sushil kumar modi
-
బిహార్ మాజీ ముఖ్యమంత్రికి వచ్చిన కేన్సర్ ఎలాంటిదంటే?
బిహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ సోమవారం (మే 13) మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు ఆరు నెలల క్రితమేకేన్సర్ నిర్ధారణ అయినట్టు ట్వీట్ ద్వారా వెల్లడించారు. గొంతు కేన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్న మాజీ సీఎం ఢిల్లీలోని ఎయిమ్స్లో ఆయన తుది శ్వాస విడిచారు. అతనుఈ కేన్సర్ లక్షణాలు ఏమిటో? నివారణ మార్గాలేమిటో? ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన డాక్టర్ అభిషేక్ శంకర్ తెలియజేశారు.బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ గొంతు కేన్సర్కి గురవడంతో.. ఈ వ్యాధి క్రమంగా అతని ఊపిరితిత్తులకు చేరుకుంది. దీంతో ఆయన కన్నుమూశారు. ఈనేపథ్యంలో గొంతు కేన్సర్ లక్షణాలు, కారణాలు తెలుసుకుందాం.ఇవి.. గొంతు కేన్సర్ లక్షణాలు..– ఒక వ్యక్తికి తరచుగా దగ్గు సమస్య ఉన్నా, ఆహారం మింగడంలో ఎలాంటి ఇబ్బంది కొనసాగినా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి– ఇలాంటి లక్షణాలను అస్సలు విస్మరించకూడదు. ఎందుకంటే గొంతు కేన్సర్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.– దీనినే 'అన్నవాహిక' కేన్సర్ అని కూడా పిలుస్తారు. లక్షణాలు– కేన్సర్ కారణంగా.. గొంతునొప్పితో బాధపడుతున్న వ్యక్తి వాయిస్ ముద్దగా మారుతుంది.– ఆహారం తినేటప్పుడు గొంతులో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీంతోపాటుగా వాపు కూడా సంభవిస్తుంది.– బాధితుడు గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు.. చెవి నొప్పి కూడా రావచ్చు.– దగ్గుతున్నప్పుడు శ్లేష్మంతో పాటు రక్తం కూడా వచ్చే అవకాశం ఉంది.– అలాగే బరువులో మార్పులు కూడా కనిపిస్తాయి. గొంతు కేన్సర్కు కారణమేమిటి?– ఒక వ్యక్తి నిరంతరం ధూమపానం చేయడంతో గొంతు కేన్సర్కు గురయ్యే అవకాశం ఉంది.– పొగాకు సేవించే వారిలోనూ ఈ వ్యాధి సోకే ప్రభావం ఉంది.– అలాగే ధూమపానంతోపాటు , మద్యం సేవించే వారికి కూడా గొంతు కేన్సర్ వస్తుంది.– ఈ వ్యాధి విటమిన్ ఎ లోపం వల్ల కూడా రావచ్చు.మనల్ని మనం ఎలా రక్షించుకోవచ్చు?– కేన్సర్ ప్రమాదకరమైన ఒక ప్రాణాంతక వ్యాధి.– శరీరంలోని ఏదైనా భాగంలో కేన్సర్ సోకితే వెంటనే చికిత్స పొందడం చాలా ముఖ్యం. అశ్రద్ధ వహిస్తే క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది.– గొంతు కేన్సర్ ఆహార నాళ ద్వారాన్ని అడ్డుకుంటుంది. దీంతో ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.– గొంతులో అకస్మాత్తుగా భారం, వాయిస్లో మార్పు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని డా. అభిషేక్ శంకర్ తెలిపారు.ఇవి చదవండి: ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి -
సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత
పట్నా: బిహార్కు చెందిన బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ(72) సోమవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజ్యసభ ఎంపీగాను, 2004 ఎన్నికల్లో భాగల్పూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2005లో ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్సీగా ఎన్నికై, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సుశీల్కుమార్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ప్రధాని మోదీ సంతాపం..సుశీల్ కుమార్ మోదీ మరణంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘పార్టీలో విలువైన సహచారుడు, నా స్నేహితుడు సుశీల్ మోదీ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. బిహార్లో బీజేపీ ఎదుగుదల, విజయానికి సుశీల్ కుమార్ ఘనత వహించారు’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా సంతాపం తెలియజేశారు.पार्टी में अपने मूल्यवान सहयोगी और दशकों से मेरे मित्र रहे सुशील मोदी जी के असामयिक निधन से अत्यंत दुख हुआ है। बिहार में भाजपा के उत्थान और उसकी सफलताओं के पीछे उनका अमूल्य योगदान रहा है। आपातकाल का पुरजोर विरोध करते हुए, उन्होंने छात्र राजनीति से अपनी एक अलग पहचान बनाई थी। वे… pic.twitter.com/160Bfbt72n— Narendra Modi (@narendramodi) May 13, 2024బిహార్ రాజకీయాల్లో గొప్ప మార్గదార్శకుడు: అమిత్ షా‘రాజకీయాల్లో గొప్ప మార్గదర్శకుడని బిహార్ కోల్పోయింది. ఆయన రాజకీయాలు పేదలు, వెనుకబడిన వర్గాల ప్రయోజనాల కోసం అంకితం చేశారు. ఆయన మరణంతో బీహార్ రాజకీయాల్లో నెలకొన్న శూన్యతను పూరించలేము’ అని అమిత్ షా ‘ఎక్స్’లో సంతాపం తెలియజేశారు.हमारे वरिष्ठ नेता सुशील कुमार मोदी जी के निधन की सूचना से आहत हूँ। आज बिहार ने राजनीति के एक महान पुरोधा को हमेशा के लिए खो दिया। ABVP से भाजपा तक सुशील जी ने संगठन व सरकार में कई महत्त्वपूर्ण पदों को सुशोभित किया। उनकी राजनीति गरीबों व पिछड़ों के हितों के लिए समर्पित रही। उनके…— Amit Shah (Modi Ka Parivar) (@AmitShah) May 13, 2024ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుశీల్ కుమార్ మోదీ మృతికి సంతాపం తెలిపారు. ‘గత 51-52 సంవత్సరాలుగా.. పట్నా యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ కాలం నుంచి సుశీల్ కుమార్ మోదీ నా స్నేహితుడు. ఆయన మృతి బాధాకరం’అని సంతాపం తెలిపారు. पटना यूनिवर्सिटी छात्र संघ के समय यानि विगत 51-52 वर्षों से हमारे मित्र भाई सुशील मोदी के निधन का अति दुःखद समाचार प्राप्त हुआ।वे एक जुझारू, समर्पित सामाजिक राजनीतिक व्यक्ति थे। ईश्वर दिवगंत आत्मा को चिरशांति तथा परिजनों को दुख सहने की शक्ति प्रदान करें।— Lalu Prasad Yadav (@laluprasadrjd) May 13, 2024 -
క్యాన్సర్ బారిన సుశీల్ కుమార్ మోదీ!
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్తో పోరాడుతున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో స్వయంగా తెలియజేశారు. సుశీల్ కుమార్ మోదీ బీహార్ ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఆయన తన 33 సంవత్సరాల రాజకీయ జీవితంలో రాజ్యసభ, లోక్సభ, శాసన మండలి, శాసనసభతో సహా మొత్తం నాలుగు సభలలో సభ్యునిగా కొనసాగారు. ఐదేళ్లపాటు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. సుశీల్ కుమార్ మోదీ బీహార్ ఉప ముఖ్యమంత్రిగానూ, ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. నాటి ఎమర్జెన్సీ రోజ్లులో 19 నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆయన వరుసగా 15 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. తొమ్మిదేళ్ల పాటు శాసన మండలి సభ్యునిగా ఉన్నారు. లోక్సభలో భాగల్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రాజ్యసభ సభ్యుడైన తర్వాత, సభలోని లా అండ్ జస్టిస్ కమిటీకి ఛైర్మన్గానూ వ్యవహరించారు. తాను ఆరు నెలలుగా క్యాన్సర్తో బాధపడుతున్నానని సుశీల్ కుమార్ మోదీ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. ఇప్పుడు తన అనారోగ్యం గురించి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తాను లోక్సభ ఎన్నికల కోసం ఏమీ చేయలేనని, అన్ని విషయాలు ప్రధానికి తెలియజేశానని దానిలో పేర్కొన్నారు. पिछले 6 माह से कैंसर से संघर्ष कर रहा हूँ । अब लगा कि लोगों को बताने का समय आ गया है । लोक सभा चुनाव में कुछ कर नहीं पाऊँगा । PM को सब कुछ बता दिया है । देश, बिहार और पार्टी का सदा आभार और सदैव समर्पित | — Sushil Kumar Modi (मोदी का परिवार ) (@SushilModi) April 3, 2024 -
నితీశ్కుమార్ తిరిగి ఎన్డీయేలోకి?!
అతిత్వరలో బీహార్లోనూ మహారాష్ట్ర తరహా రాజకీయ సంక్షోభం నెలకొంటుంది. అదీ అధికార పక్షంలోనే!. నితీశ్ కుమార్ వైఖరి నచ్చక కొందరు ఎమ్మెల్యేలు జేడీయూ నుంచి బయటకు వచ్చేస్తారు. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితుల నడుమ నితీశ్ మరో దారి లేక తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి అడుగు పెడతారు!!. మహారాష్ట్రలో అజిత్ పవార్తో పాటు ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల జంపింగ్ పరిణామం నడుమ.. తర్వాతి వంతు బీహార్దేనంటూ రాజకీయ విశ్లేషణలు మొదలయ్యాయి. పైగా ప్రభుత్వం కూలిపోయే తరుణంలో గత్యంతరం లేని స్థితిలో నితీశ్ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరతారంటూ పలు మీడియా విశ్లేషణలు జరుగుతున్నాయి. దీనికి తోడు గత నాలుగైదు రోజులుగా నెలకొన్న పరిస్థితులూ ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉండడంతో.. నితీశ్ వైఖరిపైనా అనుమానాలు కలుగుతూ వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికలను విపక్షాలు నిర్వహించదల్చిన భేటీ.. మహారాష్ట్ర ఎన్సీపీ ఎపిసోడ్ కారణంగా వాయిదా పడింది. అదే సమయంలో బీహార్ గత నాలుగు పర్యటనలో నితీశ్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఆశ్చర్యంగా తాజా పర్యటనలో మాత్రం పన్నెత్తి మాట అనలేదు. పైగా అవినీతి పక్షంతో పొత్తు(జేడీయూ మిత్రపక్షం ఆర్జేడీకి) దేనికి అంటూనే.. దానిని దూరంగా ఉండాలంటూ నితీశ్ సర్కార్కు పరోక్ష సూచన చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే నితీశ్.. పాత మిత్ర కూటమికి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 2017లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేయగా.. నితీశ్ కుమార్ ఆర్జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో పొత్తుకు ముందుకు వెళ్లారు. అయితే.. తాజా ఊహాగానాలను పటాపంచల్ చేశారు బీహార్ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అదంతా మీడియా సృష్టేనని తేల్చిపడేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నితీశ్ను బీజేపీ దగ్గరకు తీయబోదని స్పష్టం చేశారాయన. ‘‘బీజేపీకి ఆయన(నితీశ్) దూరం జరిగాక అమిత్ షా ఓ స్పష్టత ఇచ్చారు. ఇకపై బీజేపీ ఎప్పటికీ నితీశ్ను అంగీకరించబోదని. అలాంటప్పుడు నితీశ్ మళ్లీ ఎన్డీయేలో చేరే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుంది! అని సుశీల్ మోదీ మీడియాతో స్పష్టం చేశారు. అయితే.. బీజేపీకి చెందిన మరో సీనియర్, కేంద్ర మంత్రి రామ్దాస్ అథావాలే మాత్రం మరో తరహా ప్రకటన ఇచ్చారు. బీహార్లోనే కాదు.. యూపీలోనూ మహారాష్ట్ర పరిణామాలు ఏర్పడొచ్చని చెబుతున్నారాయన. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీహార్ జేడీయూలో, ఉత్తర ప్రదేశ్ ఎస్పీలోనూ ఆయా పార్టీ చీఫ్ల మీద ఉన్న అసంతృప్తితో కొందరు బయటకు రావడం ఖాయం. ఎస్పీలో జయంత్ చౌద్రి ఎన్డీయే కూటమిలో చేరే అవకాశం లేకపోలేదు అని సంచలన ప్రకటన చేశారు అథావాలే. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది జనవరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో జేడీయూతోగానీ, నితీశ్ కుమార్ను గానీ దగ్గరకు తీయొద్దంటూ ఏకంగా ఓ తీర్మానం పాస్ చేసింది పార్టీ. ఇదిలా ఉంటే.. మహా పరిణామాల నేపథ్యంలో విపక్షాల భేటీ వాయిదా పడిందనే ప్రచారానికి చెక్ పెడుతూ.. ఈ నెలలోనే భేటీ ఉంటుందని విపక్షాల తరపున ఒక ప్రకటన వెలువడింది కూడా. ఇదీ చదవండి: ఎన్పీసీని బలోపేతం చేస్తాం.. పునర్నిర్మిస్తాం! -
త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. రూ.2000 నోట్లను దశల వారీగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ పెద్ద నోట్లు ఉన్న వారు వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని సూచించారు. దేశంలోని ఏటీఎంలలో రూ.2వేల నోట్లన్నీ ఖాళీ అయ్యాయని సుశీల్ మోదీ పేర్కొన్నారు. త్వరలోనే ఈ నోట్లను రద్దు చేస్తారనే వదంతులు కూడా మొదలయ్యాయని చెప్పారు. కేంద్రం దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రూ.2వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ మూడేళ్ల కిందటే నిలిపివేసిందని చెప్పుకొచ్చారు. 2016లో ప్రధాని మోదీ నోట్ల రద్దును ప్రకటించారు. రూ.1000, రూ.500 నోట్లను బ్యాన్ చేశారు. వాటి స్థానంలో కొత్తగా రూ.2000, రూ.500 నోట్లను చలామణిలోకి తెచ్చారు. అయితే రూ.1000 నోట్లనే రద్దు చేసినప్పుడు రూ.2000 నోట్లను చలామణిలోకి తేవడంలో అర్థం లేదని సుశీల్ మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్ద నోట్లు చలామణిలో లేవని వివరించారు. భారత్లో రూ.2వేల నోట్లను డ్రగ్స్, మనీ లాండరింగ్ వంటి అక్రమ లావాదేవీలకు ఉపయోగిస్తున్నారని బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చారు. ఈ పెద్ద నోటు నల్ల ధనానికి పర్యాయపదంగా మారిందని చెప్పారు. అందుకే కేంద్రం దశల వారీగా రూ.2వేల నోట్లను రద్దు చేసి, వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు ప్రజలకు రెండేళ్ల సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. చదవండి: రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని లేకుండా చేయాలి: కాంగ్రెస్ నేత -
‘నితీశ్ కుమార్ ఈ జన్మలో ప్రధాని కాలేడు!’
పాట్నా: ఎన్డీయే కూటమి నుంచి వైదొలగి.. పాత మిత్రపక్షాలతో బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనతా దల్ యునైటెడ్కు(జేడీయూ) మామూలు ఝలక్లు తగలడం లేదు. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఒకేఒక్క ఎమ్మెల్యే ఈమధ్యే బీజేపీలో చేరిపోగా.. తాజాగా ఊహించని రీతిలో మణిపూర్లో పెద్ద షాక్ తగిలింది. ఏకంగా ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రభుత్వానికి మద్ధతు ప్రకటిస్తూ.. పార్టీ మారిపోయారు. ఈ క్రమంలో జేడీయూపై విమర్శలు ఎక్కుపెట్టింది బీజేపీ. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. ప్రధాని కావాలని నితీశ్ కుమార్ కంటున్న కలలు ఈ జన్మలో నెరవేరవని, ఆర్జేడీతో జేడీయూ సర్వనాశనం అవుతుందని బీజేపీ సీనియర్ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్లు ఇప్పుడు జేడీయూ నుంచి విముక్తి పొందాయి. త్వరలో లాలూ ప్రసాద్ యాదవ్.. ఉన్న జేడీయూను చీల్చడం ఖాయం. అప్పుడు జేడీయూ ముక్త బీహార్ అవుతుంది. జాతీయ రాజకీయాల్లో రాణించాలని, ప్రధాని అభ్యర్థిగా ఉండాలని నితీశ్ భావిస్తున్నట్లు ఉన్నాడు. కానీ.. ఆ ప్రయత్నం ఈ జన్మలో నెరవేరదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు సుశీల్ మోదీ. ఇక డబ్బు ఉపయోగించి ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగారన్న జేడీయూ చీఫ్ ఆరోపణలను సుశీల్ మోదీ ఖండించారు. రంజన్ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. డబ్బుకు లొంగిపోయేంత బలహీనులా వాళ్ల ఎమ్మెల్యేలు. అలాంటి వాళ్లకా జేడీయూ టికెట్లు ఇచ్చింది? అని సెటైర్లు వేశారాయన. వాళ్లు మొదటి నుంచి ఎన్డీయేలో కొనసాగాలనుకుంటున్నారు. జేడీయూ ఇప్పుడేమో ఎన్డీయేకు దూరం జరిగింది. కాంగ్రెస్తో చేతులు కలపాలన్న జేడీయూ అధిష్ఠానం ఆలోచన వాళ్లకు నచ్చలేదు. అందుకే ఆ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు అని సుశీల్ మోదీ చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: అదే జరిగితే 2024లో సీన్ వేరేలా ఉంటుంది -
సీఎం కేసీఆర్ పట్నా పర్యటనపై సుశీల్ మోదీ కీలక వ్యాఖ్యలు
-
బిహార్ సీఎం పై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్ పై బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజ్యసభ ఎంపీగా పదివి చేపట్టక మునుపు తాను బిహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిస్తున్న సమయంలో జేడీయు నాయకులు తన వద్దకు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టారని అన్నారు. నితీష్ కుమార్ ఉపరాష్ట్రపతిగా ఢిల్లీ వెళ్లితే మీరు ముఖ్యమంత్రి అవుతారంటూ అదే జేడీయే నాయకులు ఒక పథకంతో తనను సంప్రదించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐతే నితీష్ కుమార్ తనకు ఆ ఉద్దేశం లేదని కొట్టిపారేశారు. కేవలం తాను బీజేపీ వ్యూహం నుంచి తన పార్టీని రక్షించుకునే నిమిత్తం ఇలా చేశానని చెప్పుకొచ్చారు. పైగా తాను గత నెలన్నర కాలం నుంచి మీడియాకి దూరంగా ఉన్నానని అన్నారు. మరోవైపు బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ నితీష్ ఈ రోజు బీజేపీ ప్రజలను మోసం చేశారంటూ మండిపడ్డారు. బిహార్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని చూసి నమ్మి ఓటు వేస్తే ఇలా వెన్నుపోటు పొడిచే రాజకీయానికి తెరలేపారని ఆరోపించారు. తాను ఉపముఖ్యమంత్రి తేజస్వీయాదవ్తో ఉన్న కొత్త బిహార్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూస్తానంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో లోపే ఈ ప్రభుత్వం పడిపోతుందని అన్నారు. అయినా నితీష్ కుమార్ మహారాష్ట్రలా బిహార్ అవుతుందని భయపడ్డానని చెబుతున్నారు. కానీ బీజేపీ ఏమీ శివసేనను విభజించడానికి ప్రయత్నించలేదని చెప్పారు. అంతేకాదు లాలు ప్రసాద్ యాదవ్ అనారోగ్యాన్ని ఆసరాగా తీసుకుని ఆర్జేడియూని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఐతే ఈ విషయమే జేడీయూ లేదా ఆర్జేడియూ ఇంకా స్పందించలేదు. (చదవండి: బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ ప్రమాణం.. డిప్యూటీగా ఆర్జేడీ నేత తేజస్వి) -
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్పై కీలక ప్రకటన
న్యూఢిల్లీ: జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను తీసుకురావడం ఇప్పట్లో సాధ్యం కాని విషయమని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్కుమార్ మోదీ తేల్చేశారు. జీఎస్టీ కిందకు వస్తే వార్షికంగా రూ.2 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోవాల్సి వస్తుందంటూ.. ఇందుకు ఏ రాష్ట్రం కూడా సుముఖంగా లేదన్నారు. రాష్ట్రాలకు రూ.2లక్షల కోట్ల నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలంటూ ప్రశ్నించారు. జీఎస్టీ కిందకు పెట్రోలియం ఉత్పత్తులను తీసుకువచ్చేందుకు మరో 8–10 ఏళ్ల పాటు వేచి చూడాల్సి రావచ్చని పేర్కొన్నారు. ఆర్థిక బిల్లుకు మద్దతుగా రాజ్యసభలో బుధవారం సుశీల్మోదీ మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రాలు కలసి ఉమ్మడిగా పెట్రోలియం ఉత్పత్తులపై ఏటా రూ.5 లక్షల కోట్ల మేర పన్నులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ట రేటు అయిన 28 శాతమే పన్ను అమలవుతుందని.. ప్రస్తుతం అయితే వాటి విక్రయ ధరలో 60 శాతం వరకు పన్ను అమలవుతున్నట్టు తెలిపారు. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు చారిత్రక గరిష్టాలకు చేరడంతో ధరలు దిగివచ్చేందుకు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వినిపిస్తుండడం తెలిసిందే. ప్రతిపక్ష నేతలు బహిరంగంగా ప్రకటనలు అయితే ఇస్తారు కానీ.. ఈ అంశాలను జీఎస్టీ కౌన్సిల్ ముందు ప్రస్తావించరంటూ ఆయన విమర్శించారు. జీఎస్టీ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల మంత్రులు కూడా ఉన్న నేపథ్యంలో సుశీల్ ఈ విమర్శ చేశారు. బిహార్ మంత్రిగా పనిచేసిన సమయంలో జీఎస్టీ కౌన్సిల్కు సుశీల్ ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్రాలు ముందుకు వస్తే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందకు తీసుకురావడంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి సీతారామన్ మంగళవారం ప్రకటన చేసిన విషయం గమనార్హం. -
సోషల్ మీడియా రెవెన్యూని మీడియాకి పంచాల్సిందే!
న్యూఢిల్లీ: దేశంలో వార్త సంస్థలు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఫేసుబుక్, గూగుల్, యూట్యూబ్ వంటి టెక్ దిగ్గజాలు వార్తలను షేర్ చేస్తున్న మీడియా సంస్థలకు యాడ్ రెవెన్యూలో కొంత మొత్తాన్ని చెల్లించే విధంగా భారతదేశం ఒక చట్టాన్ని రూపొందించాలని బిజెపి సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ బుధవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు. “గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్లో షేర్ చేస్తున్న వార్తల వల్ల ఆయా టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో యాడ్ రెవెన్యూను ఆర్జిస్తున్నాయి. దీని వల్లే రెవెన్యూ తగ్గి దేశంలోని సాంప్రదాయ మీడియా కష్టాలు ఎదుర్కొంటుంది. అందువల్ల, ఆయా కంపెనీలు తమ యాడ్ రెవెన్యూలో కొంత మొత్తాన్ని సాంప్రదాయ మీడియా సంస్థలకు చెల్లించాల్సిందే” అని ఆయన డిమాండ్ చేశారు. గత నెలలో ప్రపంచంలో మొదటి సారిగా న్యూస్ మీడియా షేర్ చేసే కంటెంట్కు తగిన ఆదాయం లభించేలా ఆస్త్రేలియా ప్రభుత్వం తరహా కొత్త చట్టాన్ని రూపొందించింది. ఇప్పుడు అదే మాదిరి ఒక కొత్త చట్టాన్ని రూపొందించి భారత పార్లమెంట్లో పాస్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. రాజ్యసభ చైర్మన్, ఉపాధ్యక్షుడు ఎం.వెంకయ్య నాయుడు ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవడం విలువైనదని వ్యాఖ్యానించారు. సాంప్రదాయ మీడియా సంస్థలు, పత్రికలు ఇటీవలి కాలంలో చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కరోనా కారణంగా ప్రజలు పేపర్ వేయించుకోవడానికి భయపడడం, ప్రింట్ మీడియాపై ఆసక్తి చూపకపోవడం, యాడ్ రెవెన్యూ తగ్గడం వంటి కారణాలతో సిబ్బంది జీతాలు కూడా చెల్లించలేక కొన్ని పత్రికలు మూసేయాల్సిన పరిస్థితి తలెత్తింది. సాంప్రదాయ పత్రికలు, వార్తా ప్రసార మాధ్యమాలు టెక్ దిగ్గజాలు నడుపుతున్న ప్లాట్ఫామ్లలో ఉచితంగా వార్తలను షేర్ చేస్తున్నాయి. ప్రకటనలు మాత్రం ఎక్కువగా టెక్ ప్లాట్ఫామ్లలో వస్తున్నందున అవి చాలా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి అన్నారు. సాంప్రదాయ వార్తా మాధ్యమాలు నమ్మదగిన వార్తలను అందించడానికి వ్యాఖ్యాతలు, పాత్రికేయులు, విలేకరులను కోసం భారీ పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది అన్నారు. అయితే, వాణిజ్య ప్రకటనల ద్వారానే వాటికి ఆదాయం వస్తుంది. కానీ, అటువంటి ఆదాయాన్ని టెక్ కంపెనీలు లాగేస్తున్నాయని ఆయన వాపోయారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తప్పనిసరిగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తుచేశారు. చదవండి: స్మార్ట్ వాచ్.. బాయ్ఫ్రెండ్ను పట్టిచ్చింది! -
డిప్యూటీ సీఎం పదవిపై ఉత్కంఠ
పట్నా : బిహార్లో నూతన ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. ఎన్డీయే కూటమి తరుఫున ముఖ్యమంత్రిగా జేయూడీ అధినేత నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది మంత్రులు సైతం ప్రమాణం చేసే అవకాశం ఉంది. అయితే బిహార్ డిప్యూటీ సీఎం పదవిపై కొంత ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సుశీల్ మోదీ స్థానంలో ఇద్దరు కొత్త వ్యక్తులను నియమిస్తారని తెలుస్తోంది. వీరిలో ప్రధానంగా బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే తారక్ కిషోర్ ప్రసాద్తో పాటు రేణు దేవి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ నితీష్తో పాటు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు స్వీకర్ పదవి సైతం బీజేపీకే దక్కే అవకాశం ఉంది. (35 ఏళ్లుగా పోటీకి దూరం.. ఏడోసారి సీఎం) అయితే సుశీల్ మోదీ ఎందుకు తప్పుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. బీజేపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. డిప్యూటీ సీఎం పదవిపై సుశీల్ అంతగా ఆసక్తి చూపడంలేనట్లు తెలుస్తోంది. అయితే నితీష్ కేబినెట్లో కీలకమైన శాఖలన్నీ బీజేపీకే దక్కే అవకాశం ఉండటంతో మంత్రివర్గంలోనే బలమైన శాఖను కట్టబెడతారనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు మంత్రి పదవుల కోసం బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. కాగా 74 స్థానాలు బీజేపీ గెలుచుకోగా.. జేడీయూ 44 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 76 స్థానాల్లో విజయకేతనం ఎగరేసిన ఆర్జేడీ ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోనుంది. -
క్వారంటైన్ పూర్తి చేశాక కండోమ్ బహుమతి
పట్నా : క్వారంటైన్ గడువు పూర్తి చేసుకున్న వలస కార్మికుల్లో ఇప్పటి వరకు 17 లక్షల కండోమ్లను పంపిణీ చేసినట్లు ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ బుధవారం ప్రకటించారు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి వైద్య ఆరోగ్యశాఖ ఇలా వినూత్న పద్దతిని ప్రారంభించిందన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది మంది వలస కూలీలు వచ్చారని, 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న కార్మికులకు గర్భనిరోధక మందులు, కండోమ్లతో కూడిన కిట్లను ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిందని చెప్పారు. దీనికి సంబంధించి ఏప్రిల్ నెలలోనే 2.14 లక్షల కండోమ్లు పంపిణీ చేయగా, మే నెలలో 15.39 లక్షల కండోమ్లను పంపిణీ చేసినట్లు వివరించారు. అంతేకాకుండా రాష్ర్టంలోని అన్ని ప్రాథమిక కేంద్రాల్లో కండోమ్ సహా గర్భనిరోధక మందులు అందుబాటులో ఉంచామని, ఎవరికైనా అవసరం ఉంటే ఆయా కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు. డోర్ డెలివరీ ద్వారా ఇప్పటికే 11 లక్షల గర్భనిరోధక మందులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. (పెళ్లి పీటలెక్కనున్న కేరళ సీఎం కుమార్తె) క్వారంటైన్లో ఉన్న వలస కూలీల కోసం బట్టలు, దోమతెరలు లాంటి ఇతర వస్తువులకి కలిపి రాష్ర్ట ప్రభుత్వం ఒక్కొక్కరిపై 5300 రూపాయిలు ఖర్చుచేసిందని సుశీర్ కుమార్ పేర్కొన్నారు. క్వారంటైన్ తర్వాత కూడా అదనంగా వెయ్యి రూపాయల నగదును అందించామని చెప్పారు. బాలికలు, మహిళా విద్యను ప్రోత్సహించేందుకు రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ద్వారా దశాబ్ధ కాలంలోనే బీహార్లో సంతానోత్పత్తి రేటు 4.3 నుంచి 3.2 శాతానికి తగ్గిందని మోదీ అన్నారు. (ఊరట : యాక్టివ్ కేసుల కంటే రికవరీలు అధికం ) -
ప్రత్యేక రైళ్లు వేయండి: సుశీల్ మోదీ
పట్నా: దేశంలోని వివిధ ప్రాంతాలను నుంచి తమ పౌరులను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని కేంద్రాన్ని బిహార్ ప్రభుత్వం కోరింది. లాక్డౌన్ కారణంగా తమ రాష్ట్రానికి చెందిన ఎంతో మంది వివిధ ప్రాంతాల్లో చిక్కుపోయారని బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న బిహార్ వలస కార్మికులు, విద్యార్థులను తమ రాష్ట్రానికి తరలించేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయిన లక్షలాది మంది వలస కార్మికులు, విద్యార్థులను బస్సుల్లో తీసుకురావడం సాధ్యం కాదు. బస్సుల ద్వారా వీరిని తరలించడం ఖర్చుతో కూడుతున్నదే కాకుండా కొన్ని నెలల సమయం పడుతుంది. ఒక్కో ట్రిప్పుకు బస్సులు ఆరు నుంచి రోజులు సమయం తీసుకుంటాయి. కాబట్టి ప్రత్యేక రైళ్లతో భౌతిక దూరం పాటిస్తూ వారిని తరలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామ’ని సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. వలస కార్మికులు, విద్యార్థులను ఇక్కడికి తరలిస్తే వారిని క్వారెంటైన్ చేసే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ సహాయం కోసం 27 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. కాగా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న బిహారీలను లాక్డౌన్ నిబంధనలు సడలించే వరకు తీసుకురావడం కుదరదని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇంతకుముందు ప్రకటించారు. (సైకిల్పై భార్యతో కలిసి 230 కి.మీ ప్రయాణం) -
సుశీల్కు ప్రశాంత్ కిషోర్ కౌంటర్ అటాక్
పట్నా : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై జనతాదళ్ (యునైటెడ్)లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. సుశీల్ను ఉద్దేశిస్తూ.. కొంతమంది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పట్ల కృతజ్ఞత చూపలేదని ఆరోపిస్తూ ప్రశాంత్ కిషోర్ శనివారం సుశీల్ కుమార్ పాత వీడియోను తన ట్విటర్లో షేర్ చేశారు. 'నితీష్ కుమార్ పార్టీలో కొంతమందికి ఎటువంటి గుర్తింపు లేకున్నా తనకున్న అధికారంతో వారికి గౌరవమైన స్థానాన్ని కల్పించారు. ఏ రాజకీయ ఎజెండా, సిద్ధాంతాలు లేకుండా కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు. అధికార పార్టీని దెబ్బతీసేందుకు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల డేటాను సేకరించి విపక్ష పార్టీలకు చేరవేస్తూ రాజకీయంగా లబ్ధి చేస్తున్నారంటూ' సుశీల్ కుమార్ ఇంతకుముందు ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ కౌంటర్ అటాక్ ఇస్తూ.. ప్రజలకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవ్వడంలో సుశీల్ మోదీని మించినవారు ఎవరు ఉండరని ఎద్దేవా చేశారు. దీంతోపాటు ప్రశాంత్ సుశీల్ మోడీకి చెందిన పాత వీడియోను పోస్ట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ షేర్ చేసిన వీడియోలో సుశీల్ కుమార్ నితీశ్ కుమార్పై ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఆ వీడియోలో సుశీల్ మాట్లాడుతూ' నితీశ్ కుమార్ బీహారీ కాదని,17 సంవత్సరాల స్నేహం పేరుతో నితీశ్ బీజేపీకి ద్రోహం చేశారు. మోసం అనే పదం నితీశ్ డీఎన్ఏలో ఉంది కానీ బీహారీ ప్రజల్లో లేదని' తెలిపారు. అంతకుముందు జేడియూ సీనియర్ నేత పవన్ వర్మ నితీష్ కుమార్పై ట్విటర్లో మండిపడ్డారు. సీఏఏను వ్యతిరేకిస్తూనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. (విపక్షాలకు అనుకూలంగా ప్రశాంత్ కిషోర్: సుశీల్ మోదీ) -
విపక్షాలకు అనుకూలంగా ప్రశాంత్ కిషోర్..!
పట్నా : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింహభాగం స్థానాల్లో జేడీయూ పోటీచేస్తుందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రశాంత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ-జేడీయూ కూటమి మధ్య స్నేహాన్ని దెబ్బతీసేవిధంగా ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై తాజాగా బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ స్పందించారు. ప్రశాంత్ వ్యాఖ్యలు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయని, ఇలాంటి వాటిని కూటమి సమర్థించదని అన్నారు. (బీజేపీకి ప్రశాంత్ కిషోర్ అల్టిమేటం..!) మంగళవారం పట్నాలో సుశీల్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏ రాజకీయ ఎజెండా, సిద్ధాంతాలు లేకుండా కొంతమంది రాజకీయాల్లోకి వస్తారు. అధికార పార్టీని దెబ్బతీసేందుకు విపక్షాలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎన్నికల డేటాను సేకరించి విపక్ష పార్టీలకు చేరవేస్తూ రాజకీయంగా లబ్ధి చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో బీజేపీ-జేడీయూ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. సీట్ల పంపకాలు గురించి పార్టీ అధినేతలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు’ అని అన్నారు. కాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో బిహార్ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకత్వం అంచనాలు వేస్తున్నట్లు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50:50 సీట్ల పంపకాల ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జేడీయూకే సింహాభాగం సీట్లు కేటాయించాలని అన్నారు. సీట్ల ఒప్పందంపై బీజేపీ నేతలు మరోసారి పునపరిశీలన చేసుకోవాలని సూచించారు. అలాగే 1:4 ఫార్మూలాను ఆయన తెరపైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికార జేడీయూ మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
జీఎస్టీలో మార్పులు ఉండకపోవచ్చు: సుశీల్
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం కారణంగా ఇప్పట్లో జీఎస్టీ శ్లాబుల్లో మార్పులు ఉండకపోవచ్చని ఇంటిగ్రేటెడ్ గూడ్స్, సర్వీస్ ట్యాక్స్(ఐజీఎస్టీ) కన్వీనర్ సుశీల్ కుమార్ మోదీ శనివారం అన్నారు. కొనుగోళ్లు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు జీఎస్టీ పెంచడం సరైన నిర్ణయం కాదన్నారు. ఆర్థిక మందగమనం కొనసాగుతున్నప్పుడు, జీఎస్టీ తగ్గించకపోతే.. పెంచడానికి కూడా అవకాశం ఉండదన్నారు. శనివారం ఆయన ‘భారత్: 5 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు పయనం’ అన్న అంశంపై ఎఫ్ఐసీసీఐ 92వ వార్షిక సమావేశంలో మాట్లాడారు. పన్ను రేట్లు పెంచడానికి ఏ రాష్ట్రమూ సిద్ధంగా లేదని చెప్పారు. -
'అమిత్షా అపరచాణక్యుడిలా వ్యవహరించారు'
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాత్రికి రాత్రే చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీ స్పందిస్తూ.. భాజపా అధ్యక్షుడు అమిత్షాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'భారత రాజకీయాల్లో అపరచాణక్యుడిలా' అమిత్ షా మరోసారి నిరూపించారంటూ ట్టిటర్లో పేర్కొన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు వేసిన రాజకీయ ఎత్తుగడ తమకు సానుకూల ఫలితాన్ని ఇచ్చిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్న తరుణంలో శనివారం నాడు అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనుకుంటున్న తరుణంలో ఇలాంటి అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడానికి అమిత్షాయే కారణమంటూ సుశీల్ మోదీ ప్రశంసలు కురిపించారు. -
డిప్యూటీ సీఎం నివాసం జలదిగ్బంధం
న్యూఢిల్లీ: ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో బిహార్, ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య సోమవారానికి 157కు చేరుకుంది. గత వారం రోజుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 111 మంది, బిహార్లో 27 మంది చనిపోగా.. గుజరాత్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్లలో కలిపి 19 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బిహార్ రాజధాని పట్నాలో కుండపోత వానలతో డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ అధికార నివాసం సోమవారం జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆయనతోపాటు కుటుంబసభ్యులను పోలీసులు రబ్బర్బోట్లో సురక్షిత ప్రాంతానికి తరలించారు. పట్నాలోని చాలా ప్రాంతాలు మూడు రోజులుగా నీటిలోనే నానుతున్నాయి. వానల తీవ్రత దృష్ట్యా యూపీ ప్రభుత్వం అధికారుల సెలవులు రద్దు చేసింది. బలియా జిల్లా జైలులోకి వరద ప్రవేశించడంతో 900 మంది ఖైదీలను వేరే జైళ్లకు తరలించారు. -
పన్నులు తగ్గించేందుకు కంపెనీల ఎత్తుగడలు
పాట్నా: దేశం ఆర్థిక మందగమనాన్ని ఏమీ ఎదుర్కోవడం లేదన్నారు బీహార్ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్కుమార్ మోదీ. తయారీ పడిపోతుందని చూపిస్తూ పన్నులు తగ్గించాలంటూ ప్రభుత్వంపై కంపెనీలు ఒత్తిడి తీసుకొచ్చేందుకు అనసరిస్తున్న ఎత్తుగడలుగా దీన్ని అభివర్ణించారు. తన వాదనకు మద్దతుగా బీహార్లో పార్లే జీ బిస్కట్ల డిమాండ్ పెరగడాన్ని ఆయన ప్రస్తావించారు. బిహార్ ఆర్థిక మంత్రిత్వ బాధ్యతలను సుశీల్మోదీయే చూస్తున్నారు. అయినా కంపెనీ బిస్కట్ల డిమాండ్ తగ్గిందని తయారీదారులు చెబుతున్నారంటే... అభివృద్ధి చెందిన రాష్ట్రాలు చౌకగా లభించే పార్లే జీ వంటి అధిక పన్ను రేటున్న వాటికి బదులు ఖరీదైన ప్యాస్ట్రీని ఎంచుకుంటున్నట్టు ఆయన సందేహం వ్యక్తం చేశారు. రాంచిలో ఓ వార్తా చానల్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సుశీల్మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ పరిధిలో అధిక పన్నులు చెల్లించాల్సి రావడం వల్ల ధరలు పెరిగాయని, దీంతో డిమాండ్ భారీగా పడిపోయిందంటూ, ఇలా అయితే ఉద్యోగులను ఎద్ద ఎత్తున తొలగించాల్సి రావచ్చని పార్లే ఇటీవలే ప్రకటన చేసింది. ఆటోమొబైల్స్, ఇతర రంగాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని మీడియాలో వస్తున్నదంతా కార్పొరేట్ ప్రపంచం చేస్తున్న లాబీయింగ్లో భాగమేనన్నారు మోదీ. ప్రభుత్వంపై ఒత్తిళ్లు పెంచి పన్ను రేట్లను తగ్గించుకునేందుకునేనని అభివర్ణించారు. చదవండి : టీవీ ధరలు దిగొస్తాయ్! -
నన్ను వేధించే క్రమంలో మరో కేసు : రాహుల్
పట్నా : కోర్టు విచారణకు హాజరయ్యేందుకు బిహార్కు చేరుకున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆయనపై పూల వాన కురిపిస్తూ కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. కాగా దొంగలంతా మోదీ అనే ఇంటిపేరునే కలిగి ఎందుకు ఉంటారు అంటూ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన బిహార్ ఉపమఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ శనివారం పట్నా కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా..‘నా రాజకీయ ప్రత్యర్థులు ఆరెస్సెస్, బీజేపీ నన్ను వేధించే క్రమంలో ఇది మరొక కేసు. ఈరోజు 2 గంటలకు పట్నా సివిల్ కోర్టులో వ్యక్తిగత విచారణకు హాజరవుతున్నా. సత్యమేవ జయతే’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఇక ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 542 లోక్సభ స్థానాలకు గానూ 52 స్థానాల్లో మాత్రమే పార్టీ గెలుపొందింది. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ అభివృద్ధికి జవాబుదారీతనం కీలకమని, అందుకోసమే తాను రాజీనామా చేస్తున్నానని 49 ఏళ్ల రాహుల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్లో నాలుగు పేజీల లేఖను పోస్ట్ చేశారు. I will appear in person at the Civil Court in Patna today at 2 PM, in yet another case filed against me by my political opponents in the RSS/ BJP to harass & intimidate me. Satyameva Jayate 🙏 — Rahul Gandhi (@RahulGandhi) July 6, 2019 -
రాహుల్పై పరువునష్టం కేసు
పట్నా : దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకుందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. రాహుల్పై బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ పరువు నష్టం దావా వేశారు. పేరులో మోదీ అని ఉన్నవారందరినీ మహారాష్ట్రలో ప్రచార ర్యాలీ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు కించపరిచేలా ఉన్నాయని ఆయనపై బీజేపీ నేత సుశీల్ మోదీ గురువారం పట్నా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ర్టేట్ ఎదుట ఫిర్యాదు చేశారు. టీవీ వార్తా ఛానెల్స్లో ఈనెల 13న జరిగిన ర్యాలీలో రాహుల్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారమైందని, ఈ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని పిటిషన్లో సుశీల్ మోదీ పేర్కొన్నారు. తనతో సహా పేరులో మోదీ అని ఉన్న వారందరి ప్రతిష్టను ఆయన వ్యాఖ్యలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ను కోర్టు ఈనెల 22న విచారణకు చేపట్టనుంది. కాగా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, ప్రధాని నరేంద్ర మోదీల పేర్లను ప్రస్తావిస్తూ దొంగలందరి పేర్లలో మోదీ పేరు ఎందుకు ఉంటోందని రాహుల్ మహారాష్ట్ర ర్యాలీలో పేర్కొన్న సంగతి తెలిసిందే. -
బంగ్లానా...7 స్టార్ హోటల్లా?
సాక్షి, పాట్నా : ఎట్టకేలకు బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రభుత్వ అధికారిక బంగ్లాలోకి మకాం మార్చారు. దేశ్రత్న మార్గ్లోని ప్రభుత్వ నివాసంలోకి ఆయన నిన్న (మంగళవారం) ప్రవేశించారు. ఈ సందర్భంగా సుశీల్ మోదీ మాట్లాడుతూ...‘ ఈ బంగ్లా చూస్తుంటే సెవన్ స్టార్ హోటల్లో ఉన్నట్లు ఉంది. ఈ బంగ్లాలో ప్రతిదీ ప్రత్యేకమే. ఇందుకోసం కోట్లాది రూపాయిలు దుబారా చేశారు. ప్రధానమంత్రి నివాసంలో కూడా ఇంతటి విలాసవంతమైన ఫర్నిచర్ ఉండదేమో’ అని వ్యాఖ్యానించారు. కాగా 2015లో ఈ బంగ్లాను అప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి యాదవ్కు నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం కేటాయించింది. అనంతరం ఆ పార్టీ మహా కూటమితో విడిపోవడం, ఆ తర్వాత నితీష్ కుమార్ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. దీంతో తేజస్వి యాదవ్ ఆ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే తన తల్లి రబ్రీదేవి సీఎంగా పనిచేసిన సమయంలో ఆ భవనాన్ని ఉపయోగించడంతో సెంటిమెంటుగా భావించిన ఆయన ఖాళీ చేయలేదు. మరోవైపు ఆ బంగ్లాను డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీకి నితీష్ సర్కార్ కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ తేజస్వి యాదవ్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఆయనకు అక్కడ చుక్కెదురైంది. తక్షణమే బంగ్లాను ఖాళీ చేసి, ప్రతిపక్ష నేతకు కేటాయించిన బంగ్లాలోకి మారాలని సూచించింది. అంతేకాకుండా ఈ అంశంపై పాట్నా హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని తేజస్వి యాదవ్ సవాల్ చేయడంపై ఆయనకు ఉన్నత ధర్మాసనం రూ.50 జరిమానా కూడా విధించింది. దీంతో ఎట్టకేలకు ఆ బంగ్లాను ఖాళీ చేసిన తేజస్వి యాదవ్ ఆ తర్వాత కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. బీహార్ ప్రభుత్వం ఆ బంగ్లాలోకి దెయ్యాలు వదిలిపెట్టారంటూ ఆరోపణలు గుప్పించారు. గతంలో వాస్తు పేరుతో తేజస్వి యాదవ్ ఆ భవనం మరమ్మతులకు కోట్లాది రూపాయిలు వెచ్చించారు. -
‘ఆయన చేతులు నరికేయాలనిపించింది’
పాట్నా : కేంద్ర మంత్రి రామ్ కృపాల్ యాదవ్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, ఆర్జేడీ నాయకురాలు మీసా భారతి. పాట్నాలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న మీసా భారతి రామ్ కృపాల్ యాదవ్ గురించి మాట్లాడుతూ.. ‘అతన్ని మేము చాలా గౌరవించే వాళ్లం. కానీ 2014లో అతను మా పార్టీని వీడి.. సుశీల్ కుమార్ మోదీతో చేతులు కలిపినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఆయన చేతులను నరికేయాలనిపించిందం’టూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక రానున్న లోక్సభ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు మీసా భారతి. అయితే ఆర్జేడీకి విధేయుడిగా పేరు పొందిన రామ్ కృపాల్కు 2014 ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దాంతో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం ఎన్నికల్లో గెలుపొంది ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు. -
శత్రుఘ్న సిన్హాకు మోదీ షాక్
పట్నా : ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీపై పలు సందర్భాల్లో విమర్శలతో విరుచుకుపడుతున్న ఆ పార్టీ నేత, ఎంపీ శత్రుఘ్న సిన్హాకు బీజేపీ సీనియర్ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ షాక్ ఇచ్చారు. బీజేపీతో ఏమైనా ఇబ్బందులుంటే సిన్హా పార్టీ నుంచి వైదొలగాలని, ఆయన బీజేపీ అసంతృప్త నేత యశ్వంత్ సిన్హా ప్రభావానికి లోనయ్యారని విమర్శించారు. బీజేపీపై శత్రుఘ్న సిన్హా మాట్లాడుతున్న విధానం, ఆయన ఉపయోగిస్తున్న భాష తీవ్ర అభ్యంతరకరమని ఆక్షేపించారు. సిన్హాకు బీజేపీతో సమస్యలుంటే పార్టీకి రాజీనామా చేయాలని సుశీల్ మోదీ సూచించారు. ‘అసలు ఆయన పార్టీలో ఎందుకుండాలి..పార్టీని దూషిస్తూ బీజేపీలో ఉన్నాని ఎలా చెబుతా’రని ప్రశ్నించారు. పార్టీ సీనియర్ నేతలుగా చలామణి అవుతున్న యశ్వంత్, శత్రుఘ్న సిన్హాలు తరచూ బీజేపీ విధానాలపై, ప్రధాని నరేంద్ర మోదీపై తరచూ విమర్శల దాడికి దిగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని కేవలం ముందస్తు ప్రణాళికతో కూడిన ఇంటర్వ్యూలు ఇవ్వడం మినహా నిబద్ధత కలిగిన జర్నలిస్టులు నేరుగా అడిగే ప్రశ్నలకు బదులివ్వలేరని సిన్హా ఇటీవల ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వన్మాన్ షోలా తయారైందని కూడా ఆయన విమర్శలు గుప్పించారు. -
‘యోగా డే ఓ పబ్లిక్ స్టంట్’
పట్నా : యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ, జేడీ(యూ)ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పట్నా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు సీఎం నితీశ్ కుమార్ హాజరుకాలేదు. యోగా డే ఒక పబ్లిసిటీ స్టంట్ అని గతంలో వ్యాఖ్యానించిన నితీశ్ కుమార్.. ఈరోజు(జూన్ 21) కూడా ఇంట్లోనే యోగా చేశారు. ఈ విషయమై జేడీ(యూ) రాష్ట్ర అధ్యక్షుడు వశిష్ట నారాయణ్ సింగ్ మాట్లాడుతూ... ‘ప్రతీ భారతీయుడు యోగా చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆ మాటల్ని మేము గౌరవిస్తాం. అయినా జనాల మధ్య ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు. మా పార్టీ కార్యకర్తలంతా రోజూ యోగా చేస్తారు. ఇందులో విశేషమేముంది’ అంటూ వ్యాఖ్యానించారు. వాళ్లను ఆహ్వానించలేదు... పట్నా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన యోగా డేలో కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, రామ్ కృపాల్ యాదవ్తో పాటు నితీశ్ కుమార్ ప్రభుత్వంలోని పలువురు బీజేపీ మంత్రులు పాల్గొన్నారని బీజేపీ నేత కృష్ణ కుమార్ రిషి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా జేడీ(యూ) నేతలకు ఆహ్వానాలు పంపలేదని ఆయన మీడియాకు తెలిపారు. జేడీయూ నేతలకు ఆహ్వానాలు పంపకపోవడంపై ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు స్పందిస్తూ.. ‘ఎన్డీయే కూటమిలో అసలేం బాగాలేదంటూ’ వ్యాఖ్యలు చేశారు. కాగా బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ ప్రతిపక్షం వ్యాఖ్యల్ని ఖండించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యోగా చేయడాన్ని ఇష్టపడతారు. యోగా దినోత్సవాన్ని కూడా రాజకీయాలకు ఉపయోగించుకుని అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని’ ఆయన హితవు పలికారు. -
మోదీ చౌక్లో తెగిపడ్డ తల
పట్నా : బిహార్లో దారుణం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ఉన్న ఓ చౌరస్తా పేరును మార్చేందుకు కొందరు యత్నించగా.. అడ్డుకున్న ఓ వృద్ధుడిని దారుణంగా తల నరికి చంపారు. ఈ కేసుపై పోలీసులు, నేతలు ఇచ్చే పొంతన లేకపోవటంతో ఇప్పుడక్కడ ఇది రాజకీయ చర్చకు దారితీసింది. బాధిత కుటుంబ సభ్యులు కథనం ప్రకారం... దర్బంగలోని భాదవన్ గ్రామం సర్దార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ చౌరస్తాకు ‘ నరేంద్ర మోదీ చౌక్’ అనే పేరుంది. శుక్రవారం సుమారు 50-60 మంది ఆర్జేడీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఉప ఎన్నికల్లో విజయంతో నినాదాలు చేస్తూ.. ఆ బోర్డు(మోదీ చౌక్)ను తొలగించి.. దానికి లాలూ ప్రసాద్ చౌక్గా నామకరణం చేసేందుకు యత్నించారు. అయితే వారికి అడ్డుకునేందుకు రాంచంద్ర యాదవ్(60) యత్నించగా.. అతన్ని హకీ స్టిక్లతో కొట్టి, ఆపై తల నరికి హత్య చేశారు. దాడిలో రాంచంద్ర కొడుకు కమలేష్కు కూడా గాయాలయ్యాయి. పోలీసులు మాత్రం బాధిత కుటుంబ కథనాన్ని కొట్టిపారేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఎప్పటి నుంచో భూతగాదాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే హత్య జరిగిందని.. పబ్లిసిటీ స్టంట్ కోసమే హతుడి కుటుంబ సభ్యులు మోదీ(చౌక్) పేరును తెరపైకి తెచ్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. బీజేపీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు? ఈ ఘటనపై డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ తన ట్విట్టర్లో స్పందించారు. ఆ కథనాలన్నీ అవాస్తవమని.. ఆ చౌక్కు పేరు ఎప్పటి నుంచో ఉందని.. అది భూతగాదాలో జరిగిన హత్యేనని ట్వీట్ చేశారు. కానీ, శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మాత్రం ఈ కేసులో అనుమానాలు ఉన్నట్లు చెబుతున్నారు. ‘రామచంద్ర(హతుడు) భార్యతో నేను మాట్లాడా. మీడియా ముందు బోర్డు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావని పోలీసులు ఆమెను బెదిరించినట్లు నాతో చెప్పింది. ఆ లెక్కన్న వాస్తవాలు దాచిపెట్టి పోలీసులు ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనిపిస్తోంది’ అంటూ గిరిరాజ్ తెలిపారు. ఇక బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్ కూడా ఇది చౌక్ పేరు మార్చే క్రమంలో జరిగిన గొడవ అని చెబుతుండటం గమనార్హం. ఏది ఏమైనా ఈ కేసు పోలీసుల తీరుపై విమర్శలకు తావునిస్తోంది. -
లాలూ ఇచ్చిన షాక్ మాములుగా లేదు
పట్నా : రాజకీయాల్లోనే పరస్పర విమర్శలు.. శత్రుత్వం ఉంటాయని.. వ్యక్తిగత జీవితాలకు అవి అడ్డురావని మరోసారి రుజువైంది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన పని ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. రాజకీయ ప్రత్యర్థిగా భావించే సుశీల్ కుమార్ మోదీ ఇంట జరిగిన వేడుకకు లాలూ హాజరై ఆశ్చర్యపరిచాడు. మోదీ కుమారుడు ఉత్కర్ష్ వివాహం ఆదివారం జరిగింది. విరోధాలను పక్కనపెట్టి లాలూ ఈ కార్యక్రమానికి హాజరుకాగా, సుశీల్సహా అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆపై సుశీల్ ఆప్యాయ ఆలింగనంతో లాలూని ఆహ్వానించాడు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని కాసేపు ముచ్చటించారు. లాలూ అక్కడి నుంచి వెళ్లేంతవరకు వారిద్దరినే మీడియా హైలెట్ చేయటం విశేషం. కొన్ని రోజుల క్రితం ఈ పెళ్లి వేడుకకు హాజరై రచ్చ చేస్తానని లాలూ కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆ మధ్య హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దానిపై తీవ్ర విమర్శలు రావటంతో తన ప్రకటనపై వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించాడు. ఈ వేడుకకు కేంద్ర మంత్రులు అరున్ జైట్లీ, రవి శంకర్ ప్రసాద్, రామ్ విలాస్ పాశ్వాన్, ధర్మేంద్ర ప్రధాన్, గిరిరాజ్ సింగ్, బిహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, గోవా గవర్నర్ మృదులా సిన్హా, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, హర్యానా సీఎం మనోహార్ లాల్ ఖట్టర్, జార్ఖండ్ సీఎం రఘబర్ దాస్లు హాజరయ్యారు. కళ్యాణ వేదిక నుంచి హాజరైన ప్రజలతో వరకట్నం, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు. -
తేజ్ ప్రతాప్ చేసిన వ్యాఖ్యలు ఇవే...
-
లాలూ కొడుకుపై కోటి నజరానా
పట్న : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పై బీజేపీ నేత ఒకరు నజరానా ప్రకటించారు. తేజ్ చెంప పగలకొట్టిన వారికి కోటి రూపాయలు ఇస్తానని అనిల్ సాహ్ని శుక్రవారం ఓ ప్రకటన జారీచేశారు. తేజ్ ఈ మధ్య బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ(బీజేపీ) పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఆయన అక్రమాలను బయటపెడతానని.. ప్రజల ముందే చెంప పగలకొడతానని చెప్పాడు. ఈ నేపథ్యంలో పట్నా బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ అయిన సాహ్ని ఈ కొత్త ఆఫర్ ప్రకటించాడు. ‘‘మోదీపై దాడి చేస్తానని తేజ్ చెప్పాడు.. అంతకంటే ముందే ఎవరైతే తేజ్పైనే దాడి చేస్తారో వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తాం’’ అని ప్రకటించాడు. అంతేకాదు తేజ్ చేత క్షమాపణలు చెప్పేదాకా లాలూ ఇంటి ముందు ధర్నా చేపడతామని హెచ్చరించాడు. సాహ్ని వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం గరంగరంగా ఉంది. ఆయన ప్రకటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. ఇప్పటికే వివరణ కోరామని... అది సహేతుకంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమని పేర్కొంది. లాలూ తన కొడుకులను అదుపులో పెట్టుకోవాలని సూచించింది కూడా. కాగా, ఔరంగాబాద్లో తేజ్ ఓ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ... డిసెంబర్ 3న జరగబోయే సుశీల్ కొడుకు ఉత్కర్ష్ పెళ్లి ఆహ్వానం తనకు అందిందని.. ఒకవేళ తాను అక్కడికి వెళ్తే మాత్రం రచ్చ చేయటం ఖాయమని హెచ్చరికలు చేశాడు. -
జీఎస్టీ సవాళ్లపై ప్రత్యేక కమిటీలు
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులో ఐటీ సవాళ్లు, ఎగుమతులపై ప్రత్యేక కమిటీలను నియమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 21వ భేటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్తో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కమిటీని నియమించినట్లు తెలిపింది. బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ కమిటీని పర్యవేక్షించనున్నట్లు వివరించింది. చత్తీస్ఘడ్ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి అమర్ అగర్వాల్, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరెగౌడ, కేరళ ఆర్థిక శాఖ మంత్రి డా. టీఎమ్ థామస్ ఐసాక్, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్లు కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారని వెల్లడించింది. సుశీల్ కుమార్ మోదీ నేతృత్వంలోని కమిటీ వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అమలులో ఐటీ నుంచి ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి పని చేస్తుందని తెలిపింది. ఎగుమతులపై నియమించిన కమిటీకి రెవెన్యూ శాఖ సెక్రటరీ నేతృత్వం వహిస్తారని వెల్లడించింది. ఎగుమతులలో ఏర్పడుతున్న అడ్డంకులు, జీఎస్టీ తర్వాత ఎగుమతులను పెంచేందుకు జీఎస్టీ కౌన్సిల్కు ఈ కమిటీ సలహాలు ఇస్తుందని తెలిపింది. ఈ కమిటీలో సీబీఈసీ చైర్మన్, డైరెక్టర్ జనరల్, డీజీఎఫ్టీ అడిషనల్ సెక్రటరీ, జీఎస్టీ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్, ఎక్స్పోర్ట్స్ కమిషన్ డీజీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ల కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారని వివరించింది. -
ఉప ముఖ్యమంత్రి కాన్వాయ్పై రాళ్ల దాడి
పాట్నా: బిహార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుశీల్కుమార్ మోదీకి స్వతంత్ర దినోత్సవం రోజు చేదు అనుభవం ఎదురైంది. ఆయన వెళ్తున్న కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. వైశాలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రిగా సుశీల్కుమార్ మోదీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
‘అది నితీశ్ రక్తంలోనే ఉంది’
పట్నా: కాంగ్రెస్ పార్టీపట్ల వ్యతిరేకత భావం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రక్తంలోనే ఉందని బీజేపీ నేత, బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ అన్నారు. మహాగట్బందన్కు ముగింపు పలకడం ఆహ్వానించదగిన పరిణామం అని ఆయన చెప్పారు. ఎందుకంటే వారిది అసహజమైన భాగస్వామ్యం అని మోదీ వర్ణించారు. 2019నాటి ఎన్నికల్లో నితీశ్- మోదీల భాగస్వామ్యం రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించనుందని, లోక్సభ ఎన్నికల్లో తమ కూటమి స్థానాలన్నీ కైవసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్జేడీ తెగదెంపులు చేసుకున్న అనంతరం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి ఆ వెంటనే బీజేపీ మద్దతు తీసుకొని తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత, సుశీల్ కుమార్ మోదీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత నితీశ్ రక్తంలోనే ఉందన్నారు. నితీశ్ గ్రాండ్ అలయన్స్ నుంచి విడిపోవడానికి తమ పార్టీ ఏమీ చేయలేదన్నారు. ఇప్పుడు కూడా ఎలాంటి కండిషన్ లేకుండానే తమ కూటమి ఏర్పడిందన్నారు. గతంలో ఎన్డీయేతో కలిసి నితీశ్ 17 ఏళ్లు పనిచేశారని గుర్తు చేశారు. బిహార్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదాకు మించిన మేలే బిహార్కు జరగనుందని స్పష్టం చేశారు. -
శభాష్... నితీశ్
నితీశ్ రాజీనామాపై బీజేపీ కామెంట్ పట్నా: బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేయడాన్ని బీజేపీ స్వాగతించింది. బిహార్లో మధ్యంతర ఎన్నికలకు తాము మొగ్గు చూపించడం లేదని ప్రకటించింది. అవినీతి విషయంలో రాజీపడకుండా సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేసినందుకు సంతోషంగా ఉందని బీజేపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. ఆర్జేడీ ముందు మోకరిల్లనందుకు హర్షం వ్యక్తం చేశారు. బిహార్ భవిష్యత్ కార్యాచరణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. నితీశ్ రాజీనామాను బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా స్వాగతించింది. బిహార్లో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని స్వాగతిస్తున్నట్టు ప్రకటించింది. మధ్యంతర ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా లేదని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి జేపీ నద్దా తెలిపారు. ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ అధినాయకత్వానికి నివేదిక ఇస్తుందని చెప్పారు. -
సొంత ఎంపీపై బీజేపీ ఫైర్
పట్నా: లాలూ ప్రసాద్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా మాట్లాడిన బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హాపై సొంత పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. శత్రుఘ్నసిన్హా విశ్వాసఘాతకుడని, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అన్నారు. తన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూకు బిహార్ సీఎం నితీశ్ కుమార్ తనకు తానుగా దూరంగా ఉన్నారని, బీజేపీకి శత్రువుగా మారిన శత్రుఘ్నసిన్హా మాత్రం లాలూను సమర్థిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో తిరుగుబాటు నేతగా శత్రుఘ్నసిన్హా వ్యవహరిస్తున్నారని సుశీల్ మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు ‘షాట్గన్’కు లాలూ తనయుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ బాసటగా నిలిచారు. శత్రుఘ్నసిన్హా వాస్తవాలు మాట్లాడారని అన్నారు. సుశీల్ మోదీ అబద్దాలకోరని, ఆయన పూటకో రంగు మారుస్తారని విమర్శించారు. ఆయన వర్ణ అంధత్వంతో బాధ పడుతున్నారని ధ్వజమెత్తారు. వ్యతిరేక రాజకీయాలకు స్వస్తి పలకాలని, ప్రత్యర్థులపై బురద చల్లడం మానుకోవాలని బీజేపీకి శత్రుఘ్నసిన్హా నిన్న సూచించారు. -
‘మీకెందుకా శ్రమ.. అప్పటికి జైలులో ఉంటారు’
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ఈ మధ్య ఏ మాత్రం కలిసి రావడం లేదు. ఆయనపై మరోసారి కేసుల పరంపర మొదలైంది. ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు ఐదు రకాల అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారనే కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కోనున్నారు. ఈ కేసును ఆపించే ప్రయత్నం చేసినా సుప్రీంకోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఇక లాలూ నేరుగా కేంద్రంపై సమరశంఖం పూరించారు. ఆగస్టు చివరివారంలో పట్నాలోని గాంధీ మైదాన్లో ఓ భారీ ర్యాలీ నిర్వహించ తలపెట్టారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్న కక్షపూరిత విధానాలను, ప్రధాని నరేంద్రమోదీని విమర్శించగానే కేసులు పెడుతున్న వైనాన్ని దాదాపు ఆరోజు సభకు హాజరయ్యే ఐదు లక్షలమందితోపాటు దేశ ప్రజానీకానికి చెప్పాలని అనుకుంటున్నారు. ఈ భారీ బహిరంగ సభలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఉంటారని స్పష్టం కాగా తాను కూడా వస్తున్నానంటూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. అలాగే, బీఎస్పీ అధినేత్రి మాయావతికి కూడా ఇప్పటికే ఆహ్వానం పంపించారంట. ములాయం సింగ్, వామపక్ష నేతలైన సీతారాం ఏచూరి, డీ రాజా కూడా వస్తారని లాలూ హింట్ ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను సంప్రదించలేదని లాలు చెప్పుతున్నారు. మరోపక్క, ప్రస్తుతం తన మద్దతుతో బిహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్న నితీశ్ కుమార్ ఈ వేదికను పంచుకుంటారా లేదా అని ఇంకా సుస్పష్టం కాలేదు. ఈలోగా, లాలూ ఆశలపై నీళ్లు చల్లినట్లుగా బిహార్ బీజేపీ ఉన్నత శ్రేణి నేత సుశీల్ కుమార్ మోదీ స్పందిస్తూ.. ‘లాలూ ప్రసాద్ యాదవ్ ఇలాంటి పనులు చేయాలనుకోవడం అవగాహన రాహిత్యం, పరిపక్వత లేని చర్య. ఎందుకంటే వచ్చే ఆగస్టు నాటికే ఆయనను బహుశా జైలులో ఉండొచ్చు. కాబట్టి లాలూ అంత శ్రమపడకుండా ఉండటమే మంచిది’ అంటూ ట్వీట్లో విమర్శించారు. దీనికి వెంటనే స్పందించిన లాలూ కూడా ‘హా..హా.. నా పేరు లాలూ.. ఇలా నన్ను కుంగదీయాలనుకునే వారిని చూసి జాలేస్తుంది’ అంటూ లాలూ రీ ట్వీట్ చేశారు. అన్న ప్రకారం లాలూ భారీ బహిరంగ సభ పెట్టి తీరతారా? లేదా సుశీల్ మోదీ చెప్పినట్లు మరోసారి జైలు పాలవుతారా అనేది వేచి చూడాల్సిందే. -
మీసా భారతిపై మనీలాండరింగ్ ఆరోపణలు
నకిలీ కంపెనీలతో నల్లధనాన్ని తెలుపుగా మార్చారు: సుశీల్ మోదీ పట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కూతురు, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి నకిలీ కంపెనీలు సృష్టించి మనీ లాండరింగ్కు పాల్పడ్డారని బిహార్ బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు. అలా ఆమె ఢిల్లీలోని బిజ్వాసాన్ ప్రాంతంలో చవకగా ఓ వ్యవసాయ క్షేత్రాన్ని కొన్నారని తెలిపారు. లాలూ కుమారులు, బిహార్లో మంత్రులైన తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్లు రూ.1000 కో ట్లను అక్రమంగా పోగేశారని సుశీల్ ఇంతకు ముందు ఆరోపించారు. మీసా అనుమానాస్పద రీతిలో తన కంపెనీ షేర్లను అమ్మి, తిరిగి కొనుగోలు చేసి నల్ల ధనాన్ని తెలుపుగా మార్చారని వెల్లడించారు. 2008–09లో ఆమె కేవలం రూ.1.41 కోట్లకు కొనుగోలు చేసిన ఫార్మ్హౌస్ వెల ఇప్పుడు కనీసం రూ.50 కోట్లుంటుందని పేర్కొన్నారు. లాలూ అధికారిక నివాసాన్నే మీసా తన కంపెనీ చిరునామాగా మార్చి, దాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లో కూడా ఆమె తన ఆదాయ వనరులను వెల్లడించలేదని తెలిపారు. ఈ ఆరోపణలపై ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి స్పందిస్తూ... ఏం పనిలేని సుశీల్ మోదీ నిరాశ, నిస్పృహలో ఉన్నారని, బీజేపీలో తన ఉనికిని కాపాడుకోవడానికే చాలా ఏళ్ల క్రితం న్యాయంగా జరిగిన వ్యాపార లావాదేవీలను తేవనెత్తుతున్నారని అన్నారు. -
’వాళ్లిద్దర్నీ తక్షణమే కేబినెట్ నుంచి తొలగించాలి’
పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమారుల్ని బీహార్ మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ డిమాండ్ చేశారు. మట్టి కుంభకోణంపై లూలు తనయులు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై సుశీల్ కుమార్ మోదీ మాట్లాడుతూ... మట్టి కుంభకోణానికి సంబంధించి తమవద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ..తక్షణమే వారిద్దర్ని కేబినెట్ నుంచి తొలగించాలన్నారు. నితీశ్ కేబినెట్లో లాలూ కొడుకుల్లో ఒకరు డిప్యూటీ సీఎం కాగా మరొకరు వైద్య, అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. కాగా లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఓ సహాయానికిగానూ ఓ వ్యాపారవేత్త... ప్లాట్ను ఇవ్వడం జరిగిందన్నారు. ఆ ప్లాట్ ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు ప్రేమ్ చంద్ గుప్తా, ఆయన కుటుంబసభ్యుల పేరుతో ఉందన్నారు. అనంతరం లాలూతో పాటు ఆయన కుమారుల పేరుపై బదలాయింపు జరిగిందన్నారు. పట్నా శివారు ప్రాంతంలో ఉన్న ఈ ప్లాట్లో ప్రస్తుతం ఓ పెద్ద వాణిజ్య భవన సముదాయం నిర్మిస్తున్నారు. ఓ ప్రైవేటు సంస్థ దీనిని నిర్మిస్తోంది. ఈ క్రమంలో భవన నిర్మాణం కోసం భారీ తవ్వకాలు జరిపారు. తవ్వకాల్లో బయటకు తీసిన మట్టి మొత్తాన్ని కనీసం ఎలాంటి టెండర్ కూడా పిలవకుండా దాదాపు రూ.90లక్షలకు పాట్నా జూపార్క్కు విక్రయించారు. ఇదంతా కూడా అటవీశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఆధ్వర్యంలో చోటు చేసుకుంది. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మట్టి కుంభకోణంపై బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిన్న విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. -
ఆర్ఎస్సెస్కు పోటీగా డీఎస్సెస్
పట్నా: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్సెస్)కు వ్యతిరేఖంగా బీహార్ వైద్యశాఖ మంత్రి, ఆర్జేడీ నేత లాలుప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ప్రతాప్ యాదవ్ ధర్మనిర్పేక్ష సేవక్ సంఘ్ (డీఎస్సెస్) ను ఏర్పాటు చేశారు. ఆర్ఎస్సెస్ మతతత్వాన్ని,దేశ విభజన భావాజలాన్ని ప్రోతాహిస్తుందని, దీన్ని డీఎస్సెస్ అడ్డుకుంటందని తేజ్ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యానించారు. సోమవారం పట్నాలో తన మద్దతుదారులతో చేపట్టిన డీఎస్సెస్ ర్యాలీలో పాల్గొన్న తేజ్ ప్రతాప్ డీఎస్సెస్ గురించి మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాధ్ హిందూ యువవాహిని పేరుతో హిందూత్వ భావజాలన్ని బీహార్లోకి ప్రవేపెట్టాలనుకుంటున్నారని దీన్ని డీఎస్సెస్ సమర్దవంతంగా అడ్డుకుంటదని తెలిపారు. దేశంలో శాంతి, స్నేహపూర్వక వాతవరణాన్ని నెలకొల్పడమే డీఎస్సెస్ ముఖ్య ఉద్దేశ్యమని యాదవ్ చెప్పాడు. డీఎస్సెస్ ఏర్పాటు చేసేముందు తేజ్ప్రతాప్ ఆర్స్సెస్లో చేరి ఒక సంవత్సరం పాటు పని చేయాలని సీనియర్ బీజేపీ నాయకుడు సుశీల్కుమార్ మోదీ సలహాఇచ్చాడు. ప్రతాప్ స్థాపించిన డీఎస్సెస్ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని సుశీల్ తెలిపాడు. కానీ కొంత అనుభవం అవసరమని దానికి ఆర్స్సెస్లో చేరి హాఫ్ ప్యాంట్లతో ‘భారత్ మతాకి జై ’అని జపం చేస్తే వస్తుందన్నాడు. దీనిపై స్సందించిన తేజ్ప్రతాప్ హాఫ్ ప్యాంట్లు వేసుకునే వారంతా హాఫ్ మైండ్గాళ్లని సుశీల్కు కౌంటర్ ఇచ్చాడు. -
చెవులు కుట్టించుకో.. గుండు గీయించుకో!
సుశీల్ మోదీ ట్వీట్కు లాలూ ఘాటు పంచ్! పట్నా: ట్విట్టర్ వేదికగా ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ నేత సుశీల్కుమార్ మోదీ మధ్య నిత్యం వ్యంగ్యాస్త్రాలు, మాటల యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి. తాజాగా ఈ ఇద్దరు నేతలు మరోసారి దూసుకున్నారు. ట్విట్టర్ వేదికగా పరస్పరం వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా తదితరుల సమక్షంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాలూపై సుశీల్ మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ’యోగి సీఎం కావడంతో ఆయనను ఎలా తిట్టాలో కూడా తెలియని దిగ్భ్రాంత స్థితిలో లాలూ ఉన్నారు’ అటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు అంతే ఘాటుగా స్పందించిన లాలూ.. ’నువ్వు కూడా చెవులు కుట్టించుకో. గుండు గీయించుకో. దుస్తులు మార్చుకో. ఇది నీకు మేలు చేయవచ్చు. (ప్రమాణస్వీకారానికి) నిన్ను పిలువలేదని మరీ బాధపడిపోకు’ అంటూ చురకలు అంటించారు. నువ్వు కూడా సన్యాసం స్వీకరిస్తే బాగుపడే చాన్సుందని పరోక్షంగా సూచిస్తూ లాలూ పేల్చిన ఈ వ్యంగ్యాస్త్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నది. సుశీల్మోదీకి ఇది అద్భుతమైన పంచ్ అని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఇటీవల లాలూ-మోదీ ట్వీట్ సంవాదం కొనసాగిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో బీజేపీ తిరుగులేని విజయాలు సాధించడంతో.. నేరుగా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా, 'లాలూ మీ పరిస్థితి ఏమిటి' అంటూ ఓ చిన్న ట్వీట్ చేశారు సుశీల్ మోదీ. దానికి లాలు చాలా షార్ప్గానే రియాక్ట్ అయ్యారు. 'నేను బాగానే ఉన్నా. నిన్నే యూపీలోకి అడుగుపెట్టనివ్వలేదు కాబట్టే.. అక్కడ బీజేపీ గెలువగలిగింది’ అంటూ కౌంటర్ ఇచ్చారు. -
లాలుతో పెట్టుకుంటే ఇంతే మరి!
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ బాగా షార్ప్గా ఉంటారు. రాజకీయ సెటైర్లు వేయాలంటే ఎవరైనా ఆయన తర్వాతే. అలాంటి లాలుకు షాకివ్వాలని ప్రయత్నించిన బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీకి లాలుయే ఝలక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల్లోను బీజేపీ తిరుగులేని విజయాలు సాధించడంతో.. నేరుగా ఆ విషయాన్ని ప్రస్తావించకుండా, 'ఎలా ఉన్నారు లాలూ' అని ఓ చిన్న ట్వీట్ చేశారు సుశీల్ మోదీ. దానికి లాలు చాలా షార్ప్గానే రియాక్ట్ అయ్యారు. 'నేను బాగానే ఉన్నాను. బీజేపీ నిన్ను యూపీలోకి రానివ్వలేదు. అందుకే ఆ పార్టీ అక్కడ గెలిచింది' అని సమాధానం ఇచ్చారు. సుశీల్ మోదీ, లాలుల మధ్య ఇలా సరదా సంభాషణలు, పొలిటికల్ సెటైర్లు కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా వీళ్లిద్దరి మధ్య ఇలాంటివి చాలానే జరిగాయి. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సమయం నాటికి సమాజ్వాదీ పార్టీలో ములాయం సింగ్ యాదవ్కు, ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్కు మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు.. లాలుకు 'మీ కొడుకులతో జాగ్రత్త' అని సుశీల్ మోదీ చెప్పారు. @laluprasadrjd क्या हाल है ? — Sushil Kumar Modi (@SushilModi) 11 March 2017 ठीक बा। देखा ना, बीजेपी ने तुम्हें यूपी में नहीं घुसने दिया तो फायदा हुआ। https://t.co/KBzqOjGdzM — Lalu Prasad Yadav (@laluprasadrjd) 11 March 2017 -
లాలూకి కొడుకుల బెడద ఉందా?
తండ్రి ములాయంకు చెక్ పెడుతూ కొడుకు అఖిలేష్ యాదవ్ వ్యవహరిస్తున్న వైఖరి ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్కు 'సన్' స్ట్రోక్ కు సంకేతాలుగా మారుతున్నాయట. ఆయన కొడుకులు కూడా ఇదే మాదిరి రాజకీయ సంక్షోభం లేవనెత్తుతారేమోనని లాలూ ఆందోళన చెందాల్సినవసరం ఉందని బీజేపి సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ ఇద్దరు కొడుకులు తేజస్వి ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్రానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. మరో కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నారు. సమాజ్వాద్ పార్టీలో నెలకొన్న వివాదంతో లాలూకు కూడా కొడుకుల బెడద ఉందని తనకు అనిపిస్తున్నట్టు సుశీల్ కుమార్ మోదీ తన నివాసంలో నిర్వహించిన జనతా దర్బార్లో వ్యక్తంచేశారు. అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో సమాజ్వాద్ పార్టీలో ముదురుతున్న రాజకీయ సంక్షోభంపై లాలూ ఇప్పటికే మధ్యవర్తిత్వంగా బంధువుడి హోదాలో ములాయం సింగ్కు, అఖిలేష్కు హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. సఖ్యతగా ఉండకపోతే, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లబ్ది పొందే అవకాశముందని లాలూ హెచ్చరించారు. కానీ ఆయనకు కూడా మంత్రి పదవుల్లో ఉన్న ఇద్దరు కొడుకులతో ముప్పు పొంచి ఉందని బీజేపీ సీనియర్ నేత అన్నారు. అఖిలేష్ వ్యవహరించిన తీరే దీనికి సంకేతమన్నారు. పార్టీ నాయకత్వం తీసుకోవడానికి ఆర్జేడీ సుప్రీం కొడుకులు కూడా తండ్రి ఛాయల నుంచి బయటికి రావాల్సి ఉందని సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు. -
‘అంత బాధేస్తే నితీశ్కు నీ సోదరినివ్వు’
పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీని అనకూడని మాటలు అన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భవిష్యత్తు గురించి అంత ఆందోళన పడుతున్న సుశీల్ ఆయనను ఇంటికి తీసుకెళ్లి ఒడిలో కూర్చొబెట్టుకోవచ్చని అన్నారు. అది కాకుంటే నితీశ్కు సుశీల్ సోదరి చేయినందించి పెళ్లి చేసుకోని ఆయన ఖ్యాతిని పెంచుకోవచ్చని వివాదాస్పదంగా మాట్లాడారు. బీజేపీలో ఉన్నప్పుడు నితీశ్ కుమార్ జీవితం చాలా అద్భుతంగా ఉందని, ఆయనకు అది ఒక స్వర్ణ యుగం అని, కానీ, ఇప్పుడు ఆర్జేడీ, కాంగ్రెస్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారని అంతకుముందు రోజు సుశీల్ కుమార్ మోదీ అన్నారు. ఆ పార్టీలతో స్నేహం గురించి మరోసారి ఆలోచిస్తే మంచిదని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతిస్తూ నితీశ్ బహిరంగ ప్రకటన చేసిన అనంతరం సుశీల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే లాలూ భార్యను కొందరు మీడియా ప్రతినిధులు కలిసి స్పందన కోరగా సుశీల్కు నితీశ్ ను చూసి అంత బాధనిపిస్తే ఆయన సోదరినిచ్చి పెళ్లి చేసి ఇంటికి తీసుకెళ్లి ఒడిలో కూర్చొబెట్టుకోవచ్చని ఘాటుగా అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలు మీడియాలో పలు విమర్శలకు దారి తీయడంతో తన ఉద్దేశం అది కానే కాదని, మీడియానే తన వ్యాఖ్యలను వక్రీకరించిందని చెప్పారు. సుశీల్ కుమార్ మోదీ తనకు మరిదిలాంటివాడని, అతడికి తాను వదినలాంటిదాన్నని, ఆ మాత్రం పరాచికాలు ఆడకూడదా అంటూ వివరణ ఇచ్చారు. -
సగంమంది మంత్రులు, ఎమ్మెల్యేలూ తాగుబోతులే!
పాట్నా: 'ముఖ్యమంత్రిగారు, మీరు రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలుచేస్తున్నారు. కానీ అధికార మహా కూటమికి చెందిన సగం మంది మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం మద్యం సేవిస్తారు. ఈ నేపథ్యంలో మద్యం నిషేధం అమలులో మీ చిత్తశుద్ధి కనిపించడం లేదు' అని బిహార్ బీజేపీ సీనియర్ నేత సుశీల్కుమార్ మోదీ ముఖ్యమంత్రి నితీశ్కుమార్పై మండిపడ్డారు. రాష్ట్రంలో మద్యనిషేధం అమల్లో ఉన్న ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు మందు కొడుతూ స్టింగ్ ఆపరేషన్లో అడ్డంగా దొరికిన పోయిన నేపథ్యంలో సుశీల్ మోదీ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ పార్టీలతో కూడిన మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వంలోని సగానికిపైగా మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం మందు తాగుతారనే విషయం తనకు తెలుసునని, ఈ నేపథ్యంలో బిహార్లో నితీశ్ ప్రభుత్వం సంపూర్ణంగా మద్యనిషేధం ఏమేరకు అమలుచేస్తున్నదనేది ప్రశ్నార్థకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. -
'కీర్తి ఆజాద్ పై చర్యలు తీసుకోండి'
పట్నా:డీడీసీఏ(ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) అక్రమాల వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ విమర్శించిన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ పై చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ డిమాండ్ చేశారు. పార్టీ నియమావళిని తుంగలో తొక్కాలని ప్రయత్నిచిస్తే చర్యలు తప్పవని సుశీల్ కుమార్ హెచ్చరించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఆజాద్ పై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు సుశీల్ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజుల నుంచి జైట్లీని ఆజాద్ విమర్శిస్తున్నా.. ఇప్పటివరకూ బీజేపీ నేతలెవరూ నోరు మెదపలేదు. కాగా, తొలిసారి ఆజాద్ పై క్రమ శిక్షణా చర్యలు చేపట్టాలని సుశీల్ కుమార్ మోదీ డిమాండ్ చేయడం గమనార్హం. కొన్ని రోజుల నుంచి డీడీసీఏ వ్యవహారంపై జైట్లీని టార్గెట్ చేస్తూ కీర్తి ఆజాద్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నసంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేసిన అనంతరం జైట్లీపై ఆజాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే తనపై దావా వేయాలని జైట్లీకి ఛాలెంజ్ చేశారు. హాల్లో డియర్ అరుణ్జైట్లీ.. నాపై కూడా పరువునష్టం దావా వేస్తున్నావు కదా? ప్లీజ్ నా మీద కూడా వేయ్. మినహాయింపు ఏమీ వద్దు. భావప్రకటనా స్వేచ్ఛను హరించకు' అని ట్వీట్ చేశారు. 'నా పేరు ఎందుకు కేసులో చేర్చలేదు. మీరే కదా నేను రిజిస్టర్ పోస్టులో పంపించిన లేఖలు చూపించింది'అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆజాద్ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించే అవకాశాలు కనబడుతున్నాయి. -
'ఆయన రెండో పెళ్లికి అమ్మాయి దొరకలేదు'
బక్సర్: బిహార్ ఎన్నికల్లో మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ప్రత్యర్థులు విమర్శలకు పదును పెడుతున్నారు. జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ వ్యంగాస్త్రాలు సంధించారు. నితీష్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారని, అయితే ఆయన మెడలో దండ వేయాలని ఏ అమ్మాయి కోరుకోవడం లేదని సుశీల్ కుమార్ మోదీ విమర్శించారు. బీజేపీతో జేడీయూకు ఉన్న అనుబంధాన్ని లోక్సభ ఎన్నికలకు ముందు నితీష్ తెగతెంపులు చేసుకున్నారని చెప్పారు. తమ కూటమికి వరుడు (నితీష్) ఉన్నారని, ఎన్డీయేకు ఎవరూ లేరని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన విమర్శలకు సుశీల్ పైవిధంగాకౌంటర్ ఇచ్చారు. జనతా పరివార్ కూటమి తరపున నితీష్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించగా.. ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రధాని నరేంద్ర మోదీపై బీజేపీ ఎక్కువగా ఆధారపడుతోంది. -
పాల వ్యాపారంలో 'లాభాల' రహస్యం ఇదే..
'కుక్కలు పెంచుకునే వాళ్లు.. పశుకాపరులకు పాఠాలు చెప్పొద్దు. అసలు గోవుల గురించి మీకేం తెలుసు? నా ఇంట్లో 500 ఆవులున్నాయి. అవి ఇచ్చే పాలతోనే వ్యాపారం చేస్తున్నా' అంటూ రెండు రోజుల కిందట బీజేపీ నాయకులపై విరుచుకుపడ్డారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. దాద్రీ ఘటనను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్లు చేశారు. కాగా, లాలూ వ్యాఖ్యలను బిహార్ బీజేపీ చీఫ్ సుశీల్ కుమార్ మోదీ తీవ్రంగా తిప్పికొట్టారు. 'పాల వ్యాపారం ముసుగులో లాలూ యాదవ్ నల్ల ధనాన్ని చెలామణి చేస్తున్నారు. పశువుల దాణా కుంభకోణంలో ఆయన వెనకేసుకున్న డబ్బునే.. డైరీ ఫామ్ లో లాభాలుగా చూపుతున్నారు' అని సుశీల్ మోదీ బుధవారం ట్వీట్ చేశారు. లాలూకు గోవుల పట్ల ఎలాంటి గౌరవం లేదని, అది హిందువులకు పూజ్యనీయమనే విషయాన్ని కూడా ఆయన అంగీకరించరని, అందుకే గోమాంసం తినేవాళ్లను వెనకేసుకొస్తున్నారని మోదీ విమర్శించారు. మరొ నాలుగు రోజుల్లో తొలివిడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆర్జేడీ- జేడీయూ- కాంగ్రెస్ పార్టీల కూటమి, బీజేపీ- ఎల్జేపీల ఎన్డీఏలు పరస్పర విమర్శల పర్వాన్ని మరింత ఉదృతం చేశాయి. అక్టోబర్ 12న తొలివిడిత పోలింగ్ జరగనుంది. -
మాజీ ఉపముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్
పట్నా: బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు తాయిలాలు ప్రకటించి సాక్షాత్తు రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ అడ్డంగా బుక్కయ్యారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఓటర్లకు ఉచిత కానుకలను ప్రకటించి వారిని మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయనపై మంగళవారం కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో భబువా జిల్లాలో సోమవారం ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సభలో ప్రసంగించిన మాజీ ఉపముఖ్యమంత్రి లాప్టాప్లు, కలర్ టీవీలు, చీరలు ఇస్తామంటూ బహిరంగంగా ప్రకటించేశారు. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టారని ఆరోపిస్తూ సుశీల్ కుమార్ మోదీపై జిల్లా అధికారులు కేసు బుక్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 12, నవంబర్ 5వ తేదీల్లో 243 సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. -
'ముస్లిం, యాదవ్ అభ్యర్థులను నిలబెడతాం'
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ నేతృత్వంలోని కూటమిని ఎదుర్కొనేందుకు ముస్లిం, యాదవ్ అభ్యర్థులను ఎక్కువగా పోటీకి నిలపాలని ఎన్డీఏ భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో ముస్లిం, యాదవ్ అభ్యర్థులను అధికంగా బరిలోకి దింపుతామని బీజేపీ బిహార్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ తెలిపారు. బీజేపీతో విడిపోయి కాంగ్రెస్, ఆర్జేడీతో చేతులు కలిపిన తర్వాత నితీశ్ కుమార్ పాలన గాడి తప్పిందని ఆయన విమర్శించారు. మహాకూటమికి యాదవుల మద్దతు ఉందన్న వాదనను మోదీ తోసిపుచ్చారు. గత లోక్ సభ ఎన్నికల్లో లాలూ భార్య రబ్రీదేవి, కుమార్తె మిసా భారతి ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్డీఏ పట్ల ముస్లింలు వ్యతిరేకంగా లేరని పేర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోని వస్తే సీఎం పదవికి సుశీల్ కుమార్ మోదీ పేరు బలంగా విన్పిస్తోంది. -
బీహార్ లో మాత్రం పొత్తుతోనే ముందుకు..
పాట్నా:వచ్చే సంవత్సరం బీహార్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుతోనే ముందుకు వెళతామని సీనియర్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన మహారాష్ట్రలో, హర్యానా ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితులు వేరన్నారు. రానున్న ఎన్నికల్లో ఎల్జీపీ, ఆర్ఎల్ ఎస్ పీ లతో పొత్తుపై ఆలోచిస్తున్నామన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన సుశీల్ కుమార్.. బీజేపీ విజయంతో స్థానిక పార్టీలకు ప్రమాదం ఉందన్న వార్తలను ఆయన ఖండించారు. అందులో ఎటువంటి వాస్తవం లేదన్నారు. దేశంలోని కాంగ్రెస్ విధానాలతో అలసిపోయిన ప్రజలు బీజేపీ పట్టంకట్టారన్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీ పోటీ చేసిన తీరును చూస్తే మాత్రం అది ఏకాకిని తలపిస్తోందన్నారు. మహారాష్ట్రలో శివసేన, హర్యానాల్లో హెచ్ జేపీ(హర్యానా జన్ హిత్ కాంగ్రెస్)లతో పొత్తు విఫలమయ్యిన తీరును ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
మోడీ సభలో చెప్పులు, రాళ్లు
కనీవినీ ఎరుగని రీతిలో జనం రావడంతో బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ గయ బహిరంగ సభలో కాసేపు గందరగోళం నెలకొంది. బీహార్ లోని గయలోని గాంధీమైదాన్ లో జరిగిన సభలో నరేంద్ర మోడీ వేదికపైకి రాగానే జనం బారికేడ్లను తెంచుకుని మరీ ముందుకు చొచ్చుకువచ్చారు. వారిని ఆపేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. లాఠీచార్జితో జనం మరింత రెచ్చిపోయారు. అప్పటికే నరేంద్ర మోడీ కోసం గంటల పాటు ఎదురుచూస్తున్న ప్రజలు పోలీసులపై విరుచుకుపడ్డారు. చెప్పులు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. కొందరు లాఠీలతో దూసుకుపోయారు. దీంతో కాసేపు సభలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. చివరికి బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ ప్రజలను శాంతియుతంగా వ్యవహరించమని కోరారు. కొద్ది సేపటికి సభ సద్దుమణిగింది. ఆ తర్వాత మోడీ ప్రసంగం కొనసాగింది. గురువారం ఉదయమే గయలో నక్సలైట్లు రెండు టెలిఫోన్ టవర్లను పేల్చివేశారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
పాట్నా పేలుళ్ల బాధితులను పరామర్శించనున్న మోడీ
పాట్నా నగరంలో ఆదివారం చోటు చేసుకున్న వరుస బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడిన వారిని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ శనివారం పరామర్శించనున్నారని బీజేపీ నాయకుడు సుశీల్ కుమార్ మోడీ బుధవారం ఇక్కడ వెల్లడించారు. అందుకోసం శనివారం ఉదయం నరేంద్ర మోడీ పాట్నా చేరుకుంటారని చెప్పారు. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడి నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శిస్తారని తెలిపారు. అలాగే ఆ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలను మోడీ కలుస్తారని పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో హూంకార్ ర్యాలీ నిర్వహంచారు. ఆ ర్యాలీకి కొన్ని గంటల ముందు పాట్నా రైల్వే స్టేషన్లో బాంబు పేలుడు సంభవించింది. అనంతరం గాంధీ మైదాన్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ పేలుళ్లలో ఆరుగురు మరణించారు. 82 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అయితే ఆ బాంబు పేలుళ్లపై ఇప్పటివరకు ఎన్ఐఏ అధికారులు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు.