ్రీరామ నవమి, ముక్కోటి ఉత్సవాల తరువాత హనుమాన్ జయంతికి జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి హనుమాన్ మాలధారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈసారి సుమారు 50వేలకు పైగానే భక్తులు రావచ్చని ముందుగానే అంచనా వేసిన అధికారులు.. తదనుగుణంగాఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. స్నాన ఘాట్ల వద్ద కనీసంగా చెత్త కుండీలను కూడా ఏర్పాటు చేయలేదు. ఉన్న ఒక్క కుండీ వ్యర్థాలతో నిండింది. ఆ చెత్తచెదారం, దుర్వాసన మధ్యనే కొందరు హనుమాన్ భక్తులు ‘ఓ రామా.. ఏమిటీ దురవస్థ..’ అనుకుంటూ స్నానాలాచరించారు. గోదావరి తీరంలోని అపరిశుభ్ర వాతావరణంలో స్నానమాచరించేందుకు మనసొప్పని అనేకమంది భక్తులు.. నావలపై గోదావరి మధ్యలోకి వెళ్లి పుణ్యస్నానాలు చేసి వచ్చారు. ఒడ్డునే మొక్కులు.... భక్తులు తలనీలాలు సమర్పించేందుకు గోదావరి ఒడ్డున తాత్కాలిక కళ్యాణ కట్ట ఏర్పాటు చేయా లి. హనుమాన్ జయంతికి అధికారులు ముందస్తుగా ఇటువంటి ఏర్పాట్లేమీ చేయలేదు. దీంతో, మాలధారులు, భక్తులు తమ వెంట తెచ్చుకున్న క్షురకుడితో గోదావరి ఒడ్డునే తలనీలాల మొక్కులు తీర్చుకున్నారు. గోదావరి తీరమంతా ఆ జుట్టుతో అపరిశుభ్రంగా తయారైంది. -
ఘనంగా నవమి ఉత్సవాలు
కడప కల్చరల్, న్యూస్లైన్ : శ్రీరామనవమి సందర్భంగా మంగళవారం ప్రారంభమైన ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. కడప నగరంలోని పలు రామాలయాల్లో ఉదయం స్వామి, అమ్మవార్ల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం కన్నులపండువగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వివిధ రకాల పూజోత్సవాలు నిర్వహించారు. సాయంత్రం భక్తులు నామార్చనలు, భజనలు నిర్వహించారు. స్థానిక రవీంద్రనగర్లోని శ్రీసీతారామస్వామి ఆలయంలో ఈ వేడుకల సందర్భంగా సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో పల్లకీపై శ్రీసీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను అలంకరించి స్థానిక వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు పూజాద్రవ్యాలు సమర్పించి స్వామి, అమ్మవారలకు మొక్కుకున్నారు. నిర్వాహకులు ఆలయం వద్ద స్వామి తీర్థప్రసాదంగా వడపప్పు, పానకం అందజేశారు. 42వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి చల్లా రాజశేఖర్, చల్లా అనిల్, యువ నాయకులు పవర్ బాలాజీ, బొమ్మిశెట్టి చంద్రశేఖర్, శ్రీను, వెంకట్, ఖలీల్, షఫి, రవీంద్రనగర్ యువజన సంఘం, స్థానిక భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. -
వైభవంగా సీతారాముల ఎదుర్కోళ్లు
రెండో భద్రాద్రిగా పేరొందిన నల్లగొండలోని రామాలయం సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముస్తాబైంది. మంగళవారం స్వామి,అమ్మవార్ల కల్యాణం జరగనుంది. సోమవారం స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నల్లగొండ కల్చరల్, న్యూస్లైన్,నల్లగొండ రామగిరిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించనున్న శ్రీరామ కల్యాణ మహోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి ఆలయం ఆవరణలో ఎదుర్కోళ్ల మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి తరఫున స్థానాచార్యులు శ్రీరంగాచార్యుల బృందం, రాములవారి తరఫున యం.అనంతచార్యుల బృం దం వాదోపవాదాలు, చర్చలు, చతురోక్తులతో ఎదుర్కొళ్ల కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు సీతారామచంద్రస్వామి వార్లను పల్లకిసేవతో ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించిన వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. ఎదుర్కొళ్ల కార్యక్రమానంతరం మళ్లీ స్వామి, అమ్మవార్లను ఆలయంలో ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బుర్రి చైతన్య శ్రీనివాస్రెడ్డి, ఈఓ మనోహర్రెడ్డి, ధర్మకర్తలు వంగరి వేమన సునీత, శ్రీనివాసాచార్యులు, జడల సువర్ణ, మెరుగు గోపి, అక్కినేపల్లి పద్మ, బుక్కా ఈశ్వరయ్య, వేదపండితులు సుజిత్కుమారాచార్య, హరికుమారనాచార్య, రామరంగాచార్యులు, రామకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
‘నవమి’కి ప్రత్యేక ఏర్పాట్లు
భద్రాచలం టౌన్, న్యూస్లైన్: భద్రాచలంలో ఏప్రిల్ 8, 9 తేదీలలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం ఈఓ ఎం.రఘునాధ్ తెలిపారు. ఈ ఏర్పాట్ల వివరాలను ఆయన బుధవారం ‘న్యూస్లైన్’కు తెలిపారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే... కల్యాణం జరిగే మిథిలా స్టేడియంలో చివరి సెక్టార్లలో కూర్చున్న భక్తులందరికీ స్వామి వారి కల్యాణం కనిపించేలా 40 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్లు 20 వరకూ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవి కాకుండా, స్టేడియం చుట్టూ మరికొన్ని పెద్ద స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తాం. స్టేడియం లోపల 40 కూలర్లను సిద్ధం చేస్తున్నాం. వంద రూపాయల సెక్టార్లలో భక్తుల కోసం పందిళ్ల ఎత్తును పెంచుతున్నాం. రూ.45లక్షల వ్యయంతో ఇంజనీరింగ్ పనులు చేయిస్తున్నాం. వీటిలో పది పనులకు టెండర్లు ఖరారయ్యాయి. మరో ఐదు పనులకు రీ-టెండర్లను 17వ తేదీన నిర్వహిస్తాం. భక్తుల కోసం వసతికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చలువ పందిళ్లను, షామియానాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాం. ఐదు రూపాయలకే రెండు ముత్యాలతో తలంబ్రాలు విక్రయిస్తాం. స్వామి వారి ముత్యాల తలంబ్రాలకు ఏటేటా ఆదరణ పెరుగుతోంది. అందుకే, వీటిని సామాన్య భక్తులకు కూడా అందించేందుకు కేవలం ఐదు రూపాయలకే విక్రయించాలని నిర్ణయించాం. దీని కోసం 100 కేజీల ముత్యాలు, 100 క్వింటాళ్ల బియ్యంతో ఆరులక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతాం. ఈ పనులు వసంతోత్సవం తరువాత ప్రారంభమవుతాయి. గతేడాది 2.5 లక్షల లడ్డూలు విక్రయించాం. ఈ ఏడాది మూడులక్షల లడ్డూలను సిద్ధం చేసి, క్యూ లైన్లలోనే ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తాం. శ్రీరామ నవమి ఆహ్వాన పత్రికలతో గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ వద్దకు వెళ్తున్నాం. కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాల ఆహ్వాన పత్రాలు గవర్నకు అందజేస్తాం. మరికొంతమంది ఉన్నతాధికారులకు ఆహ్వాన పత్రాలు ఇస్తాం. కల్యాణ మహోత్సవానికి గవర్నర్ వచ్చే అవకాశముంది. ఈ నెల 20వ తేదీ నుంచే వీఐపీ; 500, 200, 100 రూపాయల టిక్కెట్లను బ్యాంకర్ల ద్వారా అందుబాటులో ఉంచుతాం. ఉభయ దాతల టిక్కెట్ల విక్రయాన్ని ఇప్పటికే ప్రారంభించాం. మిగతా టిక్కెట్లను ముందుగానే అమ్ముతాం. గతేడాది టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.70లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.కోటి వచ్చేలా టిక్కెట్ల అమ్మకాలకు సన్నాహాలు చేస్తున్నాం. 2015 ఆగస్టులో జరిగే పుష్కరాలకు వచ్చే భక్తుల వసతి కోసం మూడు కాటేజీలు, వివిధ ప్రదేశాలలో 250 గదులు, 100 డార్మెటరీ లాకర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఐదుకోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ ప్రతిపాదించిన గదులను తానీషా మండపం వద్దనున్న 2.6 ఎకరం స్థలంలో నిర్మించేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నాం. రంగనాయకుల గుట్టపై మూడు కాటేజీల నిర్మాణం ప్రారంభమైంది. అభయాంజనేయ స్వామి ఆలయం పక్కనున్న 90 సెంట్ల దేవస్థానం స్థలంలో భక్తుల కోసం 100 లాకర్లతో డార్మెటరీ హాల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. -
ముగిసిన అధ్యయనోత్సవాలు
భద్రాచలం టౌన్, న్యూస్లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ముక్కోటి ఏకాదశకి ముందు పదిరోజులు పగటి పూట పగల్ పత్తు ఉత్సవాలు, అనంతరం పదిరోజులు రాత్రి పూట ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రాపత్సేవలను నిర్వహించటం ఆనవాయితీ. ఇలా 21 రోజుల పాటు అధ్యయనోత్సవాలు కన్నులు పండువగా జరిగాయి. పగల్పత్తు ఉత్సవాలలో తొమ్మిది అవతారాలలో స్వామి వారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. నృసింహదాసు మండపంలో రాపత్ ఉత్సవం.. భద్రాచలం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం నృసింహదాసు మండపంలో రామయ్యకు రాపత్ ఉత్సవం నిర్వహించారు. ప్రత్యేకంగా అలకంరించిన స్వామివారిని గరత్మంత వాహనంపై కొలువుదీర్చారు. శ్రీకృష్ణకోలాట సమితి మహిళల కోలాటాలు, వేద పండితుల మంత్రోఛ్చారణలు, భక్తుల కోలాహలం నడుమ ఊరేగింపుగా నృసింహదాసు మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ఆలయ అర్చకులు స్వామి వారికి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం గావించి హారతి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, నర్సింహాచార్యులు, ఎంపీడీవో రమాదేవి, పంచాయతీ ఈవో శ్రీమన్నారాయణ, సర్పంచ్ భూక్యా శ్వేత దంపతులు, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. నేటి నుంచి విలాసోత్సవాలు... అధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం స్వామి వారికి మూడు రోజుల పాటు విలాసోత్సవాలు నిర్వహిస్తారు. బుధవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శ్రీరామదాసు మండపంలో, విలాసోత్సవాలలో భాగంగా స్వామి వారికి బుధవారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో శ్రీరామదాసు మండపంలో, గురువారం దసరా మండపంలో, శుక్రవారం దేవస్థానం సిబ్బంది ఆధ్వర్యంలో వశిష్ట మండపంలో సేవలు నిర్వహిస్తారు. -
శ్రీకృష్ణాలయంలో ‘రామయ్య’కు రాపత్తు సేవ
భద్రాచలం టౌన్, న్యూస్లైన్ : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలలో భాగంగా వైకుంఠ రాముడికి సోమవారం స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో రాపత్తుసేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేకంగా కృష్ణాలంకరణ చేశారు. పల్లకిలో స్వామి వారిని కొలువుదీర్చి మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మహిళల కోలాటాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియం వద్దనున్న ఆలయానికి తీసుకొచ్చారు. దారి పొడవునా భక్తులు స్వామి వారికి హారతి ఇస్తూ స్వాగతం పలికారు. కృష్ణాలయంలో స్వామి వారికి విష్వక్సేణ పూజ, పుణ్యాహవచనం, కృష్ణా అష్టోత్తర నామార్చన గావించారు. శేషనాగుపడగపై నాట్యమాడుతూ దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారిని తాతగుడి సెంటర్ మీదుగా ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. కాగా, కృష్ణాలయంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విద్యాలయ విద్యార్థులు శ్రీకృష్ణుడు, బలరాముడు, భక్తుడు వేషధారణలో చేసిన శాస్త్రీయ నృత్యం పలువురిని అలంరించాయి. ఎమ్మెల్యే కుంజా సత్యవతి కళాకారులను శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రామాలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లు, ఏఎస్పీ ప్రకాశ్రెడ్డి, పట్టణ ఎస్సై ఎం. అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘రెవెన్యూ’ పెత్తనం
భద్రాచలం టౌన్, న్యూస్లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించిన తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనం వేడుకల్లో ఎప్పటిలాగే రెవెన్యూ అధికారులు పెత్తనం చెలాయించారు. వీవీఐపీ టికెట్లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆలయ అధికారులకు కేవలం రూ.500, రూ.250 టికెట్లను మాత్రమే అమ్మకానికి ఇచ్చారు. ఈ వీవీఐపీ టికెట్లు కూడా సామాన్య భక్తులకు కాకుండా కేవలం పైరవీలు చేసిన వారికే దక్కాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉత్సవ ఖర్చులు మాత్రం కేవలం ఆలయానివే కాగా పెత్తనం రెవెన్యూ అధికారులు చెలాయించడం గమనార్హం. శనివారం నిర్వహించిన ఉత్తర ద్వార దర్శనానికి పూర్తిగా టికెట్లు అమ్ముడుపోవడంతో రెవెన్యూ అధికారులు మరో అడుగు ముందుకేసి ఆలయ అధికారులకు సమాచారం లేకుండానే పాత టికెట్లపై సంతకాలు చేసి విక్రయించినట్లుగా తెలిసింది. వీవీఐపీ టికెట్లపై దేవస్థానానికి చెందిన హోలోగ్రాం ఉంటుంది. కానీ శనివారం ఇచ్చిన వీవీఐపీ టికెట్లపై మాత్రం ఈ హోలోగ్రాం లేకపోవడంతో విషయం బయటపడింది. దీనిపై ఆర్డీవో వెంకటేశ్వర్లును ‘న్యూస్లైన్’ వివరణ కోరగా వీవీఐపి టికెట్లు అయిపోవడంతో పై అధికారుల అనుమతితో పాత టికెట్లపై సంతకం చేసి.. 20 టికెట్లను అమ్మినట్లుగా తెలిపారు. రామాలయానికి ఆదాయం తెచ్చే క్రమంలోనే ఈ టికెట్లను విక్రయించామన్నారు. ఇదే విషయమై ఆలయ ఈవో ఎం.రఘునాథ్ను ‘న్యూస్లైన్’ సంప్రదించగా... ఏ టికెట్లు విక్రయించాలన్నా, ముద్రించాలన్నా దేవస్థాన అధికారుల అనుమతి తప్పని సరని పేర్కొన్నారు. హోలోగ్రాం లేకుండా ఉన్న టికెట్లు చెల్లవన్నారు. హోలోగ్రాం లేకుండా టికెట్ల ఇచ్చిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. దీనిపై పూర్తివివరాలు తెలుసుకుంటానన్నారు. భారమైన ‘ద్వార’ దర్శనం.. ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చిన వీవీఐపీలను రెండు సెక్టార్లగా విభజించారు. మొదటి సెక్టార్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు 250 సీటింగ్ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. వారి వెనుక భాగాన రూ.800 విలువ గల టికెట్లను 350 మంది వీవీఐపీల కోసం కేటాయించారు. కేవలం 350 మంది భక్తులకు మాత్రమే సరిపోయే ఈ సెక్టార్లో అదనంగా టికెట్లు విక్రయించడం వల్ల శనివారం ఉత్తరద్వార దర్శనానికి వచ్చిన వీవీఐపీ భక్తులు పలు ఇబ్బందులు పడ్డారు. ఉత్తరద్వార దర్శనం తలుపులు తెరవక ముందే ఈ సెక్టార్ భక్తులతో నిండిపోయింది. వీవీఐపీల సెక్టార్లోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన దారిలో పలువురు కూర్చుండి పోయారు. అధికారులు ముందస్తు ఆలోచన లేకుండా ఇలా అదనంగా టికెట్లను విక్రయించడం వల్లనే వీవీఐపీ భక్తులు ప్రశాంత దర్శనానికి నోచుకోలేదనే విమర్శలు వచ్చాయి. ఉత్సవాల చరిత్రలో తొలిసారి దేవస్థాన ఉత్సవాల చరిత్రలోనే ఇలా అదనంగా టికెట్లను ముద్రించి అమ్మటం ఈ ఏడాదే చోటుచేసుకుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. దేవస్థానం అధికారుల అనుమతి లేకుండా టికెట్లను అదనంగా ముద్రించి విక్రయించడం వివాదాస్పదమైంది. కేవలం ఉన్నతాధికారుల మెప్పు, ప్రజా ప్రతినిధుల ఆశీస్సులను పొందటం కోసమే రెవెన్యూ అధికారులు భక్తుల సౌకర్యాలను గాలికొదిలేశారనే విమర్శలు వచ్చాయి. కష్టం మాది..పెత్తనం రెవెన్యూ శాఖ వారిది అని ఇప్పటికే లోలోపల మదన పడుతున్న ఆలయ అధికారులకు...రెవెన్యూ అధికారుల పెత్తనం ‘పుండుమీద కారం చల్లినట్టయింది.’ -
మొదటి షాట్ తీస్తుండగా....నాన్న మరణవార్త తెలిసింది
తొలియత్నం కథ, కవిత, ఆట, పాట, చిత్రం, శిల్పం... కళ, కల్పన, మరే సృజనకైనా ప్రేరణ ప్రేమ. ప్రేమ ఈ ప్రపంచపు ప్రాణవాయువు. అది సృజనకు అగ్గి రాజేస్తుంది. హృదయాంతరాళాల్లో కొత్త ప్రపంచాలను సృష్టిస్తుంది. యుగయుగాలుగా, తరతరాలుగా మనిషిని ఊరిస్తున్న, ఊపేస్తోన్న ఈ ప్రేమ ఝంజాటాన్ని, మనసుల గుంజాటనల్ని కళాకారులు రకరకాల రూపాల్లో ఆవిష్కరించారు. అలాంటి ప్రేమను కథావస్తువుగా చేసుకుని దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి వెండితెరపై ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి’ అనే దృశ్య కావ్యాన్ని తన తొలియత్నంగా రూపొందించారు. నువ్వు నన్ను నమ్మొద్దు. అలాగే నిన్ను కూడా నువ్వు నమ్మొద్దు. మనం నమ్మాల్సింది ప్రేమను. మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ నిజమైతే, అది ఒక శక్తిగా మారి మనల్ని పెళ్లి దాకా తీసుకెళ్తుంది. పెళ్లిపీటల మీద ఎవరు కూర్చున్నా తాళి కట్టేది మాత్రం నేనే’ - ఇది సినిమాలో హీరో హీరోయిన్తో చెప్పే డైలాగ్. ప్రేమ శక్తి మీద ఉన్న నమ్మకంతో ఈ డైలాగ్ రాసుకున్నాను. అదే లైన్ మీద కథ అల్లుకున్నాను. ప్రేమ మీద నమ్మకంతో ప్రేమకథ రాసుకున్నాను కానీ నన్ను నేను నమ్మడానికి, నిరూపించుకోవడానికి చాలా సంఘర్షణ అనుభవించాను. నా మొదటి సినిమా కోసం నా ప్రయాణంలో మలుపులు, ఒక సినిమాలో కన్నా ఎక్కువగా ఉన్నాయి. నాగార్జునగారు హీరోగా చేసిన అయిదు సినిమాలకు నేను డెరైక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను (అగ్నిపుత్రుడు, జానకి రాముడు, గోవిందా గోవిందా, క్రిమినల్, నిన్నే పెళ్లాడతా). తను సెట్లో ఓ పక్క నల్ల కళ్లద్దాలు పెట్టుకుని కూర్చుని అందరినీ గమనిస్తుండేవారు. టాలెంట్ను గుర్తించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. తన కెరీర్లో చాలామందిని దర్శకులుగా పరిచయం చేశారు. అందుకే ఆయన్ను సెల్యులాయిడ్ సైంటిస్ట్ అంటుంటాను. నా కష్టించే తత్వం, క్రమశిక్షణ ఆయన్ని ఆకట్టుకున్నాయి. ‘గోవిందా గోవిందా’, ‘క్రిమినల్’కు పనిచేసిన సమయాల్లో దర్శకుడిగా అవకాశం ఇస్తానని చెప్పారు. అవి ఫ్లాప్ కావడంతో రెండుసార్లు అవకాశం చేజారింది. ‘నిన్నే పెళ్లాడతా’ సమయంలో మళ్లీ మాట ఇచ్చారు. ఆ సినిమా హిట్ కావడంతో తన మాట నిలబెట్టుకున్నారు. సినిమా తీయడానికి నాగార్జునగారు సిద్ధంగా ఉండటంతో, స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాను. అప్పుడు రవితేజ నా రూమ్మేట్. తనను పక్కన పెట్టుకుని ఒక్కొక్క సీన్ డిస్కస్ చేస్తూ రెండు రోజుల్లో స్క్రిప్ట్ పూర్తిచేశాను. ఈలోపు నాగార్జునగారు కొత్త దర్శకుడితో గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద సినిమా తీస్తున్నట్టు పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. మరి ఈ కథకు హీరో ఎవరైతే బాగుంటారా అని ఆలోచిస్తున్న సమయంలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఆ పోస్టర్ మీద హీరోతో పాటు ఈ అబ్బాయి ఎవరు అని ఒక క్యాప్షన్ ఉంచారు. పోస్టర్ చూసి ఇతనెవరో సన్నగా, స్టైల్గా అచ్చం రజనీకాంత్లా ఉన్నాడు, నా కథకు సరిపోతాడని అనుకున్నాను. ఎంక్వైరీ చేస్తే పేరు పవన్ కల్యాణ్, చిరంజీవిగారి తమ్ముడని తెలిసింది. కల్యాణ్గారిని అప్రోచ్ అవుదామని ప్రయత్నిస్తే, అప్పటికే తను ‘గోకులంలో సీత’ కమిట్ అయ్యాడని తెలిసింది. ఆ ప్రయత్నం విరమించుకున్నాను. అదే సమయంలో అన్నపూర్ణ బ్యానర్ మీద సుమంత్ను హీరోగా పరిచయం చేస్తున్నారని తెలిసి అవకాశం అడిగాను. అప్పటికే తనను రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో పరిచయం చేస్తున్నామని చెప్పారు. తరువాత జేడీ చక్రవర్తి, శ్రీకాంత్, జగపతిబాబు, వెంకటేశ్లకు కథ వినిపించాను. పట్టు వదలకుండా ఇండస్ట్రీలో ఉన్న తొంభై శాతం మంది హీరోలకు ఈ కథ చెప్పాను. అందరూ చూద్దాం చేద్దాం అన్నారే తప్ప అడుగు ముందుకు పడలేదు. చాలా విసిగిపోయి కొత్తవాళ్లతో చేయాలని నిర్ణయించుకున్నాను. సినిమా చర్చ వచ్చినప్పుడు నాగార్జునగారు హీరో ఎవరు కావాలని అడిగారు. కొత్తవాళ్లయితే బాగుంటుందన్నాను. నేను అవసరం లేదా అన్నారాయన. ఈ కథకు కొత్తవాళ్లయితే బాగుంటుందని అన్నాను. సరే అన్నారాయన. నేను ఆర్టిస్ట్ కోసం అన్వేషిస్తుండగా సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు వెంకట్ను పరిచయం చేశారు. హీరోగా తను సరిపోతాడనిపించింది. మిగతా ఆర్టిస్టులందరినీ బాంబేకు వెళ్లి సెలక్ట్ చేశాను. నిజానికి ఆ రోజుల్లో అంతా కొత్తవాళ్లతో సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్కు తెగింపు ఉండాలి. ఎందుకంటే రాఘవేంద్రరావుగారు కొత్తవాళ్లతో తీసిన పరదేశి, దాసరిగారి కల్యాణ ప్రాప్తిరస్తు, కృష్ణవంశీ సింధూరం ఏవీ ఆశించిన ఫలితాలనివ్వలేదు. నా సినిమా కథ ప్రకారం ఫస్టాఫ్ దుబాయ్లో జరుగుతుంది. సెకండాఫ్ రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూళ్లో జరుగుతుంది. కొత్తవాళ్లతో అంత బడ్జెట్ పెట్టి తీయడం ప్రొడ్యూసర్కు చాలా రిస్క్. ఇలాంటి సందర్భాల్లో నాగార్జునగారు నామీద నమ్మకంతో ఆ సాహసం చేశారు. సినిమా జరుగుతున్నప్పుడు అంతా కొత్తవాళ్లు కాబట్టి అప్పుడప్పుడూ కాన్ఫిడెన్స్ కోల్పోయేవాణ్ని. చుట్టూ ఉన్నవాళ్లు నాగార్జునగారికి చాలా విషయాలు నెగటివ్గా చెప్పేవారు. ఆయన వినేవారు తప్ప రియాక్ట్ అయ్యేవారు కాదు. ఆయన నామీద నమ్మకంతో నేనేం అడిగితే అది సమకూర్చేవారు. ఇవన్నీ ఒకవైపు. మరోవైపు నేను మొదటి షెడ్యూల్ కోసం వైజాగ్లో ఉన్నాను. షెడ్యూల్ చివరిరోజు రామాయణ సారానికి సంబంధించి మొదటి షాట్ తీస్తుండగా మా నాన్నగారి మరణవార్త తెలిసింది. పని డిస్ట్రబ్ అవడం ఇష్టంలేక, సాయంత్రం వరకూ సినిమా షూట్ చేశాను. నిజానికి షెడ్యూల్ మధ్యలోనే ఆయన అనారోగ్యం పాలైనా, పదమూడేళ్ల తరువాత నాకు వచ్చిన అవకాశాన్ని డిస్ట్రబ్ చేయడం ఇష్టంలేక, తన విల్పవర్తో అంతకాలం బతికారేమో అనిపించింది. నా జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిన నాన్న మరణం నన్ను చాలా కుంగదీసింది. కొన్ని రోజులు గడిచాక, నాకు నేను సర్దిచెప్పుకుని తిరిగి షూటింగ్ మొదలుపెట్టాను. ఈ సినిమాకు సంబంధించి నేను చెప్పుకోవలసింది మొదటగా నాగార్జునగారైతే, రెండో వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావుగారు. నేను ఎన్టీర్ పరమ భక్తుడినైతే, మా అమ్మా నాన్న ఏఎన్నార్గారి వీరాభిమానులు. ఇందులో తాత పాత్రకు ఆయన తప్ప మరొకరు సరిపోరేమోననిపించింది. నటనలో అత్యున్నత శిఖరాలనందుకున్న ఏఎన్నార్, మరోవైపు నటనకు సంబంధించి ఓనమాలు దిద్దని ముగ్గురు కొత్త నటులతో నా మొదటి సినిమా తీయడం ఒక గొప్ప అనుభవం. అక్కినేనిగారు సెట్లో నన్ను సార్ అని పిలిచేవారు. అదేంటి సార్ అంటే, నేనే నిన్ను గౌరవించకపోతే మరెవరు గౌరవిస్తారనేవారాయన. ఆయనతో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తాను. ఇక కొత్త ఆర్టిస్ట్ అయినా పాత్రను అర్థం చేసుకుని నటించాడు వెంకట్. చాందిని చాలా ధైర్యం గల అమ్మాయి. దుబాయ్లో పర్మిషన్ లేకుండా విపరీతమైన చలిలో షూట్ చేస్తున్నాం. దాదాపు మూడు కిలోమీటర్లు ఉన్న టన్నెల్ మధ్యలో ఒక ఎడ్జ్లో నిలబడాలి. పోలీసులు చూస్తే పట్టుకుంటారేమోనని టెన్షన్ పడుతుంటే, తను చాలా ధైర్యంగా నిలబడి చాలా తొందరగా షాట్ పూర్తిచేసింది. అలా అందరి సహకారంతో, అన్ని అడ్డంకులు దాటుకుని 99 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశాం. సంగీతం విషయానికొస్తే, అది చిన్నప్పటినుంచీ నా నరనరాల్లో ఉంది. కీరవాణిగారిని హింస పెట్టి నాకు కావలసిన విధంగా పాటలు చేయించుకున్నాను. సీతారామశాస్త్రిగారు అద్భుతమైన సాహిత్యం అందించారు. పాటలు తీశాక, నేను పిక్చరైజ్ చేసిన విధానం చూసి కీరవాణిగారు మెచ్చుకున్నారు. సంభాషణలు రాసిన జంధ్యాలగారైతే, డబుల్ పాజిటివ్ చూసి మళ్లీ రెండోసారి చూశారు. టైటిల్ విషయంలో చాలా చర్చ జరిగింది. నా ఆరాధ్య దైవం ఎన్టీఆర్ డెరైక్షన్లో వచ్చిన సీతారామకళ్యాణంలో పాటను టైటిల్గా వాడుకున్నాను. కొంతమంది టైటిల్ చాలా పొడవుగా ఉందన్నారు. తెలుగువాళ్ల నరనరాల్లో జీర్ణించుకున్న పాట కావడంతో టైటిల్ రిచ్ అవుతుందని నమ్మకంతో ఉన్నాను. దానికి ‘ట్రస్ట్ లవ్’ అనే క్యాప్షన్ పెట్టాను. 1998 జూన్ 26న సినిమా విడుదలైంది. రామ్గోపాల్వర్మ, రాఘవేంద్రరావు వంటి ఎందరో పెద్దలు సినిమా చూసి ప్రశంసించారు. ఈ సినిమా యూత్కి బాగా కనెక్ట్ అయ్యింది. నా ప్రేమలో, నా చుట్టూ ప్రేమకథల్లో జరిగిన కొన్ని సున్నితమైన ఫీలింగ్స్ను కథలో చేర్చాను. దాంతో చాలామంది ఇది తమ ప్రేమకథలా భావించారు. అందుకే ఈ సినిమా అంత పెద్ద విజయాన్ని సాధించిందనిపిస్తుంది. - కె.క్రాంతికుమార్రెడ్డి -
రామాలయ బంగారు, వెండి ఆభరణాల అప్పగింత
భద్రాచలం, న్యూస్లైన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బంగారు, వెండి ఆభరణాలకు సంబంధించిన లావాదేవీలను బుధవారం పరిశీలించారు. గతంలో దేవస్థానం ఈవోగా పనిచేసిన కె. రామచంద్రమోహన్ సింహాచలం ఆలయానికి బదిలీపై వెళ్లిన నేపథ్యంలో ఆభరణాలకు సబంధించిన వివరాల బాధ్యతలను అప్పగించలేదు. అయితే ముక్కోటి ఏకాదశికి ఈ ఆభరణాలు స్వామివారికి అలంకరించాల్సి ఉన్నందున ఈవో రఘునాథ్ బుధవారం అందుబాటులో లేకున్నా.. వీటికి సంబంధించిన వివరాలను ఆలయ ఏఈవో శ్రావ ణ్కుమార్, సూపరింటెండెంట్ కనకదుర్గలకు అప్పగించారు. ఆలయంలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను వాస్తవిక సంఖ్య ఆధారంగా సరిపోల్చి వాటిని ధ్రువీకరించుకున్నారు. బ్యాంకులో ఉన్న ఆభరణాలను గురువారం పరిశీలించి వాటి బాధ్యతలను కూడా అందజేస్తానని సింహాచలం ఈవో రామచంద్రమోహన్ ‘న్యూస్లైన్’కు తెలిపారు. అనంతరం ఆయన ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపాన్ని తిలకించారు. అద్దాల మండపం మూసి ఉన్నప్పటికీ పనులు ఏ మేరకు ఉన్నాయో చూ సేందుకు మండపం తాళాలు తీయించారు. అద్ధాల మండపంలో స్వామి వారిని భక్తులంతా కనులారా చూసేలా అన్ని వేళల్లో తాళాలు తీసి ఉంచితే బాగుంటుందని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈ రవీందర్ ఉన్నారు. -
భద్రాద్రి రామాలయంలో రేపు విజయదశమి వేడుకలు
భద్రాచలం టౌన్, న్యూస్లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో విజయ దశమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి(ఈఓ) ఎం.రఘునాధ్, ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారంగా.. శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగిసిన పిదప రామాలయంలో విజయ దశమి వేడుకలను నిర్వహించటం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ప్రత్యేక కార్యక్రమాలు: 14వ తేదీన భద్రాద్రి రామాలయంలో జరిగే వేడుకల వివరాలను ఈఓ, ప్రధాన అర్చకులు వివరించారు. గజ, అశ్వ, రాజాధిరాజ వాహనాలపై రామయ్య స్వామి దసరా మండపం వరకు పారువేటకు వెళతారు. తెల్లవారుజామున స్వామి వారి మూల విరాట్టులకు, ఉత్సవమూర్తులకు అంతరాలయంలో ఏకాంతంగా అభిషేకం ఉంటుంది. ఉదయం 8 నుంచి 8.15 గంటల వరకు క్షేత్ర మహత్యం, 9 నుంచి 10 గంటల వరకు నిత్య కళ్యాణం, 10 నుంచి 11 గంటల వరకు మహా పట్టాభిషేకం, 11 నుంచి 12 గంటల వరకు యాగశాలలో మహాపూర్ణాహుతి, 12 గంటలకు ఆరాధన, ఆరగింపు, నివేదన ఉంటాయి. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆలయ తలుపులు మూస్తారు. 3 గంటలకు స్వామి వారికి రాజ దర్బార్, 3.30 నుంచి 4.30 గంటల వరకు పారువేట ఉంటాయి. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు దసరా మండపంలో శమీ, ఆయుధ పూజ, ఆశీర్వచనం; 6.06 గంటలకు శ్రీరామలీల ఉత్సవం సందర్భంగా రావణాసురవధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీరలక్ష్మి అలంకరణలో అమ్మవారు శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ తాయారమ్మ వారు శనివారం వీరలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాలు ముగియనున్న నేపథ్యంలో అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. అమ్మవారికి పంచామృతాలతో, నారీకేల జలంతో, పండ్ల రసాలతో, నదీజలాల తో ఆలయ అర్చకులు అభిషేకం.. సహస్ర జలాభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారిని వీరలక్ష్మిగా అలంకరించి భక్తుల దర్శనార్దం లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో కొలువుతీర్చారు. ఈ అలంకరణ ప్రాశస్థ్యాన్ని ఆలయ అర్చకులు వివరించారు. అనంతరం, అమ్మవారికి ఎదురుగా రామయ్య స్వామికి దర్బారు సేవ నిర్వహించారు. తాత గుడి సెంటర్ వరకు తిరువీధి సేవ వైభవంగా నిర్వహించారు. అమ్మవారు 14వ తేదీన నిజరూప లక్ష్మి అలంకరణ లో దర్శనమిస్తారని వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు తెలిపారు. -
18 నుంచి శబరి ఉత్సవాలు
భద్రాచలం టౌన్, న్యూస్లైన్: శ్రీ రాముడి వద్ద అన్ని కులాలు, వర్గాలు ఒకటేననే సత్యం చాటేందుకు ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి అక్టోబర్ 18వ తేదీ నుంచి మూడురోజులు శబరి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ ఎం.రఘునాథ్ తెలిపారు. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గిరిజనులు, ప్రజల్లో ఆర్థిక అసమానతలు తొలగించి హిందూ మతం వైపు వారిని ఆకర్షించేందుకే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రామున్ని ఆరాధ్యదైవంగా కొలచిన శబరి గిరిజన మహిళ కావడం, రామాలయం ఏజెన్సీ ప్రాంతంలో ఉండటంతో శబరి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఏజెన్సీలో ఉంటూ రాముని దర్శనం చేసుకోని వారున్నారని..అటువంటి వారు ఇతర మతాలవైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. దీన్ని అరికట్టేందుకు ప్రచార రథాల ద్వారా ఉత్సవాలపై ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. గిరిజన ఆచార వ్యవహారాలను పరిశీలిస్తున్నామని, వారి సంస్కృతీ సంప్రదాయాల ప్రకారమే ఉత్సవాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆలయ అర్చకులతో సమీక్ష అనంతరం తుదిరూపు ఇస్తామన్నారు. గిరిజన, హరిజనవాడల్లో రూ. 3 లక్షల సీజీఎఫ్ నిధులతో రామాలయాలను నిర్మించి ఆ ఆలయాల్లోగిరిజన అర్చకుల ద్వారా పూజలు నిర్విహ స్తామన్నారు. వారికి రూ.2,500 గౌరవవేతనం అందించే బృహత్తర కార్యక్రమం వచ్చే ఏడాదికల్లా రూపుదిద్దుకుంటుందన్నారు. 2015లో జరిగే గోదావరి ఉత్సవాలకు ప్రణాళికను రూపొందించి ఉన్నతాధికారులకు పరిశీలనకు పంపామన్నారు. తానీషా కల్యాణ మండపాన్ని పూర్తిగా తీసివేసి రూ.5 కోట్ల వ్యయంతో ‘0 బ్లాక్’తో వందగదుల సత్రాన్ని భక్తుల వసతి కోసం నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్లాన్కు రామాలయ స్పెసిపైడ్ అథారిటీ కమిటీ కూడా ఆమోదం తెలిపిందన్నారు. బిల్డింగ్ ప్లాన్నూ రూపొం దిస్తున్నామన్నారు. దీన్ని తిరుమల తిరుపతిలోని రామ్బగీజా సత్రం తరహాలో నిర్మిస్తామని తెలిపారు. తానీషా కల్యాణ మండపం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో దాతల సహకారంతో 30 ఏసీ గదులతో మరో సదనం, 18 గదులతో శ్రీరామ సదనానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే గుట్టపైన రూ. 50 లక్షల వ్యయంతో ఓ కాటేజి, రూ. 60 లక్షలతో మరో కాటేజీని దాతల సహాయంతో నిర్మిస్తున్నామన్నారు. తూర్పుమెట్లకు రెండువైపులా మెట్లు, మధ్యలో విచారణ కేంద్రం నిర్మిస్తామని తెలిపారు. గోదావరి నీటిని ప్యూరిపైడ్ చేసి భక్తులకందించేందుకు వీలుగా ఆలయంలో ఐదు కూలర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పీఆర్వో కార్యాలయాన్ని బస్సుల పార్కింగ్ ప్రదేశానికి మార్చే ఆలోచన ఉందన్నారు. ఇక్కడి వరకు ఆర్టీసీ బస్సులు వచ్చేలా చూస్తామన్నారు. ఇక్కడి నుంచి గుట్టమీద ఉన్న టీటీడీ గదుల వరకు నిరంతరం ప్రైవేట్ వాహనాలను తిప్పేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుట్టపై మోడ్రన్ క్యాంటిన్కూ అనుమతిస్తామన్నారు. సారపాక వద్దే ట్రాఫిక్ను ఆపేలా చర్యలు గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తుల వాహనాలను సారపాక వద్దే ఆపేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనివల్ల బ్రిడ్జిపై ట్రాఫిక్ ఇక్కట్లు తప్పుతాయన్నారు. ఇందుకు రెవెన్యూ, పోలీసుశాఖల సలహా ప్రకారం సారపాకలో రూ.68 లక్షల వ్యయంతో 28 ఎకరాల భూమిని సేకరిస్తున్నామన్నారు. ఏడాది క్రితమే దీనికి సంబంధించిన నగదును పాల్వంచ ఆర్డీఓ కార్యాలయానికి డిపాజిట్ చేశామన్నారు. మిథిలాస్టేడియాన్ని కూడా ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. కల్యాణ మండపం ఆవశ్యకత, శిల్పకళా సౌందర్యం విశిష్టతను తెలిపేలా గైడ్నూ నియమిస్తున్నామన్నారు. కల్యాణమండపానికి తాత్కాలికంగా ఉన్న గేట్లను తొలగించి వాటిస్థానంలో ముఖద్వారంతో కూడిన శాశ్వతగేట్లను ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నామన్నారు. 2015 గోదావరి పుష్కరాల సమయానికి ఈ పనులన్నింటినీ పూర్తిచేస్తామని ఈఓ రఘునాథ్ తెలిపారు. -
భద్రాద్రి రామాలయంలో సౌకర్యాలు లేక భక్తుల ఇక్కట్లు
భద్రాచలం, న్యూస్లైన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కానీ ఇందుకనుగుణంగా ఆలయంలో సౌకర్యాలు మాత్రం మెరుగపడటం లేదు. అభివృద్ధి పనులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. శ్రీరామ నవమి ఉత్సవాల సమయంలో హడావిడి చేసిన ఆలయ అధికారులు ఆ తర్వాత అభివృద్ధి పనుల గురించి పూర్తిగా మరిచిపోయారు. గతంలో ఈవోలుగా పనిచేసిన చంధ్రశేఖర్ ఆజాద్, ఆ తర్వాత వచ్చిన రామచంద్రమోహన్, మధ్యలో కొంతకాలం పనిచేసిన బదరీనారాయణాచార్యులు తమదైన రీతిలో భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లకుండా ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చే పట్టే వారు. అభివృద్ధి పనులు కూడా అదే రీతిన సాగాయి. కానీ ప్రస్తుతం అభివృద్ధి పనులతో పాటు ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల శోభ కూడా కనిపించడం లేదు. గతంలో వరలక్ష్మీ వత్రం, పవిత్రోత్సవాలు ఎంతో అట్టహాసంగా చేసేవారు. కానీ ఈ ఏడాది ఈ ఉత్సవాలు నామమాత్రంగానే జరిగాయని పలువురు భక్తులు అంటున్నారు. ఆలయంలో జరిగే కార్యక్రమాలపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. అర్చకులు కూడా రెండు వర్గాలుగా విడిపోయారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుత ఈఓ రఘునాధ్ వైదిక కమిటీని ఉన్నఫళంగా రద్దు చేయటం ఈ విమర్శలకు మరింత బలం చేకూరుస్తోంది. అర్చకులు రెండు వర్గాలుగా విడిపోవటం భద్రాద్రి చరిత్రలో ఇదే మొదటి సారని, ఇందుకు ప్రస్తుత ఆలయాధికారులు నిర్వాకమే కారణమనే ప్రచారం కూడా ఉంది. దేవస్థానం పాలక మండలి లేకపోవటంతో పాలనపై ప్రశ్నించే వారు కరువయ్యారు. గత ఏడాది నవంబర్లో పాలక మండలి పదవీకాలం పూర్తి కాగా, నూతన ట్రస్టు బోర్డును వేసేందుకు ప్రభుత్వం వెనుకంజ వేసింది. దీనికి ప్రత్యామ్నాయంగా స్పెసిఫైడ్ అథారిటీ (సాధికారిత) కమిటీని వేసినప్పటికీ ఉత్సవాల సమయంలో వీరి అజమాయిషీ నామమాత్రమే అయింది. గత తొమ్మిది నెలలుగా ఆలయంలో అభివృద్ధి పనులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యవేక్షణలోని సాధికారిత కమిటీ ఎట్టకేలకు బాధ్యతలు చేపట్టేందుకు గురువారం ముహూర్తంగా నిర్ణయించారు. దీంతో ఇప్పట్లో దేవస్థానానికి కొత్త పాలకమండలి నియామకం లేనట్లేనని తేలిపోయింది. ఇకనుంచి సాధికారిత కమిటీనే ఆలయాభివృద్ధిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సమావేశం అవుతున్న కమిటీ రామాలయం అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాలపై సమీక్షించనుంది. రామయ్య అందాలను భక్తులు అద్దాలలో కనులారా తిలకించేందుకని ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఉన్న సమయంలో అద్దాల మేడ నిర్మాణ పనులు ప్రారంభించారు. కానీ దీని గురించి ప్రస్తుత అధికారులు పూర్తిగా మరించిపోయారు. చెన్నైకి చెందిన శ్రీనివాసన్ రూ.50 లక్షలతో బంగారు వాకిలి పనులను చేపట్టారు. దాత డబ్బులు ఇచ్చినప్పటికీ వాటిని సవ్యంగా వినియోగించుకోలేకపోవటంతో చివరకు ఆ పనులను ఆయనే స్వయంగా చేపట్టారు. అయితే బంగారు వాకిలి కూడా కొంత అసంపూర్తిగానే మిగిలిపోయింది. మాడ వీధుల విస్తరణ పేరిట శ్రీరామనవమి ముందు హడావిడిగా చేసిన పనులు ప్రస్తుతం అర్ధంతరంగా నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేసేందుకు ఆలయ ఆధికారులు శ్రద్ధ చూపటం లేదనే విమర్శ ఉంది. రూ. 22 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినా ప్రస్తుతం దాని ఊసే లేకుండా పోయింది. పాలక మండలి ఉన్న సమయంలో టీటీడీ వారు కాటే జీల నిర్మాణం కోసం రూ. 5 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పుడు దాని ప్రస్థావనే లేదు. ఉత్సవాల సమయంలో భక్తులకు సరైన వసతి, సౌకర్యాలు కరువయ్యాయి. ప్రస్తుతం ఉన్న గదులు, కాటేజీలు ఏమాత్రం సరిపోవటం లేదు. కొత్త కాటేజీల నిర్మాణంపై ఆలయ అధికారులు దృష్టి సారించటం లేదు. దాతలను కూడా ప్రోత్సహించకపోవటంతో వసతి సమస్య తీవ్రంగానే ఉంది. రాజగోపురానికి మెరుగులు దిద్దేందుకని పెయింట్ను తొలగించి, దాన్ని అలాగే వదిలేశారు. దీంతో అది కళాహీనంగా మారింది. సిబ్బందిలో నిర్లక్ష్వం పేరుకుపోతోంది. జమా ఖర్చులపై పర్యవేక్షణ లేదు. ఆడిట్ అభ్యంతరాలు ఉన్నప్పటికీ అధికారులు దీనిపై దృష్టి సారించటం లేదు. సాధికారిత కమిటీ అయినా ఇలాంటి సమస్యలపై దృష్టి సారించకపోతే ఆలయ పాలన పూర్తిగా గాడి తప్పే ప్రమాదం ఉందని భక్తులు అంటున్నారు.