Venkatapuram
-
మల్లన్న భక్తులకు తప్పని నడక కష్టాలు
మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. శ్రీశైలం (Srisailam) మల్లన్న దర్శనానికి భక్తులు కాలినడకన బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. వందలు కాదు.. వేలు కాదు.. లక్షలాది మంది భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని ఏటా దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఇప్పటికే శివ మాల ధరించిన భక్తులు తమ దీక్షా కాలాన్ని పూర్తి చేసుకుని నిష్టాగరిష్టులై స్వామి దర్శనానికి వేచి ఉన్నారు. ఈ నెల 19 నుంచి మార్చి 1 వరకు జరగనున్న శివరాత్రి (MahaShivratri) ఉత్సవాలకు ఏర్పాట్లు చేసిన దేవస్థానం, దేవదాయశాఖ అధికారులు పాదయాత్ర భక్తులను మాత్రం విస్మరించినట్లున్నారు. జంగిల్ క్లియరెన్స్, తాగు నీటి ఏర్పాట్లను మొదలే పెట్టకపోవడంతో పాదయాత్ర భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివయ్యా.. నీ చెంతకు చేరే దారేదయ్యా అంటూ లోలోనే మదన పడుతున్నారు.శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లాలనుకునే భక్తుల్లో చాలా మంది వెంకటాపురం మీదుగా ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. ఆత్మకూరు నుంచి వెంకటాపురం మీదుగా శ్రీశైలానికి 45 కిలోమీటర్ల దూరం అవుతుంది. 41 రోజులు కఠోర దీక్షలో ఉంటూ, శివనామస్మరణ చేస్తూ, నేలపై నిద్రించి అనునిత్యం శివ నామాన్ని జపించే శివమాలధారులు చివరిగా ఆ శివయ్యను చేరుకునేక్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 20 రోజులకు పైగా భక్తుల రద్దీ కొనసాగే ఈ ఈ 45 కిలోమీట్ల నడక దారిలో జంగిల్ క్లియరెన్స్ను ఇటు శ్రీశైలం దేవస్థానం గానీ.. అటు అటవీశాఖ అధికారులు గానీ పట్టించుకోవడం లేదు. బొబ్బలెక్కిన కాళ్లకు... గుళక రాళ్లు మరింత అడ్డంకి వెంకటాపురం గ్రామం నుంచి కాస్త దూరం వెళ్లగానే నాగలూటి క్షేత్రం చేరుకుంటారు. ఈక్రమంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. చిన్న దారి, గుబురుగా పెరిగిన చెట్ట కొమ్మలు, రాలిపడిన ఆకుల కింద ముళ్లు భక్తులకు ఇబ్బందిగా మారనున్నాయి. అక్కడ వీరభద్రస్వామిని దర్శించుకుని ఎగువగట్టుకు వెళ్లేక్రమంలో ప్రతి ఐదు లేదా పది నిమిషాలకోసారి మల్లన్నా.. నీ దర్శనం ఎప్పుడంటూ నడవలేక ఆగిపోయే పరిస్థితులున్నాయి. అతికష్టమైనా మెట్లు ఎక్కే భక్తులకు. చెత్తచెదారం కాళ్లకు గుచ్చుకుంటే మాత్రం భరించలేదు. ఎలాగో కష్టపడి గట్టు దిగిన భక్తులకు పెచ్చెరువుకు చేరుకోవడం సులభమే. కానీ సాదులమఠం, సీతమ్మబావి, భీమునికొలను చేరే క్రమంలోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భీముని కొలనులోయలో పడే ప్రమాదముందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అతి కష్టంపై ఒకరి చేయి మరొకరు పట్టుకుని మరో చేత్తో కొండ గట్టును పట్టుకుని ఒక్కొక్కరుగా ముందుకుసాగాల్సిన దుస్థితి ఉంది. భీముని కొలను దిగగానే కైలాస ద్వారానికి వెళ్లే మెట్ల మార్గం మరో ఛాలెంజ్. ఆ తర్వాత కైలాస ద్వారం నుంచి హఠటకేశ్వరం క్షేత్రం చేరే సమయంలోనూ దారి అస్తవ్యస్తంగా ఉంది. ఇలా 45 కిలోమీటర్ల ప్రయాణంలో భక్తుల పాదాలకు గుచ్చుకునే పదునైన కొండరాళ్లు తీవ్ర అంతరాయంగా మారుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి నడిచి రావడంతో అప్పటికే బొబ్బలెక్కిన కాళ్లకు వెదురుబొంగులు, పదునై ఎర్రరాళ్ల కొస వల్ల మరింత కష్టంగా మారుతున్నాయి. శ్రీశైలం దేవస్థానం, అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 32 ఏళ్లకు పైగా శివమాలధారణ ప్రారంభమైనప్పటి నుంచి నడకమార్గం ఎప్పుడూ శుభ్రం చేయకపోవడమే అందుకు నిదర్శనం. శ్రీశైలం దేవస్థానం అధికారులు తూతూ మంత్రంగా నిధులిస్తుండటంతో ఫారెస్టు అధికారులు కూడా అంతే రీతిలో పనులు చేసి చేతులు దులుపేసుకుంటున్నారు. కేవలం నాగలూటి క్షేత్రం వద్ద ఉన్న రెండు కోనేరులను శుభ్రం చేయడం, నాగలూటి వరకు అక్కడక్కడా వెదురుబొంగులు తొలగించడం మినహా.. రహదారి విశాలంగా చేయడం కానీ, నడక దారి భక్తుల కాళ్లకు గుచ్చుకోకుండా రాళ్లను తొలగించడం కానీ చేసిన దాఖలు లేదు. కాగా తాము నిధులిస్తున్నా.. అటవీ శాఖ దేనికి ఖర్చు చేస్తుందో చెప్పడం లేదని దేవస్థానం అధికారులు ఆరోపిస్తున్నారు. దారి పొడవునా జంగిల్ క్లియరెన్స్ చేయాలి శ్రీశైలం క్షేత్రానికి వెంకటాపురం నుంచి పాదయాత్ర కొనసాగించే భక్తులకు ఇబ్బంది లేకుండా కనీసం దారిలో గుచ్చుకునే రాళ్లనైనా తొలగించేందుకు అటవీశాఖ, శ్రీశైలం దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏటా భక్తుల కోసం నామమాత్రంగా కొన్ని పనులు చేసి చేతులు దులుపుకోవడం సరికాదు. తప్పనిసరిగా రహదారి వెంట ఇరువైపులా కంప చెట్లను, వెదురుబొంగులను, మొనదేలిన రాళ్లను తొలగించాలి. – విశ్వంభర మద్దుల రమణారెడ్డి, శివస్వామి, ఆత్మకూరు తాగు నీరు ఏర్పాటు చేయాలి యేటేటా శ్రీశైలం మహా క్షేత్రానికి లక్షలాదిగా తరలివెళ్లే శివస్వాములు, భక్తులకు తప్పనిసరిగా అధికారులు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇప్పటికే నాగలూటి చెంచుగూడెం, పెచ్చెరువు, నాగలూటి వీరభద్రస్వామి క్షేత్రం వద్ద బోర్లు చెడిపోయాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయడమేగాకుండా ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక చోట తాగునీరు ఏర్పాటు చేయాలి. సాదుల మఠం, సీతమ్మబావి, భీమునికొలను వరకు భక్తులకు నీటి సౌకర్యం కల్పించాలి. – సంజీవరెడ్డి, శివస్వామి, సిద్ధపల్లి గ్రామం -
కాంగ్రెస్ లో చేరిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు
-
వైఎస్సార్సీపీలోకి వెంకటాపురం
శాంతిపురం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కర్లగట్ట పంచాయతీలోని వెంకటాపురంలో దాదాపు 60 కుటుంబాలు మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. గ్రామంలో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వీరంతా పార్టీ మారారు. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దన్న ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చిన వీరికి ఎమ్మెల్సీ భరత్ కండువాలు వేసి ఆహ్వానం పలికారు. ప్రజలు, పేదల కోసం ప్రతిక్షణం తపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించాలని ఆయన కోరారు. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గ్రామంలో ఇప్పటివరకు మూడు కుటుంబాలు మాత్రమే వైఎస్సార్సీపీలో ఉండేవి. ఇప్పుడు ఒక్కసారిగా దాదాపు 60 కుటుంబాల వారు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామంలో పట్టున్న తమ్మన్నగారి వెంకటస్వామి, కోళ్లఫారం పెద్దన్నగారి జయవేలు, గొర్లెప్పగారి వెంకటస్వామి, గురుస్వామి వెంకటేష్, సుబ్బక్కగారి సుబ్రమణ్యం, గురుస్వామప్పగారి వెంకటేశు, మునివెంకట, రంగస్వామి, ఎ.వి.రమేష్, ఎన్.సుబ్బన్న సహా పలు కుటుంబాల పెద్దలు పార్టీలో చేరారు. సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో వివక్షకు తావులేకుండా తమకు లబ్ధిచేకూరడం, ఎమ్మెల్సీ భరత్ నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు తీర్చడంతో తాము పార్టీలో చేరుతున్నామని గ్రామస్తులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వసుంధర, జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బుల్లెట్ దండపాణి, రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు చంగప్ప, కృష్ణమూర్తి, స్థానిక సర్పంచ్ గోవింద్, ఎంపీటీసీ సభ్యుడు చలం, బెంగళూరు మురుగేష్ తదితరులు పాల్గొన్నారు. -
కారులో సజీవ దహనం కేసులో ఊహించని ట్విస్ట్
-
రాష్ట్రపతి రామప్ప పర్యటనకు సీఎం కేసీఆర్!
వెంకటాపురం (ఎం): ఈనెల 28న ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాల్గొంటున్నట్లు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాత్రమే హాజరవుతారని భావిస్తున్నప్పటికి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కూడా ఖరారయినట్లు సమాచారం. రామప్ప ఆలయానికి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఇప్పటివరకు రాలేదు. యునెస్కో గుర్తింపు పొందిన తర్వాత తొలిసారిగా కేసీఆర్ రానుండటంతో పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈ మేరకు రామప్పలో మూడు ప్రత్యేక హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. రామప్పలో గంటన్నరపాటు రాష్ట్రపతి... రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన గంటన్నరపాటు కొనసాగనుంది. భద్రాచలం పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 2:20 గంటలకు ఆమె రామప్పకు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. మధ్యాహ్నం 2:40 సమయంలో ఆలయంలోని రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. 3:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు. రాష్ట్రపతి విలేకరులతో మాట్లాడతారా లేదా అనేది అధికారికంగా ఖరారు కాలేదు. -
ఉన్నత చదువుకు డబ్బుల్లేవని ఉసురు తీసుకుంది!
సాక్షి, ములుగు: చదివేందుకు డబ్బుల్లేవనే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేశ్–కవిత దంపతుల కుమార్తె సాత్విక (18)కు ఇంటర్ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ చేసేందుకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో సీటు వచ్చింది. తల్లిదండ్రులకు డబ్బులు కట్టే స్థోమత లేకపోవడంతో స్థానికంగా కాలేజీల్లో చేర్పించాలని యోచిస్తున్నారు. మనస్తాపానికి గురైన ఆమె బుధవారం రాత్రి గడ్డి మందు తాగడంతో కుటుంబీకులు ములుగు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా.. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. తన కూతురు మృతిచెందినా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశించిన తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారు. మృతురాలి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు ఎస్సై తాజొద్దీన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమానుషం: చెరువులో చేపలు పట్టారని బట్టలిప్పి చెట్టుకు కట్టేసి కొట్టి -
‘అమ్మ’ పెట్టదు.. అడగనివ్వదు!
రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో వడ్డే కులానికి చెందిన దంపతులకు ఇద్దరు అబ్బాయిలు సంతానం. దశాబ్దాలుగా రెండు గదుల ఇంట్లోనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసిన ఆ దంపతులు... మరోమార్గం లేక ఇద్దరు కోడళ్లు, కుమారులతో కలిసి ఆ ఇంట్లోనే సర్దుకుని జీవనం సాగిస్తున్నారు. వీరు ఇల్లు కట్టుకునేందుకు అర్హులు. ప్రభుత్వం కూడా ఇలాంటి వారికి ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆ గ్రామానికే చెందిన ఓ వ్యక్తి ఇంటి పట్టా కోసం తన పొలాన్ని ప్రభుత్వానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరూ దరఖాస్తు చేసే సాహసం చేయని పరిస్థితి. ఇలాంటి వారు వెంకటాపురంలో చాలా మందే ఉన్నారు. పథకాలకు అర్హులైనప్పటికీ.. ఇక్కడ రాజకీయ నాయకులకు భయపడి ఒక్క పథకం పొందలేకపోతున్నారు. రామగిరి/అనంతపురం: వెంకటాపురం.. ఈ పేరు వినిపిస్తే చాలు ఓ రాజకీయ నేత గుర్తొస్తారు. ఏళ్లుగా అక్కడ ఆ కుటుంబానిదే ఆధిపత్యం. గ్రామంలో బతికి బట్టకట్టాలంటే వారి చెప్పుచేతల్లో ఉండాల్సిందే. లేదంటే ఊరు విడవక తప్పని పరిస్థితి. చివరకు ప్రభుత్వ పథకాలైనా వారు చెప్పిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి. కాదూ.. కూడదని దరఖాస్తు చేయాలనుకుంటే ఆ గ్రామంలో వారికి నిలువ నీడ ఉండదు. అందుకే 750 జనాభా ఉన్న వెంకటాపురం దశాబ్దాలుగా పూర్తి నిర్బంధంలో బతుకుతోంది. దరఖాస్తు చేసుకోవాలంటేనే భయం రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఎందరో అర్హులు వాటిని అందిపుచ్చుకుని తమ జీవితాలను మార్చుకుంటున్నారు. కానీ రామగిరి మండలం వెంకటాపురంలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రభుత్వం ఇద్దరు వలంటీర్లను ఆ గ్రామంలో నియమించినా.. ప్రభుత్వ పథకాలకు అర్హులైనప్పటికీ ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి. గ్రామంలో ఎవరైనా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పథకం తీసుకుంటే తమ ఆధిపత్యానికి గండి పడుతుందనే దురాలోచనతో ఆ గ్రామానికి చెందిన రాజకీయ నాయకులు పేదలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పోనీ వారైనా నిరుపేదలను ఆదుకుంటారా అంటే అదీ లేదు. ఎప్పుడూ ఏ మెట్రో సిటీలోనో లేదా జిల్లా కేంద్రంలోనో హాయిగా గడుపుతున్న ఆ ‘పెద్ద’ కుటుంబం నిరుపేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. గూడు లేని 46 మంది ఉన్నా.. వెంకటాపురం గ్రామంలో నిలువ నీడ లేని వారు 46 మంది ఉన్నట్లు ఆ గ్రామస్తులే చెబుతున్నారు. కానీ అధికారులు వెళ్లి అడిగితే ఒక్కరంటే ఒక్కరూ నోరు తెరవలేని పరిస్థితి. అందువల్లే చాలా మంది సొంత ఊరును వదులుకుని బంధువుల ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల గ్రామంలో పర్యటించిన తహసీల్దార్ 14 మంది గ్రామస్తులకు ఇళ్లు లేనట్లు గుర్తించారు. వారంతా దరఖాస్తు చేసుకుంటే ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో గ్రామానికే చెందిన రైతు శ్రీనివాసులు పేదలకు పట్టాలిచ్చేందుకు సర్వేనంబర్ 752లోని తన 2.50 ఎకరాల పొలాన్ని ప్రభుత్వానికి విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ అక్కడి రాజకీయ నేతలు మాత్రం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు తమ గ్రామస్తులకు అవసరం లేదని చెబుతున్నారు. ఫలితంగా గూడులేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులే చొరవ తీసుకుని.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంకటాపురం అభివృద్ధిపై దృష్టి సారించింది. స్థానిక శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి కూడా వెంకటాపురం వాసుల పరిస్థితి అర్థం చేసుకుని అధికారులనే గ్రామానికి పంపారు. దీంతో మండల అధికారులు పథకాలకు అర్హులను గుర్తించారు. అందువల్లే ప్రస్తుతం గ్రామంలోని 100 మందికి పెన్షన్లు.. 215 రేషన్ కార్డులు ఉన్నాయి. అదో ప్రత్యేక రాజ్యం వెంకటాపురంలో ప్రత్యేక రాజ్యం నడుస్తోంది. ఆ గ్రామంలోకి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. అధికారులు కూడా ఆ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసే సాహసం చేయలేకపోతున్నారు. ఒక్క కుటుంబం రాజకీయ ఉనికి కోసం ఎందరో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆ రాజకీయ కుటుంబీకులు తమ దుస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, లేకపోతే వారే సాయం చేసినా బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు. అర్హులను గుర్తించాం వెంకటాపురంలో ఇళ్లు లేని వారు 14 మంది ఉన్నట్లు గుర్తించాం. అయితే వారెవరూ ఇంటి కోసం గానీ, స్థలం కోసం గానీ దరఖాస్తు చేయలేదు. వారు ఇల్లు కావాలని కోరితే తప్పకుండా స్థలం ఇవ్వడంతో పాటు అర్హత మేరకు ఇళ్లు కూడా మంజూరు చేస్తాం. – నారాయణస్వామి, తహసీల్దార్ రామగిరి -
గద్దర్ను కలిసిన టీఆర్ఎస్ నేతలు
సాక్షి, హైదరాబాద్ : ప్రజా గాయకుడు గద్దర్ను టీఆర్ఎస్ నేతలు కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వెంకటాపురం డివిజన్కు ఇంఛార్జ్గా వ్యవహరిస్తున్న కొప్పుల ఈశ్వర్, మరికొంత మంది నేతలు గద్దర్ను కలిశారు. కేవలం మర్వాదపూర్వకంగానే కలిసినట్లు మంత్రి కొప్పుల తెలిపారు. టీఆర్ఎస్ కార్పొరేటర్గా వెంకటాపురం డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని గద్దర్కు పరిచయం చేశారు. ఆయన నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ అనంతరం కేటీఆర్తో పలు సందర్భాల్లో విభేదించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు ఆయన్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
వెంకటాపురంలో వైఎస్ఆర్ క్లినిక్ను ప్రారంభించిన మంత్రి అవంతి
-
గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్యం
-
'వైఎస్సార్ క్లినిక్'ను ప్రారంభించిన అవంతి
సాక్షి, విశాఖపట్నం: ప్రమాదకర కంపెనీల విషయంలో రాజీ పడేదే లేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. ప్రమాదరక పరిశ్రమలు నివాస ప్రాంతం నుంచి తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. మంగళవారం ఆయన వెంకటాపురంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభించారు. ఈ రోజు నుంచి వెంకటాపురం కేంద్రంగా వైఎస్సార్ క్లినిక్ ద్వారా 24 గంటల వైద్య సేవలు అందుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐదు గ్రామాల ప్రజలకు హెల్త్ కార్డులు మంజూరు చేశారు. (ఏపీ టూరిజంలో అవినీతిపై విచారణ) త్వరలోనే ఎల్జీ పాలిమర్స్పై చర్యలు మంత్రి మాట్లాడుతూ.. గ్యాస్ ప్రభావిత ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్యం అందుతుందని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. త్వరలో స్థలం గుర్తించి వైఎస్సార్ క్లినిక్ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సృజన, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, జేసీ అరుణ్ బాబు, జిల్లా వైద్యాధికారి తిరుపతిరావు, వైఎస్సార్సీపి సీనియర్ నాయకులు బెహరా భాస్కరరావు పాల్గొన్నారు. (దేశమంతా ఏపీ వైపు చూసేలా..) -
ఇసుక మాఫియాపై హైకోర్టు జోక్యం
సాక్షి, పెద్దపల్లి: మంథని నియోజకవర్గ పరిధిలోని ఇసుక క్వారీల మాఫియాపై హైకోర్టు జోక్యం చేసుకుంది. మంథని మండలంలోని వెంకటాపూర్ ఇసుక క్వారీ నిర్వహణపై గత నెల 16న పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్ జారీ చేసిన ప్రొసీడింగ్పై సోమవారం నోటీసులు జారీ చేసింది. కాగా వెంకటాపూర్ గ్రామంలోని మానేరు ఇసుక క్వారీపై న్యాయవాది గట్టు వెంకట నాగమణి కోర్టుకు లేఖ రాశారు. భూగర్భ జలాలు అడుగంటుతుండగా, రైతులతో బాండ్ పేపర్లపై సంతకాలు తీసుకున్న వ్యవహారాన్ని, నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక రవాణా జరపడాన్ని లేఖలో ఎండగట్టింది. (ఆ వారసులకు రూ.20 వేల కోట్లు) రూ.50 కోట్ల విలువైన ఇసుకను రూ.5 కోట్లకు అప్పగించడంపై వెంకటాపూర్ గ్రామానికి జరుగుతున్న కోట్లాది రూపాయల నష్టాన్ని ఆమె లేఖలో పేర్కొంది. ఈ లేఖను పిల్గా స్వీకరించిన న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో రాష్ట్ర స్థాయి నుంచి మొదలుకొని జిల్లా వరకు 9 మంది అధికారులను,శాఖలను ప్రతి వాదులుగా చేర్చింది. గత నాలుగు ఏండ్లుగా జరుగుతున్న ఇసుక రవాణాపై పూర్తి వివరాలు తెలపాని నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంథని నియోజకవర్గంలో కొనసాగుతున్న ఇతర 14 ఇసుక క్వారీల మైనింగ్ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని పిటిషనర్ కోరారు. (ఇసుక ఇబ్బందులకు.. రెండ్రోజుల్లో చెక్) -
కరోనా పోరు: విజేత ఆ ఊరు
కరోనా.. ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న మహమ్మారి. వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్కు అడ్డుకట్ట వేయలేక అగ్రరాజ్యాలే గడగడలాడుతున్న వేళ కోవిడ్–19 పాజిటివ్ కేసు నిర్థారణ అయిన వెనువెంటనే స్పందించి, పటిష్ట చర్యలతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేశారు అధికారులు. ఆ నలుగురు బాధితులు కూడా చికిత్స అనంతరం కోలుకుని తిరిగి రావడంతో, ఆ ఊరు ఊపిరి పీల్చుకుంది. పద్మనాభం(భీమిలి): పద్మనాభం మండలంలోని వెంకటాపురం గ్రామం కరోనాను జయించింది. గ్రామంలో నలుగురికి కరోనా సోకినప్పటికీ, అధికారులు, సిబ్బంది చేపట్టిన చర్యలతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగారు. గ్రామంలో ఇంకెవరికీ వైరస్ లక్షణాలు లేకపోవడంతో పాటు ఆ నలుగురు రోగులు కూడా ఆరోగ్యవంతులై రావడంతో, దాదాపు మూడు వారాల అనంతరం ఆ ఊరిలో ప్రశాంత వాతావరణం నెలకొంది. గత నెల 17వ తేదీన లండన్ నుంచి స్వగ్రామమైన వెంకటాపురం వచ్చిన యువకుడికి అదే నెల 20వ తేదీన కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానం రావడంతో 21న విశాఖపట్నం ఛాతీ ఆస్పత్రిలో చేరాడు. 22వ తేదీన కరోనా పాజిటివ్గా గుర్తించి, ఆ యువకుడి కుటుంబ సభ్యులైన తండ్రి, తల్లి, సోదరి, నాన్నమ్మలతో పాటు 33 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో యువకుడి నాన్నమ్మ మినహా మిగతా ముగ్గురికీ కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా వైరస్ సోకడంతో వెంకటాపురం గ్రామ ప్రజల్లో ఆందోళన నెలకొంది. 23రోజులు ఆ గ్రామస్తులు కంటిపై కునుకు లేక తల్లడిల్లారు. అయితే 29మందికి నెగెటివ్ రావడంతో వీరిని ఇళ్లకు పంపించారు. ఐదు రోజుల క్రితం చికిత్స పూర్తయి కోలుకున్న తర్వాత యువకుడిని, అతడి తండ్రిని డిశ్చార్జి చేశారు. సోమవారం యువకుడి తల్లి, సోదరి కోలుకోవడంతో వారిని ఇంటికి పంపించేశారు. వీరంతా వెంకటాపురం గ్రామంలో ఉంటున్నారు. ఇప్పటి వరకు ఊరుకు చుట్టుపక్కల గ్రామాలతో సంబంధం లేక ఉన్న వీరు ఇప్పుడు పక్క గ్రామాలకు ప్రవేశించేందుకు ఆటంకాలు తొలగడంతో గండం గట్టెక్కామని ఊపిరి పీల్చుకున్నారు. కట్టడి చేశారిలా.. కరోనా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాక వెంకటాపురం గ్రామస్తులు మూడు కిలోమీటర్ల పరిధిలోని రేవిడి, రౌతుపాలెం, పాండ్రంగి గ్రామాల్లోకి వెళ్లకుండా మూడు వైపులా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. రేవిడి జంక్షన్లో పగటి వేళల్లో ఒక ఎస్ఐ, ముగ్గురు పీసీలు, రాత్రి వేళల్లో ఇద్దరు ఏఆర్, ఇద్దరు సివిల్ కానిస్టేబుళ్లతో పోలీస్ పికెట్ ఇంకా కొనసాగుతోంది. వెంకటాపురం కళ్లాల్లో ఇద్దరు, పాండ్రంగి జంక్షన్లో ఒక కానిస్టేబుల్, ఇద్దరు టీచర్లతో పికెట్ నిర్వహించారు. ఏసీపీ రవిశంకరరెడ్డి ఆధ్యర్యంలో సీఐ విశ్వేశ్వరరావు పర్యవేక్షణలో ఈ పికెట్లు కొనసాగుతున్నాయి. కరోనా పాజిటివ్ కేసు నిర్థారణ అయిన 22వ తేదీ నుంచి వెంకటాపురం గ్రామంలో ప్రతి రోజు వెంకటాపురం, రేవిడి గ్రామాల కార్యదర్శులు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామంలో బ్లీచింగ్ జల్లడం, వెంకటాపురం గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో సోడియం హైపో క్లోరైట్ను పిచికారీ చేయడం చేస్తున్నారు. డ్రైనేజీల్లో పూడిక తీస్తున్నారు. కరోనా వైరస్ సోకిన బాధితుల ఇంటిని సోడియం హైపో క్లోరైట్తో మరింత శుద్ధి చేశారు. టెన్షన్ తగ్గింది మా గ్రామంలో కరోనా అదుపులోకి రావడంతో భయం పోయింది. ఎవరికి ఎలా ఉంటుందో అని భయపడుతుండేవాళ్లం. బయటి ఊరికి రాకపోకలు ఉండేవి కావు. ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం. వైరస్ ప్రభావం తొలగిపోవడంతో రేవిడి గ్రామంలోకి వెళ్లి నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నాం. – బి.వెంకట సూర్యకుమార్, వెంకటాపురం కల్లోలం నుంచి ప్రశాంతత వెంకటాపురం గ్రామం కరోనా కల్లోలం నుంచి గట్టెక్కింది. కరోనా బాధితులు ఆస్పత్రిలో ఉన్నంత కాలం మా గ్రామానికి చెందిన వారు ఇళ్లు విడిచి బయటికి వచ్చే వారు కాదు. ఎప్పడు ఏం జరుగుతోందని ఆందోళన మధ్య కాలం గడిపాం. మా ఊరిలో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొంది. – ఎ.బంగారుబాబు, వెంకటాపురం మంచి చికిత్స అందించారు కరోనా లక్షణాలున్నట్లు గుర్తించి ఆస్పత్రికి వెళ్లాం. మమ్మల్ని ఆస్పత్రిలో బాగా చూసుకున్నారు. ఇప్పుడు మా ఆరోగ్యం బాగుంది. రిపోర్ట్ నెగెటివ్ రావడంతో మమ్మల్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేసి ఇంటికి పంపించేశారు. గ్రామంలోనే ఉంటున్నాం. – కరోనా బాధితుడు, వెంకటాపురం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాం కరోనా సోకినప్పటి నుంచి వెంకటాపురంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాం. వీధుల్లో బ్లీచింగ్ చల్లిస్తున్నాం. సోడియం హైపో క్లోరైట్ను పిచిచారీ చేయిస్తున్నాం. లాక్ డౌన్ను ఈ గ్రామంలో మరింత పకడ్బందీగా అమలు చేశాం. – జి.వి.చిట్టిరాజు, ఎంపీడీవో -
ప్రసాదమిచ్చి ప్రాణాలు తీస్తాడు
ఏలూరు టౌన్: కోటీశ్వరుల్ని చేస్తానంటూ రూ.లక్షలు వసూలు చేసి.. ఆనక ప్రసాదం పేరుతో సైనైడ్ తినిపించి 10 మందిని హతమార్చిన సీరియల్ కిల్లర్ను ఏలూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవల్ వెల్లడించిన వివరాలివీ.. ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీ ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి అలియాస్ శివ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. అది లాభసాటిగా లేకపోవటంతో సులభంగా డబ్బు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రైస్ పుల్లింగ్ కాయిన్, రంగు రాళ్లను చూపించి వాటిని ఇంట్లో ఉంచు కుంటే రోజుల్లోనే కోటీశ్వరులు కావచ్చని నమ్మిస్తుండేవాడు. గుప్త నిధులు చూపిస్తానని, బం గారాన్ని రెట్టింపు చేస్తానని కూడా చెబుతుండేవాడు. వీటిపై మక్కువ గల వారిని లక్ష్యంగా చేసుకుని నగదు, నగలు కాజేస్తుండేవాడు. అసలు విషయం తెలిసి నిలదీసిన వారికి.. పూజ చేయించిన ప్రసాదం తింటే వెంటనే ఫలితం కనిపిస్తుందని చెప్పి.. సైనైడ్ తినిపించి హతమార్చేవాడు. ఇప్పటివరకు 20 నెలల్లో 10 మందిని హత్య చేసినట్లు తేలిందని ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవల్ చెప్పారు. నిందితుడి నుంచి కొంత సైనైడ్, 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.1,63,400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సింహాద్రికి సైనైడ్ విక్రయించిన విజయవాడ వాంబే కాలనీ వాసి షేక్ అమీనుల్లా (బాబు అలియాస్ శంకర్) ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. పీఈటీ హత్యతో వెలుగులోకి.. ఏలూరు కేపీడీటీ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న కాటి నాగరాజును కిల్లర్ సింహాద్రి గత నెల 16న సైనైడ్ కలిపిన ప్రసాదం తినిపించి చంపాడు. నాగరాజు భార్య ఫిర్యాదు మేరకు మృ తుడి ఫోన్ కాల్ లిస్ట్లో చివరి కాల్ సింహాద్రిది కావటంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. హతుల వివరాలివీ.. వల్లభనేని ఉమామహేశ్వరరావు (కృష్ణాజిల్లా) నూజివీడు), పులప తవిటయ్య (కృష్ణా జిల్లా మర్రిబంద), గంటికోట భాస్కరరావు (కృష్ణా జిల్లా ఆగిరిపల్లి), కడియాల బాలవెంకటేశ్వరరావు (కృష్ణా జిల్లా గన్నవరం), రామకృష్ణానంద స్వామీజీ (తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం), కొత్తపల్లి నాగమణి (రాజమహేంద్రవరం), సామంతకుర్తి నాగమణి (రాజమండ్రి బొమ్మూరు), చోడవరపు సూర్యనారాయణ (ఏలూరు వంగాయగూడెం), రాములమ్మ (ఏలూరు హనుమాన్ నగర్), కాటి నాగరాజు (ఏలూరు ఎన్టీఆర్ కాలనీ). -
జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్
-
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అరెస్ట్
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం వెళుతున్న ఆయనను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. జేసీతో పాటు యామిని బాల, బీటీ నాయుడును అరెస్ట్ చేసి, అరగంట అనంతరం వారందరిని వాళ్ల ఇళ్ల వద్ద వదిలిపెట్టారు. కాగా కొన్నిరోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఇంటి స్థలంపై వివాదం నెలకొంది. వైఎస్సార్ సీపీ కార్యకర్త వెంకట్రామిరెడ్డి తన స్థలం హద్దుల్లో బండలు పాతాడు. అయితే అతడి స్థలాన్ని ఆక్రమించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు. ఈ నేపథ్యంలో కబ్జాదారులకు మద్దతుగా జేసీ దివాకర్ రెడ్డి వెంకటాపురం గ్రామానికి వెళ్లే యత్నం చేశారు. అంతేకాకుండా ప్రైవేట్ స్థలంలో రహదారి ఉందంటూ టీడీపీ నేతలు అడ్డగోలు వాదనలకు దిగారు. అయితే వెంకట్రామిరెడ్డి సొంత స్థలంలోనే బండలు పాతుకున్నట్లు పోలీస్, రెవెన్యూ అధికారులు నిర్థారణ చేశారు. మరోవైపు టీడీపీ నేతల తీరుపై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మండిపడ్డారు. టీడీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రామప్ప.. మెరిసిందప్పా
ఆహా... ఎంతలో ఎంతమార్పు! ఏడొందల ఏళ్ల క్రితం నిర్మాణరంగంలో ప్రపంచానికి సరికొత్త పరిజ్ఞానాన్ని పరిచయం చేసిన రామప్ప దేవాలయం పరిసరాలు ఎలా ఉండేవి ఎలా మారాయి..! గుడిని గుర్తుపట్టకుండా ఉన్న పిచ్చిమొక్కలను, 300 మీటర్ల పరిధిలో ఉన్న అక్రమకట్టడాలను అధికారులు తొలగించారు. దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన ఆ ప్రాంతం కేవలం 20 రోజుల్లో ఆహ్లాదకరంగా మారిపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వకట్టడంగా గుర్తించేందుకు ఈ నెల 25న యునెస్కో ప్రతినిధులు అక్కడికి వస్తుండటమే దీనికి కారణం. మార్పు ఎంతుందో ఈ చిత్రాలే సాక్ష్యం. –సాక్షి, హైదరాబాద్. ఎంత గొప్ప ఆలయమైనా సరే, అడ్డదిడ్డంగా వెలిసే అక్రమ నిర్మాణాలు ఆ ప్రాంతాన్ని గజిబిజిలా మార్చేస్తాయి. రామప్ప దేవాలయం ప్రవేశద్వార ప్రాంతం 20 రోజుల క్రితం ఇలా ఉంది. ఇప్పుడక్కడ దేవాలయం, దాని చుట్టూ చెట్లు తప్ప మరేం లేదు. యునెస్కో నిబంధనల ప్రకారం.. కట్టడానికి 300 మీటర్ల పరిధిలో ఎలాంటి కొత్త నిర్మాణాలుండకూడదు. అందుకే అధికారులు ఇలా మార్చేశారు. రామప్ప ఆలయం తరహాలోనే మంచి నిర్మాణకౌశలం ఉన్న చిన్నగుడి ఇది. ఆలయం శిల్ప సౌందర్యం ఇప్పటివరకు కనిపించేది కాదు. ఇప్పుడు ఇలా స్పష్టంగా కనిపిస్తోంది. మూలవిరాట్టు దర్శనం కాకున్నా, శిల్పుల పనితనాన్ని దర్శించుకునే అవకాశం చిక్కింది. గుబురుగా పెరిగిన చెట్లు, లతలతో ఇదో పొదరిల్లులా మారింది కదూ. కానీ అక్కడ ఓ రాతి నిర్మాణం అస్పష్టంగా కనిపిస్తోంది. ఎండాకాలమైతే ఎండిన చెట్లతో నిండి ఉంటుంది. అది త్రికూటాలయం. రామప్ప దేవాలయానికి 100 మీటర్ల దూరంలో దీనిన్ని కట్టారు. నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. చాలా కాలం తర్వాత దానికి విముక్తి కలిగింది. -
వైఎస్ జగన్ను కలిసిన వెంకటాపురం డ్వాక్రా మహిళలు
-
ప్రజాసంకల్పయాత్ర@2000 కి.మీ.
-
చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర@2000 కి.మీ
-
వైఎస్ జగన్ పాదయాత్రలో చరిత్రాత్మక ఘట్టం
సాక్షి, ఏలూరు: ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ కునారిల్లుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజాసంకల్పయాత్ర @2000 కిమీ: వెల్లువలా జనం వెంటనడువగా... పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్ను ఆవిష్కరించిన జననేత.. మైలురాయికి గుర్తుగా ఒక కొబ్బరిమొక్కను నాటారు. వెంకటాపురం నుంచి ఏలూరుకు చేరుకోనున్న జగన్.. ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జననేత పాదయాత్ర 2000 కిలోమీటర్లు చేరుకున్నవేళ తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంఘీభావ యాత్రలు కొనసాగాయి. ప్రజాసంకల్పయాత్ర 2000కి.మీ పైలాన్ను ఆవిష్కరించిన వైఎస్ జగన్ పాదయాత్ర 2000కి.మీ మైలురాయికి గుర్తుగా కొబ్బరిమొక్కను నాటుతున్న వైఎస్ జగన్ జిల్లాల వారీగా ప్రజాసంకల్పయాత్ర విశేషాల్లో కొన్ని.. ►నవంబర్ 6, 2017 న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర.. సోమవారం(161వ రోజున) 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ►వైఎస్సార్ జిల్లా: ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడురోజులపాటు 94 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ►కర్నూలు జిల్లా: ఏడు నియోజకవర్గాల్లో 18 రోజులపాటు 263 కిలోమీటర్లు ►అనంతపురం జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 20 రోజులపాటు 279 కిలోమీటర్ల పాదయాత్ర ►చిత్తూరు జిల్లా: 10 నియోజకవర్గాల్లో 23 రోజుల పాత్రయాత్రో 291 కిలోమీటర్ల కాలినడక ►నెల్లూరు జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 20 రోజులపాటు 267 కిలోమీటర్ల పాదయాత్ర ►ప్రకాశం జిల్లా: తొమ్మిది నియోజకవర్గాల్లో 21 రోజులపాటు 278 కిలోమీటర్లు ►గుంటూరు జిల్లా: 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రోజులు 281 కిలోమీటర్ల యాత్ర ►కృష్ణా జిల్లా: 12 నియోజకవర్గాల్లో 24 రోజులపాటు 244 కిలోమీటర్లు ►పశ్చిమగోదావరి జిల్లా: మే 13న(ఆదివారం) మహేశ్వరపురం వద్ద వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. సోమవారం ఉదయం మహేశ్వరపురం నుంచి శ్రీపర్రు, గురకళ పేట మీదుగా లింగారావుగూడెం, మాదేపల్లిల్లో ప్రజలతో మమేకం అయ్యారు. వెంకటాపుంర వద్ద ప్రజాసంకల్పయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వెంకటాపురం దగ్గర నిర్మించిన 40 అడుగుల పైలాన్ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. అక్కడ నుంచి ఏలూరు చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
వణుకుతున్న వెంకటాపురం
సాక్షి, రాజమహేంద్రవరం/చింతూరు: తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ వై.రామవరం మండలం చాపరాయి గ్రామంలో 16 మంది మృత్యువాత పడిన సంఘటన మరువక ముందే చింతూరు ఏజెన్సీలోని వెంకటాపురం గ్రామం అంతుచిక్కని వ్యాధులతో వణుకుతోంది. పదిహేను రోజుల్లో గ్రామంలో ముగ్గురు మృత్యువాత పడగా మరో పది మంది వివిధ వ్యాధులతో బాధపడుతున్నారు. గ్రామస్తులు వరుసగా మృత్యువాత పడుతుండడంతో ఆదివాసీలు భయంతో గ్రామాన్ని వీడి ఇతర గ్రామాలకు వెళ్లిపోతున్నారు. 30 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్లోని గాదిరాస్ నుంచి వలస వచ్చిన 20 కుటుంబాలకు చెందిన 110 మంది చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీలోని వెంకటాపురం గ్రామంలో నివాసముంటున్నారు. వీరంతా గ్రామ సమీపంలోనే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రెండు వారాల్లో ముగ్గురు మృతి గ్రామానికి చెందిన మడకం వుంగయ్య(18) అనే యువకుడు 15 రోజుల క్రితం అంతుచిక్కని వ్యాధితో మృతిచెందగా వారం క్రితం కొవ్వాసి జోగయ్య(25) అనే యువకుడూ అకస్మాత్తుగా మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఆశా వర్కర్ మంగమ్మ భర్త మడివి గంగయ్య(60) బుధవారం మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం మడకం సుక్కమ్మ, మడివి దేవయ్య, పొడియం లింగయ్య ఒళ్లంతా మంట, జ్వరం, దగ్గు, నొప్పులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా వుంది. కాగా, వ్యాధులతో బాధపడుతున్న గ్రామస్తులు ఏడుగురాళ్లపల్లిలోని ఆసుపత్రికి వెళ్లకుండా నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. సదరు నాటువైద్యుడు కుండల్లో ఏవో ఆకులు పెట్టి మంత్రాలు చదువుతూ ఆకులతో ఆమె ఒంటిపై నిమురుతున్నాడు. కాగా, వ్యాధుల కారణంతో చాలామంది భయాందోళనలతో గ్రామాన్ని వీడుతున్నారు. వాగు నీరే తాగునీరు... గ్రామంలో 20 కుటుంబాలు నివాసముంటున్నా తాగునీటి కోసం ఇక్కడ ఒక్క బోరు కూడా లేదు. గ్రామానికి కిలోమీటర్ దూరంలోని వాగుకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధాన రహదారికి ఏడు కిలోమీటర్ల దూరాన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి చిన్నపాటి కాలిబాట మాత్రమే ఉంది. గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరిగినా విషయం ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. ప్రస్తుత మరణాలు కూడా కాటుకపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సవలం సత్తిబాబు ద్వారా బాహ్య ప్రపంచానికి తెలిసింది. రహదారి సౌకర్యం సరిగా లేకపోవడంతో వైద్య సిబ్బంది కూడా అడపాదడపా వస్తున్నారని.. తామే వారాంతపు సంత రోజుల్లో ఆసుపత్రికి వెళ్తుంటామని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో వ్యాధుల పరిస్థితిని తెలుసుకున్న ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి చెందిన వైద్య బృందం శుక్రవారం ఆ గ్రామానికి చేరుకుని వైద్య పరీక్షలు నిర్వహించింది. సకాలంలో వైద్యం అందకే మరణాలు వివిధ వ్యాధుల వల్లే గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయి. సకాలంలో వైద్యం తీసుకోకపోవడంతో వ్యాధులు ముదురుతున్నాయి. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తాం. – డాక్టర్ పుల్లయ్య, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో. -
వెంకటాపురంలో హైడ్రామా
పశ్చిమగోదావరి , ఏలూరు రూరల్: ఏలూరు మండలం వెంకటాపురం పం చాయతీలో మంగళవారం హైడ్రామా నడిచింది. మధ్యాహ్నం 2 గంటలకు పంచాయతీ కార్యాయలంలో పాలకవర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే సమావేశానికి హాజరుకా వాల్సిన మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడుకు మద్దతు ఇచ్చిన వార్డు సభ్యులను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వదంతులు హల్చల్ చేశాయి. ఈ విషయాన్ని కొందరు వార్డు సభ్యులు స్వయంగా మీడియాకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో గ్రామంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 గంట సమయంలో సర్పంచ్ చెరుకూరి దీప్తిఉష స మావేశానికి హాజరుకావడం లేదంటూ ఇన్చార్జి కార్యదర్శి రత్నం సమావేశాన్ని వాయిదా వేశామని వెల్లడించారు. దీంతో అప్పటికే వచ్చిన అప్పలనాయుడు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసి వెనుదిరిగారు. గంట ముందు వాయిదా నోటీసు అందిస్తారా అంటూ ప్రశ్నించారు. పరువు కోసం పాకులాట టీడీపీ నుంచి బహిష్కృతుడైన రెడ్డి అప్పలనాయుడుకు మద్దతుగా 9 మంది వార్డు సభ్యులు పార్టీకి రాజీనామా చేయడం ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జికి సవాల్గా మారింది. గ్రామంలో 3.27 ఎకరాల్లో ఏర్పాటుచేసే లే–అవుట్, కొత్తగా నిర్మించతలపెట్టిన మూడు అపార్ట్మెంట్లకు అనుమతి ఇస్తూ అజెం డాలో పేర్కొన్న అంశాలకు తీర్మానాలు ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యే వార్డు సభ్యులకు సూచించినట్టుగా తెలిసింది. అయితే వీటిని పాలకవర్గ సమావేశంలో అప్పలనాయుడు వర్గం తిరస్కరించేందుకు సిద్ధమయ్యింది. దీనిని గుర్తించిన ఎమ్మెల్యే వర్గీయులు తీర్మానం వీగిపోతే పరువు పోతుందనే ఆలోచనతో సభ్యులను కిడ్నాప్ చేస్తామంటూ బెదిరించారని పలువురు చెబుతున్నారు. చివరకు సర్పంచ్ను సమావేశానికి వెళ్లవద్దంటూ ఆదేశించి సమావేశాన్ని వాయిదా వేయించారని సభ్యులు అంటున్నారు. పాలకవర్గ సభ్యులు ప్రమేయం లేకుండా గ్రామంలో తీర్మానాలు, అభివృద్ధి పనులు తమ వర్గీయులకే ఎమ్మెల్యే బుజ్జి వర్గం కేటాయిస్తోందని అప్పలనాయుడు వర్గం ఆరోపిస్తోంది. మొత్తం 20 మంది వార్డు సభ్యుల్లో 9 మంది అప్పలనాయుడుకు మద్దతు ప్రకటించారు. 8 మంది ఎమ్మెల్యే వర్గం వైపు ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. -
నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది
‘‘సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దర్శకుడు ఓ సస్పెన్స్ ఫ్యాక్టర్ మెయిన్టైన్ చేశాడు. ఆ పాయింట్తో పాటు స్క్రీన్ప్లే నాకు నచ్చింది. ఈ రోజు ప్రేక్షకులు సైతం వీటి గురించి మాట్లాడు తుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు రాహుల్. వేణు మడికంటి దర్శకత్వంలో రాహుల్ హీరోగా తూము ఫణికుమార్, ‘శ్రేయాస్’ శ్రీనివాస్ నిర్మించిన ‘వెంకటాపురం’ శుక్రవారం విడుదలైంది. మౌత్ టాక్ వల్ల సింగిల్ స్క్రీన్స్లో ప్రతి షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయని, మల్టీప్లెక్స్లలో హౌస్ఫుల్స్ అవుతున్నాయన్నారు రాహుల్. ఇంకా ఆయన మాట్లాడుతూ – ‘‘ఇప్పటివరకు రొమాంటిక్ ఫిల్మ్స్, సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశా. ‘వెంకటాపురం’కు ముందు ఓ కొత్త జోనర్లో చేయాలని క్లియర్ కట్గా డిసైడయ్యా. ఆ టైమ్లో వేణు ఈ కథ చెప్పారు. అయితే సెకండాఫ్లో నా క్యారెక్టర్ గ్రాఫ్ ఛేంజ్ అయ్యి రివెంజ్ మోడ్లోకి వెళ్తుంది. స్టేషన్లో పోలీసులను కొడతా. జనాలు నన్ను ఆ సీన్స్లో యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే భయం ఉండేది. అక్కణ్ణుంచి సినిమా పీక్స్లోకి వెళ్లిందని చాలామంది చెప్పారు. ప్రేక్షకుల ప్రశంసలతో భవిష్యత్తులోనూ ఇలాంటి కొత్త కథలు చేయొచ్చనే కాన్ఫిడెన్స్ నాలో పెరిగింది. నేను పదిమందిని కొడితే ప్రేక్షకులు నమ్మాలని సిక్స్ ప్యాక్ చేశా. సినిమా చూసి లక్ష్మీ మంచు, మనోజ్, సాయిధరమ్ తేజ్, సుధీర్బాబు వంటి ప్రముఖులు ఫోన్ చేసి మెచ్చుకున్నారు. ఈ సినిమాతో నాకో కొత్త ఇమేజ్ రావడం హ్యాపీ’’ అన్నారు. -
రాహుల్ని ఆనంద్గానే గుర్తు పెట్టుకుంటారు!
రాహుల్, మహిమా మక్వాన్ జంటగా గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మించిన చిత్రం ‘వెంకటాపురం’. మాధికంటి వేణు దర్శకత్వం వహించారు. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఓ యువతి హత్య చుట్టూ కథంతా తిరుగుతుంటుంది. వైజాగ్ నేపథ్యంలో సాగే యూత్పుల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరూ ‘రాహుల్’ను ఆనంద్గానే గుర్తుపెట్టుకుంటారు. డైరెక్టర్ వేణు టేకింగ్ బాగుంది’’ అని అన్నారు. రాహుల్ మాట్లాడుతూ –‘‘కంటెంట్ను నమ్ముకుని సినిమా తీస్తే కచ్చితంగా విజయం సాధిస్తుంది. మా సినిమా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఇందులో మంచి పాత్ర చేశాను’’ అని అన్నారు. -
సస్పెన్స్.. థ్రిల్...
‘‘వెంకటాపురం’ పాటలు బాగున్నాయి. సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి వంద రోజులు ఆడాలి. తెలంగాణ కళాకారులు సినిమా ఇండస్ట్రీలో ముందుకు వచ్చి తెలంగాణ వాడీ వేడీ చూపించాలి. హైదరాబాద్లో, తెలంగాణలో ఉండే ఆంధ్రావాళ్లంతా తెలంగాణావాదులే. మనం రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, కలిసి మెలిసి ఉండాలి’’ అని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్, మహిమా మక్వాన్ జంటగా వేణు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘వెంకటాపురం’. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా బిగ్ సీడీని నాయిని, పాటల సీడీని దర్శకుడు మారుతి విడుదల చేశారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ– ‘‘రాహుల్ నాకు మంచి మిత్రుడు. ఈ చిత్రకథ నాకు తెలుసు. చాలా బాగుంటుంది. అచ్చు పాటలు, రీ–రికార్డింగ్ బాగుంటాయి. తనతో ఎప్పటికైనా ఓ సినిమా చేస్తా’’ అన్నారు. ఇందులో మంచి పాత్ర చేశానని రాహుల్ తెలిపారు. -
బాహుబలితో ఢీ..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాహుబలి ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతుండటంతో ఆ దరిదాపుల్లో ఓ మాదిరి సినిమా రిలీజ్ చేయడానికి కూడా సినీ ప్రముఖుల సాహసించటం లేదు. బాహుబలి రిలీజ్కు ముందు వారం ఒకటి రెండు సినిమాలను విడుదల చేస్తున్నా.. రిలీజ్ తరువాత మాత్రం పదిహేను రోజుల పాటు మరే సినిమా థియేటర్లలోకి రాదని భావించారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ చిన్న సినిమాలు బాహుబలితో ఢీ అంటున్నాయి. ఇప్పటికే బాహుబలి రిలీజ్ అయిన వారం తరువాత అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్లో తెరకెక్కిన బాబు బాగా బిజీ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఇప్పుడు మరో చిన్న సినిమా మరింత రిస్క్ చేసేందుకు రెడీ అవుతోంది. హ్యాపిడేస్ ఫేం రాహుల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెంకటాపురం సినిమాను బాహుబలి రిలీజ్ అయిన తరువాతి రోజు (ఏప్రిల్ 29)న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఎవరి మార్కెట్ వారిదే అనుకున్నారో లేక, బాహుబలి టికెట్ దొరకని వారైనా మన సినిమా చూస్తారని భావిస్తున్నారో గాని.., వెంకటాపురం చిత్రయూనిట్ నిర్ణయానికి ఇండస్ట్రీ ప్రముఖులు కూడా షాక్ అవుతున్నారు. చాలా కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ చిన్న సినిమా బాహుబలి సునామీని తట్టుకొని ఎంత వరకు నిలబడుతుందో చూడాలి. -
తరుముకొచ్చిన మృత్యువు
ఏలూరు అర్బన్ : మృత్యువు లారీ రూపంలో తరుముకొచ్చి బైక్ను ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్సై ఎంవీ సుభాష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు మండలం పోణంగి గ్రామానికి చెందిన బంకురు శ్రీనివాసరావు అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు గొట్టాపు వెంకటేశ్వరరావు (49)తో కలిసి బైకుపై వ్యక్తిగత పనులపై శుక్రవారం ఏలూరు ఎంపీడీవో కార్యాలయానికి బయలుదేరాడు. బైకు వెంకటాపురం పంచాయతీ రాజరాజేశ్వరి కాలనీ సమీపంలోకి వచ్చేసరికి వెనుకగా మితివీురిన వేగంతో దూసుకొచ్చిన లారీ» బైక్ను ఢీ కొట్టింది. దాంతో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు మిత్రులు రోడ్డుపై పడిపోయారు. బైకు నడుపుతున్న శ్రీనివాసరావు రోడ్డు మార్జిన్లో పడిపోగా వెనుక కూర్చున్న వెంకటేశ్వరరావు రోడ్డుపై పడ్డాడు. లారీ టైర్లు అతని తలమీద నుంచి వెళ్లడంతో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే చనిపోయాడు. శ్రీనివాసరావు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎస్సై సుభాష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
కమలాపురం: కమలాపురం రైల్వే గేటు సమీపంలోని తూర్పు వైపునకు ఉన్న 283/2–3 కిలోమీటరు రాయి మధ్య ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సాదక్ వలి తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వల్లూరు మండలం వెంకటాపురం వీవర్స్ కాలనీకి చెందిన దండే నరసింహులు (50) సోమవారం తెల్లవారుజామున ఈ అఘాయిత్యం చేసుకున్నాడు. ఆయన కుడి భాగంతోపాటు తల వెనుక భాగం బాగా దెబ్బతింది. ముఖం ఒక వైపు బాగుండటంతో దుగ్గాయపల్లె వాసులు నరసింహులుగా గుర్తించారు. ఆయన కొన్నేళ్లుగా సీకే దిన్నె మండలంలోని ఊటుకూరు సమీపంలోని వడ్డీలకాలనీలో సూరి హోటల్లో పని చేస్తూ జీవనం సాగించే వాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాల్సి ఉంది. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. నరసింహులుకు భార్య నాగలక్షుమ్మ, కుమార్తె ఉన్నారు. -
'వెంకటాపురం' మూవీ స్టిల్స్
-
అమెరికా అమ్మాయి.. వెంకటాపురం అబ్బాయి..
వెంకటాపురం(రంగంపేట): ప్రేమకు సరిహద్దులు అడ్డురావని రుజువు చేశారు వెంకటాపురం గ్రామానికి చెందిన నూతన దంపతులు. స్థానిక క్రైస్తవ మందిర సంఘ కాపరి గొల్లమందల నాగేశ్వరరావు, అన్నవజ్రంల కుమారుడు చిట్టిబాబు(అహోరాను)కు అమెరికాకు చెందిన ఆన్, మిషెల్ల కుమార్తె అలెక్సీస్ సెమెస్కోతో శనివారం వివాహమైంది. విశాఖపట్నంలో పాస్టర్గా పనిచేస్తూ, సువార్త సభల నిర్వహణలో విశిష్ట సేవలందించిన చిట్టిబాబుతో పరిచయమవడం ఇరుపెద్దల ఒప్పందం మేరకు వివాహం జరిగిందని నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి నూతన వధూవరులను పలువురు ఆశీర్వదించారు. -
ఎవరో ఎవరో ఎదురుగ కలలా..!
ఆగస్టు 28న విశాఖ, భీమిలి బీచ్లో చైత్ర అనే అమ్మాయి శవం పోలీసులకు కనిపిస్తుంది. చైత్రను ఎవరు చంపారు? ఆమె బాయ్ఫ్రెండ్ ఆనందేనా? హత్యకు ముందు ఏం జరిగింది? అనే కథతో రూపొందిన సినిమా ‘వెంకటాపురం’. ‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్, మహిమా మక్వాన్ జంటగా వేణు దర్శకత్వంలో ‘శ్రేయాస్’ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులోని ‘ఎవరో ఎవరో ఎదురుగ కలలా.. కలలా..’ అనే మొదటి పాటను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మంగళవారం విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. ప్రేక్షకుల ఊహకు అందని మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందీ సినిమా. రాహుల్ లుక్, న్యూ మేకోవర్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది’’ అన్నారు. అజయ్, జోగి బ్రదర్స్, శశాంక్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: సాయిప్రకాశ్, సంగీతం: అచ్చు. -
చిన్న చిత్రాలు మరిన్ని రావాలి
– అల్లు అరవింద్ ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న చిత్రాలు మరిన్ని రావాలి. అప్పుడే ఇండస్ట్రీలో పదిమందికి పని దొరుకుతుంది. చిన్న సినిమాలు మంచి కథతో తీస్తున్నారు. శ్రేయాస్ శీను, ఫణిలకు సినిమా అంటే ప్యాషన్. చిన్న చిత్రాలు తీసి, సక్సెస్ సాధిస్తున్నారు’’ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ‘హ్యాపీడేస్’ ఫేం రాహుల్, బాలీవుడ్ టీవీ నటి మహిమా మక్వాన్ జంటగా వేణును దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రేయాస్ శీను, ఫణి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘వెంకటాపురం’. ఈ చిత్రం ట్రైలర్ను అల్లు అరవింద్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథను దర్శకుడు తనదైన స్కీన్ర్ప్లేతో ఎంటర్టైనింగ్గా చూపించబోతున్నారు. మా చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ చూసి సినిమా ఇండస్ట్రీ పెద్దలు అభినందిస్తుండటం సంతోషంగా ఉంది. రాహుల్ విభిన్నంగా కనిపించబోతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. రాహుల్, నిర్మాత ‘జెమిని’ కిరణ్, నటుడు–దర్శకుడు అవసరాల శ్రీనివాస్, దర్శకుడు ‘డార్లింగ్’ స్వామి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి ప్రకాష్, సంగీతం: అచ్చు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: తాళ్లూరి ఆనంద్, లైన్ ప్రొడ్యూసర్: కె.అరుణ్ మోహన్. -
క్రిమినల్ కాదు!
‘హ్యాపీడేస్’, ‘లవ్ యు బంగారమ్’ చిత్రాలతో ఆకట్టుకున్న రాహుల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘వెంకటాపురం’. వేణుని దర్శకునిగా పరిచయం చేస్తూ, గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారధ్యంలో శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. మా చిత్రం ఫస్ట్లుక్కు మంచి క్రేజ్ వచ్చింది. చిత్ర పరిశ్రమలోని పలువురు పెద్దలు అభినందించారు. ఈ చిత్రంలో రాహుల్ విభిన్నంగా కనిపిస్తారు. త్వరలో పాటలు, ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. మహిమా మఖ్వానా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కెమేరా: సాయి ప్రకాష్, సంగీతం: అచ్చు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తాళ్లూరి ఆనంద్, లైన్ ప్రొడ్యూసర్: కె.అరుణ్ మోహన్, నిర్మాత: ఎంవివి సత్యనారాయణ. -
చెరువులో పడి తల్లీపిల్లలు మృతి
వెంకటాపురం (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు గ్రామ శివారులోని చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లిన తల్లి, ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతిచెందారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. సూరవీడు గ్రామానికి చెందిన కోమలి(35), తన ఇద్దరు పిల్లలు లహరి(15), శృతి(6)లను తీసుకుని బట్టలు ఉతికేందుకు సమీపంలోని చెరువుకు వెళ్లింది. ప్రమాదవశాత్తూ కాలు జారి తల్లి చెరువులో పడడంతో ఏడుస్తూ పిల్లలు కూడా ఆమెను అనుసరించి చెరువులో పడి నీటిలో మునిగిపోయారు. తల్లీబిడ్డల మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. -
వెంకటాపురం హెచ్ఎం మృతి
అనంతపురం ఎడ్యుకేషన్ : బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.షమీర్కుమార్ (50) శనివారం మతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మతి చెందారు. 1989 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ వత్తిలో అడుగుపెట్టిన షమీర్కుమార్ 2010లో ప్రధానోపాధ్యాయుడిగా పదోన్నతి పొందారు. అప్పటినుంచి ఇదే పాఠశాలలో పని చేస్తున్నారు. మతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. హెచ్ఎం భౌతికకాయాన్ని డీఈఓ అంజయ్య, హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చలపతి, ఎంవీ రమణారెడ్డి, బాలమురళీ సందర్శించి నివాళులు అర్పించారు. -
ఓంకారేశ్వర ఆలయంలో చోరీ
వెంకటాపురం (మోపిదేవి): మండలంలోని వెంకటాపురంలోని శ్రీ అన్నపూర్ణ సమేత ఓంకారేశ్వరస్వామివారి దేవస్థానంలో దొం గలు పడ్డారు. శ్రీ అన్నపూర్ణమ్మ వారి రెండు మంగళసూత్రాలు, కల్యాణం బొట్టు, ముక్కుపుడక దొంగతనమయ్యాయి. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆలయ ఈవో మోపిదేవి మురళీకృష్ణ ఫిర్యాదు మేరకు చల్లపల్లి పోలీసులు ఆలయాన్ని పరిశీలించారు. వీటి విలువ రూ. 30 వేలుగా చెబుతున్నారు. మచిలీపట్నం క్లూస్ టీం పరిశీలించి ఆధారాలు సేకరించింది. దొంగలు అమ్మవారి బంగారు నగలు దొంగిలించడంతో పాటు గర్భాలయంలోని హుండీని పగలగొట్టారు. అందులో పెద్దమొత్తంలో సొమ్ములేమీ లేవని చెబుతున్నారు. పోయిన నగలు చేయిస్తా: జడ్పీటీసీ శ్రీ అన్నపూర్ణమ్మ అమ్మవారికి పోయిన బంగారు నగలను తాను సమర్పిస్తానని జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లిఖార్జునరావు హామీ ఇచ్చినట్లు ఆలయ ఈవో మురళీకృష్ణ తెలిపారు. సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. -
మంత్రాల నెపంతో వృద్ధ దంపతులపై దాడి
నెక్కొండ : నెక్కొండ మండలంలోని వెంకటాపురం గ్రామ శివారు బీక్యా తండాకు చెందిన వృద్ధ దంపతులు గుగులోత్ రాజమ్మ, చక్రు మంత్రాలు చేస్తున్నారనే నెపంతో వారిపై తండాకే చెందిన కొందరు ఆదివారం రాత్రిదాడి చేశారు. రాజమ్మ, చక్రు మం త్రాలు చేస్తున్నారంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. దీంతో వారు తమపై తప్పుడు ప్రచా రం జరుగుతోందంటూ ఆదివారం ఉదయం నె క్కొండ పోలీసుస్టేçÙన్లో ఫిర్యాదు చేశారు. ఈ విష యం తెలియడంతో తమపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ తండాకు చెందినబానోత్ మాంజీ, బాలా జీ, రాజు, రవి, అంజీతో పలువురు దాడి చేశారని దంపతులు తెలిపారు. ఈ మేరకు వారిని చికిత్స నిమిత్తం స్థానికులు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
‘బకెట్’ భయం
వారోత్సవాల వేళ సరిహద్దుల్లో మావోల అలజడి అడవి దారుల్లో పేలుతున్న బాంబులు పోలీసులే లక్ష్యంగా మందుపాతర్లు తొలిసారిగా బకెట్ బాంబుల వినియోగం ప్రతిదాడులకు సిద్ధమవుతున్న ఇరువర్గాలు భద్రాచలం : అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో అలజడి సృష్టించేందుకు మావోయిస్టులు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. వెంకటాపురం మండలంలోని ఆలుబాక సమీపంలో ప్రధాన రహదారిపై శనివారం రాత్రి అమర్చిన రెండు బకెట్ బాంబులను పోలీసులు ఆదివారం గుర్తించి నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు 30 మందికి పైగా సాయుధ మావోయిస్టులు, 60 మందికి పైగా సానుభూతి పరులైన గొత్తికోయలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రధాన రహదారిపైకి వచ్చిన మావోయిస్టులు బకెట్ బాంబులను అమర్చి, వాటిని పేల్చేందుకు సమీప పొలాల్లో వైర్లను ఏర్పాటు చేశారు. అదే సమయంలో చర్ల వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సును సైతం నిలిపి..ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించి పంపారు. అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ ఘటనాస్థలిలో పోస్టర్లను విడిచి వెళ్లారు. చర్ల మండలం పెదమిడిసిలేరు దారిలో ఆంజనేయపురం గ్రామ సమీపంలోనూ ఇలాగే పోస్టర్లు వదిలివెళ్లారు. ఈ రెండు ఘటనలు ఒకే రోజు జరగటం పోలీసు వర్గాలను ఆలోచనలో పడేసింది. సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్.. ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే అమర వీరుల సంస్మరణ వారోత్సవాలకు మావోయిస్టులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారని నిఘా వర్గాలు సైతం ఇటీవల ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవటంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్– ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజానీకం తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వారోత్సవాల వేళ అటవీ ప్రాంతాల నుంచి మావోయిస్టులు గ్రామాలకు దూసుకొస్తుండగా..వారిని తిప్పికొట్టేందుకు పోలీసులు ప్రతి దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజానీకం ఆందోళన చెందుతోంది. అడవిలో బాంబులు సరిహద్దుల్లో మావోయిస్టులు పట్టు పెంచుకునేందుకు అటవీ ప్రాంతాలకు వెళ్లే రహదారుల్లో పెద్ద సంఖ్యలో బాంబులు అమర్చినట్లు ఇటీవల జరిగిన ఘటనలను బట్టి తెలుస్తోంది. తెలంగాణ– ఛత్తీస్గఢ్– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో నిత్యం ఏదో ఒక చోట బాంబులు బయటపడుతూనే ఉన్నాయి. ఏపీలో విలీనమైన చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లికి సమీపంలో ఉన్న పేగ రహదారిలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబులు పేలాయి. ఇదే ప్రాంతంలో మూడు సార్లు బాంబులు పేలడం గమనార్హం. గత నెలలో చర్ల మండల కేంద్రానికి సమీపంలోని ఆనందకాలనీ వద్ద, చర్ల– వెంకటాపురం ఆర్అండ్బీ రహదారిలోని ఎధిరకు సమీపంలో ప్రెషర్ బాంబులు పేలాయి. ఎధిర వద్ద జరిగిన ఘటనలో ఇద్దరు గిరిజనులకు గాయాలు కాగా ఇప్పటి వరకు బాంబులు పేలిన ఘటనలో ఎటవంటి ప్రాణ , ఆస్తి నష్టం జరగలేదు. పంథా మార్చిన మావోలు మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ఇప్పటి వరకు చెట్లు నరకడం, రహదారులపై కందకాలు తవ్వడం, పోస్టర్లు, కరపత్రాలు వేయడం వంటివి చేసేవారు. కానీ ఇటీవల పంథా మార్చటం వెనుక భారీ లక్ష్యాలే ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఈ రీతిన పెద్ద ఎత్తున మందుపాతరలను అమర్చటం, అవసరమైన సమయాల్లో వాటిని పేల్చటం ద్వారా విధ్వంసాలు సృష్టిస్తుండటం పోలీసులకు సవాల్గా మారింది. పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు పేలి ఎందరో పోలీసులు మృతిచెందారు. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్కే పరిమితమైన ఈ తరహా పంథా తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు పాకడం ఆందోళన కలిగిస్తోంది. భారీ విధ్వంసానికే బకెటా..! మావోయిస్టులు బకెట్ బాంబులు పెట్టడం వెనుక భారీ విధ్వంసానికే వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. కూంబింగ్కు వచ్చే పోలీసులను టార్గెట్ చేసుకొని మావోయిస్టులు బకెట్ బాంబులు పెడుతున్నట్టు సమాచారం. వెంకటాపురం మండలం ఆలుబాక సమీపంలోని ప్రధాన రహదారిపై బకెట్ బాంబులు బయటపడటం ఇదే తొలిసారి. వీటిని నిర్వీర్యం చేసుందుకు పోలీసు బలగాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలోకి ఎవరినీ రానివ్వకుండా.. చివరకు మీడియాకూ తెలియకుండా బాంబులను నిర్వీర్యం చేశారు. ఇవి శక్తివంతమైన బాంబులు కావడంతో పోలీసులు అతి జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది. -
పేలిన నాటుబాంబు: ఒకరికి గాయాలు
ఖమ్మం: తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని వెంకటాపురం గ్రామంలో బుధవారం నాటుబాంబు పేలింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే వెంకటాపురం మండలం విజయపురి కాలనీ సమీపంలో రహదారి పక్కన బాంబుపేలింది. ఈ పేలుడులో ఓ బాటసారి గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రుడిని 108 వాహనంలో మధిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నాటు బాంబు పేలిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇది నాటుబాంబా లేక కూంబింగ్కు వెళ్లే పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన బాంబా అనే విషయం తేలాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అగ్నిప్రమాదంలో 60 ఇళ్లు దగ్ధం: రూ.కోటి నష్టం
కుక్కనూరు (ఖమ్మం జిల్లా) : కుక్కనూరు మండలం వెంకటాపురం ఎస్సీకాలనీలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొలాల్లో చెత్తకు పెట్టిన నిప్పు ప్రమాదవశాత్తూ ఇళ్లపై పడి ఒకదాని వెంట మరో ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 60 ఇళ్లు పూర్తిగా కాలిపోగా..మరో 10 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సుమారు రూ.కోటి ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలను అదుపుచేసేందుకు కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేట నుంచి ఫైరింజన్లు వచ్చాయి. మంటలను ఆర్పేందుకు సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కుక్కనూరు మండలం రాష్ట్ర విభజనలో పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసిపోయినా ఆ జిల్లా యంత్రాంగం ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి సహాయక చర్యలు అందకపోవటంతో అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అక్కడి నుంచి ఫైరింజన్లు ఒక్కటీ రాలేదు. -
మహిళను తాళ్లతో కట్టేసి చోరీ..
ఏలూరు (పశ్చిమ గోదావరి) : ఒంటరిగా ఉన్న మహిళను తాళ్లతో నిర్బంధించి నగలు, నగదు దోచుకున్న ఘటన ఏలూరు మండలం వెంకటాపురంలో శనివారం చోటుచేసుకుంది. ఆళ్ల నాని కాలనీలో నివాసం ఉంటున్న మహిళను దుండగులు తాళ్లతో కట్టేసి 40 కాసుల బంగారు నగలు, 5 లక్షల రూపాయల నగదు చోరీ చేశారు. హేమలక్ష్మి(55) అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. దొంగలు చొరబడి ఆమెను తాళ్లతో కట్టేసి ఇంట్లో ఉన్న నగలు, నగదు దోచుకున్నారు. సమాచారం అందుకున్న ఏలూరు సీఐ నాగమురళి, ఎస్ఐ కిషోర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్పత్రి అధోగతి
ఇది వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. మండలంలోని 12 గ్రామాలకు ఏకైక దిక్కరుున ఈ పీహెచ్సీలో సమస్యలు అనేకం. పీహెచ్సీ ఆవరణ అంతా పిచ్చిమొక్కలతో అడవిని తలపిస్తోంది. ఇక ఆస్పత్రి ఎదుట పెద్ద పాముల పుట్ట. అందులో నుంచి అప్పుడప్పుడు విషసర్పాలు బయటకు వస్తుండడంతో సిబ్బంది, ఆస్పత్రికి వచ్చే ప్రజలు భయూందోళనకు గురవుతున్నారు. ఇక్కడ సిబ్బంది సేవలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారుు. మరుగుదొడ్లు, తాగునీటి సమస్య షరా మామూలే. ఆస్పత్రి ఆవరణలో ఆరు మరుగుదొడ్లు ఉన్నా అందులో మూడే పని చేస్తున్నారుు. తాగునీటి ట్యాంకును గత ఆరు నెలలుగా శుభ్రం చేసిన నాథుడే లేడు. దీంతో ఈ పీహెచ్సీకి వచ్చే పేద రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. - వెంకటాపురం -
కో ఆపరేటివ్ సొసైటీ సీఈవో అదృశ్యం
వెంకటాపురం (ఖమ్మం జిల్లా) : వెంకటాపురం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సీఈవో అదృశ్యం అయ్యాడంటూ ఆయన భార్య మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. పీఏసీఎస్ సీఈవోగా పనిచేస్తున్న అనుమకొండ రమేష్ (45) 20 రోజుల క్రితం ఆఫీసుకు వెళుతున్నానని చెప్పి ఇప్పటి వరకూ ఆచూకీ లేకుండా పోయారని ఆయన భార్య లక్ష్మి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
బండరాయి మీద పడి వ్యక్తి మృతి
కనగానపల్లి (అనంతపురం జిల్లా) : రామగిరి మండలం వెంకటాపురం గ్రామ సమీపంలో మంగళవారం ప్రమాదవశాత్తు బండరాయి మీద పడి వెంకటేశ్వర్లు(42) అనే వ్యక్తి మృతిచెందాడు. రాళ్లు కొడుతుండగా పక్కనే ఉన్న మరో పెద్ద బండ అకస్మాత్తుగా మీద పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
8మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
నేరెడ్మెట్ (హైదరాబాద్) : పేకాట ఆడుతున్న 8మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి రూ.1.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అల్వాల్ పరిధిలోని వెంకటాపురంలో శనివారం సాయంత్రం జరిగింది. విద్యుత్ కాంట్రాక్టర్ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పేకాట ఆడుతున్న నలుగురు విద్యుత్ శాఖ ఉద్యోగులతో పాటు, మరో నలుగురు కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1.30 లక్షల నగదు, 5 ద్విచక్రవాహనాలతో పాటు 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కామాంధుడిని కొట్టి చంపారు..?
-
ఖమ్మం జిల్లాలో వెలిసిన మావోయిస్టు పోస్టర్లు
ఖమ్మం : ఖమ్మం జిల్లా వెంకటాపురం సమీపంలో మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. పీఎల్వీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలంటూ మావోయిస్టు నేతలు పోస్టర్లలో పిలుపునిచ్చారు. దండకారణ్య ప్రాంతంలో దండకారణ్య ప్రాంతంలో పోలీసులు చేపట్టిన కూంబింగ్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. -
కలకలం సృష్టించిన కిడ్నాప్
గిద్దలూరు: ప్రకాశం జిల్లా గిద్దలూరులోని వివేకానంద కాలనీలో జరిగిన కిడ్నాప్ కలకలం సృష్టించింది. దర్శి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అతనిని బంధించి రైల్వే ట్రాక్పై పడవేశారు. రైల్వే ట్రాక్పై పడి ఉన్న మనిషిని స్థానికులు చూసి రక్షించారు. చికిత్స నిమిత్తం అతనిని ఆస్పత్రికి తరలించారు. ** -
నిద్రిస్తున్న రైతుపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్
అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో విషాదం చోటు చేసుకుంది. కాల్వ గట్టుపై నిద్రిస్తున్న ఓ రైతుపై నుంచి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఆ ఘటనలోఅబ్దుల్లా అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే స్పందించి ట్రాక్టర్ను అడ్డుకుని... డ్రైవర్కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు ఘటన స్థలం నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఫారెస్ట్ ఆఫీసర్ కావాలనుకున్నా..
ఐఎఫ్ఎస్ నా లక్ష్యం రూ.ఆరువేలు లేక ఎంబీబీఎస్ సీటు వదులుకున్నా ఇంగ్లిష్లో గ్రిప్లేక లక్ష్య ఛేద నలో వెనుకబడ్డా జమానత్ సీతారాం అనే పిలుపు గర్వంగా ఉండేది అతి తక్కువ ఖర్చుతో గెలిచింది దేశంలో నేనొక్కడినే నా చదువులో నానమ్మది కీలకపాత్ర నా ప్రతి అడుగులో భార్య సహకారం ఉంది ఆటలంటే ఎంతో ఇష్టం హరిత తెలంగాణ సాధనకు నా వంతు కృషి చేస్తా మానుకోట ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ సాక్షిప్రతినిధి, వరంగల్: మాది వెంకటాపురం మండలంలోని మల్లయ్యపల్లి. నారాయణపురం గ్రామపంచాయతీ అనుబంధ గ్రామం. నాన్న అజ్మీరా లక్ష్మణ్, అమ్మ మంగమ్మ. ముగ్గురం అన్నదమ్ములం. నేనే పెద్దోడిని. ఇద్దరు చెల్లెళ్లు. వ్యవసాయ కుటుంబం. మా తాతలప్పుడు 50 ఎకరాల వరకు ఉండేది. అన్నదమ్ములు పంచుకోగా కొంత తగ్గింది. ఇంటి నిర్వహణ విషయంలో మా నానమ్మ పాపమ్మ గ్రేట్. నా చదువులో ఆమెది కీలకపాత్ర. 1957 ఆగస్టు 20న పుట్టాను. డిగ్రీలో ఉన్నప్పుడే పెళ్లయింది. భార్య పేరు శారద. కుమార్తె పల్లవి, కాకతీయ వర్సిటీలో బయోటెక్నాలజీ ఎమ్మెస్సీ ఫస్ట్ బ్యాచ్. అల్లుడు బూక్యా లచ్చిరాంనాయక్, ఐఆర్ఎస్ అధికారి. కాజీపేట రైల్వే డివిజన్ సీనియర్ మెకానికల్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు రాకేశ్, ఎంఎస్(ఆర్థోపెడిక్) పూర్తిచేశాడు. చిన్నోడు రాజేశ్, ఎంటెక్. ప్రస్తుతం కేయూలోనే అకడమిక్ కన్సల్టెంట్గానూ పనిచేస్తున్నాడు. నా జీవిత పయనంలో వృత్తిపరంగా, కుటుంబపరంగా నా భార్య సహకారమే ఎక్కువ. చదువుకునే రోజుల్లో, ఉద్యోగ సమయంలో, తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. ఈ విషయంలో నా భార్య ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. ఇంటి నిర్వహణ ఆమే చూసుకుంటుంది. పిల్లల సెటిల్మెంట్ ఘనత పూర్తిగా ఆమెదే. ఎన్నికల సమయంలోనూ కీలకంగా వ్యవహరించింది. జమానత్ సీతారాం.. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులోనే పెద్ద కుట్ర ఉన్నది. ఎస్టీ, ఎస్సీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా అన్యాయం జరిగింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికపరంగానూ ఈ వర్గాలే ఎక్కువ నష్టపోయాయి. ఆంధ్రరాష్ట్రం, తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన 1956 నుంచి మాకు(లంబాడీ) ఎస్టీగా రిజర్వేషన్లు లేవు. అదే ఆంధ్ర ప్రాంతంలోని లంబాడీలు ఎస్టీల్లో ఉండేవారు. 1976లో తెలంగాణ ప్రాంతంలోని లంబాడీలను ఎస్టీల్లో చేర్చారు. ఇలాంటి వాటితో ఎంతోమంది విద్యావంతులు నష్టపోయారు. ఎంబీబీఎస్ సీటు విషయంలో నాకు ఇదే అనుభవం ఉంది. ఇలా ఎన్నో అన్యాయాలు. ఇవన్నీ చూసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నా వంతుగా ప్రయత్నించా. ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీ సమన్వయకర్తగా ఉన్న పరిచయాలతో తెలంగాణ యూనివర్సిటీల గిరిజన అధ్యాపకుల సంఘం(తుటా)ను ఏర్పాటు చేశాను. 2009లో కేసీఆర్ నిరహార దీక్ష తర్వాత ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ పాత్ర చెప్పలేనిది. పోలీసు నిర్బంధంతో విద్యార్థులపై దాడులకు తెంపు ఉండేది కాదు. ఉద్యమం కేసుల పేరిట పగలు, రాత్రి తేడాలేకుండా పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసేవారు. నేను వెళ్లి వారికి జమానత్ ఇచ్చేవాడిని. దీంతో ఒకసారి జడ్డి... ఎంతమందికని జమానత్ ఇస్తరు. మీపై అధికారులకు లెటర్ రాస్తా అన్నారు. ‘నేను దేశద్రోహులకు, ఉగ్రవాదులకు జమానత్ ఇస్తలేను. నా జీతం కట్ అయినా పర్వాలేదు’ అని చెప్పాను. ఉద్యమం కీలక సమయంలో నన్ను జమానత్ సీతారాం అనేవారు. అలా పిలవడం నాకు గర్వంగా అనిపించేది. ఎన్ఎస్ఎస్తో గుర్తింపు.. ఎన్ఎస్ఎస్లో పనిచేయడం అదృష్టంగా భావిస్తా. సమాజంలో అనేక సమస్యలను తెలుసుకునే అవకాశం దీంతోనే వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులతో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాలను నిర్వహించా. సామాజిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టాం. మంచిర్యాలలో ఉన్నప్పుడే ఎన్ఎస్ఎస్ జిల్లా సమన్వకర్తగా, వరంగల్కు వచ్చాకా జిల్లాస్థాయి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల అధికారిగా పనిచేశా. సామాజిక, రక్తదానం కార్యక్రమాలు నిర్వహించా. మేడారం జాతర సమయాల్లో మూడుసార్లు మెగాక్యాంపులు విజయవంతంగా నిర్వహించాం. 17 రాష్ట్రాల విద్యార్థులతో ములుగులో క్యాంప్ నిర్వహించా. క్యాంపులో ఉన్నప్పుడే కాకతీయ యూనివర్సిటీలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వచ్చాయి. 50 వేల యూనిట్ల రక్తం సేకరించాం. రెడ్క్రాస్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యా. రెండుసార్లు యూనివర్సిటీకి గవర్నర్ సుర్జిత్సింగ్ బర్నాలాను తీసుకువచ్చా. 35 గిరిజన తెగలకు పరిశోధన చేశా. గుల్బార్గా, మిథిలా వర్సిటీలతోపాటు అమెరికా, నేపాల్, థాయ్లాండ్లో అంతర్జాతీయ సదస్సులో పరిశోధనాపత్రాలను సమర్పించా. అవార్డులూ వచ్చాయి. సీతారాంనాయక్కు గుర్తింపు తెచ్చింది ఎన్ఎస్ఎస్ అని గట్టిగా చెబుతాను. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన హరిత తెలంగాణకు నా వంతుగా కృషి చేస్తాను. మనిషి పుట్టుక నుంచి జీవితాంతంలోనూ చెట్టు ప్రాధాన్యతను వివరించేలా ఉన్న ‘చెట్టమ్మ.. చెట్టు’ పాటతో పచ్చదనం ప్రాధాన్యతను వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా. నాకు మొదటి నుంచి స్పోర్ట్స్ అంటే ఇష్టం. కబడ్డీ, బాల్బ్యాడ్మింటన్ ఆడేవాడిని. ఎన్నికల్లో నాది రికార్డు సామాజిక కార్యక్రమాలపై నాకు మొదటి నుంచి ఆసక్తి. వీటి వల్లే రాజకీయాలపైనా ఇష్టం ఏర్పడింది. యూనివర్సిటీలో ఉన్నప్పుడు పీడీఎస్యూ, ఆర్ఎస్యూ బలంగా ఉండేవి. అంతా ఖమ్మం వాళ్ల డామినేషన్ నడిచేది. వరంగల్ లోకల్ ఫీలింగ్తో కొందరు మిత్రులతో కలిసి నేను విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీచేశా. సమానంగా ఓట్లు రావడంతో టాస్ వేస్తే ప్రత్యర్థి సోమిరెడ్డి గెలిచారు. డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడే ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు పరిశీలనలో ఉన్నట్లు పత్రికల్లోనే వార్తలు వచ్చేవి. 2004, 2009 ఎన్నికల్లో ఒక జాతీయ పార్టీ టిక్కెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలించింది. డబ్బులు లేవనో, మధ్యవర్తులు లేకనో నాకు అవకాశం రాలేదు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎస్టీల స్వయంపాలన కోసం తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుతామన్నారు. అందుకే నేను టీఆర్ఎస్లో చేరా. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలిచి టికెట్ ఇచ్చారు. ఎంపీగా పోటీచేస్తావా? ఎమ్మెల్యే టికెట్ కావాలా? నీ ఇష్టం అన్నారు. ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి నన్ను సన్నిహితులు ఎంపీగారు అనేవారు. నేను దానికే ఫిక్సయ్యా. మహబూబాబాద్ లోక్సభ పరిధిలో ఖమ్మంలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా నాకు ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతో కేసీఆర్గారు ఎమ్మెల్యే టెకెట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మానుకోట ప్రజలను నన్ను ఎంపీగా గెలిపించారు. ఎన్నికల్లో సాధారణ రవాణా, ప్రచారం కోసమే ఖర్చు చేశా. ఓట్ల కోసం ఒక్క రూపాయీ ఇయ్యలేదు. దేశంలోనే అతి తక్కువ ఖర్చుతో ఎంపీగా గెలిచింది నేనేనని గర్వంగా చెబుతా. 13 ఏళ్లపాటు కేయూలో పనిచేశాను. అడ్మిషన్ల డెరైక్టరుగా, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా, ఆర్ట్స్ కాలేజీ ఇన్చార్జ్గా, కేయూ పాలకమండలి సభ్యుడిగా పదవులు నిర్వహించా. రెండుసార్లు వర్సిటీ బడ్జెట్ ప్రవేశపెట్టా. యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహం, ఎస్టీలపై బుక్బ్యాంక్, పరిపాలన భవనం ఎదుట ఎన్ఎస్ఎస్ మార్గ్ ఏర్పాటు, చెక్డ్యాం నిర్మాణం తృప్తి కలిగించాయి. ఒక్క విమర్శ, ఆరోపణ లేకుండా 13 ఏళ్లపాటు యూనివర్సిటీలో పనిచేశా. రాజకీయాల్లోనూ ఇలాగే ఉండాలని నా ఉద్దేశం. ఇంగ్లిష్లో పట్టులేక.. వ్యక్తి అభివృద్ధికి చదువే మూలం. ఇందుకు నేనే నిదర్శనం. మా చిన్నాన్న వెంకట్రాం 1950ల్లోనే తొమ్మిదో తరగతి వరకు చదివారు. నా చిన్నప్పుడు వ్యాపారం చేసుకునేందుకు మా ఊరొచ్చిన ఓ వైశ్య కుటుంబం మా ఇంట్లోనే ఉండేది. వారు మా నాన్నను, నానమ్మను ఒత్తిడి చేయడంతో నన్ను స్కూలుకు పంపించారు. నాలుగో తరగతి వరకు నారాయణపురంలో చదివాను. నాలుగు నుంచి ఆరు వరకు గుర్రంపేటలో, ఆరు నుంచి తొమ్మిది వరకు ఘణపురం(ఎం) ప్రభుత్వ పాఠశాలలో చదివాను. పదో తరగతి కోసం హన్మకొండ మర్కజీ స్కూల్లో చేరాను. హాస్టల్ సీటు కోసం మా ఊరి దగ్గర్లోని లక్ష్మీదేవిపేటకు చెందిన సూర్యనేని రాజేశ్వరరావు.. సంక్షేమ అధికారితో మాట్లాడారు. అయితే మర్కజీ స్కూల్కు వెళ్లలేదు. తర్వాత పరకాల స్కూళ్లో చేరా. ఎందుకో ఉండబుద్ధి కాకపోయేది. చిన్నప్పటి నుంచి ఫస్ట్ లేదా సెకండ్ ర్యాంక్లో ఉండేవాడిని. 1969 తెలంగాణ ఉద్యమంతో చదువులో కొంత వెనుకబడ్డా. 50 శాతం మార్కులతో పాసయ్యా. హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్లో చదువుకున్నా. కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీలో చేరా. అప్పుడు కాకతీయ డిగ్రీ కాలేజీనీ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ రోజుల్లోనే మంత్రి చాంబర్ ఎదుట నిరసన తెలిపాం. డిగ్రీ నుంచి నా చదువు బాగా మెరుగయ్యింది. మెరిట్ వచ్చింది. కేయూలో బాటనీలో ఎమ్మెస్సీ పూర్తిచేశా. 1982లో ఎమ్మెస్సీ అయ్యింది. అటవీ ప్రాంతంతో ఉన్న అనుబంధం వల్ల కావచ్చ.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు(ఐఎఫ్ఎస్) అధికారి కావాలని లక్ష్యంగా ఉండేది. అందుకే బైపీసీ చదివా. ఎంబీబీఎస్ రాశాను. అప్పుడు సీటు రాలేదు. రూ.ఆరు వేలు ఫీజు కడితే సీటు వస్తుందన్నారు. అంత కట్టలేక డిగ్రీలో చేరాను. ఫారెస్ట్ శాఖలో ఉద్యోగం, లేకుంటే గెజిటెడ్స్థాయిలో ఉండే ఉద్యోగం చేయాలని అనుకునేవాడిని. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాలు, చదువులకు దేనికి దరఖాస్తు చేయాలన్నా గెజిటెడ్ సంతకం తప్పనిసరి. దీనికోసం గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చేది. ఆ నిరీక్షణ చూసి నేను గెజిటెడ్స్థాయి ఉద్యోగం చేయాలని అనుకునేవాడిని. ఐఎఫ్ఎస్ అనేది బాగా మనసులో ఉండేది. డిగ్రీ పూర్తి కాగానే ఐఎఫ్ఎస్ రాశాను. ఇంగ్లిషులో గ్రిప్ లేకపోవడం వల్ల రాలేదు. పీహెచ్డీ పూర్తి కాకముందే డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. పీహెచ్డీకి ఇబ్బంది లేకుండా మంచిర్యాలలో పోస్టింగ్ వచ్చింది. ఈ విషయంలో మేచినేని కిషన్రావుగారు సహకరించారు. 1984 నుంచి 1995 వరకు అక్కడే పనిచేశా. తర్వాత 2001 వరకు కాకతీయ డిగ్రీ కాలేజీ. 2001 నుంచి ఇటీవలి వరకు కేయూలో రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేశా. కాలం మారింది మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులంటే ఎంతో గౌరవం ఉండేది. ఇద్దరి అనుబంధం ఉండేది. ఇప్పుడు అది కనిపించడంలేదు. జగన్మోహన్రావు, సుబ్బారావు, తిరుపతిరావు, రామ్మోహన్రావు ఇప్పటికీ నాకు చాలా గుర్తు. పీహెచ్డీ గైడ్గా దిగంబరరావు సార్ ఉండె. ఉన్నత విద్య అనేది వ్యక్తుల జీవితాలకు, జీతాలకు కాకుండా సమాజానికి ఉపయోపడాలని చెప్పేవారు. వల్లంపట్ల నాగేశ్వర్రావు నాకు పరకాల నుంచీ మిత్రుడే. ఎందుకో తెలియదుగానీ సబ్జెక్టు పరంగా మన కంటే మెరుగైన వాళ్లతో స్నేహం చేయాలని నాకు మొదటి నుంచి ఉండేది. అది కెరియర్ పరంగా నాకు బాగా ఉపయోగపడింది. భగవాన్రెడ్డి, సుధీర్రెడ్డి, విజయాకర్, దేవదాసు, నేను బాగా కలిసి ఉండేవాళ్లం. అప్పుడు ఫ్రెండ్స్తో కలిసి సినిమాలకు వెళ్లేవాడిని. సినిమా అనేది పవర్ఫుల్ మీడియా. ఇప్పుటి సినిమాల్లో విలువలే ఉండడం లేదు. హీరోల పేరుతో కొందరు చేసే చేష్టలు చూస్తేనే వికారం వస్తుంది. -
రైతులకు శాపంగా మారిన డీఫ్లోరైడ్ ప్రాజెక్టు
వెంకటాపురం : నీటితో రామప్ప సరస్సు కళకళలాడుతున్నా.. వర్షాలు లేవన్న సాకుతో అధికారులు నీటి సరఫరా నిలిపేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రామప్ప సరస్సును నమ్ముకొని మండలంలోని పాలంపేట, రామాంజాపూర్, వెంకటాపురం, ఎల్లారెడ్డిపల్లె, నల్లగుంట, లక్ష్మీదేవిపేట, గంపోనిపల్లె, వీర్లపల్లె గ్రామాలకు చెందిన రైతులు పంటలు సాగుచేస్తున్నారు. 36 అడుగుల నీటిసామర్థం గల ఈ సరస్సు కింద అధికారికంగా ఐదువేల ఎకరాలు, అనధికారికంగా మరో ఐదువేల ఎకరాలు సాగవుతోంది. సరస్సు ఒకసారి పూర్తిస్థాయిలో నిండితే రెండేళ్లపాటు ఖరీఫ్, రబీ పంటలకు ఢోకా ఉండదు. దీనికింద సోమికాలువ, ఒగరు కాలువ, నల్లకాలువ ఉన్నాయి. వీటి ద్వారా ఆయకట్టు పొలాలకు సాగునీరు అందుతుంది. సరస్సులో 27 అడుగుల నీటిమట్టం ఉన్నట్లయితే ఖరీఫ్, రబీ పంటలు, 18 అడుగుల నీరు ఉంటే ఖరీఫ్ సాగవుతుంది. ప్రస్తుతం సరస్సులో 25అడుగుల నీరు ఉంది. అంటే ఖరీఫ్ పంటలకు సరిపడా నీరు ఉన్నట్టే. అయితే వానలు కురవలేదన్న సాకుతో అధికారులు నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దయతలచి నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. నాలుగేళ్ల క్రితం మొదలైన కష్టాలు సరస్సులో డీఫ్లోరైడ్ ప్రాజెక్టు నిర్మించి గత నాలుగేళ్లుగా వెంకటాపురం, గణపురం మండలాల్లోని 26 గ్రామాల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. వేసవిలో తాగునీటి సమస్య రాకూడదనే ఉద్దేశంతో అధికారులు రబీ పంటలకు సాగునీటిని విడుదల చేయడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు రబీ పంటలను కోల్పోతున్నారు. సరస్సులోకి దేవాదుల నీరు వచ్చే వరకు మండలంలోని గ్రామాలను మినహాయిం చి ఇతర గ్రామాలకు తాగునీటి సరఫరాను నిలిపివేయాలని రైతులు పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో ప్రతీ ఏటా రైతులకు, అధికారులకు మధ్య వివాదా లు చోటుచేసుకుంటున్నాయి. అసలే రబీ పంటలు కోల్పో యి నష్టాల పాలవుతున్న రైతులు.. ప్రస్తుత ఖరీఫ్ పంటలకు కూడా అధికారులు నీటిని విడుదల చేయకపోవడంతో ఏంచేయాలో తెలియక తల్లడిల్లుతున్నారు. చేసేది లేక వరుణుడిపైనే ఆశలు పెట్టుకుని వరినార్లు పోసుకున్నారు. వేసిన పంటలు ఎండిపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంద ని, అధికారులు తక్షణమే స్పందించి సాగునీటిని విడుదల చేయాలని రైతులు వేడుకుంటున్నారు. -
పరిటాల శ్రీరామ్ గృహనిర్బంధం
రాప్తాడులో అమ్మ ఓడిపోతే.. అంతు చూస్తానంటూ ఓటర్లను బెదిరించిన పరిటాల శ్రీరామ్ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఎన్నికల సందర్భంగా శ్రీరామ్ ఓటర్లను బెదిరించేలా ఇంతకుముందు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన తల్లి పరిటాల సునీత రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను పోలీసులు వెంకటాపురంలోని ఆయన ఇంట్లోనే శ్రీరామ్ను నిర్బంధంలో ఉంచారు. -
గొంతెండుతున్న పల్లెలు
నిజామాబాద్ అర్బన్, న్యూస్లైన్ : మాక్లూర్ మండలం వెంకటాపూర్ గ్రామం... 20రోజుల క్రితం ఈ గ్రామానికి నీరు అందించే ట్రాన్స్ఫార్మర్, సబ్మెర్సిబుల్ పంపులు చెడిపోయాయి. అధికారులు ఇప్పటివరకు వాటికి మరమ్మతులు చేయించలేదు. ఫలితంగా గ్రామస్తులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. రాత్రి పూట వ్యవసాయ బావుల వద్ద కెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. ఉదయం నుం చి రాత్రి వరకు కరెంటు ఉండకపోవడంతో నీటి కటకట ఏర్పడింది. జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఈ దుస్థితి నెలకొంది. ఇక జిల్లా సరిహద్దు గ్రామాలలో గ్రామీణుల తాగునీటి అవస్థలు చెప్పనలవి కాకుం డా ఉన్నాయి. చుక్క నీరు లేదు ఎండలు మండుతున్నాయి. తాగేందుకు నీరు దొరకడం లేదు. ఏకధాటిగా 12 గంటల నుంచి 14 గంటల వరకు కరెంటు సరఫరా లేకపోవడం ఇం దుకు ప్రధాన కారణమవుతోంది. మరోవైపు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు నీటికోసం గోస పడుతున్నారు. గ్రామాలలో ఉన్న నీటి ట్యాంకుల వినియోగం సక్రమంగా లేదు. కొన్నిచోట్ల అవసరమైన మేరకు ట్యాంకుల నిర్మాణం లేనందున సరిపోయేంత నీరు అందుబాటులో ఉం డడం లేదు. ముఖ్యంగా జిల్లా సరిహద్దు ప్రాంతాలు, తం డాలలో నీటి కటకట ఏర్పడింది. గాంధారి, ఎల్లారెడ్డి, లింగంపేట, మద్నూరు, జుక్కల్, భీంగల్, సిరి కొండ, డిచ్పల్లి, కామారెడ్డి ప్రాంతాల్లో నీటి తీవ్రత ఎక్కువగా ఉంది. తండాలలోని వాగుల్లోని చెలిమలు, ఊట బావులనుంచి నీటిని తోడుకుంటున్నారు. మరికొన్ని చోట్ల వ్యవసాయ బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఇందు కోసం కిలోమీటర్ల చొప్పు న కాలినడకన వెళుతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో 1,640 ఆవాస ప్రాంతాలు ఉండగా, 1,054 ఆవాస ప్రాంతాలకు నీటి సరఫరా ఉంది. 590 ఆవా స ప్రాంతాలకు పాక్షికంగా నీటి సరఫరా అవుతోంది. 159 ఆవాస ప్రాంతాలు సురక్షితం కానివి. ఈ ప్రాంతాలకు సీపీడబ్ల్యూ పథకం ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. అధికారులు చెబుతున్న వివరాలు ఇవి. కాగా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరే విధంగా ఉంది. అధికారులు చెప్పినట్లు 1,054 ఆవాస ప్రాంతాలకు కాకుండా, 600 ఆవాస ప్రాంతాలకు కూడా నీటి సరఫరా అందుబాటులో లేదు. 590 ప్రాంతాలకు పాక్షికంగా నీటి సరఫరా ఉందని పేర్కొనడంలోనూ నిజం లేదు. వంద ప్రాంతాలకు కూడా సక్రమంగా నీరు అందడం లేదు. 39 బోర్లను అద్దెకు తీసుకుని, 31 ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలపడం మరీ పచ్చి అబద్ధంగా కనిపిస్తోంది. బోర్ల నుంచి నీటిని అందించేందుకు కరెంటు సదుపాయమే లేదు. అయి నా అధికారులు వీటిని లెక్కలోకి తీసుకుంటున్నారు. అద్దె ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు నీటి సరఫరా నామమాత్రంగానే ఉంటోంది. ఈ ఏడాది వేసవి ప్రణాళికలో భాగంగా రూ. 1.50 కోట్లతో ప్రణాళిక లు సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయి తే ఆ ప్రణాళికలు ఎక్కడా అమలవుతున్నట్లు కని పించడం లేదు. జిల్లాలో 347 బోర్లు, చేతిపంపులకు ఫ్లషింగ్, డిఫెనింగ్ చేసినట్లు అధికారులు రికార్డులలో చూపుతున్నారు. చేతిపంపుల వినియోగం అక్కడక్కడ మాత్రమే ఉంది. వేసవి కాలంలో చేతిపంపులే ప్రధాన నీటి వనరులుగా ఉపయోగపడతాయి. వీటి ని పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అంతటా అధికారులు ఎన్నికల నిర్వహణలో నిమగ్నమయ్యారు. దీంతో నీటి ఎద్దడిపై చర్యలు తీసుకునేందుకు తీవ్ర ఆటం కాలు ఎదురవుతున్నాయి. అధికారులు ప్రధానమైన నీటి అవసరాలను పట్టించుకోకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
అపర భగీరథుడు వైఎస్
జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాల ఫలాలు... నేడు అన్నదాతల ముంగిట చేరుతున్నాయి. నీరందక బీళ్లుగా మారిన ఆయకట్టు చివరి భూముల్లో ఆ మహానేత వరప్రసాదం ‘ఎత్తిపోతల’తో నేడు సిరులు కురిపించే రెండు పంటలు పండుతూ అన్నదాతలను ఆదుకుంటున్నాయి. వెంకటాపురం(పెనుగంచిప్రోలు), న్యూస్లైన్ : మండలంలోని వెంకటాపురం గ్రామం వద్ద మునేటిపై జలయజ్ఞ రూపకర్త, వైఎస్ ఆశీస్పులతో అప్పటి ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను కృషితో రూ.2.30 కోట్లతో, కె.పొన్నవరం వద్ద రూ.30 లక్షలతో ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఎండిపోతున్న పొలాలకు ఈ ఎత్తిపోతల పథకాలు వరంగా మారాయి. శనగపాడు మేజర్-1 సాగర్ కాలువ కింద ఉండే చివరి భూములకు సాగునీరు రాక, వర్షాలు పడక రైతులు అనేక ఇబ్బందులకు గురై విసుగుచెంది సుబాబుల్ తదితర పంటలపై దృష్టి సారించారు. ఈ తరుణంలో రైతులకు శాశ్వత లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో వైఎస్ ఆశీస్సులతో ఉదయభాను చేసిన కృషి నేడు కొళ్లికూళ్ల గ్రామంలో 300 ఎకరాలు, వెంకటాపురంలో 465 ఎకరాలు, వెంగనాయకునిపాలెంలో 100 ఎకరాలు ఇలా... మొత్తం 865 ఎకరాలకు సంవృద్ధిగా సాగునీరందుతోంది. మునేరు నుంచి శనగపాడు మేజర్-1కు అండర్గ్రౌండ్ పైపులైన్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. అక్కడ నుంచి రైతులు తమ పొలాలకు నీటిని వాడుకుంటున్నారు. ఎస్సీల కోసం ప్రత్యేక ఎత్తిపోతల పథకం...... మండలంలోని వెంకటాపురం శివారు గ్రామంలోని కె.పొన్నవరం గ్రామంలో నివశిస్తున్న కేవలం 400 మంది ఎస్సీల కోసం రూ.30 లక్షలతో ప్రత్యేకంగా ఎత్తిపోతల పథకాన్ని వైఎస్ హయాంలో నిర్మిం చారు. ఎస్సీలకు ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు 45 ఎకరాల భూములకు సాగునీరందించేందుకు దీనిని నిర్మించారు. కళకళలాడుతున్న పొలాలు....... వర్షాలు లేక, సాగర్ నీరు రాక మండల పరిధిలోని పొలాలన్నీ నెర్రెలు వచ్చి ఎండిపోతుంటే వెంకటాపురం, కె.పొన్నవరం ఎత్తిపోతల పథకాల కింద ఉన్న పొలాలు మాత్రం కళకళలాడుతున్నాయి. మండుతున్న ఎండల్లోనూ మొక్కజొన్నకు నీరు పెట్టుకుంటున్నామని రైతులు ఆనందంతో చెబుతున్నారు. -
రంగారెడ్డిలో విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి
రంగారెడ్డి: పాడిషరీఫ్ సమీపంలోని వెంకటాపురంలో శనివారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది.ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. దీంతో వెంకటాపురంలో విషాద చాయలు అలుముకున్నాయి. విగత జీవులుగా మారిన తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. వెంకటాపురంలోని ఓ చెరువులో ఈతకు వెళ్లగా ఆ ముగ్గురు విద్యార్థులు గల్లంతై దుర్మరణం పాలైనట్టు తెలిసింది. -
ఉన్మాది చేతిలో మహిళ దారుణ హత్య
మూడేళ్ల క్రితం కన్నకూతురిని చంపిన సైకో సదానందం అప్పట్లో పోలీసులకు సాక్ష్యం చెప్పారని.. దారుణం వెంకటాపురం, న్యూస్లైన్ : మూడేళ్ల క్రితం కన్నకూతురిని దారుణంగా హత్య చేసిన ఓ ఉన్మాది.. అందుకు సాక్షిగా నిలిచిన మరో మహిళను బలిగొన్నాడు. పోలీసులకు తన గురించి సమాచారం ఇచ్చారనే నెపంతో దారుణాని కి ఒడిగట్టాడు. ఈ ఘటన మండలంలోని బూర్గుపేటలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జగ్గు సదానందం, అరుణ దంపతులకు మూడేళ్ల క్రితం కూతురు జన్మించింది. ఆ పాప తనకు పుట్టలేదంటూ ఉన్మాదిగా ప్రవర్తించిన సదానందం అప్పట్లోనే ఆ పాపను గడ్డపారతో పొడిచి చంపేశాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన శ్యామల జయపాల్రెడ్డి సాక్షిగా ఉన్నాడు. కాగా మూడేళ్లుగా సదానందం భార్య అరుణ నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామంలోని తన పుట్టింట్లో ఉంటోంది. ఇటీవల జైలు నుంచి విడుదలైన అతడు గ్రామంలో రెండు రోజులుగా కత్తి పట్టుకుని తిరుగుతూ తన భార్యను బూర్గుపేటకు తీసుకురావాలని అరుస్తూ హంగామా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు సైకోగా ప్రవర్తిస్తూ పాప హత్య కేసులో సాక్షిగా ఉన్న శ్యామల జయపాల్రెడ్డి ఇంటికి వెళ్లాడు. ఇంటి ఎదుట నిల్చు న్న జయపాల్రెడ్డి భార్య స్వరూప(32)ను కత్తితో కడుపులో రెండుసార్లు పొడిచాడు. ఆమె కేకలు వేయగానే పారిపోయాడు. గమనించిన స్థానికులు లక్ష్మిదేవిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎస్సై యాసీన్ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పింఛన్ గద్దలు
వెంకటాపురం(ఏలూరు రూరల్), న్యూస్లైన్ : పేదలకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ను కూడా అవినీతి ఉద్యోగులు గద్దల్లా త న్నుకుపోతున్నారు. లబ్ధిదారులకు పింఛన్ మంజూరైన విషయం కూడా తెలియనీయకుండా కొన్ని నెలలుగా సొమ్మును బొక్కేస్తున్న వ్యవహారం వెంకటాపురం పంచాయతీలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు లబోదిబోమంటున్నారు. గ్రామంలో గతనెల పింఛన్దారుల నుంచి రూ.10 చొప్పున దాదాపు రూ.22 వేలు వసూలు చేసిన సిబ్బంది రెండు నెలలుగా పెన్షన్ తీసుకోని లబ్ధిదారుల పింఛన్లు సైతం కాజేస్తున్నారు. వెంకటాపురం పంచాయతీ ఇందిరా కాలనీలో నివాసం ఉంటున్న నాగమల్లి రేణుక భర్త భీమారావు వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత ఏడాది భర్త మృతి చెందడంతో బిడ్డల పోషణ భారమై మే నెలలో వితంతువు పింఛన్ను కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. అప్పటినుంచి పంచాయతీ సిబ్బంది చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉంది. అడిగిన ప్రతి సారీ మంజూరు కాలేదని ఆమెకు చెబుతూ వచ్చారు. మరోమారు దరఖాస్తు చేసేందుకు సోమవారం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన ఆమె ‘న్యూస్లైన్’ ఎదుట తన గోడు వెళ్లగక్కింది. దీంతో ‘న్యూస్లైన్’ ఆమె సమస్యను మండల పరిషత్ కార్యాల యంలో పింఛన్ల పంపిణీని పర్యవేక్షించే జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్కు వివరించింది. ఆయన రికార్డులను పరిశీలించి రేణుకకు గత ఏడాది నవంబర్ నెలలో ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసినట్లు చెప్పారు. అనంతరం పింఛన్ బట్వాడా పట్టిక పరిశీలించగా జనవరి నెలలో ఆమె రూ.600 తీసుకున్నట్టు ఉంది. రికార్డులో ఎన్.రేణుక నిశాని అని రాసి వేలిముద్ర వేసి ఉంది. దీంతో ఆమె తాను నిశాని కాదని.. చదువుకున్నానని చెప్పింది. తన పింఛన్ను ఉద్యోగులు కాజేశారంటూ ఆవేదనకు గురైంది. వెంకటాపురంలో 2,280 మంది పింఛన్దారులు ఉన్నారు. వీరికి నెలకు రూ. 6,91,700 విడుదలవుతోంది. వీరిలో అసలైన లబ్ధిదారులు ఎవరో.. అన్యాయానికి గురవుతున్నది ఎందరో అధికారులే తేల్చాల్సి ఉంది. నా పింఛన్ కాజేశారు ఆరు నెలలుగా తిరుగుతున్నా నాకు పింఛన్ మంజూైరె ందని చెప్పలేదు. ఇప్పుడు చూస్తే నా పింఛన్ మొత్తం కాజేశారు. పెన్షన్ పత్రాల్లో నేను నిశాని అని రాసి వేలిముద్ర వేశారు. నేను చదువుకున్నాను. నాలా అన్యాయానికి గురైనవారెందరున్నారో. - నాగమల్లి రేణుక -
నాడే అంతం చేశారు...
వెంకటాపురం,న్యూస్లైన్ : వెంకటాపురం మండలం వీఆర్కె పురం గ్రామానికి చెందిన డర్రా రాధ, డర్రా పోతురాజుల అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. ఎప్పటికైనా తిరిగి వస్తారని ఎదురుచూస్తున్న వారి కుటుంబ సభ్యులను పోలీసులు ఇచ్చిన సమాచారం హతాశులను చేసింది. రాధ, పోతురాజులను సమీప బంధువులే అత్యంత కిరాతకంగా అంతమొందించారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి వెంకటాపురం సీఐ కే ఆర్కే ప్రసాద్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వీఆర్కేపురానికి చెందిన డర్రా దామోదర్కు ఇదే గ్రామానికి చెందిన రాధతో పదేళ్ల క్రితం వివాహమైంది. వివాహమై సంవత్సరాలు గడుస్తున్నప్పటకీ వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో దామోదర్ అదే గ్రామంలోని వేరే మహిళతో వివాహేతర సం బంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. ఇదిలా ఉండగా దామోదర్ చిన్నాన్న కుమారుడైన పోతురాజు అనే వ్యక్తి రాధతో సన్నిహితంగా మెలగటమే కాకుండా ఆమెతో వివాహేతర సం బంధం పెట్టుకున్నాడు. రాధ,పోతురాజు 2012 జూలై నెలలో ఊరు నుంచి పారిపోయారు. నెల్లూరు జిల్లా బోగాల మండలం సీఆర్ పురం గ్రామంలోని బ్రహ్మయ్య ఇంటికి వారు వెళ్లారు. గతంలో వెంకటాపురం ఏరియాలో తాపీ మేస్త్రీగా బ్రహ్మయ్య పనిచేయటంతో అతనితో ఉన్న పరిచయం మేరకు రాధ, పోతురాజు ఇరువురు బ్రహ్మయ్యను ఆశ్రయించారు. అక్కడ నుంచి వారు చెన్నై వెళ్లి కూలిపనులు చేసుకుంటూ సహజీవనం సాగించారు. రాధ, పోతురాజులు కలిసి పారిపోయినట్లుగా తెలుసుకున్న రాధ భర్త దామోదర్ వీరి గురించి ఆరా తీశాడు. వారు బ్రహ్మయ్య దగ్గర ఉన్నట్లు 15రోజుల తర్వాత తెలుసుకున్నాడు. దామోదర్, అతని కుటుంబ సభ్యులు సర్వేశ్వరరావు, వెంకటే శ్, నాగరాజు,వేణు,గోపి నెల్లూరు జిల్లా సీఆర్పురంలోని బ్రహ్మయ్య ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. రాధ, పోతురాజులను చె న్నై పంపించింది బ్రహ్మయ్య అని నిర్ధారించుకొని వారిని వెంటనే తమకు అప్పగించాలని నిలదీ శారు. వారిని తమకు అప్పగించకపోతే పోలీ సులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో బ్రహ్మయ్య చెన్నై వెళ్లి వారిద్దరినీ నెల్లూరుకు తీసుకొస్తుండగా, అప్పటికే వారి కోసం బస్టాండ్లో వేచిఉన్న సర్వేశ్వరరావు, వెంకటేష్లను చూసిన రాధ, పోతురాజులు వారి కంట పడకుండా అక్కడనుంచి తప్పించుకుని కావలి వెళ్లిపోయారు. రాధ, పోతురాజులు పారిపోగా... బ్రహ్మయ్యను దామోదర్ పట్టుకున్నాడు. తమఊరు నుంచి వచ్చిన వారి గురించి తెలుసుకునేందుకు సాయంత్రం రాధ, పోతురాజులు బ్రహ్మయ్యకు ఫోన్ చేశారు. దీంతో తప్పించుకుపోయిన వారు కావలిలో ఉన్నట్లుగా నిర్ధారించుకొని బ్రహ్మయ్యను అక్కడికి పంపించారు. వారిని జమ్మల పాలెం మీదుగా గుంటూరుకు తీసుకురమ్మని చెప్పి బ్రహ్మయ్యను పంపించినప్పటికీ, అతని వెనుకే ఆటో ద్వారా దామోదర్ తదితరులు వెంబడించారు. ఆటోలో ఎదురుగా తీసుకొస్తున్న రాధ, పోతురాజులను పట్టుకొని తమ ఆటోలో ఎక్కించుకున్నారు. అక్కడ నుంచి నేరు గా భద్రాచలం తీసుకొచ్చారు. అయితే రాధ, పోతురాజు దొరికారనే విషయం గ్రామంలో తెలిసింది. కాగా, భార్య వివాహేతర సం బంధం పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేని దామోదర్ ఎలాగైనా వారిని అంతమొందించాలని నిర్ణయానికి వచ్చాడు. సహజీవనం చేసిన ఇరువురిని ఒక్కటి చేసేందుకు గ్రామంలోని పెద్దలను ఒప్పిస్తానని నమ్మబలికాడు. రాధతో తమ గ్రామంలో ఉన్న అత్తమామలకు ఫోన్ చేయిం చి, తాము బెంగుళూరులో ఉన్నట్లుగా చెప్పిం చాడు. వారం రోజుల తరువాత రాధ, పోతురాజు భద్రాచలం రావాలని చెప్పి వారిని అక్క డ నుంచి కరీంనగర్లోని బంధువులు ఇంటికి పంపించాడు. దామోదర్ మాటలు నమ్మిన వారిద్దరూ వారం రోజుల తరువాత కరీంనగర్ నుంచి రైలులో కొత్తగూడెం వరకూ వచ్చారు. అప్పటికే కొత్తగూడెం రైల్వే స్టేషన్లో వేచి ఉన్న దామోదర్, వెంకటేష్, సర్వేశ్వరరావు, నాగరాజు, వేణు వారిని ఆటో ద్వారా భద్రాచలం తీసుకొచ్చారు. ఆటో భద్రాచలం గోదావరి బ్రిడ్జి మధ్యలోకి రాగా వారిని అంత మొందించాలని నిర్ణయించుకున్న దామోదర్, మిగతా వారు పోతురాజు మెడకు కండువా చుట్టి బిగించారు. చనిపోయినట్లుగా నిర్ధారించుకొని బ్రిడ్జి పై నుంచి గోదావరిలో శవాన్ని వేశారు. ఆ తరువాత రాధను గొంతు నులిమి ప్రాణాలు పోకముందే గోదావరి నదిలో తోసేశారు. తరువాత వీరంతా గ్రామానికి వచ్చేశారు. వెలుగులోకి ఎలా వచ్చిందంటే.... రాధ తమ్ముడు సతీష్ మొక్కు తీర్చుకునే క్రమంలో మూడు నెలల క్రితం తిరుపతి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో అక్కను చూసేందుకని నెల్లూరు జిల్లాలోని సీఆర్పాలెంలో గల బ్రహ్మయ్య ఇంటికి వెళ్లాడు. అయితే రాధ, అతనితో పాటు ఉన్న పోతురాజును చాలా కాలం క్రితమే దామోదర్, మరికొంతమంది వచ్చి గ్రామానికి తీసుకెళ్లినట్లుగా బ్రహ్మయ్య చెప్పాడు. తిరిగి గ్రామానికి వచ్చిన సతీష్ ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో రాధ విషయమై వారు దామోదర్ను నిలదీశారు. తనకేమీ తెలియదని దామోదర్ తప్పించుకోగా, దీనిపై అనుమానం వచ్చిన రాధ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రాధ తల్లిదండ్రుల ఫిర్యాదుతో అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసిన పోలీసులు ఆరా తీశారు. దీంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తే కాలయముడుగా మారి అత్యంత కిరాతకంగా అంతమొందించటం సర్వత్రా చర్చనీయాంశమైంది. హత్యకు పాల్పడినవారిలో నలుగురిని పోలీసు లు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వేణు, గోపిలు పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ కేఆర్కే ప్రసాద్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సై శివప్రసాద్, ట్రైనీ ఎస్సై వెంకటేశ్వర్లు ఉన్నారు. -
అదృశ్యం కేసులో దోషులను శిక్షించాలి
వెంకటాపురం, న్యూస్లైన్: మండలంలోని వీఆర్కేపురం గ్రామానికి చెందిన డర్రా రాధ, డర్రా పోతురాజుల అదృశ్యం కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం వెంకటాపురంలో ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పోలీసులు ఈ కేసులో దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో వీఆర్కేపురం, చొక్కాల, ఇప్పలగూడెం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. న్యాయం చేయాలంటూ నిరసన దీక్షలు ప్రారంభం రాధ, పోతురాజుల అదృశ్యానికి కారణమైన వారికి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ రాధ, పోతురాజుల తల్లిదండ్రులు మల్లయ్య, గంగ, లక్ష్మయ్య, నాగమ్మలు వెంకటాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ళో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను వెంకటాపురం సర్పంచ్ బెజ్జరి నారాయణమ్మ ప్రారంభించి మాట్లాడారు. బాధితులకు వైఎస్సార్సీపీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తుందని ఆమె అన్నారు. ఈ నిరసన దీక్షలకు వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చిడెం శివ, సయ్యద్హుస్సేన్, కాంగ్రెస్ నాయకులు మంగాయమ్మ, సీతాదేవి, సీపీఐ నాయకులు తోట మల్లిఖార్జునరావు, సీపీఎం నాయకులు గ్యానం సారయ్య, ఏసురత్నం పాల్గొన్నారు. -
దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
విశాఖపట్నం, న్యూస్లైన్ : మహిళను బెదిరించి దోపిడీకి పాల్పడిన ఐదుగురు సభ్యుల ముఠా ను భీమిలి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కమిషనరేట్ సమావేశ మందిరంలో శు క్రవారం విలేకరుల సమావేశంలో నగ ర శాంతి భద్రతలు డీసీపీ పి.విశ్వప్రసాద్ వివరాలను వెలడించారు. పద్మనాభం మండలం రేవిడి వెంకటాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని అట్టాడ జయప్రద గత నెల 23వ తేదీ సాయంత్రం చీపురుపల్లిలోని తన బంధువుల ఇంట్లో వివాహానికి బయల్దేరారు. మహారాజుపేట జంక్షన్లో నగిశెట్టి పెద్దిరాజు(29) ఆటో విజయనగరం వెళ్తుందని చెప్పడంతో ఎక్కారు. అందులో గండిరెడ్డి గోవిందరాజు (23), నగిశెట్టి శివ (26), ధర్లామి మోహన్(20), ధాట్ల పైడిరాజు (21) ఉన్నారు. ఆటో కొంతదూరం వెళ్లాక రూటు మారటాన్ని ఆమె గమనించి ప్రశ్నించారు. వారు కత్తితో బెదిరించి మెడలోని పుస్తెలతాడు, నల్లపూసల దండ, సెల్ఫోను, ఎస్బీఐ ఏటీఎం కార్డు, పాన్కార్డు, ఓటరు ఐడీ కార్డు, ఐడెంటిటీ కార్డుతో సహా హ్యాండ్బ్యాగ్ లాక్కొన్నారు. అనంతరం ఆమెను చీరతో కట్టేసి వెళ్లిపోయూరు. తప్పించుకున్న ఆమె దగ్గరల్లోని బంధువుల ఇంటికి చేరుకుని విషయూన్ని కుటుం బసభ్యులకు సమాచారం అందించారు. వారు భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆటోడ్రైవర్ నగిశెట్టి పెద్దిరాజును ఆనందపురం ఎస్సీ కాలనీలోను. మిగిలిన నలుగురిని నగరంపాలెంలోని ఓ హోటల్లో సీఐ ఎస్.లక్ష్మణమూర్తి, ఎస్ఐ వై.అప్పారావు ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దోపిడీకి వినియోగించిన ఆటోతోపాటు అపహరించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు.