Verification
-
సర్కారు ఏడిపింఛన్!
రెండు కాళ్లూ దెబ్బ తిన్నా పింఛన్ ఇవ్వట్లేదురోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు దెబ్బ తిని పనిచేయడం లేదు. రెండు నెలలుగా పింఛన్ కోసం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్కు వచ్చి పోతున్నాను. అయినా నాకు పింఛన్ మంజూరు చేయడంలేదు. ఎస్టీ కులానికి చెందిన నాకు జీవనాధారం లేదు. దివ్యాంగుల పింఛన్ ఇప్పిస్తేనే జీవించగలుగుతా. – ప్రభాకర్, కల్యాణపురం ఎస్టీ కాలనీ, పుత్తూరు మండలం, తిరుపతి జిల్లా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు అవుతున్నా కొత్త పింఛన్లు మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లను తొలగించడానికి మాత్రం ఉరుకులు పరుగులు పెడుతోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడమే కాకుండా.. వలంటీర్ల వ్యవస్థనే లేకుండా చేసిన కూటమి సర్కారు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతోంది. తాము అధికారంలోకి రాగానే వలంటీర్ల జీతాలు రూ.10 వేలకు పెంచుతామని చెప్పి.. ఏకంగా వలంటీర్ల వ్యవస్థకే మంగళం పాడిన విషయం తెలిసిందే. వలంటీర్ల వ్యవస్థ ఉండి ఉంటే.. సచివాలయ ఉద్యోగులతో సమన్వయం చేసుకుని పింఛన్ల పంపిణీ, కొత్త పింఛన్ల నమోదు ప్రక్రియ సవ్యంగా సాగేలా శ్రద్ధ తీసుకునేది. అందుకు అవకాశమే లేకుండా చేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా పింఛన్లను తగ్గించాలా అని చూస్తున్నారు. కొత్తగా పింఛన్ కోసం 2 లక్షల మంది ఎదురు చూస్తుండటాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు. పైగా వివిధ సాకులు చూపుతూ ఈ ఆరు నెలల్లోనే ఏకంగా 1.57 లక్షల మందికి పింఛన్లు తీసేశారు. ఇది చాలదన్నట్లు అనర్హుల ఏరివేత అంటూ రాష్ట్రంలో ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్న లబ్దిదారులపై వేటు వేసేందుకు వెరిఫికేషన్ కార్యక్రమానికి సోమవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో పింఛన్ లబ్ధిదారుల అర్హత, అనర్హతలపై ప్రభుత్వం వెరిఫికేషన్ను చేపట్టనుంది. సంబంధిత సచివాలయాలనికి గానీ, అసలు మండలానికే సంబంధమే లేని.. బయటి మండలాల్లో పని చేసే మండల స్థాయి ఉద్యోగి ఒకరు, సచివాలయ ఉద్యోగి ఒకరు ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పరిశీలన చేపడతారు. ఇద్దరేసి ఉద్యోగులతో కూడిన ఒక్కో బృందం 40 మంది లబ్దిదారుల చొప్పున వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆయా సచివాలయ పరిధిలో ఉండే మొత్తం పింఛను దారుల సంఖ్య ఆధారంగా ఒక్కో సచివాలయ పరిధిలో 7 నుంచి 13 బృందాలను ఇప్పటికే ఆయా జిల్లాల డీఆర్డీఏ పీడీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో వీరపాండ్యన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఆర్డీఏ పీడీలకు ఆదేశాలు జారీ చేశారు.ఈ వ్యక్తి పేరు సీపాన ఆనందరావు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కనుగులవలస గ్రామానికి చెందిన ఇతను అంధుడు. 2019 నుంచి పింఛన్ అందుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక టీడీపీ నాయకులు ఆనందరావు దివ్యాంగుడు కాదని తప్పుడు ఫిర్యాదు చేయడంతో అతని పింఛన్ నిలుపుదల చేశారు.రిమ్స్ నుంచి 100 శాతం బ్లైండ్ అని సదరం సర్టిఫికెట్ తెచ్చుకున్నా కనికరించలేదు. ఎంపీడీవోను కలిసినా ఫలితం లేకపోయింది. మూడు నెలలుగా పింఛన్ ఆపేస్తే తన పింఛన్ రద్దయిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అన్నట్టుగానే మూడు నెలలు పూర్తయ్యాయి. పింఛన్ రద్దయింది. ఎంతగా వేడుకున్నా పింఛన్ పునరుద్ధరించడం లేదు. ఒక్క టిక్తో అంతా తారుమారువెరిఫికేషన్కు ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ను సిద్ధం చేసింది. ఈ యాప్లో అన్ని పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు సంబంధించిన ప్రశ్నలనే పేర్కొన్నారు. ఈ ప్రశ్నలకు వెరిఫికేషన్ చేసే ఉద్యోగి ‘అవును’/ ‘కాదు..లేదు’ అని నమోదు చేయాల్సి ఉంటుంది. చివరగా ‘మీరు ఈ పింఛనుదారునికి పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా?’ అన్న ప్రశ్నకు ‘అవును’/ ‘లేదు’ అని స్పష్టంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క ‘టిక్’తో పేద పింఛన్ లబ్ధిదారుల తలరాత పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఉద్యోగి అడిగే ప్రశ్నలు ఇలా ఉంటాయి.1. లబ్ధిదారుని కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేల లోపు ఉందా?2. పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా?3. నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నారా?4. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా?5. విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉందా?6. కుటుంబానికి పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా?7. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా?8. కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నారా?9. మీరు ఈ పింఛనుదారునికి పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా? రాజకీయ పైరవీలకు చోటు గత ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసే సమయంలో దరఖాస్తుదారుడు నిబంధనల ప్రకారం అర్హుడా, కాదా.. అన్నది స్థానిక సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయి పరిశీలనలో నిర్ణయించేవారు. ఆపై ఆన్లైన్ ప్రక్రియలో కూడా అన్ని ప్రభుత్వ శాఖల వద్ద ఉండే సమాచారంతో సరిపోల్చుకోవడానికి ఆరు దశల పరిశీలన (సిక్స్ స్టెప్ వ్యాల్యుడేషన్) జరిపేవారు. ఆ తర్వాత పింఛన్ మంజూరు చేసేవారు. అయితే, ఇప్పుడు వెరిఫికేషన్లో ఆ లబి్ధదారుడు పింఛను మంజూరు అర్హత నిబంధనల ప్రకారం అర్హుడా, కాదా.. అన్నది వెరిఫికేషన్ ఉద్యోగి నిర్ణయిస్తారు. ప్రభుత్వం అనర్హుల గుర్తింపు పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడంలోనే ఏదో మతలబు ఉందని అందరూ అనుమానిస్తున్నారు. ప్రస్తుత పింఛన్ల వెరిఫికేషన్ ప్రక్రియలో పాల్గొనే ఉద్యోగులపై ఆయా ప్రాంతాల్లో అధికార కూటమి పార్టీల నేతల ప్రభావం, ఒత్తిడి ఉంటుందని.. దీంతో అర్హులైన లబ్దిదారులను కూడా అనర్హులుగా నమోదు చేసే అవకాశాలు లేకపోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు నెలల్లో 1.57 లక్షల పింఛన్లు తగ్గుదలరాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఇచ్చే పింఛన్ల సంఖ్య నెల నెలకూ తగ్గిపోతోంది. ఈ ఏడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా, డిసెంబర్ నెలకు వచ్చే సరికి 63,92,702 మంది లబ్దిదారులకు మాత్రమే పింఛన్ డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. అంటే కేవలం ఆరు నెలల్లోనే 1,57,162 మేర పింఛన్లు తగ్గిపోయాయి. సెపె్టంబర్లో 22,601, అక్టోబర్లో 24,710, నవంబర్లో 21,472.. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో 88,379 పింఛన్లు తగ్గిపోయాయి. 2 లక్షల మంది వెయిటింగ్.. కొత్తగా దరఖాస్తులకు అవకాశమే లేదు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పింఛన్ల మంజూరు కోసం కొత్తగా ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ సేవలు సైతం పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో.. అర్హులు ఏడాదిలో ఏ రోజైన తమ ఊరిలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆ సేవలు పని చేయడం లేదు. ఈ ఏడాది జనవరిలో అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త పింఛను మంజూరు చేసిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ కొత్త పింఛన్లే మంజూరు కాలేదు. గత ఐదేళ్ల కాలంలో పింఛన్ల పంపిణీ అమలు చేసిన విధానాల ప్రకారం ఈ ఏడాది జూలైలోనే కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సి ఉంది. ఈ ఏడాది జనవరిలో అప్పటి దాకా కొత్తగా గుర్తించిన పింఛన్ లబ్దిదారులందరికీ పింఛన్ల డబ్బుల పంపిణీ మొదలు కాగా.. ఆ తర్వాత జనవరి నుంచి మార్చి 16న ఎన్నికల నోటిఫికేషన్ వరకు ‘ఏపీ సేవ’ అనే ఆన్లైన్ వెబ్పోర్టల్ ద్వారా కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగింది. ఆ సమయంలో దాదాపు రెండు లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. దయలేకుండా తొలగించారయ్యా.. దివ్యాంగుడని కూడా చూడకుండా నా పింఛన్ తొలగించారు. నేనేం పాపం చేశానో తెలియడం లేదు. మూడు నెలల క్రితం నా పింఛన్ తొలగించారు. ఈ కుట్ర ఎవరు చేశారో ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. దివ్యాంగుడైన నాకు పింఛన్ పొందేందుకు అన్ని అర్హతలున్నాయి. డాక్టర్ ఇచ్చిన సదరం సర్టిఫికెట్ కూడా ఉంది. నేను ఎలాంటి పనులు చేయలేను. నాకొచ్చే పింఛన్ సొమ్ముతోనే నా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. పింఛన్ ఆపేయడంతో తినడానికి కూడా కష్టంగా ఉంది. నాకు జరిగిన అన్యాయంపై ఇటీవల శ్రీరంగరాజపురం మండల కార్యాలయం వద్ద కుటుంబంతో నిరసన తెలిపాను. ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని విన్నవించినా పట్టించుకోలేదు. నాకేమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – హేమాద్రి, దివ్యాంగుడు, శ్రీరంగరాజపురం మండలం, చిత్తూరు జిల్లా పింఛన్ ఇప్పించండి సారూ.. మా బిడ్డ హరీష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. పేద కుటుంబానికి చెందిన మేము మా బిడ్డ వైద్య ఖర్చుల కోసం ప్రతి నెలా రూ.7 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో అప్పుల బాధలతో ఇబ్బందులు పడుతున్నాం. మా బిడ్డకు పింఛన్ మంజూరు చేయండి. – ఏ.హరీష్ తల్లిదండ్రులు, కల్యాణపురం ఎస్టీకాలనీ, పుత్తూరు మండలం, చిత్తూరు జిల్లాఅర్హత ఉన్నా అందని పింఛన్ వైజాగ్ జీవీఎంసీ 47వ వార్డు కంచరపాలెం కొండవాలు ప్రాంతం జయప్రకాష్ నగర్లో టి.సునీత అనే మూగ–వినికిడి లోపం గల మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసినా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. జీవీఎంసీ జోన్–5 పరిధిలో యూసీడీ అధికారులకు ఎన్నోసార్లు పింఛన్ కోసం విన్నవించగా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యం వహించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో దరఖాస్తు చేసి కాళ్లు అరిగేలా తిరిగినా ప్రయోజనం కనిపించలేదని సునీత సైగలా ద్వారా వాపోతోంది. ప్రభుత్వం సదరం సర్టిఫికెట్ జారీ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
ఫేక్ వెబ్సైట్లకు చెక్.. గూగుల్లో కొత్త ఫీచర్
Google Badges: మనకు ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ చేసేస్తాం. అలా సెర్చ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఫేక్ వెబ్సైట్ కూడా దర్శనమిస్తుంటాయి. తెలియనివారు వీటితో నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో యూజర్ల భద్రత కోసం గూగుల్ సరికొత్త ఫీచర్ను తీసుకొస్తోంది.ఫేస్బుక్, వాట్సాప్, ‘ఎక్స్’ (ట్విటర్) వంటి వాటిలో ప్రసిద్ధమైన వెరిఫికేషన్ బ్యాడ్జ్లను గూగుల్ కూడా తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. గూగుల్ సెర్చ్ ఫలితాల్లో ఇప్పటికే ఈ తేడాను చూడవచ్చు. అధికారిక మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ వెబ్సైట్లకు లింక్ల పక్కన బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తుంది.ప్రముఖ కంపెనీల అధికారిక ఖాతాలను గుర్తించేందుకు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ ప్రకటించింది. ధ్రువీకరణ చిహ్నాలు (Google Badges) ఇప్పుడు కొన్ని పరిశ్రమలలోని ప్రముఖ కంపెనీల వెబ్ అడ్రస్ పక్కన కనిపిస్తాయి. దీంతో ఫేక్ వెబ్సైట్లను యూజర్లు సులభంగా గుర్తించగలరు. ఇందుకోసం ఆటోమేటెడ్ సిస్టమ్స్ను ఉపయోగిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. -
ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల గోల్ మాల్
-
మా సందేహాలు ఈసీ నివృత్తి చేయలేదు: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయనగరం: మా సందేహాలను ఎలక్షన్ కమిషన్ నివృత్తి చేయలేదని వైఎస్సార్సీపీ నేతలు బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పల నర్సయ్య అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మాక్ పోలింగ్ రీ-వెరిఫికేషన్ అనేది మా ఫిర్యాదు అంశం కాదు. పోలింగ్ నాటి బాటరీని వెరిఫికేషన్ చేయమని కోరాం. దాన్ని వెరిఫికేషన్ చేయడానికి ఈసీ ఆదేశాలు ఇవ్వలేదని జిల్లా కలెక్టర్ చెప్పారు’’ అని వారు పేర్కొన్నారు.ఫిర్యాదు చేసిన ఈవీఎంలో డేటాను తొలగించి డమ్మీ గుర్తులు లోడ్ చేశారు. విచారణలో వుండగా ఈవీఎం డేటాను డిలీట్ చేయడం నేరం. కోర్టుకు ఆధారాలు లేకుండా చేశారు. ఈసీ తీరుపై మేం కోర్టుకు న్యాయం కోసం వెళ్తాం. దేశమంతా ఈవీఎంలు టెంపర్ జరిగాయని అనుమానిస్తుంది. ఈ అనుమానాలను బీజేపీ ప్రభుత్వం నివృత్తి చేయాలి’’ అని బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పల నర్సయ్య డిమాండ్ చేశారు.కాగా, విజయనగరం ఎంపీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.. ఈవీఎం బ్యాటరీ అంశంపై డిక్లరేషన్ ఇవ్వలేమన్న జిల్లా కలెక్టర్.. ఈసీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ చేస్తామనన్నారు. తమ దరఖాస్తులో మాక్ పోలింగ్ కోరలేదని.. కోరకుండా మాక్ పోలింగ్ చేయడం ఏమిటని బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పలనర్సయ్య ప్రశ్నించారు. ఈసీ, జిల్లా అధికారుల తీరుపై అనుమానాలు మరింత బలపడాయి. ఎన్నికల ఈవీఎంల అక్రమాలు బయటపడకుండా కుంటిసాకులు చెప్పి దరఖాస్తు చేసిన అభ్యర్ధులను జిల్లా యంత్రాంగం తప్పు దారి పట్టిస్తోంది. కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోండని వెరిఫికేషన్ కేంద్రం నుంచి కలెక్టర్ వెళ్లిపోయారు. -
విజయనగరం: నిలిచిపోయిన ఈవీఎంల రీ-వెరిఫికేషన్
Updatesవిజయనగరం ఎంపీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయిందిఈవీఎం బ్యాటరీ అంశంపై డిక్లరేషన్ ఇవ్వలేమన్న జిల్లా కలెక్టర్ఈసీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ చేస్తామన్న కలెక్టర్మా దరఖాస్తులో మాక్ పోలింగ్ కోరలేదు. కోరకుండా మాక్ పోలింగ్ చేయడం ఏమిటని ప్రశ్నించిన బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పలనర్సయ్య.ఈసీ,జిల్లా అధికారుల తీరుపై మరింత బలపడిన అనుమానాలు.ఎన్నికల ఈవీఎంల అక్రమాలు బయటపడకుండా కుంటిసాకులు చెప్పి దరఖాస్తు చేసిన అభ్యర్ధులను తప్పు దారి పట్టిస్తున్న జిల్లా యంత్రాంగం.కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోండని వెరిఫికేషన్ కేంద్రం నుండి వెళ్లిపోయిన జిల్లా కలెక్టర్ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో నిలిచిపోయిన ఈవీఎంల రీ-వెరిఫికేషన్మాక్ పోలింగ్కు అంగీకరించని వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్బ్యాటరీ స్టేటస్ మాత్రమే వెరిఫై చేయాలని చంద్రశేఖర్ పట్టుజిల్లా కలెక్టర్కు సమాచారం ఇచ్చిన ఆర్డీవో సూర్యకళవెరిఫికేషన్ కేంద్రానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రారంభం అయింది. నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి చెందిన 2 ఈవీఎంలను ఎన్నికల అధికారులు రీ వెరిఫికేషన్ ప్రారంభించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ హాజరయ్యారు.నెల్లిమర్ల నియోజకవర్గం కొండ గుంపాం, బొబ్బిలి నియోజక వర్గం కోమటపల్లి ఈవీఎంలు అభ్యర్థుల సమక్షంలో వెరిఫికేషన్ చేస్తారు. ఈవీఎం బాటరీ స్టేటస్పై వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. బెల్లాన చంద్రశేఖర్ అభ్యర్థనతో ఈవీఎంల రీ వెరిఫికేషన్ను చేస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.ఈవీఎం బ్యాటరీల్లో గోల్ మాల్ఈవీఎం తనిఖీల్లో అడ్డంగా ఈసీ దొరికిపోయింది. గజపతినగరం బూత్ నంబర్ 20 ఈవీఎం తనిఖీల్లో లోగుట్టు బయటపడింది. పోలింగ్ నాడు 50 శాతం.. కౌంటింగ్ నాడు 99 శాతం ఛార్జింగ్ కనిపించింది. 84 రోజుల తరువాత తనిఖీ నాడు కూడా ఈవీఎం బ్యాటరీ 99 శాతం చార్జింగ్ చూపించింది. ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు పెరిగిందో ఈవీఎం తయారీ ఇంజనీర్లు, ఎన్నికల అధికారులు వెల్లడించలేదు.దత్తిరాజేరు మండలంలోని పెదకాడ ఈవీఎంని అధికారులు తనిఖీ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య ఫిర్యాదుతో ఈవీఎం వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ కోసం ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ 9 గంటల పాటు నిర్వహిస్తే ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ 80 శాతానికి తగ్గింది. మరి పోలింగ్ జరిగిన ఈవీఎంలో 99 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా ఉందో అధికారులు చెప్పలేదు. ఈవీఎంలో డేటాను అధికారులు తొలగించారు. ఈవీఎం వీవీ ప్యాట్లను అధికారులు మాయం చేశారు. ఈవీఎంలో ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండా అధికారులు మాక్ పోలింగ్ చేపట్టారు. ఈవీఎం భద్రపరచిన తాళాలను అధికారులు పోగొట్టారు. మూడు గంటల తర్వాత స్పేర్ తాళం తెచ్చి తెరిచారు. ఈవీఎం కౌంటింగ్ హాల్ టేబుల్ సీసీ కెమెరా ఫుటేజీని అధికారులు ఇవ్వకపోవటం గమనార్హం. చదవండి: ఈవీఎంలు ఇక్కడ.. తాళాలు ఎక్కడ? -
గజపతినగరం... ఇక్కడా మాక్ పోలింగ్తోనే ఈసీ సరి!
సాక్షి, విజయనగరం: గజపతినగరం నియోజకవర్గంలో ఈవీఎం తనిఖీ అనుమానాస్పదంగా మారింది. గజపతినగరం అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్లపై వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. పోలింగ్ బూత్ నంబర్ 20, పెదకాద ఈవీఎం తనిఖీ చేయాలని, వీవీప్యాట్ లెక్కించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వైఎస్సార్సీపీ ఫిర్యాదుకు సంబంధం లేకుండా అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించడం వివాదస్పదంగా మారింది.పెదకాద ఈవీఎంలో డేటా మొత్తం అధికారులు తొలగించారు. వీవీప్యాట్ బాక్స్లోనూ వీవీప్యాట్లు కనిపించలేదు. ఈవీఎంలో డేటా తొలగించి కొత్త గుర్తులను లోడ్ చేశారు. అయితే కొత్త గుర్తులతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ అడిగిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రం సీసీ ఫుటేజ్, బాటరీ లెవెల్ డేటాను ఎన్నికల అధికారులు ఇవ్వలేదు.దీంతో ఒంగోలు తరహాలోనే మాక్ పోలింగ్తో అధికారులు డ్రామా నడిపిస్తున్నట్లు ఆరోపణలు వస్తన్నాయి. కొత్త గుర్తులతో 1400 ఓట్లు మాక్ పోలింగ్ జరిగింది. ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండానే మాక్ పోలింగ్ నిర్వహణ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
Big Question: ఒట్టు.. ఉంది లోగుట్టు.. . ఈవీఎం డేటా డిలీట్..!?
-
నిలిచిపోయిన ఈవీఎం వెరిఫికేషన్
-
మాక్ పోలింగ్ వెరిఫికేషన్ ఏర్పాట్లపై బాలినేని అభ్యంతరం
-
వీవీప్యాట్ కూడా లెక్కించాల్సిందే!.. బాలినేని తరఫు ప్రతినిధుల వాకౌట్
ప్రకాశం, సాక్షి: ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంల వెరిఫికేషన్ వేళ.. ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టులో తన రిట్ పిటిషన్ విచారణ జరుగుతుండగానే... అధికారులు రీ చెక్ చేస్తుండడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తరఫున ప్రతినిధులు బయటకు వచ్చేయగా.. దీంతో అధికారులు రీ వెరిఫికేషన్ ప్రక్రియను నిలిపివేశారు.ఈవీఎంలను మాక్ పోలింగ్ పద్ధతిలో వేరిఫికేషన్ చేస్తామని అధికారులు చెప్పడాన్ని తొలి నుంచి బాలినేని వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు కూడా. అయినప్పటికీ అధికారులు ముందుకు వెళ్లారు. ఇవాళ రీ చెకింగ్ సందర్భంగా ఆయన తరపున ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు సైతం లెక్కపెట్టాలని ఎన్నికల అధికారుల్ని కోరారు. అయితే.. అలా కుదరదని అధికారులు చెప్పడంతో బాలినేని ప్రతినిధులు బయటకు వచ్చేశారు. దీంతో.. వేరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. మరోవైపు.. రిట్ విచారణ రేపటికి..ఈవీఎంల వేరిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో బాలినేని వేసిన రిట్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. మాక్ పోలింగ్ పద్ధతి నిలిపివేసి , సుప్రీంకోర్టు ఉత్వర్వుల ప్రకారం ఈవీఎం చెక్ అండ్ వేరిఫికేషన్, వీవీప్యాట్ లెక్కింపును కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారాయన. ఈ క్రమంలో ఇవాళ్టి విచారణ సందర్భంగా.. ఈసీ మాక్ పోలింగ్ చేస్తోందని బాలినేని తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా చేయడం సరికాదని బాలనేని లాయర్ వాదించారు. దీంతో.. ఈసీ తరఫు న్యాయవాది రేపు వాదనలు వినిపిస్తామని చెప్పడంతో విచారణను రేపటికి హైకోర్టు వాయిదా వేసింది. ఆ 12 బూత్లలో.. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల్లో అవకతవకలపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని 12 బూత్లలో ఈవీఎంల వెరిఫికేషన్, వీవీప్యాట్ల లెక్కింపు చేసి.. ఫలితాలతో సరిపోల్చాల్సిందిగా ఆయన ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం నుంచి ఆరురోజుల పాటు రోజుకు రెండు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను పరిశీలించాల్సి ఉంది.డమ్మీ బ్యాలెట్ను ఏర్పాటు చేసి ఫిర్యాదుదారుల(అభ్యర్థులు లేదంటే వారి ప్రతినిధులు) సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఈవీఎంలకు సంబంధించిన బెల్ కంపెనీ ఇంజనీర్ల సమక్షంలో ఈవీఎంల పరిశీలన జరగనుంది. -
ITR Filing: ఇది చేయకపోతే రూ.5 వేలు పెనాల్టీ!
ఇది జూలై నెల. ట్యాక్స్ పేయర్లు అందరూ ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. జూలై 31 చివరి తేది దగ్గర పడుతోంది. అన్ని పత్రాలను సేకరించుకుని ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత దానిని 30 రోజులలోపు ధ్రువీకరించడం చాలా ముఖ్యం. మీరు దీన్ని సమయానికి చేయకపోతే పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది.వెరిఫికేషన్ ఎలా చేయాలంటే..ఆధార్-ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా ప్రీ వ్యాలిడేటెడ్ బ్యాంక్ ఖాతా/డీమ్యాట్ ఖాతా ద్వారా రిటర్న్ను ఈ-వెరిఫై చేయడం ఐటీఆర్ వెరిఫికేషన్కు సులభమైన మార్గం. ఆన్లైన్ వెరిఫికేషన్ సౌకర్యంగా లేకుంటే, ఐటీఆర్-వీ భౌతిక కాపీని బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)కి పంపవచ్చు. అయితే, ఇది ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ పూర్తయ్యాక విజయవంతమైనట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు సందేశం వస్తుంది. దీంతో పాటు ట్రాన్సాక్షన్ ఐడీ వస్తుంది. అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి కూడా ఈమెయిల్ వస్తుంది.తప్పితే జరిమానా కట్టాల్సిందే..ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం, 30 రోజులు దాటినా వెరిఫికేషన్ చేయకపోతే సెక్షన్ 234ఎఫ్ కింద ఆలస్య రుసుములను చెల్లించవలసి ఉంటుంది. 2024 మార్చి 31 నాటి CBDT (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) నోటిఫికేషన్ నం. 2/2024 ప్రకారం, ఇతర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. 5 లక్షల వరకు ఆదాయానికి ఆలస్య రుసుము రూ. 1,000, రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయానికి రూ. 5,000 పెనాల్టీ చెల్లించవలసి ఉంటుంది. -
ఈవీఎంలు వెరిఫికేషన్ చేయండి..
-
ఆన్లైన్లో పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఇలా..
పర్మినెంట్ అకౌంట్ నంబర్ లేదా పాన్ కార్డు అనేది దేశంలో ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది పన్ను సంబంధిత ప్రయోజనాలకు, గుర్తింపు రుజువుగానూ పనిచేస్తుంది. ప్రతి పాన్ కార్డు ప్రత్యేకమైన పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ సంఖ్యను కలిగి ఉంటుంది. దీన్ని ఆదాయపు పన్ను శాఖ లామినేటెడ్ కార్డు రూపంలో జారీ చేస్తుంది.ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు, ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఏ ఉత్తరప్రత్యుత్తరాలపై పాన్ కార్డు నంబరును కోట్ చేయడం తప్పనిసరి. 2005 జనవరి 1 నుంచి ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన చెల్లింపులకు చలాన్లపై పాన్ కోట్ చేయడం తప్పనిసరి. ఈ క్రింది ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లలో పాన్ ను కోట్ చేయడం కూడా తప్పనిసరి. దీని కోసం పాన్ కార్డును ఎప్పటికప్పుడు వెరిఫై చేయాల్సి ఉంటుంది.ఆన్లైన్లో పాన్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియస్టెప్ 1: ఇన్కమ్ ట్యాక్స్ 'ఈ-ఫైలింగ్' పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి.స్టెప్ 2: 'క్విక్ లింక్స్' సెక్షన్ నుంచి 'వెరిఫై యువర్ పాన్ డీటెయిల్స్' హైపర్ లింక్పై క్లిక్ చేయండి.స్టెప్ 3: పాన్, పూర్తి పేరు (పాన్ ప్రకారం), పుట్టిన తేదీ ఎంటర్ చేసి 'స్టేటస్'పై క్లిక్ చేయండిస్టెప్ 4: ఇమేజ్లో ఉన్న విధంగా క్యాప్చా ఎంటర్ చేసి మీ పాన్ వివరాలను ధ్రువీకరించడానికి 'సబ్మిట్' పై క్లిక్ చేయండి. -
జీఎస్టీ నమోదుకు ఆధార్ బయోమెట్రిక్!
న్యూఢిల్లీ: జీఎస్టీ నమోదుకై ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణను ఆంధ్రప్రదేశ్, గుజరాత్తోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి. ఈ నెల ప్రారంభంలో జరిగిన సెంట్రల్, స్టేట్ జీఎస్టీ అధికారుల మూడవ జాతీయ సమన్వయ సమావేశంలో బయోమెట్రిక్ ఆధారిత ధ్రువీకరణపై చర్చించారు. జీఎస్టీ నమోదు కోసం ఆధార్ బయోమెట్రిక్ ప్రమాణీకరణను అమలు చేయడానికి తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు సైతం ఆసక్తి చూపుతున్నాయని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ విధానం అమలుకు అయ్యే ఖర్చు, మౌలిక సదుపాయాలు, మానవ వనరుల అవసరాన్ని ఈ రాష్ట్రాలు అంచనా వేయాలని అనుకుంటున్నాయని తెలిపారు. అందుకు కావాల్సిన సమాచారం అందించామని, మూల్యాంకనం ఆధారంగా ఈ రాష్ట్రాలు ఆమోదం కోసం రాష్ట్ర క్యాబినెట్ ముందు ప్రతిపాదనను ఉంచాల్సి ఉంటుందన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారులు ప్రస్తుతం రిజిస్ట్రేషన్లో భాగంగా దరఖాస్తుదారుల గుర్తింపును నిర్ధారించడానికి ఓటీపీ ఆధారిత ఆధార్ ధ్రువీకరణను ఉపయోగిస్తున్నారు.ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం బూటకపు సంస్థలను సృష్టించడం ద్వారా ఇతరుల గుర్తింపును దుర్వినియోగం చేసిన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ (సీబీఐసీ) బయోమెట్రిక్ ప్రామాణీకరణ అమలు చేయాలని నిర్ణయించింది. కొన్ని అనుమానాస్పద సందర్భాల్లో రిజిస్ట్రేషన్ కోరుకునే వ్యక్తిని బయోమెట్రిక్లను ధృవీకరించుకోవడానికి ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తారు. -
వీవీప్యాట్ స్లిప్పుల క్రాస్చెక్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లలో వేసిన మొత్తం ఓట్ల వీవీప్యాట్ స్పిప్పులు వెరిఫై చేయాలని వేసిన పిటిషన్లపై బుధవారం(ఏప్రిల్24) మరోసారి విచారణ జరిపిన అత్యున్నత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగసంస్థ అయిన ఎన్నికల కమిషన్ ఏ పనిచేయాలన్నది తాము సూచించలేమంది. ఎన్నికల్లో మొత్తం వీవీప్యాట్ స్లిప్పుల వెరిఫికేషన్పై సుప్రీంకోర్టు బుధవారమే తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే ఈ విషయంలో తమకు ఉన్న పలు సందేహాలపై న్యాయమూర్తులు ఈసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తీర్పు రిజర్వు చేశారు. -
518 ఎకరాలు.. హాంఫట్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అవి పంటలు పండించుకుని జీవనాధారం పొందేందుకు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు.. క్రయ విక్రయాలు, వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేని భూములు.. కానీ ధరణి పోర్టల్లో రికార్డులను తారుమారు చేశారు. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చేశారు. దీనితో ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా 518 ఎకరాల అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపో యాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకున్న ఈ భూదందా.. తాజాగా ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం, రెండు జాతీయ రహదారులు, ఐఐటీ ఉండటంతో కంది మండలంలో భూముల ధర ఎకరా రూ.ఐదు కోట్ల వరకు పలుకుతోంది. అంటే అక్రమాలు జరి గిన 518 ఎకరాల భూముల విలువ రెండున్నర వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. 11 గ్రామాల పరిధిలో.. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల వెరిఫి కేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయి, ఎక్కడైనా అన్యా క్రాంతం అయ్యాయా? వాటి రికార్డుల పరిస్థితే మిటనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ స్థాయి అధికారులకు ఒక్కో మండలం చొప్పు న బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలోనే కంది మండలం పరిధిలోని 11 గ్రామాల్లో 518 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా భూము లుగా రికార్డులను మార్చేసినట్టు తేలింది. అత్య ధికంగా బ్యాతోల్లో 181 ఎకరాలు, చిద్రుప్ప లో 154 ఎకరాలు, జుల్కల్లో 57 కాశీపూర్లో 41 ఎకరాలు, ఉత్తర్పల్లిలో 17 ఎకరాలు మిగ తాచోట్ల కలిపి 68 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను మార్చేసినట్టు గుర్తించారు. ఈ మండలంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. మరో ఆరు గ్రామాల రికార్డులను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వాటిలోనూ తని ఖీ పూర్తయితే.. మరిన్ని అక్రమాలు వెలుగు లోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. ధరణి పోర్టల్లో మార్చేసి.. అధికారులు, దళారులు కుమ్మక్కై ధరణి పోర్ట ల్ను ఆసరాగా చేసుకుని ఈ భూదందాకు తెరలేపారు. అసైన్డ్భూములను ధరణి పోర్టల్లో పట్టా భూము లుగా మార్చేశారు. ఈ మేరకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు. తర్వాత ఆ పాసు పుస్తకాల ఆధారంగా.. చాలావరకు భూముల క్రయవిక్రయాలు చేతులు మారాయి. బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రాజకీయ నేతలు, బడాబాబులకు భూములు దక్కేలా చేసిన కొందరు రెవెన్యూ అధికారులు భారీగా దండుకున్నారని.. కోట్లకు పడగలెత్తారని ఆరోపణలు ఉన్నాయి. వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది కలెక్టర్ ఆదేశాల మేరకు కంది మండలంలో ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాం. భూములకు సంబంధించిన రికా ర్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. అసైన్డ్ భూములను పట్టాభూములుగా మార్చి నట్టు గుర్తించాం. అన్ని గ్రామాల్లో వెరిఫి కేషన్ పూర్తిచేసి నివేదిక ఇస్తాం. – విజయలక్ష్మి, కంది మండల తహసీల్దార్. -
స్టాఫ్నర్స్ ప్రొవిజినల్ మెరిట్ జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్నర్స్ పోస్టుల మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మేంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీన విడుదల చేసిన రాత పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఈ జాబితాను ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. మొత్తం స్టాఫ్నర్స్ పోస్టులకు 40,936 మంది దరఖాస్తు చేశారు. అందులో 38,674 మంది రాత పరీక్ష రాశారు. వారిలో నుంచి 8,892 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్కు పిలిచినట్లు ఆయన వివరించారు. శనివారం (30వ తేదీ) నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని చెప్పారు. వెరిఫికేషన్ ఎక్కడంటే.. ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ (ఈస్ట్), 120/పీ, సెయింట్ మైకేల్స్ కాలనీ, అభ్యుదయన గర్, అభ్యుదయ నగర్ కాలనీ, బండ్లగూడ జాగీర్, హైదరాబాద్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. దరఖాస్తుదారులు ఒరిజినల్ సర్టిఫికె ట్లు, డాక్యుమెంట్లతోపాటు వాటికి సంబంధించి రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలి. అలాగే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తు ఫారమ్ పీడీఎఫ్ను వెంట తీసుకొని రావాలి. ఎవరెవరు ఏయే సర్టిఫికెట్లు తేవాలంటే.. ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ రుజువు సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ వర్తించేవారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కమ్యూనిటీ సర్టిఫికెట్ తీసుకురావాలి. నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ అందించని బీసీలను ఓసీలుగా పరిగణిస్తారు. ఈడబ్ల్యూఏఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసే అభ్యర్థులు తాజా ఆదాయ ధ్రువీకరణపత్రం తీసుకురావాలి. స్పోర్ట్స్ కేటగిరీ కింద రిజర్వేషన్ను క్లెయిమ్ చేసే వారు స్పోర్ట్స్ సర్టిఫికెట్ తీసుకురావాలి. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ తీసుకురావాలి. స్థానికతను తెలిపే సర్టిఫికెట్లు, జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటో వెంట తీసుకొని రావాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు తేకుంటే అభ్యర్థిత్వం రద్దు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాకపోవడం లేదా ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోతే వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తారు. ప్రొవిజినల్ జాబితా ఎంపిక జాబితా కాదని గోపీకాంత్రెడ్డి స్పష్టం చేశారు. కాగా, 7,094 స్టాఫ్నర్స్ పోస్టులను భర్తీ చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు వచ్చిన వారిలో అనర్హులుండి, పోస్టుల కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధిస్తే, తమ వద్ద ఉన్న అర్హుల జాబితా నుంచి మరికొందరిని పిలుస్తామని ఆయన తెలిపారు. నిర్ణీత రోజుల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయం... ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే ఆరో తేదీ వరకు ప్రతి రోజూ మూడు సెషన్లలో సర్టిఫికెట్ల వెరిఫి కేషన్ నిర్వహిస్తారు. ప్రతీ సెషన్లో 400 నుంచి 500 మంది సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఈ మేర కు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. మొదటి సెషన్: ఉదయం 9.15 నుంచి 11.15 గంటల వరకు రెండో సెషన్: మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మూడో సెషన్: మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు -
ఇదేమి పని ‘నారాయణా’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నారాయణ విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీడీపీ ఎన్నికల ఉచ్చులో ఇరుక్కున్నారు. తమ విద్యాసంస్థల అధినేత, టీడీపీకి చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ రాజకీయంలో సమిధలైపోతున్నారు. వారి చేత నారాయణ ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న నారాయణ సిబ్బంది, ఉపాధ్యాయులకు ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగిస్తున్నారు. మూడురోజుల క్రితమే నెల్లూరు నగరం మూలాపేట డివిజన్లో ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్న నారాయణ సంస్థ ఉద్యోగినికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తాజాగా మంగళవారం నగరంలోనే 42వ డివిజన్ మన్సూర్నగర్లో ఇదే తరహాలో నారాయణ విద్యా సంస్థల ఉపాధ్యాయుడు ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండగా స్థానికులు ఆగ్రహించి అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎన్ టీంగా ఏర్పాటు నారాయణ టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఆయన 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి మరోసారి బరిలోకి దిగేందుకు సమాయత్తం అవుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు నెల్లూరుకు ముఖం చాటేసిన ఆయనపై టీడీపీ కేడర్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఆయన కోసం పనిచేయడానికి టీడీపీ నేతలెవరూ ముందుకు రావడంలేదు. దీంతో తన విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రంగంలోకి దింపుతున్నారు. దాదాపు 150 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులతో నారాయణ టీం (ఎన్ టీం)గా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆ బృందంలోని వారితో నెల్లూరు నగరంలో ఓటర్ల వెరిఫికేషన్ పేరుతో ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకుంటున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా సమాచారం, వారి మొబైల్కు వచ్చే ఓటీపీని కూడా అడుగుతుండడంతో స్థానికుల్లో ఆందోళన ఏర్పడింది. తమ ఓట్లు తొలగిస్తారని స్థానికులు వారిని అడ్డుకుంటున్నారు. నెల్లూరు నగరంలో మూడు రోజుల్లోనే ఇద్దరు ఉపాధ్యాయులు దేహశుద్ధి చేయించుకొన్నారు. ఇదేం ఖర్మ నారాయణా.. అంటున్న ఉద్యోగులు నారాయణ విద్యా సంస్థల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులుగా అనేక మంది పనిచేస్తున్నారు. 2014 ఎన్నికల వరకు నారాయణ టీడీపీకి ఆర్థికంగా తోడ్పాటు అందిçస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు బినామీగా వ్యవహరించేవారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో నారాయణను చంద్రబాబు ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నారాయణ సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులను రాజకీయ ఉచ్చులోకి దింపుతున్నారు. ఒకవేళ ఎవరైనా నిరాకరిస్తే ఏదో ఒక సాకుతో ఉద్యోగం నుంచి తొలగించడం.. లేదా దూర ప్రాంతాలకు బదిలీ చేయడం చేస్తున్నట్లు ఓ ఉద్యోగి వెల్లడించారు. ఇప్పుడు ఉద్యోగులు ప్రజల చేతిలో తన్నులు తింటున్నారు. మాకు ఇదేం ఖర్మ అంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులపై భారీ కసరత్తు
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. అసైన్డ్ రైతులకు హక్కులిచ్చేందుకు అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించిన ప్రభుత్వం దాన్ని అమలు చేసే దిశగా వేగంగా అడుగులేస్తోంది. అందులో భాగంగా జిల్లాల్లో అసైన్డ్ భూముల లెక్కలు తేల్చేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చురుగ్గా వెరిఫికేషన్ జరుగుతోంది. ఈ ఏడాది జూలై 31 నాటికి అసైన్ చేసి 20 ఏళ్లు పూర్తయిన భూముల వివరాలను వీఆర్వోలు తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికంగా 27.41 లక్షల ఎకరాలపై హక్కులివ్వాలని ఇప్పటికే నిర్ణయించగా క్షేత్ర స్థాయిలో ఆ భూములను పరిశీలిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో నిశిత పరిశీలన.. ప్రతి రెవెన్యూ గ్రామంలో అసైన్డ్ భూములు అసైన్దారుల చేతుల్లో ఉన్నాయా, లేదా అనే విషయాన్ని వీఆర్వోలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతి సర్వే నంబర్కు సంబంధించిన పట్టాను పరిశీలించి ఆ పట్టాదారు ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తా లేక అతని వారసుడా? అనే విషయాన్ని నమోదు చేస్తున్నారు. సంబంధిత భూమి వారి ఆధీనంలోనే ఉందా? రెవెన్యూ రికార్డుల ప్రకారం.. ఆ భూమి లంక భూమా? లేక నీటి వనరులకు సంబంధించిన భూమా? ఆ భూమి అతనికి ప్రభుత్వం ఎప్పుడు అసైన్ చేసింది? వంటి వివరాలను సేకరిస్తున్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి డీకేటీ రిజిస్టర్లు, 1బీ అడంగల్, 22ఎ జాబితా, ఇతర రెవెన్యూ రికార్డులు చూసి వాటికి తగ్గట్టు క్షేత్ర స్థాయి పరిస్థితి ఉందా లేదా?, వాస్తవ పరిస్థితి ఏమిటనే విషయాలను నమోదు చేస్తున్నారు. 4 వేల గ్రామాల్లో పూర్తి.. ఇప్పటివరకు 4 వేల గ్రామాల్లోని 8 లక్షల ఎకరాల్లో వీఆర్వోలు వెరిఫికేషన్ పూర్తి చేశారు. తహశీల్దార్లు 2,600 గ్రామాల్లో తనిఖీలు పూర్తి చేయగా, ఆర్డీవోలు వెయ్యికి పైగా గ్రామాల్లో, జేసీలు 150కిపైగా గ్రామాల్లో వెరిఫికేషన్ ముగించారు. దీంతో తనిఖీలు పూర్తయిన గ్రామాల్లో తహశీల్దార్లు అసైన్డ్ భూముల జాబితాలను తయారు చేస్తున్నారు. వీఆర్వోలు, తహశీల్దార్ల స్థాయిలో జరిగిన వెరిఫికేషన్ను ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు పరిశీలిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి వెరిఫికేషన్ను పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అసైన్డ్ భూముల జాబితాలను తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇవన్నీ తయారైన తర్వాత వచ్చే నెలలో పూర్తి స్థాయిలో తనిఖీ చేసి జిల్లా కలెక్టర్లకు పంపనున్నారు. వారి నుంచి జిల్లా రిజిస్ట్రార్లకు 22(ఎ) నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాల్సిన భూముల జాబితాను పంపడానికి కసరత్తు జరుగుతోంది. -
ఐటీఆర్ వెరిఫికేషన్! ఐటీ డిపార్ట్మెంట్ ఈ మెసేజ్చూశారా? లేదంటే?
డిపార్ట్మెంటు వారు జ్ఞాపకం చేస్తున్నారా లేదా భయపెడుతున్నారా? కాదు కాదు ఎందరో మరిచిపోయేవారిని దృష్టిలో ఉంచుకుని అందరికీ ఒక సందేశం.. రిమైండర్ పంపుతున్నారు. దాని సారాంశం ఏమిటంటే రిటర్ను దాఖలు చేసి ఊరుకోవద్దు. మరచిపోవద్దు. ఈ-ఫైలింగ్ ప్రాసెస్ని పూర్తి చేయండి. మీరు ఐటీఆర్ని 30 రోజుల్లోపల వెరిఫై చేయండి. గతంలో ఈ గడువు 120 రోజులు ఉండేది. అంటే నాలుగు నెలలు. కొత్త నిబంధనల ప్రకారం ఈ గడువుని 30 రోజులకు కుదించారు. గడువు తేదీలోగా వెరిఫై చేయకపోతే మీరు సకాలంలో రిటర్ను వేసినట్లు కాదు. మీరు దాఖలు చేసిన రిటర్ను ఇన్వాలిడ్ అయిపోతుంది. రద్దయిపోతుంది. వేసినట్లు కాదు. ఆలస్యమయింది కాబట్టి లేటు ఫీజు పడుతుంది. ఇది రూ. 5,00,000లోపు ఆదాయం ఉంటే రూ. 1,000; రూ. 5,00,000 దాటితే రూ. 5,000 ఉంటుంది. ఈ-వెరిఫై చేయడం చాలా సులభం. త్వరగా కూడా పూర్తవుతుంది. ఈ-వెరిఫై వద్దనుకుంటే ఫారం-Vని 30 రోజుల్లోపల అందేలా స్పీడ్పోస్ట్లో పంపండి. పోర్టల్ ద్వారా చేయండి. ఆధార్ కార్డు ద్వారా ఓటీపీ వస్తుంది. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. బ్యాంకు అకౌంట్ ద్వారా లేదా డీమ్యాట్ అకౌంటు, బ్యాంకు ఏటీఎం ద్వారానైనా చేయొచ్చు. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ ద్వారా చేస్తే కొంచెం ఖర్చవుతుంది. ఈ–ఫైలింగ్కి సంబంధించిన ప్రశ్నల్లో, తరచుగా మీకు సందేహాలొచ్చే వివిధ అంశాలు, పరిస్థితులు అన్నింటినీ పొందుపర్చారు. లేటయితే కూడా వెరిఫై చేయొచ్చు. కానీ, తగిన కారణం ఉండాలి. ఒప్పుకుంటే లేటుగా వేయవచ్చు. మీ తరఫున మీ ఆథరైజ్డ్ వ్యక్తి వేయొచ్చు. మొబైల్ నంబర్ను వెంటనే ఆధార్తో అప్డేట్ చేయడం తప్పనిసరి. మరిచిపోకండి. మీరు స్పీడ్పోస్ట్లో పంపించిన డాక్యుమెంట్ల వివరాలు భద్రపర్చుకోండి. రుజువులు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు అందలేదని డిపార్టుమెంటు వారు అంటే ఇవి రుజువులుగా పనికొస్తాయి. రిఫండ్ క్లెయిమ్ చేసిన వారయితే, వెరిఫై చేసిన తర్వాతే రిఫండును ఆశించాలి. జులై మొదటి వారంలో కొంత మందికి 48 గంటల్లో రిఫండు వచ్చింది. ఇప్పుడు రెండు వారాలు దాటిన తర్వాత రిఫండు ఇస్తున్నారు. గతంలో నెలరోజులు దాటేది. ఇప్పుడు ఇంకా త్వరితగతిన ఇద్దామని గట్టి ప్రయత్నం చేస్తూ, సమాయత్తం అవుతున్నారు .. డిపార్ట్మెంట్ వారు. Dear Taxpayers, Complete the e-filing process today! Please find below the modes of e-verification of return. Remember to verify your ITR within 30 days of filing. Delayed verification may lead to levy of late fee in accordance with provisions of the Income-tax Act, 1961.… pic.twitter.com/bu7jrXLFNH — Income Tax India (@IncomeTaxIndia) August 26, 2023 -
మొన్న రిజల్ట్..నిన్న వెరిఫికేషన్..నేడు జాబితా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల (యూఆర్ఎస్)లో కాంట్రాక్టు పోస్టుల భర్తీలో సమగ్ర శిక్షా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం పరీక్ష ఫలితాలు విడుదల చేసి, శుక్రవారం ఉదయం 10 గంటలకే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రావాలని ఆదేశాలు జారీచేశారు. గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన వాళ్లతో ఆ ప్రక్రియను మమా అనిపించి, శనివారం ఫైనల్ లిస్టు ఇచ్చి, సెలెక్టయినవారు రేపు జాయినింగ్ కావాలని ఆదేశాలిచ్చారు. రెండ్రోజుల్లోనే తంతు ముగించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కేజీబీవీ, యూఆర్ఎస్ల్లో ఖాళీగా ఉన్న 1,241 సీఆర్టీ, పీజీసీఆర్టీ, స్పెషల్ ఆఫీసర్ తదితర పోస్టులకు గతనెల 24, 25, 26 తేదీల్లో సమగ్ర శిక్ష అధికారులు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టులకు మొత్తం 43,056 మంది దరఖాస్తు చేసుకోగా, 34,797 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ సమయంలో భారీ వర్షాలు వచ్చినా.. ప్రభుత్వం అధికారికంగా సెలవులు ప్రకటించినా ఎగ్జామ్స్ మాత్రం యథాతథంగా నిర్వహించారు. ఈ సమయంలో చాలామంది అభ్యర్థులు అనేక ఇబ్బందులతో పరీక్షలకు హాజరుకాగా, కొందరు వర్షాలతో అటెండ్ కాలేదు. అభ్యర్థులకు రాత్రి పూట ఫోన్లు మెరిట్ లిస్టులను డీఈఓలకు గురువారం రాత్రి సమగ్ర శిక్ష ఆఫీసు నుంచి పంపించారు. డీఈఓ ఆఫీసు సిబ్బంది జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా రోస్టర్ తయారు చేసి, 1: 3 మెరిట్లో అభ్యర్థులను ఎంపిక చేశారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో రాత్రి 8 గంటల నుంచి 12 వరకూ మెరిట్ అభ్యర్థులకు డీఈఓ సిబ్బంది ఫోన్లు చేశారు. మరోపక్క గురుకుల పరీక్షలు నడుస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది ఆ పరీక్షలు రాస్తుండగా, కొందరు హైదరాబాద్లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వారందరికీ రాత్రి కాల్ చేసి, ఉదయం 10 గంటలకే రావాలంటూ చెప్పడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఒక చోట.. తాము మరోచోట ఉన్నామనీ కొందరు, సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయనీ ఇంకొందరు వారికి సమాధానం చెప్పినా పట్టించుకోలేదు. ఉద్యోగం కావాలంటే తప్పకుండా రావాల్సిందేననీ హుకుం జారీచేశారు. అయితే, కొందరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి, రెడీగా సర్టిఫికెట్లు పెట్టుకోవాలనీ ఎస్ఎస్ఏలో కొందరు అధికారులు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడ్రోజుల్లో మమ... డీఈఓలకు శుక్రవారం ఉదయం హైదరాబాద్లో సమావేశం ఉంటడంతో, చాలామంది గురువారం మధ్యాహ్నమే హైదరాబాద్కు బయల్దేరారు. తర్వాతి రెండ్రోజులూ రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు. ఈ క్రమంలో ఇంత హడావుడి చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10వ తేదీ రాత్రి ఫలితాలు ఇచ్చి, 11న ఉదయం 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. అదే రోజు 1:1 మెరిట్ లిస్టు రిలీజ్ చేయనున్నారు. 12న రెండోశనివారం మధ్యాహ్నం వరకు ఆబ్జెక్షన్లు తీసుకొని, ఫైనల్ లిస్టు రిలీజ్ చేస్తారు. ఎంపికైన వారు 13న ఆదివారం సాయంత్రం 5 గంటలకు జాయిన్ కావాల్సి ఉంటుంది. అయితే, కనీసం 1:3 అభ్యర్థుల మెరిట్ లిస్టు కూడా బయట పెట్టకుండా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఈ సెలెక్షన్ కమిటీకి చైర్మన్గా కలెక్టర్, వైస్చైర్మన్గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సెలవు రోజుల్లో వారు ఉంటారో ఉండరో అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడంపై డీఈఓలూ మండిపడుతున్నారు. దీనివెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోపక్క కొందరు కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. -
ఏ మొబైల్ నెంబర్ ఆధార్ కి లింక్ అయ్యిందో.. ఇప్పుడు మీ మొబైల్ లోనే ఇలా చూసుకోవచ్చు
-
ఆధార్ ఓటీపీ మీ మొబైల్ నంబర్కే వస్తోందా?
ఆధార్ కార్డులకు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. కార్డుదారులు ఇప్పుడు తమ ఆధార్తో సీడ్ చేసిన మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను ధ్రువీకరించవచ్చు. దీంతో తమ ఆధార్ OTP వేరే మొబైల్ నంబర్కు వెళ్తుందన్న ఆందోళన ఇక అక్కర్లేదు! ఇదీ చదవండి: iPhone 14 Offers: ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు మరో సంస్థలోనూ భారీ డిస్కౌంట్లు! కార్డుదారులు తమ ఆధార్కు సీడ్ చేసిన మొబైల్ నంబర్ల గురించి కొన్ని సందర్భాల్లో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. దీనివల్ల OTP వేరే మొబైల్ నంబర్కు వెళుతోందేమోనని ఆందోళన చెందుతుంటారు. ఈ ఇబ్బందులను గుర్తించిన యూఐడీఏఐ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీంతో ఆధార్ కార్డ్ హోల్డర్లు సీడెడ్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను సులభంగా చెక్ చేసుకోవచ్చని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ఆధారంగా ఐఎఎన్ఎస్ ఈ మేరకు నివేదించింది. ఇలా వెరిఫై చేయండి కార్డుదారులు యూఐడీఏఐ అధికారిక వెబ్సైట్ (https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ ద్వారా ఈ కొత్త ఫీచర్ను ఉపయోగించవచ్చు. వెబ్సైట్ లేదా యాప్ లోకి వెళ్లిన తర్వాత 'వెరిఫై ఈమెయిల్/మొబైల్ నంబర్' ట్యాబ్ను క్లిక్ చేసి తమ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను ధ్రువీకరించవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీలో మార్పులు ఉంటే దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు -
ట్విటర్ యూజర్లకు శుభవార్త!
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అధికారిక ట్విటర్ అకౌంట్లకు తొలగించిన ‘బ్లూటిక్’ వెరిఫికేషన్ మార్క్లను మళ్లీ పునరుద్దరించారు. ట్విటర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్కు ఛార్జీలు తీసుకొచ్చిన మస్క్..నిర్దేశించిన గడువులోగా డబ్బులు చెల్లించకపోతే వెరిఫికేషన్ మార్క్ తొలగిస్తామని చెప్పారు. అనుకున్నదే తడువుగా ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్ ఖాతాల వెరిఫికేషన్ మార్క్ను తొలగించారు. ఫలితంగా ప్రజాప్రతినిధుల నుంచి సినీ ప్రముఖులు వరకు ట్విటర్ బ్లూ మార్క్ను కోల్పోయారు. అయితే ఈ నేపథ్యంలో బ్లూ మార్క్ను తొలగించిన అకౌంట్లకు మళ్లీ పునరుద్దరించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటిల్లో సబ్స్క్రిప్షన్ తీసుకోని అకౌంట్లు సైతం ఉన్నాయి. బ్లూటిక్ వెరిఫికేషన్ ఉన్న అకౌంట్లకు వన్ మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఖాతాలను మస్క్ రీస్టోర్ చేశారు. ఇదే ఫైనల్ ఫేక్ అకౌంట్లను గుర్తించేందుకు వీలుగా ట్విటర్ సంస్థ తొలిసారిగా 2009లో బ్లూ టిక్ ఖాతాలను ప్రవేశపెట్టింది. వాటిపై ఎలాంటి ఛార్జీలు విధించలేదు. కానీ 2022లో ట్విటర్ బాస్గా బాధ్యతలు చేపట్టిన మస్క్.. ట్విటర్ బ్లూ టిక్ అకౌంట్లకు ఛార్జీలు చెల్లించాలనే నిబంధన విధించారు. ఈ సబ్స్క్రిప్షన్ ఛార్జీలపై ఈ ఏడాది ఏప్రిల్ 11న మస్క్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోని అకౌంట్లకు ఏప్రిల్ 20 నుంచి వెరిఫికేషన్ బ్యాడ్జీలను తొలగిస్తామని పేర్కొన్నారు. Tomorrow, 4/20, we are removing legacy verified checkmarks. To remain verified on Twitter, individuals can sign up for Twitter Blue here: https://t.co/gzpCcwOXAX Organizations can sign up for Verified Organizations here: https://t.co/YtPVNYypHU — Twitter Verified (@verified) April 19, 2023 ‘బ్లూటిక్’ వెరిఫికేషన్ మార్క్ల పునరుద్దరణ ట్వీట్లో మస్క్ చెప్పినట్లుగానే వెరిఫికేషన్ బ్యాడ్జీలను డిలీట్ చేశారు. దీంతో సెలబ్రిటీ ట్విటర్ యూజర్లు మస్క్పై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. బిగ్బిలాంటి వారు సైతం తాము ట్విటర్ బ్లూ కోసం డబ్బులు చెల్లించినా..బ్యాడ్జీని ఎందుకు తొలగించారంటూ మస్క్పై కామెంట్ల వర్షం కురిపించారు. తాజాగా అధికారిక అకౌంట్లకు బ్లూ చెక్ మార్క్లు ప్రత్యక్షమయ్యాయి. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్! -
కువైట్ వెళ్లేవారికి కొత్త నిబంధన.. వలస కార్మికులు ఆవేదన
మోర్తాడ్(బాల్కొండ): మనదేశం నుంచి వెళ్లే వారికిగాను కువైట్ వీసా నిబంధనలను సవరించింది. కువైట్ నుంచి వీసాలు జారీ అయిన తరువాత అవి అసలువో నకిలీవో తేల్చడానికి ఆ దేశ కాన్సులేట్ల పరిశీలన కోసం పంపాల్సి ఉంది. ఈ కొత్త నిబంధన పదిహేను రోజుల కింద అమలులోకి వచ్చింది. వీసాలను కాన్సులేట్ పరిశీలన కోసం పంపడం వల్ల కాలయాపనతో పాటు ఆర్థికంగా భారం పడుతుందని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కువైట్లో ఉపాధి పొందాలనుకునే వారు లైసెన్స్డ్ ఏజెన్సీలు, లేదా తమకు తెలిసిన వారి ద్వారా వీసాలను పొందిన తరువాత పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) తీసుకోవాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో ఒక్క కువైట్కు మాత్రమే పీసీసీ తప్పనిసరి అనే నిబంధన ఉంది. వీసా కాపీల పరిశీలనను ఇప్పుడు అదనంగా చేర్చారు. కువైట్ నుంచి వీసాలను ఆన్లైన్లోనే జారీ చేస్తున్నారు. ఈ వీసాలు అన్ని కువైట్ విదేశాంగ శాఖ ద్వారానే జారీ అవుతున్నాయి. విదేశాంగ శాఖ ఆమోదంతోనే వీసాలు జారీ కాగా, వాటిని మరోసారి తమ కాన్సులేట్ల్లో పరిశీలనకు పంపాలని కువైట్ ప్రభుత్వం సూచించడం అర్థరహితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ, ముంబైలోనే కాన్సులేట్లు కువైట్ విదేశాంగ శాఖకు సంబంధించిన కాన్సు లేట్లు ఢిల్లీ, ముంబైలలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్కు భారీగానే వలసలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కాన్సులేట్ ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాల నుంచి వలస కార్మికులు కోరుతున్నారు. కువైట్ ప్రభుత్వం గతంలో సానుకూలంగా స్పందించినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. కువైట్ ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లో తీసుకురావడంతో కాన్సులేట్ హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. (క్లిక్ చేయండి: లే ఆఫ్స్ దెబ్బకి భారత ఐటీ ఉద్యోగుల విలవిల) -
ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ
న్యూఢిల్లీ: సోషల్ మీడియా మైక్రోబ్లాగింగ్ ఫాట్పారం ట్విటర్ అకౌంట్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇప్పటిదాకా ఉన్న వెరిఫికేషన్ మార్క్ బ్లూ టిక్ ..ఇపుడు మూడు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దీనికి వెబ్ యూజర్లు నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి ఉటుంది. ఐఫోన్ యూజర్లు మాత్రం 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. బ్లూ చెక్మార్క్తో పాటు, ప్రత్యేక ఫీచర్లు ఉన్న ట్విటర్ బ్లూ సేవలను కూడా పొందవచ్చని సంస్థ తెలిపింది. బ్లూ సేవలను ప్రత్యేక రుసుం చెల్లించిన ఎవరికైనా ఇవ్వనున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం (డిసెంబరు13)న షురూ అయింది. ట్విటర్ టేకోవర్ తరువాత బిలియనీర్ ఎలాన్ మస్క్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో ఒకటి వెరిఫికేషన్ ఫీజు. అలాగే ఆయా వర్గాల వారీగా టిక్ కలర్ మార్పు. ఇప్పటికే ఒకే వెరిఫికేషన్ టిక్ (బ్లూ) ఉన్న సంగతి తెలిసిందే. తాజా మార్పుల ప్రకారం ఇపుడిక సెలబ్రిటీల వ్యక్తిగత ఖాతాలకు బ్లూ టిక్, ప్రభుత్వ సంస్థలకు గ్రే టిక్, వ్యాపార సంస్థలకు గోల్డ్ కలర్ టిక్ను కేటాయించ నున్నట్టు మస్క్ ప్రకటించారు. we’re baaaack! Twitter Blue is now available for $8/month on web or $11/month on iOS – we’ve made some upgrades and improvements 🧵 pic.twitter.com/uRMuwCSElb — Twitter Blue (@TwitterBlue) December 12, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐడెంటిటీ ప్రూఫ్గా ఆధార్.. యూఐడీఏఐ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: వ్యక్తిగత గుర్తింపు ఆధార్ విషయంలో.. ఆధార్ నిర్వహణ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’(యూఐడీఏఐ) గురువారం కీలక ప్రకటన చేసింది. ఆధార్ వివరాలను ధృవీకరించుకున్నాకే.. ఐడెంటిటీ ఫ్రూఫ్గా అంగీకరించాలంటూ సూచించింది. ఆధార్ లెటర్, ఇ-ఆధార్, ఆధార్ పీవీసీ కార్డ్, ఎం-ఆధార్.. ఇలా ఆధార్ ఏ రూపంలో అయినా సరే ఐడెంటిటీ ఫ్రూఫ్గా తీసుకునే సమయంలో.. అందులో సమాచారం సరైందేనా? కాదా? అని ధృవీకరించాలని యూఐడీఏఐ పేర్కొంది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.ఆధార్ వివరాలను ధృవీకరించుకునేందుకు క్యూఆర్ కోడ్లు, ఎం-ఆధార్ యాప్, ఆధార్ క్యూఆర్ కోడ్ స్కానర్లు ఉన్నాయని తెలిపింది. డెస్క్యాప్ వెర్షన్తో పాటు మొబైల్స్ ద్వారా ఈ యాప్స్ను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ మేరకు సెప్టెంబర్లో ఆధార్ వివరాల దుర్వినియోగ కట్టడికి పలు కీలక సూచనలు పౌరుల కోసం జారీ చేసిన విషయాన్ని యూఐడీఏఐ గుర్తు చేసింది. అంతేకాదు.. ఆధార్ వెరిఫికేషన్ ద్వారా ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ దుర్వినియోగానికి ఆస్కారం ఉండదని తెలిపింది. అనైతిక, సంఘ వ్యతిరేక అంశాలను అడ్డుకున్నట్లు అవుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆధార్ వినియోగం సక్రమంగా జరుగుతుందని, నకిలీ ఆధార్ల కట్టడికి తోడ్పడుతుందని స్పస్టం చేసింది. ఆధార్ పత్రాలను ట్యాంపరింగ్ గనుక చేస్తే.. ఆధార్ యాక్ట్ సెక్షన్ 35 ప్రకారం శిక్షార్హమైన నేరమని, జరిమానాలు కూడా కట్టాల్సి వస్తుందని తెలిపింది. అంతేకాదు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ఆధార్ సమర్పించేప్పుడు దానిని ధృవీకరించుకోవాల్సిన అవసరాన్ని రాష్ట్రాలు తప్పనిసరి చేయాలంటూ యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: మీరు నోరు మూస్తారా? సుప్రీంలో ఏజీ అసహనం -
బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు: మరోసారి బ్రేక్, ఎందుకంటే?
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ మరోసారి సబ్స్క్రిప్షన్ ఆధారిత 'బ్లూ వెరిఫికేషన్' ప్లాన్ను మరోసారి వాయిదా వేసుకున్నారు. తాజాగా 'బ్లూ వెరిఫైడ్' బ్యాడ్జ్ పునఃప్రారంభించడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎలాన్ మస్క్ మంగళవారం ప్రకటించారు. “బ్లూ వెరిఫికేషన్ రీలాంచ్ను ఆపివేయడం వల్ల ఫేక్ అకౌంట్ల తొలగింపుపై పూర్తి విశ్వాసం వచ్చేంత వరకు దీన్ని వాయిదా వేస్తున్నానన్నారు. అలాగే వ్యక్తుల కోసం కాకుండా సంస్థల కోసం వేర్వేరు కలర్స్లో వెరిఫికేషన్ ఉంటే బావుంటుందేమో అంటూ మస్క్ ట్వీట్ చేశారు. అయితే ప్పుడు రీలాంచ్ చేసేదీ ప్రకటించ లేదు. మరోవైపు గత వారంలో 1.6 మిలియన్ల యూజర్లను ట్విటర్ సాధించిందనీ, ఇది "మరో ఆల్ టైమ్ హై" అని మస్క్ ట్వీట్ చేశారు. కాగా నెలకు 8 డాలర్లు బ్లూటిక్ను ఫీజును ప్రకటించిన మస్క్ నకిలీ ఖాతాల బెడద కారణంగా దీన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. ఆ తరువాత నవంబరు 29 నుంచి పునఃప్రారంభించనున్నట్టు తెలిపారు. కానీ దీని మరోసారి బ్రేకులు వేయడం గమనార్హం. Holding off relaunch of Blue Verified until there is high confidence of stopping impersonation. Will probably use different color check for organizations than individuals. — Elon Musk (@elonmusk) November 22, 2022 Twitter added 1.6M daily active users this past week, another all-time high pic.twitter.com/Si3cRYnvyD — Elon Musk (@elonmusk) November 22, 2022 -
బ్లూటిక్ బాదుడు పక్కా, ముహూర్తం ఫిక్స్: మస్క్ క్లారిటీ
న్యూఢిల్లీ: ట్విటర్ బ్లూటిక్ వెరిఫికేషన్ బాదుడుపై ట్విటర్ కొత్తబాస్, బిలీయనీర్ ఎలాన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెలాఖరునుంచి (నవంబరు 29) బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు మొదలవుతుందని మస్క్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. (ElonMusk: తీవ్ర వాదన, ఊడిపోయిన ఉద్యోగం, అసలేం జరిగిందంటే?) తాత్కాలికంగా నిలిపివేసిన బ్లూ చెక్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ నవంబర్ 29న పునఃప్రారంభిస్తున్నట్టు మస్క్ మంగళవారం ట్వీట్ చేశారు. ఇది మాత్రం పక్కా అంటూ తేల్చి చెప్పేశారు. అంతేకాదు తమ సర్వీసు నిబంధనలకు అనుగుణంగా ట్విటర్ ధృవీకరించని ఖాతాలు పేరు మార్చుకుంటే బ్లూటిక్ కోల్పోతారని కూడా తెలిపారు. కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ను సొంతం చేసుకున్న టెస్లా చీఫ్ మస్క్ నెలకు 8 డాలర్ల బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ ప్రకటించారు. అయితే నకిలీ ఖాతాల బెడద కారణంగా బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు అమలు నిర్ణయాన్ని తాత్కాలికంగా బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. Punting relaunch of Blue Verified to November 29th to make sure that it is rock solid — Elon Musk (@elonmusk) November 15, 2022 -
ట్విటర్లాగా చార్జీలేమీ విధించం..
న్యూఢిల్లీ: యూజర్ల వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం ట్విటర్లాగా చార్జీలేమి విధించబోమని, ఇది పూర్తిగా ఉచితమేనని దేశీ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ చెప్పారు. ఆధార్ ఆధారిత స్వీయ ధృవీకరణతో పసుపు రంగు వెరిఫికేషన్ బ్యాడ్జ్ని ఉచితంగా పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. బాట్స్ (రోబో) సమస్యను సృష్టించినది ట్విటరే అని రాధాకృష్ణ ఆరోపించారు. మొదట్లో వాటిని ప్రోత్సహించిన ట్విటర్ ప్రస్తుతం నియంత్రించడానికి నానా తంటాలు పడుతోందని చెప్పారు. తాము సిసలమైన మనుషులమేనని యూజర్లు ధృవీకరించేందుకు, బ్లూ టిక్ పొందేందుకు .. వెరిఫికేషన్ పేరిట చార్జీలు వసూలు చేసే ప్రయత్నాల్లో ఉందని విమర్శించారు. కూ ఈ ఏడాది తొలి నాళ్ల నుండే స్వచ్ఛంద వెరిఫికేషన్ను యూజర్లకు చట్టబద్ధమైన హక్కుగా ఉచితంగా అందిస్తోందని రాధాకృష్ణ తెలిపారు. ఇప్పటివరకూ 1,25,000 మంది భారతీయ యూజర్లు దీన్ని ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు. అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ను కొనుగోలు చేసిన తర్వాత పలు మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. భారీగా ఉద్యోగులను తొలగించడంతో పాటు వెరిఫైడ్ బ్యాడ్జ్ల కోసం 8 డాలర్ల ఫీజు విధించనుండటం మొదలైనవి వీటిలో ఉన్నాయి. -
అక్రమాలకు చెక్ ....గోధుమల ఎగుమతికి ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరి..
న్యూఢిల్లీ: రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్ ఎగుమతులు పడిపోయిన సంగతి తెలిసింది. అదీగాక ఇతర దేశాలలో పంటలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడంతో యావత్ ప్రపంచం గోధుమల కోసం భారత్వైపే చూసింది. అందుకు అనుగుణంగా భారత్ కూడా సుమారు 10 మిలయన్ల వరకు గోధులమలను ఎగుమతి చేయాలని అనుకుంది గానీ జాతీయ ఆహార భద్రతా దృష్ట్యా నిలిపేసింది. ఈ మేరకు భారత్ మే 13న గోధుమల ఎగుమతిని నిషేధించిన సంగతి తెలసిందే. అంతేకాదు కేంద్రం గోదుముల నిషేధం అమలులోకి రాక మునుపే కస్టమ్స్ అథారిటీ వద్ద నమోదు చేసుకున్న గోధుమ సరుకుల రవాణాను మాత్రమే అనుమతించాలని నిర్ణయించిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ప్రైవేట్ ఎగుతిదారులు ఈ నిబంధను క్యాష్ చేసుకుని ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేలా కఠినతరమైన నిబంధనలను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం గోధుమలు ఎగుమతి చేసే ముందు ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని తెలిపింది. అంతేకాదు అర్హత ఉన్న ఎగుమతిదారుల విషయంలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల (ఆర్సీలు) జారీకి ప్రాంతీయ అధికారులు డ్యూ డిలిజెన్స్' పాటించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. చాలామటుకు నిషేధాన్ని తప్పించుకునే క్రమంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సి)ని మే 13కి ముందు తేదిని ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్టి) ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేలా తనిఖీలు తప్పనసరి అని స్పష్టం చేసింది. ప్రాంతీయ అధికారులు ఆమెదించిన లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ) తేదికి సంబంధిత బ్యాంకులకు సంబంధించిన స్విఫ్ట్ లావాదేవీల తేదితో సరిపోల్చాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేట్ ఎగుమతిదారులు సీబీఐ విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ బ్యాంకర్లకు ఏ దశలోనైనా ఏదైన సమస్య తలెత్తినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేసే ప్రయత్నాలలో భాగంగా ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఆమోదం కోసం ఇద్దరు సభ్యుల ఉన్న కమిటీకి పంపబడతాయని ప్రభుత్వం తెలిపింది. ఐతే ఈ కమిటీ క్లియరన్స్ ఇచ్చిన తర్వాతే ప్రాంతీయ అధికారులు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లను జారీ చేస్తారని వెల్లడించింది. (చదవండి: గోధుమల ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం) -
Masked Aadhaar Card: ఆధార్ కార్డు వాడకంపై కేంద్రం కీలక సూచన
దేశంలో ప్రతీ పనికి ఆధార్ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. సిమ్ కార్డు నుంచి బ్యాంక్ ఖాతాల వరకు ఆధార్ తప్పనిసరి అయిపోయింది. ఆధార్ కార్డు లేనిదే కొన్ని పనులు జరగవు. ఈ నేపథ్యంలో ఆధార్ వాడకంపై కేంద్రం.. దేశ పౌరులకు కీలక సూచన చేసింది. ప్రతీ విషయంలోనూ ఆధార్ను వాడుతున్న నేపథ్యంలో.. ఏ విషయంలోనైనా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సి వస్తే.. కేవలం ‘మాస్క్డ్ కాపీ’లను మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఇలా చేయాలని కేంద్రం కోరింది. ముందు జాగ్రత్త కోసమే ఇలా సూచన చేస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అందుకే ఎవరికైనా ఫొటోకాపీకి బదులుగా మాస్క్డ్ కాపీలను మాత్రమే చూపించాలని స్పష్టం చేసింది. మాస్క్డ్ ఆధార్ కాపీ అంటే.. భారత పౌరుల సౌకర్యార్థం యుఐడిఏఐ(UIDAI) ఆన్లైన్లో మరో ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, చిరునామా, లింగం ఇటువంటి మార్పులు చేసుకునేందుకు వీలుగా ఈ కొత్త ఫీచర్ను తీసుకువచ్చింది. దీనినే మాస్క్ ఆధార్ కార్డ్ అని చెబుతున్నారు. ఈ కార్డుపై 12 అంకెల ఆధార్ నంబర్ పూర్తిగా కనిపించదు. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. ఆధార్లో మొదటి ఎనిమిది అంకెలు ****-**** గా కనిపిస్తాయి. దీంతో, మాస్క్డ్ ఆధార్ కార్డు.. ఒరిజినల్ కార్డును సురక్షితంగా ఉంచుతుంది. మాస్క్డ్ ఆధార్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. 1. https://eaadhaar.uidai.gov.in వెబ్సైట్కు వెళ్లి, 'డౌన్లోడ్ ఆధార్' ఎంపికపై క్లిక్ చేయండి. 2. మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్ను ఎంటర్ చేయాలి. 3. మాస్క్డ్ ఆధార్ కావాలి.. అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. 4. ధృవీకరణ కోసం అందించబడే క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. 5. ‘Send OTP’పై క్లిక్ చేయండి. 6. ఇ-ఆధార్ కాపీని డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత PDF కాపీని డౌన్లోడ్ చేసుకోండి. 7. ఆధార్ PDF పాస్వర్డ్ 8 అక్షరాలలో ఉంటుంది.(మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు (ఆధార్లో ఉన్నట్లు) క్యాపిటల్ అక్షరాలు, YYYY ఆకృతిలో పుట్టిన సంవత్సరంతో ఎంటర్ చేయాలి.) In order to prevent misuse, the central government has asked citizens to share only masked versions of their #Aadhaar cards. Unlicensed private entities are like hotels etc are not allowed to collect or keep copies of Aadhaar card, as par the Ministry of Electronics & IT. pic.twitter.com/QQIvI4y3wi — NIRUPAM ACHARJEE 🇮🇳 (@NirupamAcharjee) May 29, 2022 -
IRCTC: ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్లో మార్పులు!
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్సైట్ లేదంటే యాప్ని ఉపయోగించి రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకుల కోసం.. టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను సవరించింది. ఐఆర్సీటీసీ.. బుధవారం ఈ మేరకు ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. ఐఆర్సీటీసీ వినియోగదారులు తమ యాప్ లేదా వెబ్సైట్లో ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు వారి ఫోన్ నంబర్లు మరియు ఈ-మెయిల్ ఐడీలను ధృవీకరించడం తప్పనిసరి చేసింది. ఈ యాప్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్తో పాటు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంటుందన్నది తెలిసిందే. ఇక మీదట.. వెరిఫికేషన్ లేకుండా కస్టమర్లు టిక్కెట్లు బుక్ చేసుకోలేరని IRCTC స్పష్టం చేసింది. అయితే COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్ చేయని వారికి కొత్త నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ , ఈ-మెయిల్ ఐడీని ఎలా ధృవీకరించవచ్చో చూద్దాం.. ►ముందుగా ఐఆర్సీటీసీ యాప్ లేదంటే వెబ్సైట్కు వెళ్లాలి. అక్కడ వెరిఫికేషన్ విండో కనిపిస్తుంది. ► అందులో మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. ► కుడి వైపు వెరిఫికేషన్.. ఎడమ వైపు ఎడిట్ బటన్ కనిపిస్తాయి. ► వివరాలను పొందుపరిచాక.. వన్ టైం పాస్వర్డ్(ఓటీపీ) మొబైల్ నెంబర్ లేదంటే మెయిల్ ఐడీకి వస్తుంది. ► ఆపై వెరిఫై ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ తర్వాత.. ఐఆర్సీటీసీ పోర్టల్ లేదా యాప్కు వెళ్లి లాగిన్ కావాలి. స్టేషన్, తేదీ, ఇతర వివరాలను ఎంటర్ చేయాలి. బుక్ నౌ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రయాణికుల వివరాలు.. ఇతర వివరాలు పొందుపర్చాలి. పేమెంట్ ఆప్షన్ పూర్తయ్యాక.. అప్పుడు కన్ఫర్మేషన్ వివరాలు వస్తాయి. చదవండి: గూగుల్లో ఈ మూడు విషయాలు సెర్చ్ చేయొద్దు.. చేస్తే జైలుకెళ్లడం ఖాయం! -
ఐటీఆర్ దాఖలుతో పని పూర్తయినట్టు కాదు
ఆదాయపుపన్ను రిటర్నుల దాఖలు గడువు డిసెంబర్ 31 తో ముగిసింది. జూలైతోనే ముగిసిన గడువును.. కరోనా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. దీంతో చాలా మంది డిసెంబర్లో రిటర్నులు దాఖలు చేశారు. రిటర్నులు దాఖలుతో బాధ్యత ముగిసిందని అనుకోవద్దు. ఆ తర్వాత తమ వైపు నుంచి దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. చివరి నిమిషంలో వేయడం వల్ల అందులో తప్పులు దొర్లి ఉంటే వెంటనే రివైజ్డ్ రిటర్నులు వేసుకోవాలి. ఈ వెరిఫై చేస్తేనే వేసిన రిటర్నులు చెల్లుబాటు అవుతాయి. ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించి వివరించే కథనమే ఇది.. ఈ ఫైలింగ్ పోర్టల్పై ఐటీఆర్ దాఖలు చేయడం ప్రాథమికంగా చేయాల్సిన పని. తర్వాత ఆ రిటర్నులను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మీరే దాఖలు చేశారనడానికి నిదర్శనం ఏమిటి? అందుకనే ధ్రువీకరణ ప్రక్రియ. దాంతో ఆ రిటర్నుల్లో పేర్కొన్న సమాచారానికి మీరు బాధ్యత వహిస్తున్నట్టు అవుతుంది. గతేడాది కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్ తీసుకురావడం తెలిసిందే. ఎన్నో సాంకేతిక సమస్యలు వెక్కిరించడంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. డిసెంబర్ చివరి వారంలో హడావుడిగా రిటర్నులు వేసిన వారు కూడా ఉన్నారు. కనుక ఒకసారి రిటర్నులు ధ్రువీకరించినదీ, లేనిదీ చూసుకోవాలి. వెరిఫికేషన్ చేయని రిటర్నులు చెల్లవు. రిటర్నులు సమర్పించిన తేదీ నుంచి 120 రోజుల్లోపు ధ్రువీకరించేందుకు సమయం ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ పత్రం లేదా ఫామ్–5 పత్రంపై (ఆదాయపన్ను శాఖ నుంచి డౌన్లోడ్ చేసుకుని) సంతకం చేసి ఆ కాపీని పోస్ట్ ద్వారా ఆదాయపన్ను శాఖ, బెంగళూరు కార్యాలయానికి పంపించాలి. కొరియర్ ద్వారా పంపకూడదు. భౌతికంగా చేసే ధ్రువీకరణ ఇది... ఇలా కాకుండా ఆన్లైన్లో ఈ వెరిఫై చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ నుంచి లేదంటే ఆధార్ ఓటీపీ ద్వారా, బ్యాంకు లేదా డీమ్యాట్ ఖాతా నంబర్ సాయంతోనూ వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు యూజర్ మొబైల్కు వన్టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఈ కోడ్ లేదా ఓటీపిని ఈఫైలింగ్ పోర్టల్పై ఎంటర్ చేసి, సబ్మిట్ కొట్టడంతో ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది. వెరిఫై చేసినట్టు సమాచారం కూడా వస్తుంది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలను ఉపయోగించుకుని ఓటీపీ జనరేట్ చేసుకోవడం ద్వారా ఈవెరిఫై చేయవచ్చు. సదరు బ్యాంకులో ఖాతా ఉండి, ఖాతాకు పాన్ నంబర్ అనుసంధానించి ఉంటే సరిపోతుంది. సెక్షన్ 44ఏబీ కింద ఖాతాలను ఆడిట్ చేయాల్సి అవసరం ఉన్న వారు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేసిన వెంటనే.. తమ డిజిటల్ సిగ్నేచర్ను ఉపయోగించి ధ్రువీకరించాల్సి ఉంటుంది. పన్ను రిటర్నులు వేసిన 120 రోజులకీ వెరిఫై చేయకపోతే ముందు ఈఫైలింగ్ పోర్టల్లో లాగిన్ అయ్యి సరైన కారణాన్ని తెలియజేస్తూ జరిగిన ఆలస్యానికి క్షమాపణ తెలియజేయాలి. మీ అభ్యర్థనను ఆదాయపన్ను శాఖ మన్నిస్తే.. అప్పుడు రిటర్నులు ఈ వెరిఫై చేసుకునేందుకు అవకాశం తిరిగి లభిస్తుంది. లేదంటే మీ రిటర్నులను దాఖలు చేయనట్టుగా ఐటీ శాఖ భావిస్తుంది. అప్పుడు సకాలంలో రిటర్నులు వేయనందుకు చట్టప్రకారం అన్ని చర్యలకు బాధ్యత వహించాలి. ఆలస్యపు ఫీజు, చెల్లించాల్సిన పన్ను ఉంటే ఆ మొ త్తంపై నిర్ణీత గడువు తేదీ నుంచి వడ్డీ చెల్లించాలి. రిటర్నుల్లో తప్పులను గుర్తిస్తే..? ఐటీఆర్ దాఖలు చేశారు. ధ్రువీకరించడం కూడా ముగిసింది. కానీ ఆదాయం, మినహాయింపులను పేర్కొనడం మర్చిపోయారనుకోండి. అప్పుడు సవరించిన రిటర్నులు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. అది కూడా రిటర్నులను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందే చేసుకోవాలి. ఇందుకు ప్రత్యేకంగా వేరొక ఫామ్ ఉండదు. ఈ ఫైలింగ్ పోర్టల్పై ఒరిజినల్, రివైజ్డ్ అనే ఆప్షన్లు ఉంటాయి. ‘రివైజ్డ్ రిటర్న్’ ఆప్షన్ ఎంపిక చేసుకుని, ముందు దాఖలు చేసిన మాదిరే మొదటి నుంచి ప్రక్రియ అనుసరించాలి. ఒరిజినల్ ఐటీఆర్ ఈ ఫైలింగ్ దాఖలు చేసిన తేదీ, అక్నాలెడ్జ్మెంట్ నంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందుగానే రివైజ్డ్ రిటర్నుల ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 2020–21 సంవత్సరానికి 2021–22 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. కనుక 2021 డిసెంబర్ 31ని గడువుగా అర్థం చేసుకోవాలి. ఆలోపే ఐటీఆర్ అసెస్మెంట్ను ఆదాయపన్ను శాఖ పూర్తి చేస్తే గడువు ముగిసినట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అమలవుతుంది. 2021–22 అసెస్మెంట్ సంవత్సరానికి సవరించిన రిటర్నుల దాఖలు గడువును ఆదాయపన్ను శాఖ 2022 మార్చి 31 వరకు పొడిగించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ గడువులతో సంబంధం లేకుండా.. మీరు దాఖలు చేసిన రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్ చేసి సెక్షన్ 143(1) కింద ఇంటిమేషన్ మెయిల్ పంపినట్టయితే గడువు ముగిసిపోయినట్టుగానే పరిగణించాలి. దాంతో రిటర్నులను సవరించుకోలేరు. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసి, వెరిఫై చేసిన తర్వాత.. 10–30 రోజుల్లోపే ఆదాయపుపన్ను శాఖ ప్రాసెస్ చేసేస్తుంది. అందుకని రిటర్నులు దాఖలు చేసిన వారు ఆ తర్వాత వారం వ్యవధిలోపే మరొక్క సారి అన్నింటినీ క్షుణంగా సరిచూసుకోవడం మంచిది. రివైజ్డ్ రిటర్నులు వేసుకునేందుకు, ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసుకునేందుకు సాధారణంగా డిసెంబర్ 31 గడువుగా ఉంటుంది. కనుక ఆలస్యంగా రిటర్నులు వేసే వారికి రివైజ్ చేసుకునేందుకు తగినంత వ్యవధి ఉండకపోవచ్చు. ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేయక ముందు ఎన్ని సార్లు అయినా రివైజ్డ్ రిటర్నులు ఫైల్ చేసుకోవచ్చు. తాజాగా దాఖలు చేసిన ఐటీఆర్ను ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకుంటుంది. అవకాశం ఉంది కదా అని చాలా సార్లు రివైజ్డ్ రిటర్నులు వేశారనుకోండి.. అప్పుడు ఆదాయపన్ను శాఖ సందేహంతో మీ ఐటీఆర్ను స్క్రూటినీ చేయవచ్చు. రిఫండ్ సంగతిదీ.. ఆదాయపుపన్ను రిటర్నులను దాఖలు తర్వాత, ఐటీ శాఖ వాటిని ప్రాసెస్ చేసి 143 (1) ఇంటిమేషన్ ఇవ్వడం పూర్తయి, అందులో ఏ తప్పులూ లేకపోతే రిటర్నుల ప్రక్రియ సంపూర్ణంగా ముగిసినట్టే. చివరిగా ఒకవేళ చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ పన్ను చెల్లించి ఉంటే రిఫండ్కు అర్హత ఉంటుంది. రిఫండ్ స్టేటస్ ఏంటన్నది ఐటీ శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డుపై కనిపిస్తుంది. అదనంగా ఎన్ఎస్డీఎల్ పోర్టల్లోనూ చెక్ చేసుకోవచ్చు. https://tin.tin. nsdl.com/oltas/refund-status.html. ఈ లింక్ను ఓపెన్ చేసి పాన్ వివరాలు ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. ఫేస్లెస్ ప్రాసెసింగ్ వచ్చిన తర్వాత రిఫండ్లు పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. 143(1) ఇంటిమేషన్ వచ్చిన 15 రోజుల్లోపే రిఫండ్ కూడా వచ్చేస్తుంది. పలు కారణాల వల్ల ఆలస్యం అయితే, బ్యాంకు ఖాతా వివరాలు (అకౌంట్ నంబర్/ఐఎఫ్ఎస్ నంబర్ తదితర) సరిగా లేకపోవడం వల్ల పెండింగ్లో ఉంటే అప్పుడు నూతన ఈఫైలింగ్ పోర్టల్కు వెళ్లి సర్వీస్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా వివరాలను సరిచేసుకోవచ్చు. రిఫండ్లు ఆలస్యమైనా ఆందోళన చెందక్కర్లేదు. నిర్ణీత గడువు దాటిన తర్వాత నుంచి ఆ మొత్తంపై ప్రతీ నెలా 0.5 శాతం మేర వడ్డీని ఐటీ శాఖ చెల్లిస్తుంది. ఇలా అందుకునే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని మర్చిపోవద్దు. ఈ మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయం కింద రిటర్నుల్లో పేర్కొనాల్సి ఉంటుంది. పన్ను కోసం డిమాండ్ నోటీసు వస్తే? పన్ను రిటర్నుల్లో తప్పులు, పొరపాట్లు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ రిటర్నులను ప్రాసెస్ చేసే సమయంలో అందులోని సమాచారం మధ్య అంతరాలు, పోలికల్లేమిని గుర్తిస్తుంది. ఆ వివరాలను 143(1) ఇంటిమేషన్ నోటీసులో పేర్కొంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఐటీ శాఖ పేర్కొన్న సమాచారంతో మీరు ఏకీభవిస్తే ఆ మేరకు పన్ను చెల్లించేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు ఏదైనా మినహాయింపును పేర్కొనడం మర్చిపోయిన కారణంగా ఆ అంతరం తలెత్తి ఉంటే? అప్పుడు రెక్టిఫికేషన్ రిక్వెస్ట్ దాఖలు చేయాలి. ఆదాయపన్ను శాఖ లెక్కలతో ఏకీభవించడం లేదని లేదా రిటర్నుల్లో పొరపాటు చేశానంటూ అందులో పేర్కొనాలి. పన్ను అధికారులు ఆరు నెలల్లోగా స్పందిస్తారు. నాలుగు రకాల రెక్టిఫికేషన్ రిక్వెస్ట్లు ఉన్నాయి. రిటర్నుల్లో సరిపోలని సమాచారం అసలు ఏంటన్న దాని ఆధారంగా వీటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. -
ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్ గడువు పొడిగింపు
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్లో తమ ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్)లను ఈ-వెరిఫై చేయని పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ మరో అవకాశం కల్పించింది. ఐటీఆర్లను వెరిఫై చేయడానికి ఐటీ శాఖ ఈ ఏడాది డిసెంబర్ 21 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువును పొడిగించింది. చట్టం ప్రకారం.. డిజిటల్ సంతకం లేకుండా దాఖలు చేసిన ఐటీఆర్లను ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, డీమ్యాట్ ఖాతా ద్వారా పంపిన కోడ్, ప్రీ వాలిడేటెడ్ బ్యాంక్ ఖాతా, ఏటిఎమ్ ద్వారా రిటర్న్ దాఖలు చేసిన 120 రోజుల్లోగా ఈ-వెరిఫై చేయాల్సి ఉంటుంది. అలా కాకపోతే ‘సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ)’కు ఫైల్ చేసిన ఐటీఆర్ పత్రాలను బెంగళూరులోని ఐటీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. ఒకవేళ ఐటిఆర్-వి ఫారం ద్వారా ఈ-వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కానట్లయితే, ఐటీఆర్ను దాఖలు చేయనట్లుగా పరిగణిస్తామని ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది. ఇతర కారణాల వల్ల ఇప్పటికే తిరస్కరణకు గురైన ఐటీఆర్లను తాజా ఈ-వెరిఫికేషన్లో అనుమతించబోమని తెలిపింది. వారికి ఈ గడవు వర్తించదని పేర్కొంది. (చదవండి: వాట్సాప్ గ్రూప్స్ మెసేజ్స్పై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..!) -
వన్నె తగ్గని ఉస్మానియా యూనివర్సిటీ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల్లో విద్యనభ్యసించి ఏటా వేలాది మంది డిగ్రీలు అందుకుంటున్నారు. వీరిలో సుమారు 20 వేల మందికి పైగా పట్టభద్రులు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఓయూ పరిధిలో డిగ్రీలు పూర్తి చేసిన పలువురు విద్యార్థులు గల్ఫ్తో పాటు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు దరఖాస్తు చేసుకుంటారు. అలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లు అసలివా? నకిలీవా? అని తెలుసుకునేందుకు ఆయా దేశాల రాయబార కార్యాలయాలు పరిశీలన కోసం ఢిల్లీలోని వివిధ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తాయి. (చదవండి: కోటితో ఆగను.. అదే నా స్వప్నం: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ విజేత) ఢిల్లీలోని ఏజెన్సీ సంస్థలు ఓయూకు రూ.500 చెల్లించి నేరుగా వెరిఫికేషన్కు దరఖాస్తు చేస్తాయి. హాల్టికెట్ నంబర్ ద్వారా సర్టిఫికెట్ డూప్లికేటా, ఒరిజినలా అని పరిశీలించి ఏజెన్సీ సంస్థలకు ఎయిర్లైన్స్ ద్వారా వెరిఫికేషన్ చేసి సర్టిఫికెట్ను చేరవేస్తారు. అలా ప్రతిరోజూ 50కిపైగానే వెరిఫికేషన్ కోసం ఎగ్జామినేషన్ బ్రాంచ్కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేస్తారని ఓయూ మాజీ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ వివరించారు. జూన్, జులై నెలల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే.. వెరిఫికేషన్లో జాప్యం కారణంగా ఎంతో మంది అభ్యర్థులు విదేశాల్లో ఉద్యోగాలకు దూరమవుతున్నారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. (చదవండి: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన హైదరాబాద్ బాలిక) -
గూగుల్ సంచలన నిర్ణయం
Google Two Step Verification: సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూజర్ భద్రత విషయంలో ఇక మీదట యూజర్ అనుమతితో సంబంధం లేకుండా వ్యవహరించబోతోంది!. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న వెరిఫికేషన్ను.. మరింత కట్టుదిట్టం చేయనుంది. తద్వారా హ్యాకర్లు గూగుల్ అకౌంట్లను అంత తేలికగా హ్యాక్ చేయలేరికా!. సాధారణంగా గూగుల్ అకౌంట్ను రెగ్యులర్ డివైజ్లలో లాగిన్ కానప్పుడు కన్ఫర్మ్ మెసేజ్ ఒకటి వస్తుంది. దానిని క్లిక్ చేస్తేనే అకౌంట్ లాగిన్ అవుతుంది. అయితే ఇక మీదట ఇది రెండు దశల్లో (2 సెటప్ వెరిఫికేషన్) జరగనుంది. హ్యాకర్లు అకౌంట్ను ట్రేస్ చేయడానికి వీల్లేని రేంజ్లో ఈ విధానం ఉండబోతోందని మంగళవారం గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు రకరకాల సాఫ్ట్వేర్లను ఉపయోగించి హ్యాకర్లు పాస్వర్డ్ను ఊహించడం లేదంటే దొంగతనంగా అకౌంట్ను లాగిన్ కావడం లాంటి చర్యలు సంక్లిష్టం కానున్నాయి. స్వయంగా గూగులే.. Two-Factor Authentication పేరుతో ఈ సెక్యూరిటీని చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది గూగుల్. ఇందుకోసం గూగుల్ క్రోమ్, జీమెయిల్, ఇతరత్ర గూగుల్ అకౌంట్లను అప్డేట్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్ను యూజర్ యాక్టివేట్(సెట్టింగ్స్ ద్వారా) చేయాల్సిన అవసరమేం లేదు. యూజర్ పర్మిషన్ లేకుండా గూగులే ఈ పని చేయనుంది. 2021 డిసెంబర్ కల్లా 150 మిలియన్ గూగుల్ అకౌంట్లను టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పరిధిలోకి తీసుకురానున్నట్లు గూగుల్ పేర్కొంది. అలాగే 20 లక్షల యూట్యూబ్ క్రియేటర్లను Two-Factor Authentication ఫీచర్ను ఆన్ చేయాల్సిందిగా సూచించింది. ఒకవేళ యూజర్ ఈ వ్యవస్థ వద్దనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్లి ఆఫ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం డివైజ్లలో లాగిన్ అయ్యేవాళ్లకు 2 సెటప్ వెరిఫికేషన్ తప్పకుండా కనిపిస్తుంది. రెగ్యులర్ డివైజ్లలో అప్పుడప్పుడు నొటిఫికేషన్ రావొచ్చని గూగుల్ స్పష్టం చేసింది. చదవండి: ఈ యాప్స్ను ఫోన్ నుంచి అర్జెంట్గా డిలీట్ చేయండి -
మరోసారి ట్విటర్ ఖాతాలకు బ్లూటిక్ నిలిపివేత..!
అమెరికన్ మైక్రో-బ్లాగింగ్ సైట్, సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ ట్విటర్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్విటర్ ఖాతాలకు ఇచ్చే బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ను నిలిపివేసింది. వెరిఫికేషన్ రివ్యూ ప్రాసెస్లో భాగంగా బ్లూటిక్ సేవలను ట్విటర్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ట్విటర్ ఖాతాల బ్లూటిక్ వెరిఫికేషన్ కోసం వచ్చే దరఖాస్తులను తీసుకోవడంలేదు. గతవారంలో పలు ఫేక్ ట్విటర్ ఖాతాలను తప్పుగా వెరిఫికేషన్ చేసి బ్లూటిక్ను ఇచ్చినట్లు ట్విటర్ నిర్థారించింది. ఇటీవల కాలంలో ట్విటర్ ఖాతాల ధృవీకరణ కోసం అప్లై చేసి ఉంటే వారికి బ్లూటిక్ వెరిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్విటర్ ప్రతినిధి మాట్లాడుతూ.. "రాబోయే కొద్ది వారాల్లో బ్లూటిక్ వెరిఫికేషన్కు వచ్చే దరఖాస్తులను తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ట్విటర్ తన బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రోగ్రాంను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. 2017 సంవత్సరంలో, ఈ ఏడాది మొదట్లో కూడా బ్లూటిక్ సేవలను ట్విటర్ నిలిపివేసింది. తాజాగా ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి తొలగిస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ట్విటర్ ఇండియా హెడ్ నియమితులైన మనీష్ మహేశ్వరి అమెరికాకు బదిలీ చేసింది. మనీష్ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్గా ట్విటర్ నియమించనున్నట్లు తెలుస్తోంది. -
నెట్ఫ్లిక్స్లో ఇకపై అలా నడవదు...!
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సరికొత్త ఆప్డేట్ను తీసుకురాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా నెట్ఫ్లిక్స్కు 200 మిలియన్ల పైగా సబ్స్ర్కైబర్ ఉన్నారు. భవిష్యత్తు కాలంలో నెట్ఫ్లిక్స్ అకౌంట్ డిటెల్స్ను ఇతరులతో పంచుకోలేరు. ఒకవేళ అకౌంట్ డిటెల్స్ను ఇతరులతో పంచుకున్న , వారికి అకౌంట్ ఉన్న వారు కచ్చితంగా అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ప్రసుత్తం కొంతమంది వినియోగదారులకు నెట్ఫ్లిక్స్ నుంచి తమ అకౌంట్ను వాడేవారు తమవారేనా..! అనే సందేశం యాప్ ఓపెన్ చేయగానే కనిపించింది. ప్రస్తుతం ఈ వెరిఫికేషన్ను వదిలేసిన, తిరిగి యాప్ ఓపెన్ చేయగానే ఈ సందేశం కనిపిస్తోంది. చివరికి అకౌంట్ లేనివారు కచ్చితంగా కొత్త అకౌంట్ను తీసుకోవాల్సిందే. ఈ ఆప్డేట్ను కంపెనీ ప్రస్తుతం టెస్ట్ చేస్తోంది. వాణిజ్యపరంగా, భద్రత కారణాల దృష్ట్యా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని నెట్ఫ్లిక్స్ ప్రతినిధి వెల్లడించారు. ఇదిలా ఉండగా నెటిజన్టు ఇకపై అకౌంట్ డిటైల్స్ను పంచుకోలేముని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: కోహ్లి ట్వీట్పై నెట్ఫ్లిక్స్ సంబరం) -
ప్రత్యక్ష తనిఖీ తర్వాతే జీఎస్టీ రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: జీఎస్టీ కింద నమోదు చేసుకునే వ్యాపార సంస్థలు ఆధార్ గుర్తింపు ధ్రువీకరణను ఇవ్వలేకపోతే.. ఆయా సంస్థల వ్యాపార స్థలాలను పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ మంజూరు అవుతుందని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర మండలి(సీబీఐసీ) స్పష్టం చేసింది. ఈ నెల 21 నుంచి జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తుదారులు ఆధార్ ఆథెంటికేషన్ను ఎంచుకోవచ్చని సీబీఐసీ తన నోటిఫికేషన్లో తెలిపింది. ఆథార్ గుర్తింపు ధ్రువీకరణలో విఫలమైనా లేక ఆధార్ అథెంటికేషన్ను ఎంచుకోకపోయినా.. అటువంటి దరఖాస్తులకు సంబంధించి వ్యాపార కేంద్రాలను పరిశీలించిన తర్వాతే జీఎస్టీ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తామని పేర్కొంది. దీనిపై పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ నేషనల్ లీడర్ ప్రతీక్ జైన్ స్పందిస్తూ.. ‘పన్ను చెల్లింపుదారు జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోరుకుంటే ఆధార్ అథెంటికేషన్ను ఎంచుకోవచ్చు. దీనికి ప్రత్యక్ష పరిశీలన అవసరం లేకుండా 3 రోజుల్లో రిజిస్ట్రేషన్ మంజూరు అవుతుంది. లేదంటే 21 రోజులు పడుతుంది. అధికారులు ప్రత్యక్షంగా ఆయా వ్యాపార కేంద్రాలను తనిఖీ చేసి, పత్రాల పరిశీలన తర్వాతే రిజిస్ట్రేషన్ మంజూరు చేస్తారు’’ అని వివరించారు. -
ఓటు భద్రం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఓట్ల గల్లంతు వ్యవహారం దుమారం రేపుతోంది. లోక్సభ, అసెంబ్లీ, మున్సిపల్, పంచాయతీ.. ఇలా ఏ తరహా ఎన్నికలు జరిగినా తమ ఓట్లను అకారణంగా తొలగించారని వేల మంది ఫిర్యాదు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఏటా ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం’నిర్వహించి వివిధ కారణాలతో లక్షల సంఖ్యలో ఓట్లను తొలగిస్తోంది. నివాసం మారారని/ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని, చనిపోయారని, డూప్లికేట్ ఓటు, బోగస్ ఓటు అని నిర్ధారించిన తర్వాతే సంబంధిత వ్యక్తుల ఓట్లను తొలగించాల్సి ఉండగా, చాలా సందర్భాల్లో సరైన విచారణ జరపకుండానే అర్హులైన వ్యక్తుల ఓట్లను తొలగిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటరు ధ్రువీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. సెప్టెంబర్ 1 ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని తాజాగా నవంబర్ 30 వరకు పొడిగించింది. ఈ కార్యక్రమంలో ఓటర్ల ధ్రువీకరణతో పాటే ఓటరు పేరు, చిరునామాలో తప్పులను సరిచేసుకోవడం, ఫొటోలను మార్చుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఓటును ధ్రువీకరించుకున్న వ్యక్తుల పేర్లను వారి అనుమతి లేకుండా ఓటర్ల జాబితాల నుంచి తొలగించబోమని కేంద్ర ఎన్నికల సంఘం హామీనిచ్చింది. ఓటర్ల జాబితాకు సంబంధించి ఓటర్లకు నిరంతర అప్డేట్స్ పంపడానికి వారి ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను సైతం ఈ కార్యక్రమంలో భాగంగా సేకరిస్తోంది. ఇంటింటికీ బీఎల్ఓలు... ఈ కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి ఓటర్లందరి నుంచి గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను సేకరిస్తున్నారు. పాస్పోర్టు/డ్రైవింగ్ లైసెన్స్/ఆధార్/రేషన్కార్డు/ప్రభుత్వ గుర్తింపు కార్డు/బ్యాంకు పాసుపుస్తకం/రైతు గుర్తింపు కార్డు/పాన్కార్డు/ జాతీయ జనాభా రిజిస్ట్రర్(ఎన్పీఆర్)లో భాగంగా రా>జీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జారీ చేసే స్మార్టు కార్డు/తాజా నల్లా/టెలిఫోన్/విద్యుత్/గ్యాస్ కనెక్షన్ బిల్లుల్లో ఏదైనా ఒకదానికి సంబంధించిన జిరాక్స్ ప్రతిని బీఎల్ఓలకు అందజేసి తమ ఓటు హక్కును పటిష్టం చేసుకోవచ్చు. ‘ఓటర్ హెల్ప్లైన్’ఆండ్రాయిడ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని తమ వివరాలను అప్లోడ్ చేయడం ద్వారా కూడా ఓటరు ధ్రువీకరణ చేసుకోచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ కార్యక్రమంతో ప్రయోజనాలు.. 1) ఓటర్లకు శాశ్వత లాగిన్ సదుపాయం 2) క్రమం తప్పకుండా ఎస్ఎంఎస్ల ద్వారా అలర్ట్ 3)బీఎల్ఓ/ఈఆర్ఓలతో పరిచయం 4) మీ అనుమతి లేకుండా పేరు తొలగించే వీలుండదు 5) ఎన్నికల సంబంధింత సకల సమాచారాన్ని మీ మొబైల్/మెయిల్కు అందుతుంది ఓటర్లు నేరుగా స్వీయ ధ్రువీకరణ చేసుకోవచ్చు.. ఓటర్లు స్వయంగా తమ ఓటును ధ్రువీకరించుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (https://www.nvsp.in)లో తమ పేరుతో లాగిన్ అకౌంట్ను ప్రారంభించి తమ గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను అందజేయడంతో పాటు ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామాలో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. కొత్త ఫొటోను అప్లోడ్ చేయవచ్చు. అదేలా అంటే.. స్టెప్1: మీ ఎపిక్ నంబర్తో https://www.nvsp.in వెబ్సైట్కు లాగిన్కండి. స్టెప్ 2: మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, సంబంధం రకం/పేరు, చిరునామా, ఫొటోలను ధ్రువీకరించండి. స్టెప్ 3: మీ వివరాల్లో తప్పులను సరిచేయడం/వివరాల్లో మార్పులు చేయడం, ఫొటోగ్రాఫ్ మార్పు అవసరమైతే చేయండి. స్టెప్ 4: ఏదైనా మీ గుర్తింపు ధ్రువీకరణను అప్లోడ్ చేయండి. స్టెప్ 5: తదుపరి సేవల కోసం మీ మొబైల్ నంబర్/మెయిల్ ఐడీలను జతచేయండి. -
ఫేస్బుక్: ‘మీరు మీరేనా’.. తనిఖీ చేసుకోవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : ఈ రోజుల్లో సోషల్ మీడియాను టెర్రరిస్టులు, మాఫియాలు కూడా వాడుతున్న విషయం తెల్సిందే. ఒకరి పేరు మీద మరొకరు దొంగ ఖాతాలను కలిగి ఉండడం వల్ల అది సాధ్యమవుతోంది. ఇక ముందు అలా జరుగకుండా నిరోధించేందుకు ‘మీరు మీరేనా’ రుజువు చేసుకునేందుకు ‘ఫేస్బుక్’ రహస్యంగా ఓ తనిఖీ కార్యక్రమాన్ని ఇటీవల చేపట్టినట్లు తెల్సింది. అందులో భాగంగా ఫేస్బుక్ ఖాతాదారుల ముఖాన్ని సెల్ఫీ వీడియో తీసి పంపించుమని కోరుతుంది. ఆ వీడియా ద్వారా ‘మీరు మీరేనా, కాదా?’ అన్న విషయాన్ని ధ్రువీకరించుకుంటోంది. కంటి ముందు వరకు మొబైల్ను ఎత్తుపట్టుకొని కెమేరా స్క్రీన్ మీద కనిపించే వృత్తంలో మొఖం పూర్తిగా వచ్చేలా సర్దుకోవాలి. స్క్రీన్ మీదకు సూటిగా చూస్తూ, అక్కడి నుంచి కుడికి, మళ్లీ పూర్తి ఎడమకి తలను తిప్పి మళ్లీ ముఖాన్ని సూటిగా తీసుకురావాలి. దీన్ని సెల్ఫీ తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి. ఈ వీడియోను ఎవరికి చూపించమని కూడా కంపెనీ వర్గాలు హామీ ఇస్తున్నాయి. ‘మీరు మీరేనా’ అనే విషయాన్ని రుజువు చేసుకొని నెల రోజుల్లో వీడియోను డిలీట్ చేస్తామని కూడా చెబుతున్నాయి. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించకుండానే ఫేస్బుక్ యాజమాన్యం గోప్యంగా పరిమిత స్థాయిలో సెల్ఫీ వీడియో కార్యక్రమాన్ని చేపట్టింది. త్వరలోనే దీన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ప్రైవసీ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అమెరికాలోని ఇలినాయీ కోర్టు ‘ఫేస్బుక్’ యాజమాన్యానికి భారీ జరిమానా విధించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా ఫేస్బుక్ గోప్యంగా నిర్వహిస్తోంది. -
నేటి నుంచి ఓటర్ వెరిఫికేషన్
న్యూఢిల్లీ: కొత్త ఓటర్లను చేర్చేందుకు, చనిపోయిన వారి ఓట్లను తీసి వేసేందుకు ఎన్నికల కమిషన్ సరికొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి ‘మెగా ఎలక్టర్స్ వెరిఫికేషన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ఈసీ అధికారులు శనివారం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రత్యేక యూజర్నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. వాటితో అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తమ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాల్సి ఉంటుందని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రణబీర్ సింగ్ స్పష్టం చేశారు. ఇలా చేర్చిన వివరాలను బ్లాక్ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు. దీని వల్ల సమయం ఆదా కావడమేగాక, సాధికారత వైపు ఓటర్లు అడుగులు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతుందని అన్నారు. ఢిల్లీలో దీనిపై సెస్టెంబర్ 1 నుంచి 15 వరకు ప్రచారం నిర్వహిస్తామన్నారు. ముసాయిదాను 2020 జనవరి 1న ప్రచురిస్తామని, రెండు మూడు వారాల్లోగా తుది ఫలితాలను తెలుపుతామన్నారు. ఇందులో పత్రాలు సమర్పించేందుకు రూ. 1, ఫొటో అప్లోడ్ చేసేందుకు రూ. 2, ఫామ్ 6 సమర్పించేందుకు రూ. 1 చెల్లించాల్సి ఉంటుంది. -
ఓటరు జాబితా సవరణ సమయం..
ఓటర్లకు శుభవార్త.. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 2020 ఓటర్ల తుది జాబితా ప్రకటనకు కసరత్తు ప్రారంభించింది. ఇంటింటి సర్వే సహా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించింది. దీని ప్రకారం జాబితా పారదర్శకంగా రూపొందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సాక్షి, అమరావతి : ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నిర్దేశిత షెడ్యూల్ మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 2020 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆగస్టు 31 వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న వారి వివరాలను సెప్టెంబర్లో బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి పరిశీలించనున్నారు. ఇది పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 15న మధ్యంతర ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. అప్పటికీ ఓటర్లుగా నమోదు చేసుకోని వారికి అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు తుది అవకాశాన్ని కల్పించనున్నారు. డిసెంబర్ 15లోగా అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్ 25న మరోసారి జాబితాను ప్రచురించనున్నారు. తుది పరిశీలన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తర్వాత వచ్చే ఏడాది జనవరిలో తుది జాబితా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటింటి సర్వే.. ఓటరు జాబితా సవరణలో భాగంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి 30 వరకు ఇంటింటి సర్వే చేస్తారు. బూత్లెవల్ అధికారులు (బీఎల్వోలు) తమ వద్ద ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారు. స్థానికంగా నివాసం లేనప్పటికీ ఇక్కడ ఓటరు జాబితాలో పేర్లుంటే వాటిని గుర్తించనున్నారు. సెప్టెంబరు 15వ తేదీ నుంచి అక్టోబరు 15 వరకు పోలింగ్ కేంద్రాల వివరాలు సేకరిస్తారు. ఎక్కడైనా పోలింగ్ కేంద్రాలు మార్పు చేయాల్సి ఉంటే ఆ వివరాలను నమోదు చేస్తారు. పోలింగ్ కేంద్రాల చిరునామాలు తప్పుగా నమోదైతే వాటిని సరి చేస్తారు. బీఎల్వోలు, రిటర్నింగ్ అధికారులు ఈ ప్రక్రియ చేపట్టి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరుకు నివేదిక అందజేస్తారు. అక్టోబరు 15న ముసాయిదా ప్రకటన ఈ ఏడాది అక్టోబరు 15వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాలు, వీటి పరిధిలో ఓటర్ల వివరాలు ప్రకటిస్తారు. అదే రోజు నుంచి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా చేర్చుకునేందుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2020 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు కోసం ఆన్లైన్లో లేదా బీఎల్వోలు, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 30వ తేదీ వరకు నూతన ఓటర్ల దరఖాస్తులను స్వీకరిస్తారు. వీటిని డిసెంబరు 15వ తేదీ లోపు పరిశీలిస్తారు. డిసెంబరు 25 లోపు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలన చేసి తప్పులుంటే సరి చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి జనవరిలో ఎన్నికల కమిషన్ సూచించిన తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. తప్పులు సరిదిద్దేందుకు.. ఏప్రిల్లో సాధారణ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబాతాను హడావుడిగా తయారు చేసి తుది జాబితా ప్రకటించారు. వాటిలో ఒకే కుటుంబానికి చెందిన పేర్లు పలుమార్లు ఓటర్ల జాబితాల్లో నమోదయ్యాయి. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రెండుసార్లు నమోదైన ఓటర్ల పేర్లను ప్రస్తుతం జరిగే ఓటర్ల జాబితాల సవరణల్లో తొలగిస్తారు. జాబితాలో ఓటర్ల పేర్లు తప్పుగా నమోదైతే వాటిని సరిదిద్దుతారు. ఓటరు ఫొటో గతంలో లేకుంటే చేరుస్తారు. హెల్ప్లైన్ యాప్ ద్వారా ఓటర్లు తమ పేర్లు, ఫొటోలు అడ్రసు, సక్రమంగా ఉన్నాయా.? లేదా .? అన్నది పరిశీలించుకోవచ్చు. -
వెరిఫికేషన్ ఫ్రీ
సాక్షి, సిటీబ్యూరో: పనివాళ్లే పగవాళ్లుగా మారి నిలువునా దోచేస్తున్న ఉదంతాలు ఎన్నో ఉంటున్నాయి. ఇంట్లో అద్దెకు దిగి అరాచకాలకు కారణమవుతున్న వారికీ కొదవలేదు. ఈ తరహా కేసులు ఇటీవల కాలంలో అనేకం నమోదయ్యాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా వీలున్నంత వరకు నిరోధించాలంటే పనివాళ్లు, అద్దెకు దిగేవాళ్ల గత చరిత్రను పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పోలీసు విభాగం ఉచితంగా సేవలు అందిస్తోందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. పోలీస్ అధికారిక యాప్ ‘హాక్–ఐ’ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఆయా వ్యక్తుల గత చరిత్ర, పూర్వాపరాలు పూర్తిస్థాయిలో వెరిఫై చేసి నివేదిక అందిస్తామని తెలిపారు. ఇలా చేయడం ద్వారా పనివాళ్లు, అద్దెకు ఉండేవాళ్ల డేటాబేస్ సైతం పోలీసుల వద్ద నిక్షిప్తమవుతుందన్నారు. ఇప్పటి వరకు కేవలం 6 వేల మంది మాత్రమే ఈ ‘వెరిఫికేషన్’ను వినియోగించుకున్నారని, ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రస్తుతం సిటీ జనాభా కోటి వరకు ఉండగా... నేరగాళ్ల సంఖ్య ఇందులో ఒక శాతం కూడా లేదని, ప్రజలు, మీడియా సహకరిస్తే దీన్ని మరింత తగ్గిస్తామన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొత్వాల్ కీలకాంశాలు వెల్లడించారు. రండి.. తగ్గిద్దాం ‘ప్రస్తుతం నగరంలో నమోదవుతున్న నేరాల్లో దాదాపు ప్రతి కేసూ సీసీ కెమెరాల ఆధారంగా, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోనే కొలిక్కి వస్తోంది. వీటి కారణంగానే సిటీలో నేరాల సంఖ్య తగ్గుతోంది. ప్రజలు సైతం ముందుకొచ్చి మరిన్ని కమ్యూనిటీ, ‘నేను సైతం’ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో మరో 5శాతం నేరాలు తగ్గిస్తాం. సిటీలో నేరం చేసిన వాళ్లు ఎవరైనా తప్పించుకోవడం అసాధ్యమనే సందేశం ఇచ్చాం. కాస్త ఆలస్యమైనా ఎవరినీ వదిలేది లేదని సుస్పష్టం చేస్తున్నాం. వేసవి సెలవుల నేపథ్యంలో నగరవాసులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్తే చోరులు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. సెలవుల కోసం ఊళ్లకు వెళ్లే వాళ్లు ఆ విషయాన్ని సెక్టార్ ఎస్సై, గస్తీ బృందాలకు తెలిపితే వారి ఇళ్లపై నిఘా వేసి ఉంచుతాం. నగర పోలీసు విభాగం నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడంలో లీడర్గా ఉంది. ఇక్కడి కేసులే కాకుండా పక్క కమిషనరేట్లు, పొరుగు జిల్లాలు ఇతర రాష్ట్రాలకూ కేసుల్ని కొలిక్కి తీసుకురావడానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తున్నాం. దాదాపు ఆరేడు రాష్ట్రాలు సిటీ పోలీసు సేవల్ని వినియోగించుకుంటున్నాయి. గత వారం తమిళనాడులో నమోదైన ఓ దోపిడీ కేసును కొలిక్కి చేర్చడంలో కీలకంగా వ్యవహరించాం. అనేక అంశాల్లో నగర పోలీసు విభాగం ఇతర పోలీసులకు రోల్ మోడల్గా మారింది. రాష్ట్రం ఏర్పడి వచ్చే నెల 2 నాటికి ఐదేళ్లు అవుతుంది. అయితే కొన్ని నగరాలు, రాష్ట్రాలకు చెందిన పోలీసులు 50 ఏళ్లల్లో సాధించలేని ప్రగతి, అభివృద్ధి, సాంకేతికతను నగర పోలీసు విభాగం ఐదేళ్లలో సాధించింది. ఫలితంగానే హైదరాబాద్ సేఫ్ సిటీ’ అంటూ అనేక అవార్డులు వచ్చాయని కమిషనర్ తెలిపారు. హెల్మెట్ పెట్టుకోండి... ‘ఇటీవల మధ్య మండల పరిధిలో ఓ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు దీని బారినపడ్డారు. ఆ భర్త హెల్మెట్ ధరించడంతో ఎలాంటి గాయాలు కాలేదు. అయితే వెనుక కూర్చున్న భార్య మాత్రం హెల్మెట్ లేని కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే వెనుక కూర్చునే మహిళలు సైతం హెల్మెట్ పెట్టుకోవాలి. ఓ కుటుంబానికి భర్త ఎంత ముఖ్యమో... భార్య అంతే కీలకం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చిన్నారులు సైతం ఈ విషయంలో తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావాలి. ప్రతి భర్త తన భార్యకు ఓ హెల్మెట్ ఖరీదు చేసి ఇచ్చే వరకు ఇది సాగాలి. ఇలా మొదట ద్విచక్ర వాహనాల వెనుక కూర్చునే భార్యలతో మొదలయ్యే ఈ అవగాహన ఆపై అందరికీ కలిగేలా కృషి చేయాలి. చట్ట ప్రకారం ద్విచక్ర వాహనం వెనుక కూర్చునే వారు (పిలియన్ రైడర్స్) హెల్మెట్ ధరించడం తప్పనిసరి కాదు. అయితే మన భద్రత కోసం ఎవరికి వారు అవగాహన పెంచుకుని ఈ విధానం అలవాటు చేసుకోవాలి. ఈ కోణంలో నగర ట్రాఫిక్ విభాగం అధికారులు కూడా అనునిత్యం అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు భారీ ప్రచారం నిర్వహిస్తారు. ప్రతి వారం లేదా పక్షం రోజులకు ఓ కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామ’ని చెప్పారు. వైట్నర్విక్రయాలపైడేగకన్ను... ‘సాధారణంగా విద్యార్థులు, ఇతరులు రిమూవర్/థిన్నర్గా వినియోగించే వైట్నర్కు అనేక మంది బానిసలుగా మారుతున్నట్లు గుర్తించాం. ప్రధానంగా దీనికి బానిసలుగా మారుతున్న విద్యార్థులు తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కొన్ని నేరాలకూ ఈ వైట్నర్కు అలవాటుపడిన వారే మూలంగా ఉంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని నగరంలోని వైట్నర్ విక్రయాలపై డేగకన్ను వేయాలని నిర్ణయించాం. దీనికోసం నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్లో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశాం. ఈ అధికారులు వైట్నర్ విక్రయించే దుకాణాల్లో జరుగుతున్న క్రయవిక్రయాలను గమనిస్తారు. ఎవరు ఏ స్థాయిలో వైట్నర్ ఖరీదు చేస్తున్నారు? ఎందుకు వినియోగిస్తున్నారు? అనే అంశాలను వ్యాపారులు దృష్టిలో పెట్టుకోవాలి. అలా కాకుండా లాభాపేక్షతో వైట్నర్ విక్రయిస్తుంటే దీన్ని స్పెషల్బ్రాంచ్ బృందం గుర్తిస్తుంది. అలాంటి వ్యాపారులపై నివేదిక ఇచ్చి చర్యలకు సిఫార్సు చేస్తుంది. దీన్ని తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించాం. ఈ విషయంలో తల్లిదండ్రులు సైతం తమ పిల్లల కదలికలు, వ్యవహార శైðలిని గమనిస్తూ పోలీసులకు సహకరించాల’ని సూచించారు. -
జీఎంఆర్ ఏరోకు ఈసా ధ్రువీకరణ రద్దు
హైదరాబాద్: విమానాల నిర్వహణ, మరమ్మతు సేవలు అందిస్తున్న జీఎంఆర్ ఏరో టెక్నిక్కు యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈసా) ధ్రువీకరణను రద్దు చేసింది. నవంబరు 12 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. యూరోపియన్ యూనియన్ మెంబర్ స్టేట్స్లో నమోదైన విమానాలకు ఇక నుంచి ఈ సంస్థ సర్వీసు చేయడానికి వీల్లేదు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్తో సహా ఇతర సంస్థల నుంచి జీఎంఆర్ ఏరో టెక్నిక్ పొందిన ధ్రువీకరణలపైనా ఈ రద్దు ప్రభావం ఉంటుందని ఈసా స్పష్టం చేయడం గమనార్హం. -
వీవీప్యాట్ మిషన్లు ఫొటోలు తీయబోవు..
న్యూఢిల్లీ: ఓటు ధ్రువీకరణ యంత్రాల(వీవీప్యాట్)తో అనుసంధానం చేసిన ఈవీఎంలు ఓటు వేసే సమయంలో ఓటర్లను ఫొటోలు తీయబోవని, వీటిపై ప్రచారమవుతున్న అవాస్తవాలను నమ్మవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ‘వీవీప్యాట్ ఈవీఎం మిషన్లు ఓటు వేసే సమయంలో ఫొటోలు తీస్తాయి. మీరు మా నుంచి డబ్బులు తీసుకుని ఓటు వేయకపోతే మాకు తెలుస్తుంది. మీరు మమ్మల్ని మోసం చేయలేరని కొందరు రాజకీయ నాయకులు ఓటర్లను భయపెడుతున్నారు. ఇవి పూర్తిగా అవాస్తవాలు. వీటిని నమ్మవద్దు’అని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ వివరించారు. వీవీప్యాట్ మిషన్లు ఈవీఎంతోపాటు ఉంటాయని, ఓటరు ఓటు వేసిన వెంటనే తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరు, గుర్తు వీవీప్యాట్ పరికరం నుంచి చిన్న పేపర్పై ప్రింట్ అయ్యి బయటకు వస్తాయని చెప్పారు. ఆ పేపరు సుమారు 7 సెకన్లపాటు ఓటరుకు కనిపించి.. అక్కడే ఉన్న బాక్స్లోకి వెళుతుందని తెలిపారు. -
రేపటి వరకు ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్లో భాగంగా 58,732 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు హాజరయ్యారు. ఇంజనీరింగ్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్కు 1,36,305 విద్యార్థులు హాజరు కాగా.. అందులో 1,06,646 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వారిలో ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న విద్యార్థులకు గత నెల 28 నుంచి వెరిఫికేషన్ను ప్రవేశాల క్యాంపు నిర్వహించింది. ఆ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఈ వెరిఫికేషన్కు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు 55,354 మంది, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని వారు 1,807 మంది, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని వారు 1,157 మంది, ఇతర రాష్ట్రాల వారు 414 మంది హాజరైనట్లు ప్రవేశాల క్యాంపు కార్యాలయం అధికారి శ్రీనివాస్ తెలిపారు. అందులో 36,163 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. మిగతా విద్యార్థులు ఈ నెల ఐదు లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. సీట్ల కేటాయింపును ఈ నెల 8న ప్రకటిస్తామని వెల్లడించారు. -
ఊపందుకున్న సర్టిఫికెట్ల పరిశీలన!
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఊపందుకుంది. రెండో రోజు మంగళవారం ఉన్నత పాఠశాలల టీచర్ల దరఖాస్తులను పరిశీలించారు. మొత్తం 431 స్కూళ్లకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. అనంతపురం డివిజన్లో 75, గుత్తి డివిజన్లో 108, పెనుకొండ డివిజన్లో 128, ధర్మవరం డివిజన్లో 120 స్కూళ్ల టీచర్ల సర్టిఫికెట్లను పరిశీలించారు. అన్ని డివిజన్లకూ సంబంధించి 56 స్కూళ్లు పెండింగ్ ఉన్నాయి. బుధవారం ఉదయమే వాటిని పూర్తి చేస్తామని డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. అలాగే ఈనెల 12తో ఈ ప్రక్రియను ముగించాల్సిన నేపథ్యంలో బుధవారం మండల విద్యాశాఖ అధికారులు సైన్స్ సెంటర్కు రావాలని ఆదేశించారు. వివిధ పాయింట్ల కోసం దరఖాస్తు చేసుకున్న టీచర్ల ధ్రువీకరణ పత్రాలు పక్కాగా పరిశీలించాలన్నారు. మళ్లీ కనిపిస్తే సస్పెండ్ చేస్తా : డీఈఓ ‘ఏవైనా పాయింట్లకు సంబంధించిన సమస్యలుంటే నేరుగా ప్రధానోపాధ్యాయుల ద్వారా ఫిర్యాదులు చేయాలని పదేపదే చెప్పా. పత్రికల్లో వచ్చాయి. సెల్ఫోన్లలో రోజూ మెసేజ్లు పంపుతున్నా. అయినా టీచర్లలో మార్పు రావడం లేదు. పాఠశాల సమయంలో సైన్స్ సెంటర్కు ఎందుకొస్తున్నారు? మళ్లీ కనిపిస్తే సస్పెండ్ చేస్తా’ అని డీఈఓ హెచ్చరించారు. దరఖాస్తుల పరిశీలన జరుగుతున్న సైన్స్ సెంటర్ ప్రాంగణంలో మంగళవారం ఉదయం పలువురు టీచర్లు కనిపించారు. వారిని చూడగానే డీఈఓ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను నాశనం చేయొద్దన్నారు. బడులు వదిలేసి రావద్దంటే కూడా అలాగే వస్తారా? అని మండిపడ్డారు. -
గ్రూప్–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 12 నుంచి 24 వరకు
టీఎస్పీఎస్సీ వెల్లడి సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను ఈ నెల 12 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. తేదీల వారీగా వెరిఫికేషన్కు హాజరుకావాల్సిన అభ్యర్థుల జాబితాలను తమ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. గ్రూప్–2 పరీక్షలో వైట్నర్ ఉపయోగించి అభ్యర్థి వివరాలను మార్పు చేసిన వాటినే అనుమతించామని, వైట్నర్తో జవాబులు మార్పు చేసిన అభ్యర్థులను అనుమతించలేదని టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. గత నవంబర్లో జరిగిన పరీక్షలో విద్యార్థులకు ఇచ్చిన ఓఎంఆర్ జవాబుపత్రం, ప్రశ్నపత్రం సరిపోలకపోవడంతో వాటిని మార్చారు. ఈ క్రమంలో ముందుగా ఇచ్చిన ఓఎంఆర్ జవాబు పత్రంలో అభ్యర్థికి సంబంధించిన వివరాలను, ప్రశ్న పత్రం బుక్లెట్ కోడ్ మాత్రమే కొంతమంది అభ్యర్థులు వైట్నర్ ఉపయోగించి మార్పు చేశారని పేర్కొంది. ఇదే విషయాన్ని అభ్యర్థులతోపాటు చీఫ్ సూపరిం టెండెంట్లు తెలియ జేశారంది. దీనిపై టెక్నికల్ కమిటీ వేశామని, ఆ కమిటీ సూచ నల మేరకు వివరాలను మాత్రమే వైట్నర్తో మార్పు చేసిన వారి ఫలితాలను ఇచ్చామని, జవాబులను మార్పు చేసిన వారి ఫలితాలను ఇవ్వలేదని తెలిపింది. నామినల్ రోల్స్ ఇతర వివరాలను సరిచూశాకే ఫలితాలను ఇచ్చామంది. దీనివల్ల మెరిట్ విషయంలో ఎవరికీ అన్యాయం జరిగే అవకాశం ఉండదని పేర్కొంది. -
డీఎడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
బుక్కపట్నం : డీఎడ్–2016 రెండో కౌన్సెలింగ్లో సీట్లు డౌన్ లోడు చేసుకున్న విద్యార్థులకు డైట్ కళాశాలలో మంగళవారం సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టామని ప్రిన్సిపాల్ జనార్దన్రెడ్డి అన్నారు. రెండో కౌన్సిలింగ్ స్లైడింగ్లో కొత్త కళాశాలలో సీట్లు పొందిన వారు గతంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కాలేదని అలాంటి వారు కూడా బుధవారం హాజరు కావచ్చనని ఆయన పేర్కొన్నారు. -
రికార్డుల పరిశీలన వేగవంతం
మహబూబాబాద్ : మానుకోట జిల్లా ఏర్పా టు నేపథ్యంలో డివిజన్ పరిధిలోని పలు మండలాలు ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లా యి. దీంతో ఆయా మండలాల రికార్డుల పరిశీలన మానుకోట ఆర్డీఓ కార్యాలయం లో ముమ్మరం చేశారు. ఇందుకు సిబ్బంది ని కూడా కేటాయించారు. మానుకోట డివి జన్లో మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాలతోపాటు తొర్రూరు, నెక్కొండ మండలాలు ఉన్నాయి. మానుకోట జిల్లాలోకి కొత్తగూడ, గూడూరు, బయ్యారం, గార్ల మండలాలు చేరాయి. నర్సంపేట డివిజన్లోని గూడూరు మండలం, ఖమ్మం జిల్లా కొత్తగూడ డివిజన్లోని గార్ల, బయ్యారం మండలాలు రానున్నాయి. మానుకోట డివి జన్ పరిధిలోని నెక్కొండ మండల రికార్డులను నర్సంపేట డివిజన్కు అందజేసే పను లు వేగవంతం చేశారు. నర్సంపేట డివిజన్లోని గూడూరు, ములుగు డివిజన్లోని కొత్తగూడ మండలానికి సంబంధించిన భూములు, ఇతర వివరాలను మానుకోట జిల్లా పరిధిలోకి రానున్నాయి. గార్ల, బయ్యారానికి సంబంధించి రికార్డులను త్వరలోనే ఆర్డీఓ కార్యాలయానికి వస్తాయని అధికారులు తెలిపారు. -
డీఈఈసెట్ సర్టిఫికెట్ల పరిశీలనకు 432 మంది హాజరు
బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) : బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో డీఈఈసెట్–2016లో అర్హత సాధించి డీఎడ్ కోర్సుల్లో చేరే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మూడో రోజైన మంగళవారం కూడా కొనసాగింది. 432 మంది సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఆన్లైన్లో నిర్దేశించిన ఫీజులు చెల్లించిన తరువాత కళాశాల అడ్మిషన్ లేఖలు అందజేసినట్టు ప్రిన్సిపాల్ జయప్రకాశరావు తెలిపారు. -
నేటి నుంచి డీసెట్–2016 సర్టిఫికెట్ల పరిశీలన
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : డీసెట్–2016(డైట్సెట్)లో భాగంగా ఆదివారం నుంచి పదో తేదీ వరకు బి.తాండ్రపాడులోని ప్రభుత్వ డైట్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం జరుగుతుందని డైట్ ప్రిన్సిపాల్ రాఘవరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు తమ వెంటనే ఆన్లైన్ అప్లికేషన్, హాల్ టిక్కెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి మార్కుల లిస్టు, ఇంటర్ మార్కుల లిస్టు, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు(ఒకటి నుంచి 10వ తరగతి), కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేదా రేషన్ కార్డులతో పాటు పీహెచ్, స్పోర్ట్స్, క్యాప్, ఎన్సీసీ(బీ ఆర్ సీ) తదితర సర్టిఫికెట్లను తీసుకొని 45్ఠ30 సైజు పాలిథిన్ కవర్లో పెట్టుకొని రావాలని సూచించారు. అంతేకాక జిల్లాలోని అన్ని ప్రై వేట్ డీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు కూడా హాజరు కావాలని కోరారు. -
నేటి నుంచి డైట్ సెట్ కౌన్సెలింగ్
అంగలూరు(గుడ్లవల్లేరు) : డైట్ సెట్– 2016 తొలి విడత కౌన్సెలింగ్ శనివారం నుంచి నిర్వహించనున్నట్లు అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థ(డైట్) ప్రిన్సిపాల్ జి.వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. సీట్ల కేటాయింపు, అలాట్మెంట్ లెటర్ డౌన్లోడు శనివారమే జరుగుతుందన్నారు. ఏడో తేదీన సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. ఈ నెల 9న తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రొవిజినల్ ఎలాట్మెంట్ లెటర్ను ప్రభుత్వ డైట్ నుంచి తీసుకుని కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయాలని తెలిపారు. -
7 నుంచి డీఈఈసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) : ఏపీ డీఈఈసెట్–2016లో అర్హులైన అభ్యర్థులకు వారికి కేటాయించిన ప్రభుత్వ డైట్ కళాశాలల్లో ఈ నెల ఏడు నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపాల్ అప్పారి జయప్రకాశరావు శుక్రవారం విలేకర్లకు తెలిపారు. డీఈఈసెట్లో అర్హులైన అభ్యర్థులు తమకు నచ్చిన డైట్, ప్రభుత్వ, ప్రైవేటు డీఎడ్ కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చారన్నారు. వెబ్ కౌన్సెలింగ్లో సీటు పొందినవారు ఈ నెల ఆరో తేదీన ఎలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. తమకు ఏ కళాశాలలో, ఏ జిల్లాలో సీటు వచ్చిందో, ఏ ప్రభుత్వ డైట్ కళాశాలకు వెళ్లాలో క్షుణ్ణంగా చదువుకోవాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు నిర్దేశిత తేదీల్లో ప్రభుత్వ డైట్ కళాశాలకు వెళ్లాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చే అభ్యర్థులు అలాట్మెంట్ లెటర్తోపాటు, ఆన్లైన్లో పెట్టిన అప్లికేషన్ కాపీ తీసుకురావాలన్నారు. దాని ఆధారంగా మాత్రమే ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని చెప్పారు. ఎలాట్మెంట్ లెటర్లో పేర్కొన్న ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలని తెలిపారు. జిల్లాకు సంబంధించి బొమ్మూరులోని ప్రభుత్వ డైట్ కళాశాలకు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలన్నారు. నిర్దేశిత ఫీజులు ఆన్లైన్లో చెల్లించిన తరువాత ఫైనల్ అడ్మిషన్ లెటరు అందజేస్తామని తెలిపారు. -
ముగిసిన పీజీ మెడికల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీ పీజీ మెడికల్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియలో నాన్ సర్వీస్, ఇన్సర్వీస్ సర్టిఫికెట్ల పరిశీలన ఆదివారంతో ముగిసింది. విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరిగిన తెలంగాణ, ఏపీకి చెందిన దివ్యాంగ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా ఆదివారం ముగిసింది. ఏపీ అభ్యర్థులకు సంబంధించి హైదరాబాద్ జేఎన్టీయూలో 151, ఏయూలో 72, ఎస్వీ యూనివర్సిటీలో 49, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 379 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తెలంగాణ కేఎన్ఆర్ యూనివర్సిటీ కింద జేఎన్టీయూ హైదరాబాద్లో 430, కాకతీయ యూనివర్సిటీలో 47, ఎన్టీఆర్ యూనివర్సిటీలో 223 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో కలిపి దివ్యాంగులకు జరిగిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో 20 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తెలంగాణలో నాన్ సర్వీస్ అభ్యర్థులకు జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు సోమవారం 1,001 నుంచి 4వేల ర్యాంకుల వరకు ఆహ్వానించారు. -
పక్కాగా ‘వెరిఫై’ చేస్తారు!
సాక్షి, హైదరాబాద్: నూతన రాష్ట్రం, రాజధాని ప్రాంతం కావడంతో కొత్తగా ప్రైవేట్ సంస్థలు వచ్చి రిక్రూట్మెంట్ చేపట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకూ చెందిన వారు ఉద్యోగాల కోసం వచ్చే అవకాశం ఉంది. వీరిలో నేరచరితులు ఉంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అత్యాధునిక ‘వెరిఫికేషన్’ సాఫ్ట్వేర్ రూపకల్పనకు ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. దీన్ని వినియోగించడం ద్వారా ఏదైనా సంస్థ రూ. 500 రుసుము చెల్లించి తమ వద్ద ఉద్యోగంలో చేరే వారి గత చరిత్రను వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఈ విధానం ఇప్పటికే అమలులో ఉన్నా సరిగా సాగట్లేదు. వెరిఫై సాఫ్ట్వేర్ రూపొందించాలని నిర్ణయించిన పోలీసు విభాగం ప్రాథమికంగా కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోనుంది. తద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 2,300 కోర్టులకు సంబంధించిన ఐదున్నర కోట్ల రికార్డులతో కూడిన డేటాబేస్తో అనుసంధానం చేసుకుంటారు. ఆయా న్యాయస్థానాల్లో ట్రయల్ పెండింగ్, ట్రయల్ దశ, వీగిపోయిన, శిక్షపడిన, రాజీ కుదిరిన కేసుల వివరాలు ఆన్లైన్లో పోలీసు విభాగానికి అందుబాటులోకి వస్తాయి. దీని ఆధారంగా ‘వెరిఫై’ సాఫ్ట్వేర్ను రూపొందిస్తారు. ఈ డేటాబేస్ను అన్ని పోలీసుస్టేషన్లకూ కనెక్టివిటీ ఉండేలా ఇంట్రానెట్తో అనుసంధానిస్తారు. తద్వారా ఓ నేరం జరిగినప్పుడు ఆ తరహా నేరాలు చేసే వారు, గతంలో పలుసార్లు చేసిన వారు ఎవరు ఉన్నారు? వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? తక్షణం తెలుసుకోవడంతో పాటు డేటా నుంచే వారి ఫొటో, చిరునామా, వేలిముద్రలు కూడా సంగ్రహించి అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందరికీ ఉపయుక్తకరం... పూర్తిస్థాయిలో అప్డేట్ అయిన ‘వెరిఫై’ సాఫ్ట్వేర్ అందుబాటులోకి వస్తే పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి తక్షణం వాటిని అందించే అవకాశం ఏర్పడుతుంది. దీని కంటే ముఖ్యంగా ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా పటిష్టమైన నివేదికలు రూపొందించి దరఖాస్తుదారులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రైవేటు కంపెనీలకు సమర్పించే అవకాశం ఉంటుంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ గార్డులుగా, పని మనుషులుగా, డ్రైవర్లుగా చేరే వారు పలు నేరాలు చేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి వారిలో అత్యధిక శాతం నేర చరిత్ర కలిగిన వారే ఉంటున్నారు. ‘వెరిఫై’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే యజమానులు సైతం పోలీసులను ఆశ్రయించి తమ వద్ద ఉద్యోగాల్లో చేరే వారి వివరాలను సమగ్రంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. -
8 నుంచి డీఈఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో చేరేందుకు డీఈఈసెట్-2015 పరీక్షకు హాజరై అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 8 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు డీఈఈసెట్ చైర్మన్, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు తెలిపారు. మార్కుల ఆధారంగా నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. ఓసీ/బీసీ అభ్యర్థులైతే 100 మార్కులకు గాను 35 మార్కులు వస్తే అర్హులేనని, ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులేమీ లేవని, పరీక్షకు హాజరైతే వారిని అర్హులుగానే ప్రకటించినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ఇంటర్మీడియట్/తత్సమాన, ఎస్ఎస్సీ/తత్సమాన, 1 నుంచి 10వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్ లేదా రెవెన్యూశాఖ జారీ చేసిన నివాస, కులం సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. పూర్తి వివరాలకు tsdeecet.cgg.gov.in వెబ్సైట్ను పరిశీలించాలన్నారు. -
కృష్ణా జలాల కేసుపై నేడు సుప్రీంలో విచారణ
-
ఆదాయ పరిమితి పెంచిన కేసిఆర్ సర్కార్
-
ఏడాదిగా ఎదురుచూపు
కర్నూలు(అర్బన్): ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి వివిధ రుణాల కోసం లబ్ధిదారులు ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. వెరిఫికేషన్, ఎన్నికలు, కొత్త ప్రభుత్వం తదితర కారణాలతో కాలయూపన జరగుతోంది. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 5366 మంది లబ్ధిదారులకు రూ.34.34 కోట్ల మేరకు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 2027 మందికి రూ.20.82 కోట్లు సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరయ్యాయి. అయితే గత ఏడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికలు రావడంతో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి రుణాలు అందించని పరిస్థితి ఏర్పడింది. జీవో నంబర్ 101తో మొదలైన కాలయూపన.. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి 2013 డిసెంబర్ 31వ తేదీన జీవో నంబర్ 101ను జారీ చేశారు. ఈ మేరకు 45 సంవత్సరాల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీలు మాత్రమే రుణాలు పొందేందుకు అర్హులు. దీంతో వందల సంఖ్యలో దరఖాస్తులు బుట్టదాఖాలయ్యాయి. వయస్సు నిర్ధారణకు సంబంధించి ఆయా కార్పొరేషన్లకు అందిన దరఖాస్తులన్నీ తిరిగి మండలాలు, మున్సిపల్ కార్యాలయూలకు తిప్పి పంపారు. ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులను వడపోసి తిరిగి కార్పొరేషన్లకు పంపడంలో కొంత మేర జాప్యం జరిగింది. వయసు నిర్ధారణ తర్వాత రూపొందించిన జాబితాలను కలెక్టర్ అనుమతి కోసం పంపారు. కలెక్టర్ అనుమతి లభించిన అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మళ్లీ అవి పెండింగ్లో పడ్డారుు. నేతల పెత్తనం.. ఎన్నికలు అయిపోయి రాష్ట్రంలో కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కలెక్టర్ అప్రూవల్ చేసిన దరఖాస్తులను గ్రామీణ, మున్సిపల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫించన్ కమిటీలు స్క్రూట్నీ చేయూలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 535ను జారీచేసింది. ఆ మేరకు ఎస్సీ, ఎస్సీ కార్పొరేషన్లలోని దరఖాస్తులను తిరిగి పింఛన్ల కమిటీ పరిశీలనకు పంపుతారు. ఈ గ్రామ కమిటీల్లో సర్పంచు, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి, ఇద్దరు స్వయం సహాయక సంఘాల లీడర్లు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు ఉంటారు. మున్సిపల్ ప్రాంతాల్లో కార్పొరేటర్, ఇద్దరు స్వయం సహాయక సంఘాల లీడర్లు, ముగ్గురు సామాజిక కార్యకర్తలు, ఒక బిల్ కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. వీరు విచారించి సిఫారసు చేసిన దరఖాస్తులను ఉన్నతాధికారి కార్యాలయానికి అప్లోడ్ చేయనున్నారు. ఇక్కడే వారు రాజకీయం చేస్తున్నారు. తమ వారి దరఖాస్తులను మాత్రమే సిఫార్సు చేస్తున్నారు. అర్హులైనా చాలామంది దరఖాస్తులను పక్కన పడేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2027 దరఖాస్తులను ఆయా కార్యాలయాలకు పంపగా 676 దరఖాస్తులను మాత్రమే సిఫారసు చేశారు. ఎస్టీ కార్పొరేషన్ కూడా 527 దరఖాస్తులను ఆయా కార్యాలయాలకు విచారణకు పంపేందుకు చర్యలు చేపట్టింది. -
8 నుంచి పింఛన్ల పంపిణీ
తొలి నెలలో నేరుగా లబ్ధిదారుల చేతికే పెంచిన పింఛన్ నగదు కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో కేటీఆర్ తర్వాత నెల నుంచి గతంలో మాదిరిగా చెల్లింపు సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పెంచిన పింఛను సొమ్మును తొలి నెలలో నేరుగా లబ్ధిదారుల చేతికే ఇవ్వనున్నట్లు చెప్పారు. పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల ప్రక్రియపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో మాట్లాడారు. తొలి నెల్లో నేరుగా చేతికే: వృద్ధులు, వితంతువులకు రూ.వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.1,500 చొప్పున పింఛన్ల సొమ్మును నేరుగా వారి చేతికే అందించడం ద్వారా.. వారి సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేయాలని కేటీఆర్ అధికారులను కోరారు. ‘తర్వాతి నెల నుంచి గతంలో మాదిరిగా చెల్లింపులు ఉంటాయి. గ్రామం యూనిట్గా పింఛన్లను పంపిణీ చేయాలి. ప్రారంభించిన మూడు రోజుల్లో పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యేలాగా చర్యలు చేపట్టాలి’ అని చెప్పారు. పంపిణీలో సమస్యలు తలెత్తకుండా లబ్ధిదారులకు పింఛన్ అందినట్లు కంప్యూటరైజ్డ్ రసీదు తీసుకోవాలని సూచించారు. వారంలోగా వెరిఫికేషన్..: పింఛన్ల పంపిణీకి గడువు దగ్గర పడుతున్నందున దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని, వారంలోగా పూర్తి చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల కోసం 39,90,197 దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 19,27,049 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, ఆహార భద్రతా కార్డుల కోసం 92,06,366 దరఖాస్తులు రాగా, 19,28,528 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు. పింఛన్ల విషయమై ఇప్పటికే ప్రజల్లో అవగాహన ఉన్నప్పటికీ, పెరిగిన పింఛను విషయమై మరింత విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు. వితంతువుల పింఛను దరఖాస్తుల పరిశీలన సందర్భంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రాల కోసం వారిని ఒత్తిడి చేయవద్దని ఆదేశించారు. -
సర్టిఫికెట్లు లేకున్నా కౌన్సెలింగ్కు అనుమతి
వెరిఫికేషన్ కేంద్రాలకు మౌఖిక ఆదేశాలు ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు ఊరట ‘సాక్షి’ కథనానికి స్పందన హైదరాబాద్ : పీజీ ఈసెట్ కౌన్సిలింగ్కు హాజరయ్యే అభ్యర్థులు తమ వద్ద ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకున్నా వెరిఫికేషన్కు హాజరుకావచ్చు. అయితే.. బీటెక్లో అన్ని సబ్జెక్టులు పాసైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని వెరిఫికేషన్ కేంద్రంలో సమర్పించాలి. ఫీజు రీయింబర్స్మెంట్ అందని కారణంగా పలు ఇంజనీరింగ్ కాలేజ్లు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని కారణంగా గేట్, పీజీ ఈసెట్ ర్యాంకర్లు ఈనెల 6నుంచి ప్రారంభమైన కౌన్సెలింగ్కు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై ఈనెల 7న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బీటెక్ పాసైనట్లు ధ్రువీకరణ పత్రం తెచ్చిన అభ్యర్థులను కౌన్సెలింగ్కు అనుమతించాలని కౌన్సెలింగ్ కేంద్రాలకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. పాసైనట్లు ధ్రువీకరణ ఇలా.. పీజీ ఈసెట్ వెరిఫికేషన్ కేంద్రాలకు వె ళ్లే అభ్యర్థులు విద్యార్హతల పత్రాలు కళాశాల్లోనే ఉన్నట్లైతే.. తమ వద్దే ఉన్నట్లుగా ప్రిన్సిపాల్ ఇచ్చే కస్టోడియన్ లెటర్ను వెరిఫికేషన్ అధికారులకు చూపవచ్చు. అదే లెటర్లో బీటెక్ అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులైనట్లుగా పేర్కొనాలి. లేదా పాస్ సర్టిఫికెట్ల జిరాక్సుప్రతులపై అటెస్టేషన్ చేసి ఇచ్చినా అనుమతిస్తారు. అలా కుదరని పక్షంలో.. సంబంధిత యూనివర్సిటీల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ల నుంచి సదరు విద్యార్థి బీటెక్ ఉత్తీర్ణులైనట్లు ధ్రువపత్రం (కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో జిరాక్సు ప్రతిని అటెస్టేషన్ చేయించి) తెచ్చినా సరిపోతుంది. ఆర్జేయూకేటీ పరిధిలోని బీటెక్ పాసైన వారికి కూడా ఈ తరహా లెటర్లు ఇవ్వాలని ఆయా సంస్థల డెరైక్టర్లకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. లెటర్లు తెచ్చినా చాలు: పీజీ ఈసెట్ కన్వీనర్ బీటెక్ పాసైన అభ్యర్థులకు సీఎంఎం జిరాక్సు ప్రతులపై అటెస్టేషన్ చేసి ఇవ్వాలని అన్ని యూనివర్సిటీల కంట్రోలర్లకు సూచించాం. కళాశాలల్లో ప్రిన్సిపాల్ నుంచి కస్టోడియన్ లెటరు తెచ్చినా అనుమతిస్తున్నాం. -
సర్వీస్ రికార్డులతో పాటే పరిశీలన
-
31లోగా ముగించాలి
-
ఎంసెట్ వివాదం
-
వెరిఫికేషన్ మాత్రమే!
-
ఎంసెట్ చిచ్చు!