tv channel
-
ఏడాది కిందటి పోస్టులపై ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏమిటో!
సాక్షి, అమరావతి: ‘నేను ఏడాది కిందట సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఇప్పుడు కొందరి మనోభావాలు హఠాత్తుగా దెబ్బతినడం ఏమిటో అర్థం కావడం లేదు. పత్రికల్లో ప్రచురించే కార్టూన్ల మాదిరిగానే నేను కూడా కొన్ని పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. పత్రికలకు ఉన్నట్టే వ్యక్తులకు కూడా కాస్త భావప్రకటన స్వేచ్ఛ ఉంది. కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించవచ్చు. ఆ పోస్టులు పెట్టినప్పుడు.. అంటే ఏడాది కిందట ఎవరూ తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అనలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయనూ లేదు. ఆ పోస్టుల్లో నేను పేర్కొన్నవారు కూడా కనీసం అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయనేలేదు.కానీ హఠాత్తుగా ఏడాది తరువాత.. అదీ ఆంధ్రప్రదేశ్లోని వేర్వేరు ప్రాంతాల్లోని వ్యక్తులకు ఒకేసారి మనోభావాలు దెబ్బతినడం ఏమిటో..! వాళ్లు ఒకేసారి వేర్వేరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయడం ఏమిటో..! పోలీసులు వెంటనే కేసులు పెట్టడం ఏమిటో..! దీన్నిబట్టి ఈ ఫిర్యాదులు, కేసుల వెనుక ఏం జరిగిందన్నదీ.. ఎంత పక్కా స్క్రిప్ట్ ఉందన్నదీ స్పష్టం అవుతునే ఉంది..’ అని సినీ దర్శకుడు రామ్గోపాల్ వర్మ అన్నారు. ఆయన ఆదివారం వివిధ టీవీ చానళ్ల డిబేట్లలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. -
Sakshi Little Stars: తారే జమీన్ పర్
‘మేం పాటలు పాడతాం. డైలాగ్స్ గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తాం. పొడుపుకథలు వేస్తాం, ప్రశ్నలతో తికమక పెట్టేస్తాం. స్కూల్లో చదువుకుంటాం, సినిమాల్లో నటిస్తాం, డ్యాన్స్లే కాదు అల్లరి కూడా చేస్తాం ...’ అంటూ బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం ‘సాక్షి’ మీడియా హౌస్ హైదరాబాద్ ఆఫీసులో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా పలువురు బాల తారలు తమ ఆనందాలను పంచుకున్నారు. స్కూల్ విద్యార్థులు అడిగిన పొడుపు కథలకు ఈ ‘లిటిల్ స్టార్స్’ ఆన్సర్ చేయడం, లిటిల్ స్టార్స్ కోరిన పాటలను స్కూల్ విద్యార్థులు పోటీ పడుతూ పాడటంతో కార్యక్రమం సందడిగా మారింది.స్కూల్లో రన్నింగ్, ఖోఖో, కబడ్డి, క్రికెట్, బాస్కెట్ బాల్... వంటి ఆటలన్నీ ఆడతాం అంటూ మొదలు పెట్టిన పిల్లలు కరెంట్ షాక్ ఎందుకు తగులుతుంది? బాల్ని కొడితే ముందుకు ఎలా వెళుతుంది? అంటూ సైన్స్ పాఠాలనూ వినిపించారు. లెక్కలు ఇష్టం అంటూనే డాక్టర్లం అవుతాం అనే భవిష్యత్తు ప్రణాళికలనూ చెప్పారు. సోషల్ మీడియాలో తమకున్న ఫాలోవర్స్ గురించి, చేస్తున్న రీల్స్ గురించి వివరించారు. ‘సాక్షి’ మీడియా హౌస్ వారం రోజుల పాటు జరిపిన ‘లిటిల్ స్టార్స్’ కార్యక్రమంలో భాగంగా కలిసిన చిన్నారులను గుర్తుకు తెచ్చుకొని, ‘మరో ప్రపంచం తెలుసుకున్నాం’ అంటూ తమ స్పందనను తెలియజేశారు బాల తారలు. టీవీ చానల్కి సంబంధించిన న్యూస్రూమ్, పీసీఆర్ వంటి వాటిని చూసి సంభ్రమాశ్చర్యాలను వెలిబుచ్చారు.మేమిద్దరం కవలలం. కలిసే చదువుకుంటాం. సినిమాల్లోనూ కలిసే వర్క్ చేస్తాం. మేం ఇద్దరం పెద్దయ్యాక సాఫ్ట్వేర్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. ఈ ్రపోగ్రామ్ ద్వారా మా ఇద్దరి ఆలోచనలను, మా ప్రతిభను షేర్ చేసుకునే అవకాశం లభించింది. ఇక్కడ న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకొని ఆశ్చర్యపోయాం. ఈ చిల్డ్రన్స్ డే మాకు వెరీ వెరీ స్పెషల్. – అర్జున్, అర్విన్నాకు నటుడిగా గుర్తింపు వచ్చిందంటే మా అమ్మే కారణం. ఇప్పటి వరకు పది సినిమాల్లో బాల నటుడిగా నటించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన తరువాత స్కూల్లో ఫ్రెండ్స్ నీ క్యారెక్టర్ సూపర్గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. రెండు మూడు పేజీల డైలాగ్లు కూడా ఒకేసారి చెప్పగలను. ఈ కార్యక్రమం ద్వారా నేను సినిమాల్లోని డైలాగ్స్ చెప్పే అవకాశం లభించింది. అలాగే, న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకున్నాను. ఈ పోగ్రామ్ మాకు పాఠంలా కొత్తదనాన్ని పరిచయం చేసింది. థాంక్యూ సాక్షి.– కె. హర్షచదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!ఏడేళ్ల వయసు నుంచి సినిమాలలో నటిస్తున్నాను. చదువు, సినిమాలతో పాటు బాస్కెట్ బాల్, క్రికెట్, డ్యాన్స్ కూడా చాలా ఇష్టం. స్కూల్, సినిమా షూటింగే కాదు ‘సాక్షి’ ఏర్పాటు చేసిన ‘లిటిల్స్టార్స్’లో భాగంగా నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలను కలిసినప్పుడు చాలా బాధపడ్డాను. తలస్సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలను చూసి, అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను. అలాగే ఈ ఫైనల్ ఈవెంట్లో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోని డైలాగ్ చెప్పినప్పుడు అందరూ గ్రేట్ అంటూ మెచ్చుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. మమ్మల్ని ఎంకరేజ్ చేసే ఈ ్రపోగ్రామ్ చాలా బాగుంది. అందరికీ థ్యాంక్స్. – మోక్షజ్ఞతలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను కలవడానికి ‘సాక్షి’ మీడియా ద్వారా వెళ్లాను. చిన్న చిన్న పిల్లలు ఆ వ్యాధితో బాధపడుతుండటం చూసి, చాలా బాధగా ఫీలయ్యాను. కాసేపు వాళ్ల బాధని మరచిపోయేలా చేయాలని వాళ్లు అడిగిన డైలాగ్స్ చెప్పాను. వాళ్లను ఎంకరేజ్ చేసేలా మాట్లాడాను. మామూలుగా నేను చదువుకుంటాను, సినిమాలు చేస్తుంటాను. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. అలాంటి నాకు ఇలాంటి పిల్లలతో కాసేపు టైమ్ స్పెండ్ చేయడం ఓ డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్లినట్లు అనిపించింది. ఇక ‘సాక్షి మీడియా’ హౌస్లో ఏర్పాటు చేసిన ‘‘లిటిల్స్టార్స్’లో నాతోటి యాక్టర్స్తో కలిసి ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. – అనన్య ఈగ3చేసే పనిపై ఇష్టం ఉంటుంది కాబట్టి చదువు–సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటాను. ఈ ్రపోగ్రామ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘స్పర్శ్’ హాస్పిస్ కేంద్రంలో సేవలు పొందుతున్న చిన్నారులను కలిశాం. వారి పరిస్థితి చూశాక చాలా బాధ అనిపించింది. వారి ముఖాల్లో నవ్వులు తెప్పించాలని డ్యాన్స్లు చేశాం, పాటలు పాడాం... ఈ ఎక్స్పీరియన్స్ను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిల్డ్రన్స్ డే మాకు సాక్షి ఇచ్చిన ఓ పెద్ద గిఫ్ట్. – సయ్యద్ ఫర్జానారైతు స్వరాజ్య వేదిక ద్వారా అక్కడి పిల్లలను కలిసినప్పుడు వాళ్లు ఎంత కష్టపడుతున్నారో అనిపించింది. వాళ్ల నాన్న చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ బాగా చదువుకుని, అమ్మను బాగా చూసుకుంటాం అని వారు చెప్పినప్పుడు ‘గ్రేట్’ అనిపించింది. అలాగే కలెక్టర్ అవుతామని, డాక్టర్ అవుతామని వాళ్లు తమ భవిష్యత్తు గురించి, తమ ప్లాన్స్ గురించి చెప్పినప్పుడు వారి ధైర్యం చూసి భేష్ అనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని చూశాం. – హనీషఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పిల్లలను చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. తర్వాత వాళ్లను హ్యాపీగా ఉంచాలనిపించింది. అందుకే మాటలు, పాటలతో వారితో కలిసిపోయాను. ఇంటికి వెళ్లాక మా నాన్నతో ఆ విషయాలన్నీ పంచుకున్నాను. ‘సాక్షి మీడియా’ వల్ల వాళ్లను కలిసి, నా వంతుగా కాసేపు వాళ్లని సంతోషపెట్టడానికి ట్రై చేశాను. ఈ చిల్డ్రన్స్ డే నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. – సాన్వికమూడేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నాను. నేను కోపం, బాధ, హ్యాపీ సీన్లలో బాగా నటిస్తాను అని చెబుతారు. ఏడుపు సీన్లలో గ్లిజరిన్ లేకుండా నటించడం చూసి, అందరూ మెచ్చుకున్నారు. టీవీలో అందరి ముందు నా టాలెంట్ను ప్రదర్శించే అవకాశం లభించింది. ఇప్పుడు స్వయంగా టీవీ న్యూస్రూమ్, స్టూడియో... ఇవన్నీ చూడటం కొత్తగా అనిపించింది. – ఖుషీ రెడ్డిమూడేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు 25 యాడ్స్, 30 సినిమాల్లో నటించాను. హిందీ మూవీలో కూడా నటించాను. డ్యాన్స్, సంగీతం నేర్చుకుంటున్నాను. బాలరత్న అవార్డు కూడా వచ్చింది. ‘సాక్షి’ మీడియాతో కలిసి రైతు స్వరాజ్య వేదికకి వెళ్లి అక్కడి పిల్లలతో మాట్లాడటం బాగా అనిపించింది. ‘మా నాన్న లేరు’ అని వాళ్లు చెప్పినప్పుడు ఏడుపొచ్చింది. ఇక ఫైనల్ ఈవెంట్లో గోగో (బొమ్మ)తో మాటలు బాగా నచ్చాయి. ఎంత టైమ్ స్పెండ్ చేశామో తెలియనే లేదు. – శ్రేష్ట కోటకేంద్రీయ విద్యాలయాలో చదువుకుంటున్నాను. సినిమాల్లో నటిస్తున్నాను. తబలా వాయిస్తాను. డ్యాన్స్, మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సీరియల్స్లో కూడా నటిస్తున్నాను. ‘బాలోత్సవం’లో నాకు వచ్చిన పాటలు పాడాను. అందరూ సూపర్ అని మెచ్చుకున్నారు. – శ్రేయాన్ కోటఈ కార్యక్రమం ద్వారా తలసేమియాతో బాధపడుతున్నవారిని కలిశాను. వారిని నవ్వించాను కూడా... పాటలు పాడాను, డ్యాన్సులు చేశాను. అలాగే బుధవారం జరిగిన వేడుకలో నాలా సినిమాల్లో నటిస్తున్న మిగతా అన్నయ్యలు, అక్కలను కలుసుకోవడం హ్యాపీగా అనిపించింది. మా ఇష్టాలు, చదువు, ఆటలు, పాటలు, డైలాగ్స్ మీ అందరికీ చెప్పడం.. అన్ని విషయాలను షేర్ చేసుకోవడం బాగుంది. గోగో (బొమ్మ)తో బాగా ఎంజాయ్ చేశాం. – తనస్విఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్లని చూడగానే ఫస్ట్ చాలా ఏడుపొచ్చింది. అయితే మేం వాళ్లని హ్యాపీ చేయడానికి వెళ్లాం కాబట్టి, వాళ్లతో జోక్గా మాట్లాడాను. వాళ్లు నవ్వడం హ్యాపీ అనిపించింది. అలాగే ‘సాక్షి’ టీవీకి వచ్చి, అందరితో మాకు క్లాసులు చెప్పినవి, మేం సినిమాల్లో చేసినవి షేర్ చేసుకోవడం హ్యాపీ. పెద్దయ్యాక మహేష్బాబులాగా పెద్ద హీరోని అవుతాను. ఇక్కడ గోగో (బొమ్మ)తో కలిసి చేసిన అల్లరి బాగుంది. అలాగే, మాకు అన్ని న్యూస్ రూమ్లు చూపించారు. చాలా కొత్తగా అనిపించింది. – స్నితిక్చిన్ని మనసులు కదిలిన వేళ...పసి హృదయాలు కదిలిపోయాయి. చిన్న మనసులే అయినప్పటికీ తోటి చిన్నారులు పడుతున్న బాధ చూసి, చలించిపోయాయి. బాలల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ‘సాక్షి’ మీడియా హౌస్ జరిపిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా కేన్సర్, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను, మృత్యువుతో పోరాడుతున్న పసిబాలలకు, తండ్రిని కోల్పోయిన వారిని, అనాథ బాలలను కలిశారు పలువురు బాల తారలు. కాసేపు ఆ చిన్నారులు తమ కష్టాన్ని మరచిపోయేలా చేసి, వారితో ఆడి పాడారు... నవ్వించారు. చివరగా ‘సాక్షి’ మీడియా హౌస్లో జరిగిన వేడుకలో స్కూల్ విద్యార్థులతో కలిసి ఈ బాల తారలు సందడి చేశారు. ఈ ‘బాలల దినోత్సవం’ ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.టీవీలో న్యూస్ చదువుతారు కదా.... ఆ రూమ్ ఎలా ఉంటుందో చూస్తారా? ఎడిటింగ్ ఎలా జరుగుతుందో చూడాలని ఉందా? అసలు టీవీ స్టూడియో ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? అనడమే ఆలస్యం ‘ఓ’ అంటూ ఆసక్తి కనబరిచారు లిటిల్ స్టార్స్. ‘సాక్షి టీవీ’ న్యూస్ రూమ్, పీసీఆర్ (ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్) వంటివి చూసి, ఆశ్చర్యపోయారు. టీవీ స్టూడియోలో జరుగుతున్న పనులను నిశితంగా గమనించారు.ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్లో చూడటానికి ఈ QRకోడ్ను స్కాన్ చెయ్యండి -
టీవీ ఛానెల్ ప్రసారాలకు కొత్త ఓటీటీ
ప్రసార భారతి త్వరలో ప్రారంభించబోయే ఓటీటీ ప్లాట్ఫారమ్లో తమ టీవీ ఛానెల్లను ప్రసారం చేయడానికి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ప్రస్తుతం దాదాపు అన్ని బ్రాడ్కాస్టింగ్ సంస్థలు ఓటీటీను ప్రారంభిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రసారభారతి కూడా ఓటీటీను మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది.త్వరలో ప్రారంభించబోయే ఈ ఓటీటీలో ఏడాదిపాటు తమ టీవీ ఛానెల్ ప్రసారం చేయడానికి ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 12లోపు దరఖాస్తులు సమర్పించాలని ప్రసార భారతి కోరింది. అయితే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) లైసెన్స్ పొందిన ఛానెల్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది.ఇదీ చదవండి: బంగారం పరిశ్రమకు కొత్త సంఘం!కుటుంబ సమేతంగా ఓటీటీను చూసేలా భారతీయ విలువలు, విజ్ఞానాన్ని ప్రోత్సహించే ప్రసారాలను ఇందులో అందిచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్లాట్ఫారమ్లో ఛానెల్లను ప్రసార చేయాలనుకునేవారు ప్రకటన విరామ సమయాలను సూచించాలని చెప్పారు. ఛానెల్ ‘ఎస్సీటీఈ -35/ యాడ్ మార్కర్’ ప్రకారం ప్రకటన ఫీడ్లను అందించాలని తెలిపారు. ప్రకటనల ద్వారా వచ్చే రెవెన్యూలో 65:35 ఆదాయ వాటాను ప్రసార భారతి ప్రతిపాదించింది. అంటే 65 శాతం ఛానెల్కు, 35 శాతం ఓటీటీకు వెళుతుంది. ట్రాన్స్కోడింగ్, సీడీఎన్ ఖర్చులు, ఏజెన్సీ కమీషన్లతో సహా ఛానెల్ ప్రసార ఖర్చులను సర్దుబాటు చేసిన తర్వాత ఆదాయ వాటా లెక్కిస్తారు. -
బ్లాక్మెయిల్ ఛానల్స్ని బహిష్కరించాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: మహా న్యూస్ ఛానెల్పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మహా చెత్త న్యూస్..‘కాకినాడ రైస్ మిల్లర్ల దందా’ ప్రోమో సంగతి ఏమైందని ప్రశ్నించారు. బ్లాక్మెయిల్ ఛానళ్లను ప్రజలు బహిష్కరించాలని కోరారు.కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘మహా చెత్త న్యూస్.. టాల్కమ్ డబ్బా పౌడర్ బ్లాక్ మైలర్కి కాకినాడ రైస్ మిల్లర్లు, ఎక్స్పోర్టర్లు నుండి 50 లక్షలు వెళ్లాయి. ‘కాకినాడ రైస్ మిల్లర్ల దందా’ అని చెప్పి ఒక ప్రోమో రిలీజ్ చేసి, నేనే వస్తున్నా, అక్రమాలన్నీ బయట పెడుతున్నా అని బెదిరించి.. వారి నుండి 50 లక్షలు తీసుకున్నాడు. ఇలాంటి బ్లాక్ మెయిల్ ఛానళ్లని ప్రజలు బహిష్కరించి సంబంధిత బ్లాక్ మెయిల్ రిపోర్టర్లకు తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి’ అని కామెంట్స్ చేశారు. "మహా చెత్త న్యూస్" టాల్కమ్ డబ్బా పౌడర్ బ్లాక్ మైలర్ కి కాకినాడ రైస్ మిల్లర్లు, ఎక్సపోర్టర్లు నుండి 50 లక్షలు వెళ్లాయి.. ‘కాకినాడ రైస్ మిల్లర్ల దందా’ అని చెప్పి ఒక ప్రోమో రిలీజ్ చేసి, నేనే వస్తున్నా, అక్రమాలన్ని బయట పెడుతున్నా అని బెదిరించి.. వారి నుండి 50 లక్షలు తీసుకున్నాడు.…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 22, 2024 -
‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేత రాజ్యాంగ ఉల్లంఘనే: ఎన్బీడీఏ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడంపై ‘బ్రాడ్కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్’ (ఎన్బీడీఏ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సాక్షి టీవీతోపాటు మరో మూడు ఛానళ్ల ప్రసారాలనూ ఏపీలోని కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ నిలిపివేయడానికి సరైన కారణాలు చూపకపోవడం ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమని ఎన్బీడీఏ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్బీడీఏ సోమవారం(జూన్24) మీడియా ప్రకటన విడుదల చేసింది.మీడియాతో పాటు ప్రజల ప్రయోజనాలకు భంగం..ఏపీలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీపై విమర్శనాత్మక కథనాలు ప్రసారం చేయడం వల్లనే ఆయా టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసినట్లు చెబుతున్నారని, కొందరు కేబుల్ టీవీ ఆపరేటర్లు తీసుకున్న ఈ చర్యలు బ్రాడ్కాస్టర్లు, మీడియా, ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని ప్రకటించింది. కొన్ని టీవీ ఛానళ్ల ప్రసారాలు ఆపడం ప్రమాదకరమైన సంకేతాలు పంపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే..ఛానెళ్లలో ఎలాంటివి ప్రసారం చేయాలన్నది బ్రాడ్కాస్టర్ల ఇష్టమన్నది రాజకీయ పార్టీలు గుర్తించాలని, మీడియా స్వేచ్ఛలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా పేర్కొంది. ఇతరుల జోక్యంతో మీడియా తన స్వతంత్రతను కోల్పోయే పరిస్థితి కల్పిస్తుందని తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ), ఆర్టికల్ 19(1)(జీ)లను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. మీడియా స్వేచ్ఛపై ప్రభావం..ఛానళ్లపై నిషేధం సరైన పద్ధతి కాదని,మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేదని ఎన్బీడీఏ పునరుద్ఘాటించింది. ఏకపక్ష నిర్ణయాలు బ్రాడ్కాస్టర్ల వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తాయని, వ్యూయర్షిప్పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఇది చివరికి ఛానళ్ల రేటింగ్ తద్వారా ఆదాయంపైనా ప్రభావం చూపుతుందని వివరించింది. ప్రభుత్వానిదే బాధ్యత..దీర్ఘకాలంలో బ్రాడ్కాస్టర్లు, ప్రకటనకర్తల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు చర్యలు కారణమవుతాయని తెలిపింది. ఏపీలో మీడియా స్వతంత్రంగా, స్వేచ్ఛగా వ్యవహరించేలా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్బీడీఏ అభ్యర్థించింది. ఇతరుల జోక్యం ఏమాత్రం లేకుండా మీడియా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా చూడాలని కోరింది.సమాచారం పొందడం ప్రజల హక్కు..ప్రజాస్వామ్య వ్యవస్థలో వేర్వేరు మార్గాల ద్వారా సమాచారం పొందే హక్కు ప్రజల మౌలిక హక్కు అని, మీడియా నోరు నొక్కేందుకు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా వెంటనే అడ్డుకోవాలని సూచించింది. సాక్షి టీవీతోపాటు మరో మూడు ఛానళ్ల ప్రసారాలను నిలిపి వేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, కొందరు కేబుల్ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే సమీక్షించి ఘర్షణ పూర్వక పరిస్థితిని నివారించాలని ఎన్బీడీఏ కోరింది. -
టీవీ ఛానళ్ల సబ్స్క్రిప్షన్ రేట్లు పెంపు.. ఎంతంటే..
టీవీ ఛానళ్ల సబ్స్క్రిప్షన్ రేట్లు 5-8 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డిస్నీ స్టార్, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా వంటి బ్రాడ్కాస్టర్లు తమ బొకే(ఛానళ్ల సమూహం) రేట్లు పెంచనున్నట్లు తెలిపాయి.కొత్త టారిఫ్ ఒప్పందాలపై సంతకం చేయని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ ఆపరేటర్లకు (డీపీఓ) సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు సిగ్నళ్లను తొలగించకూడదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) బ్రాడ్కాస్టర్లను ఆదేశించింది. దాంతో ఎన్నికలు ముగిసే వరకు కంపెనీలు ఈమేరకు చర్యలు తీసుకోలేదు. తాజాగా ఎన్నికల ఫలితాలు సైతం వెలువడడంతో తిరిగి సబ్స్క్రిప్షన్ రేట్ల పెంపు అంశం వెలుగులోకి వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? స్పష్టతనిచ్చిన యూఐడీఏఐజనవరిలో ప్రముఖ బ్రాడ్కాస్టర్లు తమ బేస్ బొకే రేట్లను సుమారు 10 శాతం పెంచారు. భారతీయ క్రికెట్ హక్కులను చేజిక్కించుకోవడంతో సాధారణ ఎంటర్టైన్మెంట్ ఛానెళ్ల కంటే వయోకామ్18 అత్యధికంగా 25 శాతం పైగా రేట్లును పెంచింది. అయితే పెరిగిన ధరలు ఫిబ్రవరి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ట్రాయ్ నిబంధనల వల్ల వాటికి బ్రేక్ పడింది. -
వివాహేతర సంబంధం పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపుతాం
కాబూల్: అఫ్గానిస్తాన్లో మధ్యయుగాల నాటి ఛాందసవాద పాలనకు తెరలేపిన తాలిబాన్లు ప్రజల పట్ల మరింత దారుణంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షల కొరడాను మరోసారి ఝులిపించారు. వివాహేతర సంబంధం, వ్యభిచారానికి ఒడిగట్టే మహిళలను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపుతామని తాలిబాన్లు హెచ్చరించారు. ఈ మేరకు తాలిబాన్ల సుప్రీం లీడర్ ముల్లా హిబాతుల్లా అకుంద్జాదా అఫ్గాన్లనుద్దేశిస్తూ ప్రభుత్వ టీవీ చానెల్లో శనివారం ఒక ఆడియో సందేశం ఇచ్చారు. ‘‘అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు మహిళలకు హక్కులు ఉండాలంటారా? అవి మన ఇస్లామిక్ షరియా చట్టాలు, మన మతాధికారుల నియమాలకు వ్యతిరేకం. మేం చాయ్ తాగుతూ చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారేమో! ఈ నేలపై షరియా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి తీరతాం. వివాహేతర సంబంధాలు, వ్యభిచారం ఘటనల్లో మహిళలను అందరూ చూస్తుండగా కొయ్యకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతాం’’ అని అకుంద్జాదా హెచ్చరించారు. -
HYD: టీవీ ఛానల్ యాంకర్ను కిడ్నాప్ చేసిన యువతి
సాక్షి, హైదరాబాద్: ఓ టీవీ ఛానల్ యాంకర్ను యువతి కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. యాంకర్ను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగిన త్రిష్ణ అనే యువతి కిడ్నాప్కు పాల్పడింది. తనను వివాహం చేసుకోవాలని రూమ్లో బంధించింది. త్రిష్ణ చెర నుంచి తప్పించుకున్న ప్రణవ్ పోలీసులను ఆశ్రయించాడు. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ను నడుపుతున్న త్రిష్ణ.. భారత్ మాట్రిమోన్లో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడింది. ప్రణవ్ పేరుతో నకిలీ ఐడిని సైబర్ కేటుగాళ్లు క్రియేట్ చేయగా, నిజంగానే ప్రణవ్ ఐడి అనుకున్న త్రిష్ణ ఇష్టపడింది. ప్రణవ్పై మనసు పడ్డ ఆమె కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని భావించింది. చివరికి కథ అడ్డం తిరిగింది. త్రిష్ణను అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులు రిమాండ్కు పంపించారు. ఐదు స్టార్టప్ కంపెనీలకు త్రిష్ణ ఎండిగా ఉంది. ఇదీ చదవండి: నిన్ను లవ్ చేస్తున్నా.. ఫ్యాకల్టీ నో చెప్పాడని.. ఎంత పనిచేసిందంటే.. -
ఏది సత్యం? ఏదసత్యం?
‘ఏకం సత్ విప్రాః బహుధా వదంతి’ అనేది ఉపనిషత్ వాక్యం. ఉన్నది ఒకటే సత్యం. దానినే పండితులు అనేక రకాలుగా చెబుతారని దీని అర్థం. వెలుతురు ఉన్న లోకంలో చీకటి ఉన్నట్లే,వసంతం ఉన్న ప్రకృతిలో శిశిరం ఉన్నట్లే సత్యం ఉన్న ప్రపంచంలో అసత్యం కూడా ఉనికిలో ఉంటుంది. అది సహజం. ‘సత్యమేవ జయతే’– ఇది కూడా ఉపనిషత్ వాక్యమే! మన దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజున ఈ వాక్యాన్ని జాతీయ ఆదర్శంగా స్వీకరించాం. ‘సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్/ నబ్రూయాత్ సత్యమప్రియం/ ప్రియంచ నానృతం బ్రూయాత్/ ఏష ధర్మ స్సనాతనః’– ఇది సుభాషిత శ్లోకం. ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. సత్యాన్ని ప్రియంగా పలకాలి. సత్యమే అయినప్పటికీ అప్రియంగా పలుకరాదు. ప్రియమైనదే అయినంత మాత్రాన అసత్యాన్ని పలుకరాదు. ఇదే సనాతన ధర్మం అని ఈ శ్లోకానికి అర్థం. అనాదిగా ప్రచారంలో ఉన్న ఉపనిషత్ వాక్యాలను, సుభాషిత శ్లోకాలను గమనిస్తే, అవన్నీ సత్యం పట్ల నిబద్ధతకు అద్దం పడతాయి. సత్యం కోసం సర్వస్వాన్నీ వదులుకున్న సత్యహరిశ్చంద్రుడి కథ మన జాతిపిత మహాత్మా గాంధీ సహా ఎందరికో ఆదర్శప్రాయం. మరి సత్యసంధతపై ఇంత కట్టుదిట్టమైన పునాదులు ఉన్న మన దేశం నలుచెరగులా నిరంతరం సత్య వాక్కులే వినిపిస్తూ ఉండాలి కదా! సత్యమే వర్ధిల్లుతూ ఉండాలి కదా! అలా అనుకుంటే అది అమాయకత్వమే! దీపం కింద నీడలా సత్యాన్ని అంటిపెట్టుకుని అసత్యమూ ఉంటుంది. సత్యానిదే అంతిమ విజయం కావచ్చు గాక, కాని అప్పుడప్పుడు అసత్యం బలం పుంజుకుని లోకంలో అనర్థాలకు కారణమవుతుంది. అసత్యం తెచ్చిపెట్టే అనర్థాలకు ఉదాహరణలు మన రామాయణ, మహాభారతాల్లో దొరుకు తాయి. రామబాణం తాకినప్పుడు మాయలేడి రూపంలోని మారీచుడు ‘హా సీతా! హా లక్ష్మణా!’ అంటూ రాముడి గొంతుతో ఆర్తనాదాలు చేసి, సీతాపహరణానికి కారకుడయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మరాజు ‘అశ్వత్థామ హతః’ అని బిగ్గరగా పలికి, భేరీనాదాలు మోగే సమయంలో ‘కుంజరః’ అని గొణిగి ద్రోణాచార్యుడి మరణానికి కారకుడయ్యాడు. అబద్ధం చేసే అలజడి మార్మోగే సమయంలో మనకు మెదడు పనిచేయదు. వెనువెంటనే నిజాన్ని తెలుసుకోగల వ్యవధి ఉండదు. నిజాన్ని తెలుసుకునే వ్యవధిలోగానే అబద్ధం నానా అనర్థాలను కలిగిస్తుంది. అసత్య ప్రచారం అట్టహాసంగా సాగుతున్నప్పుడు సత్యమేదో, అసత్యమేదో తేల్చుకోవడం దుస్సాధ్యంగా మారుతుంది. పత్రికలు మొదలయ్యాక ఆధునిక ప్రపంచంలో అసత్య ప్రచారం బలం పుంజుకోవడం మొదలైంది. అబద్ధాలకు పత్రికలు ఊతమివ్వగల అవకాశాలను తొలి తరాల్లోనే కొందరు రాజకీయవేత్తలు గుర్తించారు. పత్రికల ద్వారా అబద్ధాలను ప్రచారం చేయడాన్ని హిట్లర్ అనుయాయి గోబెల్స్ ఒక కళలా సాధన చేశాడు. ‘ప్రజాభిప్రాయాన్ని మలచే కార్యక్రమాన్ని పర్యవేక్షించే పూర్తి అధికారం రాజ్యానికి ఉంది’ అనేది గోబెల్స్ జ్ఞానగుళిక. రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీ నిరంకుశ రాజ్యానికి గొంతునిచ్చిన గోబెల్స్ను ఆరాధించేవారు ప్రపంచంలో నేటికీ ఉన్నారు. నిజానికి ఇప్పుడు గోబెల్స్కు బాబుల్లాంటి వాళ్లు పుట్టుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులను చూడటం వల్లనే కాబోలు ‘ఏది పుణ్యం, ఏది పాపం/ ఏది సత్యం, ఏదసత్యం? / ఏది నరకం, ఏది నాకం?/ ఓ మహాత్మా, ఓ మహర్షీ!’ అని వాపోయాడు మహాకవి. ఇది హైటెక్కు టమారాల యుగం. ఇది సమాచార విప్లవశకం. స్మార్ట్ఫోన్ల ఆవిష్కరణతో ప్రపంచం పిడికిట్లో ఇమిడిపోయిన కాలం. క్షీరనీర న్యాయంగా అబద్ధాల నుంచి నిజాలను వేరు చేయగల హంసలు బొత్తిగా కరవైపోతున్న రోజులివి. నిజం వేషాన్ని ధరించిన అబద్ధాన్ని గుర్తించడం అగ్నిపరీక్షగా మారిన రోజులివి. సమాచార ప్రచారానికి ఒకప్పుడు వార్తాపత్రికలు, రేడియో మాత్రమే ఆధారంగా ఉండేవి. ఇప్పుడు ఇరవై నాలుగు గంటలూ ప్రసారాలతో ఊదరగొడుతున్న టీవీ చానళ్లు, నిరంతర కథనాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వార్తా వెబ్సైట్లు, వీటికి తోడుగా సామాజిక మాధ్యమ సాధనాలు అనుక్షణం జనాల మీదకు పుంఖాను పుంఖాలుగా సమాచారాన్ని వదిలిపెడుతున్నాయి. వరద ఉద్ధృతి ఉప్పొంగినప్పుడు జలప్రవాహంతో పాటు చెత్తా చెదారం కొట్టుకొస్తుంటాయి. నిర్విరామంగా సాగే నిరంతర సమాచార ప్రవాహంలో సత్యంతో పాటు అర్ధసత్యాలు, అసత్యాలు కూడా అలాగే కొట్టుకొస్తుంటాయి. గుట్టలు గుట్టలుగా పోగుపడుతున్న అసత్యాలు, అర్ధసత్యాల అడుగున సత్యం కనుమరుగుగా ఉంటుంది. సత్యాన్ని మరుగుపరచేలా సాగుతున్న అసత్యాల, అర్ధసత్యాల సమాచార ప్రవాహం సమాచార కాలుష్యాన్ని పెంచుతోంది. సమాచార కాలుష్యం ప్రపంచానికే పెనుముప్పుగా పరిణమిస్తోంది. అబద్ధాల రణగొణల మధ్య నిజాల గొంతు వినిపించకుండా పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. తప్పుడు సమాచారం ప్రపంచ దేశాలకు ప్రమాదకరంగా మారుతోందని ఇటీవల ప్రపంచ ఆర్థిక వేదిక తన ‘గ్లోబల్ రిస్క్ రిపోర్ట్–2024’లో వెల్లడించింది. అసత్యాలు, అర్ధసత్యాలతో హోరెత్తిస్తున్న తప్పుడు సమాచారం ప్రపంచ దేశాల్లో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించడమే కాకుండా, రాజకీయ అస్థిరతకు, అశాంతికి, హింసకు, ఉగ్రవాదానికి దారితీస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక సమర్పించిన ఈ నివేదిక హెచ్చరించింది. ‘సత్యమేవ జయతే’ అని జాతీయ ఆదర్శంగా చెప్పుకుంటున్న మన భారతదేశమే తప్పుడు సమాచారం వ్యాప్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలవడం వర్తమాన విషాదం. -
నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టు..
చంఢీగర్: నూహ్ అల్లర్లలో అసత్యాలను ప్రచారం చేశారనే ఆరోపణలపై హిందీ ఛానల్ సుదర్శన్ టీవీ ఎడిటర్ను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లను మరింత పెంచేంతగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు ఆరోపించారు. సుదర్శన్ టీవీ ఛానల్ ఎడిటర్ ముఖేష్ కుమార్ను గురుగ్రామ్లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. కొంతమంది గుండాలు అతన్ని అరెస్టు చేసినట్లు సుదర్శన్ ఛానల్ పేర్కొంది. దీనిపై వివరణ ఇచ్చిన పోలీసులు.. సైబర్ క్రై విభాగం అరెస్టు చేసినట్లు చెప్పారు. गुड़गांव की पुलिस कमिश्नर को @AJENews (अल जजीरा न्यूज चैनल) से फ़ोन किया जा रहा है हिंदुओं के खिलाफ कार्रवाई के लिए दबाव बनाया जा रहा है। और @DC_Gurugram फोन आने के बाद इतने दबाव में आ जाती हैं कि कहीं से भी हिंदूवादी कार्यकर्ताओं को उठा ले रही है@cmohry कृपया संज्ञान लें pic.twitter.com/bIjVYfR0Di — Mukesh Kumar (@mukeshkrd) August 8, 2023 ఆల్ జజిరా ఛానల్ ఒత్తిడి మేరకు గురుగ్రామ్ పోలీసులు.. హిందు కార్యకర్తల మీద చర్యలు తీసుకుంటున్నారని ట్వీట్టర్లో ముఖేష్ కుమార్ పోస్టు చేశారు. గురుగ్రామ్ పోలీసులకు విదేశీ మీడియా కాల్ చేసిందని ఈ మేరకు హిందువులపై చర్యలు తీసుకుంటున్నారని ఎడిటర్ ఆరోపణలు చేస్తూ పోస్టులు చేశారు. pic.twitter.com/FbtdApa5zq — Gurugram Police (@gurgaonpolice) August 11, 2023 దీనిపై స్పందించిన పోలీసులు..కుమార్ పోస్టులు నిరాధారమైనవని కొట్టిపడేశారు. తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. ఐటీ చట్టం కింద అతనిపై చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. అయితే.. విధుల్లో భాగంగా కుమార్ మేవాత్ ప్రాంతానికి వెళ్లినట్లు సుదర్శన్ టీవీ తెలిపింది. కొందరు దుండగులు ఆయన్ను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. పోలీసుల చర్యలను తప్పుబడుతూ సుదర్శన్ టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ సురేష్ వాంఖడే ట్వీట్ చేశారు. అయితే.. కొన్ని గంటల తర్వాత ముఖేష్ కుమార్ను విడుదల చేసినట్లు సమాచారం. मुकेश कुमार को छोड़ा नहीं गया तो कल बड़ी घोषणा करेंगे। देखते है कौन- कौन मर्द हिंदू साथ है। नपुंसक तो जान कर भी मौन हैं। किसी अधिकारी की इतनी हिंम्मत और सभी असहाय…? हम तो असहाय नहीं है… #ReleaseMukeshKunar — Suresh Chavhanke “Sudarshan News” (@SureshChavhanke) August 11, 2023 హర్యానాలోని నూహ్లో జులై 31న అల్లర్లు చెలరేగాయి.విశ్వహిందూ పరిషత్ రథయాత్ర సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమై.. రాష్ట్రం మొత్తం వ్యాపించాయి. ఈ ఆందోళనల్లో ఆరుగురు మరణించారు. ఇదీ చదవండి: తప్పుడు వాగ్దానంతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు.. -
Banjara Hills: టీవీ చానల్లో అర్థరాత్రి అశ్లీల దృశ్యాల ప్రసారం
హైదరాబాద్: బంజారాహిల్స్రోడ్నెం 12, ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఓ తెలుగు చానల్లో ఈ నెల 28న అర్థరాత్రి దాటిన తర్వాత అకస్మాత్తుగా అశ్లీల వీడియోలు ప్రసారమయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు తమ చానల్కు చెందిన సర్వర్ను హ్యాక్చేసి వీడియోలు అప్లోడ్ చేశారంటూ సదరు చానల్ నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైవ్ చానెల్గా నడిచే తమ చానల్లో అర్ధరాత్రి 15 నిమిషాల పాటు అశ్లీల వీడియోలు ప్రసారం అయ్యాయని, తమ సిబ్బంది అప్రమత్తమై వాటి ని తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. -
సంసద్ టీవీకి లేఖ రాసిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: సంసద్ టీవీలో చర్చలకు వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ రఘురామకృష్ణరాజును పిలవద్దని ఆ టీవీ సీఈవోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ టీవీ సీఈవోకి లేఖ రాశారు. సంసద్ టీవీ చర్చల్లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీ రఘురామ పాల్గొనడం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై అనర్హత వేటు వేయాలని తాము ఇచ్చిన పిటిషన్పై స్పీకర్ విచారిస్తున్నారని లేఖలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు విశ్వసనీయత ఉండదని, ఆయన మాటలు వైఎస్సార్సీపీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత 17వ లోక్సభ గడువు పూర్తయ్యేవరకు ఆయన్ని సంసద్ టీవీ షోలు, చర్చలకు పిలవద్దని విజయసాయిరెడ్డి కోరారు. చదవండి: (ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ) -
ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి.. ఇంటికి చేరిన బాలిక
వెంగళరావునగర్: దాదాపు ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన ఓ బాలిక సోమవారం తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఓ టీవీ కార్యక్రమం ఆ బాలిక పాలిట వరంలా మారి..అనాథ జీవితానికి తెర పడింది. వివరాల్లోకి వెళ్తే..ఈసీఐఎల్ కమలానగర్కు చెందిన పిన్నమోని కృష్ణ, అనూరాధ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఇందు, సింధు కవలలు. 2014లో వినాయక ఉత్సవాలకు వెళ్ళిన సందర్భంగా ఇందు అనే మూడున్నరేళ్ల కుమార్తె తప్పిపోయింది. ఆ సమయంలో ఆ పాపను ఓ మహిళ తీసుకెళ్లినట్టుగా సీసీ టీవీలో కూడా కనిపించింది. దాంతో తల్లిదండ్రులు నాటి నుంచి చాలా ప్రాంతాల్లో గాలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇటీవల ఓ టీవీ చానల్ కార్యక్రమంలో ఆ పాప కనిపించడంతో తల్లిదండ్రులు గుర్తించి తమ కుమార్తెలాగానే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఆరా తీశారు. టీవీ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు. ఎక్కడ నుంచి వచ్చారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ కమిటీ అధికారులను కలిసి విషయం తెలిపారు. వారి సాయంతో కిస్మిత్పూర్లోని చెరిస్ అనాథ బాలికల సంరక్షణ కేంద్రాన్ని చేరుకున్నారు. అక్కడ ఉన్న పిల్లల్లో తమ కుమార్తె ఉండటంతో తల్లిదండ్రులు గుర్తించి అధికారులకు తెలియజేశారు. దాంతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రంగారెడ్డి, జిల్లా బాలల హక్కుల చైర్మన్ నరేందర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ అధికారి ప్రవీణ్కుమార్, మహిళా శిశుసక్షేమశాఖ అధికారులు తల్లిదండ్రుల వద్ద వివరాలను, ఆ బాలిక వివరాలను పరిశీలించారు. ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన పాప, అనాథాశ్రమంలో ఉన్న పాప ఒక్కరే అని నిర్ధారణకు వచ్చారు. సోమవారం స్థానిక మధురానగర్లో ఉన్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రధాన కార్యాలయంలో తల్లిదండ్రులకు తమ కుమార్తెను అప్పజెప్పారు. తప్పిపోయిన తమ కుమార్తె తిరిగి తమ వద్దకు చేరడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి.. వంట విషయంలో గొడవపడి) -
మతిమరుపు బైడెన్పై స్పూఫ్ వీడియో.. నెట్టింట వైరల్
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో దీనిపై స్పందిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తన వింతగా ఉంటోంది. వయస్సులో పెద్దవాడు కావడం వల్ల జరుగుతోందో.. ఏమో కానీ ఆయన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేరు సైతం మర్చిపోవడం, తనతోపాటు పక్కనే ఉన్న ఆమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. అప్పుడే నిద్ర నుంచి లేచి మీడియా ముందుకు వచ్చినట్లు కనిపించడం పట్ల పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు సంబంధించిన ఓ స్పూఫ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుతం సమయంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్లు మీడియాతో మాట్లాడుతూ గందరగోళానికి గురైనట్లు చాలా వ్యంగ్యంగా ఓ ఫన్నీ స్కిట్ను సౌదీలోని ప్రభుత్వానికి అనుకూల టీవీ టెలివిజన్ ఛానెల్ ప్రసారం చేసింది. ఈ వీడియోలో రెండు పాత్రలు.. జో బైడెన్, కమలా హారిస్లు వేదికపై నడుస్తూ వచ్చినట్లు వ్యంగ్యంగా చూపుతారు. వారిద్దరూ మీడియతో మాట్లాడుతూ కనిపిస్తారు. ముందుగా.. బైడెన్ పాత్ర మాట్లాడుతూ.. ఈ రోజు మనం స్పెయిన్ సంక్షోభం గురించి మాట్లాడబోతున్నామని వ్యాఖ్యానిస్తాడు. పక్కనే ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పాత్రదారి కాదు.. కాదు.. అన్నట్లు చెవిలో చెబుతుంది. అయినా కూడా వినని బైడెన్ పాత్రదారి.. ఆఫ్రికాలో సంక్షోభం అంటూ మొదలుపెడతాడు. అది కూడా తప్పు కావడంతో చివరకు రష్యా అని అంటాడు. అక్కడితో ఆగకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరును మర్చిపోయి గుర్తు చేసుకోవడానికి సహాయం తీసుకుంటాడు. ‘పుతిన్, నా మాట వినండి. మీ కోసం నా దగ్గర చాలా ముఖ్యమైన సందేశం ఉంది. ఆ సందేశం ఏమిటంటే..’ అని నిల్చొన్న చోటే ఓ కునుకు తీస్తాడు. వెంటనే నిద్ర లేవగానే పుతిన్ గురించి పూర్తిగా మర్చిపోయి ‘చైనా ప్రెసిడెంట్' తో మాట్లాడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టాడు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను పట్టుకొని.. తాను మాట్లాడున్న సమయంలో తనను సరిదిద్దినందుకు ధన్యవాదాలు, ఆమెరికా ప్రథమ మహిళా’ అని నవ్వుతూ మాట్లాడుతాడు. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం గురించి స్పందించాలన్న అమెరికా అభ్యర్థనను సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవి స్వీకరించిన తర్వాత సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఒక్కసారిగా కూడా మాట్లాడిన దాఖలు లేకపోవడం గమనార్హం. తాజాగా ప్రసారమైన ఈ ఫన్నీ స్కిట్తో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నావో తెలుసుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. VIDEO: A prominent Saudi television network has racked up millions of views with a comedy sketch that openly mocks US President Joe Biden, an unusual move that further signals souring ties pic.twitter.com/GRrNXx7Bjo — AFP News Agency (@AFP) April 14, 2022 -
రష్యా టీవీ లైవ్షోలో నిరసన.. మహిళా జర్నలిస్ట్కు 15 ఏళ్ల వరకు జైలు శిక్ష!
యుద్ధం ఆపాలంటూ రష్యా టీవీ లైవ్ షోలో నిరసన తెలిపిన మహిళా జర్నలిస్ట్కు దాదాపు 15 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మాస్కోలోని ఛానల్1లో పనిచేస్తున్న మెరీనా ఓవ్స్యానికోవా యుద్ధం ఆపాలని ప్లకార్డుతో రష్యాకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మెరీనా అనంతరం మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియోను న్యూయార్క్ టైమ్స్ ట్విటర్లో పోస్టు చేసింది. ఇందులో సదరు ఉద్యోగి ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి తను చేసిన ప్రయత్నాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. తనను 14 గంటలపాటు పోలీసులు విచారించినట్లు తెలిపింది. తన కుటుంబాన్ని కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపింది. అంతేగాక ఘటన తర్వాత పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు న్యాయ సహాయం కూడా అందలేదని వాపోయింది. చదవండి: రష్యాకు కోలుకోలేని దెబ్బ.. ఆవేదనలో పుతిన్..! A Russian state television employee who stormed a live broadcast Monday has been fined by a Moscow court for saying in a video that she was “deeply ashamed” to have helped make “Kremlin propaganda." She still faces a prison sentence over the protest. https://t.co/fFmgkyvmP6 pic.twitter.com/wb2FanGFsa — The New York Times (@nytimes) March 16, 2022 ‘ఉక్రెయిన్ రష్యా యుద్ధం భయంకరంగా సాగుతోంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, సహోద్యోగులకు ధన్యవాదాలు. నా జీవితంలో ఇవి చాలా కఠినమైన రోజులు. రెండు రోజులుగా నిద్రపోలేదు’ అని తెలిపింది. అయితే రష్యా మహిళా జర్నలిస్ట్ నిరసన విషయం తెలిసిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా రష్యాలోని ఓ వార్తా ఛానెల్లో జర్నలిస్ట్ లైవ్లోనే యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. మరో జర్నలిస్ట్ వార్తలు చదువుతుండగా యుద్ధానికి వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకుని నిరసనను తెలిపింది. ‘యుద్ధం వద్దు.. యుద్ధాన్ని ఆపండి.. వాళ్లు ఇక్కడ అబద్దం చెబుతున్నారు. తప్పుడు ప్రచారాలను అసలు ఎవరూ నమ్మోద్దు’ అని నిరసన వ్యక్తం చేసింది. దీంతో రష్యా టీవీ జర్నలిస్టు నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మెరీనా తండ్రి యుక్రెయిన్ దేశస్థుడు కావడంతో ఆమె మద్దతుగా నిరసన వ్యక్తం చేసింది. చదవండి: యుద్దం వేళ రష్యాతో భారత్ డీల్.. మోదీపై అక్కసు వెళ్లగక్కిన అమెరికా -
సంసద్ టీవీ యూట్యూబ్ చానల్ హ్యాక్
న్యూఢిల్లీ: లోక్సభ, రాజ్యసభ కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారాలు చేసే సంసద్ టీవీకి చెందిన యూట్యూబ్ చానల్ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్చేశారు. దీంతో అప్రమత్తమైన యూట్యూబ్ సంస్థ.. సమస్యకు కొద్ది గంటల్లోనే చెక్ పెట్టింది. సోమవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంటకు సంసద్ టీవీ యూట్యూబ్ చానల్ను హ్యాకర్లు హ్యాక్ చేసి చానెల్ పేరును ఇథీరియం( ఒక క్రిప్టో కరెన్సీ పేరు)గా మార్చారు. హ్యాకింగ్ జరిగిన విషయాన్ని ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లోనే సంసద్ టీవీ సంబంధిత అధికారులకు తెలిపామని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్) తెలిపింది. చానెల్ హ్యాక్కు గురైందని తెలిపే స్క్రీన్షాట్లను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. చదవండి: (ప్రఖ్యాత గాయని సంధ్యా ముఖర్జీ కన్నుమూత) -
ఏబీఎన్ ఛానల్పై సుబ్రమణ్యస్వామి మరో పిటిషన్
సాక్షి, చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఛానెల్పై పరువు నష్టం దావా వేసిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గురువారం తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. 4వ అదనపు జిల్లా సెషన్ కోర్టులో ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి మరో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం సుబ్రహ్మణ్యం స్వామి తరుపున సబర్వాల్ హాజరుకానున్నారు. టీటీడీపై అసత్య కథనాలు ప్రసారంపై సుబ్రహ్మణ్యం స్వామి ఎబీఎన్పై రూ.100 కోట్లు పరువు నష్టం వేశారు. టీటీడీ వేసిన పిటిషన్పై అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఆయన మరో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి అసత్య కథనాలు కేసుపై తన తరుపున సబర్వాల్ కోర్టుకు హాజరవుతారని పేర్కొన్నారు. శుక్రవారం కోర్టును ఈ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. -
అయ్యయ్యో.. టీవీ చానెల్ ఎంత పనిచేసింది!
వాషింగ్టన్: ఉన్నట్టుండి అమెరికాలోని ఒక టీవీ చానల్ ప్రేక్షకులను షాక్కు గురి చేసింది. వాతావరణ వివరాలను ప్రసారం చేస్తున్న బులిటెన్లో ఏకంగా పోర్న్ కంటెంట్ను ప్రసారం చేసింది. దీంతో వీక్షకులు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఈవినింగ్ న్యూస్కాస్ట్లో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. (kidney transplantation: సంచలనం) స్థానిక వార్తా ఛానెల్ అశ్లీల క్లిప్ను ప్రసారం చేయడం హాట్టాపిక్గా నిలిచింది. సాయంత్రం వార్తల బులిటెన్లో భాగంగా వాతావరణ నిపుణురాలు మిషెల్ బాస్ వాతావరణ అప్డేట్ ఇస్తున్నారు. ఇంతలో పోర్న్క్లిప్ టెలికాస్ట్ కావడం ప్రారంభమైంది. 13 సెకన్ల స్పష్టమైన వీడియో టెలికాస్ట్ అవుతోంటే..యాంకర్, కో యాంకర్, కోడి ప్రోక్టర్ గానీ దీన్ని గమనించనేలేదు. వివరాల అనంతరం బ్యాక్గ్రౌండ్లో గ్రాఫిక్ వీడియో వచ్చేదాకా ఇది ప్రసారమైంది. అయితే దీనిపై సంబంధిత టీవీ ఛానెల్ స్పందించింది. పొరపాటు జరిగిందంటూ ఛానెల్ క్షమాపణలు తెలిపింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటామని ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై వీక్షకుల నుండి ఫిర్యాదులు రావడంతో సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోంది. -
సంసద్ టీవీ హోస్ట్లుగా శశిథరూర్, ప్రియాంక
న్యూఢిల్లీ: రాజకీయ రంగంలో వాళ్లిద్దరికీ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అభిప్రాయాలను చెప్పడంలో, ప్రత్యర్థుల్ని ఇరకాటంలో పెట్టేలా సమాధానం ఇవ్వడంలోనూ వారికి వారే సాటి. అయితే ఇప్పుడు వారు తమ స్థానాన్ని మార్చుకొని ప్రశ్నించే స్థానంలోకి వస్తున్నారు. లోక్సభ, రాజ్యసభల టీవీలను కలిపేస్తూ కొత్తగా వచి్చన సంసద్ టీవీలో ప్రతిపక్ష ఎంపీలు శశిథరూర్, ప్రియాంక చతుర్వేది యాంకర్లుగా దర్శనమివ్వబోతున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ‘టు ది పాయింట్’ అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేయబోతుండగా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ‘మేరి కహానీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. థరూర్ నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖులతో వివిధ అంశాలపై లోతైన చర్చలు ఉంటే, చతుర్వేది మహిళా ఎంపీల రాజకీయ ప్రయాణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. -
ప్రముఖ టీవీ ఛానల్లో ఆయుధాలతో వ్యక్తి హల్చల్
చెన్నె: ప్రముఖ టీవీ ఛానల్ కార్యాలయంలోకి దూరి ఓ వ్యక్తి ఆయుధాలతో హల్చల్ చేశాడు. కత్తి డాలు పట్టుకుని నానా హంగామా సృష్టించాడు. కార్యాలయంలో అద్దాలు, ఫోన్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. దీంతోపాటు సిబ్బందిని పచ్చిబూతులు తిడుతూ బీభత్సం చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నెలో చోటుచేసుకుంది. తమిళనాడులో ప్రముఖ ఛానల్ సత్యం టీవీ. రోయపురం కామరాజరర్ రోడ్డులో ఉన్న కార్యాలయంలోకి మంగళవారం సాయంత్రం 6-7 గంటల సమయాన అకస్మాత్తుగా ఓ దుండగుడు వచ్చాడు. కత్తి, డాలు చేతపట్టి కార్యాలయంలోని రిసెప్షన్లో కనిపించిన వాటినన్నింటిని ధ్వంసం చేశాడు. ఫోన్లు, అద్దాలు, కంప్యూటర్లు పగులగొట్టాడు. ఒకటో అంతస్తులోని అకౌంట్స్ డిపార్ట్మెంట్లో హల్చల్ చేశాడు. ఆ దుండగుడు కోయంబత్తూరుకు చెందిన డి.శివకుమార్గా గుర్తించారు. దుండగుడి దాడిలో ధ్వంసమైన కార్యాలయంలో సామగ్రి అర్ధగంటపాటు బీభత్సం సృష్టించడంతో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. అతడిని అతికష్టంగా సెక్యూరిటీ బంధించింది. సమాచారం అందుకున్న రోయపురం పోలీసులు కార్యాలయానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో ఆ కార్యాలయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిపై సత్యం టీవీ ఎండీ ఇసాక్ లివింగ్స్టన్ స్పందించారు. ‘అతడు ఎవరో తెలియదు. ఎందుకు దాడి చేశాడో కూడా లేదు. మేం ఎవరికీ వ్యక్తిగతంగా విరుద్ధ ప్రసారాలు చేయలేదు.’ అని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీని ఆ ఛానల్ విడుదల చేసింది. శివ కుమార్ కోయంబత్తూర్ నుంచి గుజరాత్కు వెళ్లాడు. నిందితుడు గుజరాత్ నంబర్ ప్లేటు ఉన్న కారుతోనే వచ్చాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారణ చేపట్టారు. కార్యాలయంపై దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా చెన్నె ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి భారతి తమిళన్ డిమాండ్ చేశారు. -
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకో టీవీ ఛానల్
న్యూఢిల్లీ: రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ.. తాము త్వరలో ప్రారంభించనున్న డిజిటల్ టీవీ ప్లాట్ఫామ్ ‘ఐఎన్సీ టీవీ’కి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ను బుధవారం విడుదల చేసింది. ఈ నెల 24న పార్టీ చానెల్ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ చానెల్ ద్వారా తమ పార్టీ సమాచారాన్ని నేరుగా ప్రజలకు తెలియ జేయవచ్చని భావిస్తోంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు గొంతుకను వినిపించే తమ చానెల్ను పంచాయతీ రాజ్ రోజున విడుదల చేస్తామని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలాలు ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్లో వెల్లడించారు. అందులో రోజూ దాదాపు 8 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటాయని తెలిపారు. మొదటగా ఆంగ్లం, హిందీ భాషల్లో చానెల్ ప్రసారమవుతుందని, అనంతరం స్థానిక భాషల్లో కూడా అందు బాటులోకి తెస్తామన్నారు. చదవండి: ఇంటి పక్కన కిరాణా దుకాణాదారుడే కింగ్ -
ప్రముఖ టీవీ ఛానెల్పై రూ.200 కోట్ల దావా
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ స్నేహితుడు, బాలీవుడ్ నిర్మాత సందీప్ సింగ్ రిపబ్లిక్ టీవీ ఛానల్పై 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. ఈమేరకు రిపబ్లిక్ టీవీ కార్యాలయానికి, ఆ ఛానల్ ఎడిటర్ అర్నబ్ గోస్వామికి బుధవారం నాడు నోటీసులు పంపించారు. ఛానల్ టీఆర్పీ పెంచుకోవడం కోసం తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార కథనాలను ప్రచారం చేశారని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. సుశాంత్ కేసులో తనను కీలక సూత్రధారిగా, హంతకుడిగా పరిగణించారని మండిపడ్డారు. (చదవండి: సుశాంత్ కేసు : సీబీఐ ఎదుట యూటర్న్) వెంటనే వారు తనకు లిఖితపూర్వకంగా లేదా వీడియో సందేశం ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నిజానిజాలు సైతం వెల్లడించాలని కోరారు. దాంతో పాటు తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వార్తలను ఛానల్ నుంచి తొలగించాలని పేర్కొన్నారు. కాగా సుశాంత్ కేసు పాట్నా నుంచి సీబీఐ విచారణకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణం బాలీవుడ్ను అతలాకుతలం చేస్తోంది. ఈ క్రమంలో పలు మీడియా సంస్థలు బాలీవుడ్ను చీల్చి చెండాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారంటూ బాలీవుడ్ నిర్మాతలు.. రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా వేసిన విషయం విదితమే. (చదవండి: మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని విఙ్ఞప్తి) -
టీవీ కార్యాలయంపై రాళ్ల దాడి
జూబ్లీహిల్స్ : గుర్తు తెలియని వ్యక్తులు బంజారాహిల్స్లోని ఓ టీవీ కార్యాలయంపై శుక్రవారం అర్ధరాత్రి రాళ్లతో దాడిచేసినట్లు సంస్థ సీఈవో రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేవారు. వివరాల్లోకి వెళితే.. మూడు ద్విచక్రవాహనాలపై వచ్చిన అగంతకులు రాళ్లతో పలు ఫ్లోర్లపై దాడి చేశారని, ఈ దాడిలో పలు అంతస్తుల అద్దాలు ధ్వంసం అయ్యాయన్నారు. నైట్ షిఫ్ట్లో పనిచేస్తున్న దాదాపు 50 మంది ఉద్యోగులు భయాందోళనకు గురవడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది 100కు ఫోన్ చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన వెనుక పెద్దకుట్ర ఉందని, దర్యాప్తు చేసి దాడికి దిగిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘డబ్బుల్’ మోసం.. టీవీ చానల్ చైర్మన్ అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఫ్లాట్లు కేటాయించేలా చూస్తున్నానని 40 మంది నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు చేసిన నిందితుడిని సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కేపీహెచ్బీ తొమ్మిదో ఫేజ్లో నివాసముంటున్న ఈస్ట్ గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం నడిమిలంక గ్రామవాసి, విజన్– టీవీ చానల్ చైర్మన్ గుతుల ప్రశాంత్ను నిందితుడిగా గుర్తించి పట్టుకున్నారు. కేసు వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షలపైనే.. డబుల్ బెడ్రూం ఫ్లాట్ల కోసం చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని నిజాంపేట, కైతలాపూర్ గ్రామాల్లో మీడియా వ్యక్తులకు డబుల్ బెడ్రూం ఫ్లాట్లు కేటాయిస్తోదంటూ కొంతమంది అమాయకులతో ప్రశాంత్ పరిచయం పెంచుకున్నాడు. దాదాపు 40 మంది నుంచి ఆధార్ కార్డులు, పాస్పోర్టు సైజు ఫొటోలు, ప్రస్తుత చిరునామా కరెంట్ బిల్లు తీసుకున్నాడు. అనంతరం ఒక్కో వ్యక్తి వద్ద రూ.1,55,000 నుంచి రూ.1,70,000 వసూలు చేశాడు. కొన్నాళ్లు గడిచాక రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ కాపీ ఇచ్చినట్టుగానే తన ల్యాప్టాప్లో రెడీ చేసి ఆ తర్వాత బాండ్ పేపర్పై కలర్ జిరాక్స్ తీశాడు. దానిపై మేడ్చల్ జిల్లాలోని ఓ సెక్షన్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆర్డర్ కాపీ అందరికీ ఇచ్చాడు. కేపీహెచ్బీ, కూకట్పల్లి, బాచుపల్లి, మియాపూర్ ఠాణా పరిధిలోని వారిని మోసం చేశాడు. ఈ సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు నిందితుడు ప్రశాంత్గా గుర్తించి కేపీహెచ్బీ పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. రూ.8 లక్షల నగదుతో పాటు కారు, ల్యాప్టాప్, కలర్ ప్రింటర్, ఎనిమిది డబుల్ బెడ్రూం కేటాయింపు నకిలీ లెటర్లు స్వాధీనం చేసుకున్నారు. ‘గతంలోనూ సైబరాబాద్ పోలీసు కమినరేట్లో సబ్ ఇన్స్పెక్టర్గా నకిలీ పోలీసు ఐడీని క్రియేట్ చేసి హైవే టోల్గేట్ల వద్ద డబ్బులు చెల్లించకుండానే తిరుగుతుండటంతో విజయవాడలోని భవానీపురం పోలీసులు ప్రశాంత్ను జూన్ 24న అరెస్టు చేశారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఇతగాడు డబుల్బెడ్రూం ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించేలా చూస్తామంటూ చెప్పే దళారులు మాటలు నమ్మవద్దని సీపీ సజ్జనార్ సూచించారు. కార్యక్రమంలో క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రణవ్ ఎస్ఐకు పుట్టిన వాడే..
గుంటూరు: ఎస్ఐ ఎస్.జగదీష్పై నమోదైన కేసులో సాక్షులను బెదిరిస్తున్నాడంటూ నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన ఓ యువతి సోమవారం రూరల్ ఎస్పీ విశాల్ గున్నీకి ఫిర్యాదు చేసింది. ముప్పాళ్ళ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న జగదీష్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా అనుభవించి ఓ బిడ్డకు తల్లిని చేశాడని నరసరావుపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ నెల 2వ తేదీన కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీని కలసి తనకు, సాక్షులకు రక్షణకల్పించాలని కోరింది. ‘ఎస్ఐపై కేసు నమోదైనప్పటి నుంచి సాక్షులుగా ఉన్న వారికి ఫోన్ చేసి మీరు ఈ కేసులో సాక్ష్యం చెబితే మీ అంతు చూస్తానని హెచ్చరిస్తున్నాడు. ఓ టీవీ చానల్లో (సాక్షి కాదు) నా గురించి అసత్యాలతో కూడిన వీడియోలను చూపించి అసభ్యకరంగా ప్రదర్శించారు. నా మాజీ భర్త పి.సుబ్బారావును సాకుగా చూపి నా మనోభావాలను దెబ్బతీసేలా టీవీలో కథనం వచ్చింది. వారిపై కూడా విచారించి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నా బిడ్డ ప్రణవ్ ఎస్ఐ జగదీష్కు పుట్టిన బిడ్డే కావాలంటే డీఎన్ఏ పరీక్షకు నేను, నాబిడ్డ సిద్ధంగా ఉన్నాం. తమకు ప్రాణరక్షణ కల్పించి ఆదుకోవాలి’ అని కోరింది. కాగా, వీడియో కాన్పరెన్స్ ద్వారా విచారించిన ఎస్పీ ఫిర్యాదుపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ఎస్ఐపై ప్రస్తుతం శాఖాపరమైన విచారణ కొనసాగుతుందని ఎస్పీ విశాల్ గున్నీ వివరించారు. -
అలిపిరి వద్ద మద్యం, మాంసం స్వాధీనం
తిరుమల: అలిపిరి టోల్గేట్ వద్ద బుధవారం మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్లు టీటీడీ వీఎస్ఓ ప్రభాకర్ తెలిపారు. తిరుపతికి చెందిన ఒక టీవీ చానల్ వీడియో జర్నలిస్టు కారులో తిరుపతి నుంచి తిరుమలకు వెళుతుండగా అలిపిరి టోల్గేట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. 5 కిలోల చికెన్, సిగ్నేచర్ విస్కీ–4 బాటిళ్లు, ఓట్కా–2 బాటిళ్లు, లూజ్ లిక్కర్–2000 ఎంఎల్ ఉన్నాయి. నిందితుడిని తిరుమలలోని టూటౌన్ పోలీస్స్టేషన్లో అప్పగించారు. అతనిపై గతంలో నమోదైన ఒక కేసు విచారణలో ఉంది. -
పదేళ్ల తర్వాత లైవ్లో దొరికిపోయాడు
చంఢీగఢ్ : ఓ వ్యక్తి తను చేసిన హత్యల గురించి ఓ టీవీ షో లైవ్లో నోరువిప్పి అడ్డంగా బుక్కయ్యాడు. హత్యలు జరిగిన పదేళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు ఈ ఘటన చంఢీగఢ్లో బుధవారం చోటు చేసుకుంది. చంఢీగఢ్కు చెందిన క్యాబ్ డ్రైవర్ మహీందర్ సింగ్ ఓ టీవీ షో లైవ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను 2010లో తన ప్రేయసి సరబ్జిత్ కౌర్ను హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు. ఆమెకు తన బావతో ఎఫైర్ ఉందని అందుకే చంపాలనుకున్నానని చెప్పుకొచ్చాడు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుందామని పిలిచి చంఢీగఢ్లోని ఓ హోటల్లో ఆమెను హతమార్చానని అంగీకరించాడు. దీంతో పోలీసులు ఉన్నపలంగా టీవీ చానల్ స్టూడియోకు చేరుకుని అతన్ని లైవ్లోనే అరెస్టు చేశారు. కాగా అతను తన మరో ప్రేయసిని హతమార్చిన కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. దీనిపైన కూడా లైవ్లో అతను నోరు విప్పాడు. ఆమె ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తితో ప్రేమాయణం జరుపుతోందని అందుకే చంపేశానని ఒప్పుకున్నాడు. దీనిపై అతను ఇప్పటికే శిక్ష అనుభవిస్తుండగా గత కొంతకాలంగా బెయిల్పై తిరుగుతున్నాడు. -
దావా నెగ్గిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య
లండన్ : పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఎ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహం ఖాన్ పరువునష్టం దావా కేసు నెగ్గారు. కోర్టు ఆదేశాలతో నిరాధార ఆరోపణలపై సదరు వార్తా ప్రసార సంస్థ ఆమెకు బహిరంగ క్షమాపణలు చెప్పింది. వివరాలు.. ఇమ్రాన్ మాజీ భార్య, పాక్ సంతతి బ్రిటిష్ పౌరురాలు రెహమ్ ఖాన్ పాక్లో ఎన్నికల ముందు తన మాజీ భర్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందులో కొన్ని వ్యక్తిగత, లైంగిక విషయాలు కూడా ఉన్నాయి. అంతేకాక, పూర్తి వివరాలతో తన ఆత్మకథను రాస్తానని ఆమె అప్పడు ప్రకటించారు. ఎన్నికల్లో కాబోయే ప్రధానిగా ఇమ్రాన్ పేరు మార్మోగుతున్న తరుణంలో రెహమ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇమ్రాన్కు ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉండడంతో పార్టీలోని ఇతర నాయకులు ఆమెను టార్గెట్గా చేసి అనేక తీవ్ర విమర్శలు చేశారు. రెహమ్ ఆత్మకథ రాసేందుకు ఇమ్రాన్ ప్రత్యర్థి పార్టీ అయిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ నాయకుడు షెహబాజ్ షరీఫ్ వద్ద నుంచి డబ్బు తీసుకున్నారని ప్రధానంగా ఆరోపించారు. ఇమ్రాన్ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు రెహమ్ను ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇమ్రాన్ పార్టీ నాయకుడు, ఇప్పటి పాకిస్తాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ గతేడాది జూన్లో దునియా అనే టీవీ చానెల్లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. పైన పేర్కొన్న వ్యాఖ్యలను పరుష పదజాలంతో మరోసారి చేశారు. ఉర్దూలో ప్రసారమయ్యే దునియా చానెల్ ఇంగ్లాండ్లో కూడా ప్రసారమవుతుంది. అయితే రషీద్ చేసిన ఆరోపణలను ఆ చానెల్ పదే పదే ప్రసారం చేసింది. దీంతో మనస్తాపానికి గురైన రెహమ్ ఖాన్ నిరాధార ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారంటూ లండన్లోని రాయల్ కోర్టులో కేసు వేసింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి మాథ్యూ నిక్లిన్ రెహమ్ ఖాన్కు క్షమాపణలు చెప్పి కోర్టు ఖర్చులు చెల్లించాలని సదరు టీవీ చానెల్ను ఆదేశించారు. జడ్జి ఆదేశాల ప్రకారం దునియా టీవీ చానెల్ రెహమ్ ఖాన్కు బహిరంగ క్షమాపణలు చెబుతూ, కొంత నష్ట పరిహారంతో కోర్టు ఖర్చుల్ని భరిస్తామని ప్రకటించింది. అనంతరం రెహమ్ స్పందిస్తూ.. ఈ తీర్పు వల్ల నా వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నానని, పాకిస్తాన్లో నైతిక జర్నలిజానికి ఈ తీర్పు దోహదపడుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. -
టీవీ చానెల్ ఏర్పాటులో రజనీకాంత్
చెన్నై: సినీ నటుడు రజనీకాంత్ నెలకొల్పిన రాజకీయ ఫోరం రజనీ మక్కల్ మంద్రమ్..టీవీ చానెల్ను పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్మార్క్స్ వద్ద ఆ చానెల్ పేరును నమోదుచేసేందుకు యత్నిస్తున్నట్లు స్వయంగా రజనీకాంతే తెలిపారు. శనివారం కుటుంబ సభ్యులతో కలసి అమెరికా బయల్దేరే ముందు ఆయన విమానాశ్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. తాము అనుకుంటున్న పేరుతోనే ఎవరో చానెల్ ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిసిందని, వారి కన్నా ముందే ఆ పేరును నమోదుచేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తారా? అని ప్రశ్నించగా, ఇంకా తాను రాజకీయ పార్టీని నెలకొల్పలేదని, ఎన్నికల్లో పోటీపై తరువాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. -
సొంత చానెల్ పెట్టనున్న సూపర్ స్టార్..?
ప్రస్తుత కాలంలో రాజకీయ పార్టీలు మనుగడలో ఉండాలంటే వాటికంటూ సొంత టీవీ చానెల్ ఉండటం తప్పనిసరిగా మారింది. ఇదే అంశాన్ని ఫాలో అవుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. అభిమానులు ఎన్నో ఏళ్లుగా తలైవా రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 31 తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటించారు రజనీకాంత్. ‘మక్కల్ మంద్రమ్’ అనే పార్టీని స్థాపించిన రజనీకాంత్.. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తన పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతానని కూడా ప్రకటించారు. పార్టీ పేరును అనౌన్స్ చేశారు. కానీ అది ఇంకా పూర్తిస్థాయిలో రూపుదాల్చలేదు. ప్రస్తుతం రజనీ పార్టీ నిర్మాణ కార్యకలపాలను ఓ ప్రముఖునికి అప్పజెప్పారనే వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ క్రమంలో త్వరలోనే రజనీకాంత్ పేరు మీద ఓ టీవీ చానెల్ను కూడా ప్రారంభించబోతున్నారనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే రజనీ టీవీ పేరుతో ఓ ట్రేడ్ మార్క్ను కూడా రిజిస్టర్ చేయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాక ప్రస్తుతం ట్రేడ్ మార్క్ లోగోకు సంబంధించిన ఫోటో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇప్పటివరకూ ఈ విషయం గురించి ఎటువంటి అధికారిక సమాచారం తెలియలేదు. ఇక సినిమాల విషయానికోస్తే రజనీకాంత్ నటించిన పేట్టా విడుదలకు సిద్ధంగా ఉంది. -
త్వరలో చానల్, పత్రిక..
రాజకీయ ప్రకటనతో నాయకుడిగా అవతరించిన కథానాయకుడు రజనీకాంత్ తన మక్కల్ మండ్రంకు ప్రత్యేక నియమ నిబంధనల్ని రూపొందించారు. మక్కల్ మండ్రంలో నిర్వాహకులు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, క్రమశిక్షణ కల్గిన రక్షకుల వలే ఎలా మెలగాలి వివరిస్తూ కఠిన నిబంధనల్ని పుస్తకం రూపంలో మంగళవారం విడుదల చేశారు. అలాగే, త్వరలో ఓ టీవీ చానల్, పత్రిక ఏర్పాటుతో రాష్ట్ర పర్యటనకు సిద్ధం అవుతున్నారు. సాక్షి, చెన్నై : 2017 డిసెంబరు 31వ తేదీ కథానాయకుడు రాజకీయ ప్రకటనతో నాయకుడిగా అవతరించారు. తమిళనాడు పరిరక్షణకు రక్షకులుగా నిలబడుదామని అభిమాన సేనలకు ఈసందర్భంగా పిలుపునిచ్చారు. రజనీ రాజకీయ ప్రకటనతో తమిళనాట ఆహ్వానాలు, వ్యతిరేక చర్చ జోరుగానే సాగింది. అయితే, వీటన్నింటిని లెక్క చేయని తలైవా పార్టీ కసరత్తుల దృష్టి పెట్టారు. తన సన్నిహిత మిత్రులు, మేధావులతో మంతనాల్లో నిమగ్నం అయ్యారు. అయితే, రాజకీయ పార్టీ ప్రకటనలో మాత్రం జాప్యం తప్పడం లేదు. సమయం వచ్చినప్పుడు పార్టీ అని స్పందిస్తూ వచ్చిన రజనీకాంత్, తన అభిమాన సంఘాల్ని ఏకంచేసి రజనీ మక్కల్ మండ్రాన్ని నెలకొల్పడంలో సఫలీకృతులయ్యారు. రజనీ మక్కల్ మండ్రంకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో నిర్వాహకుల్ని ఏర్పాటుచేశారు. ఇందులో ఎవరి మీదైనా సరే చిన్న ఫిర్యాదు, ఆరోపణ వచ్చినా తక్షణం ఉద్వాసన పలికి మరొకరికి అవకాశం కల్పిస్తున్నారు. రజనీ మక్కల్ మండ్రం తమిళనాడుకు రక్షకులుగా నిలబడాలన్న కాంక్షతో నిబంధనల్ని కఠినత్వం చేస్తూ కీలక నిర్ణయాలను తాజాగా తీసుకున్నారు. రజనీ మక్కల్ మండ్రం నియమ నిబంధనల్ని ఓ పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. ఇందులో అనేక కీలక, కఠిన అంశాలను పొందుపరిచారు. రక్షకులు ఎలా ఉండాలో చాటడంతో పాటు, అందుకు సిద్ధపడే వాళ్లు ఎలా తమను తాము మలచుకోవాలో వివరిస్తూ అంశాల్ని వివరించారు. నిబంధనలు మక్కల్ మండ్రం నిబంధనలతో కూడిన పుస్తకాలను నిర్వాహకులకు పంపిణీ చేశారు. అందులోని కొన్ని నిబంధనలు.. మక్కల్ మండ్రం నిర్వాహకులు ఇతరులకు ఆదర్శంగా ఉండే రీతిలో మెలగాల్సిన అవసరం ఉంది. ఎవరైనా చిన్న తప్పుచేసినా, అది మండ్రం మీద ప్రభావం పడుతుంది కాబట్టి, అలాంటి వారిని ప్రోత్సహించకుండా, తక్షణం ఉద్వాసన పలకడం లక్ష్యంగా కొన్ని అంశాలను పొందుపరిచారు. అలాగే, ఒక కుటుంబానికి చెందిన వాళ్లు మక్కల్ మండ్రంలో ఏదేని పదవిలో ఉన్న పక్షంలో, ఆ కుటుంబానికి చెందిన మరకొరికి పదవులు కేటాయించే ప్రసక్తేలేదు. మత, కుల, తదితర సంఘాల్లో సభ్యులుగా ఉన్న వాళ్లకు రజనీ మక్కల్ మండ్రంలో చోటు లేదు. అలాంటి వారు ఎవరైనా ఉన్న పక్షంలో వారంతకు వారే బయటకు వెళ్లడం మంచిది. లేదా ఉద్వాసన పలకడం త«థ్యం. యువజన విభాగంలో 35 ఏళ్ల వయస్సులోపు వారికి మాత్రమే చోటు. 18 సంవత్సరాల వయసు దాటిన వాళ్లు ఎవరైనా మండ్రంలో సభ్యులుగా చేరవచ్చు. మక్కల్ మండ్రం జెండాను ఎల్లప్పుడు ఉపయోగించేందుకు వీలు లేదు. ప్రధానంగా వాహనాల్లో ఉపయోగించకుండా ఆంక్షలువిధించారు. మక్కల్ మండ్రం కార్యక్రమాల సమయంలో మాత్రమే ఉపయోగించి, ఆ తదుపరి వాటిని తీసివేయాలి. మహిళల్ని గౌరవించడం, భారత దేశ చట్టాలను గౌరవించాలి. వ్యక్తిగత విమర్శలకు చోటులేదు. పార్టీ నుంచి లఖిత పూర్వకంగా వచ్చే ప్రకటనలు, ఇతర వివరాల మేరకు నడచుకోవాలి. ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వీలు లేదు. పార్టీ ఆదేశించకుండా ఎలాంటి విరాళాల్ని సేకరించకూడదు. ఇతరుల్ని హేళనచేసే రీతిలో సామాజిక మాధ్యమాల్లో స్పందించరాదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రీతిలో నడుచుకోవాలి. ప్రజాస్వామ్య బద్ధంగానే మక్కల్ మండ్రం నిర్వాహకుల ఎంపిక ఎన్నికలు జరిగే రీతిలో పార్టీ ఇచ్చిన ఆదేశాలను గౌరవించాలి. మార్పులు చేర్పులు, ఉద్వాసనలు, చర్యల విషయాల్లో అధిష్టానం తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడాల్సిందేనంటూ అనేక నిబంధనల్ని అందులో పొందుపరిచారు. మీడియా వైపు చూపు మక్కల్ మండ్రం పటిష్టత మీద దృష్టి పెట్టిన రజనీ, అదే తరహాలో బూత్ కమిటీల ఎంపికలోనూ నిమగ్నం అయ్యారు. ఒక బూత్కు 30 మంది చొప్పున కమిటీల ఏర్పాటు కసరత్తుల్ని వేగవంతం చేశారు. కొన్నిచోట్ల బూత్ కమిటీలకు పుష్కలంగా మద్దతుదారులు ఉన్నా, మరికొన్నిచోట్ల సంఖ్య తక్కువగా ఉండడంతో కష్టాలు తప్పడం లేదు. దీన్ని పరిగణించి ఆయా ప్రాంతాల్లో మక్కల్మండ్రం నిర్వాహకుల ద్వారా కార్యక్రమాల్ని విస్తృతం చేయడానికి సిద్ధం అయ్యారు. అలాగే, పార్టీ ఏర్పాటుకు ముందుగా తమ కార్యక్రమాలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాలంటే, మీడియా మద్దతు తప్పనిసరిగా భావించారు. ఇందుకోసం ఓ టీవీ చానల్ మీద దృష్టి పెట్టారు. తన సన్నిహితునికి సంబంధించిన ఓ టీవీ చానల్కు మంచి గుర్తింపు ఒకప్పుడు ఉన్నా, ఇప్పుడు ప్రజాదరణ లేక సతమతం అవుతుండడాన్ని పరిగణించి, దానిని తన గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అలాగే, ఓ పత్రికను నెలకొల్పడమా లేదా, కష్టాలు, నష్టాల్లో ఉన్న పరిశ్రమను తమ ఆధీనంలోకి తీసుకోవడమా..? అన్న దిశగా కూడా రజనీ కసరత్తుల్లో ఉన్నట్టు సమాచారం. ఈ ప్రక్రియలన్నీ త్వరితగతిన ముగిసిన పక్షంలో, ఆ తదుపరి రాష్ట్ర పర్యటనకు సన్నద్ధం కానున్నారు. ఇందుకు తగ్గట్టుగా కార్యాచరణను మక్కల్ మండ్రం రాష్ట్ర నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. -
బంజారాహిల్స్లో అర్ధరాత్రి ఉద్రిక్తత
బంజారాహిల్స్: బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఓ టీవీ చానెల్లో శ్రీరాముడు, సీతలపై చర్చావేదిక సందర్భంగా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ కార్యకర్తలు, ప్రతినిధులు సదరు చానెల్ భవనంలోకి చొచ్చుకెళ్లారు. ఈ ఘటనపై చానెల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న వీహెచ్పీఎ, బజరంగ్దళ్ కార్యకర్తలు బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు వెస్ట్జోన్ ఇన్చార్జి డీసీపీ విశ్వప్రసాద్, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, బంజారాహిల్స్ ఏసీపీ కే.ఎస్.రావు నేతృత్వంలో భారీగా బలగాలను మోహరించారు. అప్పటికే వీహెచ్పీ, బజరంగ్దళ్ కార్యకర్తలు భారీగా పోలీసు స్టేషన్ బయట గుమిగూడారు. ఈ నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. ఒకవైపు భారీగా మోహరించిన పోలీసులు, మరో వైపు న్యాయం చేయాలంటూ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి కూడా స్టేషన్కు వచ్చారు. ఎట్టకేలకు అరెస్ట్ చేసిన కార్యకర్తలను విడుదల చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
‘సాఫ్ట్నెట్’ చాటున రాజకీయ ప్రచారం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న చంద్రబాబు సర్కారు తమ ద్వారా పొందుతున్న సేవలను సైతం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించు కోవడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మన టీవీ’ లో టీడీపీ సర్కారు రాజకీయ కార్యక్రమాలను ప్రసారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘సాఫ్ట్నెట్’ ద్వారా ఏపీకి అందిస్తున్న బ్యాండ్విడ్త్ సర్వీసులను సస్పెండ్ చేసున్నట్లు ప్రకటించింది. టీడీపీ సర్కారు అధికార దుర్వినియోగాన్ని ఎండగడుతూ గవర్నర్కు సైతం తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడం గమనార్హం. విద్య, వైజ్ఞానిక సేవల కోసమే.. ‘సాఫ్ట్నెట్’ (సొసైటీ ఫర్ తెలంగాణ స్టేట్ నెట్వర్క్) ‘మనటీవీ’ ద్వారా విద్య, వైజ్ఞానిక, టెలి మెడిసిన్ సేవలను ఉపగ్రహ ప్రసారాలతో అందించేందుకు ఇస్రోతో ఒప్పందం చేసుకుంది. సమాచార, సాంకే తిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికే ఈ బ్యాండ్విడ్త్ను వినియోగించాలి. ఏపీ ప్రభుత్వం డీఎస్ఎన్జీ ద్వారా బ్యాండ్విడ్త్ను రాజకీయ పార్టీ సమావేశాలకు వినియోగించుకుంటున్నట్లు తెలం గాణ సర్కారు గుర్తించింది. రాజకీయ అవసరాలు, పార్టీ సమావేశాలకు దీన్ని వాడుకోవడం బ్యాండ్ విడ్త్ కేటాయింపుల నిబంధనల ఉల్లంఘనే అవుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. టీడీపీ రాజకీయ సమావేశాలకు ‘సాఫ్ట్నెట్’ సాఫ్ట్నెట్ పరిపాలనా కేంద్రం తెలంగాణ ఐటీ శాఖ పరిధిలో ఉంది. దీన్ని పునర్విభజన చట్టం 10వ షెడ్యూల్లో కూడా చేర్చారు. 2014 జూన్ 2వ తేదీ నుంచి సాఫ్ట్నెట్ ఆంధ్రప్రదేశ్కు సేవలను అందిం చాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ఇస్రోతో మన టీవీ ఛానల్ ఒప్పందం చేసుకుంది. టీడీపీ నిర్వహించిన మహానాడుకు కొద్ది రోజులు మందుగా అంటే మే 24వ తేదీన సాఫ్ట్నెట్ను పార్టీ రాజకీయ సమావేశం కోసం చంద్రబాబు ప్రభుత్వం వినియోగించుకున్నట్లు తెలంగాణ సర్కారు గుర్తిం చింది. ఇది బ్యాండ్విడ్త్ నిబంధనలను ఉల్లం ఘించడమేనని తెలంగాణ సర్కారు పేర్కొంది. తెలంగాణ సర్కారుపై అభ్యంతర వ్యాఖ్యలు ‘మన టీవీ 1’ బ్యాండ్ విడ్త్ను వినియోగించుకుని రాజకీయ పార్టీ సమావేశాలను ప్రసారం చేయడంతోపాటు తెలంగాణ సర్కారుపై అభ్యంతర కర వ్యాఖ్యలను కూడా ప్రసారం చేసినట్లు గుర్తిం చారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్నెట్ను టీడీపీ రాజకీయ అవసరాల కోసం దుర్వినియోగం చేస్తున్నందున ఏపీకి బ్యాండ్విడ్త్ సర్వీసులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలంగాణ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. లేఖ ప్రతులను గవర్నర్ నరసింహన్ ముఖ్య కార్యదర్శి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యకార్యదర్శికి కూడా పంపించారు. -
ఆ టీవీ చానెల్కు మరో షాక్!
న్యూఢిల్లీ: అసత్యాలతో కూడిన విద్వేషపూరిత కథనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారంటూ ఓ ప్రఖ్యాత టీవీ చానెల్కు నోటీసులు జారీ అయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తోన్న భారతీయులను.. రోహింగ్యాలు, బంగ్లాదేశీలుగా పేర్కొంటూ ఆ చానెల్ ఒక కథనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. దానిపై ఢిల్లీ మైనారిటీస్ కమిషన్(డీఎంసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయుల జాతీయతను కించపరిచేలా సాగిన కథనంపై తక్షణమే క్షమాపణలు చెప్పాల్సిందిగా చానెల్కు నోటీసులు ఇచ్చింది. ఆది నుంచీ వివాదాలే: నోయిడా కేంద్రంగా 2007 నుంచి పనిచేస్తోన్న హిందీ న్యూస్ చానెల్ ‘సుదర్శన్ న్యూస్’... ఆది నుంచీ వివాదాలకు కేంద్రంగా ఉంటూవస్తోంది. మొన్న మే11న బవానా ప్రాంత వాసులపై ఆ చానెల్ చేసిన ప్రోగ్రామ్లో స్థానికులను విదేశీయులుగా పేర్కొంది. ఇరువర్గాల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా టీవీ ప్రసారాలు చేశారన్న ఆరోపణలపై సుదర్శన్ న్యూస్ ఎండీ, ఎడిటర్ ఇన్ చీఫ్ సురేశ్ చౌహంకేను గతేడాది సంభల్(ఉత్తరప్రదేశ్) పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందే అతనిపై అత్యాచారం, హత్యాయత్నం కేసులున్నాయి. తన చానెల్లోనే పనిచేసిన ఉద్యోగినిపై చౌహంకే అత్యాచారయత్నం చేశాడని 2016లో నోయిడా పోలీసులు కేసు నమోదుచేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. జూన్ 12లోగా స్పందించకుంటే..: ఢిల్లీలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో నిర్వాసితులుగా మారిన చాలా మందికి ప్రభుత్వమే బవానా ప్రాంతంలో పునరావాసం కల్పించిందని, అలాంటివారిని విదేశీయులుగా పేర్కొనడం గర్హనీయమని డీఎంసీ చైర్మన్ జాఫరుల్ ఇస్లామ్ ఖాన్ అన్నారు. అనుచిత ప్రసారాలపై సుదర్శన్ న్యూస్ జూన్ 12లోగా స్పందించి, క్షమాపణలు చెప్పడంతోపాటు సంబంధిత వీడియోలను తొలగించాలని, లేకుంటే తీవ్రచర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. చానెల్ ప్రసారాలపై దర్యాప్తు చేయాల్సిందిగా ఢిల్లీ నార్త్జోన్ పోలీసులను కూడా ఆదేశించినట్లు ఖాన్ తెలిపారు. -
వేలూరులో టీవీ కెమెరామెన్ హత్య
వేలూరు: ఓ ప్రైవేట్ టీవీ కెమెరామెన్ను గంజాయి విక్రయించే ముఠా సభ్యులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వేలూరులో చోటుచేసుకుంది. వేలూరు శరవణ్పేట ఎన్ఎస్కే నగర్కు చెందిన అశోక్కుమార్(25) ప్రైవేట్ టీవీ చానెల్లో కెమెరామెన్ అవివాహితుడు. గురువారం రాత్రి అశోక్కుమార్ ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 12.30 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన తిరుమలై, రమేష్, అగస్టిన్ అశోక్కుమార్ ఇంటి తలుపులు తట్టారు. అశోక్కుమార్ తలుపులు తీసిన వెంటనే ఈ ముగ్గురు కత్తితో దారుణంగా పొడిచారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయడంతో నిందితులు ముగ్గురూ అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అశోక్కుమార్ను కుటుంబసభ్యులు సమీపంలోని పెండ్ల్యాండ్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. విషయం తెలిసిన సౌత్ పోలీసులు నిందితులు తిరుమలై, రమేష్లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అగస్టిన్ కోసం గాలిస్తున్నారు. నిందితులు ముగ్గురూ ఎన్ఎస్కే నగర్లో తరచూ గంజాయి విక్రయించే వారని తెలిసింది. దీన్ని అశోక్కుమార్ పోలీసులకు చెప్పడంతో ఈ విషయం తెలిసిన ముగ్గురు నిందితులు అశోక్కుమార్ను హత్య చేసినట్లు పోలీసుల తెలిపారు. -
ఘోర తప్పిదం.. ఛానెల్ పరువును తీస్తున్నారు
ఇస్లామాబాద్ : ఘోర తప్పిందంతో ఓ ఉర్దూ న్యూస్ ఛానెల్ పరువు పొగొట్టుకుంది. పాప్ సింగర్ ఎడ్ షీరన్ను మహిళగా అభివర్ణిస్తూ ఓ కథనం ప్రసారం చేసింది. దీంతో సదరు ఛానెల్ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఫిమేల్ రీడర్తో గొడవ.. వైరల్ షేప్ ఆఫ్ యూ, కాసెల్ రాక్ ఆల్బమ్లతో ప్రపంచవ్యాప్తంగా యూత్ను ఉర్రూతలూగించాడు షీర్. నాలుగు సార్లు గ్రామీ అవార్డులు గెలుచుకున్న అతగాడి గురించి కనీస అవగాహన లేనట్లుగా ఇస్లామాబాద్కు చెందిన ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానెల్ కథనం ప్రసారం చేసింది. అయితే ఈ క్రమంలో అతను ఫోటోలు, విజువల్స్ను ప్రదర్శిస్తూ మరీ పాప్ క్వీన్గా కింద స్క్రోలింగ్ వేయటం, బులిటెన్లో యాంకర్ న్యూస్ చదివి వినిపించారు. ఈ వార్తను ఓ వ్యక్తి వీడియోతోపాటు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘బ్రిటిష్ పాప్ క్వీన్ ఎడ్ షీరన్ 2017 బెస్ట్ ఫిమేల్ సింగర్గా ఎంపికయ్యారు’... మొత్తానికి పాక్ న్యూస్ చానళ్లు లింగ సమానత్వం (జెండర్ ఈక్వాలిటీ) పాటిస్తున్నాయి. ఎక్స్ప్రెస్ న్యూస్ వాళ్లకు ఆడా-మగా తేడా లేకుండా పోయింది. దయ చేసి ఈ విషయాన్ని షీరన్కు ఎవరూ చెప్పకండి, కనీస అవగాహన లేనివాళ్లు న్యూస్ ఛానెళ్లు ఎందుకు నడుపుతున్నారో అర్థం కావట్లేదు... ఇలాంటి రీ ట్వీట్లు ఇప్పుడు కనిపిస్తున్నాయి. Ed Sheeran pop queen aur gulukara?😂 Express news thinks that Ed Sheeran is a female😂😂 pic.twitter.com/EloM0uHoXN — Imad Kazmi (@imadtweetss) 27 February 2018 -
అన్నాడీఎంకేకు సొంత చానల్, పత్రిక!
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ సొంత టీవీ చానల్, దిన పత్రికను ప్రారంభించాలని భావిస్తోంది. ప్రతిపక్ష డీఎంకేతో పాటు ఇటీవలే ఆర్కేనగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన టీటీవీ దినకరన్కూ సొంత ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమ పార్టీకి కూడా సొంత మీడియా ఉండాలని అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సొంత మీడియా ఏర్పాటుపై ఎమ్మెల్యేలతో చర్చించారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి తొలిసారిగా హాజరుకానున్న దినకరన్ను చూసి నవ్వడం, మాట్లాడటం చేయరాదని ఎమ్మెల్యేలను ఎడపాడి, పన్నీర్ ఆదేశించారు. -
అఫ్గానిస్తాన్లో టీవీ చానెల్పై ఉగ్ర దాడి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ లోని శంషాద్ టీవీ చానెల్ కార్యాలయం లోకి పోలీసు దుస్తుల్లో ప్రవేశించిన దుండగులు తుపాకీతో విచక్షణార హితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు మరణిం చగా.. 24 మంది ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అఫ్గాన్ ప్రత్యేక దళ పోలీసులు కార్యాలయ భవనం గోడకు ఓవైపు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. కాల్పులకు తెగబడిన దుండగుడిని హతమార్చారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఐసిస్ ప్రకటించుకుంది. -
15 కోట్లు డిమాండ్.. టీవీ చానల్ చీఫ్ అరెస్ట్
జయనగర(బెంగుళూరు) : పదిహేను కోట్ల రూపాయలు లంచం ఇవ్వాలని లేని పక్షంలో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని పారిశ్రామికవేత్తను బెదిరించిన ఓ ప్రైవేటు టీవీ చానల్ చీఫ్ ప్రసాద్ తో పాటు అతడి అనుచరుడు నితిన్ను కోరమంగల పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు... ప్రైవేటు టీవీ.చానల్లో చీఫ్గా ఉన్న ప్రసాద్ ఓ పారిశ్రామికవేత్త కు వ్యతిరేకంగా కథనాన్ని టీవీలో ప్రసారం చేశాడు. అనంతరం అతడికి ఫోన్ చేసి రూ.15 కోట్లు లంచం ఇవ్వాలని లేని పక్షంలో మీకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తామని బెదిరించాడు. రూ.15 కోట్లలో ముందుగా రూ.10 కోట్లు చెల్లించాలని, మాకు తెలిసిన వ్యక్తుల పేరుతో అకౌంట్కు జమ చేయాలని పారిశ్రామికవేత్తను సూచించాడు. దీనిపై సదరు పారిశ్రామికవేత్త కోరమంగల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురిని శనివారం అరెస్ట్ చేశారు. వీరిపై కోరమంగల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
టీడీపీ లక్ష్యం ‘సాక్షి’
-
టీడీపీ లక్ష్యం ‘సాక్షి’
► మహిళలపై స్పీకర్ మాటలను వక్రీకరించారని అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల విమర్శలు ► ఎడిటర్, పబ్లిషర్ను సభకు పిలవాలని డిమాండ్ ► సాక్షి పత్రిక, చానల్పై చర్యలు తీసుకోవాలి: సీఎం చంద్రబాబు ► స్పీకర్ వజ్రాయుధం బయటకు తీయాలి: శ్యామ్సుందర్ శివాజీ ► స్పీకర్ కోడెల ప్రెస్మీట్ అసెంబ్లీ టీవీలో ప్రదర్శన సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ నేతలు సాక్షి పత్రిక, టీవీ చానల్ను లక్ష్యంగా చేసుకున్నారు. గురువారం శాసనసభలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చను పక్కదారి పట్టించిన టీడీపీ ఎమ్మెల్యేలు ‘సాక్షి’పై విమర్శలకు దిగారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాత్ర ఉందని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో చర్చను పక్కదారి పట్టించాలని టీడీపీ సభ్యులు ఎత్తుగడ వేశారు. ఇందులో భాగంగానే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రెస్మీట్ అంశాన్ని సభలో తెరపైకి తెచ్చారు.జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా ఫిబ్రవరి 8వ తేదీన ప్రెస్మీట్లో స్పీకర్ చేసిన ప్రసంగాన్ని (రికార్డు) అసెంబ్లీ టీవీలో ప్రదర్శించారు. అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించి రాయడం, చూపడం ద్వారా ‘సాక్షి’ పత్రిక, టీవీ చానల్ స్పీకర్ గౌరవానికి భంగం కలిగించాయని అధికార పక్ష సభ్యులు ఆరోపించారు. అందువల్ల సాక్షి పత్రిక, చానల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర పత్రికలు, చానళ్లు కూడా ప్రసారం చేశాయి: చంద్రబాబు ‘‘నేను అనని మాటలను అన్నట్లుగా రాయడం నాకు బాధ కలిగించింది. సోషల్ మీడియాలో కూడా మా కుటుంబ సభ్యులపై లేనిపోనివి రాయడం అన్యాయం, అక్రమం, అనైతికం’’ అని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ప్రతిపక్ష సభ్యులున్నప్పుడు మరోసారి ఈ వీడియోను అసెంబ్లీ టీవీలో ప్రసారం చేసి, కారకులపై చర్యలు చేపట్టేలా సభ నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్పీకర్ వ్యాఖ్యలను సాక్షితోపాటు ఇతర పత్రికలు రాశాయని, ఇతర చానళ్లు కూడా ప్రసారం చేశాయని పేర్కొన్నారు. నిజానికి ఆ రోజు తాను స్పీకర్కు ఫోన్చేసి ఆరా తీశానన్నారు. తాను ఆ మాటలు అనలేదని స్పీకర్ చెప్పారన్నారు. ప్రతిపక్ష సభ్యులు సభలోకి వచ్చాక వారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత చర్యలు తీసుకోవాలని మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సభను, స్పీకర్ను అగౌరవపరిచేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ సభ్యులు బుచ్చయ్య చౌదరి, అనిత, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణు కుమార్రాజు తదితరులు ‘సాక్షి’పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమన్లు జారీ చేసి ఎడిటర్ను, పబ్లిషర్ను సభకు పిలవాలన్నారు. మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర్ శివాజీ మాట్లాడుతూ... స్పీకర్కు ఉన్న వజ్రాయుధాన్ని బయటకు తీయాల్సిన సమయం ఆసన్నమైందంటూ పురాణ గాథను వినిపించారు. గురువారం అసెంబ్లీ టీవీలో ప్రసారం చేసిన స్పీకర్ ప్రెస్మీట్లోని ముఖ్యమైన అంశమిదీ... ఏడో తరగతి నుంచి విద్యార్థులకు తప్పనిసరి సెల్ఫ్ ప్రొటెక్షన్ కోర్సుల నిర్వహణపై మహిళా పార్లమెంట్ సదస్సులో తీర్మానం చేస్తారా? అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు స్పీకర్ సమాధానమిచ్చారు. ఆయన ఏం అన్నారంటే... ‘‘ఒక వెహికల్ కొన్నారనుకోండి. ఇంట్లో షెడ్లో పెడితే యాక్సిడెంట్లు జరగవు కదా! బజారుకు పోతే, రోడ్డు ఎక్కితేనే యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా స్పీడ్ పెరిగితే యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువవుతుంది. 50 కిలోమీటర్లు తక్కువ స్పీడ్. అలా వెళితే యాక్సిడెంట్లకు అవకాశం తక్కువ. 100 కిలోమీటర్ల వేగంతో పోతే అవకాశం ఎక్కువవుతుంది. అట్లాగే ఆడపిల్లలు హౌస్వైవ్స్గా ఉండి గతంలోలాగే ఉంటే వాళ్లమీద ఏమీ జరగవు. వాళ్లు(ఆడపిల్లలు) ఇవాళ చదువుకున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు. దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ది సొసైటీ. లా ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఈవ్టీజింగ్ కావచ్చు, వేధింపులు కావచ్చు, అట్రాసిటీస్ కావచ్చు, అత్యాచారాలు, కిడ్నాప్లు కావచ్చు. అలా ఇళ్లలో నుంచి బయటకు పోకపోతే జరగవు. కానీ, అంతమాత్రం చేత ఆడపిల్లలు మళ్లీ ఉన్నది ఎందుకు? పోవాలి. ధైర్యంగా పోవాలి. ధైర్యంగా చదవాలి. ఉద్యోగాలు చేయాలి. సో.. దానికి తోడు వాళ్లకు కుంగ్ఫూ ఒక్కటే కాదు. కుంగ్ఫూ ఇలాంటి ఆత్మరక్షణ మెకానిజం ఒక ఎత్తయితే, దానికంటే వాళ్లలో ధైర్యం రావాలి. ఆ ధైర్యాన్ని మనం ఇవ్వాలి’’ అని స్పీకర్ కోడెల ప్రెస్మీట్లో వివరించారు. మధ్యాహ్నం 1.55 గంటల నుంచి 2.05 గంటల వరకూ స్పీకర్ ప్రెస్మీట్ను టీవీలో ప్రసారం చేశారు. ఈ సమయంలో ప్రతిపక్ష సభ్యులెవరూ సభలో లేరు. అంతకుముందే బయటకు వెళ్లిపోయారు. ఇతర పత్రికలు, చానళ్లను వదిలేసిన టీడీపీ స్పీకర్ ఫిబ్రవరి 8వ తేదీన ప్రెస్మీట్లో మాట్లాడిన అంశాలనే సాక్షి పత్రిక ఫిబ్రవరి 9వ తేదీన ప్రచురించింది, టీవీ చానల్ ప్రసారం చేసింది. అలాగే ఇతర పత్రికలు, చానళ్లు కూడా ప్రసారం చేశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ఈ విషయాన్ని అసెంబ్లీలో వెల్లడించారు. అయినప్పటికీ టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు, నేతలు ఇతర పత్రికలు, చానళ్లను వదిలేసే సాక్షిపైనే గురిపెట్టడం గమనార్హం. -
టీవీ ఛానెల్పై నర్సుల ఫిర్యాదు
హైదరాబాద్: టీవీ కార్యక్రమాలపై ఈ మధ్య కాలంలో ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్లో ప్రసారమైన కార్యక్రమంలో తమను తీవ్రంగా అవమానించారంటూ నర్సులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ టీవీ ఛానెల్లో ఈ నెల 4వ తేదీన ప్రసారమైన పటాస్షోలో నర్సులను కించపరిచేలా అసభ్యంగా మాట్లాడారని తెలంగాణ నర్స్ అసోయేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో జబర్దస్థ్ కార్యక్రమంలో తమను కించపరిచారంటూ న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విశయం తెలిసిందే -
నిండు జీవితం.. విషాదాంతం
తాగుడుకు బానిసై తరచూ గొడవలు టీవీ చానల్ మార్చే విషయంలో ఘర్షణ కుటుంబ సభ్యుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు ముదిగుబ్బ మండలం ఏబీపల్లె తండాకు చెందిన డి.లక్ష్మానాయక్(27) కుటుంబ సభ్యుల దాడిలో బుధవారం రాత్రి తీవ్రంగా గాయపడి, చివరకు ప్రాణాలు కోల్పోయాడని ఏఎస్ఐ విజయభాస్కర్రాజు గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం... తండాకు చెందిన లక్ష్మీబాయి, వెంకటేశ్ నాయక్ దంపతులకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు సంతానం. కుమార్తెతో పాటు పెద్ద కుమారుడు గోపాల్నాయక్కు వివాహాలయ్యాయి. లక్ష్మానాయక్, రామునాయక్ కవల పిల్లలు. వారిద్దరూ అవివాహితులు. వారిలో లక్ష్మానాయక్ తాగుడుకు బానిసయ్యాడు. ప్రతి రోజూ మద్యం తాగొచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కూడా అతను పీకల దాకా మందు తాగి ఇంటికొచ్చాడు. కుటుంబ సభ్యులందరూ టీవీ చూస్తుండగా.. అమ్మానాన్న, తమ్ముడు అందరూ కలసి బుధవారం రాత్రి ఎంతో ఆసక్తిగా టీవీ చూస్తున్నారు. అంతలోనే మద్యం మత్తులో ఊగుతూ ఇంటికొచ్చాడు లక్ష్మానాయక్. అప్పటి వరకు చూస్తున్న చానల్ను మార్చాలని పట్టుబట్టాడు. కాసేపు ఆగమని చెప్పినా అతను విన్పించుకోలేదు. కుటుంబ సభ్యులు సహనం కోల్పోయారు. తల్లిదండ్రులు. సోదరులు కలసి లక్ష్మానాయక్ను చితకబాదారు. అంతటితో ఆగక కాళ్లు, చేతులు కట్టేసి ఇంటి బయటపడేశారు. అదే రోజు అర్ధరాత్రి రామునాయక్ మరోసారి లక్ష్మానాయక్పై దాడి చేసి బలంగా కొట్టడంతో అతను గిలగిలాకొట్టుకుంటూ మరణించాడు. రంగంలోకి పోలీసులు.. ఘటనపై లక్ష్మానాయక్ తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పరిశీలించారు. కదిరి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
తప్పులో కాలేసిన టీవీ చానల్
న్యూఢిల్లీ: టీవీ చానల్ ఇండియా టుడేలో కనిపించిన ఓ బ్రేకింగ్ న్యూస్ చూసి జనం ముక్కున వేలేసుకున్నారు. గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని బ్రేకింగ్ న్యూస్గా ఇచ్చే క్రమంలో ఇండియా టుడేలో పెద్ద తప్పిదమే దొర్లింది. పార్లమెంట్లో ఎంపీల వ్యవహారశైలి మూలంగా చర్చ జరగకుండా పోతుందని.. దీనిపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారని టీవీ చానల్ ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ కాస్తా.. టైపింగ్లో తప్పు దొర్లి, మధ్యలో ఆంగ్ల అక్షరం 'ఈ' చేరడంతో ఎలా మారిందో మీకు కనిపిస్తోంది! -
మోసపోయిన సినీ నటుడు, ఆరుగురి అరెస్టు
హైదరాబాద్: సీఐడీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హోంగార్డు ఎస్ఐ అవతారం ఎత్తాడు. ఓ ఛానెల్లో పనిచేస్తున్న డ్రైవర్ కానిస్టేబుల్ అవతారం ఎత్తాడు. ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు మహిళా రిపోర్టర్ అవతారం ఎత్తారు. అంతా కలిసి ఓ సినీ నటుడి ఇంట్లోకి ప్రవేశించి వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నావంటూ బెదిరించి డబ్బులు లాక్కున్నారు. అంతేకాకుండా ఇంకా డబ్బు కావాలంటూ కిడ్నాప్కు పాల్పడి పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే శ్రీకృష్ణానగర్లో నివసించే సినీ నటుడు కాలెపు శ్రీనివాసరావు(48) నివాసంలోకి గత నెల 31వ తేదీన ఉదయం 10.30 గంటలకు అయిదుగురు యువకులు, ఇద్దరు యువతులు ప్రవేశించారు. తమను తాము పోలీసులమని, న్యూస్ఛానెల్ ప్రతినిధులమంటూ లాఠీతో పాటు డమ్మీ పిస్టల్, ఛానెల్ లోగోతో లోనికి ప్రవేశించి శ్రీనివాసరావును వ్యభిచారగృహం నిర్వహిస్తున్నావంటూ కెమెరా ఆన్చేసి బెదిరించారు. ఇంటి బీరువాలో ఉన్న డబ్బు దొంగిలించారు. బలవంతంగా కారులో తీసుకుని వెళ్లి ఏటీఎం కార్డు ద్వారా మరింత డబ్బును డ్రా చేయించారు. రూ. 2 లక్షలు ఇస్తే టీవీ ఛానెల్లో రాకుండా చేస్తామంటూ నగరమంతా తిప్పారు. వారి బారినుంచి తప్పించుకొని బయటపడ్డ శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారించగా.. సీఐడీ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్న రాజు ఎస్ఐగా బిల్డప్ ఇచ్చాడు. ఓ టీవీ ఛానెల్ డ్రై వర్గా పని చేస్తున్న మధు కానిస్టేబుల్గా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు ఛానెల్ విలేకరినంటూ అదరగొట్టారు. ఛానెల్ యజమానే మీ జీతాలు మీరే సంపాదించుకోండి నాక్కూడా నెలకు ఒక్కొకరు రూ.25 వేలు తెచ్చివ్వండి అని చెప్పడంతో తామంతా రోడ్డు కెక్కామని నిందితులు తెలిపారు. ఛానెల్ ప్రతినిధులమంటూ చెప్పుకున్న జలీల్, జగదీష్, మధు, సంజయ్రెడ్డి, లక్ష్మి, దుర్గ, హోంగార్డు రాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఛానెల్ ఎండీని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
నచ్చిన ఛానల్ పెట్టలేదని బాలిక ఆత్మహత్య
వాంకిడి : టీవీ ఛానల్ విషయంలో అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ.. తండ్రి మందిలింపు... చివరికి ఓ బాలిక ఆత్మహత్యకు దారి తీసింది. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం కోమటిగూడ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వి.జ్యోతి (13) మంగళవారం రాత్రి తెలుగు చానల్ పెట్టాలని కోరింది. పండుగకు మహారాష్ట్ర నుంచి పుట్టింటికి వచ్చిన జ్యోతి సోదరి హిందీ చానల్ పెట్టాలని పట్టుబట్టింది. ఈ విషయంలో జ్యోతిపై ఆమె సోదరి చేయి చేసుకుంది. తండ్రి రామారావు జోక్యం చేసుకుని చిన్నకుమార్తె జ్యోతిని మందలించాడు. మనస్తాపం చెందిన ఆమె రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. -
జీహెచ్ఎంసీ న్యూస్ !
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో అమలు చేస్తున్న వివిధ పథకాలు, వాటి ఫలితాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేం దుకు టీవీ చానల్ను వేదికగా చేసుకోవాలని జీహెచ్ఎంసీ యోచిస్తోంది. ఈ మేరకు ప్రతి ఆదివారం రాత్రి ‘జీహెచ్ఎంసీ న్యూస్’ పేరిట ఒక బులెటిన్ను రన్ చేయాలని, ఇందుకు ఆయా న్యూస్ చానళ్ల నుంచి ఆర్ఎఫ్సీలను ఆహ్వానించాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో జరిగే కార్యక్రమాల సమాహారం‘రౌండప్’లా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా విశ్వనగరం దిశగా హైదరాబాద్ అనే థీమ్తో దీని ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి 8 గం టల నడుమ దీనిని నిర్వహిస్తే ఎక్కువమంది వీక్షించగలరని యోచిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యక్రమాలను వివిధ న్యూస్ చానళ్లు ప్రముఖంగానే ప్రసారం చేస్తున్నప్పటికీ, తాము చెప్పదలచుకున్నది మరింత స్పష్టంగా ప్రజ లకు చేరవేసేందుకు ఈ జీహెచ్ఎంసీ న్యూస్ బులెటిన్ ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ బులెటిన్ మధ్య విరామం లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు వినియోగించరాదని భావిస్తున్నారు. వాటి బదుల పర్యావరణం, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై ప్ర జలకు అవగాహన కలిగించే, పౌరస్పృహను పెంచే కార్యక్రమాలను ప్రసారం చేయాలని భావిస్తున్నారు. ‘జీహెచ్ఎంసీ న్యూస్’ ఆలోచన ఉన్నప్పటికీ అమలుకు ఎంత సమయం పడుతుందనేది మాత్రం చెప్పలేమని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్కుమార్ చెప్పారు. -
గోట్స్ థియరీ
హ్యూమర్ ప్లస్ నిజానికి మనుషులకి, గొర్రెలకీ పెద్దగా తేడా లేదు. ఈ విషయం అందరి కంటే టీవీ చానెల్స్ వారికి బాగా తెలుసు. ఒక రోజు మనుషులెవరూ దొరక్క ఒక గొర్రెని స్టూడియోకి తీసుకొచ్చి ఇంటర్వ్యూ మొదలుపెట్టారు. ‘‘గతంలో కూడా మేము చాలా గొర్రెలతో ఇంటర్వ్యూ చేశాం. అయితే అవి మనుషుల్లా మేకప్ చేసుకుని రావడం వల్ల మీరు గుర్తు పట్టలేకపోయారు. ఈసారి ఒరిజినల్ గొర్రెనే పిలిపించాం. ఇది మనుషులకంటే తెలివైన సమాధానాలే ఇస్తుందని నమ్ముతున్నాం’’ అని ప్రారంభించింది యాంకర్. ప్ర. ‘‘మేకలు మేమే అంటాయి. మీరెందుకు అలా అరవరు?’’ జ. ‘‘మే నెల అంటే మాకిష్టం లేదు. ఒకటే ఎండ’’ ప్ర. ‘‘మనుషులపై మీ అభిప్రాయం ఏమిటి?’’ జ. ‘‘గొర్రెలుగా మారాలంటే ఇంకాస్త ఎదగాలి’’ ప్ర. ‘‘ప్రజాస్వామ్యంపై మీ ఒపీనియన్?’’ జ. ‘‘అది హనుమంతుడి తోకలా ఉంటుందని నాయకులు చెబుతుంటారు కానీ అది వాస్తవానికి మా తోకంత ఉంటుంది. అధికారమనేది దుడ్డుకర్రలాంటిది. అది చేతిలో ఉంటే ఎవరో ఒకర్ని మోదాలనిపిస్తూ ఉంటుంది. ఇక మనుషులే ఏ ఒపీనియన్స్ లేకుండా జీవిస్తున్నప్పుడు గొర్రెల ఒపీనియన్స్ని గౌరవించడం మీ చానెళ్ల గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ‘‘గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందని ఎందుకంటారు?’’ ‘‘నమ్మినా నమ్మకపోయినా వాడెలాగూ చంపలేడు. అవిశ్వాసంతో మరణించడం కంటే, విశ్వాసంతో మరణించడం శ్రేయస్కరం. ఓటేసినా, వేయకపోయినా ఎవరో ఒకరు గెలవడం తప్పనిసరి అయినట్టు, చచ్చేవాడి నమ్మకాలతో ఒరిగేదేమీ లేదు.’’ ‘‘మీరు ఫిలాసఫరా?’’ ‘‘కాదు ఫిలాసఫరర్’’ ‘‘మీకేమైనా థియరీస్ ఉన్నాయా?’’ ‘‘తోక ఉన్నప్పటికీ విప్పలేను, చెప్పలేను, దీన్ని టెయిల్స్ థియరీ అంటారు’’ ‘‘టెయిల్ ఉన్నప్పుడు హెడ్ కూడా ఉండాలిగా. ఆ థియరీ చెప్పండి’’ ‘‘ఆఫీసుల్లో అనేకమంది హెడ్స్ ఉన్నట్టు. ఈ హెడ్స్లా రకరకాల థియరీలు ఉంటాయి. హెడ్ మూవ్మెంట్ అంటే ఎదుటివాడు చెప్పేది అక్షరం అర్థం కాకపోయినా అన్నింటికి తల ఊపే థియరీ ఇది. వీళ్లకు నాలుగు కాలాల పాటు హెడ్ పదిలంగా ఉంటుంది. హెడ్ వెయిట్ థియరీ అంటే ప్రపంచమంతా మన తలలో నుంచే నడుస్తుందని నమ్మే థియరీ. లోకం బరువు మోసి మోసి వీళ్ల తలకాయ చైనా చార్జర్లా పేలిపోతుందని అనుకుంటూ ఉంటారు. అందరి తలరాత రాస్తున్నామని అనుకుంటారు కానీ తలకి నూనె తప్ప ఇంకేమీ రాయలేరు. హెడ్లెస్ థియరీ అని ఇంకొకటుంది. బయటికెళ్లాక తల ఉంటుందో లేదో తెలియని నాలాంటి వాళ్లు చెప్పే థియరీ ఇది’’ ‘‘థియరీస్ బావున్నాయి. ప్రాక్టికల్స్కి కూడా ఉన్నాయి?’’ ‘‘థియరీస్ మేం చెబుతాం. నాలాంటి వాళ్లని బిరియాని వండుకుని ప్రాక్టికల్స్ మీరు చేసుకుంటారు’’ ‘‘మనుషులకి గొర్రెలకి తేడా లేదని మా అభిప్రాయం’’ ‘‘గొర్రెలకి మనుషులకి తేడా లేదని నా అభిప్రాయం’’ ‘‘రెండు ఒకటేగా?’’ ‘‘ఒకలా కనిపించేవన్నీ ఒకటి కావు. ఉప్పు కప్పురంబు పద్యం తెలుసుగా. మీరు ప్రతీది మనుషులతో పోలుస్తారు. మేం గొర్రెలతో పోలుస్తాం. మనుషులు మారాలి అని మీరంటే, గొర్రెలు మారాలి అని మేమంటాం’’ ‘‘ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం’’ ‘‘పైసా ఖర్చు లేకుండా వాట్సప్లో ఎవరికి వాళ్లు లక్షల సందేశాలు ఇచ్చుకుంటుంటే గొర్రెలిచ్చే సందేశం ఎవడికి కావాలి? అయినా అడిగారు కాబట్టి ఇస్తున్నా. మీరు మనుషులైనా, గొర్రెలైనా కత్తికి దొరక్కుండా జీవించండి’’ ‘‘పొయెటిక్గా చెప్పారు’’ ‘‘కత్తి కంటే కవిత్వం డేంజర్’’ ‘‘మీ విలువైన అభిప్రాయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి’’ ‘‘ఆ గుంజకి కట్టిన వాడు తాడు విప్పితే నా దారిన నేను పోతాను’’ - జి.ఆర్. మహర్షి -
ఓటమి కాదు.. ప్రత్యామ్నాయం!
భూ సేకరణ ఆర్డినెన్స్ను మళ్లీ జారీ చేయకూడదన్న ప్రభుత్వ నిర్ణయంపై అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: వివాదాస్పద భూ ఆర్డినెన్స్పై వెనకడుగు వేయడం ప్రధాని మోదీ పరాజయమన్న విపక్షాల వాదనను తిప్పికొట్టేందుకు సోమవారం కేంద్ర మంత్రులు నడుం బిగించారు. దీన్ని ప్రతిష్టకు సంబంధించిన అంశంగా ప్రభుత్వం ఎన్నడూ చూడలేదని స్పష్టం చేశారు. కీలకమైన భూసేకరణ అంశంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకే ఆ ఆర్డినెన్స్ను మరోసారి జారీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఓ టీవీ చానల్తో అన్నారు. తమ నిర్ణయంతో భూ సేకరణ చట్టాలు చేసుకునే విషయంలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ లభిస్తుందని, తమ అవసరాలకు అనుగుణంగా అవి సంబంధిత చట్టాలను రూపొందించుకోవచ్చని వివరించారు. ‘మాది వెనకడుగు కాదు. ఒకరకంగా చెప్పాలంటే అది ముందడుగు. ట్రాఫిక్ జామ్ తరహా ప్రతిష్టంభనలో చిక్కుకోకుండా ఉండటం కోసం, ప్రత్యామ్నాయ మార్గం తీసుకున్నాం. ఈ మార్గంలో రాజకీయ జోక్యం తక్కువ. దీని ద్వారా రాష్ట్రాలు తమ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా భూ సేకరణ చట్టాల్లో మార్పులు చేసుకునేందుకు మరింత వెసులుబాటు లభిస్తుంది’ అని వివరించారు. జీఎస్టీ బిల్లుపై కాంగ్రెస్తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కాగా, ఆర్డినెన్స్ను మరోసారి జారీ చేయొద్దని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. కాంగ్రెస్ ప్రగతి వ్యతిరేక వైఖరి బట్టబయలైందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. భూ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేలా పార్లమెంట్లో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ ఎన్నడూ సిద్ధంగా లేదని విమర్శించారు. భూ ఆర్డినెన్స్పై విపక్ష ఒత్తిడితో ప్రభుత్వం యూటర్న్ తీసుకుందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టివేశారు. 2013 చట్టంతో భూ సేకరణ సాధ్యం కాదని చెప్పినవారిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలూ ఉన్నారన్నారు. మోదీది రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదనడానికి.. ఇటీవలి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడమే రుజువని పేర్కొన్నారు. మరో మంత్రి మంత్రి చౌదరి బీరేందర్ సింగ్తో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పుడు రాష్ట్రాలు తమకు నచ్చినట్లుగా భూ సేకరణ చట్టాలు చేసుకోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు రైతుల ఆమోదం, సామాజిక ప్రభావ అంచనా నిబంధనలను తమ చట్టాల్లో చేరుస్తాయో లేదో చూడాలి’ అని బీరేందర్సింగ్ అన్నారు. కాగా, ‘ఒక ర్యాంకు-ఒక పెన్షన్’ విధానం కింద వార్షిక పెన్షన్పై సమీక్ష జరపాలన్న మాజీ సైనికుల డిమాండ్ సాధ్యం కాదని అరుణ్జైట్లీ పేర్కొన్నారు. -
డ్యాన్స్ చేసిన మిచెల్ ఒబామా
-
నవ్వుల మాస్టర్... ఇకపై క్విజ్ మాస్టర్!
తొలి సినిమా ‘అష్టా చెమ్మా’తోనే తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపారేశాడు అవసరాల శ్రీనివాస్. కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు అందరినీ. సరదాగా కాసేపు, పిల్ల జమిందార్, అంతకుముందు ఆ తర్వాత, చందమామలో అమృతం వంటి చిత్రాలతో తన నట ప్రతిభను కళ్లకు కట్టిన శ్రీనివాస్... మంచి రచయిత, దర్శకుడు కూడా. ఇప్పుడు సరికొత్తగా... టీవీ హోస్ట్ కూడా కాబోతున్నాడు. ఓ టీవీ చానెల్ రూపొందిస్తోన్న క్విజ్ ప్రోగ్రామ్ ద్వారా టెలివిజన్ రంగంలోనూ అడుగిడుతున్నాడు శ్రీనివాస్. నిజానికిది పెద్ద వెరైటీ షో ఏం కాదు. హైస్కూల్ స్థాయి విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించే ఓ క్విజ్ షో. అయితే శ్రీనివాస్ ఈ మామూలు క్విజ్ షోకి, తన స్టయిల్లో వినోదాన్ని మేళవించి ప్రత్యేకతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని వినికిడి. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ షో, త్వరలోనే మొదలవ బోతోందట. చూద్దాం... ఆ షోకి శ్రీనివాస్ ప్లస్ అవుతాడో, లేక అతడి కెరీర్కి ఈ షో ప్లస్ అవుతుందో! -
రైతుల కోసం ప్రారంభించనున్న టీవీ చానల్?
ప్రభుత్వ వ్యయ నియమాలు - వర్గీకరణ అవస్థాపనా సౌకర్యాలైన రవాణా, సమాచారం, నౌకాశ్రయాలు, ఇంజనీరింగ్ పరిశ్రమలు, విద్యుత్, రోడ్ల అభివృద్ధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత పెంపునకు ఈ రంగాల అభివృద్ధి తప్పనిసరి. ఆయా రంగాలపై పెట్టుబడులు మార్కెట్ పరిధిని విస్తృత పర్చడానికి, శ్రామిక ఉత్పాదకత పెంపునకు, ఉత్పత్తి వ్యయాల తగ్గుదలకు దోహదపడతాయి. కోశ విధాన సాధనమైన ప్రభుత్వ వ్యయం అనే అంశం ఆర్థికాభివృద్ధి లక్ష్యసాధనకు అవసరమైన ఓవర్హెడ్ క్యాపిటల్ అందిస్తుంది. ప్రభుత్వ వ్యయం రెండు రకాలు: * నీటిపారుదల, రోడ్లు లాంటి ప్రాజెక్టులపై ప్రత్యక్ష పెట్టుబడి * కొన్ని వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి గ్రాంట్లు, సబ్సిడీలను అందించడం. ఈ రెండు విధాలైన ప్రభుత్వ వ్యయం గ్రామీణ రంగంలో ఆర్థికవృద్ధిని పెంపొందించడానికి దోహదపడుతుంది. ప్రభుత్వ బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని మిసెస్ హిక్స్ ప్రభుత్వ వ్యయాన్ని కింది విధంగా వర్గీకరించారు. * రక్షణ వ్యయం: డిఫెన్స (రక్షణ) పరికరాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స సిబ్బంది వేతనాలు ఈ వ్యయంలో భాగం. విదేశీ దురాక్రమణల నుంచి దేశంలోని పౌరులకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం ఈ వ్యయం చేస్తుంది. సివిల్ వ్యయం: దేశంలో శాంతిభద్రతలు కాపాడటం, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్కు సంబంధించి ప్రభుత్వ వ్యయం. అభివృద్ధి వ్యయం: వ్యవసాయం, పారిశ్రామిక రంగం, వాణిజ్యం, రవాణా, సమాచార రంగాలపై వ్యయం. అన్ని రకాల ప్రభుత్వ వ్యయం ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనమా? ప్రభుత్వ వ్యయాన్ని సక్రమంగా వినియోగిస్తే ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన వృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వ వ్యయానికి కింది లక్షణాలు ఉండాలి. * ఉత్పాదకతను కలిగి అభివృద్ధి నిమిత్తం వినియోగించాలి. * ప్రభుత్వ వ్యయానికి సంబంధిత అథారిటీ అనుమతి తప్పనిసరి. * నిర్దేశిత ద్రవ్యాన్ని సక్రమంగా వినియోగించారో లేదో తెలుసుకోవడానికి ఆడిట్ తప్పనిసరిగా నిర్వహించాలి. * అందరికీ ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలకు ప్రభుత్వం వ్యయం చేయాలి. * ఆర్థిక వ్యవస్థలో సరళత్వాన్ని ప్రోత్సహించి ప్రభుత్వ వ్యయ విధానంలో మార్పులను సూచించే విధంగా ఉండాలి. ఆధునిక ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ వ్యయం పాత్ర ప్రధానమైంది. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి స్థిరత్వం సాధించడానికి ఇది ఉపకరిస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధనకు కింది విధంగా దోహదపడుతుంది. * వేగవంతమైన ఆర్థికాభివృద్ధి * వాణిజ్యం, వ్యాపారాన్ని ప్రోత్సహించడం * గ్రామీణాభివృద్ధి * ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి * వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి * రోడ్లు, రైల్వే, శక్తిలాంటి అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి * బొగ్గు, చమురు ఖనిజ వనరుల వెలికితీత, అభివృద్ధి. * పూర్తి స్థాయి ఉద్యోగిత ద్వారా ధరల స్థిరత్వం సాధించటం * ఆదాయ పంపిణీలో సమానత * ప్రజాశ్రేయస్సుకు ప్రాధాన్యమివ్వడం. ప్రభుత్వ వ్యయం పెరుగుదలకు కారణాలు * ప్రణాళికా యుగంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వ్యయం గణనీయంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యయం సుమారు పదిరెట్లైంది. 1990-91లో ఇది రూ. 98,272 కోట్లు కాగా, 2012-13లో రూ. 14,10,372 కోట్లకు చేరింది. 2014-15 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ వ్యయాన్ని రూ. 17,94,892 కోట్లుగా ప్రతిపాదించారు. * జనాభావృద్ధి అధికంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు తమ విధులను విస్తృత పర్చాలి. దాంతో విద్య, ఆరోగ్యం, సబ్సిడీలు, సాంఘిక భద్రత, అవస్థాపనా సౌకర్యాలపై ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. * స్వాతంత్య్రానంతరం రక్షణ రంగ వ్యయంలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. దీని కారణంగా విదేశాల నుంచి ఎదురయ్యే సమస్యలు తగ్గుముఖం పట్టాయి. దేశంలో సాంఘిక, ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి అనువైన వాతావరణం ఏర్పడింది. 1990-91లో రక్షణ వ్యయం రూ. 10,874 కోట్ల నుంచి 2012-13లో రూ. 1,81,776 కోట్లకు పెరిగింది. 2014-15 బడ్జెట్లో రక్షణ రంగ వ్యయాన్ని రూ. 2,29,000 కోట్లుగా ప్రతిపాదించారు. * స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ రాబడికంటే వ్యయం ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వానికి రుణభారం పెరిగింది. తద్వారా వడ్డీ చెల్లింపులు అధికమయ్యాయి. అనేక ప్రభుత్వ కార్యకలాపాలకయ్యే వ్యయంలో పెరుగుదల కారణంగా ప్రభుత్వం స్వదేశీ మార్కెట్ నుంచి, బహిర్గత ఆధారాల ద్వారా రుణాన్ని సమీకరించింది. ఈ క్రమంలో 1990-91లో కేంద్ర ప్రభుత్వ వడ్డీ చెల్లింపుల వ్యయం రూ.21,498 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తం క్రమంగా పెరుగుతూ 2012-13లో రూ.3,13,170 కోట్లకు చేరుకుంది. 2014-15 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం వడ్డీ చెల్లింపులపై వ్యయాన్ని రూ. 4,27,011 కోట్లుగా ప్రతిపాదించింది. * కేంద్ర ప్రభుత్వం ఆహారం, ఎరువులు, ఇంధనం, విద్యా రంగాలకు సంబంధించి అనేక విధాలైన సబ్సిడీలనందిస్తోంది. అధిక సబ్సిడీ వ్యయం కారణంగా ప్రభుత్వ వ్యయంలో గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. 1990-91లో సబ్సిడీలపై వ్యయం రూ. 9581 కోట్లు కాగా 2012-13లో రూ. 2,57,079 కోట్లకు చేరింది. 2014-15 బడ్జెట్లో సబ్సిడీలపై వ్యయాన్ని రూ. 2,60,658 కోట్లుగా ప్రతిపాదించారు. * పెరుగుతున్న జనాభా, ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో సాధారణ పరిపాలనపై కేంద్ర ప్రభుత్వ వ్యయం అధికమైంది. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్పై ఎక్కువగా వ్యయం చేయాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం వల్ల ప్రభుత్వం వేతన స్కేళ్లను సవరించడం, ప్రభుత్వ వస్తు, సేవల ఉత్పత్తికి ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావడం కారణంగా ప్రభుత్వ వ్యయంలో గణనీయమైన పెరుగుదల ఏర్పడుతోంది. * ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసే క్రమంలో ఆధునిక ప్రభుత్వాలు ప్రణాళికా రచన ప్రారంభించాయి. భారత్లో 1951 నుంచి ప్రణాళికా యుగం ప్రారంభమైంది. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పాత్ర కీలకమైనందు వల్ల వివిధ రంగాలపై ప్రభుత్వ వ్యయం పెరిగింది. * పట్టణీకరణ కారణంగా సివిల్ అడ్మినిస్ట్రేషన్పై వ్యయం పెరిగింది. కోర్టులు, పోలీస్, రవాణా, రైల్వేలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రజారోగ్యం, నీరు, విద్యుత్ సరఫరా, పబ్లిక్ పార్కులు, లైబ్రరీలపై ఖర్చు ఎక్కువైంది. * స్వాతంత్య్రానంతరం ప్రభుత్వానికి పన్ను, పన్నేతర రాబడి అధికమైన కారణంగా ప్రభుత్వ రాబడి పెరిగింది. దాంతో జాతీయాదాయం పెరిగింది. దీనికి అనుగుణంగా వ్యయాన్ని పెంచారు. 1950 -51లో ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద ఎన్ఎన్పీ 1999-2000ధరల వద్ద రూ. 2,04,924 కోట్ల నుంచి 2013-14లో 2004-05 ధరల వద్ద రూ. 49,20,183 కోట్లకు పెరిగింది. ఝ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన కార్యక్రమాలపై అధిక వ్యయం చేస్తున్నాయి. వీటితోపాటు ప్రజా సంక్షేమం దృష్ట్యా అనేక సాంఘిక భద్రతా చర్యలను చేపట్టాయి. భారత్లోనూ వీటిపై ఎక్కువ వ్యయం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యయ వర్గీకరణ మూలధన, రెవెన్యూ వ్యయం: మూలధన వ్యయం స్థిర ఆస్తుల కల్పనకు దారితీస్తుంది. ఈ వ్యయం పెట్టుబడుల రూపంలో ఉంటుంది. నికర ఉత్పాదక ఆస్తుల పెరుగుదలకు పెట్టుబడులు దోహదపడతాయి. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడానికి మూలధన వ్యయం ఉపయోగపడుతున్నందువల్ల ఈ వ్యయాన్ని అభివృద్ధి వ్యయంగా పరిగణించవచ్చు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు చేసేదే మూ లధన వ్యయం. రెవెన్యూ వ్యయాన్ని ప్రస్తుత లేదా వినియోగ వ్యయంగా భావించవచ్చు. ఈ వ్యయాన్ని సివిల్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స బలగా లు, ప్రజారోగ్యం, విద్య, ప్రభుత్వ యంత్రాంగం నిర్వహణకు వినియోగిస్తారు. స్వాతంత్య్రానంతరం రెవెన్యూ వ్యయంలో పెరుగుదల ఏర్పడింది. అభివృద్ధి లేదా అభివృద్ధేతర వ్యయం: అవస్థాపనా సౌకర్యాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఈ క్రమంలో వివిధ రంగాలపై జరిగిన వ్యయాన్ని అభివృద్ధి (ఉత్పాదక) వ్యయంగా వర్గీకరించవచ్చు. అభివృద్ధేతర (అనుత్పాదక) వ్యయం ద్వారా ప్రభుత్వానికి ఏవిధమైన ఆదాయం లభించదు. వడ్డీ చెల్లింపులు, శాంతి భద్రతలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లపై జరిగే వ్యయం ద్వారా ఏవిధమైన ఉత్పాదక ఆస్తుల కల్పన ఉండదు. బదిలీ, బదిలీ చేయడానికి వీలులేని వ్యయం: జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, నిరుద్యోగ భృతి, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం అమలుపర్చే సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాన్ని బదిలీ వ్యయంగా భావించవచ్చు. దీనివల్ల సమాజంలో ఆదాయ పునఃపంపిణీ జరుగుతుంది. మరోవైపు బదిలీ చేయడానికి వీలులేని వ్యయం వల్ల ఆదాయం లేదా ఉత్పత్తి సృష్టి జరుగుతుంది. ఈ వ్యయంలో అభివృద్ధి, అభివృద్ధేతర వ్యయం కలిసి ఉంటుంది. ఆర్థిక అవస్థాపనలు (శక్తి, రవాణా, నీటిపారుదల), సాంఘిక అవస్థాపనలు (విద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం), అంతర్గత శాంతి భద్రతలు, రక్షణ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్పై ఈ వ్యయం జరుగుతుంది. దీని వల్ల ఆర్థిక కార్యకలాపాల పెంపునకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయం: పంచవర్ష ప్రణాళికలకు సంబంధించిన వివిధ అంశాలపై జరిగే వ్యయం ప్రణాళికా వ్యయం. బడ్జెట్ ద్వారా వివిధ రంగాలపై కేంద్ర ప్రభుత్వం ఈ వ్యయాన్ని చేస్తుంది. ప్రణాళిక అమల్లో భాగంగా రాష్ర్ట ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే ఆర్థిక సహాయం దీనిలో భాగంగా ఉంటుంది. ప్రణాళికా వ్యయాన్ని రెవెన్యూ వ్యయం, మూలధన వ్య యంగా విభజించవచ్చు. బడ్జెట్లో ప్రభుత్వం సాధారణ కార్యకలాపాలను నిర్వహించడానికి పొందుపర్చేది. ప్రణాళికేతర వ్యయం. అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు, వేతనాలు, పెన్షన్లపై ఈ వ్యయం ఉంటుంది. దీనికి పంచవర్ష ప్రణాళికలో తావులేదు. ప్రణాళికేతర వ్యయాన్ని కూడా రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంగా విభజించవచ్చు. -
ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్కు హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ రాష్ట్రంలో తమ చానెల్ ప్రసారాలను మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ (ఎమ్మెస్వో) నిలుపుదల చేయడాన్ని సవాలు చేస్తూ ఆ చానెల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని, సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఎమ్మెస్వోలను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కాదని, చట్టబద్ద సంస్థ కాదని, కాబట్టి వారికి ఈ కేసులో తాము ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. రవిప్రకాశ్ కోర్టు హాజరు కోసం పిటీషన్... తెలంగాణ శాసనసభ్యులను కించపరుస్తూ కథనం ప్రసారం చేసినందుకు కోర్టు ఆదేశాల మేరకు ఎల్బీ నగర్ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతున్న టీవీ 9 చానెల్ సీఈవో రవిప్రకాశ్ను కోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశించాలని కోరుతూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 438 (1బి) కింద పీపీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తి జస్టిస్ బి.శివ శంకరరావు శుక్రవారం విచారించారు. పీపీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని రవిప్రకాశ్కు స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేశారు. -
టీవీ చానల్ మార్పు విషయంలో అక్కాచెల్లెళ్ల వాగ్వాదం చెల్లి ఆత్మహత్య
సంజీవరెడ్డినగర్,న్యూస్లైన్: టీవీ చానల్ మార్పు విషయంలో అక్కాచెల్లల మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన చెల్లి చివరకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన సంజీవరెడ్డినగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్ఐ సుదర్శన్రెడ్డి వివరాల ప్రకారం..బోరబండ రాజీవ్నగర్కు చెందిన వైద్యుడు ఉస్మాన్ కూతురు ఫాతిమా(13) స్థానిక పాఠశాలలో 8వతరగతి చదువుతుంది. ఫాతిమా టీవీ చూస్తుండగా అక్క వచ్చి మరోచాన ల్ మార్చింది. ఎందుకు చానల్ మార్చావంటూ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఫాతిమా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. మధ్యాహ్నం నమాజ్ చేసుకున్న అనంతరం 2గంటల సమయంలో గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గదిలోకి వెళ్లిన ఫాతిమా ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. కొనఊపిరితో ఆమెను చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించగా కాసేపటికే మృతిచెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా చానల్ మార్పు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. -
నాస్తికుల కోసం టీవీ చానల్!
నమో నాస్తికా! ప్రపంచ వ్యాప్తంగా ప్రతి టీవీ చానల్లోనూ భక్తి కార్యక్రమాలు ప్రసారం అవుతుంటాయి. కేవలం భక్తికి మాత్రమే పరిమితమై, ఇరవై నాలుగు గంటలూ భక్తి విశేషాలనే ప్రసారం చేస్తుండే చానళ్లూ ఉన్నాయి. అయితే మొట్టమొదటిసారి ఒక నాన్-భక్తి చానల్ రాబోతోంది. అంటే నాస్తికుల చానల్ అని! జూలైలో అమెరికాలో మొదలు కాబోతున్న ఈ చానల్కు ఇంకా పేరు నిర్ణయించలేదు. ఈ నెల మొదటి వారంలో ‘అమెరికన్ అఫీయిస్ట్స్’ (అమెరికా నాస్తికులు) సంస్థ అధ్యక్షుడు డేవిడ్ సిల్వర్మేన్ ఈ విషయాన్ని ప్రకటించినప్పుడు అమెరికాలోని యువ నాస్తికులు, విశాల దృక్పథం గల ఆలోచనాపరులు హర్షం వ్యక్తం చేశారట! ‘‘ఎందుకు మేమీ చానల్ను ప్రారంభిస్తున్నామో మీకు తెలుసా?’’ అని అడిగి, సమాధానం కోసం ఎదురు చూడకుండానే, ‘‘మనం ఎక్కడికైతే వెళ్లలేమో అక్కడికి వెళ్లే వ్యూహంలో భాగంగానే ఈ కొత్త చానల్ను తెస్తున్నాం’’ అని సిల్వర్మేన్ అన్నారు. దీని అర్థం ఏమిటో ఆయన సభకు హాజరైన నాస్తిక మిత్రులకే తెలియాలి. ‘రొకు’ అనే ఇంటర్నెట్ ప్లేయర్ను కేబుల్ బాక్సులా టీవీలకు అమర్చుకోవడం ద్వారా నాస్తిక చానల్ కార్యక్రమాలను చూడవచ్చని; రోజుకు 24 గంటలు, 365 రోజులూ నిర్విరామంగా జరిగే ఈప్రసారాలు తొలి విడతగా 70 లక్షల మంది అమెరికన్లకు ఉచితంగా అందుబాటులోకి వస్తాయని సిల్వర్మేన్ చెబుతున్నారు. వీడియోలు, ప్రసంగాలు, వ్యక్తిగత అనుభవాల రూపంలో కార్యక్రమాలను రూపొందించే పని ఇప్పటికే మొదలయిందని కూడా ఆయన తన సభకు హాజరైన నాస్తికులను ఉత్సాహపరిచారు. వారిలో ఒక ఔత్సాహికుడు ‘‘రేడియో చానల్ ను కూడా తెస్తే బాగుంటుంది కదా’’ అని సూచించినప్పుడు ‘‘బ్రిలియంట్ ఐడియా’’ అని సిల్వర్మేన్ అతడిని అభినందించారు. ‘‘మీ కోసం తప్పకుండా తెస్తాం’’ అని హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో ప్రముఖంగా 100 క్రైస్తవ టీవీ చానళ్లు, 4 యూదుల టీవీ స్టేషన్లు ఉన్నాయి. వాటికి దీటుగా ప్రజల్లో నాస్తికత్వాన్ని పెంపొందించడానికి సిల్వర్మేన్ కృషి చేస్తున్నారు. చూడాలి ఎంతమంది ఆయన ప్రయత్నాన్ని ఆదరిస్తారో. -
సాహసాలు చేయిస్తున్న సౌందర్యకాంక్ష
విపరీతం ‘అందం దేవుడిచ్చిన వరం’ అంటుంటారు. అసలు దేవుడు ఏది ఇచ్చినా, ఏదో ఒక రూపంలో అదొక వరంలానే మనిషి భావించాలి. అయితే సియోల్అమ్మాయిలు ‘అందం మాత్రమే అసలైన వరం’ అని భావిస్తున్నారు. తమకు నచ్చిన విధంగా తమ ముఖాలను మలుచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. మితి మీరిన సౌందర్యకాంక్షతో... ఒక విధంగా దుస్సాహసాలు చేస్తున్నారు! ప్రపంచంలో ఎక్కడా లేనంతగా దక్షిణ కొరియాలో ప్లాస్టిక్ సర్జరీపై మోజు పెరుగుతోంది! తక్కువ ధర, నాణ్యత, సులువుగా అయిపోవడం... అనే మూడు ప్రలోభాలతో మగువలు కోరుకున్న ముఖ వర్చస్సును ప్రసాదిస్తున్నాయి కొరియన్ సర్జరీ క్లినిక్కులు. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప్రస్తుతం వీధికో ప్లాస్టిక్ సర్జరీ కేంద్రం ఉందంటే నమ్మి తీరాల్సిందే. ఒక సర్వే ప్రకారం 2009 నాటికే సియోల్లో ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఏదో ఒకరకమైన ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తేలింది. అంతేకాదు, అక్కడ దాదాపు ప్రతి సెలబ్రిటీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నవారేనట. 2012 మిస్ కొరియా కూడా తాను కొద్దిపాటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు చెప్పుకోవడం విశేషం అని ఆ సర్వే పేర్కొంది. ఇక అక్కడి ప్రతి అమ్మాయీ లైట్ స్కిన్, సన్నటి నాజూకు ముక్కు, పెద్దపెద్ద కళ్లు, వి-షేప్లోని చిన్నటి గడ్డం కోసం ప్రయత్నిస్తోందనీ, వారి దేశానికి చెందిన అంతర్జాతీయ మోడల్ ‘కిమ్ తై హీ’ లా తమ ముఖాలను మలచుకోడానికి ఎక్కువ మంది అమ్మాయిలు ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది. అమెరికాలో పది వేల డాలర్ల ఖర్చయ్యే ప్లాస్టిక్ సర్జరీ ఇక్కడ 2-3 వేల డాలర్లకే అందుబాటులో ఉండడం కూడా ఇందుకో కారణం అని సర్వే పేర్కొంది. సర్జరీపై ఒక రియాలిటీ షో! ఇదిలా ఉంటే, సియోల్లోని స్థానిక టీవీ ఛానెల్ ‘స్టోరీ ఆన్’లో ప్లాస్టిక్ సర్జరీ లపై ప్రస్తుతం ఒక రియాలిటీ షో నడుస్తోంది. అసలది రియాలిటీ షోలకే పరాకాష్టగా నిలుస్తోంది. నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ రియాలిటీ షోలో ముఖానికి అక్కడికక్కడే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. ఇది పూర్తిగా ఉచితం కూడా. కాకపోతే ఆ షోలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వారి అందానికి సంబంధించిన అన్ని హక్కులు ఆ ప్రోగ్రాం నిర్వాహకులకు ఉంటాయి. అంటే ఇక అప్పట్నుంచి వారి ప్రకటనలకు వీళ్ల ముఖార విందాలను వాడుకుంటారు. ఈ విషయాన్ని సర్జరీకి ముందే చెబుతారు. సర్జరీ మొత్తం షో వేదికపైనే జరుగుతుంది. సర్జరీ ముగిశాక... పాల్గొన్నవారి మునుపటి విజువల్స్ని, సర్జరీ అనంతర విజువల్స్ను చూపిస్తారు. అయితే ఈ రియాలిటీ షో భారీ క్రేజును సంపాదించడమే కాకుండా, పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ఇటీవల ఈ షోలో ఒకేలా ఉన్న కవల పిల్లలకు ప్లాస్టిక్ సర్జరీ చేసి ఇద్దరిని వేర్వేరు రూపంలోకి తెచ్చారు. అది మోస్ట్ పాపులర్ ఎపిసోడ్ అట!! విపరిణామాలు దక్షిణ కొరియాలోని ఈ సర్జరీల ధోరణి అనారోగ్యకరమైన పోటీని పెంచుతోంది. తల్లిదండ్రులు ఇతర పిల్లల కంటే తమ పిల్లలు అందంగా ఉండాలని సర్జరీల మీద సర్జరీలు చేయిస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ సర్జరీ సెంటర్లు ప్రతి వీధిలోనూ పెద్దపెద్ద హోర్డింగులు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నాయి. ఈ పరిణామం చివరకు అప్పులకు, తద్వారా సామాన్యుల ఆర్థిక కష్టాలకు దారితీస్తోంది. దీంతో ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలలో ఈ హోర్డింగులు పెట్టడాన్ని ఇటీవల నిషేధించింది. కాగా 2013 లో మిస్ కొరియా పోటీలకు వచ్చిన వారిలో ఎక్కువమంది మొహాలు ఒకేవిధంగా ఉన్నట్టు అనిపించడంతో వారిలో చాలామంది ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారేమో అనే అనుమానాలు తలెత్తాయి. వైద్యం కోసం కనిపెట్టిన కొన్ని ప్లాస్టిక్ సర్జరీలను అందం కోసం ఇలా వాడేస్తున్నారన్న ఆరోపణలూ వచ్చాయి. అందులో ఒకటి డబుల్ జా సర్జరీ. ఈ సర్జరీల కారణంగా కొందరు శాశ్వతంగా నంబ్నెస్ (స్పర్శ మొద్దుబారడం)కు గురవుతున్నా, ‘చూడటానికి బాగుంటే చాలు’ అనే స్థాయికి వెళ్లిపోతున్నారు. ఏదైనా ఇది మంచి ధోరణి కాదనీ, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం భవిష్యత్తులో పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని కొరియన్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
టీవీక్షణం: వినోదం వికటిస్తోందా?
ఈ మధ్య ఏ చానెల్ పెట్టినా రెండు రకాల కార్యక్రమాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి హారర్ లేక క్రైమ్, రెండోది డ్యాన్స్. ముఖ్యంగా డ్యాన్స్ షోలు బాగా పెరిగిపోయాయి. బూగీవూగీ, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్, నాచ్బలియే, డ్యాన్సింగ్ సూపర్స్టార్, ఝలక్ దిఖ్లాజా అంటూ హిందీ చానెళ్లు... రంగం, ఆట తదితర షోలతో తెలుగు చానెళ్లు సందడి చేస్తున్నాయి. మస్తు మస్తు డ్యాన్సులతో ప్రేక్షకులకు మజాని అందిస్తున్నాయి. అరవై నాలుగు కళల్లో డ్యాన్స్ కూడా ఒకటి. అయితే సంప్రదాయ నృత్యాలు స్జేజి ప్రదర్శనలకే పరిమితమవుతున్నాయి తప్ప, టెలివిజన్ సెట్లలో స్థానం సంపాదించలేకపోతున్నాయి. పాశ్చాత్య నృత్యరీతులు మాత్రమే టీవీ చానెళ్లలో కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర్నుంచి, నడి వయస్కుల వరకూ వెస్టర్న్ డ్యాన్స్నే ఎంచుకుంటున్నారు. చానెళ్లవారు కూడా వాటినే ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటి ట్రెండుని బట్టి ఇందులో తప్పేమీ లేదు. కానీ ఒక్కోసారి ఈ షోల ధోరణి శృతి మించుతోందనడంలో సందేహం లేదు. డ్యాన్సులు విపరీత పోకడలు పోతున్నాయి. ఆట షో గురించి వచ్చిన వివాదం తెలిసిందే. చిన్న పిల్లలకు పొట్టిపొట్టి దుస్తులు వేసి, ద్వంద్వార్థ ధోరణిగల పాటలకు డ్యాన్స్ చేయించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిజానికిది ‘ఆట’లో మాత్రమే లేదు. దాదాపు అన్ని డ్యాన్స్ షోలలోనూ జరుగుతోంది. అలాగని పెద్దవాళ్ల డ్యాన్సులతో ఇబ్బంది లేదా అంటే కూడా ఊ అనలేం. వాళ్లు కూడా సినిమాలకు తీసిపోని విధంగా అసభ్య నృత్యరీతులను ప్రదర్శిస్తున్నారు. పైగా ఈ మధ్య సెలెబ్రిటీ జోడీల మధ్య పోటీలు పెడుతున్నారు. జీవిత భాగస్వామియే కాబట్టి ఫర్వాలేదనుకుంటున్నారో ఏమో గానీ... స్టేజిమీద రొమాన్స్ని హద్దు దాటిస్తున్నారు వారు. టీవీ అనేది పిల్లలకు కూడా అందుబాటులో ఉండే వినోద సాధనం. అందుకే ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సరికాదు. అయితే వినోదం ఉండకూడదని కాదు. డ్యాన్స్ షోలని నిషేధించాలనీ కాదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఆ మధ్య ఇండియన్ ఐడల్ ఆడిషన్స్కి వచ్చిన ఓ చిన్నపిల్ల ఐటెమ్ సాంగ్ పాడింది. దాంతో జడ్జిలు ఆ పాప తల్లిని పిలిచి, ఇలాంటివి ప్రోత్సహించి పాప భవిష్యత్తును పాడు చేయకండి, మంచి పాటలు నేర్పించండి అని చెప్పారు. డ్యాన్స్ షోలకు కూడా ఇది వర్తిస్తుంది. పిల్లల మనసులపై చెడు ప్రభావం పడ కుండా ఉండేందుకు కొన్ని పాటల్ని ఎంచుకోకుండా నియంత్రించాలి. పెద్దలకు కూడా కొన్ని రకాల విన్యాసాలు చేయకుండా హద్దులు పెట్టాలి. నియమాలు విధించాలి. లేదంటే చెడును తీసుకెళ్లి స్వయంగా మన పిల్లల చేతుల్లో పెట్టినట్టవుతుంది. ఈమాత్రం జాగ్రత్త కూడా తీసు కోకపోతే వినోదం వికటిస్తుంది. డ్యాన్స్ షో కాస్తా డేంజరస్ షో అవుతుంది! -
నన్ను ఎన్నుకోకపోతే మీ తలలు నరుక్కున్నట్లే: టీజీ
కర్నూలు: ‘నన్ను ఎన్నుకోకపోతే మీ తలలు నరుక్కున్నట్లే’ అని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆయన కర్నూలు నగరంలో రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో మంచివాళ్లను ఎన్నుకోవాలని.. తాను నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని.. అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఓట్ల కోసం వచ్చే వారు ఏ సేవ చేశారో తెలుసుకోవాలన్నారు. కళ్లు లేని వాళ్లకు తాను చేసిన అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. రాజకీయాలను మార్చే శక్తి మీడియాకు లేదన్నారు. ఆ శక్తి ఉంటే తాను ఏనాడో పేపర్, టీవీ చానల్ పెట్టేవాడినని మంత్రి చెప్పారు. -
చానల్ చూడనివ్వలేదని యువతి ఆత్మహత్య
కృష్ణగిరి (తమిళనాడు), న్యూస్లైన్: ఇష్టమైన చానల్ను చూడనివ్వలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆర్ఎస్ లక్షీ్ష్మపురం ప్రాంతానికి చెందిన వ్యాపారి మురుగేశన్, నాగలక్ష్మి(టీచర్) దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు నివేద (20) స్థానిక కళాశాలలో బీఏ రెండో సంవత్సరం, మరో కూతురు హరిత్ ఇంటర్మీడియెట్ చదువుతోంది. తల్లిదండ్రులు విధులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి ఆలస్యమయ్యేది. వారు వచ్చేంతవరకూ అక్కాచెల్లెళ్లు ఇంట్లో టీవీ చూసేవారు. ఇష్టమైన చానల్ కోసం వారు గొడవపడేవారు. ఎప్పట్లాగే మంగళవారం సాయంత్రం అక్కాచెల్లెళ్లు ఇంట్లో టీవీ చూస్తుండగా, ఇష్టమైన చానల్ కోసం పోట్లాడుకున్నారు. ఆవేశంతో నివేద తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రాత్రి ఇంటికి వచ్చిన నాగలక్ష్మి తన కుమార్తెను సముదాయించేందుకు ఎంతసేపు పిలిచినా ఆమె తలుపు తీయకపోవడంతో కిటికీ తీసి చూశారు. నివేద గదిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపిం చింది. తలుపులు బద్దలుగొట్టి లోపలకెళ్లి ఆమెను కిందకు దించారు. అప్పటికే నివేద ప్రాణాలు కోల్పోయింది. -
అల్ జజీరా చానల్ను బహిష్కరించిన ఈజిప్టు కోర్టు
ఈజిప్టులో అల్ జజీరా చానల్ను బహిష్కరిస్తూ అక్కడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ చానల్ ప్రసారాలను దేశంలో అనుమతించకూడదని ఆదేశించింది. దాంతో పాటు ముస్లిం బ్రదర్హుడ్కు చెందిన అహ్రార్ 25, జోర్డాన్కు చెందిన అల్-యర్ముక్, పాలస్తీనాకు చెదిన అల్- కుద్స్ చానళ్లనూ బహిష్కరించింది. ఈ మేరకు ఈజిప్టు అధికార వార్తా సంస్థ మెనాను ఉటంకిస్తూ సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఇస్లామిస్టు అల్-హఫజ్ చానల్ను కూడా ఇంతకుముందు ఇదే కోర్టు తన ఆదేశాలతో బహిష్కరించింది. ఆ చానల్ మతవిద్వేషాలను రేపుతోందన్న ఆరోపణల కారణంగానే బహిష్కారం విధించింది. మరికొన్ని ఇస్లామిస్టు నెట్వర్కులను తాత్కాలికంగా ఆపేశారు. ఇస్లామిస్టు అధ్యక్షుడు మహ్మద్ మోర్సీని పదవీచ్యుతుడిని చేశాక ఇదంతా జరిగింది. -
అసెంబ్లీ వ్యవహారాలపై త్వరలో టీవీ చానల్ ప్రారంభం
సాక్షి, ముంబై: అసెంబ్లీలో కొనసాగుతున్న వ్యవహారాలన్నింటినీ ప్రజలకు తెలియపరిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తొందర్లోనే ‘అమ్చీ విధానసభా’ అనే టీ వీ చానల్ను ప్రారంభించనుంది. ఇందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. అందిన వివరాల మేరకు ఈ విషయంపై తుది నివేదిక రూపొందించినట్టు తెలిసింది. అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు ఎలా పనులు చేస్తారనే విషయంతోపాటు అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల్లో వారు సమస్యలపై చర్చలు ఎలా జరుపుతున్నారనే విషయం తెలుసుకోవాలని ప్రజల్లో కుతూహలం ఉంటుంది. వీటితోపాటు అనేక సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ చానల్ను ప్రారంభిస్తున్నారని చెప్పవచ్చు. ఈ విషయంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్లతోపాటు శాసన సభ, శాసన మండలిల స్పీకర్లు, పదాధికారులు లోకసభ టీవీ చానల్ అధికారులతో భేటీ అయినట్టు సమాచారం.