tomato prices
-
టమాటా ధర ఢమాల్!
పలమనేరు: చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. పలమనేరులోని టమాటా మార్కెట్లో గురువారం 15కిలోల బాక్సు ధర కేవలం రూ.50 పలికింది. దీంతో ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడులు పెట్టి టమాటా సాగుచేసిన రైతులు తమకు భారీ నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పలమనేరు హార్టికల్చర్ డివిజన్లో 4వేల హెక్టార్లలో టమాటా సాగు చేశారు. వెయ్యి హెక్టార్లలో పంట కోత దశకు వచ్చింది. ప్రస్తుతం స్థానిక రైతులు రోజూ పలమనేరు మార్కెట్కు 40టన్నుల వరకు టమాటాలు తీసుకొస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి రోజూ మరో 40టన్నుల వరకు టమాటా వస్తోంది. అయితే, కొనుగోలు చేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాకపోవడంతో ధరలు తగ్గిపోయాయి.బయటి రాష్ట్రాల్లో టమాటా సీజన్ మొదలుమన రాష్ట్రంలో టమాటా అత్యధికంగా పండించే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఏటా పొరుగు రాష్ట్రాల వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో టమాటా సీజన్ మొదలైంది. అక్కడి అవసరాలకు స్థానిక సరుకు సరిపోతోంది. ఆయా రాష్ట్రాల నుంచి వ్యాపారులు చిత్తూరు జిల్లాకు రావడం లేదు. మరోవైపు వేసవి మొదలుకావడంతో తోటల్లో టమాటా మాగడం మొదలైంది. వెంటనే అమ్ముకోవాలని రైతులు మాగినవాటిని కోసి మార్కెట్కు తీసుకొస్తున్నారు. వాటిని కొనుగోలు చేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాకపోవడం, డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉండటంతో ధర తగ్గిపోయిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒక్కరోజుతో చేతులెత్తేసిన ప్రభుత్వంరాష్ట్రంలోని టమాటా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు. రైతులకు నష్టం రాకుండా మార్కెటింగ్ శాఖ ద్వారా టమాటాను కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. కానీ, మార్కెటింగ్శాఖ అధికారులు ఇటీవల ఒక్కరోజు మాత్రం తూతూ మంత్రంగా రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్లకు పంపించారు. ఆ తర్వాత చేతులెత్తేశారు. దీంతో రైతులు దిక్కుతోచక అల్లాడుతున్నారు. ఈ ధరలతో అప్పులపాలే..ఎకరా పొలంలో టమాటా సాగుకు రూ.1.20లక్షలు పెట్టుబడి పెట్టాలి. బాగా పండితే ఎకరాకు 800 బాక్సులు దిగుబడి రావొచ్చు. ఇప్పుడున్న ధర రూ.50 ప్రకారం అయితే రైతుకు దక్కేది రూ.40వేలు మాత్రమే. రైతులు అప్పులపాలవడం ఖాయం. ప్రభుత్వమే టమాటాను మద్దతు ధరకు కొని రైతులను ఆదుకోవాలి. – గోవిందు, బేరుపల్లి, పలమనేరు మండలం ప్రభుత్వం పట్టించుకోలేదు..రూ.లక్షలు ఖర్చుపెట్టి టమాటా సాగుచేసిన రైతులకు 15కిలోల బాక్సు ధర రూ.400 ఉంటే లాభమే. ఇప్పుడు బాక్సు ధర రూ.50 ఉంది. ఈ లెక్కన చూస్తే పూర్తిగా నష్టం తప్పదు. ఇటీవల మార్కెటింగ్శాఖ అధికారులు ఒక రోజు టమాటాను కొని రైతుబజార్లకు పంపారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. నిత్యం అధికారులు సరుకు కొంటే బయటి వ్యాపారులు సైతం ఎక్కువ ధరకు కొనే అవకాశం ఉంటుంది. రైతులకు లాభం వస్తుంది.– టీఎస్ బుజ్జి, టమాటా వ్యాపారి, పలమనేరు -
టమాటా పడిపోయే..
సాక్షి, హైదరాబాద్: టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. మునుపెన్నడూలేని రీతిలో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. శివార్లలోని రైతులు ధరలు గిట్టుబాటు కాకపోవడంతో తెంపకుండా తోటల్లోనే వదిలేసేందుకు మొగ్గు చూపుతుండగా.. కొందరు మాత్రం మార్కెట్కు తెచి్చనా ధరలు రాకపోవడంతో రోడ్లపై పారబోస్తున్నారు. గతేడాది ఇదే సీజన్లో నగర మార్కెట్లో కిలో రూ. 15 ఉన్న టమాటా ప్రస్తుతం కిలో రూ. రూ.10కి పడిపొయింది. మార్కెట్లకు దిగుబడులు పోటెత్తడంతో సామాన్యులకు మాత్రం టమాటాలు అందుబాటులోకి వచ్చా యి. జంటనగరాల అవసరాలకు సరిపడా టమాటా పెరగడంతో ప్రస్తుతం నగరంలోని గుడిమల్కాపూర్, మోండా, బోయిన్పల్లి, మాదన్నపేట, ఎల్బీనగర్ మార్కెట్లలో టమాటా ధరలు తగ్గాయి. హోల్సేల్ మార్కెట్లో కిలో టమాటా రూ.3–8 ఉండగా రిటైల్ మార్కెట్లో ధర కిలో 7–10 పలుకుతోంది. డిమాండ్కు తగిన సరఫరా నగరానికి నిత్యం దాదాపు 100 నుంచి 120 లారీల టమాటా డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లకు 150 లారీల మేర దిగుమతులు వస్తున్నాయి.దీంతో నగర డిమాండ్ కంటే 30 లారీల టమాటా ఎక్కువగా దిగుమతి అవడంతో ధరలు విపరీతంగా పడిపోయాయి. తెలంగాణ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల నుంచి రోజురోజుకూ దిగుమతులు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ జిల్లాల నుంచి రోజుకు 30 నుంచి 40 లారీలు వస్తుండగా, పొరుగు రాష్ట్రాల నుంచి మరో 90–120 లారీల మేరకు టమాటా దిగుమతి అవుతోంది. ఈ నెల చివరి వరకు దిగుమతులు ఇలాగే ఉంటాయని, ఫిబ్రవరి రెండో వారం నుంచి దిగుమతులు తగ్గుతాయని హోల్సేల్ వ్యాపారులు అంటున్నారు. దిగుమతులు తగ్గితే ధరలు పెరిగే అవకాశముంది. -
తోటల్లోనే టమాటా
పలమనేరు: మార్కెట్లో టమాటా ధర పడిపోవడంతో రైతు కుదేలవుతున్నాడు. ఓ పక్క ఎగుమతులు లేకపోవడం, మరోపక్క కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందకపోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. రైతుకు మిగులుతున్నది పంట పెట్టుబడికి తెచి్చన అప్పులే. పలమనేరు హారి్టకల్చర్ డివిజన్లో రైతులకు పంట సాగు ఖర్చులు కూడా రావడంలేదు. స్థానిక టమాటా మార్కెట్లో సోమవారం 15 కిలోల బాక్సు గరిష్ట ధర రూ.200 మాత్రమే ఉంది.సగటు ధర బాక్సుకు రూ.180గా ఉంది. దీంతో పంట కోసిన కూలీల డబ్బు కూడా రావడంలేదని, కోసి నష్టపోయేకంటే తోటల్లోనే వదిలేయడం మేలన్న నిర్వేదంతో రైతులు పంటను కోయకుండా వదిలిపెట్టారు. పలమనేరు హారి్టకల్చర్ డివిజన్లో టమాటా సీజన్ ఏడాదంతా ఉంటుంది. ప్రస్తుతం 9 వేల హెక్టార్లలో టమాటా పంట సాగవుతోంది. 2,58,888 టన్నులు దిగుబడి ఉంటుందని అంచనా. ఎక్కువగా రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ, తమిళనాడు నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి టమాటా కొనుగోలు చేస్తుంటారు.అయితే ప్రస్తుతం ఆ ప్రాంతాల్లోనే సాగు పెరిగి, అక్కడి మార్కెట్లకు సరుకు భారీగా వస్తోంది. దీంతో అక్కడి వ్యాపారులు పలమనేరు, పుంగనూరు, మదనపల్లి రావడంలేదు. ఎగుమతులు లేక ఇక్కడ ధరలు పడిపోయాయి. మార్కెట్కు వచి్చన కాస్త పంటను కూడా వ్యాపారులు, మధ్యవర్తులు అతి తక్కువ ధరకు కొని, బహిరంగ మార్కెట్లో అతి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. రైతుకు మిగిలేదేమీ లేదు ఎకరా పంట పండించడానికి రైతుకు రూ. 1.20 లక్షలు ఖర్చవుతుంది. ఎకరాకు ప్రస్తుతం 500 నుంచి 600 బాక్సుల (బాక్సుకి 15 కిలోలు) దిగుబడి వస్తోంది. ప్రస్తుతం ఉన్న రేటు కనీసం రూ. 160 నుంచి గరిష్టంగా రూ. 200 మాత్రమే ఉంది. సరాసరి ధర రూ.180 వేసుకున్నా రైతుకు రూ. లక్ష నుంచి రూ.1,08,000కి మించి రావడంలేదు. ఇక్కడే రైతుకు కనీసంగా రూ.12 వేలు నష్టం వస్తోంది. రైతు కుటుంబమంతా కష్టపడి పంటకు నీరందించి సస్యరక్షణ చర్యలు చేపట్టి వారి కూలీని లెక్కకడితే అతనికి మిగిలేది అప్పులే. దీంతో కోత ఖర్చులు కూడా వృథాయేనన్న నిర్వేదంతో రైతులు పంటను చెట్టు మీదే వదిలేస్తున్నారు. ఎకరా సాగుకు అయ్యే ఖర్చు ఇలా..ఎకరా టమాటా సాగు కోసం భూమి దున్నటం, నర్సరి నుంచి మొక్కల కొనుగోలు (ఎకరాకు 8 వేల మొలకలు) రూ.8 వేలు అవుతుంది. టమోట స్టిక్లు ఎకరాకు 1200. ఒక్కోటి రూ.20 చొప్పున రూ.24 వేలు వీటికి ఖర్చవుతుంది. సేంద్రియ ఎరువు పది లోడ్లు, కాంప్లెక్స్ ఆరు బస్తాలు కలిపి రూ.27వేలు అవుతాయి. క్రిమి సంహారక మందులు రూ.10 వేలు. కూలీల ఖర్చు రూ.15 వేలు. ఇలా ఎకరా పంట సాగుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.84 వేలు. పంట వడిగేలోపు తోటలో కాయలు కోసేందుకు కూలీ, మార్కెట్కు రవాణ, తదితరాల ఖర్చు మరో రూ.36 వేలు అవుతోంది. మొత్తం కలసి రూ.1.20 లక్షలు అవుతుంది.బయటి నుంచి వ్యాపారులు వస్తేనే ధర పెరుగుతుంది..మార్కెట్లకు నాణ్యమైన సరుకు వస్తోంది. అయితే బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికి రావడంలేదు. దీంతో సరుకు మిగిలిపోతోంది. ధరలు తగ్గిపోయాయి. కనీసం బాక్సు టమాటా ధర రూ.300 ఉంటే తప్ప రైతుకు మిగిలేదేమీ ఉండదు. – టీఎస్ బుజ్జి, మండీ నిర్వాహకులు, పలమనేరు -
సెంచరీ కొట్టిన టమాటా..
-
తగ్గనున్న టమాటా ధరలు
దేశంలో టమాటా ధరలు మరింత తగ్గనున్నాయి. దేశ రాజధాని ప్రాంతంలో కిలో రూ.75 కి పెరిగిన రిటైల్ టమాటా ధర, దక్షిణాది రాష్ట్రాల నుంచి సరఫరా మెరుగుపడటంతో రాబోయే వారాల్లో తగ్గుతుందని ఓ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది.ధరల పెరుగుదలకు కారణాలు"ఢిల్లీతోపాటు కొన్ని ఇతర నగరాల్లో టమాటా, బంగాళాదుంప, ఉల్లిపాయల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అధిక వర్షపాతం కారణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల వినియోగ ప్రాంతాల్లో ధరలు పెరిగాయి" అని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి పీటీఐకి తెలిపారు. న్యూఢిల్లీలో టమాటా ధర కిలోకు రూ.75కి పెరిగింది. అయితే భారీ వర్షాలు సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించకపోతే తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు.మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, జూలై 12న ఢిల్లీలో రిటైల్ టమాటా ధర కిలోకు రూ.75గా ఉంది. ముంబైలో రూ.83, కోల్కతా రూ.80లుగా టమాటా ధరలు నమోదయ్యాయి. జూలై 12న దేశవ్యాప్తంగా టమాటా సగటు రిటైల్ ధర కేజీకి 65.21 లుగా ఉంది. గత ఏడాది ఇదే సమయంలో ఇది రూ.53.36 ఉండేది.టమాటా ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే..ప్రస్తుతం ఢిల్లీకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి టమాటా సరఫరా అవుతోంది. “ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి హైబ్రిడ్ టమాటాలు దేశ రాజధానికి చేరుకోవడంతో ధరలు తగ్గుతాయి” అని అధికారి తెలిపారు.సబ్సిడీతో కూడిన టమాటా అమ్మకాలను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచించడం లేదు. గత ఏడాది కిలో ధర రూ.110 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చర్యను అమలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక నుంచి సరఫరా మెరుగుపడటంతో 1-2 వారాల్లో ధరలు సాధారణ స్థితికి వస్తాయని అధికారి విశ్వాసం వ్యక్తం చేశారు. -
కాసులు కురిపిస్తున్న టమాట
కోలారు: టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా రైతులకు మార్కెట్లో కాసుల పంట పండుతోంది. రెండు రోజులుగా కోలారు ఏపీఎంసీ మార్కెట్లో 15 కిలోల నాణ్యమైన టమాట బాక్సు ధర రూ.700 పలికింది. టోకు మార్కెట్లో కిలో ధర రూ.45 నుంచి రూ.50 వరకు ఉంది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వేసవి కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గడంతో మార్కెట్కు పెద్దగా సరుకు రావడం లేదు. దీంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీఎంసీ మార్కెట్ యార్డుకు గురువారం 8500 క్వింటాళ్ల టమాట వచ్చింది. గత సంవత్సరం ఇదే సీజన్లో మార్కెట్కు దాదాపు 15 వేల క్వింటాళ్ల దిగుబడి ఉండింది. ఏప్రిల్ నెలలో విపరీతమైన ఎండలు, ప్రస్తుతం కురుస్తున్న వానలకు టమాట దిగుబడి తగ్గుతోందని రైతులు అంటున్నారు. తెగుళ్ల బాధ, వాతావరణ వైపరీత్యం వల్ల కూడా టమాటా దిగుబడి బాగా తగ్గిందని రైతులు అంటున్నారు. వాతావరణంలో మార్పులను చూసి రైతులు కూడా టమాటా సాగుకు విముఖత చూపడం వల్ల దిగుబడి తగ్గిందని ఏపీఎంసీ మార్కెట్ యార్డు సెక్రటరీ విజయలక్ష్మి తెలిపారు. రాబోయే 15 రోజుల్లో మార్కెట్కు టమాట సరఫరా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. టమాట ధరలు రైతులకు లాభాలు కురిపిస్తుండగా వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. -
టమాటా రైతుకు బాసట..
సాక్షి, అమరావతి: ధరలేక సతమతమవుతున్న టమాటా రైతులకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం డిమాండ్కు మించి టమాటా పంట మార్కెట్లకు వస్తుండటంతో గత కొద్దిరోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు సీఎం యాప్ ద్వారా ధరల హెచ్చుతగ్గులను నిరంతరం పరిశీలిస్తూ కిలో రూ. 7 కంటే తక్కువ ధర పలుకుతున్న మార్కెట్లలో జోక్యం చేసుకుంటూ ధరలు నిలకడగా ఉండేలా చూస్తోంది. ఇటీవల టమాటా ధరలు చుక్కలనంటి.. కిలో రూ. 250కు పైగా పలికిన దశలో వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 28 నుంచి మార్కెట్లో జోక్యం చేసుకొని రైతుల నుంచి పెద్ద ఎత్తున టమాటాలను సేకరించి కిలో రూ. 50కే రైతు బజార్లలో విక్రయించింది. ఇలా దాదాపు రెండు నెలల పాటు రైతుల నుంచి సగటున కిలో రూ. 107.50 చొప్పున రూ.14.66 కోట్ల విలువైన 1,364.55 టన్నుల టమాటాలను సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 105 రైతుబజార్ల ద్వారా సబ్సిడీపై వినియోగదారులకు అందించింది. నేడు రైతులకు అండగా నిలిచేందుకు.. గత నెల రోజులుగా ఖరీఫ్ పంట పెద్దఎత్తున వస్తుండటంతో మార్కెట్లో ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ మార్కెట్లతో సంబంధం లేకుండా కిలో రూ. 7 కంటే తక్కువ ధర పలుకుతున్న మార్కెట్లలో జోక్యం చేసుకొని రైతులకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించింది. దీంతో సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తూ ధరల తగ్గిన మార్కెట్లలో జోక్యం చేసుకుంటూ రైతులకు బాసటగా నిలుస్తోంది. నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్ పరిధిలో ధరలు తగ్గుదల నమోదవుతుండటంతో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వ్యాపారులతో పోటీపడి రైతులవద్ద టమాటాలు కొనుగోలు చేశారు. లాభం ఆశించకుండా విక్రయం ఇటీవల ప్యాపిలి మార్కెట్లో కనిష్ట ధర రూ. 6 పలుకగా, అంతకంటే ధర తగ్గకూడదన్న ఆలోచనతో రైతుల వద్ద గడిచిన నాలుగు రోజుల్లో 16 టన్నులు సేకరించి స్థానిక రైతుబజార్లలో నో ప్రాఫిట్–నో లాస్ పద్ధతిన వినియోగదారులకు విక్రయించారు. సీఎం యాప్ ద్వారా ధరల హెచ్చుతగ్గులను పరిశీలిస్తూ ప్రభుత్వ జోక్యం చేసుకుంటుండటంతో సోమవారం ప్రధాన టమాటా మార్కెట్లలో నాణ్యమైన టమాటాకు సైజును బట్టి కిలో కనిష్టంగా రూ. 8, గరిష్టంగా రూ. 16 చొప్పున పలుకుతోంది. మరోవైపు బహిరంగ మార్కెట్లలో కిలో రూ. 11 నుంచి రూ. 24 పలుకుతుండగా, రైతు బజార్లలో కిలో రూ.9 నుంచి రూ. 20 వరకు ధరలు ఉండేలా చూస్తున్నారు. ధరల నిలకడే లక్ష్యం డిమాండ్ మించి పంట మార్కెట్కు వస్తుండటంతో గతకొద్ది రోజులుగా తగ్గుతున్న ధరలను నిలకడగా ఉంచడం ద్వారా రైతులకు బాసటగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీరోజూ ప్రధాన మార్కెట్లలో టమాటా ధరలను సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నాం. కిలో రూ.7 కంటే తక్కువగా పలుకుతున్న మార్కెట్లో జోక్యం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే కిలో రూ. 6 చొప్పున 16 టన్నులు రైతుల నుంచి సేకరించి స్థానిక రైతు బజార్లలో అదే ధరకు విక్రయించాం. ధరల విషయంలో రైతులెవ్వరూ ఆందోళన చెందనవసరం లేదు. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
ఎగిరెగిరి పడ్డ టమాటా.. ఇప్పుడు ఢీలా!
సాక్షి, కర్నూలు జిల్లా: తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావం రాష్ట్రంలో టమాటా ధరలపై పడింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్లోని మార్కెట్లకు టమాటా చేరడం లేదు. దీంతో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా రూ. 4 నుంచి 10 రూపాయలు మాత్రమే పలుకుతోంది. ప్యాపిలి మార్కెట్లోనూ టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. కిలో టమాటా రూ.3 మాత్రమే పలుకుతోంది. ధరలు లేకపోవడంతో టమాటాలను రైతులు మార్కెట్కు ఆరుబయటే పారేసి వెళ్లిపోతున్నారు. పచ్చి పంట కావడంతో ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటాలను రోడ్లపైనే పారబోస్తూ కన్నీరు పెట్టుకుంటున్నారు. కనీస ధర లేకపోవడంతో డోన్ జాతీయ రహదారిపైనే టమాటాలను ఓ రైతు పారబోశాడు. పారబోసిన టమాటాలను పశువులు తింటున్నాయి. రవాణా ఖర్చులు కూడా రావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చి పంట అయినందున ఎక్కడా దాచలేమని రైతులు దిగులు పడుతున్నారు. మొన్నటి వరకు కిలో రూ. 200 వరకు పలికిన కిలో టమాటా ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇప్పటివరకు ఎన్నో ఆశలతో ఉన్న టమాటా రైతులు.. వర్షాలతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయని చెబుతున్నారు. గత రెండు నెలలుగా ఎగిరెగిరి పడ్డ టమాటా ఇప్పుడిలా ఉల్టా కావడం మళ్లీ హాట్ టాపిక్ అయ్యింది. ఇదీ చదవండి: అలా.. ఆంధ్రప్రదేశ్కు బోలెడు అవకాశాలు -
దిగొస్తున్న టమాటా ధర
సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజులుగా వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టమాటా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. టమాటా అధికంగా పండించే ఆంధ్రప్రదేశ్ సహా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల నుంచి సరఫరా పెరగడంతో ధరలు క్రమంగా దిగొస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. గత జూలైలో కిలో ఏకంగా రూ.250 పలికిన టమాటా ధర ప్రస్తుతం రూ.100–120 మధ్యకు చేరుకుందని తెలిపింది. ఈ ధరలు వచ్చే సెపె్టంబర్ రెండో వారానికి సాధారణ స్థాయికి అంటే కిలో రూ.30–40కి చేరుకుంటాయని అంచనా వేసింది. మహారాష్ట్ర నాసిక్లోని పింపాల్గావ్ బస్వంత్ మార్కెట్కు వారం రోజులుగా టమాటా రాక ఆరు రెట్లు పెరిగిందని అధికారులు తెలిపారు. బెంగళూరు వంటి కీలక మార్కెట్లకు కూడా ట మాటా సరఫరా పెరిగింది. ఢిల్లీలో మొన్నటివరకు కిలో రూ.220గా ఉన్న టమాటా ధర శుక్రవారం రూ.100 వరకు పలికింది. -
దిగొస్తున్న టమాట ధరలు
కోలారు: గత కొద్ది రోజులుగా రెక్కలు కట్టుకుని ఆకాశంలో తిరుగుతున్న టమాట ధరలు దిగి వస్తున్నాయి. శుక్రవారం కోలారు ఏపీఎంసీ మార్కెట్ యార్డులో 15 కిలోల బాక్సు టమాట ధర కేవలం రూ.800 పలికింది. దీంతో మొదటి సారిగా 15 కిలోల బాక్సు ధర రూ.1000 లోపునకు దిగి వచ్చినట్లయింది. బుధవారం రూ.1100 ఉన్న బాక్సు టమాట ధరలు ఒకే రోజులో రూ.300 తగ్గడంతో రైతులు అసంతృప్తికి గురవుతుండగా వినియోగదారులకు మాత్రం కాస్త ఊరట లభిస్తోంది. పెరిగిన ధరలతో టమాటలను కొనలేక నానా ఇబ్బండులు పడిన వినియోగదారులకు ఇక మార్కెట్లో టమాటలు కొనడానికి ముందుకు వచ్చే అవకాశం కలిగింది. ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందని రైతులు, మార్కెట్ నిపుణులు, వ్యాపారులు అంటున్నారు. రూ.2700 పలికిన ధర జూలై 31న కోలారు మార్కెట్ యార్డులో టమాట బాక్సు గరిష్ట ధర రూ.ఽ2700 పలికి రికార్డు సృష్టించింది. ధరలు తగ్గడానికి మార్కెట్కు అధికంగా టమాట దిగుబడి అవుతుండడమే కారణమని అంటున్నారు. గత బుధవారం కోలారు మార్కెట్కు 86,091 క్వింటాళ్ల టమాట అంటే 12,913 బాక్సుల టమాట వచ్చింది. జూలై 31న మార్కెట్కు 52,820 క్వింటాళ్ల టమాట వచ్చింది. అంటే గత 10 రోజుల అవధిలో మార్కెట్కు దాదాపు 33 వేల క్వింటాళ్ల టమాట దిగుబడి పెరిగిందని, అందువల్లే టమాట ధరలు తగ్గుముఖం పడుతున్నాయని మార్కెట్ అధికారులు అంటున్నారు. టమాట ధరలు పెరిగిన తరువాత జిల్లాలో దాదాపు ఇటీవల 6 వేల హెక్టార్లలో రైతులు టమాట నాటినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. -
రికార్డు స్థాయిలో కిలో టమోటా రూ.200
-
టమోటా ధరల్లో ఓ సానుకూల కోణం
ఒకప్పుడు రెండు రూపాయలకు కిలో టమోటాలు అమ్మిన రైతులు, ఉన్నట్లుండి లక్షాధికారులుగా మారారు. ఈ సీజన్ లో టమోటా ధరలు పెరగడం వారి అదృష్టాన్ని మలుపు తిప్పింది. మండీలను తరచుగా నిలదీస్తున్నారు కానీ, సంస్కరణలు తప్పవని భావిస్తున్న ఈ వ్యవస్థలోనే రైతులకు అనూహ్యంగా అధిక ధర లభించింది. ఏ ప్రైవేట్ కంపెనీ, లేదా వ్యవస్థీకృత రిటైల్ అవుట్లెట్ కూడా టమోటా రైతులకు అధిక ధర చెల్లించలేదు. భరోసానిచ్చే, లాభదాయకమైన ధరలు వ్యవసాయాన్ని కొత్త శిఖరాలకు చేర్చగలవని ప్రస్తుత ధరల పెరుగుదల మనకు చెబుతోంది. అయితే తుది వినియోగదారు చెల్లించే ధరలో కనీసం 50 శాతం రైతు పొందేలా అధికారులు తప్పక చూడాలి. టమోటా ధరల విపరీత పెరుగుదల వినియోగదారుల్లో ఆగ్రహ ప్రతిస్పందనలను కలిగిస్తోంది. అయితే దీనికి ఒక ప్రకాశవంతమైన కోణం ఉంది. ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లకు చెందిన వందలాది టమోటా రైతులు లక్షాధికారులుగా మారారు. ఈ సీజన్ లో టమోటా ధరలు బాగా పెరగడం వారి అదృష్టాన్ని మలుపు తిప్పింది. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో జున్నర్లో 12 ఎకరాల్లో టమోటా సాగు చేసిన తుకారాం భాగోజీ గాయ్కర్ అనూహ్యంగా ఆదాయం పెరిగిన వారిలో ఒకరు. ఒక నెలలో 13,000 టమోటా బుట్టలను (ఒక్కోదాన్లో 20–22 కిలోలుంటాయి) విక్రయించి, రూ.1.5 కోట్లకు పైగా సంపాదించారు. కొద్ది రోజులుగా తుకారాం మీడియాలో సంచ లనంగా మారారు. అన్నింటి కంటే మించి, కనీస జీవితావసరాలు తీరడానికి కష్టపడుతున్న ఒక వ్యవసాయ కుటుంబానికి ఇంత సౌభాగ్యం కలగడం అత్యంత ఆహ్వానించదగినది. కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన ఒక టమోటా రైతు 2,000 బుట్టల టమోటాలను విక్రయించి, ఒక రోజులో రూ. 38 లక్షలు సంపాదించాడని వార్తలు వచ్చాయి. అతని కుటుంబం కొన్ని దశాబ్దా లుగా సుమారు 40 ఎకరాల్లో టమోటాలు సాగు చేస్తోంది. అయితే ఈసారి అతను సాధించిన ధరలు మునుపటి రికార్డులను అధిగమించాయి. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ టమోటా రైతు రూ.30 లక్షలు సంపాదించాడు. హిమాచల్ ప్రదేశ్లోని సోలన్, సిర్మోర్, కులు జిల్లాల్లో టమోటా ధరలు విపరీతంగా పెరగడం వేలాదిమంది టమోటా సాగుదారులకు ఆశీర్వాదంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. సోలన్ మార్కెట్లో, నాణ్యమైన ఆపిళ్లకు ఈ సీజన్ లో రైతులకు లభించే సగటు ధరను టమోటా ధరలు దాటేశాయి. కిలో ఆపిల్ రూ.100 ఉండగా, టమోటా రైతులకు కిలో రూ.102 వరకు పలికింది. గతేడాది కొన్ని రోజుల్లో వీటి ధర బుట్టకు రూ.5 నుంచి రూ.8 ఉండగా, ఇప్పుడు ఒక్కో బుట్ట రూ.1,875 నుంచి రూ.2,400 (కిలో రూ. 90–120) పలికింది. ఇప్పుడు, రైతులు కోటీశ్వరులు కావడం సులభమని మీరు తప్పుడు అభిప్రాయానికి వచ్చే ముందు, అధిక రిటైల్ ధరను రైతు లకు బదిలీ చేసిన అరుదైన సందర్భాలలో ఇదొకటి అని నేను స్పష్టం చేస్తున్నాను. కొన్ని నెలల క్రితమే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో టమోటాలను పశువులకు తినిపించినట్లు, లేదంటే వాగులలో పారబోసినట్లు వార్తలు వచ్చాయి. టమోటా ధరలు పెరగక ముందు, జూన్ ప్రారంభంలో కూడా మహారాష్ట్ర రైతులు కిలోకు 2 రూపాయల ధరను కూడా చూడలేకపోయారు. వ్యవసాయ రంగ దుఃస్థితి ఒక మినహాయింపుగా కాకుండా సాధారణంగా ఉంటూ వస్తోంది. హరియాణాలోని భివానీ జిల్లాలో 42 ఎకరాల్లో టమోటా సాగు చేస్తున్న ఓ ప్రగతిశీల రైతు ఈ అవకాశాన్ని కోల్పోయానని విచారం వ్యక్తం చేస్తున్నాడు. ‘నాలుగు నెలల తక్కువ ధరల తర్వాత, నేను దాదాపు రూ. 8–10 లక్షల నష్టంతో సుమారు రెండు నెలల క్రితం నా మొత్తం పంటను పీకేశాను. జూన్ మధ్య తర్వాత ధరలు విపరీతంగా పెరుగుతాయని నాకు తెలిసి ఉంటే, నేను కచ్చితంగా చాలా డబ్బు సంపాదించి ఉండేవాడిని’ అని రమేష్ పంఘాల్ నాతో అన్నారు. ‘నా అదృష్టం బాలేదు’ అని వాపోయారు. అదృష్టదేవత వరించిన కొద్ది మంది కంటే ఎక్కువ సంఖ్యలో రైతులు ఈ అపూర్వమైన టమోటా ధరలను అపనమ్మకంతో చూస్తున్నారని ఇది తెలియజేస్తోంది. ఈ అనిశ్చిత విజయాలను అలా పక్కనుంచి, విపరీతమైన ధరల పెరుగుదల నుండి కొన్ని ముఖ్యమైన పాఠాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. బహుశా, ఇది ప్రధానంగా వ్యవసాయ కష్టాల తీవ్రతకు దారితీసిన ఆధిపత్య ఆర్థిక ఆలోచనను సంస్కరించడానికి సహాయపడుతుంది. వినియోగదారులకు టమోటా ధరలు స్థిరంగా పెరిగాయని మనం అంగీకరిస్తున్నప్పటికీ, తక్కువ ధరలు దశాబ్దాలుగా కోట్లాదిమంది వ్యవసాయదారుల జీవనోపాధి మీద బలమైన దెబ్బ కొట్టాయని గ్రహించాలి. వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా దారిద్య్రంలో ఉంచారని నేను ఎప్పుడూ అనుకుంటాను. సాధారణంగా ముద్ర వేసిన విధంగా రైతులు అసమర్థులు కాదు కానీ వారు తప్పుడు స్థూల ఆర్థిక విధానాల బాధితులుగా ఉండిపోయారు. రైతులకు ఆర్థికంగా లాభదాయకమైన జీవనోపాధిని నిరాకరిస్తూ వచ్చారు. టమోటా సాగు విషయానికి వస్తే – రైతులు అధిక దిగుబడినిచ్చే అన్ని పద్ధతులనూ చేపట్టారు. ఇందులో భాగంగా అత్యంత ఖరీదైన హైబ్రిడ్ విత్తనాలను కొనుగోలు చేశారు. ఇవన్నీ ప్రమోట్ చేసిన సాగు ఆచరణల ప్యాకేజీలో భాగం. రైతులకు విక్రయిస్తున్న ప్రతి సాంకేతికత కూడా ఉత్పాదకతను పెంచుతుందనీ, తద్వారా అధిక ఆదాయాన్ని ఇస్తుందనీ వాగ్దానం చేస్తుంది. కానీ అది జరగలేదు. దీనికి విరుద్ధంగా రైతు సాంకేతిక ఇన్పుట్లను ఉపయోగిస్తాడు, కష్టపడి కుటుంబ శ్రమను వెచ్చించి రికార్డు స్థాయిలో పంటను పండిస్తాడు, తీరా మార్కెట్ ధరలు పడిపోయాయని తెలుసుకుంటాడు. రైతు పొందిన ధర తరచుగా పెట్టుబడి ఖర్చును కూడా తీసుకురాదు. బిజినెస్ మేనేజ్మెంట్ పాఠశాలలు తరచుగా సమర్థమైన వ్యవ సాయ సరఫరా గొలుసులలో భాగం కానందుకు రైతులను నింది స్తున్నాయి. టమోటా రైతు, ఆ మాటకొస్తే ఇతర రైతులూ విలువ జోడింపు చేస్తే తప్ప సహేతుకమైన లాభాలు పొందలేరు. అందుకే వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీలను (ఏపీఎంసీ) విస్మరించి, కార్పొరేట్ నిచ్చెన మెట్ల పైకి వెళ్లాలని అంతర్లీనంగా ఉద్ఘాటిస్తున్నారు. వ్యవసాయాన్ని సంపద్వంతం చేయడానికి వ్యవసాయాన్ని మరింత సరళీకరించడం, ప్రైవేటీకరించవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచు కుని నీతి ఆయోగ్ ఇటీవల ఒక కార్యాచరణ పత్రాన్ని విడుదల చేసింది. అయితే వ్యవసాయ విధానాలను మనం అరువుగా తెచ్చు కున్న అమెరికాలో కూడా, వ్యవసాయ కార్పొరేటీకరణ వ్యవసాయ ఆదాయాలను పెంచడంలో సహాయపడలేదని నీతి ఆయోగ్ గ్రహించడం లేదు. వ్యవసాయ సంక్షోభానికి సమాధానం ఎక్కడో ఉందని వెల్లువె త్తుతున్న టమోటా ధర చెబుతోంది. ఏపీఎంసీ – మండీ వ్యవస్థను తరచుగా నిలదీస్తున్నారు కానీ సంస్కరణలు తప్పవని భావిస్తున్న ఈ వ్యవస్థలోనే రైతులకు అనూహ్యంగా అధిక ధర లభించింది. ఏ ప్రైవేట్ కంపెనీ, లేదా వ్యవస్థీకృత రిటైల్ అవుట్లెట్ కూడా టమోటా రైతుకు అధిక ధర ఇవ్వలేదు. అదేవిధంగా, ఈ సీజన్లో లాభపడిన కొంతమంది టమోటా సాగుదారుల సంపద సమర్థమెన సరఫరా గొలుసుల ద్వారా పెరగలేదు. ఇదంతా పూర్తిగా ధరలపై ఆధారపడి ఉంది. భరోసానిచ్చే, లాభదాయకమైన ధరలు వ్యవసాయాన్ని కొత్త శిఖరాలకు చేర్చ గలవని ప్రస్తుతం టమోటా ధరల ఆకస్మిక పెరుగుదల మనకు చెబు తోంది. రెండు సీజన్లలో అటువంటి అధిక ధరలు లభించినట్లయితే, మీరు సంపన్నమైన టమోటా సాగుదారులకు చెందిన కొత్త తరగతి ఆవిర్భావాన్ని చూస్తారు. ధరలు నిర్దిష్టం కంటే తగ్గకుండా ఉండేలా కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేస్తున్నప్పుడు, తుది వినియోగదారు చెల్లించే ధరలో కనీసం 50 శాతం రైతులు పొందేలా అధికారులు తప్పక చూడాలి. రైతులను బతికించాలంటే అధిక ధర చెల్లించడం అత్యవశ్యం అని వినియోగదారులు గ్రహించాల్సిన సమయం ఇది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
ఆపిల్ ధర మించిపోయిన టమాటా
భారత దేశ చరిత్రలో టమాటా ధరలు టాప్ లేచిపోయాయి. టమాటాల చరిత్రలో మార్కెట్లో మంగళవారం అత్యధిక ధర పలికాయి. మంగళవారం మార్కెట్లో 30 కిలోల టమాటా ధర రూ.4,200 ధర పలికింది. కిలో టమాటా ధరలు రూ.140 వరకు ఽవేలం పాటలో వ్యాపారులు పాడుకొన్నారు. దేశంలో ఆపిల్ ధరలు అత్యధికంగా ఉండగా ఆపిల్ను అధిగమించి ఈరోజు టమాటాలు మార్కెట్లో మొదటిస్థానంలో నిలిచాయి. ఒక క్రీట్ టమాటా ధర ఇంచుమించుగా ఒక గ్రాము బంగారం ధరకు సమానంగా ఉండడం చరిత్రలో ఇదే మొదటిసారని రైతులు చర్చించుకోవడం గమనార్హం గుర్రంకొండ: అన్నమయ్య జిల్లాలో సాగు చేసిన టమాటాలకు దేశంలో అత్యధికంగా ధర పలికింది. మంగళవారం మదనపల్లె, గుర్రంకొండతో పాటు జిల్లాలోని పలు మార్కెట్యార్డుల్లో టమాటా ధరలు అత్యధికంగా కిలో రూ.140 వరకు పలికాయి. 30 కిలోల టమాటా ఽక్రీట్ ధర రూ.4200 వరకు ధర పలికాయి. దీంతో రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో టమాటా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ఓవైపు అధిక వర్షాలు, మరోవైపు వైరస్, ఇతర రోగాలతో పలు రాష్ట్రాలలో టమాటా తోటలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జిల్లాలో ముఖ్యంగా పడమటి ప్రాంతాలైన (పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె) నియోజకవర్గాల్లో ఎంతో కొంత టమాటా దిగుబడి వస్తోంది. వారం రోజుల క్రితం వరకు టమాటా ధర క్రీట్ రూ.3500 నుంచి రూ.3800 వరకు ధరలు పలికాయి. మంగళవారం నిర్వహించిన వేలం పాటల్లో టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటడంతో అందరూ ఆశ్చర్య పోయారు. టమాటా పంట దిగుబడి రోజు రోజుకు తగ్గిపోతుండడంతో మార్కెట్లో ధరలు భగ్గుమంటున్నాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ► జిల్లా మొత్తం మీద 945 క్వింటాళ్ల టమాటాలు మార్కెట్లోకి వచ్చాయి. మొదటి రకం కిలో టమాటా ధర రూ. 140 కాగా రెండవ రకం కిలో రూ.110, మూడవ రకం కిలో రూ. 80 వరకు ధర పలకడం విశేషం. బయట రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు జిల్లాకు తరలివచ్చి ఇక్కడ మకాం వేశారు. మార్కెట్లో టమాటాలను కొనుగోలు చేసి వారి రాష్ట్రాలకు ఎగుమతి చేసుకొంటున్నారు. దేశంలో ఆపిల్ ధరల కంటే టమాటా ధరలు మించిపోవడం గమనార్హం. మార్కెట్లో టమాటాల డిమాండ్ ను బట్టి చూస్తే రాబోయే రోజుల్లో టమాటాల క్రీట్ధర రూ.5000 వరకు ధర పలుకుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నారు. మార్కెట్లో అత్యధిక ధరలు ఇవే .. దేశ చరిత్రలో టమాటా మార్కెట్లో అత్యధికంగా మంగళవారం టమాటా ధరలు పలికాయి. కిలో టమాటా రూ. 140 వరకు ధర పలికాయి. 30కిలోల టమాటా క్రీట్ ధర అత్యధికంగా రూ. 4200 వరకు ఽవేలం పాటలో వ్యాపారులు పాడుకొన్నారు. ఇంత పెద్ద ఎత్తున టమాటా ధరలు పెరగడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా టమాటా దిగుబడి భారీగా తగ్గిపోయింది. అదే సమయంలో మన జిల్లాలో సాగు చేసిన టమాటాలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది. బయట రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి టమాటాలను కొనుగోలు చేసి వారి రాష్ట్రాలకు ఎగుమతి చేసుకొంటున్నారు. టమాటా దిగుబడి పెరిగితేనే మార్కెట్లో ధరలు తగ్గే అవకాశముంది. – జగదీష్, మార్కెట్ కమిటీ కార్యదర్శి, వాల్మీకిపురం -
ధరల మంట.. టమాటాలతో తులాభారం.. కూతురు మొక్కు తీర్చుకున్న వ్యాపారి
సాక్షి, అనాకపల్లిటౌన్: గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ ఆవరణలో ఆదివారం వినూత్నరీతిలో తులాభారం నిర్వహించారు. వ్యాపారవేత్త మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతులు తమ కుమార్తె భవిష్యకు తులాభారం వేస్తామని అమ్మవారికి గతంలో మొక్కుకున్నారు. టమాటాలు, బెల్లందిమ్మలు, పంచదార 51 కిలోల చొప్పున తులాభారం వేసి అమ్మవారికి సమర్పించారు. వీటితోపాటు జీడిపప్పు, కిస్మిస్ కూడా అందజేశారు. ఆలయ ఈవో బండారు ప్రసాద్, ఆలయ అర్చకులు శ్రీను, ఆలయ సిబ్బంది తులాభారం కార్యక్రమంలో పాల్గొన్నారు. టమాట ధరల మంటతో జనం అల్లాడుతున్న సంగతి తెలిసిందే. టమాటాల తులాభారం అనేసరికి ఈ వార్త వైరల్గా మారింది. (చదవండి: టమాట కేజీ రూ. 300?.. ఎందుకంటే..) -
టమాటా ధర కిలో రూ.80
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే కిలో రూ.250 దాకా పలికిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం దేశంలో సగటు ధర కిలోకు రూ.117గా ఉంది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీపై టమాటాలు విక్రయిస్తోంది. పలు నగరాల్లో కొన్ని రోజులపాటు కిలో రూ.90కి విక్రయించగా, ఆదివారం నుంచి రూ.80కే అందుబాటులోకి తీసుకొచి్చంది. భారత జాతీయ సహకార వినియోగదారుల సంఘం(ఎన్సీసీఎఫ్), భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సంఘం(నాఫెడ్) ద్వారా ప్రభుత్వం టమాటాలను రాయితీపై విక్రయిస్తోంది. ప్రభుత్వ జోక్యంతో రిటైల్ మార్కెట్లో టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయని అధికార వర్గాలు చెప్పాయి. ఆదివారం ఢిల్లీ, నోయిడా, లక్నో, కాన్పూర్, వారణాసి, పాట్నా తదితర నగరాల్లో కిలో టమాటాలు రూ.80 చొప్పున విక్రయించారు. సోమవారం నుంచి మరికొన్ని నగరాల్లో ఈ రాయితీ ధరతో టమాటాలను విక్రయించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో బహిరంగ మార్కెట్లో టమాటా కిలో రూ.178, ముంబైలో రూ.150, చెన్నైలో రూ.132 చొప్పున పలుకుతోంది. సాధారణంగా జూలై–ఆగస్టు, అక్టోబర్–నవంబర్లో టమాటా ధరలు పెరుగుతుంటాయి. ఈసారి వర్షాలు ఆలస్యం కావడం వల్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి, కర్ణాటకలోని కోలార్, మహారాష్ట్రలోని సంగనేరీ నుంచి కేంద్ర ప్రభుత్వం టమాటాలను సేకరిస్తోంది. -
టమాటల కోసం ఏపీ వైపు కేంద్రం చూపు
ఢిల్లీ: సెంచరీతో మొదలైన ధరల పరుగు.. కిందకు దిగి రావడం లేదు. ఎప్పుడో నెల కిందట.. వారం, పదిరోజుల్లో ధరలు నియంత్రణకు వస్తాయని కేంద్రం ప్రకటించింది. సరిగ్గా అదే సమయంలో భారీ వర్షాలు పెద్ద దెబ్బే వేశాయి. ప్రియమైన టమాటతో పాటు ఇతర కూరగాయల రవాణా నిలిచిపోయి.. ధరల మంట ఇంకా రుగులుతోనే ఉంది. ఈ టైంలో ప్రత్యామ్నాయాల వైపు కేంద్రం అడుగులు వేస్తోంది. టమాట ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం ఓ ఆలోచన చేసింది. ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటాలను సేకరించి.. అధిక ధరల ప్రాంతాలకు సరఫరా చేయాలని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, నేషనల్ కో ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్లను వినియోగదారుల వ్యవహారాల శాఖ కోరింది. మన దేశంలో ప్రతీ రాష్ట్రంలో టమాట పండిస్తారు. డిసెంబర్-ఫిబ్రవరి టమాటకు మాంచి సీజన్కాగా.. జులై-ఆగష్టు, అక్టోబర్-నవంబర్ మధ్య పంట ఉత్పత్తి కాస్త తక్కువే ఉంటుంది. అయితే.. దేశం మొత్తం ఉత్పత్తిలో 60 శాతం దక్షిణ, పశ్చిమ భారతం నుంచే అవుతుంటుంది. ఇక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకూ ఒక్కోసారి సరఫరా అవుతుంటుంది కూడా. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి టమాటలు దేశానికి ఎక్కువగా సరఫరా అవుతున్నాయి. ఢిల్లీ.. సమీప ప్రాంతాలకు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక నుంచి సరఫరా అవుతున్నాయి. ఏపీలో మదనపల్లె మార్కెట్ టమాట ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే ఏపీలో ప్రభుత్వ సబ్సిడీ మీద టమాటలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంతేకాదు.. బ్లాక్ మార్కెట్ను కట్టడి చేయడంలోనూ ఏపీ ప్రభుత్వం విజయవంతమవుతోంది. అధిక ధరలతో పాటు వినియోగదారుల ఉత్పత్తిని సైతం పరిగణనలోకి తీసుకుని.. ఆయా కేంద్రాలకు టమాటాలను తరలించాలని ఆయా ఫెడరేషన్లకు వినియోగదారుల వ్యవహారాల శాఖ సూచించింది. ఇక ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో టమాటా ఉత్పత్తులు చేరుకోవడంతో.. శుక్రవారం నుంచి ధరలు అదుపులోకి రానున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. -
వామ్మో! టమాటా.. కిలో రూ.140
అన్నమయ్య : రోజురోజుకీ పెరుగుతున్న టమాటా ధరలు మంగళవారం ఏకంగా ఆకాశాన్ని తాకాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ పలకనంతగా మొదటిరకం టమాటా కిలో రూ.140 ధర పలికి ఆల్టైమ్ రికార్డ్ సృష్టించింది. గత శుక్రవారం మార్కెట్లో నమోదైన కిలో రూ.124 ధర అత్యధికమని ఇప్పటివరకు భావిస్తుంటే, మంగళవారం దాన్ని తలదన్నేలా కిలో రూ.140కు చేరుకోవడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పెరుగుతున్న టమాటా ధరలతో రైతులు ఆనందపడుతున్నప్పటికీ, వినియోగదారులు మాత్రం ఆచితూచి కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. మదనపల్లె మార్కెట్లో వారంరోజుల టమాటా ధరలను పరిశీలిస్తే సరిగ్గా 13 రోజుల క్రితం మొదటిరకం టమాటా కిలో రూ.38 ధర పలికి.. రోజురోజుకూ ఊహించనిరీతిలో పెరిగి రూ.140కు చేరుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశంలో టమాటా పండించే రాష్ట్రాల్లో పంట దిగుబడులు లేకపోవడంతో అందరిచూపు ఏడాది పొడవునా క్రయవిక్రయాలు జరిగే మదనపల్లె మార్కెట్వైపు పడింది. బయటి రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లెలో మకాం వేసి వచ్చిన సరుకు వచ్చినట్లుగా కొనేస్తుండటంతో పోటీపెరిగి ధరలు పెరిగాయి. దీనికితోడు దిగుబడులు తగ్గిపోవడం, వర్షాలతో పంటకు నష్టం వాటిల్లుతుండటంతో టమాటాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్ నుంచి ఢిల్లీ, చత్తీస్గడ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు సరుకు ఎగుమతి అవుతోంది. మార్కెట్కు సోమవారం రైతులు తీసుకువచ్చిన టమాటాకు మొదటిరకం కిలో రూ.104 ధర పలికితే మరుసటిరోజు మంగళవారం ఏకంగా కిలోపై రూ.36 పెరిగి రూ.140కు చేరుకుంది. మార్కెట్లో టమాటా ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో పలు మార్కెట్యార్డులో వేలంపాటల్లో రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేస్తోంది. వాటిని రైతుబజార్లకు తరలించి రాయితీధరపై కిలో రూ.50కు అమ్మేలా చర్యలు తీసుకుంది. -
టమాటా ధరలపై పేలుతున్న మీమ్స్, ట్రోల్స్.. మీరూ ఓ లుక్కేయండి
టమాటా ధరలు ఆకాశంలో ఉండి ఆందోళన కలిగిస్తున్న మాట ఎలా ఉన్నా, చేతికి చిక్కని, అందనంత ఎత్తులో ఉన్న టమాటపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న మీమ్స్ కడుపుబ్బా నవ్విస్తూ వైరల్ అవుతున్నాయి. అవేంటో చూసేయండి.. ‘మా ప్రేమని టమాటాలతో కొనలేరు’ అంటాడు ఒక ప్రేమికుడు. పోజ్ కొడుతున్న టమాటాను ఉద్దేశించి సాటి కూరగాయలు ఇలా అంటాయి... ‘నడమంత్రపు సిరి అంటే ఇదే’ మరో మీమ్లో... పరుగు పందెంలో డీజిల్, పెట్రోల్లతోపాటు టమాట కూడా పాల్గొని నెంబర్వన్ స్థానంలో నిలిచి కాలరెగరేస్తోంది. ఉల్లిగడ్డ... కోస్తేనే కన్నీళ్లు వస్తాయి. అదేమిటో... టమాట పేరు వింటేనే కన్నీళ్లు వస్తున్నాయి. Ek tamatar ki keemat tum kya jano, Ramesh Babu!!#TomatoPrice pic.twitter.com/ViZMVtaF7W — Sandhya Bhadauria (@Okk_Sandhya) June 27, 2023 Returning home with 2kg tomato#TomatoPrice pic.twitter.com/TH1oSEaELl — Thanos Pandit™ (@Thanos_pandith) June 27, 2023 #TomatoPrice keep running pic.twitter.com/Q2WmxttRkZ — varsha roshan (@RoshanVars79963) June 27, 2023 #TomatoPrice hike, Say it like Nimmo Tai 😎 pic.twitter.com/GmKJKR74vs — United India 🇮🇳 (@Unitedd_India) June 27, 2023 Tomato prices are skyrocketing across the country. Even a simple dish like rasam has become costly. But what is causing this price hike?#tomato #tomatopricehike #climatechange #delayedrainfall #heavyrainfall #heatwave #newswithnavya pic.twitter.com/RjgsJEHMxB — Navya Singh (@newswithnavya) July 2, 2023 #TomatoPrice pic.twitter.com/3YA3eYeg1I — Sri Rama Chandra Murthy YV (@yvsrc_murthy) July 4, 2023 #TomatoPrice pic.twitter.com/ITKLb1ONiN — Nala Ponnappa (@PonnappaCartoon) July 3, 2023 -
సెంచరీ దాటిన కిలో టమాట ధరలు.. కారణమిదే!
కూరగాయల ధరలు మండుతున్నాయి. సామాన్యులకు అందనంతా దూరంగా రేట్లు పెరిగిపోయాయి. మార్కెట్లో ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి పైనే చెబుతున్నారు. ప్రధానంగా టమాట సెంచరీ కొట్టగా.. పచ్చిమిర్చి రేటు ఘాటెక్కింది. గతకొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా టమాట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు టమాట తోటలు దెబ్బతిని దిగుబడి తగ్గింది. తద్వారా 10 రోజులుగా ధరలు ఏ మాత్రం తగ్గకపోగా.. పైపెచ్చు పెరుగుతున్నాయి. ధరలు ఎగబాకుతుండటంతో రైతులకు గిట్టుబాటు అవుతుండగా.. వినియోగదారులను ఠారెత్తిస్తున్నాయి. కిలో టమాట రూ.100 హోల్సేల్ మార్కెట్లో కిలో నాణ్యమైన టమాట రూ. 80, రీటైల్ మార్కెట్లో కిలో రూ. 100కు మించి పలుకుతోంది. వారం క్రితం వరకు కిలో టమాట రూ. 20 నుంచి 30 ఉండగా ప్రస్తుతం రూ.80 నుంచి 120కి వెళ్లింది. అయితే అనిశ్చిత వాతావరణ పరిస్థితుల కారణంగా టమాట సరఫరాపై ప్రభావం చూపడంతో ధరలు అకస్మాత్తుగా పెరిగాయని వ్యాపారాలు చెబుతున్నారు. వర్షాలతో తగ్గిన దిగుబడి దేశంలో టమాటా సాగు ఎక్కువగా ఉంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, గుజరాత్ మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు, వరదలతో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో సరాఫరా తగ్గిపోయింది. మార్కెట్కు వస్తున్న టమాట దిగుబడి తగ్గడం, వానలు, తెగుళ్ల కారణంగా పలుచోట్ల టమాట తోటలను నాశనం చేయడం కూడా కారణంగా మారింది. ముఖ్యంగా టమాటా సాగు అధికంగా ఉండే కర్ణాటకలోని బెంగళూరు రూరల్, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర్, కోలార్, రామనగర జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. రానున్న రోజుల్లో టమాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతకుముందు వేసవిలో అధిక ఎండలతో ఉత్పత్తి తగ్గిపోవడం కూడా ధరలు పెరుగుదలకు ఓ కారణమని రైతులు పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల ఈ ఏడాది తక్కువ టమోటాలు మొక్కలు నాటినట్లు రైతులు చెబుతున్నారు. గత నెలలో టమాట ధరలు పతనమవ్వడం, బీన్స్ ధరలు బాగా పెరగడంతో చాలా మంది రైతులు బీన్స్ సాగుకు మారినట్లు పేర్కొన్నారు. ఇక ఉత్తరప్రదేశ్లోని స్థానిక మార్కెట్లలో వారం క్రితం కిలో టమాట రూ. 40 నుంచి 50 వరకు విక్రయించగా..ఇప్పుడు కిలో రూ. 100కి అమ్ముతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కిలో రూ. 80కి విక్రయిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్లలో కిలో టమాట ధర రూ.100కి చేరుకుంది. అటు ముంబయిలోనూ రిటైల్ ధర రూ.100కు చేరుకుంది. ఇతర కూరగాయలు కూడా టమాట కాకుండా ఇతర కూరగాయలైన బెండ, కాకర, దొండ, వంకాయ, దోస, బీర, ఆలుగడ్డ, మునగ, గోకరతో పాటుగా ఆకుకూరలు ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కూరగాయలు కొనలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జేబులకు చిల్లులు: ప్రజలు పెరిగిన ధరలతో కూరగాయాలు కొనలేకపోతున్నామని పేద, మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. మార్కెట్కు వెళ్లి కూరగాయల ధరలు వింటేనే భయమేస్తుందని, ఏ కూరగాయ ధర అడిగినా కిలో రూ. 50కి తక్కువగా చెప్పడం లేదని పేర్కొన్నారు.. పచ్చిమిర్చి, టమాటలు తప్పనిసరి పరిస్థితుల్లో కొనాల్సి వస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కూరగాయల ధరలతో పోలిస్తే పప్పులే నయం అన్న భావన కలుగుతుందంటున్నారు. రైతుల్లో సంతోషం టమాట ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పడించిన పంటకు గిట్టుబాటు ధర లభించడంతో సంతోషిస్తున్నారు. మార్కెట్లో 15 కిలోల బాక్సు రూ. వెయ్యికి విక్రయిస్తున్నట్లు నాణ్యత బాగుంటే ధర మరింతగా ఉంటుందని చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఇలాంటి ధరలు రావడం ఆనందంగా ఉంటుందంటున్నారు. 15 రోజుల క్రితం రూ.30, రూ.40 15 రోజుల క్రితం పచ్చిమిర్చి ధర కిలో రూ.30 నుంచి రూ.40 వరకు, టమాట కిలో రూ.40 మాత్రమే ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో అయితే టమాట రెండు కిలోలు రూ.10 విక్రయించారు. మిగతా కూరగాయల ధరలు కూడా పదిరోజుల క్రితం కిలో రూ.30 నుంచి రూ.40 వరకు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం వాటి ధరలు కూడా రెండింతలు కావడంతో సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఆకుకూరలు కూడా ఏ రకమైనా గతంలో రూ.10కి 4 కట్టలు వచ్చేవి.. ఇప్పుడు రూ.20 నుంచి రూ.30కి 4 కట్టలు ఇస్తున్నారు. -
మార్కెట్లో భారీగా పతనమైన టమాట ధరలు
సాక్షి, గుర్రంకొండ (అన్నమయ్య జిల్లా): మార్కెట్లో టమాట ధరలు భారీగా పతనమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో అత్యధికంగా రూ.15 వరకు పలుకుతోంది. వారం రోజుల్లో సగానికిపైగా తగ్గిపోయాయి. బయట రాష్ట్రాల్లో టమాట దిగుబడి ప్రారంభం కావడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల క్రితం కిలో రూ. 36 ఉండేది. ఈసీజన్లో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 14వేల ఎకరాల్లో టమాట సాగు చేశారు. పదిహేనురోజుల కిందట 25 కేజీల క్రీట్ రూ. 900 నుంచి రూ.750 వరకు ధర పలికింది. ప్రస్తుతం వారం రోజులుగా మార్కెట్లో 15కేజీల టమాటా క్రీట్ ధర రూ. 185 కాగా 25కేజీల క్రీట్ ధర రూ. 375 వరకు పలుకుతున్నాయి. ప్రస్తుతం మొదటిరకం టమాటాకిలో రూ.15, రెండోరకం కిలోరూ.8, మూడో రకం రూ.5 వరకు ధరలు పలుకుతున్నాయి. ఇక్కడి నుంచి మార్కాపురం, నరసరావుపేట, విజయవాడ, గుంటూరు, తమిళనాడు, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్లకు ఇక్కడి టమాటాలను ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దిగుబడులు ఊపందుకున్నాయి. అక్కడి మార్కెట్లో 25కేజీల క్రీట్ ధర రూ. 300 వరకు మాత్రమే ధరలు పలుకుతున్నాయి. దీంతో ఇక్కడి నుంచి ఎగుమతి చేసే టమాట ధరలు పతనం కావడంతో వ్యాపారులు నష్టాలు చవిచూస్తున్నారు. దీంతో బయట రాష్ట్రాలకు ఎగుమతులు నిలిపివేశారు. మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా తగ్గు ముఖం పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఊరటనివ్వని టమాట!
బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లాలోని దక్షిణ ప్రాంతం టమాట సాగుకు పెట్టింది పేరు. దేశంలోనే అత్యధిక టమాట సాగు చేసే ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు టమాట ఎగుమతులు అవుతాయి. జిల్లాలో అత్యధికంగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో సాగవుతుంది. ఈ నియోజకవర్గంలో 9,044 హెక్టార్లలో, పీలేరు నియోజకవర్గంలో 4,117 హెక్టార్లలో, మదనపల్లె నియోజకవర్గంలో 3,240 హెక్టార్లలో టమాట సాగవుతోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో 41,002 ఎకరాల్లో టమాట ఏడాది పొడవునా సాగులో ఉంటుంది. ఈ నేపథ్యంలో టమాట దిగుబడి భారీగా పెరిగి, ధరలపై ప్రభావం చూపుతోంది. దీనికితోడు సరిహద్దు కర్ణాటకలోని శ్రీనివాసపురం, చింతామణి, కోలారు, ముళబాగిలు, బాగేపల్లె నియోజకవర్గాల్లో టమాట దిగుబడులు మొదలు కావడంతో జిల్లా టమాట ధరలపై ప్రభావం చూపుతోంది. మదనపల్లె, ములకలచెరువు, అంగళ్లు, గుర్రంకొండ, కలికిరి టమాట మార్కెట్లలోనూ ధరల తగ్గుదల నెలకొంది. మదనపల్లె మార్కెట్లో గురువారం కిలో టమాట మొదటి రకం రూ.8.40–10, రెండో రకం రూ.5.00–8.20 మధ్యన పలికింది. దిగుబడి ప్రభావమే మూడు నియోజకవర్గాల్లో పెరిగిన టమాటకు అదనంగా అనంతపురం జిల్లా, కర్ణాటకలో దిగుబడులు మొదలయ్యాయి. దీనితో టమాట పంట రెండువైపులా విక్రయానికి వస్తోంది. అలాగే అనంతపురం జిల్లాలో టమాట మార్కెట్లు ఆగస్టు 15 తర్వాత ప్రారంభమవుతాయి. ఈసారి జూలై మొదటి వారంలోనే మార్కెట్లు ప్రారంభమై, విక్రయాలు సాగుతున్నాయి. ట్రేడర్లు ఇక్కడికి కూడా వెళ్లి టమాట కొంటున్నారు. దిగుబడి పెరగడం, ఇతర చోట్ల మార్కెట్లు ప్రారంభం వల్ల ధరలు తగ్గాయి. ఏడు రాష్ట్రాలకు ఎగుమతులు మదనపల్లె టమాట మార్కెట్ నుంచి గురువారం ఏడు రాష్ట్రాలకు టమాట ఎగుమతి అయ్యింది. ఒక్కరోజే 1,269 మెట్రిక్ టన్నుల టమాట విక్రయానికి వచ్చింది. ఈ టమాటలో 60శాతం తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కొత్తగూడెం, వరంగల్, మహరాష్ట్రలోని నాగ్పూర్, ఛత్తీస్గఢ్లోని రాయపూర్, జగదల్పూర్, విహిల్, అంబికాపూర్, బవోదాబాద్, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్, జబల్పూర్, పశ్చిమబెంగాల్లోని కోల్కతా, గుజరాత్లోని జోధ్పూర్, రాజ్కోట్, అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, కాన్పూర్, దేశ రాజధాని ఢిల్లీకి ఎగుమతి అయ్యింది. 40శాతం టమాట రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, కాకినాడ, తుని, నర్సీపట్నం, అనకాపల్లె, కంచిలి, ఏలూరులకు ఎగుమతి అయ్యింది. అమావాస్య ప్రభావం కూడా గురువారం అమావాస్య కావడంతో తెలంగాణ మార్కెట్లు మూతబడ్డాయి. ఇదికూడా ధర తగ్గడానికి కొంత కారణం అయినప్పటికీ ఇప్పడు వస్తున్న దిగుబడిలో నాణ్యత తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. దీనివల్ల ధరలు కొంతమేర తగ్గుతున్నట్టు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలో వచ్చేనెలలో మార్కెట్లు ప్రారంభమై ఉంటే ధరలు కొంత పెరిగి ఉండేవని కూడా అంటున్నారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రాలకు టమాట ఎగుమతులు ఉన్నందునే ఈ ధరైనా పలుకుతోందని, లేదంటే ధరలు పతనమయ్యే పరిస్థితి వచ్చేదని అంటున్నారు. -
Tomato Prices: ట‘మాట’ వినదే!
సాక్షి, వికారాబాద్ అర్బన్: గత రెండు నెలలుగా టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రకాల కూరగాయల ధరలు కాస్త తగ్గినా టమాటా ఏమాత్రం దిగిరావడం లేదు. ఆదివారం వికారాబాద్ మార్కెట్లో కిలో టమాటా రూ.100 చొప్పున విక్రయించారు. నాసిరకం టమాటా రూ.80 వరకు పలికింది. జూన్ మొదటి వారంలోనైనా ధరలు తగ్గుతాయని భావించిన వినియోగదారుల ఆశలు నెరవేరలేదు. శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతోనే డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లలోకి ఆశించిన స్థాయిలో సరుకు రావడం లేదని పేర్కొంటున్నారు. కర్నూల్, హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. సకాలంలో వర్షాలు పడితే ఆగస్టులో ధర తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏమైనా టమాటా కొనుగోలు చేసేందుకు పేదలు, మధ్య తరగతి ప్రజలు సాహసం చేయలేదు. చదవండి: మహా జాదుగాళ్లు.. విదేశీ కరెన్సీ కావాలంటూ.. -
రాష్ట్ర ప్రభుత్వం చర్యలు.. టమాటా ధరలకు కళ్లెం
సాక్షి, అమరావతి: టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి శుక్రవారం నుంచి రైతుబజార్ల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లుచేసింది. బహిరంగ మార్కెట్లో టమాటా ధర ప్రస్తుతం ప్రాంతాన్ని బట్టి కిలో రూ.60 నుంచి రూ.81 వరకు పలుకుతోంది. స్థానికంగాను, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి దిగుమతులు తగ్గడం, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండడం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. వీటిని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద స్థానిక రైతుల వద్ద ఉన్న టమాటా నిల్వలను కొనుగోలు చేయడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున దిగుమతులు చేసుకోవాలని సంకల్పించింది. బహిరంగ మార్కెట్ ధరల కంటే కనీసం కిలోకి రూ.10లు తక్కువగా రైతుబజార్లలో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఇప్పటికే షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకున్న 20 టన్నుల టమాటాలను గుంటూరు, ఏలూరు రైతుబజార్ల ద్వారా శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మరో 40 టన్నుల దిగుమతికి ఏర్పాట్లుచేసింది. వీటిని ఉత్తరాంధ్రతో పాటు కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రైతుబజార్ల ద్వారా విక్రయించనుంది. ఇదే రీతిలో బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతగా తీసుకుని అక్కడ రైతుబజార్ల ద్వారా కిలో రూ.60కు మించకుండా అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. మరోవైపు.. మదనపల్లి, ఇతర ప్రధాన టమాటా మార్కెట్లలో జోక్యం చేసుకుని రైతుల నుంచి పెద్దఎత్తున కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లుచేసింది. ఈ చర్యలతో నాలుగైదు రోజుల్లో వీటి ధరలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తాం బహిరంగ మార్కెట్లలో టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే స్వయంగా పక్క రాష్ట్రాల నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటోంది. స్థానికంగా రైతుల వద్ద ఉన్న నిల్వలను కూడా మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లుచేశాం. ఇందుకోసం వ్యవసాయ, మార్కెటింగ్, రైతుబజార్ అధికారులకు ఆదేశాలు జారీచేశాం. వీటిని ప్రాధాన్యతా క్రమంలో రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతాం. సాధ్యమైనంత త్వరగా ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – కాకాణి గోవర్థన్రెడ్డి, వ్యవసాయ మంత్రి -
ఎరుపెక్కుతున్న టమాటా.. కిలో రూ.100
సాక్షి, న్యూఢిల్లీ: టమాటా ఎరుపెక్కుతోంది. సరఫరా తగ్గడంతో పలు రాష్ట్రాల్లో టమాటా ధరలు కొండెక్కుతున్నాయి. కేరళలో రూ.100 మార్కును చేరింది. ఒడిశాలో రూ.90, కర్నాటకలో రూ.70, ఏపీ, తెలంగాణల్లోనూ రూ.60కి పైగా పెరిగినట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ నివేదిక చెప్తోంది. తీవ్ర ఎండలకు వేడిగాలులు తోడవడంతో టమాటా ఉత్పత్తి బాగా పడిపోయింది. టమాటా ఉత్పత్తిలో ముందున్న ఏపీ, ఒడిశాల్లో అసని తుఫాన్తో పంట బాగా దెబ్బ తింది. ఏపీలో విశాఖ, కర్నూలు, తిరుపతిల్లో కిలో రూ.50–70 పలుకుతున్నట్టు వినియోగదారుల శాఖ నిత్యావసర సరుకుల ధరల డేటా పేర్కొంది. -
టమాట ధర పైపైకి
మదనపల్లె : వేసవిలో ఎండలు పెరుగుతున్నట్లుగా మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు మెల్లమెల్లగా పైకి ఎగబాకుతున్నాయి. ఎండ దెబ్బకు కూరగాయల పంటలు వాడిపోవడంతో పాటు దిగుబడులు తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా టమాటా పంటపై ఎండ తీవ్ర ప్రభావం చూపుతుండటంతో డిమాండ్కు సరిపడా సరుకు లభ్యత లేకపోవడంతో మెల్లమెల్లగా ధరలు పెరుగుతున్నాయి. వారంరోజుల క్రితం మొదటిరకం టమాటా కిలో రూ.30 ఉంటే గురువారం ఏకంగా రూ.44కు చేరుకుంది. నెలరోజుల క్రితం పరిస్థితిని పరిశీలిస్తే మార్చి 28న మొదటిరకం కిలో టమాటా రూ.9.20 ఉంది. ఈ లెక్కన వారంరోజుల వ్యవధిలో కిలోకు రూ.14, నెలరోజుల వ్యవధిలో రూ.35 పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో టమాటాకు పెట్టుబడి ఖర్చులు అధికం కావడం, ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్ష వరకు ఖర్చుచేయాల్సి రావడం, ఆశించిన స్థాయిలో «మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు సాగుపై ఆసక్తి కనబరచలేదు. మార్చి రెండోవారం నుంచి మార్కెట్లో టమాటా ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఆశలు చిగురించిన రైతులు నర్సరీల నుంచి నారును కొనుగోలు చేసి ఎక్కువ విస్తీర్ణంలో సాగును ఆరంభించారు. పంట చేతికి వచ్చేందుకు 45–50 రోజుల సమయం ఉండటంతో దిగుబడులు పెరిగేందుకు మరో నెలరోజులు పట్టే అవకాశం ఉంది. పెరిగిన ఎండలతో టమాటా దిగుబడులు తగ్గడం.. మరోవైపు పొరుగు జిల్లాల నుంచి టమాటాలు మార్కెట్కు రాకపోవడంతో ఒక్కసారిగా మార్కెట్లో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. రెండునెలల పాటు టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
Tomato Price: నెల క్రితం 3టన్నుల టమాటా లక్ష రూపాయలు.. మరి నేడు..?
సాక్షి, కడప: టమోట ధరలు భారీగా క్షీణించాయి. నెల రోజుల క్రితం 114 బాక్సుల లోడు గల బోలేరో వాహనంలో సుమారు 3టన్నుల టమాటాలు లక్ష రూపాయలు పలికాయి. ప్రస్తుతం అదే బోలేరో వాహనంలోని 114 బాక్సుల టమోటాలు రూ.6వేల ధర కూడా పలకడంలేదు. వాహనంలోకి లోడు ఎక్కించేందుకు కూలీలకు రూ.2,800, మార్కెట్కు తరలించడానికి వాహన బాడుగ రూ.4వేలు కలిపి మొత్తం రూ.6,800 చెల్లించాలి. లోడు టమాటాల ధర రూ.6వేలు పలికితే రైతు అదనంగా రూ.800 చేతినుంచి వేసుకుని చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో లింగాల మండలం కోమన్నూతలకు చెందిన వెంకటేష్ అనే రైతు తాను పండించిన టమాటాలను ఇలా మేకలకు మేతగా పడేశాడు. చదవండి: (జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలి: సీఎం జగన్) -
టమాట, ఉల్లి ధరలపై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం టమాటా, ఉల్లి ధరలపై కీలక ప్రకటన చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో దిగుబడి పెరిగి ధరలు తగ్గుతాయని తెలిపింది. నవంబర్ 25 నాటికి దేశంలో కిలో టమాట సగటు ధర రూ.67 ఉంటుందని, గత ఏడాదితో పోల్చితే 63 శాతం టమాట ధర పెరిగిందని తెలిపింది. అకాల వర్షాల కారణంగా పంటనష్టం, సరఫరాపై ప్రభావంతో టమాట ధరలు పెరిగాయని పేర్కొంది. ఖరీఫ్, లేట్ ఖరీఫ్ సీజన్ నుంచి 69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నామని తెలిపింది. గతేడాది ఇదే సమయానికి 70.12లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిదని, గతేడాదితో పోల్చితే టమాట దిగుబడి తగ్గింది వెల్లడించింది. ఇప్పటికే మార్కెట్లలోకి ఖరీఫ్ సీజన్ ఉల్లిపాయలు చేరుకుంటున్నాయని,సెప్టెంబర్లో పంజాబ్, యూపీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతినడం వల్ల దిగుబడి ఆలస్యమైందని తెలిపింది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోనూ కురిసిన భారీ వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతినడంతో పాటు రవాణాపై కూడా ప్రభావం పడిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా నవంబర్ 25 నాటికి సగటు ఉల్లిపాయ ధర రూ.39 ఉంటుందని, గతేడాదితో పోల్చితే 32 శాతం ఉల్లిపాయ ధర తగ్గిందని తెలిపింది. 2019, 2020 కంటే ఉల్లిపాయ ధర ప్రస్తుత తక్కువేనని పేర్కొంది. ఉల్లిపాయ ధర నియంత్రించేందుకు బఫర్ నిల్వల నుంచి విడుదల చేశామని వెల్లడించింది. కేంద్రం వద్ద ఉన్న 2.08 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వల నుంచి ఉల్లిని విడుదల చేసినట్లు కేంద్రంపేర్కొంది. బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయని నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకున్నాయని చెప్పింది. ధరల నియంత్రణ పథకం కింద రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో, ఈశాన్య రాష్ట్రాలకు 75:25 నిష్పత్తిలో వడ్డీ రహిత అడ్వాన్సులను కేంద్రంఅందించింది. ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు రూ.164.15 కోట్ల కేంద్ర వాటా విడుదల చేసినట్లు పేర్కొంది. ఆహార వస్తువుల ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్రాలు నిధులు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు రాష్ట్రాలు సైతం ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. -
మైండ్ బ్లాక్ చేస్తున్న టమాటా ధరలు
సాక్షి, ఆదోని: ఆదోని రైతు బజారులో మంగళవారం కిలో టమాటా రూ.105గా ఉండగా, ఝాన్సీలక్ష్మీబాయి మార్కెట్లో రూ.140 పలికింది. వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గి, ఇదే సమయంలో పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో వినియోగం పెరిగి డిమాండ్ ఏర్పడింది. దీంతో మార్కెట్లో టమాటా ధర వినియోగదారులను బెంబేలెత్తిస్తుండగా రైతులను మురిపిస్తోంది. సాధారణంగా ప్రతి రోజు ఆదోని మార్కెట్కు చుట్టు పక్కల పల్లెల నుంచి 300 గంపలు, ఆస్పరి మార్కెట్కు వెయ్యికి పైగా బాక్సులు రైతులు అమ్మకానికి తెస్తారు. మంగళవారం ఆదోనికి 40 గంపలు, ఆస్పరి మార్కెట్కు 150 బాక్స్లు వచ్చాయి. ఆస్పరి మార్కెట్లో 20 కిలోల బాక్స్ రూ.1,500 పలుకగా, ఆదోని మార్కెట్లో రెండు గంపలు రూ.1,500 పలికాయి. కిలో రూ. 75 ప్రకారం రైతుకు గిట్టుబాటు అవుతోంది. చదవండి: (విషాదం: తెల్లవారితే పెళ్లి అంతలోనే ఆస్పత్రి పాలై..) -
Tomato Price: సెంచరీ కొట్టిన టమాటా
మదనపల్లె (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో మొదటి రకం టమాటా ధర కిలో రూ.100 పలికింది. గడచిన ఐదేళ్లలో ఇంత అత్యధిక ధర నమోదవడం ఇదే తొలిసారి. వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులు, వరుసగా కురుస్తున్న వర్షాలతో టమాటా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. అంతో ఇంతో వస్తున్న పంట వర్షం కారణంగా నాణ్యత లేకపోవడం, డ్యామేజీ అధికంగా వస్తుండటంతో మార్కెట్లో టమాటాకు డిమాండ్ ఏర్పడింది. దీనికితోడు బయట రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో అక్కడ స్థానికంగా లభ్యమయ్యే పంటకు నష్టం వాటిల్లింది. దీంతో వ్యాపారులు 365 రోజులు టమాటా దొరికే మదనపల్లె మార్కెట్పై దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో అన్సీజన్ కావడం, దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, డిమాండ్ ఎక్కువ ఉండటంతో రికార్డు స్థాయి ధర పలికింది. 2016 నవంబర్లో మొదటి రకం అత్యధికంగా కిలో రూ.98 పలికింది. తర్వాత కిలో రూ.100 మంగళవారం నమోదైంది. -
టమాటా దిగుబడులపై వర్షం ఎఫెక్ట్
మదనపల్లె(చిత్తూరు జిల్లా): టమాటా దిగుబడులపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. మార్కెట్కు అంతంతమాత్రంగా వస్తున్న టమాటా దిగుబడులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మరింతగా తగ్గిపోయాయి. వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాయలపై మచ్చలు వచ్చి.. తెగుళ్లు సోకుతున్నాయి. పంట నాణ్యతగా ఉండడం లేదు. గత నెల 9న రైతులు మార్కెట్కు 445 మెట్రిక్ టన్నుల టమాటాలు తీసుకువచ్చారు. ఇందులో మెదటి రకం టమాట ధర కిలో రూ.14 వరకు పలికింది. ప్రస్తుతం దిగుబడులు 70 శాతం మేర తగ్గిపోయింది. ఇతర రాష్ట్రాల్లో వర్షాలకు పంట దెబ్బతినడం, డిమాండ్కు తగ్గ సరుకు లేకపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయి. శనివారం చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో మొదటిరకం టమాటా ధర కిలో రూ.35 నుంచి రూ.52 మధ్య పలికింది. రెండో రకం రూ.16 నుంచి రూ.33 మధ్య నమోదైంది. తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల నుంచి రైతులు 86 మెట్రిక్ టన్నుల టమాటాను మార్కెట్కు తీసుకువచ్చారు. కోత దశ చివరిది కావడంతో టమాటా దిగుబడులు తగ్గాయని, రబీ సీజన్ ప్రారంభమయ్యాక దిగుబడులు పెరిగే అవకాశం ఉందని హార్టికల్చరల్ ఆఫీసర్ సౌజన్య తెలిపారు. -
తగ్గుతున్న టమాటా ధరలు
మదనపల్లె: టమాటా మార్కెట్లో ధరలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం ధరలు మరింత తగ్గాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో గతనెల 20, 21, 22 తేదీల్లో కిలో టమాటా మొదటిరకం రూ.24, రెండోరకం రూ.17 వరకు పలికాయి. ఈ మార్కెట్లో ఆదివారం కిలో మొదటిరకం రూ.16, రెండోరకం రూ.11.80 పలికాయి. పదిరోజుల కిందటి ధరలతో పోలిస్తే కిలో ధర రూ.8 నుంచి రూ.6 వరకు తగ్గింది. వాతావరణంలో మార్పులు, ఇటీవల కురుస్తున్న వర్షాలతో స్థానికంగా దిగుబడులు తగ్గడం, కాయ నాణ్యత లోపించడం, ఎగుమతులకు కావాల్సిన సరుకు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. బయటిప్రాంతాల వ్యాపారులు సరుకు కొనుగోలు చేసేందుకు మార్కెట్కు రావడం లేదు. దీనికితోడు అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం, రాయదుర్గం, కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆదోని, కడప జిల్లాలోని మైదుకూరు తదితర ప్రాంతాల్లో టమాటా సీజన్ ప్రారంభమైంది. ఆరంభంలో కాయలు నాణ్యతగా వస్తుండటం, అధిక దిగుబడులు వస్తుండటంతో వ్యాపారులు అక్కడి సరుకు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మదనపల్లె మార్కెట్ నుంచి తమిళనాడుకు టమాటా లోడ్ కావడం లేదు. ఆయా ప్రాంతాల్లో స్థానికంగా పంట వస్తుండటంతో అక్కడి వ్యాపారులు ఇక్కడకు రాకపోవడం ధరలు తగ్గేందుకు కారణమైంది. రానున్న రోజుల్లో టమాటా ధరలు ఇంకా తగ్గే అవకాశముందని మార్కెట్ కమిటీ అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్లు రెండూ టమాటా రైతును నిలువునా ముంచాయి. జిల్లాలోని పడమటి నియోజకవర్గాల్లో సీజన్ ప్రారంభ సమయంలో కోవిడ్ విస్తృతి అధికంగా ఉండటం, లాక్డౌన్ పూర్తిస్థాయిలో అమలవుతుండటంతో గడిచిన రెండు సీజన్లు టమాటా రైతును నిరాశకు గురిచేశాయి. ఆశించిన స్థాయిలో ధర లేకపోవడంతో పెట్టుబడి డబ్బు కూడా రాక టమాటా రైతు నిలువునా మునిగిపోయాడు. -
టమాటా రైతు 'పంట' పండింది
సాక్షి, అమరావతి: మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో టమాటా మంచి ధర పలుకుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో కేవలం కిలో రూ.2–4 మధ్య పలికిన ధర నేడు రూ.7–14ల మధ్య పలుకుతుండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. వచ్చే కొద్దిరోజుల్లో లాక్డౌన్ సడలింపులతో ఎగుమతులు పుంజుకుంటే ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. టమాటా పంట రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 34,090 హెక్టార్లు, అనంతపురంలో 19,340 హెక్టార్లు, కర్నూలులో 3,203 హెక్టార్లలో సాగవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 22.16 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుండగా, అందులో 20.36 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తుంది. ఇలా మార్కెట్కు వచ్చే టమాటాలో మూడొంతులు వివిధ రాష్ట్రాలకు ఎగుమతవుతుంది. నిన్నటి వరకు ఏడు రాష్ట్రాలకే పరిమితమైన ఎగుమతులు మంగళవారం పది రాష్ట్రాలకు పెరిగింది. మరో నాలుగు రాష్ట్రాలకు ఎగుమతులు ప్రారంభం కానున్నాయి. వేలం పాటల్లో మార్కెటింగ్ శాఖ.. నిజానికి.. కరోనావల్ల ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో ఎగుమతుల్లేక, మార్కెట్లో ధరలేక కిలో టమాటా రూ.2–4కు మించి ధర పలకలేదు. ఈ దశలో ప్రభుత్వాదేశాలతో రంగంలోకి దిగిన మార్కెటింగ్ శాఖ మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర తక్కువగా ఉన్న మార్కెట్లలో వ్యాపారులతో కలిసి వేలం పాటల్లో పాల్గొంది. ఇలా కిలో రూ.5–7 చొప్పున రూ.11లక్షలు వెచ్చించి 52 మంది రైతుల నుంచి సుమారు 130.39 టన్నుల వరకు కొనుగోలు చేసిన మార్కెటింగ్ శాఖ కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం రైతుబజార్ల ద్వారా విక్రయాలు జరిపింది. మరోవైపు.. ఏపీ మహిళా అభివృద్ధి సంస్థ ద్వారా 410 మంది రైతుల నుంచి రూ.63.60 లక్షల విలువైన 1,615 టన్నుల టమాటాను సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు సరఫరా చేసింది. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా కిలో రూ.4కు మించి పలకని టమాటా ధర ప్రస్తుతం గరిష్టంగా రూ.14లు పలుకుతోంది. జాతీయ స్థాయిలో టమాటా మార్కెట్గా పేరొందిన మదనపల్లెతో పాటు పలమనేరు, మలకల చెరువు మార్కెట్ యార్డుల్లో టమాటా రైతుకు నేడు మంచి రేటు వస్తోంది. కనిష్ట, గరిష్ట ధరలిలా.. ► మదనపల్లె మార్కెట్ యార్డులో మంగళవారం మొదటి రకం టమాటా కిలో కనిష్టం రూ.11, గరిష్టం రూ.14.. రెండో రకం కనిష్టం రూ.7, గరిష్టం రూ.10 పలికింది. ► అలాగే, పలమనేరు మార్కెట్ యార్డులో రెండో రకం కనిష్టం రూ.9, గరిష్టం రూ.12 ధర పలికింది. ► మలకలచెరువు మార్కెట్ యార్డులో కిలో కనిష్టంగా రూ.7, గరిష్టంగా 10 పలికింది. ఈ మూడు మార్కెట్ యార్డులకు సగటున రోజుకు 2వేల టన్నుల చొప్పున టమాటా వస్తోంది. రైతుల వద్ద మరో 10 లక్షల టన్నుల టమాటా ఉన్నట్లు అంచనా. ► ఇదిలా ఉంటే.. టమాటా ధరలు ఈనెలాఖరులో భారీగా పెరిగే సూచనలు ఉన్నట్టు మార్కెటింగ్ శాఖ అంచనా వేస్తోంది. లాక్డౌన్ సడలింపులతో పలు రాష్ట్రాలకు ఎగుమతులు మొదలైతే వ్యాపారుల మధ్య పోటీతో ధరలు ఇంకా పెరుగుతాయి. ప్రభుత్వం జోక్యంవల్లే.. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ప్రభుత్వం జోక్యం చేసుకోవడంవల్లే టమాటా ధరలు పెరుగుతున్నాయి. గతంలో ఒకసారి పతనమైతే మళ్లీ పెరిగిన దాఖలాలు చాలా తక్కువ. అలాంటిది ఈసారి కిలో రూ.2–4ల మధ్య ప్రారంభమైన ధర నేడు కిలో రూ.14లు పలుకుతోంది. మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. – పీఎస్ ప్రద్యుమ్న, కమిషనర్, మార్కెటింగ్ శాఖ ఇది నిజంగా శుభపరిణామం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మదనపల్లె మార్కెట్లో టమాటాకు మంచి ధర పలుకుతోంది. 10 కిలోల టమాటా 1వ రకం గరిష్టంగా రూ.140 పలకడం నిజంగా శుభపరిణామం. ప్రస్తుతం సాగు రకాల్లో 1వ రకం టమాటా 60 శాతం కంటే ఎక్కువగా సాగవుతోంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
టమాటా పైపైకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టమాటా ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం 10 రోజుల వ్యవధిలో కిలోకు రూ. 30 మేర ధర పెరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో టమాటా రూ. 50–60 పలుకుతోంది. తెలంగాణలో టమాటా సాగు తక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో టమాటా ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పంట చేతికొచ్చే వరకు.. అంటే అక్టోబర్ చివరి వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చని మార్కెటింగ్ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. తగ్గిన సరఫరా.. పెరిగిన డిమాండ్ రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం చాలా తక్కువ. తెలంగాణలో లక్ష ఎకరాల్లో టమాటా సాగు అవుతుంది. తెలంగాణలో వినియోగించే మొత్తం టమాటాలో రాష్ట్రంలో పండేది కేవలం 15 నుంచి 20 శాతం వరకే ఉంటుంది. వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్నగర్, నల్లగొండ తదితర ప్రాంతాల్లో టమాటా సాగవుతుంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా టమాటా పంట దెబ్బతింది. దీంతో డిమాండ్ మేర సరఫరా లేక ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, మదనపల్లితోపాటు కర్ణాటకలోని చిక్మంగళూరు, కోలారు, చింతమణి ప్రాంతాలు, మహారాష్ట్రలోని బీదర్, షోలాపూర్, నాందేడ్ నుంచి కొంతమేర టమాటా రాష్ట్రానికి వస్తోంది. లాక్డౌన్ అనంతరం జూన్లో రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకోవడంతో వినియోగం పెరగడం వల్ల టామాటా ధర రూ. 50 వరకు పెరిగింది. అనంతరం ఆగస్టు తొలి వారం నుంచి ధర తగ్గుతూ కిలో రూ. 20–30 మధ్య కొనసాగింది. ఆగస్టు చివరలో సైతం కిలో ధర రూ. 30 వరకు ఉండగా అది ఇప్పుడు దాదాపు రెట్టింపయ్యింది. ఆగస్టులో కురిసిన వర్షాలతో పంట దెబ్బతినడం, ఆయా ప్రాంతాల్లో దిగుబడి పడిపోవడంతో రాష్ట్రానికి సరఫరా తగ్గిపోయింది. ఇక మహారాష్ట్ర, తమిళనాడుల్లో భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతిన్నది. దాంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లి నుంచి టమాటాను దిగుమతి చేసుకుంటుండటం వల్ల డిమాండ్ పెరిగి తెలంగాణకు సరఫరా తగ్గిపోయింది. గత నెలలో గరిష్టంగా రోజుకు 3 వేల క్వింటాళ్ల వరకు టామటా మార్కెట్లకు రాగా గత 10 రోజులుగా 1,600–2,000 క్వింటాళ్ల మేర మాత్రమే వస్తోంది. దీంతో టమాటా ధరలు అమాంతం ఎగబాకాయి. ప్రస్తుతం మదనపల్లిలోనే కిలో టమాటా ధర రూ. 30–35 మేర ఉంది. రవాణా చార్జీలు కలుపుకొని ప్రస్తుతం హైదరాబాద్ హోల్సేల్ మార్కెట్లో కిలో రూ. 37–40 అమ్ముతున్నారు. రైతు బజార్లలో రూ. 45 వరకు అమ్ముతుండగా బహిరంగ మార్కెట్కు వచ్చే సరికి ధర రూ. 50–60 వరకు చేరుతోంది. గతేడాది ఇదే సమయానికి కిలో ధర కేవలం రూ. 20 మాత్రమే ఉండగా సరఫరా రోజుకు 3,500 క్వింటాళ్లకుపైగా ఉండేది. అక్టోబర్ చివర, నవంబర్లో స్థానికంగా పండించే పంట చేతికొస్తుందని, అప్పటివరకు టమాటా ధర తగ్గుదల ఉండదని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
టమాటా @ రూ.50
మదనపల్లె (చిత్తూరు జిల్లా): మదనపల్లె హోల్సేల్ మార్కెట్లో టమాటా ధరలు మోత మోగిస్తున్నాయి. వారం క్రితం వరకు గ్రేడ్–1 టమాటా కిలో అత్యధికంగా రూ.20 ధర పలకగా.. ఇప్పుడు అమాంతం రూ.50కి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం.. కాయల్లో నాణ్యత తగ్గిపోవడం.. డిమాండ్కు తగిన స్థాయిలో సరుకు అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగాయి. మదనపల్లె మార్కెట్లో ధరలిలా.. ► మదనపల్లె టమాటా హోల్సేల్ మార్కెట్లో సోమవారం గ్రేడ్–1 టమాటాను నాణ్యతను బట్టి రైతు నుంచి కిలో రూ.32 నుంచి రూ.50 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ► గ్రేడ్–2 రకం నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.30 వరకు అమ్ముడుపోయింది. ► ఆగస్టు ప్రారంభంలో గ్రేడ్–1 రకం రూ.19 నుంచి రూ.32, గ్రేడ్–2 రకం రూ.10 నుంచి రూ.19.60 మధ్య పలికింది. ► ఈ నెల 18 వరకు ఇవే ధరలు కొనసాగగా.. మరుసటి రోజు నుంచి అనూహ్యంగా పెరుగుతూ వచ్చాయి. తగ్గిన దిగుబడి ► తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా టమాటా పంట బాగా దెబ్బతింది. కొద్దోగొప్ప వస్తున్న పంట నాణ్యత ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ► కాయపై మచ్చలు, పగుళ్లు రావడం, పంటను పురుగులు ఆశించడం, కాయలు కోసేందుకు వీలు లేకుండా పొలాల్లో నీళ్లు నిలిచిపోవడం, ఎక్కువ తేమకు చెట్టుకు తెగుళ్లు రావడంతో దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. ► దీనికితోడు వరదల కారణంగా రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో టమాటా పంట దెబ్బతింది. ► దాంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులు టమాటా కొనుగోలు కోసం మదనపల్లె మార్కెట్కు వస్తున్నారు. నాణ్యమైన సరుకు లభిస్తుండటంతో ధర ఎంతైనా వెచ్చించేందుకు వ్యాపారులు వెనుకాడటం లేదు. ► మదనపల్లె మార్కెట్లో సాహో రకానికి చెందిన పంట అధికంగా వస్తుండటం, రంగు, రుచి, నాణ్యత బాగా ఉండటంతో మంచి ధర పలుకుతోంది. -
టమాటా అధరహో!
మదనపల్లె(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో శనివారం మొదటి రకం టమాటా కిలో రికార్డు స్థాయిలో రూ.40.80 ధర పలికింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు మార్కెట్లో నమోదైన అత్యధిక ధర ఇదే. సాధారణంగా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెద్ద మొత్తంలో రైతులు టమాటాను సాగు చేస్తారు. మే, జూన్, జూలై నెలల్లో దిగుబడులు వస్తాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఏప్రిల్, మే నెలలో ఆశించిన మేరకు ధర పలకకపోవడంతో రైతులు నిరాశ చెందారు. జూన్ ప్రారంభం నుంచి లాక్డౌన్ ఆంక్షల్లో సడలింపులు రావడం, రెస్టారెంట్లు, హోటళ్లు తెరచుకోవడం, ప్రజాజీవనం సాధారణ స్థితికి చేరుకుంటుండడంతో మెల్లగా ధరలు పుంజుకున్నాయి. దీనికితోడు అనంతపురం జిల్లాతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులో టమాటా ఉత్పత్తి నిలిచిపోవడం, సరుకు లభ్యత తక్కువగా ఉండటం ఇక్కడి రైతులకు కలసి వచ్చింది. శనివారం మార్కెట్కు రైతులు 800 మెట్రిక్ టన్నుల టమాటాను తీసుకురాగా.. మొదటిరకం కిలో రూ.30 నుంచి రూ.40.80, రెండో రకం రూ.20 నుంచి రూ.29.40 వరకు ధర పలికాయి. చాలారోజుల తర్వాత ఆశించిన మేరకు ధర రావడంతో టమాటా సాగు చేస్తున్న రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్ నుంచి విశాఖ, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కోల్కతా, తెలంగాణ, మహారాష్ట్రకు ఎగుమతులు జరుగుతున్నాయి. ధరలు ఆశాజనకం మార్చి, ఏప్రిల్లో దిగుబడులు అధికంగా ఉన్నప్పటికీ లాక్డౌన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. తర్వాత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడం, రవాణా, వ్యాపార అవకాశాలను విస్తృతం చేయడం, ఆంక్షలు సడలించడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. – రమణారెడ్డి, రైతు, ముష్టూరు పంచాయతీ, నిమ్మనపల్లె మండలం ఇంకా పెరిగే అవకాశాలు టమాటాకు మరో నెలరోజులపాటు మంచి గిట్టుబాటు ధర లభించే అవకాశాలున్నాయి. పంట దిగుబడులు తగ్గుముఖం పట్టడం, ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి లేకపోవడం ఇక్కడ ధర పెరిగేందుకు కారణమయ్యాయి. సరుకు కొనుగోలుకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లెకు వస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లోని ధరలతో రైతులు సంతృప్తిగా ఉన్నారు. –మనోహర్, సెక్రటరీ, మదనపల్లె మార్కెట్ కమిటీ -
టమాటా, ఉల్లి ధరలు పడిపోతే వెంటనే చర్యలు
న్యూఢిల్లీ: టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డల ధరలు ఉన్నట్టుండి పతనమైతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు రూపొందించిన పోర్టల్ (వెబ్సైట్)ను కేంద్ర ఆహార శుద్ధి శాఖా మంత్రి హర్సిమ్రత్కౌర్ బాదల్ బుధవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ‘‘ప్రజలు అధికంగా వినియోగించే ఈ మూడు కూరగాయల టోకు ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుంది. అధిక సరఫరా కారణంగా ధరలు పడిపోతే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తుంది. దీంతో ‘ఆపరేషన్స్ గ్రీన్’ పథకం కింద ప్రభుత్వం సకాలంలో స్పందించి.. అధికంగా ఉన్న ఉత్పత్తిని కోల్డ్ స్టోరేజ్లకు తరలించేందుకు వీలుగా రైతులకు సబ్సిడీ ఇస్తుంది. లేదా మిగులు ఉత్పత్తిని డిమాండ్ ఉన్న చోటుకు తరలించేందుకు సాయమందిస్తుంది’’ అని మంత్రి బాదల్ తెలిపారు. క్రితం ఏడాది అదే కాలంతో పోలిస్తే ధరలు 50 శాతం పతనమైనా, మూడేళ్ల కనిష్ట స్థాయికి ఈ మూడు కూరగాయల ధరలు క్షీణించినా ప్రభుత్వం రూపొం దించిన ‘మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (ఎంఐఈడబ్ల్యూఎస్) అనే పోర్టల్ హెచ్చరికలు పంపుతుంది. దేశవ్యాప్తంగా 1,200 మార్కెట్లలో వీటి ధరలను ఈ పోర్టల్ తెలియజేస్తుందని నాఫెడ్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కే సింగ్ తెలిపారు. -
ట‘మోత’ తగ్గట్లే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టమాటా ధరలు మోత మోగిస్తున్నాయి. వర్షాకాలంలోనూ ఏ మాత్రం దిగిరావడం లేదు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల్లో భారీ క్షీణత, బోర్ల కింద సాగు చతికిలబడటంతో జూలై నెలలో సాధారణంగా తగ్గాల్సిన ధరలు తగ్గడం లేదు. గతేడాది ఇదే నెలలో గరిష్టంగా కిలో రూ.30 నుంచి రూ.35 పలికిన ధర ఈ ఏడాది రూ.50కి పైనే పలుకుతోంది. రాష్ట్ర పరిధిలో సాగు పూర్తిగా పడిపోవడం, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే టమాటాపైనే ఆధారపడటంతో ధరలు ఏ మాత్రం దిగిరానంటున్నాయి. నిజానికి రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలకు మించి ఉండదు. నిజామాబాద్, వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో టమాటా సాగు జరుగుతున్నా ఈ ఏడాది అది పూర్తిగా చతికిలబడింది. ఈ జిల్లాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. ఈ జిల్లాలో సరాసరి మట్టాలు 10 మీటర్ల నుంచి 14 మీటర్ల వరకు తగ్గాయి. దీంతో బోర్ల కింద టమాటా సాగు పూర్తిగా తగ్గింది. సాగు చేసిన పంటల్లోనూ దిగుబడి తగ్గింది. రాష్ట్రం నుంచి వస్తున్న టమాటా కనీసం 10 శాతం అవసరాలను కూడా తీర్చలేకపోతోంది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే టమాటాపైనే ఆధారపడాల్సి వస్తోంది. దిగుమతులు తగ్గడంతో: ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి, కర్ణాటకలోని కొలార్, చిక్మంగళూర్, చింతమణిల నుంచి దిగుమతి అయ్యే టమాటాలపై రాష్ట్రం ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుండగా, ప్రస్తుతం అక్కడి నుంచి దిగుమతులు కూడా తగ్గాయి. ముఖ్యంగా మదనపల్లిలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గింది. వస్తున్న కొద్దిపాటి టమాటా కూడా తమిళనాడుకు ఎక్కువగా సరఫరా అవుతుండటంతో రాష్ట్రంపై ప్రభావం చూపుతోంది. గతేడాది జూలై 23న 3 వేల క్వింటాళ్లు, 21న 3,095 క్వింటాళ్లు, 21న 3,490 క్వింటాళ్లు మేర బోయిన్పల్లి మార్కెట్కు పొరుగు రాష్ట్రాల నుంచి టమాటా రాగా ఈ ఏడాది 23న 2,664 క్వింటాళ్లు, 22న 2,239 క్వింటాళ్లు, 21న 1,800 క్వింటాళ్ల మేర సరఫరా అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1,200 క్వింటాళ్ల మేర ఒక్క బోయిన్పల్లి మా ర్కెట్కే సరఫరా తగ్గింది. దీంతో జూలైలో తగ్గాల్సిన ధర ఏమాత్రం తగ్గనంటోంది. ఈ పరిస్థితుల్లో మహా రాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగాల్సిన అవసరముంది. దీనికి తోడు ఇప్పు డిప్పుడే పుంజుకుంటున్న వర్షాలతో దిగుబడులు పెరిగితే ధర దిగి వచ్చే అవకాశముంది. లేని పక్షంలో సామాన్యుడికి ట‘మోత’తప్పేలాలేదు. ఇతర కూరగాయలు కిలో రూ.50 పైనే.. టమాటాతో పాటు క్యారెట్, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, కాకర, బీన్స్, బీరకాయ ధరలు ఏ మాత్రం దిగిరావడం లేదు. వీటన్నింటి ధరలు కిలో రూ. 50కి పైనే పలుకుతున్నా యి. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ నుంచి దిగుమతులు లేకపోవడంతో క్యాప్సికం ధర రూ.60కి పైనే ఉంది. క్యారెట్ సైతం రూ.70 వరకు ఉంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్, మహారాష్ట్ర నుంచి రావాల్సిన కాకర దిగుమతులు తగ్గడంతో దీని ధర కిలో రూ.50 నుంచి రూ.60కి మధ్యలో ఉంది. -
ఈ టమాటకేమైంది?
సాక్షి, సిటీబ్యూరో: ఓ వైపు తగ్గిన టమాట దిగుమతులు..మరోవైపు పెరుగుతున్న ధరలు నగరవాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మండుతున్న ఎండలతో పాటు నగరంలో కూరగాయల ధరలు కూడా వేడిపుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా టమాట.. రోజు రోజుకూ పెరుగుతున్న టమాటా ధరలతో నగరవాసి కుదేలవుతున్నాడు. టమాటా తిందామంటే ఆలోచించే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రైతు బజారులోనే కిలో 70 రూపాయలు పలుకుతున్న టమాటా, ఇక బహిరంగ మర్కెట్లో రూ. 80 నుంచి రూ. 90 పలుకుతోంది. దాదాపు ప్రతి కూరలో వినియోగించే టమాట తినాలంటేనే సామాన్యుడు భయపడుతున్నాడు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది టమాట దిగుమతులు నగర హోల్సేల్ మార్కెట్కు భారీగా తగ్గాయి.గత ఏడాది నగర మార్కెట్లకు 250 టన్నులు దిగుమతయ్యేవి. అయితే ప్రస్తుతం కేవలం 100 టన్నుల టమాట మాత్రమే దిగుమతవుతోంది. మార్చి, ఏప్రిల్ నెల వరకు శివారు గ్రామాలతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి టమాట దిగుమతులు ఉండేవి. ప్రస్తుతం శివారు జిల్లాల నుంచి దిగుమతులు త గ్గాయి దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టమాటపైన నగర ప్రజల అవసరాలు తీరుతున్నాయి. నగరానికి 332 టన్నుల టమాట ప్రసుత్తం టమాట అన్ సీజన్ కావడంతో నగరంలోని బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, గడ్డిఅన్నారం, మాదన్నపేట్, మీరాలం మండితో పాటు రైతుబజార్లకు వివిధ జిల్లాల నుంచి రోజు 100 టన్నుల టామట దిగుమతి అవుతుంది. నగర టమాట అవసరాలు తీర్చాడానికి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేస్తున్నారు. దీంతో ట్రాన్స్పోర్టు ఖర్చులు పెరగడం డిమాండుకు సరిపడా కాకుండా తక్కువ సరఫరా కావడం కూడా కూడా ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. జాడలేని ప్రత్యామ్నాయం.. సీజన్లో టమాట ఎక్కువ దిగుబడి అయితే వాటిని నిలువ చేసి అన్సీజ్లో ధరలు నిలకడగా ఉంచడానికి మార్కెటింగ్, హార్టికర్చర్ శాఖ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. గత మూడు నెలల క్రితం రంగారెడ్డి, మెదక్తో పాటు మదనపల్లి నుంచి నగరానికి అవసరానికి కంటే ఎక్కువ టమాట దిగుమతి అయింది. అదే సీజన్లో న గరానికి రోజుకు 280–300 టన్నుల టమాట సరిపొతుందని మార్కెటింగ్ అధికారుల అంచనాల. అయితే సీజన్లో ఎక్కువ మొత్తం దిగుమతి అవుతున్న టమాటను కోల్డ్ స్టోరేజీల్లో పెట్టి అన్ సీజన్లో ధరలు నియత్రించాడానికి మార్కెటింగ్ శాఖ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. పచ్చి మిర్చిదీ అదే బాట నగర ప్రజల పచ్చి మిర్చి అవసరాలు తీర్చాడానికి శివారు ప్రాంతాల నుంచి మిర్చి దిగుమతి అవుతుంది. అయితే ఇటీవల అకాల వర్షాలతో మిర్చి పంటకు తీవ్ర నష్టం జరిగింది. దీంతో మిర్చి సరఫరా తగ్గిందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో నగరానికి మిర్చి సరఫరా తగ్గింది. నగరానికి రోజు దాదాపు 1200 నుంచి 1500 క్వింటాళ్ల వసరం ఉంది. మంగళవారం నగరానికి కేవలం 850 క్విటాళ్ల మిర్చి మాత్రమే వివిధ హోల్సేల్ మార్కెట్లకు దిగుమతి అయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో మిర్చి క్వింటాల్ ధర రూ. 5 వేల నుంచి 6 వేలు పలుకుతోంది. -
పెరిగిన టమాటా ధరలు
కూలీలు కూడా గిట్టుబాటు కాకుండా నష్టపరిచిన టమాట ప్రస్తుతం రైతులను ఆదుకుంటోంది. కిలో రూ.37లు పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి కొద్ది రోజలు ఇలాగే ఉంటే చేసిన అప్పులు కొంతమేర తీరుతాయని చెబుతున్నారు. పెరిగిన ఎండలు, ఇతర ప్రాంతాల నుంచి కాయలు రాకుండా చర్యలు తీసుకోవడంతోనే ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. చిత్తూరు, మదనపల్లె టౌన్ /రామసముద్రం : జిల్లాలోని పడమటి మండలాల్లో ప్రధానంగా టమాట పంట సాగు చేస్తారు. ఎకరా సాగుకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. నీరు తక్కువగా ఉన్న రైతులు మల్చింగ్, డ్రిప్, స్ప్రింక్లర్లను వినియోగిస్తూ ఖర్చుకు వెనకాడకుండా పంటను పెడుతున్నారు. మదనపల్లె డివిజన్లో ప్రస్తుత రబీ సీజన్లో 43 వేల హెక్టార్ల సాధారణ సాగుకు గానూ 36 వేల హెక్టార్లో టమాట సాగు చేసినట్టు ఉద్యానవన శాఖ అధికారులు సుబ్రమణ్యం, ఉమాదేవి తెలిపారు. మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండలంలో 1200 హెక్టార్లకు గాను 480 హెక్టార్లు, రామసముద్రం మండలంలో 2,200 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 1,600 హెక్టార్లలో, మదనపల్లె మండలంలో 1,400 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 800 హెక్టార్లలో టమాట పంట సాగు చేశారు. వేసవిలో పంట దిగుబడి తగ్గడం, మార్కెట్ అధికారులు నెల రోజులుగా బయటి రాష్ట్రాల కాయలను మార్కెట్లోకి అనుమతించకపోవడంతో రేట్లు పెరిగాయి. మార్కెట్కు ప్రస్తుతం మదనపల్లె మార్కెట్లో మొదటి రకం టమాట పది కిలోలు రూ.340, రెండో రకం రూ.200 పలికింది. వారం రోజులుగా సగటున కిలో రూ.34–36 మధ్య ధర ఉంది. శుక్రవారం మార్కెట్కు 262 టన్నుల టమాట కాయలు వచ్చాయి. నార్లకు పెరిగిన డిమాండ్ నెల క్రితం టమాట నార్లను అడిగేవారు లేకపోవడంతో నర్సరీల్లో పడేశారు. 20 రోజులుగా టమాట ధరలు పెరగడంతో రైతులు సాగుపై దృష్టి సారించారు. దీంతో నార్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఒక్కొక్క మొలకకు 60 పైసల నుంచి 80 పైసల వరకు చెల్లించి తీసుకెళుతున్నారు. అయినా నార్లు లభించడంలేదని రైతులు చెబుతున్నారు. కర్ణాటకకు వెళ్లి నారు తెచ్చుకుంటున్నట్టు పేర్కొంటున్నారు. -
టమాటా ధర పైపైకి!
సాక్షి, హైదరాబాద్: టమాటా ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ఇటీవల కాస్త తగ్గిన ధరలు మళ్లీ చుక్కలనంటుతున్నాయి. రాష్ట్రంలో సాగు తగ్గడం, పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి లేకపోవడంతో కిలో ధర రూ.30 పలుకుతోంది. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 15–20 రోజుల క్రితం టమాటా ధర కిలో రూ.10 వరకే పలికింది. రైతుబజార్లో కిలో రూ.5 నుంచి రూ.8 వరకు ఉంది. రాష్ట్రంలో అధికంగా సాగు చేసే మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో సాగు తగ్గిపోయింది. ఈ జిల్లాల్లో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాల్లో భారీ క్షీణత ఏర్పడింది. దీంతో ఈ జిల్లాల నుంచి మార్కెట్లోకి టమాటా రావడం లేదు. దీంతో ఏపీలోని మదనపల్లి నుంచి, కర్ణాటకలోని కొలార్, చిక్మగళూర్ల నుంచి దిగుమతి అయ్యే టమాటాలపై ఆధారపడాల్సి వస్తోంది. అక్కడి నుంచి సైతం దిగుబడి తగ్గింది. మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు కొన్ని రోజులుగా పుంజుకున్నాయి. పదిరోజుల కిందట అత్యల్పంగా కిలో ధర రూ.4 నుంచి అత్యధికంగా రూ.10 వరకు మాత్రమే పలికింది. దిగుబడి తగ్గడంతోపాటు సీజన్ ప్రారంభం కావడంతో టమాటా మార్కెట్కు 100 టన్నుల నుంచి 140 టన్నుల వరకే వస్తోంది. డిమాండ్ పెరుగుతున్న కారణంగా మదనపల్లె టమాటా ధర పుంజుకుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన టమాటా కిలో రూ.22 వరకు పలుకుతోంది. ఈ ప్రభావం మన రాష్ట్రంపై పడుతోంది. ఈ నెల 29న పొరుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ మార్కెట్కు 1,510 క్వింటాళ్లు టమాటా రాగా, సోమవారం కేవలం 884 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం రైతుబజార్లోనే టమాటా కిలో ధర రూ.24 పలకగా, బహిరంగ మార్కెట్లో కిలో ధర రూ.30కి చేరింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగాల్సిన అవసరం ఉంది. గత ఏడాది ఇదే సమయంలో రాజస్థాన్ నుంచి పెద్ద సంఖ్యలో టమాటా రాష్ట్ర మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం అక్కడి నుంచి రావడం లేదు. ఈ దిగుమతులు పెరిగితే ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుందని, లేని పక్షంలో మరో 3 నెలలపాటు ధరల్లో పెరుగుదల తప్పదని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
ధర.. దైన్యం
అనంతపురం అగ్రికల్చర్: మార్కెట్లో టమాట రేటు చూసి రైతు నోట మాట రావడం లేదు. మిర్చి ధర వింటే మూర్ఛవస్తోంది. వరుస కరువులతో ఆర్థికంగా చితికిపోయిన ‘అనంత’ రైతులను ఉద్యానతోటలు కూడా ఊసురుమనిపిస్తున్నాయి. మార్కెటింగ్ సదుపాయం లేక పండిన పంట ఉత్పత్తులను అమ్ముకోలేక చతికిలపడుతున్నారు. సరైన ప్రణాళిక, సాగు స్థిరీకరణ, గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకులు, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతుండటంతో రైతులు దారుణ నష్టాలు చవిచూస్తున్నారు. ఓవైపు ప్రకృతి కన్నెర చేస్తుండగా మరోవైపు పాలకులు నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ‘అనంత’ రైతుల పాలిట శాపంగా పరిణమించింది. కూర‘గాయాలే’ ఇటీవలకాలంలో అంతో ఇంతో నీటి వనరులు ఉన్న రైతులు వేరుశనగ, వరి లాంటి పంటలకు పోకుండా కూరగాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. ఉద్యానశాఖ, మార్కెటింగ్శాఖ నుంచి సరైన ప్రణాళిక, సాగు, మార్కెటింగ్ సదుపాయం లేక కూరగాయలకు ధరలు లేక దారుణ నష్టాలు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం టమాటా, మిరప సాగు చేసిన రైతులు ధరల పతనంతో ఈ సీజన్లో రూ.250 నుంచి రూ.300 కోట్లు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. పెరిగిన సాగు... తగ్గిన ధర జిల్లా వ్యాప్తంగా టమాట, మిరపసాగు బాగా పెరిగింది. దిగుబడులు కూడా బాగానే వచ్చాయి. అయితే మార్కెట్లో ధరలు పతనం కావడంతో పెట్టుబడులు కూడా దక్కించుకోలేకపోతున్నారు. ఈ రెండు పంటల ద్వారా ఏటా 10 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడులు వస్తుండగా... రమారమి రూ.900 నుంచి రూ1,000 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సీజన్లో ధరలు దారుణంగా పతనం కావడం, తరచూ ఇలాంటి పరిస్థితి ఏర్పడటంతో ఈ ఏడాది రైతులకు రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు నష్టం జరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వినియోగదారులు కిలో రూ.10 ప్రకారం కొంటున్నా మార్కెట్లో రైతులకు మాత్రం కిలో రూ.2 కూడా గిట్టుబాటు కావడం లేదు. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం నివారించి, మార్కెటింగ్ సదుపాయం కల్పించడంలో యంత్రాంగం విఫలం కావడంతో రైతులు కుదేలవుతున్నారు. టమాట పరిస్థితి ఇలా... జిల్లా వ్యాప్తంగా కళ్యాణదుర్గం, కుందుర్పి, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కంబదూరు, తనకల్లు, నల్లచెరువు, గాండ్లపెంట, ఓడీచెరువు, నల్లమాడ, గోరంట్ల, తాడిమర్రి, బత్తలపల్లి, అనంతపురం, ధర్మవరం, ఆత్మకూరు, కూడేరు, రాప్తాడు, కనగానపల్లి, చిలమత్తూరు, మడకశిర, గుమ్మఘట్ట, కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హిరేహాళ్, గుత్తి, గుంతకల్లు, యాడికి, తాడిపత్రి, యల్లనూరు తదితర మండలాల్లో టమాట పంట ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 14,200 హెక్టార్లలో పంట సాగులోకి రాగా ప్రస్తుతం 7,800 హెక్టార్లలో పంట పొలం మీద ఉన్నట్లు ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడి రూ.1.20 లక్షలు...రాబడి రూ.80 వేలు మామూలు పద్ధతిలో అయితే ఎకరా విస్తీర్ణంలో టామాట సాగుకు రూ.50 వేల నుంచి రూ.60 వేలు పెట్టుబడి అవుతుండగా, ట్రెల్లీస్, మల్చింగ్ పద్ధతిలో అయితే ఎకరాకు రూ.1.10 లక్షల నుంచి 1.20 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో పాటు క్రేట్స్, రవాణా, కమిషన్ల ఖర్చు అదనంగా భరించాలి. ఎకరా టమాట బాగా పండితే 30 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. మార్కెట్లో కిలో కనీసం రూ.10 పలికితే కాని గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కిలో రూ.10 ఉంటే అందులో పెట్టుబడులు, రవాణా, ఇతరత్రా ఖర్చులు కింద రూ.8 వరకు పోతుంది. మిగతా రెండు రూపాయలు మిగిలే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇపుడు కిలో రూ.2 కూడా గిట్టుబాటు కాకపోవడంతో భారీ నష్టాలు చవిచూస్తున్నారు. జిల్లాతో పాటు పక్కనున్న చిత్తూరు, మదనపల్లి, అలాగే కర్ణాటకలోని కోలార్, చింతామణి, హైదరాబాద్ చుట్టుపక్కల, కొన్ని తెలంగాణా జిల్లాల్లో టమాట సాగు పెరగడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టినట్లు చెబుతున్నారు. నవంబర్ వరకు ఇదే రకమైన మార్కెట్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిరపదీ అదే దారి జిల్లా వ్యాప్తంగా బుక్కరాయసముద్రం, నార్పల, గుత్తి, బొమ్మనహాళ్, కణేకల్లు, పరిగి, తాడిపత్రి, రాయదుర్గం, ధర్మవరం, బత్తలపల్లి, కూడేరు, ఆత్మకూరు, కళ్యాణదుర్గం, కంబదూరు, తనకల్లు, మడకశిర ప్రాంతాల్లో మిరప సాగు ఎక్కువగా ఉంది. ఉరవకొండ, గుంతకల్లు ప్రాంతాల్లో ఎండుమిర్చి ఎక్కువగా ఉంది. ఈ ఏడాది 4,100 హెక్టార్లలో మిరప సాగు చేయగా అందులో ప్రస్తుతం 2,400 హెక్టార్లలో పంట ఉన్నట్లు చెబుతున్నారు. ఎకరా పచ్చి మిరప సాగుకు రూ.1.10 నుంచి 1.50 లక్షల వరకు పెట్టుబడి అవుతోంది. పంట నాటిన 75 రోజుల తర్వాత నుంచి 7 నుంచి 8 నెలల వరకు పంట కోతలు ఉంటాయి. అంతా బాగుంటే ఎకరాకు 15 టన్నుల మిరప దిగుబడులు వస్తాయి. అన్ని రకాల ఖర్చులు పోనూ కిలో కనీసం రూ.15 పలికితే కాని మిరపకు గిట్టుబాటు కాదని అధికారులు చెబుతున్నారు. ఇపుడు కనిష్ట స్థాయికి పడిపోవడంతో మిరప రైతులు నిలువునా మోసపోతున్నారు. తెలంగాణ, మహరాష్ట్రలో విపరీతంగా మిరప సాగు, దిగుబడులు రావడంతో ఈ దుస్థితి తలెత్తినట్లు విశ్లేషిస్తున్నారు. దళారుల దందా కూరగాయల వ్యాపారంలో దళారీలే బాగుపడుతున్నారు. దళారీలు సిండికేట్ అయి ఒక రేటును ఫిక్స్ చేస్తున్నారు. రైతులనుంచి తక్కువ ధరలకు పంట కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు మార్కెట్లో విక్రయిస్తున్నారు. అంతేకాకుండా నూటికి రూ.10 కమిషన్ రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. పండించిన పంట అమ్ముకోవాలంటే కమిషన్, బాడిగ, హమలీ ఖర్చుల పోనూ మిగిలేదేమీ ఉండదని రైతులు వాపోతున్నారు. కూలి డబ్బులుకూడా వచ్చేట్లు లేవు నాకు ఐదెకరాల పొలం ఉండగా..రెండు ఎకరాల్లో టమాట సాగు చేశాను. ప్రస్తుతం 15 కిలోల టమాట బాక్సును వ్యాపారులు రూ.45 అడుగుతున్నారు. ఈ లెక్కన అమ్మితే పెట్టుబడి కాదుగదా.. కూలీలు కూడా వచ్చేట్టు లేవు.– సుబ్రమణ్యం, బుక్కరాయసముద్రం ధర అధ్వానం నాకు పదెకారల పొలం ఉండగా..రెండు ఎకరాల్లో డ్రిప్పు ద్వారా మిరప సాగు చేశాను. ఎకరాకు రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టాను. తీరా పంట చేతికి వచ్చిన తర్వాత వ్యాపారస్తులు కిలో రూ.3, రూ.4కు అడుగుతున్నారు. పంట దిగుబడి ఉన్నా..ధర మాత్రం రావడం లేదు. కేజీ రూ.15 నుంచి రూ.20 పలికి ఉంటే ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల దాకా ఆదాయం వచ్చేది. – రవిచంద్రారెడ్డి, సంజీవపురం -
ట'మోత' తగ్గింది!
గత నెలలో అందరినీ ఆందోళనకు గురి చేసిన టమాటా ధర అమాంతం పడిపోయింది. గత మూడు రోజులుగా ఒక్కసారిగా తగ్గిపోవడంతో రైతులు, వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ధరలు ఎంతగా పతనమయ్యాయంటే నవంబర్లో కిలో రూ.వంద నుంచి రూ. 120 పలికిన టమాటా నేడు 15 రూపాయలకు పడిపోయింది. ఇది కూడా ఉదయం మాత్రమే. సాయంత్రం అయ్యేసరికి ఈ ధర కూడా ఉండడం లేదు. పచ్చి సరుకును నిల్వ చేయలేక.. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం చందంగా.. వ్యాపారులు కిలో పది రూపాయలకు అమ్మేస్తున్నారు. వీరఘట్టం: టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం అధిక దిగుబడిగా అంతా భావిస్తున్నారు. టమాటా సాగుకు శీతాకాలం అనుకూలంగా ఉంటుంది. జిల్లాలోని వీరఘట్టం, పాలకొండ, పాతపట్నం, హిరమండలం, శ్రీకాకుళం రూరల్ తదితర మండలాల్లో సుమారు రెండు వేల ఎకరాల్లో రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది దిగుబడి ఎక్కువగా ఉంది. వ్యాపారులు కూడా ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు టమాటాను దిగుమతి చేసుకుంటున్నారు. ఇవే ధర పతనానికి కారణమయ్యాయి. వ్యాపారులు కూడా రైతుల వద్ద కిలో రూ.7 నుంచి పది రూపాయల్లోపే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఎందుకిలా? వాస్తవానికి సంక్రాంతి పండుగ సమీపిస్తుందంటే గతంలో టమాటా కిలో రూ.40 నుంచి రూ.50 పలికేది. ఈసారి పరిస్థితి తారుమారైంది. ఈ ఏడాది డిమాండ్కు మించి పంట దిగుబడి రావడంతో ధర పతనమైంది. రోజుకు రూ.200 నష్టపోతున్నాం పెట్టుబడులు పోను రోజుకు రూ.300 వరకు లాభం వచ్చేది. ప్రస్తుతం బేరాలు లేక సరుకు పాడవుతోంది.దీంతో రోజుకు రూ.200 వరకు నష్టం వస్తోంది. టమాటా వ్యాపారం చేయాలంటే ఆందోళనగా ఉంది. – దేవుపల్లి గౌరీశ్వరరావు, వ్యాపారస్తుడు, వీరఘట్టం అమాతంగా ధర తగ్గిపోయింది టమాటాను నెల రోజుల క్రితం పార్వతీపురం, పాలకొండ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని స్థానికంగా విక్రయించేవాళ్లమి ప్రస్తుతం వీరఘట్టంలో విస్తారంగా పంట పండుతుండడంతో మార్కెట్లోకి ఎక్కువగా టమాటా దిగుమతి అవుతోంది. అంతేకాకా ఇతర ప్రాంతాల నుంచి కూడా టమాటా వస్తుండడంతో అమాంతంగా ధర తగ్గిపోయింది. – మీసాల ప్రసాదు, తోపుడు బండి వ్యాపారి -
ప్రభుత్వ గోదాములకే ప్రాధాన్యం
- ఆ తర్వాతే ప్రైవేట్ గోదాముల్లో నిల్వలు - మార్కెటింగ్ శాఖ పనితీరుపై మంత్రి హరీశ్ సమీక్ష సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ గోదాములు భర్తీ అయిన తర్వాతే ప్రైవేటు గోదాములకు నిల్వలు తరలించాలని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్రావు ఆదేశించారు. రైతులు, వ్యాపారులు, పౌర సరఫరాల శాఖ తమ అవసరాల కోసం ప్రభుత్వ గోదాములకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు లేఖలు రాయాల్సిందిగా మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ పనితీరుపై మంత్రి హరీశ్రావు శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ గోదాముల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు పౌర సరఫరాల సంస్థ, మార్క్ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థ తదితర అన్ని ప్రభుత్వ సంస్థలు తప్పనిసరిగా వినియోగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేసే పక్షంలో మార్కెటింగ్ శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేయాలన్నారు. జాతీయ వ్యవసాయ మార్కెట్లతో స్థానిక మార్కెట్లను అనుసంధానించడంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో పాటు వ్యాపారులు, రైతులకు ఉపయోగపడేలా మొబైల్ యాప్ను సెప్టెంబర్ 15లోగా అందుబాటులోకి తేవాలన్నారు. అసంపూర్తిగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డుల గోదాముల నిర్మాణాన్ని సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. 17.75 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న 330 గోదాముల నిర్మాణం చేపట్టగా వాటిల్లో 101 గోదాముల నిర్మాణం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మార్కెటింగ్ శాఖ చేపట్టిన ‘మన కూరగాయలు’ పథకానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, ప్రస్తుతం నడుస్తున్న 21 ఔట్లెట్లతోపాటు మరో ఆరు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ డైరక్టర్ డాక్టర్ శరత్, అదనపు డైరక్టర్ లక్ష్మిబాయి తదితరులు పాల్గొన్నారు. టమాట రైతులకు ప్రోత్సాహక ధర టమాట ధరలు తగ్గిన నేపథ్యంలో రైతులకు ప్రోత్సాహక ధర ఇప్పించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. మన కూరగాయలు పథకంలో భాగంగా సేకరణ కేంద్రాల ద్వారా రైతుల నుంచి కిలోకు రూ.5 చొప్పున కొనుగోలు చేస్తారు. రైతుబజార్ల ద్వారా అమ్ముకునే రైతులకు ప్రాధాన్యమిస్తూ వినియోగదారులకు రూ.7కు తగ్గకుండా విక్రయిస్తారు. -
నో‘ట మాట’రాని రైతు
మార్కెట్లో పతనమైన టమాట ధరలు రూ.1000నుంచి రూ.100కు పడిన ధర స్థానికంగా భారీగా పెరిగిన సరుకు ధరలు మరింత తగ్గుతాయంటున్నవ్యాపారులు అయోమయంలో రైతులు టమాట ధరలు భారీగా తగ్గి సామాన్య జనానికి ఆనందం కలిగించినా రైతులను మాత్రం నట్టేట ముంచాయి. పది రోజుల క్రితం పలమనేరు టమాట మార్కెట్లో బాక్సు (14కేజీలు) ధర రూ.1000 లకు పైగా పలికి రికార్డు సృష్టించింది. అలాంటిది మంగళవారం స్థానిక మార్కెట్లో బాక్సు రూ.100 కు పడిపోయింది. స్థానికంగా సరకు పెరిగిపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెట్టుబడి కూడా రాదని రైతులు ఆవేదన చెందుతున్నారు. పలమనేరు: మదనపల్లె మార్కెట్ తర్వాత టమాటకు పలమనేరు మార్కెట్ పెద్దది. ఇక్కడికి సరాసరిన రోజుకు 30 లోడ్ల టమాటాలు వస్తాయి. అలాంటిది ప్రస్తుతం 40కి పైగా లోడ్లు వస్తున్నాయి. సరకు ఎక్కువ కావడంతో స్థానిక మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. అటు అనంతపూర్ జిల్లాలో, ఇటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ టమాట దిగుబడులు పెరిగాయి. దీంతో అక్కడి మార్కెట్లలో లోకల్ సరకు సరిపోయేంతగా వస్తోంది. దీంతో స్థానిక మార్కెట్నుంచి సరకును కొనేందుకు బయటి వ్యాపారులు ఆసక్తిని చూపడం లేదు. ఫలితంగా లోకల్ వ్యాపారులు మాత్రమే ఇక్కడి సరకును కొనాల్సిరావడంతో ధరలు అమాంతం పడిపోయినట్టు తెలుస్తోంది. గత నెలలో భారీగా ధరలు పలకడంతో స్థానిక రైతులు ధరలు ఇలాగే ఉంటాయనే ఆశతో భారీగానే టమాట సాగుచేశారు. ప్రస్తుతం 80శాతం తోటలు కోతదశలో ఉన్నాయి. ఇలా సరకు విపరీతం కావడంతో ధరలు తగ్గుముఖం పట్టేందుకు ఓ కారణమైంది. పంట పెట్టుబడి కూడా అనుమానమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఎకరా పొలంలో పంట సాగుచేయాలంటే రూ.50వేలు అవుతోంది. ఇలాంటి తరుణంలో బాక్సు రూ.200 పలికితేగానీ పంటకు పట్టిన పెట్టుబడి మిగిలేలా లేదు. ధరలు ఇలాగే మరింత తగ్గుముఖం పడితే రైతుకు తీరని నష్టం తప్పేలా లేదు. టమాట పంటను సాగుచేస్తున్నా కోత ఇప్పుడే ప్రారంభమైంది. మంగళవారం 60 బాక్సులు మార్కెట్కు తీసుకెళ్ళా. బాక్సు ధర రూ.110 దాకా పలికింది. ఎప్పుడు ధరలుంటాయో అర్థం కాని పరిస్థితి. అంతా లాటరీగా మారింది. రైతులంతా ఒకేసారి టమోటాను సాగుచేయడంతో సప్లయ్ పెరిగి అడిగే వారు లేకుండా పోతున్నారు. -వెంకటమునిరెడ్డి, నక్కపల్లె మార్కెట్కు అనుగుణంగా టమోటాను సాగుచేయాలి ప్రస్తుత పరిస్థితుల్లో పంటసాగుకు ఖర్చులు పెరిగిపోయాయి. సప్లయ్ భారీగా ఉంది. ఇలాంటి పరిస్థితులో ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలి. ధరలు ఉన్నాయని ఒకే పంటను సాగుచేస్తే సప్లయి పెరిగి డిమాండ్ తగ్గుతుంది. కాబట్టి మార్కెట్ అనుకూలిత వ్యవసాయం చేయాలి. అప్పుడే రైతులు ఆర్థికంగా గిట్టుబాటుఅవుతుంది. -లక్ష్మీప్రసన్న, హెచ్వో, పలమనేరు డివిజన్ -
మిరప కొరకకుండానే కళ్లకు నీళ్లు
-
టమోటా @రూ.60
విజయవాడ : జిల్లాలో టమోటా ధరలు చుక్కలు చూస్తున్నాయి. విజయవాడలో మార్కెట్లో కిలో ధర రూ.60కు చేరింది. వారం రోజులుగా మార్కెట్లో టమోటా కొరత ఏర్పడింది. ప్రస్తుతం జిల్లాలో దిగుబడి లేకపోవడమే దీనికి కారణమని వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అనంతపురం, మదనపల్లి నుంచి విజయవాడ మార్కెట్కు టమోటా సరఫరా అవుతోంది. అయితే కొద్ది రోజులుగా అనంతపురం, మదనపల్లి మార్కెట్ల నుంచి ఢిల్లీ, చెన్నయ్, తమిళనాడులోని పలు పట్టణాలకు టమోటా ఎక్కువగా సరఫరా అవుతోంది. ఆయా ప్రాంతాల్లో హోల్సేల్గానే ధర అధికంగా పలుకుతోంది. దీంతో కృష్ణాజిల్లాతోపాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు మదనపల్లి నుంచి టమోటా సరఫరా పెద్దగా ఉండటంలేదు. తమిళనాడులో వర్షాల వల్ల టమోటా తోటలు దెబ్బతినడంతో అక్కడి వ్యాపారులు మదనపల్లి, అనంతపురం నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు లేక పోవటంతో దిగుబడి ఆలస్యమై కొరత ఏర్పడింది. అనంతపురం, మదనపల్లిలో గ్రేడింగ్ చేసి నాణ్యమైన సరుకును అధిక ధరకు చెన్నై, ఢిల్లీకి ఎగువతి చేసి, నాసిరకం సరకు మనకు అంటగడుతున్నారని విజయవాడ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం విజయవాడ బహిరంగ మార్కెట్లో కిలో ధర రూ.60కి చేరింది. రైతు బజారుల్లో రూ.34 చొప్పున విక్రయిస్తున్నారు. విజయవాడ స్వరాజ్యమైదానంతో పాటు జిల్లాలో అన్ని రైతుబజార్లకు మూడు రోజుల నుంచి నాసిరకం టమోటా సరఫరా అవుతోంది. మంచి రకం టమోటాను బహిరంగ మార్కెట్లలో అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. ఈ నెల రెండో తేదీ నుంచి టమోటా ధర పెరుగుతోంది. గత నెలలో కిలో రూ.19 చొప్పున రైతు బజారుల్లో విక్రయించారు. బహిరంగ మార్కెట్లో రూ.25 చొప్పున ధర పలికింది. కొద్ది రోజుల్లోనే కిలో ధర రూ.60కి చేరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరో 10 రోజుల్లో జిల్లాలోనూ టమోటా ఉత్పత్తులు వస్తాయని, అప్పటి వరకూ ధరలు అధికంగానే ఉంటాయని మార్కెటింగ్ అధికారులు భావిస్తున్నారు. -
కొండెక్కిన టమాటా
♦ కిలో ధర రూ.50కి పైనే.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ♦ వర్షాభావంతో సాగు పడిపోవడం, తెగుళ్లతో దిగుబడి తగ్గడమే కారణం ♦ విలవిల్లాడుతున్న సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు సాక్షి నెట్వర్క్: మొన్న ఉల్లి.. నిన్న కందిపప్పు.. ఇప్పుడు టమాటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రెండు మూడు రోజులుగా సామాన్య, మధ్యతరగతి వినియోగదారులను ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో టమాటా ధర కిలో రూ.50కి చేరుకుంది. ధరలు తక్కువగా ఉండే రైతు బజార్లలోనే రూ. 40 దాటిపోవడం గమనార్హం. మరికొద్ది రోజుల పాటు మార్కెట్లో టమాటా ధరలు అస్థిరంగానే ఉండవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు బాగా ఉండడం, వర్షాభావం కారణంగా బోర్లు, బావుల్లో నీరు ఎండిపోవడంతో హైదరాబాద్ శివారు ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి, శామీర్పేట, దౌల్తాబాద్, తూ ప్రాన్, మహేశ్వరం, సరూర్నగర్ మండలాల్లో టమాటా సాగు తగ్గిపోయింది. దీనికితోడు తెగుళ్లతో దిగుబడి తగ్గిపోవడంతో... టమాటాకు కొరత ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న వ్యాపారులు ధరలు పెంచేశారు. ప్రస్తుతం ఏపీలోని మదనపల్లి నుంచి వచ్చే టమాటా దిగుమతులపైనే హైదరాబాద్ ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు మిగతా కూరగాయల ధరలు కూడా పెరుగుతున్నాయి. పచ్చిమిర్చి, బెండ, బీర, కాకర, చిక్కుడు తదితర కూరగాయల ధరలు కిలో రూ. 30 నుంచి రూ. 35 వరకు చేరాయి. జిల్లాల్లోనూ అదే పరిస్థితి.. సామాన్యులకు అందుబాటులో ఉండే టమా టా ధర జిల్లాల్లోనూ కొండెక్కింది. వర్షాభావంతో టమాటా సాగు తగ్గడం, వేసిన టమాటా పంట కూడా ఎండల ధాటికి ఎండిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్లలో కిలో రూ. 50ని దాటిపోయింది. శనివారం నల్లగొండ జిల్లా భువనగిరిలో కిలో టమాటా ధర రూ. 60 పలికింది. నల్లగొండ పట్టణంలోని మార్కెట్లో రూ.50లకు ఎగబాకింది. స్థానికంగా చిన్న రైతులు పండించిన కొద్దిపాటి లోకల్ టమాటా మాత్రం కిలో రూ. 30 నుంచి రూ.35 మధ్య విక్రయిస్తున్నారు. ఇక కరీంనగర్, నిజామాబాద్ మార్కెట్లలో కిలో టమాటా ధర రూ. 40పైనే పలుకుతోంది. వర్షాభావానికి తోడు తెగుళ్లతో రెండు జిల్లాల్లోని చాలా చోట్ల టమా టా పంటకు నష్టం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో టమాటా ధర పదిహేను రోజుల కింద రూ.15 నుంచి రూ.20 వరకు ఉండగా... ఇప్పుడు దాదాపు మూడింతలు పెరిగి కిలో రూ. 50కి చేరింది. వర్షాభావ పరిస్థితులతో రైతులు టమాటా సాగును చాలా చోట్ల నిలిపివేశారు. ఖమ్మం జిల్లాలో రైతు బజార్లలో శనివా రం టమాటా ధర కిలో రూ.46 పలికింది. రిటైల్ దుకాణాల్లో రూ.52 నుంచి రూ.55 వరకు విక్రయించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కిలో రూ.10 పలికిన టమాటా ధర నెల రోజుల్లో నాలుగైదు రెట్లు పెరగడం గమనార్హం. టమాటా రేటు బాగా పెరగడంతో వినియోగదారులు బెంబేలు ఎత్తుతున్నారు. -
కిలో టమాటా ఒక్క రూపాయికే!
కూడేరు (అనంతపురం) : టమాటా ధర కనిష్ట స్థాయికి పడిపోవటంతో రైతులు బెంబేలెత్తుతున్నారు. మార్కెట్కు తీసుకువచ్చిన టమాటా పంటను ధర గిట్టుబాటు కాకపోవటంతో తిరిగి తీసుకెళ్లలేక రోడ్డు పక్కనే పారబోసి వెళ్లిపోతున్నారు. ఇది అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రంలోని పరిస్థితి. మండలంలో దాదాపు 300 ల ఎకరాల్లో టమాటా పంట పండిస్తున్నారు. అయితే గత రెండు మూడు రోజులుగా టమాటా ధర మార్కెట్లో బాగా పడిపోయింది. శనివారం కిలో రూ.1కి తగ్గిపోవటంతో రైతులు రోడ్డు పక్కన పారబోశారు. కొందరు రైతులు పంటను కోయకుండా చేలల్లోనే వదిలేశారు. -
‘ఉల్లి’కిపడుతున్న టమాటా!
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మహా నగర మార్కెట్లో మాయాజాలం రాజ్యమేలుతోంది. దళారుల దగాతో ఉల్లి ధర మరింత ఘాటెక్కు తూ ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తుంటే.. టమాటా ధరలు భారీగా తగ్గుతూ పండించిన రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. హోల్సేల్ మార్కెట్లో శనివారం ఉల్లి, టమాటాలకు పలికిన ధర ల్లో భారీ వ్యత్యాసాలు కనిపించాయి. మలక్పేటలోని మహబూబ్ మాన్షన్ హోల్సేల్ మార్కెట్లో గ్రేడ్-1 రకం ఉల్లికి క్వింటాల్ రూ.3,800, గ్రేడ్-2 ఉల్లికి రూ.2,400 కనీస మద్దతు ధర నిర్ణయం కాగా, టమాటా మాత్రం బోయిన్పల్లి హోల్సేల్ మార్కెట్లో క్వింటాల్కు రూ.500 మత్రమే మద్దతు ధర పలికింది. ఇదే సరుకు రిటైల్ మార్కెట్లోకి వచ్చే సరికి ఉల్లి కేజీ రూ.45-50లు ధర పలుకుతుండగా, టమాటా కేజీ రూ.7-10ల మధ్య లభిస్తోంది. స్థానికంగా పండించిన పంటలకు ఏ మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. అదే ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొంటున్న ఉల్లికి మాత్రం భారీగా చెల్లించాల్సి వస్తోంది. ఇందులో లబ్ధి పొందుతున్నది మా త్రం దళారులే. నిత్యావసరాలైన రెండు ప్రధాన వస్తువుల ధరల్లో భారీ వ్యత్యాసం ఉండటం మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఉల్లిని స్థానికంగా పండించేం దుకు రైతులను ప్రోత్సహించకపోవడం ఒక కారణమైతే... సమృద్ధిగా దిగుబడి వ చ్చే టమాటాను నిల్వ చేసుకొనే సాంకేతికత అం దుబాటులో లేకపోవడం మరో వైఫల్యంగా కన్పిస్తోంది. నగరంలో డిమాండు-సరఫరాల మధ్య తీవ్రమైన అంతరం ఉండటంతో కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి. ధరలను అదుపులోకి తెచ్చేందుకు సబ్సిడీ పథకం పేరుతో మార్కెటింగ్ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ప్రచార ఆర్భాటానికే పరిమితమవుతున్నాయి. కూరగాయల కొరత కారణంగా రైతు బజార్తో సహా బహిరంగ మార్కెట్లో దళారుల దోపిడీ దర్జాగా కొనసాగుతోంది. టమాటా కొత్త పంట దిగుబడి ప్రారంభం కావడంతో ధర దిగివచ్చింది. ప్రస్తుతం రైతుబజార్లో కిలో టమాటా రూ.9 పలుకుతుండగా, బహిరంగ మార్కెట్లో రూ.13 ఉంది. దీంతో పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, మాదన్నపేట హోల్సేల్ మార్కెట్లకు శనివారం 230కి పైగా డీసీఎం లు, ఆటోల్లో టమోటా వచ్చినట్లు మార్కెటింగ్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం సబ్సిడీ ధరపై ఉల్లి విక్రయాలు ప్రారంభించినా నగరంలోని అన్ని ప్రాంతాల్లో రైతుబజార్లు లేకపోవడంతో వినియోగదారులు రిటైల్ మార్కెట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. నిల్వలపై నిర్లక్ష్యం.. మార్కెట్లో మరింత కొరతను సృష్టించి... ధరలను పెంచి సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు ఎత్తుగడ వే సి పెద్దమొత్తంలో ఉల్లిని నిల్వ చేసినట్లు సమాచారం. హోల్సేల్ మార్కెట్ వరకు తాము పర్యవేక్షిస్తామే తప్ప, బహిరంగ మార్కెట్లో ధరలను నియంత్రించడం తమ చేతుల్లో లేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. -
పడిలేస్తున్న టమాట
జిల్లాలో టమాట ధరలు నిలకడగా ఉండడం లేదు. ఒకసారి పూర్తిగా పడిపోతే మరోసారి భారీగా పెరుగుతోంది. హోల్సేల్, రిటైల్ మార్కెట్కు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. వ్యాపారులు, మధ్యవర్తులు లాభపడుతుండగా ఆరుగాలం కష్టపడిన రైతన్న మాత్రం నష్టాలను చవిచూస్తూనే ఉన్నాడు. రైతు తను పండించిన టమాటాను మార్కెట్లో కిలో రూ.14కు (ప్రస్తుత ధర ప్రకారం) అమ్మి, రిటైల్ మార్కెట్లో రూ.24కు కొనాల్సి వస్తోంది. టమాట విస్తీర్ణం భారీగా పెరగడంతో ధరలు తగ్గాయన్న వాదన ఉంది. - పలమనేరు - మార్కెట్లో నిలకడ లేని ధరలు - హోల్సేల్కు, రిటైల్కు మధ్య వ్యత్యాసం - మూడేళ్లుగా భారీగా పెరిగిన సప్లయ్ రైతుకు మిగిలేది సున్నే.. గంగవరం మండలం కూర్నిపల్లెకు చెందిన వెంకటేష్ తన ఎకరా పొలంలో టమాట సాగు చేశాడు. దానికి సంబంధించి ఖర్చు లు ఇలా ఉన్నాయి. - భూమి దున్నకం, నర్సరీ నుంచి మొక్కల కొనుగోలు(ఎకరాకు 8వేల మొలకలు. మొలక రూ.50 పైసలు)కు రూ.5వేలు. - టమాటకు స్టిక్లు ఎకరాకు 1200. ఒకటి రూ.20 చొప్పున రూ.24వేలు - సేంద్రియ ఎరువు పదిలోడ్లు, కాంప్లెక్స్ ఆరు బస్తాలు రూ.27వేలు - క్రీమి సంహారక మందులు రూ.10 వేలు - కూలీల ఖర్చు రూ.15 వేలు. ఆ లెక్కన ఎకరాలో పంటసాగుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.81 వేలు. - ఎకరాకు మంచి దిగుబడి వస్తే వెయ్యి బాక్సులు (బాక్సు 14 కేజీ లు). ఈ ఏడాది సగటు ధర రూ.200. ఆ లెక్కన రూ.2 లక్షలు. - 20 కిలోమీటర్ల నుంచి టమాట బాక్సును మార్కెట్కు తరలిం చేందుకు రూ.5 నుంచి 10 - టమాట మండీలు రైతు నుంచి 10 శాతం కమీషన్ (రూ.20) వసూలు చేస్తున్నాయి. కోతకు రైతు వ్యక్తిగత ఖర్చు రూ.50. - ఓ బాక్సు కాయలు కోసేందుకు కూలీ ఖర్చు రూ.15. ఆ లెక్కన ఓ బాక్సు టమాట రవాణా, తదితరాల ఖర్చు ప్రస్తుత ధర ప్రకారం రూ.100. - వెయ్యి బాక్సులకు రూ.100 చొప్పున రూ.లక్ష ఖర్చు - పంట సాగుకు పెట్టిన ఖర్చు రూ.81వేలు, మార్కెటింగ్ తదితర ఖర్చులు రూ.లక్ష మొత్తం 1.81 లక్షలు. రైతు రాబడి రూ.2లక్షలు. రైతుకు మిగిలేది కేవలం 19వేలు మాత్రమే. దీనికోసం రైతు కుటుంబ సభ్యులంతా కష్టపడాల్సి ఉంటుంది. భారీగా పెరిగిన సప్లయ్.. ఐదేళ్ల క్రితం జిల్లాలో ఆరువేల హెక్టార్లలో టమాట సాగయ్యేది. మూడేళ్లుగా పెరిగిన నర్సరీలు, పంట విస్తీర్ణంతో ప్రస్తుతం జిల్లాలో 12వేల హెక్టార్లలో టమాట సాగవుతోంది. ఏడాదికి ఇక్కడ 4.80 లక్షల మెట్రిక్ టన్నుల టమాట ఉత్పత్తి అవుతోంది. సప్లయ్కు సరిపడా డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గుముఖం పడుతోంది. పైగా కర్ణాటక, అనంతపురం జిల్లాల నుంచి సరుకు భారీగా ఇక్కడికొస్తోంది. దీని ప్రభావం ధర మీద పడుతోంది. ఆంధ్రలోని పలు జిల్లాలకు చెందిన వ్యాపారులు, తమిళనాడులోని చెన్నై, రాణిపేట్, ఆర్కాడ్, నైవేలి, విరుదాచలం, కారైకూడి నుంచి వ్యాపారులొస్తున్నారు. ఆ ప్రాంతాల్లో లోకల్ టమాట ఉన్నపుడు వీరు ఇక్కడికి రాక ధరలు అమాంతం తగ్గుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలే దిక్కు.. - డిమాండ్ను బట్టి టమాట సాగుచేసేలా చర్యలు - కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు - దళారులతో పనిలేకుండా డెరైక్ట్ మార్కెటింగ్ - రైతు బజార్ల పెంపు - మండల స్థాయిలో రైతుల కమిటీలు, నర్సరీల నియంత్రణ - టమాట పల్ప్, పికెల్, పౌడర్ యూనిట్ల ఏర్పాటు -
ట‘మోత’
సాక్షి, సిటీబ్యూరో: మార్కెట్లో టమాట ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఇటీవల ధర తగ్గినట్టేతగ్గి మళ్లీ పైపైకి ఎగబాకుతోంది. వారం కిందట కిలో రూ. 12-15 ఉన్న టమాట ధర ఒక్కసారిగా రూ. 30 లకు పెరిగింది. ఇళ్లవద్దకు వచ్చే తోపుడు బండ్ల వారైతే కేజీ రూ. 35కు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరుగుతుండడంతో ఆ ప్రభావం పంట దిగుబడిపై పడిందని, ఈ కారణంగానే ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. స్థానికంగా సాగవుతున్న టమాట పంట కూడా చివరి దశకు చేరడం నగరంలో కొరతకు ఓ కారణంగా నిలిచింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి దిగుమతి అయ్యే టమాటపైనే నగరం ఆధార పడాల్సి వస్తోంది. నగర డిమాండ్కు తగ్గట్టు సరుకు సరఫరా కాకపోవడంతో ఇదే అదనుగా భావించి వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. నిజానికి హోల్ సేల్ మార్కెట్లో ఆదివారం కిలో రూ. 20లు ధర పలికింది. దీనికి రూ. 3లు అదనంగా వేసి రైతుబజార్లలో ధర నిర్ణయించడంతో అక్కడ కిలో రూ.23లకు విక్రయించారు. ఇదే సరుకు బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి కిలో రూ. 30-35 ప్రకారం వసూలు చేస్తున్నారు. ఘాటెక్కిన మిర్చి హోల్సేల్ మార్కెట్లో కేజీ రూ.26లున్న పచ్చిమిర్చి ధర రిటైల్ మార్కెట్లో కేజీ రూ.40లకు చేరింది. నగర అవసరాలకు నిత్యం 100-150 టన్నుల మిర్చి దిగుమతి అయ్యేది. ప్రస్తుతం 100 టన్నుల లోపే మిర్చి దిగుమతి అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం లోకల్గా మిర్చి సరఫరా తగ్గిపోవడంతో గుంటూరు, విజయవాడ, అనంతపురం, బెంగళూరుల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు. బెండ, దొండ, బీర, కాకర, దోస తదితరాల ధరలు కేజీ రూ.40లకు చేరువయ్యాయి. ఇక క్యారెట్, చిక్కుడు, గోకర, ఫ్రెంచ్ బీన్స్ ధరలైతే సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. -
మళ్లీ తారాజువ్వల్లా..!
న్యూఢిల్లీ: టమాటాలు, ఉల్లిపాయల ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. నగరంలో బుధవారం కిలో టమాటా రూ. 70 కాగా ఉల్లిపాయలు రూ. 40లకు విక్రయిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆశించినమేర వర్షాలు కురియకపోవడం, పంట దిగుబడి తగ్గిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇక మదర్డెయిరీ సఫల్ మార్కెట్లలో కిలో రూ. 55, ఉల్లిపాయలు రూ. 29 పలుకుతున్నాయి. ఇక స్థానిక చిల్లర వ్యాపారులు కిలో టమాటాలను దాదాపు రూ. 70కి విక్రయిస్తున్నారు. మరోవైపు ఆజాద్పూర్ మార్కెట్లో కిలో టమాటాలు రూ. 45 నుంచి రూ. 50 పలుకుతున్నాయి. టోకు మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధరలు రూ. 20 నుంచి రూ. 25 వరకూ పలుకుతున్నాయి. హిమాచల్ప్రదేశ్ నుంచి నగరానికి టమాటా ట్రక్కుల రాక తగ్గిపోయింది. నగరానికి పెద్దసంఖ్యలో టమాటాలు ఆ రాష్ట్రం నుంచే వస్తాయి. టమాటాల ధరలు పెరగడంపై ఆజాద్పూర్ మండీ టమాటా మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దర్శన్లాల్ మాట్లాడుతూ కరువు ప్రభావమే కారణమన్నారు. నాసిక్, బెంగళూర్లతోపాటు ఉత్తరాది నుంచి నగరానికి టమాటా ట్రక్కుల రాక గణనీయంగా తగ్గిపోయిందన్నారు. -
టమోటా ధరపై గందరగోళం!
గుడివాడ : టమోటా ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఎలాగైనా ధరలను అదుపు చేయాలని జిల్లా అధికారులు భావించారు. అధికారులు చెప్పినట్లు చేస్తే తాము నష్టపోతామని రైతులు రైతుబజారుల్లో టమోటా విక్రయాలను నిలిపివేశారు. ధరల నియంత్రణకు టమోటా, వంకాయ, బెండకాయ, ఉల్లిపాయలను అన్ని రైతు బజారుల్లో ఒకే ధరకు విక్రయించాలని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి ఆదేశాలు జారీచేశారు. ఆయా ధరలను అధికారులే నిర్ణయిస్తారు. ఈ క్రమంలో సోమవారం టమోటా కిలో ధర రూ.35గా ప్రకటించారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. మన జిల్లాలో టమోటా పంట లేదని, తాము హోల్సేల్ మార్కెట్లో ఎక్కువకు కొనుగోలు చేసి తక్కువ ధరకు ఎలా విక్రయించగలమని ప్రశ్నించారు. రైతుబజార్లలో విక్రయాలు నిలిపివేశారు. గుడివాడలో మంగళవారం రైతుబజారు బయట టమోటాలను కిలో రూ.41కు విక్రయించారు. అధికారులు స్పందించి బుధవారం టమోటా కిలో రూ.41గా నిర్ణయించడంతో రైతుబజారుల్లో యథావిధిగా విక్రయాలు కొనసాగించారు. -
టమాట ధరలు పతనం
మదనపల్లె, న్యూస్లైన్: మదనపల్లె టమాట మార్కెట్లో ధరలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం మరింత తగ్గాయి. ఈనెల 6, 7 తేదీల్లో మొదటి రకం 10 కిలోల బుట్ట ధర రూ.27, రెండవ రకం రూ.25, మూడోరకం రూ.20 పలికింది. 8, 9 తేదీల్లో మొదటి రకం రూ.25, రెండవ రకం రూ.20, మూడో రకం రూ.14 పలకగా 11వతేదీ మొదటి రకం రూ.30, రెండవ రకం రూ.22, మూడవ రకం రూ.16 పలికింది. అయితే బుధవారం మొదటి రకం రూ.23లు, రెండవ రకం రూ.18లు, మూడవ రకం రూ.13 పలికింది. మదనపల్లె నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, కాకినాడ, గుంటూరుకు ప్రస్తుతం ఒక్క లోడు కూడా కాయలు వెళ్లడం లేదు. ఆ ప్రాంతాల్లో దిగుబడి అధికంగా రావడంతో ఇక్కడి నుంచి ఎగుమతి నిలిచిపోయింది. ప్రస్తుతం తమిళనాడులోని చెన్నై, కుంభకోణం, తిరుచ్చి ప్రాంతాలకు మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. అంతే కాకుండా ప్రతిరోజు 5 నుంచి 7 లోడ్ల వరకు పలమనేరు, చిత్తూరులోని జ్యూస్ ఫ్యాక్టరీలకు కాయలు తరలుతున్నాయి. -
కుప్పకూలిన టమోటా ధరలు
కడప అగ్రికల్చర్,న్యూస్లైన్ : జిల్లాలో టమాటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. 15రోజుల కిందట వరకు కిలో రూ. 20 నుంచి రూ. 30లు పలికిన ధర నేడు కిలో రూ. 5లకు పడిపోయింది. దిగుబడి లేనప్పుడు ధర బాగా ఉండి... దిగుబడి పెరిగే సమయంలో ధరలు పడిపోవడం పరిపాటిగా మారి రైతులను కుంగదీస్తోంది. జూన్.జూలై, ఆగస్టు నెలల్లో కిలో టమాటా ధర రూ. 30-40 మధ్య పలకడంతో కొందరు రైతులు అప్పట్లో ఎకరాకు ఖర్చులన్నీ పోను లక్ష నుంచి లక్షన్నర రూపాయల దాకా లాభాలు గడించారు. దీంతో మరికొంత మంది రైతులు సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో కురిసిన వర్షాలకు జిల్లాలో సరాసరి 6, 500 ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం రోజుకు సగటున ఈ పంట మార్కెట్కు 120 టన్నుల దిగుబడి వస్తోందని ఉద్యాన అధికారులు తెలిపారు. 15-20 రోజుల కిందట గంప (20 నుంచి 30 కిలోలు) రూ. 600 నుంచి రూ. 1200 పలికింది. ప్లాస్టిక్ బాక్స్ (15 నుంచి 20 కిలోలు) రూ. 450 నుంచి రూ. 800 పలికింది. కొందరు రైతులైతే మార్కెట్ ధరలను చూసి అధిక వడ్డీలకు అప్పుతెచ్చి మరీ పంట సాగు చేశారు. ఇప్పుడున్న ధరలతో పంటను అమ్ముకోలేక, కూలీలకు కూలి ఖర్చులు కూడా ఇవ్వలేక, అప్పులకు వడ్డీలు చెల్లించలేక లబోదిబో అంటున్నారు. ఇదే టమోటా కిలో రైతు వద్ద వ్యాపారులు, దళారులు రూపాయి లెక్కన కొనుగోలు చేసి వాటిని మార్కెట్కు తరలించి కిలో 4 రూపాయలకు చిరువ్యాపారులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. టమోటాలు డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఇక్కడ నుంచి తరిలించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పెట్టుబడి కూడా రావడం లేదు నేతు రెండెకరాల్లో టమోటా సాగు చేశాను. పంట దిగుబడి ఆశాజనకంగా వచ్చినా ధర లు లేవు. మార్కెట్కు 30 కిలోల గంప ట మోటాలు తీసుకుపోతే కమీషన్, దెబ్బతిన్న కాయలు 2 కిలోల తొలగింపు, ఆటో ఖర్చు లు కలిపి రూ.14 పోను రూ.16 చేతికొచ్చిం ది. ఇలా అయితే పెట్టుబడి కూడా రాదు. - గోవింద్రెడ్డి, టమాట రైతు, గొర్లపల్లె ధరలు విషయం మా చేతుల్లో లేదు అటు ఖరీఫ్, ఇటు ర బీ దాటి పంట దిగుబ డులు మార్కెట్ను ముంచెత్తడంతో ధరలు తగ్గాయి. దీంతో రైతులకు పెట్టుబడులు కూ డా రాని పరిస్థితి ఉంది. సాగుకు సహాయం అందించగలం గానీ, ధరల విషయంలో తాము చేసేదేం ఉండదు. అదంతా ప్రభుత్వం, మార్కెటింగ్శాఖలే చూసుకుంటాయి. - మధుసూదనరెడ్డి, అసిస్టెంట్ డైరక్టర్, జిల్లా ఉద్యానశాఖ-1 -
మళ్లీ చితికిన టమాటా
చేవెళ్ల మార్కెట్లో 25 కిలోల బాక్సు రూ.50 నుంచి రూ.80 మాత్రమే చేవెళ్ల, న్యూస్లైన్: టవూట పంట దిగుబడి వచ్చే సవుయుంలో ధర 90శాతం పడిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతవువుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మార్కెట్లో సరిగ్గా 20 రోజుల క్రితం.. 25 కిలోల టమాటా బాక్సు ధర రూ.600. ఇప్పుడది రూ.50 నుంచి రూ.80 మాత్రమే. రైతుల చేతికి దిగుబడి వచ్చే సమయంలోనే ధర ఒక్కసారిగా పతనమైంది. నెల క్రితం ధరలు చూసి టమాటా రైతులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ధర చూసి లబోదిబోమంటున్నారు. స్థానిక హోల్సేల్ మార్కెట్లో కిలో ధర రూ.2.50 నుంచి రూ.3 వూత్రమే ఉంది. ఈ ధరతో కనీసం కూలీలు, రవాణా చార్జీలు కూడా రావడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా క్రమంగా పతనమవుతూ వస్తున్న ధర శుక్రవారం అమాంతం పడిపోయింది. ఈ ధరతో కూలీలకు చార్జీలు కూడా చెల్లించలేమని రైతులు వాపోతున్నారు. అయితే, టమాటాను తమ వద్ద తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు హైదరాబాద్, కరీంనగర్ తదితర మార్కెట్లకు తరలించి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని రైతులు వాపోయూరు. -
టమోటా తగ్గుముఖం
మైదుకూరు(చాపాడు), న్యూస్లైన్ : టమోటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు నెలలుగా వాటి ధరలు ఆకాశాన్ని అంటడంతో పసుపు, వరి సాగు చేసుకున్న రైతులు తాము కూడా టమోటా సాగు చేసుకున్నా బాగుండునేమోనని ఆటోచనలో పడ్డారు. ఇప్పడైనా సాగు చేద్దామని ఇటీవల రైతులు ఎక్కువ విస్తీర్ణంలో టమోటా సాగుచేశారు. అయితే వారి ఆశలు ఆవిరి అవుతున్నాయి. టమాటాను ఎందుకు సాగు చేశామా అనే సందిగ్ధంలో పడ్డారు. మైదుకూరు మండలం వ్యాప్తంగా సుమారు ఆరు వేల ఎకరాలలో రైతులు టమోటా సాగు చేశారు. రెండు నెలలుగా టమోటాల దిగుబడులు అధికంగా రావడంతోపాటు ధరలు కూడా అధికంగానే ఉంటూ వచ్చాయి. సమైక్యాంధ్రా ఉద్యమం ప్రారంభం నుంచి రెండు వారాల క్రితం వరకు ధరలు బాగానే ఉన్నాయి. గతంలో 20 కేజీల టమోటాల బాక్సు రూ.1000-రూ.1200 వరకు పలికింది. ఆ సమయంలో రైతులు సొమ్ము చేసుకున్నారు. రెండు వారాల క్రితం నుంచి టమోటా రైతు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. బాక్సు రూ.1000 ఉన్న ధరలు రోజుకు రోజుకు తగ్గిపోతూనే ఉంది. 20 కేజీల టమోటాల బాక్సు ధరలు క్రమంగా రూ.800, రూ.600, రూ.400 నుంచి ఏకంగా రూ.210-రూ.220లకు పడిపోయాయి. ‘దిగుబడి చూస్తే పెరుగుతోంది.. ధరలు చూస్తే తగ్గుతున్నాయి.. వ్యాపారులేమో రోజుకొకరేటు చెబుతున్నారు... ఎంటి మన పరిస్థితి’ అన్న సందిగ్ధంలో రైతన్నలు ఉన్నారు. ఇతర ప్రాంతాలకు తరలింపు మైదుకూరు ప్రాంతంలో పండిన టమోటను వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వైజాగ్, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడు, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాలలో రెట్టింపు ధరలు ఉన్నట్లు తెలుస్తోంది. పెట్టుబడైనా తిరిగి వస్తుందేమోనని.. నేను ఎకరాన్నర్ర పొలంలో టమోటా పంటను సాగు చేశాను. రెండు వారాల క్రితం నుంచే పంట వస్తోంది. ప్రస్తుతం కోతకు 15 బాక్కులు వస్తున్నాయి. ఎకరా సాగుకు రూ.30వేలు పైగా పెట్టుబడి అయింది. ధరలు చూస్తే రోజు రోజుకు తగ్గుతున్నాయి. ఎంత త్వరగా పంటను అమ్మి తమ పెట్టుబడిని సొమ్ము చేసుకోవాలని తాపత్రయపడుతున్నా. - ఎం.సుబ్బరాజు, టమోటా రైతు, విశ్వనాథపురం