Vijaykanth
-
ఒకప్పుడు నెట్ బౌలర్.. ఇప్పుడు సన్రైజర్స్ జట్టులోకి ఎంట్రీ
ఐపీఎల్-2024 సీజన్ మొత్తానికి సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్, శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా హసరంగా స్ధానాన్ని ఎస్ఆర్హెచ్ మెన్జ్మెంట్ భర్తీ చేసింది. అతడి స్ధానంలో మరో శ్రీలంక యువ స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్తో సర్రైజర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.50 లక్షల కనీస ధరకు ఎస్ఆర్హెచ్ అతడిని సొంతం చేసుకుంది. కాగా ఐపీఎల్-2023 సీజన్లో ఆర్సీబీకి నెట్బౌలర్గా విజయకాంత్ పనిచేశాడు. ఇక అతడు శ్రీలంక తరపున ఇప్పటివరకు కేవలం ఒకే టీ20 మ్యాచ్ ఆడాడు. కానీ విజయకాంత్కు అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటికి.. డొమాస్టిక్ క్రికెట్లో మాత్రం మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు తన కెరీర్లో 33 టీ20లు ఆడిన విజయకాంత్ 6.76 ఏకానమీ రేటుతో 42 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ జట్టులో సరైన మణికట్టు స్పిన్నర్లు లేరు. ఈ నేపథ్యంలో విజయకాంత్ను సొంతం చేసుకోవడం ఎస్ఆర్హెచ్ కలిసిశ్చే ఆంశం. కాగా ఈ ఏడాది సీజన్లో సన్రైజర్స్ ఇప్పటివరకు 4మ్యాచ్లు ఆడి రెండింట విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్ధానంలో సన్రైజర్స్ కొనసాగుతోంది. -
విజయ్కాంత్ లేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నా: కార్తీ
దివంగత నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్కాంత్కు దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం తరపున ఈ నెల 19న సంస్మరణ సభను నిర్వహించనున్నట్లు హీరో, ఆ సంఘం కోశాధికారి కార్తీ తెలిపారు. గత నెల 28న విజయ్కాంత్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించగా.. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉండటం కారణంగా సంతాపం తెలుపలేకపోయారు. అందులో హీరో కార్తీ ఒకరు. గురువారం చైన్నెకి చేరుకున్న ఆయన తన తండ్రి శివకుమార్, సోదరుడు సూర్యతో కలిసి స్థానిక కోయంబేడులోని డీఎండీకే పార్టీ కార్యాలయ ఆవరణలో విజయకాంత్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయ్కాంత్ మన మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వాపోయారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆయన్ని కలిసినప్పుడు చాలా ఉత్సాహంగా మాట్లాడారని పేర్కొన్నారు. అధ్యక్షుడు అంటే మార్గదర్శిగా నిలవాలన్నది విజయ్కాంత్ నుంచే నేర్చుకున్నట్లు తెలిపారు. కాగా జనవరి 19న తమ సంఘం తరపున విజయ్కాంత్కు సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. • Exclusive - #Sivakumar Sir, @Karthi_Offl Anna At Captain #Vijayakanthsir 's Home For Grieving The Loss Of Their Loved One | @prabhu_sr #Karthi pic.twitter.com/pzMldSMoez — Yogesh Yogi (@YogeshY16480498) January 5, 2024 చదవండి: ఒక కన్నులో ధైర్యం, మరో కన్నులో కరుణ.. అంటూ బోరున ఏడ్చిన సూర్య -
కరోనా ఇలా కూడా ఎటాక్ చేస్తుందా? నటుడు విజయ్కాంత్ కూడా..
కోలివుడ్కి చెందిన ప్రుముఖ నటుడు విజయ్కాంత్(71) చెన్నైలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలతో పోరాడుతుండగానే చివరికి కరోనా పాజిటివ్గా అని తేలిన ఒక్కరోజులోనే మృతి చెందారు. న్యూమెనియా లక్షణాలతో కూడా కరోనా అటాక్ ఇస్తుందా? లేదా ఇది కూడా కరోనా సంకేతమా? లేక వయసు కారణామా?. అలాంటప్పుడూ సీనియర్ సిటీజన్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?. డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ తమిళ నటుడు విజయ్కాంత్ అభిమానులను శోక సంద్రంలోకి నెట్టేస్తూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తొలుత తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి సమస్యలతో ఆస్పత్రిలోకి చేరినట్లు సమాచారం. ఆ తర్వాత సుమారు 14 రోజులు వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు. న్యూమెనియా వంటి శ్వాసకోశ సమస్యలతో పోరాడుతున్నట్లు పేర్కొన్నారు వైద్యులు. ఆ తర్వాత కరోనా పరీక్షల్లో పాజిటివ్గా తేలడం, పరిస్థితి విషమించడం మృతి చెందడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో అందరిలో న్యూమోనియా కాస్త కరోనా మారి ప్రాణాంతకంగా పరిణామిస్తుందా? అని తీవ్ర భయాందోళనలు తలెత్తుతున్నాయి. అయితే వైద్యులు ఇలా ఎంత మాత్రం జరగదని చెబుతున్నారు. ఒక్కొసారి తేలికపాటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తేలిగ్గా తీసుకున్నప్పుడే సమస్య తలెత్తుందన్నారు వైద్యులు. వయసు వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే సుమారు 61 ఏళ్ల పైబడినవారిలో చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు, దీనికి తోడు వారిలో వ్యాధినిరోధక శక్తి కూడా తక్కువుగా ఉంటుంది. అందువల్ల అలాంటి వారు సదా అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచిస్తున్నారు. యువత కంటే పెద్దలు, చిన్నారులే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేగాదు ముఖ్యంగా కీమోథెరపీ, మధుమేహం, స్టెరాయిడ్లు తీసుకుంటున్నవారు, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణి స్త్రీలు బహు జాగ్రత్తగా ఉండాల్సిందేనని నొక్కి చెబుతున్నారు వైద్యులు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. జ్వరం అలసట దగ్గు, గొంతు నొప్పి ఊపిరి ఆడకపోవడం కండరాలు, శరీర నొప్పులు తలనొప్పి చలి రుచి, వాసన కోల్పోవడం తదితర లక్షణాలు వృద్ధలు లేదా పెద్దవారిలో వస్తే అస్సలు నిర్లక్ష్య చేయకుండా తక్షణమే వైద్యుడిన సంప్రదిస్తే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ కొత్త కరోనా సబ్ వేరియంట్ జేఎన్ 1 మరింత ప్రమాదకారి కాదు కానీ తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందేనని హెచ్చరించారు. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత, చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటిచటం తోపాట్లు ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తే సెపరేట్గా ఉండటం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే కాలనుగుణంగా తాజా కూరగాయాలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవడం వంటివి చేయాలని అన్నారు. అన్నింటికంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం వంటివి చేయడం అత్యంత ముఖ్యమని సూచించారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: తినే గమ్(గోండ్) గురించి తెలుసా? బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు..) -
Actor-Politician Captain Vijayakanth: విజయ్ కాంత్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం (ఫొటోలు)
-
విజయకాంత్ మృతిపట్ల నటుడు విశాల్ ఎమోషనల్
-
విజయకాంత్ భౌతికకాయానికి తమిళనాడు సీఎం స్టాలిన్ నివాళి
-
విజయకాంత్ మృతిపై ఏపీ సీఎం జగన్ సంతాపం
గుంటూరు, సాక్షి: ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది. విజయకాంత్ కుటుంబసభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని సదరు ప్రకటనలో తెలిపారు సీఎం జగన్. యాక్షన్ హీరోగా తమిళ చలన చిత్ర పరిశ్రమలోనే కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ ఆయన చెరగని ముద్ర వేసింది తెలిసిందే. ఇదిలా ఉంటే.. 71 ఏళ్ల విజయ్కాంత్ ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఈమధ్యే కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషించారు. అయితే కరోనా బారినపడ్డాక ఆయన పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఈ ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఇదీ చదవండి: తమిళ రాజకీయాల్లో కెప్టెన్ ఓ సంచలనం -
ఒక్క సీటుతో కింగ్మేకర్.. కూటమిలతో తగ్గిన విజయకాంత్ క్రేజ్
కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) అనారోగ్యంతో చికిత్స పొందుతూ... నేడు (డిసెంబర్ 28) తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. విజయకాంత్ జననం: విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగరస్వామి. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత తన పేరును విజయకాంత్గా మార్చుకున్నారు. విజయకాంత్కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. సినిమా ఎంట్రీ: విజయకాంత్ 27 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు. 1979లో 'ఇనిక్కుం ఇలామై' చిత్రంతో విలన్గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు. రోజుకు మూడు షిఫ్టులు పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ. ఆ తర్వాత ఆయన నుంచి ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 1984లో విజయకాంత్ నుంచి 18 సినిమాలు విడుదలయ్యాయి. 20కి పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా కనిపించాడు. విజయకాంత్ తమిళ చిత్రాల్లో మాత్రమే నటించారు. ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు చాలా భాషల్లో డబ్బ్ అయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లకు విజయకాంత్ ఒకప్పుడు గట్టి పోటీ ఇచ్చారు. విజయకాంత్ మెసేజ్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. దేశభక్తి చిత్రాలైనా, గ్రామీణ నేపథ్య సినిమాలైనా, ద్విపాత్రాభినయాలైనా నటించేందుకు విజయకాంత్ ఎప్పుడూ ముందుండేవారు. వాటితో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ సందడి చేసేవారు. అయితే ఆయన ఏ నిర్మాత వద్ద కూడా ముందుగా డబ్బు తీసుకోడని కోలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు ఉంది. కోలీవుడ్ నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా అవకాశం ఇస్తారని సమాచారం. ఒక్క సీటుతో రాజకీయ ప్రయాణం 2005లో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) అనే పార్టీని సినీ నటుడు విజయకాంత్ ఏర్పాటు చేశారు. తొలిసారిగా 2006 ఎన్నికల సమయంలో తన పార్టీ నుంచి తానొక్కడే గెలిచాడు.. కానీ ఆయన పార్టీ 10 శాతం ఓట్లు సాధించి తమిళ రాజకీయాలలో విజయకాంత్ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత (అన్నాడీఎంకే)తో చేతులు కలిపి 41 సీట్లలో 29 స్థానాలను గెలుచుకున్నారు. ఆ సమయంలో ఎం.కరుణానిధి (డీఎంకే) పార్టీని చిత్తు చేసిన విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఆ తదుపరి అన్నాడీఎంకేతో వైరం వంటి పరిణామాలు విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. దీంతో జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. కూటమిల పేరుతో నష్టం 2014 లోక్సభ ఎన్నికలలో ఆయన ఎన్డీఏతో వెళ్లి ఓటమిని చవి చూశారు. కానీ ఓటు బ్యాంక్ శాతం పెంచుకోవడం ఆయనకు కలిసి వచ్చిన అంశంగా మారింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అవతరించినా, ఫలితం శూన్యం. ఆ ఎన్నికల్లో అన్నిచోట్ల విజయకాంత్ కూటమి పార్టీ డిపాజిట్లను కోల్పోయింది. ఆ ఎన్నికల్లో విజయకాంత్ కూడా సుమారు 50 వేలకు పైగా ఓట్లతో ఓటమి చెందారు. ఆ తర్వాత వరుస ఓటములు ఎదురైనా ఏ మాత్రం డీలా పడకుండా కేడర్ మద్దతు, సినీ అభిమానుల అండతో ఒంటరిగానే పార్టీని నడిపిస్తూ వచ్చారు. కానీ కూటమిల పేరుతో ఆయన ఇతర పార్టీలకు అనుకూలంగా పనిచేయడం, ఇతర పార్టీలకు చెందిన అధినేతల సలహాలతో డీఎండీకేను ముందుకు నడపడం వంటి కారణాలతో ఆయన ఇమేజ్ క్రమేపి తగ్గుతూ వచ్చింది. ఇంతలో ఆయన తరుచుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడటం కూడా పార్టీకి నష్టం వాటిల్లింది. చివరకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా, పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించ లేని పరిస్థితి నెలకొంది పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఆయన సతీమణి ప్రేమలతకు ఆయన అప్పచెప్పారు. తాజాగా ఆయన మరణం డీఎండీకే పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికలలో ఆయన సతీమణి ప్రేమలత ఒంటరిగానే బరిలోకి దిగుతారా..? మరేదైనా పార్టీకి మద్ధతు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. -
Captain Vijayakanth: నల్లగా ఉన్నాడని హేళన.. ఏడాదిలో 18 సినిమాలు
ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్(70) మరణంతో తమిళనాట విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నెలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్కాంత్.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగాడు. (చదవండి: కెప్టెన్ విజయ్కాంత్.. కుటుంబం నేపథ్యమిదే!) ఆయన తండ్రి ఒక రైస్ మిల్లు యజమాని. కొడుకుని బాగా చదివించి ప్రభుత్వ ఉద్యోగస్థుడిగా చూడాలని ఆయన కోరిక. కానీ విజయకాంత్కు మాత్రం చిన్నపుడు చదువుపై పెద్దగా ఆసక్తి లేదు. తరచూ స్నేహితులతో కలిసి థియేటర్కి వెళ్తుండేవాడు. ఎంజీఆర్ సినిమాలను ఎక్కువగా చూసి ఆయనలా తాను కూడా పెద్ద హీరో కావాలనుకున్నాడట. (చదవండి: కెప్టెన్ విజయ్కాంత్.. అవార్డుల రారాజు!) అందుకే మధురై నుంచి చెన్నైకి తన మకాంని మార్చాడు. సినిమా అవకాశాలకు చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే తన శరీరం నల్లగా ఉండడంతో.. దర్శకనిర్మాతలు తనను రిజెక్ట్ చేసేవారట. ఈ విషయాన్ని విజయకాంతే పలు సందర్భాల్లో చెప్పాడు. ‘నా శరీర రంగు కారణంగా అనేకసార్లు తిరస్కారాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ వెనుకడుకు వేయకుండా నిలబడ్డా..వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేడు ఈ స్థాయికి చేరాను’అని ఓ ఇంటర్వ్యూలో విజయకాంత్ అన్నారు. విజయ్రాజ్ నుంచి విజయకాంత్గా విజయ్కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి. ఇండస్ట్రీ ఎంట్రీతోనే తన పేరును మార్చుకున్నాడు. అయితే ఈ పేరు మార్పు తన మొదటి సినిమా డైరెక్టర్దేనట. విజయ్ తొలి సినిమా ‘ఇనిక్కమ్ ఇళమై’(1979). ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఏంఏ కాజాకు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి అనే పేరు నచ్చలేదట. ఆ సమయంలో రజనీకంత్ హవా బాగా నడుస్తుండడంతో ఆయన పేరులోని నుంచి కాంత్ అనే పదాన్ని తీసి విజయ్ రాజ్కు యాడ్ చేశాడట. అలా విజయ్రాజ్ పేరును విజయకాంత్గా మార్చాడు. ఒకే ఏడాది 18 సినిమాలు.. 27 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయకాంత్.. కెరీర్లో 150కి పైగా సినిమాల్లో నటించారు. తొలిసినిమా ఇనిక్కుమ్ ఇలమై (1979). అందులో ఆయన విలన్ పాత్రను పోషించి, తనదైన నటనతో మెప్పించాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అయితే కెరీర్ తొలినాళ్లలో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముళక్కం’, సత్తం ఓరు ఇరుత్తర్లై’ చిత్రాలతో సక్సెస్ బాట పడ్డాడు. 2015 వరకు నిర్విరామంగా సినిమాల్లో నటించాడు. మూడు షిఫ్ట్ల్లో పని చేస్తూ ఏడాదికి ఐదారు సినిమాలను రిలీజ్ చేసేశాడు. 1984లో ఆయన నటించిన 18 సినిమాలు విడుదలై రికార్డును సృష్టించాయి. ఎస్. ఏ. చంద్రశేఖర్, రామ నారాయణన్ దర్శకత్వంలో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. -
శోకసంద్రంలో తమిళ ఇండస్ట్రీ
-
తమిళ రాజకీయాల్లో కెప్టెన్ సంచలనాలు
చెన్నై: డీఎండీకే అధినేత, సినీ నటుడు కెప్టెన్ విజయ్కాంత్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వందకిపైగా చిత్రాలతో తమిళ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారాయన. అయితే.. విజయ్ కాంత్ అటు సినీ రంగం ద్వారా యాక్షన్ హీరోగానే కాదు.. తమిళ రాజకీయాల్లోనూ సొంత పార్టీ డీఎండీకే ద్వారా సంచలనాలు కేరాఫ్గా నిలిచారాయన. తద్వారా కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత మాదిరే.. విజయ్కాంత్ తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. తన రాజకీయ ప్రస్థానంలో విజయకాంత్ రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. 2005 సెప్టెంబర్లో విజయ్కాంత్ డీఎండీకే(దేశీయ మర్పోక్కు ద్రావిడ కజగం) పార్టీని స్థాపించారు. 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మొదటిసారిగా విజయ్కాంత్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. విరుదాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారాయన. అయితే.. ఆ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేసిన డీఎడీకే తరఫున విజయ్కాంత్ ఒక్కడే విజయం సాధించారు. అనంతరం, 2009 జనరల్ ఎలక్షన్స్లో 40 స్థానాల్లో డీఎండీకే పోటీలో నిలిచింది. తమిళనాడులో 39 స్థానాల్లో, పుదుచ్చేరిలో ఒక్క స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ప్రతిపక్ష నేతగా.. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్కాంత్ పార్టీ డీఎండీకే పెను సంచలనం సృష్టించింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో డీఎండీకే పొత్తు పెట్టుకుంది. ఎన్నికల్లో డీఎండీకే 41 స్థానాల్లో పోటీ చేయగా 29 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో, విజయకాంత్ శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఐదేళ్లపాటు.. అంటే 2016 ఎన్నికల వరకు శాసనసభపక్ష నేతగా కొనసాగారు. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో పరాజయం పొందారు. 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే పోటీ చేయగా ఘోర ఓటమిని చవిచూసింది. 2016 ఎన్నికల తరువాత, జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ కారణంగా విజయకాంత్ అన్నాడీఎంకే నుండి విడిపోయాడు. ఇక, బీజేపీతో డీఎండీకేతో ఎన్డీయే నాయకుల సంప్రదింపులు జరిపారు. ఒకానొక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ.. విజయ్కాంత్కు ప్రత్యేక సూచన ఇచ్చి ఆయనను తన స్నేహితుడిగా పేర్కొన్నారు. పార్టీలో చోటుచేసుకున్న వెన్నుపోటు రాజకీయాల కారణంగా విజయ్కాంత్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన తరచుగా ఆసుపత్రిపాలు కావాల్సి వచ్చింది. ఇదీ చదవండి: కెప్టెన్ విజయ్కాంత్ అస్తమయం -
డీఎండీకే అధినేత, నటుడు విజయ్ కాంత్ కన్నుమూత
-
మరోసారి ఆస్పత్రిలో చేరిన హీరో విజయ్కాంత్.. అదే కారణం?
కొన్నాళ్ల ముందు తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్.. కోలుకుని ఇంటికెళ్లిపోయారు. ఇప్పుడు మరోసారి ఆస్పత్రిలో చేరారు. దీంతో ఈయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది రెగ్యులర్ చెకప్ కోసమేనని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని అంటున్నారు. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?) ఇకపోతే తమిళంలో పలు సినిమాల్లో హీరోగా నటించిన విజయ్కాంత్ చాలా ఫేమ్ సంపాదించారు. ఓ వైపు సినిమాలు చేస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2011-16 మధ్య తమిళనాడు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఇలా నటుడు, పొలిటీషియన్ కాకుండా నిర్మాత, దర్శకుడిగానూ పేరు తెచ్చుకున్నారు. విజయ్కాంత్ పూర్తి పేరు విజయరాజ్ అలగర్స్వామి. 1952 ఆగస్టు 25లో పుట్టారు. కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో చాలా క్రేజ్ తెచ్చుకున్నారు. దీంతో ఆయన పేరు కాస్త కెప్టెన్ విజయ్కాంత్గా మారిపోయింది. విజయ్కాంత్ భార్య పేరు ప్రేమలత. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో ఒకబ్బాయి ఆల్రెడీ హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. ఇకపోతే 70 ఏళ్ల విజయ్కాంత్ గత కొన్నేళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందుకే ఇలా ఆస్పత్రి పాలవుతున్నారు. (ఇదీ చదవండి: 'బిగ్బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్) -
విజయకాంత్ అనారోగ్యంపై పుకార్లు.. ఖండించిన నటుడి సతీమణి
తమిళ స్టార్, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయన మరణించాడంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లో విజయకాంత్ ఇక లేరంటూ ఇష్టారీతిన ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. కెప్టెన్ విజయకాంత్ సతీమణి ప్రేమలత సైతం సదరు వార్తలను ఖండించింది. కెప్టెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని పేర్కొంది. ఆయన అనారోగ్యం గురించి వచ్చే వదంతులను నమ్మవద్దని కోరింది. అటు చెన్నైలోని ఆస్పత్రి వర్గాలు సైతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని బుధవారం నాటి ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇకపోతే విజయకాంత్ 'ఇనిక్కుం ఇలమై' సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించారు. 150కి పైగా సినిమాలు చేసిన ఆయన ఇరవైకి పైగా పోలీస్ స్టోరీల్లో నటించి అలరించారు. ఆయన నటించిన 100వ మూవీ 'కెప్టెన్ ప్రభాకర్' హిట్ అయిన తర్వాత నుంచి ఈయన్ని అందరూ కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. ఈయన చేసిన చాలా సినిమాలు తెలుగులోనూ డబ్, రీమేక్ అయ్యాయి. చిరంజీవి 'ఠాగూర్' మూవీ ఒరిజినల్ వెర్షన్ 'రమణ'లో విజయ్ కాంతే హీరోగా నటించారు! கேப்டன் நலமாக இருக்கிறார். விரைவில் முழு உடல் நலத்துடன் வீடு திரும்பி, நம் அனைவரையும் சந்திப்பார். - திருமதி. பிரேமலதா விஜயகாந்த் pic.twitter.com/P9iHyO7hzG — Vijayakant (@iVijayakant) November 29, 2023 చదవండి: ‘యానిమల్’ మూవీ టాక్ ఎలా ఉందంటే.. ? -
స్టార్ హీరో కొడుకు కొత్త సినిమా.. అలాంటి కాన్సెప్ట్తో
నటుడు విజయ్కాంత్ కొడుకు షణ్ముఖ పాండియన్ ఇంతకుముందు 'మధురై వీరన్' చిత్రంతో హీరోగా పరిచమయ్యాడు. తాజాగా ఇతడు హీరోగా చేయబోతున్న కొత్త మూవీ శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. డైరక్టర్స్ సినిమాస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కథనం, మాటలు పార్తీపన్ దేసింగు అందించగా, వాల్టర్, రెక్నా చిత్రాలు ఫేమ్ యు.అన్భు దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల) కస్తూరి రాజా, ఎమ్మెస్ భాస్కర్, యామిని సుందర్ తదితరులు ముఖ్యపాత్ర పోషిస్తున్న ఇందులో మరికొందరు ప్రముఖ నటీనటుల ఎంపిక జరుగుతుందని దర్శకుడు చెప్పారు. ఇది వైవిధ్యభరిత యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. చిత్ర తొలి షెడ్యూల్ కేరళలోని దట్టమైన అడవుల్లో ప్రారంభించినట్లు తెలిపారు. తదుపరి షెడ్యూల్ను ఒడిశా, థాయిల్యాండ్ అడవుల్లో చిత్రీకరించనున్నట్లు దర్శకుడు చెప్పారు. ఇది అటవీ ప్రాంతంలోని ఏనుగులు, అక్కడి మనుషుల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. దీనికి ఎస్ఆర్ సతీష్ కుమార్ ఛాయాగ్రహణంను అందిస్తున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నట్లు చిత్రబృందం చెప్పింది. (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్.. వీల్ చైర్లోనే..
తమిళసినిమా: నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ను సీనియర్ దర్శకుడు, విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మంగళవారం ఆయన ఇంట్లో కలిశారు. వీరి కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే 1971లో విజయకాంత్ కథానాయకుడిగా చట్టం ఒరు ఇరుట్టరై చిత్రం ద్వారా ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 70కి పైగా చిత్రాలకు ఈయన దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే తాజాగా చంద్రశేఖర్, విజయకాంత్ని కలిసి ఆయనను పలకరించారు. కాగా మంగళవారం(జనవరి 30) నటుడు విజయకాంత్ ప్రేమలత పెళ్లిరోజు. చదవండి: ‘మాస్టర్’ హీరోయిన్ సాక్షి ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా? ఈ సందర్భంగా దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ఆ దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విజయకాంత్ను ఆప్యాయంగా పలకించి కొంతసేపు ఆయనతో ముచ్చటించారు. ఆ ఫొటోలను ఎస్ఏ చంద్రశేఖర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా 70 ఏళ్ల విజయకాంత్ కొంతకాలంగా డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన కాలు మూడు వేళ్లను తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. అంతేకాదు చూస్తుంటే ఆయన ఆరోగ్యం కూడా క్షిణించినట్లు కనిపిస్తోంది. ఇలా తమ అభిమాన నటుడిని చూసి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. என் உயிரை நான் சந்தித்த போது 😀@iVijayakant pic.twitter.com/KZ1bP0yyp0 — S A Chandrasekhar (@Dir_SAC) January 31, 2023 -
వడివేలు జీవితాన్ని మలుపు తిప్పిన రైలు జర్నీ
Happy Birthday Day Vadivelu: ఆయనో కమెడియన్. అలాగని ఆషామాషీ నవ్వులు పంచడండోయ్. మూస ధోరణిలో సాగిపోతున్న సినీ కామెడీకి సరికొత్త పాఠాలు నేర్పాడాయన. ‘అసలు ఇలా కూడా కామెడీ చేయొచ్చా?’ అనే రీతిలో ఉంటుంది ఆయన స్టయిల్. అందుకే స్టార్ హీరోలకు సమానమైన ఫ్యాన్డమ్ను సంపాదించుకున్నారాయన. ఒకానోక టైంలో ఏడాదికి పాతికదాకా సినిమాల్లో నటించిన వడివేలు.. అప్పటికప్పుడు సొంతంగా అల్లుకున్న ట్రాకులతోనే కడుపుబ్బా నవ్వించే వారంటే అతిశయోక్తి కాదు. వడివేలు తెర మీద కనిపిస్తే నవ్వుల ప్రవాహం గలగలా పారాల్సిందే.. అందుకే కోలీవుడ్ ఆడియొన్స్ ఆయన్ని ముద్దుగా వాగై పూయల్(వాగై ప్రవాహం) అని పిలుస్తుంటారు. వడివేలు 61వ పుట్టినరోజు ఇవాళ.. వాగై నది మధురై గుండా ప్రవహిస్తుంటుంది. ఆ నది ఒడ్డునే ఉన్న ఓ మధ్యతరగతి కుటుంబంలో సెప్టెంబర్ 12, 1960న పుట్టారు వడివేలు(కుమారవడివేలు నటరాజన్). అసలు చదువే అబ్బని వడివేలు.. చిన్నప్పటి నుంచి తండ్రి గ్లాస్ కట్టింగ్ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. ఖాళీ సమయాల్లో వీధి నాటకాలు.. అందులోనూ నవ్వులు పంచే పాత్రలతో అలరించడం చేసేవాడు. అలా దర్శకుడు టీ రాజేందర్ కంటపడడంతో .. ‘ఎన్ తంగి కళ్యాణి’లో ఓ చిన్న వేషం వేషాడు. రాజ్కిరణ్తో పరిచయం వడివేలు సినీ ప్రయాణం చాలా ఆసక్తికరంగా మొదలైంది. అవకాశాల కోసం ఆయన కనీసం ఏమాత్రం ప్రయాణం చేయలేదు. కానీ, నటుడు రాజ్కిరణ్.. వడివేలు సినిమాల్లోకి అడుగుపెట్టడానికి కారణం అయ్యాడు. వడివేలు తన పెళ్లి కోసం రైళ్లో వెళ్తున్న టైంలో.. నటుడు రాజ్కిరణ్తో పరిచయం అయ్యింది. ఆ సంభాషణ మధ్యలోనే వడివేలులోని నటుడిని గుర్తించి యాక్టింగ్ ఆఫర్ ఇచ్చాడు రాజ్ కిరణ్. అలా రాజ్ కిరణ్ హీరోగా నటించిన ‘ఎన్ రసవన్ మనసిలే’(1991)తో నటుడిగా మారిపోయాడు వడివేలు. ఆ తర్వాత నటుడు విజయ్కాంత్ ‘చిన్న గౌండర్’లో వడివేలుకు అవకాశం ఇచ్చి.. తన తర్వాతి సినిమాల్లోనూ మంచి మంచి పాత్రలు ఇచ్చి వడివేలును ప్రొత్సహించాడు. త్రయం నవ్వులు గౌండమణి-సెంథిల్-చార్లీలాంటి టాప్ కమెడియన్ల హవా కోలీవుడ్లో కొనసాగుతున్న టైంలో.. వడివేలు ఎంట్రీ ఇచ్చాడు. కమల్ హాసన్ హీరోగా వచ్చిన సింగరవేలన్(మన్మథుడే నా మొగుడు)లో విచిత్రమైన గెటప్, బట్లర్ ఇంగ్లీష్ క్యారెక్టరైజేషన్ వడివేలుకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆపై వరుసగా కామెడీ రోల్స్తో కోలీవుడ్లో కింగ్ ఆఫ్ కామెడీ ముద్రను దక్కించుకున్నాడు. గౌండమణి-సెంథిల్ కాంబోతో పాటు వడివేలు పంచిన కామెడీ కోలీవుడ్ ఆడియొన్స్కు నోస్టాల్జియా అనుభూతుల్ని మిగిల్చింది. తెలుగు వాళ్లకు.. తొంబై, 2000 దశకాల్లో కోలీవుడ్లో వడివేలు హవా నడిచింది. రజినీకాంత్, విజయ్కాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, అజిత్, ఇలా.. దాదాపు అందరు అగ్రహీరోలతోనూ ఆయన ప్రస్థానం నడిచింది. అలాగే ఇతర కామెడీ యాక్టర్లతోనూ ఆయన స్నేహం కొనసాగించేవాళ్లు. క్షత్రియ పుత్రుడు(తేవర్మగన్) లాంటి సీరియస్ సినిమాలతో పాటు ‘నవ్వండి లవ్వండి, ప్రేమికుడు, మిస్టర్ రోమియో, ప్రేమ దేశం, రక్షకుడు, ఒకే ఒక్కడు, చంద్రముఖి, సింగమలై, ఆరు, ఘటికుడు, పొగరు, దేవా, అదిరింది’ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియొన్స్ను సైతం కితకితలు పెట్టించాడాయన. తెలుగులో స్ట్రయిట్ సినిమా ‘ఆరో ప్రాణం’తో పలకరించాడు. వివాదాలు.. రాజకీయాల ఎంట్రీతో వడివేలు కెరీర్ మసకబారడం మొదలైంది. తన కుటుంబంపై జరిగిన దాడికి బాధ్యుడ్ని చేస్తూ.. కెరీర్ తొలినాళ్లలో తనకు అవకాశాలిచ్చిన విజయ్కాంత్ మీదే అటెంప్ట్ టు మర్డర్ కేసుపెట్టి వివాదాలకు తెరలేపాడు వడివేలు. ఆపై విజయ్కాంత్పై ఎన్నికల్లోనూ పోటీ ప్రకటన చేశాడు. విజయ్కాంత్తో వైరం కోలీవుడ్లో అవకాశాలు తగ్గించడమే కాదు.. రాజకీయంగానూ ఎలాంటి ఎదుగుదలను లేకుండా చేసింది. ఇక ఇమ్సయి అరసన్ 23ఎం పులకేసి(హింసించే 23వ రాజు పులకేశి) సినిమాతో హీరోగానూ వడివేలు సక్సెస్ అందుకున్నాడు. 2018లో ఈ సినిమా సీక్వెల్ విషయంలో దర్శకుడు శంకర్(మొదటి పార్ట్కు నిర్మాత), దర్శకుడు చింబు దేవన్తో చెలరేగిన చిన్న వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది. వడివేలు వల్ల కోట్ల నష్టం వాటిల్లిందని శంకర్, ఆపై మరికొందరు సినీ నిర్మాతల ఫిర్యాదులపై నడిగర్ సంఘం వడివేలుపై కన్నెర్ర జేసి నిషేధం విధించింది. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి ఈ ఏడాదిలో(2021) ఆయన కొత్త సినిమాలను అంగీకరించినట్లు, ఇది తన సినీ పునర్జన్మగా అభివర్ణించుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. లైకా ప్రొడక్షన్స్లోనే ఆయన ఐదు సినిమాలు సైన్ చేయడం. ప్రే ఫర్ నేసమణి ఆరులో ‘రక్తం’, పొగరులో ‘కూల్డ్రింక్-ఒంటేలు’, సింగమలైలో ‘కానిస్టేబుల్’ కామెడీ పోర్షన్లు తెలుగు ఆడియొన్స్ను కడుపుబ్బా నవ్విస్తుంటాయి. సినిమాలతోనే కాదు.. మన బ్రహ్మీలాగా మీమ్స్తోనూ వడివేలు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక 2001లో వచ్చిన ఫ్రెండ్స్(తెలుగులో స్నేహమంటే ఇదేరాగా రీమేక్) మూవీ. త్్్ విజయ్, సూర్య హీరోలు. ఇందులో వడివేలు నేసమణి అనే క్యారెక్టర్ పోషించాడు. ఓ సీన్లో ఆయన నెత్తి మీద సుత్తి పడుతుంది. రెండేళ్ల క్రితం ఈ సీన్ పాక్లోని ఓ ట్విటర్ అకౌంట్ ద్వారా ట్రెండ్ కాగా.. నేసమణి పరిస్థితి ఎలా ఉందంటూ ఎంతో మంది ఆరాతీశారు. ఆయన కోలుకోవాలంటూ ‘ప్రే ఫర్ నేసమణి’ ట్రెండ్ను కొనసాగించారు. అలా చాలా ఏళ్ల తర్వాత ఆ సీన్ వైరల్ అయ్యి.. వడివేలుకు ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చిపెట్టింది. - సాక్షి, వెబ్స్పెషల్ -
ప్రేమలతకు కరోనా.. రంగంలోకి దిగిన కెప్టెన్
సాక్షి, చెన్నై : డీఎండీకే నేత విజయకాంత్ ఎట్టకేలకు ప్రజల్లోకి వచ్చారు. బుధవారం గుమ్మిడి పూండిలో రోడ్ షోతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రేమలత విజయకాంత్కు అధికారులు షాక్ ఇచ్చారు. అమ్మ మక్కల్ కూటమితో కలిసి డీఎండీకే ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసింది. డీఎండీకే అభ్యర్థులు 60 స్థానాల్లో పోటీచేస్తున్నారు. అయితే, ఈ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళ్లే డీఎండీకే నేతలు కరువయ్యారు. విజయకాంత్ సతీమణి ప్రేమలత విరుదాచలంలో పోటీచేస్తుండటంతో, ఆమె ఆ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇతర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించలేని పరిస్థితి ఉంది. ఇక, విజయకాంత్ బావ మరిది, పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సుదీష్ కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో డీఎండీకే అభ్యర్థులకు మద్దతుగా కదిలే నేతలు ఆ పార్టీలో కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో అనారోగ్యంతో ఇంటికీ, లేదా కార్యాలయానికి పరిమితమైన విజయకాంత్, తన అభ్యర్థుల కోసం అడుగుబయట పెట్టకతప్పలేదు. బు«ధవారం సాయంత్రం హఠాత్తుగా ఆయన ప్రచార పర్వంలోకి అడుగు పెట్టారు. ఐదు రోజుల పర్యటన... విజయకాంత్ ఎన్నికల ప్రచారంలో విరుదాచలంతోపాటుగా మరో నియోజకవర్గంలో ఓటర్లను కలిసేందుకు తొలుత నిర్ణయించారు. అయితే, తమకు మద్దతుగా ప్రచారం చేసే వాళ్లు లేరంటూ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పెడుతున్న కేకల్ని విన్న విజయకాంత్ తానొస్తున్నానని అడుగు తీసి ముందుకు వేశారు. ఐదు రోజుల పాటుగా ఆయన ప్రచారం సాగనుంది. బుధవారం సాయంత్రం గుమ్మిడి పూండిలో సుడిగాలి పర్యటనతో ముందుకు సాగారు. అయితే, ఎక్కడా ప్రసంగాలకు తావివ్వలేదు. కేవలం పార్టీ వర్గాలను వాహనం నుంచి పలకరిస్తూ విజయకాంత్ ప్రచారం చేశారు. గురువారం తిరుత్తణిలో, శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు చెన్నైలో తమ అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారానికి ఆయన నిర్ణయించారు. పరీక్ష చేసుకోవాల్సిందే తన సోదరుడు సుదీష్, ఆయన భార్య పూర్ణిమ ఇద్దరు కరోనా బారిన పడటంతో ప్రేమలత విజయకాంత్కు సంకటం తప్పలేదు. ఆమె విరుదాచలంలో సుడిగాలి పర్యటనతో ఓట్ల వేటలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆమెకు అధికారులు షాక్ ఇచ్చారు. తప్పనిసరిగా కరోనా పరీక్ష చేసుకోవాల్సిందేనని, తదుపరే ప్రచారంలోకి వెళ్లాలని ఆరోగ్య శాఖ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కరోనా టెస్ట్ చేసుకోక తప్పలేదు. ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. -
‘ధనుష్, విజయ్ కాంత్ ఇళ్లలో బాంబు’
చెన్నై: గత రాత్రి ఓ అపరిచిత వ్యక్తి చేసిన ఫోన్ చెన్నై పోలీసులకు నిద్ర లేకుండా చేసింది. చివరకు అది ఎవరో ఆకతాయి చేసిన పనిగా తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే.. ఓ అపరిచిత వ్యక్తి పోలీసులకు కాల్ చేసి చెన్నైలోని ధనుష్ అభిరామపురం ఇంట్లో, విరుగంబక్కంలోని విజయకాంత్ ఇంట్లో బాంబులు ఉన్నట్లు బెదిరించాడు. దాంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు వెంటనే హీరోల ఇళ్లకు చేరుకున్నారు. బాంబులను నిర్వీర్యం చేసే బృందం హీరోల ఇంటి పరిసరాలు మొత్తం జల్లెడ పట్టారు. గంటల కొలది హై టెన్షన్ అక్కడ చోటు చేసుకుంది. అణువణువూ గాలించిన పోలీసులు, అక్కడ ఎటువంటి పేలుడు పదార్ధం లేదని నిర్ధారణకు వచ్చారు. దీనితో ఇది ఎవరో ఆకతాయి పని కావచ్చని పోలీసులు భావించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ మొదలుపెట్టారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఆ నిందితుడిని పట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. (చదవండి: హీరో ధనుష్కి మధురై హైకోర్టు షాక్) అయితే ఈ మధ్య కాలంలో చెన్నైలో ప్రముఖ హీరోలకు ఈ తరహా బెదిరింపు కాల్స్ ఎక్కువైపోయాయి. కొన్ని నెలల క్రితం రజనీ కాంత్ ఇంటిలో బాంబ్ ఉందని ఒకరు బెదిరించారు. దాంతో పోలీసులు రజనీ ఇల్లు జల్లెడ పట్టి చివరకు అది ఒక ఫేక్ కాల్ అని గుర్తించారు. ఆ ఫోన్ చేసిన బాలుడు మతిస్థిమితం లేనివాడని తెలుసుకొని, అతన్ని వదిలేశారు. అలానే హీరో అజిత్, విజయ్ నివాసాలలో బాంబులు పెట్టినట్లు ఫేక్ కాల్స్ రావడం జరిగింది. ప్రముఖులు కావడంతో పాటు విషయాన్ని తేలికగా తీసుకోకుండా పోలీసులు ప్రతిసారి పరుగులు పెట్టాల్సివస్తుంది. ఆకతాయిలు మాత్రం తరచుగా ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. ధనుష్ ఇంటిలో బాంబ్ లేదన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
నడిగర్ సంఘం ఎన్నికల్లో రాజకీయాల్లేవు
పెరంబూరు: నడిగర్సంఘం ఎన్నికల్లో రాజకీ య ప్రభావం లేదని ఐసరిగణేశ్ పేర్కొన్నారు. ఈ సంఘానికి 2019–2022 ఏడాదికిగానూ రానున్న 23వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్ పాండవర్ జట్టు, కే.భాగ్యరాజ్ స్వామిశంకరదాస్ జట్టు బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి కూడా పోటీ బలంగా ఉండడం, ఎన్నికలకు మరో 9 రోజులే గడువు ఉండడంతో ప్రచార మోత మొదలైంది. సభ్యులను ప్రభావితం చేసేలా వాగ్దానాస్త్రాలను ఇరు జట్లు తమ అంబులపొదలలో వేసుకుని సంధించడానికి సిద్ధం అయ్యారు. కాగా ఈ సారి ప్రచారంలో స్వామిశంకర్దాస్ జట్టు ముందుంది. నడిగర్ సంఘం ప్రస్తావనలో నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పేరు గుర్తుకు రాక తప్పదు. సంఘం అప్పుల భారం మోస్తున్న తరుణంలో పార్టీకి అధ్యక్ష పదవిని చేపట్టిన విజయకాంత్ సంఘాన్ని రుణ విముక్తి చేసి లాభాల బాట పట్టించారు. దీంతో సంఘంలో ఆయనకు అత్యంత గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఏ జట్టు అయినా ఆయనను కలిసి మద్దతు తీసుకుంటారు. అలా గురువారం ఉదయం స్వామిశంకరదాస్ జట్టు విజయకాంత్ను ఆయన ఇంట్లో కలిసి మద్దతు కోరారు. అనంతరం ఆ జట్టు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న దర్శక, నటుడు కే,.భాగ్యరాజ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ఆయన నాటక కళాకారులకు డబ్బు ఇస్తానన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయాన్ని ఆయన ముందు ప్రస్తావించగా, అందుకు బదలిచ్చిన కే.భాగ్యరాజ్ తాను ఓటుకు నోటులిస్తానని చెప్పలేదని, సాధారణంగా సినీ కళాకారులు ఆర్థి కంగా చితికిపోయిన నాటక కళాకారులను కలసినప్పుడు వారికి డబ్బు ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు నటుడు విశాల్, కార్తీ వంటి వారూ అతీ తులు కాదని పేర్కొన్నారు. విజయకాంత్ను కలవడం గురించి అడిగిన ప్రశ్నకు విజయకాంత్ను కలవడం సంతోషంగా ఉందని, ఆయన తమ చేతులు పట్టుకుని ఆశీర్వదించారని చెప్పారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అదే విధంగా నడిగర్సంఘం ఎన్నికల్లో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని సీనియర్ నటుడు,నడిగర్సంఘం మాజీ కార్యదర్శి రాధారవి చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా నటుడు,నిర్మాత, ప్రస్తుతం సంఘ కార్యదర్శి పదవికి పోటీలో ఉన్న ఐసరిగణేశ్ స్పందిస్తూ తమ జట్టుకు పలువులు సహకరిస్తున్నారనీ, అయితే నటుడు రాధారవి తమకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని చెప్పలేమనీ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని అన్నారు.తమకు సంబంధించినంత వరకూ ఈ ఎన్నికల్లో రాజకీయ జోక్యం లేదనీ ఐసరిగణేశ్ పేర్కొన్నారు. -
మెట్టుదిగని కెప్టెన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే–బీజేపీ కూటమి దాదాపు ఖరారైపోగా ఒక్క డీఎండీకే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. 9 స్థానాలకు డీఎండీకే పట్టుబడుతుండగా నాలుగు లేదా ఐదు స్థానాలు మాత్రమేనని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. మొత్తం 40 పార్లమెంటు స్థానాల్లో కనీసం 20 స్థానాల్లో ఖచ్చితంగా పోటీచేయాలని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. మిగిలిన 20 స్థానాలను మిత్రపక్షాలకు వదిలేశారు. ఇందులో బీజేపీకి ఐదు, పీఎంకేకు ఏడు స్థానాలపై ఒప్పందం జరిగిపోయింది. ఇక మిగిలిన 8 స్థానాల్లో పుదియతమిళగం, తమిళ మానిల కాంగ్రెస్ (ఇంకా చర్చల దశలో), ఇండియా జననాయక కట్చి, పుదియనీదికట్చిలకు తలా ఒకటి కేటాయించాలని నిర్ణయించారు. ఇక డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్కు మిగిలింది నాలుగుస్థానాలే. అయితే ఆయన 9 స్థానాలను కోరుతుండగా ఎంతమాత్రం వీలుకాదని అన్నాడీఎంకే తేల్చిచెప్పేసింది. మూడు లేదా నాలుగుస్థానాలు మాత్రమే కేటాయించగలమని స్పష్టం చేసింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్, కేంద్రమంత్రి పీయూష్గోయల్ మంగళవారం రాత్రి వరకు విజయకాంత్కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకూ ఆయన మెట్టుదిగకపోవడంతో పీయూష్గోయల్ ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ దశలో ఇరుపక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఇదిలా ఉండగా బీజేపీ కూటమిలో పీఎంకే చేరడానికి నిరసనగా పీఎంకే యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరి ప్రియా రాజీనామా చేశారు. ఉప ఎన్నికల షరతుపై డీఎండీకే నో: సీట్ల సర్దుబాట్లు అలా ఉంచితే ఖాళీగా ఉన్న 21 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షంగా ఎన్నికల ప్రచారం చేయాలని, పోటీ అభ్యర్థులను పెట్టరాదు, ఎన్నికల ప్రచారం చేయాలనే నిబంధనలకు బీజేపీ, పీఎంకే సమ్మతించినట్లు సమాచారం. అయితే డీఎండీకే మాత్రం ఈ నిబంధనకు ససేమిరా అని కుండబద్దలు కొట్టడం ప్రతిష్టంభనకు మరోకారణౖమైంది. పార్లమెంటు స్థానాల్లో్ల మిత్రపక్షం, అసెంబ్లీ స్థానాలో ప్రతిపక్షంగా వ్యవహరించడం ఏమిటని డీఎండీకేను అన్నాడీఎంకే ప్రశ్నిస్తోంది. ఉప ఎన్నికల్లో అభ్యర్థులను పోటీపెట్టబోమని హామీ ఇచ్చినట్లయితేనే నాలుగు లేదా ఐదు స్థానాలను కేటాయించగలమని అన్నాడీఎంకే వాదిస్తోంది. ఇదిలా ఉండగా, తాము కోరినన్ని సీట్లు కేటాయించని పక్షంలో తీవ్రమైన నిర్ణయం తీసుకోకతప్పదని విజయకాంత్ హెచ్చరించారు. బుధవారం రాత్రికి డీఎండీకే, అన్నాడీఎంకే మధ్య సామరస్యపూర్వకమైన ఒప్పందం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
ప్రతిపక్షం అన్నింటా వైఫల్యం
తిరువళ్లూరు: రాష్ట్రంలో అసమర్ధుడైన ప్రతిపక్ష నాయకుడు ఉండడం వల్లే ప్రజా సమస్యలపై గళమెత్తే పరిస్థితి లేకుండా పోయిందని డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత ఆరోపించారు. బస్సు చార్జీల మోతకు నిరసనగా డీఎండీకే ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం తిరువళ్లూరులోని బజారువీధిలో ధర్నాకు జిల్లా కన్వీనర్ కృష్ణమూర్తి నాయుడు అధ్యక్షత వహించారు. ప్రేమలతా విజయకాంత్ హాజరై ప్రసంగించారు. మొదట ఆమె ఎద్దుల బండిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేస్తూ, బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ రాష్ట్రంలో స్టాలిన్ లాంటి అసమర్థ నేత ప్రతిపక్షంగా ఉండడం ప్రజల దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. స్టాలిన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని జోస్యం పలికారు. అన్నాడీఎంకే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని స్పష్టం చేసిన ఆమె, వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే అడ్రస్ లేకుం డా పోతుందని విమర్శించారు. రవాణా శాఖలో రూ.5,700 కోట్ల కుంభకోణం, కార్మిక సంఘాల పేరిట విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్న నేతల వైఖరే నష్టాలకు కారణమని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సినీ నటులు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని పరోక్షంగా కమల్ రజనీకాంత్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రేమలత, జయలలిత ఉన్నప్పుడు వారెం దుకు పార్టీని స్థాపించలేదని ప్రశ్నించారు. ఆందోళనలో పార్టీ నేతలు శేఖర్, శరవణన్, రజనీకాంత్ పాల్గొన్నారు. -
వేడెక్కిన స్థానికం
సాక్షి, చెన్నై: స్థానిక ఎన్నికల సమరం వేడెక్కింది. నామినేషన్ల పర్వం వేగం పెరిగింది. డీఎంకే తొలి జాబితా ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్కు కంటి తుడుపు సీట్లే దక్కాయి. ఇక, అభ్యర్థుల్ని మార్చాల్సిందేనని పట్టుబడుతూ అన్నాడీఎంకేలో నిరసనలు హోరెత్తుతున్నాయి. టవర్ ఎక్కి మరీ తమ అభిమానాన్ని నాయకులు చాటుకున్నారు. కాగా, అన్ని పార్టీలు ఉరకలు పరుగులు తీస్తుంటే, డీఎండీకే అధినేత విజయకాంత్ శిబిరంలో హడావుడి కానరావడం లేదు. స్థానిక ఎన్నికల బరిలో నిలిచేందుకు అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితా ప్రకటన ఆ పార్టీలో పలు చోట్ల ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ కోసం శ్రమిస్తున్న వాళ్లకు కాకుండా, కొత్త ముఖాలకు సీట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని చోట్ల, పాత వాళ్లకే మళ్లీ సీటు ఇవ్వడాన్ని ఖండిస్తూ మరి కొన్ని చోట్ల నిరసనలు బుధవారం కూడా హోరెత్తాయి. ప్రధానంగా చెన్నైలో అయితే, పలు వార్డుల్లో నిరసనలు ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. 158వ వార్డు సీటును సిట్టింగ్ కౌన్సిలర్ రాజశేఖర్ సతీమణి కవితకు ఇవ్వడాన్ని ఖండిస్తూ, బర్మా కన్నన్ వర్గీయులు ఆందోళనకు దిగారు. వారి మద్దతు దారులు ముగ్గురు నందంబాక్కం ట్రేడ్ సెంటర్ వద్ద సెల్ టవర్ ఎక్కడం ఉత్కంఠ రేపింది. వీరిని బుజ్జగించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చివరకు అన్నాడీఎంకే పెద్దల జోక్యంతో వారు టవర్ దిగారు. 163, 125, 127, 129 వార్డుల్లోని అభ్యర్థులను మార్చాలని పట్టుబడుతూ మహిళలు పోరు బాట పట్టారు. కొన్ని చోట్ల అభ్యర్థుల మార్పునకు పట్టుబడుతూ నిరాహర దీక్ష చేపట్టారు. ఇలాంటి నిరసనల తంతు రాష్ర్ట వ్యాప్తంగా సాగుతుండడంతో వారిని బుజ్జగించడం సీట్లు దక్కించుకున్న వాళ్లకు భారంగా మారింది. ఒక సీటు రూ.కోటి: కొన్ని చోట్ల ఏకగ్రీవాలు హోరెత్తుతున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ, జిల్లా, యూనియన్ పంచాయతీల ఎన్నికలు పార్టీల వారీగా సాగుతుండడంతో ఇక్కడ ఏకగ్రీవాలకు ఛాన్స్ అరుదే. అయితే, గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలకు అవకాశాలు ఎక్కువే. దీంతో కొన్ని గ్రామాల్లో వేలం ద్వారా పంచాయతీ అధ్యక్షుడి ఎంపిక సాగించే పనిలో గ్రామ పెద్దలు నిమగ్నమయ్యారు. ఇందుకు అద్దం పట్టే విధంగా బుధవారం నీడామంగళం పంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవి ఎంపిక సాగింది. అధ్యక్ష పదవికి స్థానికంగా ఉన్న ఓ సామాజిక వర్గ పెద్ద రూ.1.10కోట్లకు వేలం ద్వారా ఎంపికయ్యారు. ఇక, ఉపాధ్యక్ష పదవికి ఆ దరిదాపుల్లో వేలం సాగినట్టు సమాచారం. అయితే, ఈ విషయం ఎన్నికల వర్గాల దృష్టికి చేరలేదు. మీడియాల్లో వచ్చిన వార్తతో విచారించే పనిలో పడ్డారు. కాగా, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, స్థానిక ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని పుదుకోట్టై జాలర్లు ప్రకటించడం గమనార్హం. డీఎంకే తొలి జాబితా: ఎన్నికల రేసులో తమ అభ్యర్థుల తొలి జాబితాను డీఎంకే ప్రకటించింది. అయితే, అన్నాడీఎంకే కంటే భిన్నంగా జిల్లాల వారీగా సేకరించిన వివరాలు, సమాచారాలతో అభ్యర్థుల ఎంపిక సాగింది. తొలి జాబితాను డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ప్రకటించారు. ఆ మేరకు సేలం కార్పొరేషన్లోని 60 స్థానాల్లో కాంగ్రెస్కు ఐదు, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్కు ఒకటి కేటాయించారు. మిగిలిన 54 వార్డుల్లో డీఎంకే అభ్యర్థులు రేసులో దిగారు. తిరుచ్చి పరిధిలో 65 వార్డులు ఉండగా, ఇందులో కాంగ్రెస్కు మూడు మాత్రం కేటాయించి, 62 వార్డుల్లో డీఎంకే పోటీ చేయనుంది. తూత్తుకుడిలో 51 వార్డుల్లో డీఎంకే, ఐదు వార్డుల్లో కాంగ్రెస్, రెండు చోట్ల ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. జిల్లాల్లో డీఎంకే, కాంగ్రెస్ , ఇతర మిత్ర పక్షాల నాయకులు కూర్చుని చర్చించి, సిద్ధం చేసి తమకు పంపుతున్న మేరకు జాబితాలను డీఎంకే విడుదల చేస్తుండటం గమనార్హం. కెప్టెన్ డౌటేనా..?: స్థానిక ఎన్నికల్లో డీఎండీకే అభ్యర్థులు రేసులో ఉంటారా..? అన్న అనుమానం మొదలైంది. నామినేషన్ల పర్వం మొదలై మూడు రోజులు గడిచినా ఆ శిబిరంలో ఎలాంటి హడావుడి కన్పించడం లేదు. పోటీకి నేతలు ఉత్సాహం చూపించని దృష్ట్యా, అభ్యర్థుల ఎంపికలో డీఎండీకే అధినేత విజయకాంత్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డా, రేసులో నిలిచే వారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉండడంతో ఎన్నికల్ని బహిష్కరిద్దామా..? అనే యోచనలో కెప్టెన్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కసరత్తుల్లో సీతారామన్: ఓ వైపు రాజకీయ పక్షాలు ఉరకలు పరుగులు తీస్తుంటే, మరో వైపు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి ఏర్పాట్ల మీద అధికారి సీతారామన్ దృష్టి పెట్టారు. ఎన్నికల పర్యవేక్షకులు, పరిశీలకులతో బుధవారం కోయంబేడు కార్యాలయంలో సమాలోచించారు. నగదు బట్వాడా కట్టడి, నిఘా కట్టుదిట్టం లక్ష్యంగా చర్యలు తీసుకుంటూ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, కోడ్ ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా కేసుల మోతకు ఆదేశాలిచ్చారు. రేషన్ కార్డుల జారీకి తాత్కాళిక బ్రేక్ వేయడంతో పాటుగా చాపకింద నీరులా ప్రభుత్వ పథకాల పంపిణీ సాగకుండా నిఘా పెంచే పనిలో పడ్డారు. ఇక, రాష్ట్రంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి తొలి రోజు పది కేసులు నమోదయ్యాయి. ఇందులో అన్నాడీఎంకే వర్గాలే ఎక్కువ. ఇక, నామినేషన్ల వేగం పుంజుకోవడంతో, ఆయా స్థానిక సంస్థల్లో సందడి మొదలైంది. కొందరు అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. సంప్రదింపులు నేడు రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు: కావేరి జలాల విషయంగా కర్ణాటక, తమిళనాడు అధికారులు ఒకే వేదిక మీదుగా సంప్రదింపులకు సిద్ధం అయ్యారు. గురువారం ఢిల్లీలో కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో జరిగే ఈ సమీక్షకు రాష్ట్ర మంత్రి ఎడపాడి పళని స్వామి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు నేతృత్వంలో అధికారుల కమిటీ పయనం అయింది. ఇక, కర్ణాటక సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో కమిటీ ఢిల్లీలో చర్చలకు సిద్ధమైంది. అయితే, నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా తమ వాదనలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించడం తమిళనాట ఆక్రోశాన్ని రగుల్చుతోంది. -
అన్నా డబ్బుల్లేవు..
కెప్టెన్కు నేతల షాక్ ఇక దరఖాస్తుల హోరు తమిళనాడు ‘స్థానిక’ సమరం డీఎండీకే వర్గాలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఓ వైపు బల నిరూపణ, మరో వైపు ఎన్నికల ఖర్చుకు నిధి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఉన్నదంతా పార్టీ కోసం ఇన్నాళ్లు ఖర్చు పెట్టిన వాళ్లంతా, ఇప్పుడు ‘అన్నా’ డబ్బుల్లేవు...నీవే దిక్కు అని కెప్టెన్ కోర్టులోకి బంతిని నెట్టే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గ షాక్లను పార్టీ అధినేత విజయకాంత్కు ఇచ్చే పనిలో జిల్లా నేతలు ఉన్నారు. చెన్నై : రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తి డీఎండీకే అన్నట్టుగా ప్రజల మన్ననల్ని అందుకున్న నాయకుడు విజయకాంత్. పార్టీ ఆవిర్భావ సమయంలో సినీ అభిమానం ఆయన వెంట కదిలింది. అభిమాన లోకం రాజకీయంగా ఎదిగారు. తమ నేత ఇచ్చే పిలుపుమేరకు చేపట్టే కార్యక్రమాలకు ఇళ్లు గుళ్ల చేసుకున్న వాళ్లెందరో ఉన్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించినా, చివరకు అధికార పక్షంతో విజయకాంత్ పెట్టుకున్న వైరం డీఎండీకే వర్గాల్ని ఆర్థికంగా మరింత కష్టాల్లోకి నెట్టిందని చెప్పవచ్చు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే, చావు దెబ్బే తిన్నారు. ఇక, తాము ఇమడలేమంటూ పెద్ద సంఖ్యలో కేడర్ డీఎండీకేను వీడింది. దీంతో మిగిలిన వాళ్లను రక్షించుకునేందుకు విజయకాంత్ తీవ్రంగానే కుస్తీలు పట్టారు. ఇప్పుడు ఉన్న కేడర్లో ఆర్థికంగా దెబ్బ తిన్న వాళ్లు కొందరు అయితే, మరి కొందరు చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా రాజకీయాలు చేసే వాళ్లు ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ నేతల్లో స్థానిక ఎన్నికల ఖర్చు గుబులు బయలు దేరింది. ఎక్కడ తమ నెత్తిన వేసే రీతిలో కెప్టెన్ పిలుపునిస్తారో అన్న ఉత్కంఠ బయలు దేరింది. దీంతో ముందస్తుగా మేల్కొన్న జిల్లాల నేతలు అన్నా..డబ్బుల్లేవు...నీవే దిక్కు అన్నట్టు విజయకాంత్ వద్ద మొరపెట్టుకునే పనిలో పడ్డారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? పొత్తా? ఒంటరా..? అన్న అంశాలపై కేడర్ అభిప్రాయాల్ని విజయకాంత్ స్వీకరించే పనిలో పడ్డారు. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ సాగుతూ వస్తోంది. ఇందులో జిల్లాలు, డివిజన్ల నుంచి వస్తున్న నేతలు విజయకాంత్కు షాక్లు ఇచ్చే పనిలో పడ్డారట..!. బలోపేతం లక్ష్యంగా కెప్టెన్ ఇచ్చే సూచనలు, సలహాలను నేతలు చక్కగా ఆలకిస్తున్నారు. అదే అభిప్రాయాల విషయానికి వచ్చే కొద్ది నేతలు తమ గళాన్ని విప్పే పనిలో పడడం కెప్టెన్కు పెద్ద షాక్కే అంట..!. డబ్బుల్లేవు, మళ్లీ..మళ్లీ తాము సొంత డబ్బులు ఖర్చు పెట్టలేం అన్న సమాధానాలు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటే మంచిదన్నట్టుగా సలహాలు ఇచ్చే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అందరి అభిప్రాయాల్ని శ్రద్ధంగా వినే విజయకాంత్, చివరలో ఎన్నికల్లోకి వెళ్తున్నాం...తాను సూచించే వ్యక్తి గెలుపునకు శ్రమించాల్సిందే అంటూ కేడర్కు హుకుం జారీ చేసి పంపించేస్తున్నట్టు సమాచారం. ఇంత మాత్రానికి తమను పిలిపించి అభిప్రాయాలు సేకరించడం ఏమిటో అంటూ పలువురు నేతలు కోయంబేడులోని పార్టీ కార్యాలయం నుంచి బయట పడ్డాక పెదవి విప్పే పనిలో పడడం గమనార్హం. అదే సమయంలో తాను మాత్రం తగ్గేది లేదన్నట్టుగా విజయకాంత్ ముందుకు సాగుతుండడంతో స్థాని కంలో బలాన్ని చాటగలమా అన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారట! ఇక, ఓ వైపు కేడర్ అభిప్రాయాలు అంటూ, మరో వైపు దరఖాస్తుల స్వీకరణ అంటూ విజయకాంత్ తనదైన రూట్లో పయనం సాగిస్తుండడం గమనార్హం. దరఖాస్తుల హోరు : ఎన్నికలపై అభిప్రాయ సేకరణ ఓ వైపు కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో సాగితే, మరో వైపు బుధవారం నుంచి ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులు దరఖాస్తులు సమర్పించుకునే విధంగా ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయడం ఆలోచించదగ్గ విషయమే. ఇక విజయకాంత్ రూటే సెపరేటుగా ఉంటే, పీఎంకే అయితే, తాము ఒంటరే అన్నది స్పష్టం చేశారు. ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి శ్రీకారం చుట్టారు. అలాగే, బీజేపీ సైతం ఒంటరి అన్నట్టుగానే దరఖాస్తుల పర్వానికి శ్రీకారం చుట్టింది. కోడంబాక్కంలో ఈ దరఖాస్తుల పంపిణీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ప్రారంభించేశారు. దీంతో ఆయా పార్టీలో దరఖాస్తుల పర్వం వేగం పుంజుకుంది. -
విజయకాంత్ కు ఊరట
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వీరికి తిరుప్పూర్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ పై అత్యున్నత న్యాయస్థానం గురువారం స్టే ఇచ్చింది. ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు, ఆధార రహిత ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ విజయకాంత్, ప్రేమలతపై తమిళనాడులోని పలు జిల్లాల్లో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకాకపోవడంతో వీరికి తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్ జారీచేసింది. మరోవైపు ఆగస్టు 9న తమ ఎదుట హాజరుకావాలని విల్లుపురం కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన విజయకాంత్ కు పరువునష్టం కేసులు తలనొప్పిగా మారాయి. -
మూడో కూటమిని నమ్మని తంబి!
విజయ్కాంత్, వాసన్ల వల్లే మట్టికరిచామంటున్న పీడబ్ల్యూఎఫ్ నేతలు చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మూడో కూటమి ప్రభావం బలంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు ఎన్నికలకు ముందు అంచనా వేశారు. అధికార అన్నా డీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత అవినీతి కేసులో కొద్ది కాలం జైలుకు వెళ్లి రావటంతో పాటు పలు ఇతర ఆరోపణలు, వైఫల్యాల విమర్శల మధ్య గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోందని.. ప్రతిపక్ష డీఎంకే గత పాలనలో అవినీతి ఆరోపణల నుంచి ఇంకా బయటపడలేక క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని.. ఈ క్రమంలో ప్రధాన ద్రవిడ పార్టీలు రెండిటినీ వ్యతిరేకించే వారు.. కెప్టెన్ విజయ్కాంత్ సారథ్యంలోని డీఎండీకేతో కూడిన ప్రజా సంక్షేమ వేదిక (పీడబ్ల్యూఎఫ్)ను ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశముందని భావించారు. 2011 ఎన్నికల్లో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే దాదాపు 8 శాతం ఓట్లతో 29 సీట్లు గెలుచుకుంది. సీట్ల సంఖ్యలో డీఎంకే సైతం విజయ్కాంత్ పార్టీ తర్వాత మూడో స్థానానికి పడిపోయింది. అనంతర పరిణామాల్లో విజయ్కాంత్ విపక్ష నాయకుడయ్యారు. ఈ అంశాలన్నీ ఈసారి ఆయనపై అంచనాలు పెరగటానికి కారణమయ్యాయి. మహామహులు మట్టికరిచారిలా... ఈ ఎన్నికల్లో తొలుత ఏ ప్రధాన పార్టీతోనూ పొత్తు పెట్టుకోవటానికి నిరాకరించిన విజయ్కాంత్ చివరికి పీడబ్ల్యూఎఫ్తో కలసి ఆ కూటమి సీఎంగాఅభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రధాన పార్టీలు రెండిటికీ స్పష్టమైన ఆధిక్యం రాని పక్షంలో విజయ్కాంత్ కింగ్ మేకర్ అవుతారనుకున్నారు. కానీ వాస్తవం వేరేలా ఉంది. డీఎండీకేతో పాటు పీడబ్ల్యూఎఫ్ పక్షాలైన ఎండీఎంకే(వైకో), వీసీకే (తిరుమాళవన్), టీఎంసీ(జి.కె. వాసన్) లెఫ్ట్ దారుణంగా మట్టికరించింది. ఏ పార్టీకీ ఒక్క సీటూ లభించలేదు కెప్టెన్ సైతం ఉలుండూర్పేటలో డిపాజిట్ కోల్పోయి ఘోరంగా ఓడారు. ఆయనకు మూడో స్థానం లభించింది. వారి రాకతో విశ్వాసం కోల్పోయాం: ఎండీఎంకే అధినేత వైకో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని నామినేషన్ల రోజు ప్రకటించటం.. తమ కూటమిపై ప్రజావిశ్వాసాన్ని దెబ్బ తీసిందని సీపీఎం నేత ఒకరన్నారు. వైకో తాను ఓడిపోతానన్న భయంతోనే వెన్నుచూపారని విమర్శించారు. అయితే.. విజయ్కాంత్, వాసన్లను కూటమిలో చేరటం వల్లే ప్రజలు తమను వ్యతిరేకించారని సీపీఎం నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘ప్రజలను తక్కువ అంచనా వేశాం. ఇతర మార్గాలన్నీ మూసుకుపోయిన తర్వాత మా దగ్గరకు వచ్చిన వారిద్దరినీ నమ్మటానికి జనం పిచ్చివాళ్లు కాదు. విజయ్కాంత్ చివరి నిమిషం వరకూ బీజేపీతోనూ డీఎంకేతోనూ చర్చలు జరుపుతున్నారన్న విషయం అందరికీ తెలుసు. వాసన్ కూడా పొయస్ గార్డెన్ (జయనివాసం) ఎదుట పడిగాపులు పడటం జనం చూశారు. జయలలిత ఆయనకు సీటు ఇవ్వటానికి నిరాకరించిన తర్వాత వాసన్ మా దగ్గరకు వచ్చి చేరారు’ అని పేర్కొన్నారు. డబ్బు పెట్టలేకపవటమూ కారణమే..! సంపూర్ణ మద్య నిషేధం, రైతులకు విదేశీ ప్రయాణాలు వంటి ఈ కూటమి హామీలు అవాస్తవికమని ప్రజలకర్థమయింది. కూటమి అభ్యర్థులు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు. పోటీ కోసం ఆస్తులను అమ్ముకున్నారు. అన్నా డీఎంకే, డీఎంకే అభ్యర్థులు రూ. 4 నుంచి రూ. 10 కోట్లు ఖర్చు చేస్తే.. వీరు ఖర్చు చేసింది నియోజకవర్గానికి రూ. 40 లక్షలు మాత్రమేనని సంబంధిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి. డీఎంకే ఎందుకు గెలవలేకపోయింది? తమిళ ఓటరు 30 ఏళ్ల తర్వాత తొలిసారి అధికార పార్టీనే మళ్లీ గెలిపించారు. ఇది.. ఐదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేని దిగ్భ్రాంతికి గురిచేసింది. వాస్తవానికి పోలింగ్ రోజున ప్రకటించిన పలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు సైతం డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు వేశాయి. కానీ.. గత ఎన్నికలకన్నా ఈ ఎన్నికల్లో కరుణ పార్టీ బలపడినప్పటికీ.. అధికారంలోకి వస్తామన్న ఆశలు తలకిందులయ్యాయి. బలమైన పొత్తు లేకపోవటం.. రాష్ట్రంలో ప్రత్యేకించి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా లేని పరిస్థితుల్లో విపక్షం స్థానిక పార్టీలను కలుపుకుని బలమైన కూటమిని కూడగట్టి అధికారంలోకి వచ్చిన ఉదంతాలు గతంలో ఉన్నాయి. 2001లో జయ కాంగ్రెస్, టీఎంసీ, పీఎంకే, లెఫ్ట్తో జట్టుకట్టి అధికారంలోకి వచ్చారు. 2006లో డీఎంకే కూడా కూటమి కట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా డీఎండీకే వంటి ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకుని బరిలోకి దిగితే ఫలితాలు వేరేలా వచ్చే అవకాశముండేదని అంచనా వేస్తున్నారు. సీఎంగా జయ తెచ్చిన పథకాలు అద్భుతం చేసినట్లు కనిపిస్తోంద చెప్తున్నారు. చౌక ధరల క్యాంటీన్లు, తాగునీరు, మందులు, బస్సులు, సిమెంటు, ఇంటి నిర్మాణం, ఉచిత మేకలు, ఆవులు, గ్రైండర్ల వంటి విద్యుత్ పరికరాల పంపిణీ వంటివి ‘అమ్మ’కు అనుకూలంగా పనిచేసినట్లుగా అంచనా వేస్తున్నారు. డీఎంకే పైన, మిత్రపక్షమైన కాంగ్రెస్పైన వచ్చిన అవినీతి ఆరోపణలు, దర్యాప్తులు.. పార్టీ అవకాశాలను దెబ్బతీశాయని పరిశీలకులు చెప్తున్నారు. కరుణ కుమారుడు స్టాలిన్ను నిర్ణయాత్మక నేతగా ముందుకు తెచ్చి, సీఎం అభ్యర్థిగా ప్రకటించి.. ప్రభుత్వ మార్పు కోసం ప్రచారం చేసినట్లయితే మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవని భావిస్తున్నారు. -
తెలుగోడి సత్తా ఎంత?
♦ తమిళ బరిలో తెలుగు ఓటర్ల కరుణ కోసం పార్టీల ఎత్తులు ♦ పలువురు తెలుగు అభ్యర్థులను బరిలోకి దించిన డీంఎంకే, అన్నాడీఎంకే సాక్షి, చెన్నై: తమిళనాట ఏ రంగమైనా తెలుగువారి ముద్ర కచ్చితంగా ఉండాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంగా కలిసున్నప్పటి నుంచి ఇప్పటివరకూ రాజకీయాలతో పాటు కళలు, వాణిజ్యం ఇలా అన్నింట తెలుగు ప్రజలు తళుక్కుమంటూనే ఉన్నారు. ఇక ఎన్నికలొస్తే మన వారి సందడి అంతా ఇంతా కాదు. తెలుగును అణగదొక్కే ప్రయత్నాలు సాగినా, ఎన్నికల్లో తెలుగు ఓటరు ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పక్షాలు మాత్రం కుస్తీలు పడతాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో ప్రస్తుతం అదే జరుగుతోంది. ఇక తెలుగువారు ఎక్కువ గా ఉన్న చోట వారినే అభ్యర్థులుగా ప్రకటించాయి ప్రధాన పార్టీలు. తమిళ రాజకీయాల్లో తెలుగు వారి ఆధిపత్యం మొదటి నుంచి కొనసాగుతోంది. మొట్టమొదటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి చక్రవర్తి రాజగోపాలాచారి నుంచి డీఎండీకే నేత విజయ్కాంత్ వరకు తమిళ రాజకీయాల్లో మన వాళ్లు చక్రం తిప్పుతున్నారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి పూర్వీకులు తమిళనాడులో స్థిరపడిన తెలుగువారే. ఆ పార్టీలోని ఆర్కాడు వీరాస్వామి, కేఎన్ నెహ్రూలు, కాంగ్రెస్కు చెందిన కృష్ణస్వామి, చిరంజీవి, గోపీనాథ్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోలు కూడా మనవాళ్లే. చెన్నైలోని 7 స్థానాల్లో మనవాళ్లే కీలకం.. చెన్నైలో తెలుగు సంతతి ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నారు. నగరంలోని రాయపురం, తిరువొత్తియూరు, పెరంబూరు, కొళత్తూరు, విల్లివాక్కం, హార్బర్, అన్నానగర్, ఆర్కేనగర్ స్థానాల్లో వీరు అధికం. వారిని ఆకర్షించేందుకు తెలుగువారైన శేఖర్బాబు(హార్బర్), రంగనాథన్ (విల్లివాక్కం), మోహన్ (అన్నానగర్)లను డీఎంకే బరిలో నిలిపింది. ఆవడి, తాంబరం, పల్లావరంలోనూ తెలుగు ఓటర్లు అధికమే. పల్లావరం అభ్యర్థిగా తెలుగువారైన నటి సీఆర్ సరస్వతిని అన్నాడీఎంకే పోటీకి పెట్టింది. సరిహద్దు జిల్లాలోను మన రాజకీయమే ఏపీ సరిహద్దుల్లోని తిరువళ్లూరు, వేలూరు, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లోను మనవాళ్ల ప్రభావం ఎక్కువే. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి, తిరుత్తణి, కృష్ణగిరి జిల్లా హొసూరు, తలి, వేపనహల్లి, ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపట్టిల్లో తెలుగు ఓటరే కీలకం. గుమ్మిడిపూండిలో తెలుగువాడైన శేఖర్ డీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అన్నాడీఎంకే నుంచి తెలుగు నేత మాజీ ఎమ్మెల్యే విజయకుమార్ రేసులో ఉన్నారు. తిరుత్తణి నుంచి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చక్రవర్తి నాయుడు, ప్రజా సంక్షేమ కూటమి నుంచి డీఎండీకే అభ్యర్థిగా కృష్ణమూర్తినాయుడు బరిలో ఉన్నారు. హోసూరు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే గోపీనాథ్ తమిళ అసెంబ్లీలో తెలుగు వాణి విన్పిస్తున్నారు. ఆర్కేనగర్లో సీఎం జయలలితను తమిళనాడు తెలుగు యువశక్తి చీఫ్ జగదీశ్వరరెడ్డి ఢీకొంటున్నారు. జయ, కరుణలకు ఈసీ నోటీసులు ఈ నెల16న ఎన్నికలు జరిగే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ప్రచారం శనివారంతో ముగిసింది. తమిళనాడులోని అరవకురిచి స్థానంలో అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టారన్న ఆరోపణలతో ఈసీ ఎన్నికను ఈ నెల 23కు వాయిదా వేసింది. పార్టీల మేనిఫెస్టోలు ఈసీ నిబంధనల మేరకు లేవని అన్నాడీఎంకే అధినేత్రి జయ, డీఎంకే చీఫ్ కరుణానిధికి ఈసీ నోటీసులు జారీచేసింది. ఆదివారం సాయంత్రం 5 గంటల్లోగా వివరణివ్వాలని పేర్కొంది. -
డీఎంకేది పిల్ల బెదిరింపు
కెప్టెన్ విజయ్కాంత్ పళ్లిపట్టు: డీఎంకేది పిల్ల బెదిరింపులని, అన్నాడీఎంకే అవినీతి సొమ్ముతో సామాన్యులను కొని జనాక్షరణగా చేస్తున్న ప్రచారాలు ఎన్నికల్లో చెల్లవని డీఎండీకే అద్యక్షుడు విజయకాంత్ ఎద్దేవా చేశారు. డీఎండీకే, ప్రజా సంక్షేమ కూటమి, తమాకాతో పాటు ఆరు పార్టీల ఆధ్వర్యంలో పొత్తు ఏర్పాటు చేసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా తిరుత్తణి డీఎండీకే అభ్యర్థి కృష్ణమూర్తికి మద్దతుగా శుక్రవారం రాత్రి తిరుత్తణిలో బహిరంగ సభ నిర్వహించారు. టీఎంసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రామన్, ఎండీఎంకే జిల్లా కార్యదర్శి డీఆర్ ఆర్ సెంగుట్టవన్, వీసీకే జిల్లా కార్యదర్శి సిద్ధార్థన్, సీపీఐ జిల్లా కార్యదర్శి కన్నన్, సీపీఎం జిల్లా కార్యదర్శి పన్నీరు సెల్వం, టీఎంసీ జిల్లా అధ్యక్షుడు శేఖర్తో సహా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో కెప్టెన్ విజయకాంత్ పాల్గొని అభ్యర్థి కృష్ణమూర్తిని పరిచయం చేసి మాట్లాడారు. తను కూటమిలో ఆరు పార్టీలున్నాయని కూటమి పార్టీల అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని, తిరుత్తణిలో కృష్ణమూర్తికి ఢంకా గుర్తుకు ఓట్లేయాలని పిలుపు నిచ్చారు. డీఎంకే పిల్ల బెదిరింపులతో స్టాలిన్ జపం చేస్తున్నారని, అలాగే అన్నాడీఎంకే డబ్బుతో నిరుపేదలను కొనుగోలు చేసి భారీగా బహిరంగ సభలు చూపి ప్రచారాలకు పరిమితమవుతున్నట్లు చెప్పారు. అయితే తమ కూటమి ఎలాంటి ఆకర్షణలకు, ప్రలోభాలకు, ప్రజలను గురి చేయకుండా ప్రజలే ఆసక్తిగా తమ వెంట నడుస్తున్నట్లు చెప్పారు. -
'రజనీకాంత్లా పిరికివాడిని కాను'
చెన్నై: తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు భయపెడితే భయపడటానికి తానేమీ రజనీకాంత్ మాదిరిగా పిరికివాడిని కాదంటూ విజయ్ కాంత్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. విజయ్ కాంత్ వ్యాఖ్యలపై రజనీకాంత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో పలుచోట్ల రజనీ అభిమానులు విజయ్ కాంత్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. విజయ్కాంత్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ఎన్నికల పొత్తు గురించి అడిగిన మీడియా ప్రతినిధులను దుర్భాషలాడారు. అప్పట్లో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. ఇక సొంత పార్టీ నాయకుల పట్ల కూడా ఆయన అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయి. -
విజయ్కాంత్ పార్టీలో ముసలం
చెన్నై: తమిళనాడులో కెప్టెన్ విజయ్కాంత్ నేతృత్వంలోని డీఎండీకేలో ముసలం మొదలైంది. పీడబ్ల్యూఎఫ్(పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్)తో పొత్తు కుదుర్చుకోవాలన్న విజయ్కాంత్ నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు సహా 10 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు. ‘వారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, అప్రతిష్ట తెచ్చారు. పార్టీ పదవులు, ప్రాథమిక సభ్యత్వం నుంచి వారిని తొలగిస్తున్నాం’ అని విజయ్కాంత్ మంగళవారం తెలిపారు. అసమ్మతిని సహించబోమని చెప్పడానికే సీనియర్ నేతలపై వేటు వేశారని పార్టీ వర్గాలు చెప్పాయి. అంతకుముందు, పీడబ్ల్యూఎఫ్తో పొత్తు వద్దని, కరుణానిధి నేతృత్వంలోని డీఎంకేతో కలసి ఎన్నికల్లో పోటీచేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు సహా పదిమంది సీనియర్ నేతలు విజయ్కాంత్కు అల్టిమేటం ఇచ్చారు. ఎమ్మెల్యే, ప్రచార కార్యదర్శి వీసీ చంద్రకుమార్ మాట్లాడుతూ, ‘జయ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పొత్తు నిర్ణయం జరగలేదు. డీఎంకేతో పొత్తుతోటే విజయం సాధ్యమవుతుంది. పీడబ్ల్యూఎఫ్తో పొత్తు పార్టీలోని 95 శాతం మందికి ఇష్టం లేదు’ అని అన్నారు. డీఎండీకే 124 స్థానాల్లో, పీడబ్ల్యూఎఫ్ 110 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. -
ఆయన భాష అర్థం కాదు
టీనగర్: అర్థం కాని భాషలో మాట్లాడి విజయకాంత్ ప్రజలను తికమకపెడుతున్నట్లు నటి వింధ్య విమర్శించారు. మదురైలో జరిగిన అన్నాడీఎంకే బహిరంగ సభలో నటి వింధ్య మాట్లాడారు. జయలలిత ప్రజల కోసం స్వర్ణయుగ పాలన జరుపుతున్నారని పేర్కొన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతోనే అన్నాడీఎంకే కూటమి ఏర్పరచుకుని ఎన్నికలను ఎదుర్కొంటోందని, అయితే పదవీ వ్యామోహంతో ప్రతిపక్షాలు సంప్రదాయాలు, విలువలు లేని పార్టీలతో కూటమి ఏర్పాటుచేసుకుని ప్రజల వద్ద ఓట్లడుగుతున్నట్లు తెలిపారు. పనికిరాని స్నేహం అనర్థానికి దారి తీస్తుందని కరుణానిధి పదే పదే చెప్పేవారని, ప్రస్తుతం వేరే గత్యంతరం లేక మళ్లీ కాంగ్రెస్ పార్టీతో కూటమి ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. దీన్ని ప్రజలు అంగీకరించబోరన్నారు. కాంగ్రెస్ పార్టీని చూస్తే జాలేస్తోందని తెలిపారు. కామరాజ్ బాటలో నడిచిన కాంగ్రెస్ పార్టీ అంటూ కుష్బూ, నగ్మాలను నమ్ముకోవడం చూస్తే బాధగా ఉందన్నారు. ప్రజా సంక్షేమ కూటమి అంటూ ఒకటుందని, విజయకాంత్ను ముఖ్యమంత్రి చేయాలన్నదే వారి లక్ష్యం అన్నారు. విజయకాంత్ ప్రస్తుతం ఎక్కడున్నాడో తెలియడం లేదన్నారు. ఆయనకు రాష్ట్రాన్ని పాలించే సత్తా వుందా? అంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆరాటపడే విజయకాంత్ ఏమి మాట్లాడేది ఆయనకే అర్థం కాదన్నారు. బాహుబలి చిత్రంలో నల్లజాతి ప్రజలు కనిపిస్తారని, వారు అర్థం కాని బాషలో మాట్లాడి ప్రేక్షకులను తికమక పెడతారన్నారు. అదే విధంగా విజయకాంత్ మాట్లాడుతూ ప్రజలను తికమకపెడుతున్నట్లు తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే 234 నియోజకవర్గాలలో ఘన విజయం సాధిస్తుందని, మళ్లీ ఆరోసారి ముఖ్యమంత్రిగా జయలలిత పదవిని అధిష్టిస్తారని తెలిపారు. -
కరుణకు కోపం వచ్చింది
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత కరుణానిధికి కోపం వచ్చింది. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన ఎండీఎంకే అధినేత వైగోకు నోటీసులు పంపించారు. తనపై అసత్య పూర్వకంగా చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు. తమతో పొత్తు పెట్టుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటూ డీఎండీకే అధ్యక్షుడు విజయ్కాంత్కు ఆఫర్ చేశాయని ఎండీఎంకే అధినేత వైగో.. డీఎంకే, బీజేపీలపై సంచలన ఆరోపణలు చేశారు. డీఎంకే.. 500 కోట్ల రూపాయల డబ్బు, 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేయగా, బీజేపీ.. ఎన్నికల ఖర్చుకు కావాల్సినంత డబ్బు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వైగో ఆరోపణల్లో పేర్కొన్నారు. దీనికి వెంటనే స్పందించిన కరుణానిధి అది తమపై చేసిన అసత్య ప్రచారమని అన్నారు. వెంటనే వివరణ ఇవ్వాలంటూ పరువు నష్టం దావా వేశారు. -
'రూ. 500 కోట్లు ఇస్తామన్నా తిరస్కరించారు'
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎండీఎంకే అధినేత వైగో.. డీఎంకే, బీజేపీలపై సంచలన ఆరోపణలు చేశారు. తమతో పొత్తు పెట్టుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటూ ఈ రెండు పార్టీలు డీఎండీకే అధ్యక్షుడు విజయ్కాంత్కు ఆఫర్ చేశాయని చెప్పారు. డీఎంకే.. 500 కోట్ల రూపాయల డబ్బు, 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేయగా, బీజేపీ.. ఎన్నికల ఖర్చుకు కావాల్సినంత డబ్బు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వైగో ఆరోపించారు. అయినా విజయ్కాంత్ వీటిని తిరస్కరించారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అధికార అన్నా డీఎంకేలకు ఓటమి తప్పదని అన్నారు. విజయ్కాంత్ నేతృత్వంలోని తమ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో నాలుగు పార్టీల కూటమి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్(పీడబ్ల్యూఎఫ్) నాయకులు.. వైగో(ఎండీఎంకే), తోల్ తిరుమవలవన్(వీసీకే), జీ. రామకృష్ణన్(సీపీఎం), ఆర్. ముతరాసన్(సీపీఐ)లు.. కెప్టెన్ ఆధ్వర్యంలోని డీఎండీకేతో పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. డీఎండీకే 124 స్థానాల్లో, పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ అభ్యర్థులు 110 స్థానాల్లో పోటీ చేయడానికి పొత్తు కుదిరింది. డీఎండీకే-పీడబ్ల్యూఎఫ్ కూటమికి కెప్టెన్ విజయ్కాంత్ సీఎం అభ్యర్థిగా ఖరారయ్యారు. -
ఎట్టకేలకు కెప్టెన్ పొత్తు ఖరారైంది!
చెన్నై: రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో జతకడతాడో అన్న విషయంలో గత కొంతకాలంగా ఉన్న సందిగ్ధతకు కెప్టెన్ విజయ్కాంత్ బుధవారం తెరదించాడు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వమే లక్ష్యంగా పావులు కదిపిన కెప్టెన్ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నాడు. నాలుగు పార్టీల కూటమి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్(పీడబ్ల్యూఎఫ్) నాయకులు.. వైగో(ఎండీఎంకే), తోల్ తిరుమవలవన్(వీసీకే), జీ. రామకృష్ణన్(సీపీఎం), ఆర్. ముతరాసన్(సీపీఐ)లు బుధవారం ఉదయం డీఎండీకే కార్యాలయంలో విజయ్కాంత్తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కెప్టెన్ ఆధ్వర్యంలోని డీఎండీకే 124 స్థానాల్లో, పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ అభ్యర్థులు 110 స్థానాల్లో పోటీ చేయడానికి పొత్తు కుదిరింది. దీనిలో భాగంగా డీఎండీకే-పీడబ్ల్యూఎఫ్ కూటమికి కెప్టెన్ విజయ్కాంత్ సీఎం అభ్యర్థిగా ఖరారయ్యారు. -
సీఎం పదవి ఇస్తేనే కూటమికి సై!
చెన్నై: కొలిక్కిరాని కూటమి కోసం భారతీయ జనతా పార్టీ రాయబారం ప్రారంభించినా అంతగా కలిసొచ్చినట్లుగా లేదు. తమిళపార్టీలతో రాజకీయ మంతనాలు సాగించేందుకు శనివారం చెన్నై చేరుకున్న కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ డీఎండీకే నేతలతో చర్చలు జరుపుతున్నారు. డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్ తో చర్చలు మొదలుపెట్టారు. విజయ్ కాంత్ మాత్రం కూటమి వైపు మొగ్గుచూపి, తనకు సీఎం పదవి ఇస్తేనే ఇందుకు సమ్మతిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్కు కౌంట్డౌన్ మొదలైనట్లుగా అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దక్షిణాదిలో బలం పుంజుకోవావలని ఆశిస్తున్న బీజేపీ అధినాయకత్వం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో తమ బలం ఏమిటో నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది. డీఎండీకే నేత నేతృత్వంలోనే కూటమి ఏర్పడాలి, తనను సీఎం అభ్యర్దిగా ప్రకటించాలని విజయకాంత్ బీజేపీకి షరతులు విధించారు. ఇందుకు అంగీకరిస్తేనే బీజేపీతో చర్చలని విజయకాంత్ భీష్మించకుని ఉన్నారు. కెప్టెన్ వైఖరితో రెండు పార్టీల మధ్య అగాధం ఏర్పడింది. ఈ పరిస్థితిని చక్కదిద్ది కూటమిని కొలిక్కి తేచ్చేందుకు జవదేకర్ రంగంలోకి దిగానా విజయ్ కాంత్ తన నిర్ణయంలో మార్పులేదని చెప్పినట్లు తెలుస్తోంది. -
కెప్టెన్కు గట్టి ఎదురుదెబ్బ!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్కు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. డీఎండీకేకు చెందిన ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలు హఠాత్తుగా చేసిన రాజీనామాను ఆదివారం స్పీకర్ ధనపాల్ ఆమోదించారు. అలాగే, ప్రధాన ప్రతి పక్ష పదవికి విజయకాంత్ అర్హత కోల్పోయినట్టుగా ప్రకటించారు. ♦ డీఎండీకే ఎమ్మెల్యేలు 8 మంది రాజీనామా ♦ ప్రతిపక్ష నేత పదవి దూరం ♦ ఆమోదంతో కోల్పోయిన అర్హత ♦ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేనట్టే ♦ పీఎంకే, పీటీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ♦ స్పీకర్ ధనపాల్ ప్రకటన సాక్షి, చెన్నై : ఏ పార్టీకి అర్హత లేని దృష్ట్యా, అసెంబ్లీకి ప్రధాన ప్రతి పక్షం అన్నది లేనట్టేనని స్పష్టం చేశారు. ఇక, పీఎంకే ఎమ్మెల్యే కలైయరసన్, పుదియ తమిళగం ఎమ్మెల్యే రామస్వామి సైతం పదవికి రాజీనామా చేయడం గమనార్హం. 2011 అసెంబ్లీ ఎన్నికల్ని అన్నాడీఎంకేతో కలసి డీఎండీకే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 29 మంది డీఎండీకే సభ్యులు విజయ కేతనం ఎగుర వేయడంతో రాష్ర్టంలో అతి పెద్ద పార్టీగా ఉన్న డీఎంకేకు పెద్ద దెబ్బ తగిలినట్టైంది. కనీసం ఆ పార్టీకి ప్రధాన ప్రతి పక్ష హోదా కూడా దక్కలేదు. డీఎండీకే అధినేత విజయకాంత్ ఈ ఎన్నికల ద్వారా ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. ఇంత వరకు బాగానే పయనం సాగినా తదుపరి పరిణామాలు అన్నాడీఎంకే, డీఎండీకేల మధ్య వైర్యాన్ని పెంచాయి. అసెంబ్లీ వేదికగా సాగిన సమరంతో వివాదం ముదిరింది. అదే సమయంలో అన్నాడీఎంకే చేపట్టిన ఆపరేషన్ ఆకర్షతో డీఎండీకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు రెబల్స్గా అవతరించారు. డీఎండీకేలో ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా అసెంబ్లీలోనే కాదు, ఇంటా బయట వ్యవహరించడం మొదలెట్టారు. వీరిలో పాండియరాజన్(విరుదునగర్), సీ.అరుణ్ పాండియన్(పేరావూరని), మైకెల్ రాయప్పన్(రాధాపురం), టి సుందరరాజన్( మదురై వెస్ట్), తమిళలగన్(దిట్టకుడి), టి సురేష్కుమార్(సెంగం), శాంతి (సెంథామంగళం), అరుణ్ సుబ్రమణ్యం(తిరుత్తణి) ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, డీఎండీకే సీనియర్ నేత, ఆలందూరు ఎమ్మెల్యే బన్రూటి రామచంద్రన్ ఏకంగా పదవికి రాజీనామా చేసి అన్నాడీఎంకేలో చేరారు. ఉప ఎన్నికల్లో ఆ సీటు అన్నాడీఎంకే ఖాతాలోకి చేరింది. ఇన్నాళ్లు రెబల్ ఎమ్మెల్యేలు డీఎండీకే సభ్యులుగానే ఉంటూ రావడంతో ప్రధాన ప్రతి పక్ష నేతగా విజయకాంత్ కొనసాగుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలు హఠాత్తుగా రాజీనామా చేయడం, దానికి ఆఘ మేఘాలపై స్పీకర్ ధనపాల్ ఆమోదం తెలపడంతో విజయకాంత్కు గట్టి షాక్ తగిలినట్టు అయింది. అర్హత కోల్పోయిన విజయకాంత్ : 29 మంది సభ్యుల్ని కల్గి ఉన్న విజయకాంత్కు బన్రూటి రామచంద్రన్ రూపంలో ఓ స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎనిమిది మంది రాజీనామాతో సంఖ్యా బలం 20కు పడిపోయింది. ఈ ఎనిమిది మంది రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ ధనపాల్ ప్రకటన విడుదల చేశారు. డీఎండీకేకు చెందిన ఎనిమిది మంది సభ్యుల రాజీనామా ఆమోదించడం జరిగిందని, అందువల్ల ఆ పార్టీ సంఖ్యా బలం 20కు చేరినట్టు వివరించారు. ఈ దృష్ట్యా, అసెంబ్లీ ప్రధాన ప్రతి పక్ష నేత పదవిని విజయకాంత్ కోల్పోయినట్టుగా, ఆ పదవికి తగ్గట్టు కల్పించిన అన్ని రాయితీలను, అర్హతలను వెనక్కు తీసుకోవడం జరుగుతున్నదని ప్రకటించారు. ఏ ప్రతి పక్ష పార్టీకి 24 మంది సభ్యులు అసెంబ్లీలో లేని దృష్ట్యా, ప్రధాన ప్రతి పక్షంగా వ్యవహరించే అర్హత ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు రాజీనామా చేయకుండా రెబల్స్గా వ్యవహరిస్తూ వచ్చిన డీఎండీకే సభ్యులు ఎనిమిది మంది హఠాత్తుగా స్పీకర్కు రాజీనామా లేఖ సమర్పించడం, దానికి ఆమోదం తెలపడం గమనించాల్సిన విషయం. ఇటీవల పీఎంకే నుంచి బయటకు వచ్చిన ఆనైకట్టు ఎమ్మెల్యే కలైయరసన్, పుదియ తమిళగం నుంచి బయటకు వచ్చిన నీల కోటై ఎమ్మెల్యేలు రామస్వామి తాజాగా రాజీనామ చేసి స్పీకర్కు పంపించారు. వీరిలో కలైయరసన్ రాజీనామా ఆమోదిం చారు. ఆశ్రయం ఇచ్చిన పార్టీకి వ్యతిరేకంగా ఇన్నాళ్లు వ్యవహరించి తాజాగా రాజీ నామా చేసి బయటకు వ స్తున్న వీరందరికీ అన్నాడీఎంకే లో సీట్లు దక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. -
నేనొక్కడినే..
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు డీఎండీకే అధినేత, ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ రెడీ అవుతున్నారు. అయితే, సభలో ఆయన ఒక్కడే ప్రధాన ప్రతి పక్షానికి కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సిన పరిస్థితి. ఇందుకు కారణం, డీఎండీకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ కొనసాగింపు పర్వమే. చెన్నై : అన్నాడీఎంకేతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనడంతో డీఎండీకే అధినేత విజయకాంత్కు అదృష్టం కలసి వచ్చిందని చెప్పవచ్చు. డీఎంకే పతనంతో ప్రధాన ప్రతి పక్షనేతగా అవతరించిన విజయకాంత్ తన స్టంట్ను అధికార పక్షం మీద చూపించి చావు దెబ్బ తినాల్సి వచ్చింది. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రెబల్స్గా మారారు. కీలక నేత బన్రూటి రామచంద్రన్ ఏకంగా పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో 29గా ఉన్న డీఎండీకే సభ్యుల సంఖ్య బన్రూటి రామచంద్రన్ రాజీనామాతో 28కి తగ్గింది. ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని అన్నాడీఎంకేకు అప్పగించుకోవాల్సి వచ్చింది. ఇక, రెబల్స్ రూపంలో మరో ఎనిమిది తగ్గాక తప్పలేదు. ఈ రెబల్స్ డీఎండీకే చిహ్నం మీద గెలిచినా, అసెంబ్లీలో మాత్రం అన్నాడీఎంకే సభ్యులతో కలసి కూర్చుంటూ వారితో కలిసి పోయారు. చివరకు తనతో పాటుగా 20 మంది సభ్యుల్ని మాత్రం విజయకాంత్ రక్షించుకోగలిగారు. అలాగే, అధికార అన్నాడీఎంకేతో ఏర్పడ్డ వైర్యం ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ కొన్నాళ్లు సభ నుంచి సస్పెండ్ కాక తప్పలేదు. ఏ రోజున సస్పెండ్ అయ్యారో, అప్పటి నుంచి సభలోకి అడుగు పెట్టడం మానేశారు. సభా సమయాల్లో అసెంబ్లీ ఆవరణలోని రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లడంతో సరి. తమ అధినేత అసెంబ్లీకి దూరంగా ఉండటంతో తమ సత్తా ఏమిటో అధికార పక్షానికి రుచి చూపించేందుకు ఆయన సేనలు వచ్చి రాని స్టంట్లు చేసి ఇరకాటంలో పడ్డారు. ఒక్కడే : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తమ రెబల్స్తో ఫైట్ డీఎండీకే సభ్యులకు శిక్ష పడేలా చేశాయి. ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించి స్పీకర్ ధనపాల్ సభ్యులందర్నీ సస్పెండ్ చేశారు. ఆ సమావేశాల కాలంతో పాటుగా తదుపరి సమావేశాల కు కూడా సస్పెన్షన్ శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి. అయితే, ఆ ఘటన జరిగిన రోజు సభలో విజయకాంత్ లేరు. దీంతో సస్పెన్షన్ ఆయనకు వర్తించదు. ఈ పరిస్థితుల్లో ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో సభలో ప్రధాన ప్రతి పక్షం ఉండేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. విజయకాంత్ సభకు రాని పక్షంలో, ఇక వారికి కేటాయించిన సీట్లన్నీ ఖాళీయే అన్న వ్యంగ్యాస్త్రాలు బయలు దేరి ఉన్నది. ఈ సమయంలో నేనొక్కడ్నే అంటూ సభలో అడుగు పెట్టేందుకు విజయకాంత్ సిద్ధం అయ్యారు. అసెంబ్లీలో ఒక్కడ్నే ..ఒంటరిగా అధికార పక్షాన్ని చీల్చి చెండాడుతా..? అంటూ మరో మారు సభ వేదికగా అన్నాడీఎంకేతో ఢీకి రెడీ అవుతున్నారు. తన వెంట ఎమ్మెల్యేలు లేకున్నా, ఒక్కడ్నే చాలు అసెంబ్లీలో అడుగు పెడుతా..! అని విజయకాంత్ స్పష్టం చేస్తున్నారు. దీంతో సభలో మరో మారు అధికార పక్షం వర్సెస్ విజయకాంత్ మధ్య ఆసక్తికర సన్నివేశాలు వివాదాలు చోటు చేసుకోవడం ఖాయం. అదే సమయంలో విజయకాంత్ దూకుడుకు కళ్లెం వేయడానికి మేమూ రెడీ అని రెబల్స్ వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. -
తమిళనాడు రాజకీయాల్లో కొత్త కోణం
-
నవంబర్ 28న జీకే వాసన్ కొత్తపార్టీ
తమిళనాడు:కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ కొత్త పార్టీకి ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 28వ తేదీన కొత్తపార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వాసన్ తాజాగా స్పష్టం చేశాడు. రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో బహిరంగ సభలోనే పార్టీ ఏర్పాటును వాసన్ ప్రకటిస్తారు. ఈ మధ్యనే కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పిన వాసన్.. కొత్త పార్టీ పేరు.. అజెండాను అదే రోజు వెల్లడించనున్నారు. తిరుచ్చిలో జరగనున్న జీకేవీ మహానాడుకు డీఎండీకే శ్రేణు లు సైతం హాజరవుతున్నట్లు తెలుస్తోంది. జీకే వాసన్ కొత్తపార్టీకి విజయ్ కాంత్ మద్దతిచ్చే క్రమంలోనే ఆ కార్యక్రమానికి డీఎండీకే శ్రేణులు హాజరవుతున్నట్లు ప్రచారం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
జీకే వాసన్కు ‘కెప్టెన్’ మద్దతు
చెన్నై, సాక్షి ప్రతినిధి : కొత్త పార్టీ పెట్టబోతున్న జీకే వాసన్కు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా డీఎండీకే అధినేత విజయకాంత్ మరోసారి కలకలం సృష్టించారు. తిరుచ్చిలో జరగనున్న జీకేవీ మహానాడుకు డీఎండీకే శ్రేణు లు సైతం హాజరుకానున్నట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావం నుంచి సంచలనానికి కెప్టెన్ కేంద్ర బిందువయ్యూ రు. పదేళ్ల క్రితం డీఎండీకే తొలిసారి ఎన్నికలను ఎదుర్కొన్నపుడు ఒక్క విజయకాంత్ మినహా ఎవ్వరూ గెలవకపోవ డం అప్పట్లో సంచలనం. ఆ తరువాత అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని డీఎంకే కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్షహోదాను దక్కించుకోవడం మరో కలకలం. స్వల్పకాలంలోనే అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతో విబేధించి, ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కూటమిలో చేరడం ద్వారా మరో సం చలనానికి తెరదీశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రధాని మోదీకి సన్నిహితునిగా మారడంతోపాటూ 2016న రాబోయే అసెం బ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోవాలని విజయకాంత్ ఆశిస్తున్నారు. ఇలా బీజేపీ కూటమిలోనే కొనసాగుతున్న విజయకాంత్ అకస్మాత్తుగా జీకే వాసన్కు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా మరోసారి కలకలం రేపారు. కాంగ్రెస్తో విభేదించి జీకే వాసన్ పెట్టబోతున్న పార్టీతో చేతులు కలిపేందుకు సుముఖత చూపుతున్నారు. జీకేవాసన్, కెప్టెన్ రాజకీయాలకు అతీతంగా మిత్రు లు. ప్రస్తుతం మలేషియాలో ఉన్న విజ యకాంత్ సెల్ఫోన్ ద్వారా జీకేవీకి శుభాకాంక్షలు తెలపడం వరకే పరిమి తం అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తిరుచ్చిలో జరగనున్న కొత్త పార్టీ ఆవిర్భావ వేడుకకు జీకే వాసన్ ఆహ్వానించడం, తాను విదేశాల్లో ఉన్నందున తమ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారని విజయకాంత్ చెప్పినట్లు సమాచారం. బీజేపీ కూటమి తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పక్షంలో ఇదే కూటమిలో జీకే వాసన్ పార్టీ సైతం చేరినట్లయితే మరింత బలం చేకూరుతుందని కెప్టెన్ అంచనాగా ఉంది. అయితే కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ అభిప్రాయం తో నిమిత్తం లేకుండా కెప్టెన్ తనకు తానుగా జీకేవీకి చేరువవుతున్నారు. జీకే వాసన్ పార్టీతో డీఎండీకే జతకడుతుందా లేక బీజేపీ కూటమిలోకి వాసన్ వస్తారా అనే చర్చకు కెప్టెన్ తెరలేపారు. సభకోసం సమీకరణలు తిరుచ్చి సభను విజయవంతం చేసేం దుకు జీకే వాసన్ సమీకరణల బాట పట్టారు. సభకు కనీసం 2 లక్షల మందిని హాజరుపరచాలని పట్టుదలతో ఉన్నారు. ఈనెల 20 లేదా 21వ తేదీ తిరుచ్చి సభకు ముహూర్తంగా చెబుతున్నారు. జీ కార్నర్ ప్రాంగణంలో సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ ఇద్దరు జీకే వాసన్వైపు మొగ్గుచూపుతున్న ఇద్ద రు (కాంగ్రెస్) ఎమ్మెల్యేల సభ్యత్వం ఉంటుందా, ఊడుతుందా అనే చర్చ సాగుతోంది. కన్యాకుమారి జిల్లా కిలి యూర్ ఎమ్మెల్యే జాన్జాకబ్, తంజావూరు జిల్లా పట్టుకోట్టై ఎమ్మెల్యే రంగరాజన్లు కొత్త పార్టీ పెట్టబోతున్న జీకే వాసన్కు మద్దతుగా నిలిచారు. హస్తం గుర్తుపై గెలిచి మరోపార్టీలో చేరుతున్నట్లు అధికారికం గా నిర్ధారణ కాగానే పార్టీ అధిష్టానం వెంటనే వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి ఆ ఉత్తరాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపే అవకాశం ఉంది. అసెంబ్లీ కార్యదర్శి వెంటనే వారిద్దరి సభ్యత్వం రద్దయినట్లు ప్రకటించవచ్చు. డీఎంకే నుంచి ఒకరు, డీఎండీకే నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఏడాది కిందటే అన్నాడీఎంకే పంచన చేరిపోయారు. రంగరాజన్, జాన్జాకబ్ సభ్యత్వం కోల్పోగానే ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు జరపక తప్పదు. రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు వీస్తున్న దశలో ఉపఎన్నికలపై కాంగ్రెస్ విముఖత ప్రదర్శించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితిలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎటువంటి వైఖ రిని అవలంభిస్తారో వేచిచూడాల్సిందే. -
అయ్యో..కెప్టెన్
డీఎండీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయ్కాంత్ పరిస్థితి ప్రస్తుతం తారుమారు అయ్యింది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్కు ముందు ఓ ఊపు ఊపిన ఆయన ఇప్పుడు కమలనాధుల దర్శనం కోసం పడిగాపులు పడుతున్నారు. ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని భార్య ప్రేమలతతో కలిసి ప్రచారం చేసిన విజయకాంత్కు...మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. ఇక ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైనా, మిత్ర పక్షాలతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడీ తన పట్ల చూపిన ప్రేమ,ఆప్యాయతలు విజయకాంత్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలంటూ ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందో లేదా, రాజపక్సేకు వ్యతిరేకంగా రాష్ట్రంలో సాగుతున్న ఆందోళనల్ని సైతం ఖాతరు చేయలేదు. తన సతీమణి ప్రేమలత, బావమరిది సుధీష్తో కలసి ఢిల్లీకి పరుగులు తీసిన విజయకాంత్కు చివరకు మిగిలింది నిరాశే. ఢిల్లీలో ఉన్నా, ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. తొలుత అనారోగ్య కారణాలతో ఆయన వెళ్లలేదన్న ప్రచారం జరిగినా, చివరకు తన బావమరిది సుధీష్కు సహాయ మంత్రి పదవి ఇవ్వక పోవడం, తనకు మొదటి వరుసలో కాకుండా మూడో వరుసలో సీటు కేటాయించడంతో విజయకాంత్ కినుకు వహించారు. దర్శనం కోసం ఎదురు చూపు: ప్రమాణ స్వీకారం ముగిసినా, చెన్నైకు విజయకాంత్ తిరుగు పయనం కాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ను కలిసి ఎన్నికల సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాల అమలుకు విజయకాంత్ తీవ్రంగానే ప్రయత్నించినట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర నేతలు పట్టించుకోకపోవడంతో ఒంటరిగానే అపాయింట్మెంట్ ప్రయత్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బుధవారం రాత్రి వరకు తన ప్రయత్నం చేసినా, కమలనాథుల దర్శనం మాత్రం విజయకాంత్కు దక్కలేదు. దీంతో విసిగి వేసారిన విజయకాంత్, ప్రేమలత, సుధీష్ తీవ్ర అసహనంతో గురువారం ఉదయాన్నే చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. చివరి క్షణంలోనైనా తమకు మోడీ దర్శనం దక్కుతుందని భావించినా, మిగిలింది నిరాశే. ఎన్నికలప్పుడు తమను వాడుకుని ఇప్పుడు కమలనాథులు చీదరించుకోవడాన్ని డీఎండీకే వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అయితే డీఎండీకేను బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను విజయకాంత్ తిరస్కరించడంతోనే ఆయన్ను దూరంగా పెట్టాలని కమలనాథులు నిర్ణయించినట్టు సమాచారం. అందుకే ఢిల్లీలో పడిగాపులు కాసినా, మోడీ, రాజ్నాథ్ల దర్శనం విజయకాంత్కు దక్కలేదన్న ప్రచారం ఊపందుకుంది. ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చిన విజయకాంత్ పార్టీశ్రేణులకు పిలుపునిస్తూ ప్రకటన విడుదల చేశారు. జూన్ నాలుగో తేదీన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్నదని, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఈ దృష్ట్యా, ఆ సమావేశానికి పెద్ద ప్రాధాన్యత నెలకొన్నట్టే కనిపిస్తోంది. -
ఆ 'రెండు పార్టీ'లతో విసిగారా.. నేనున్నా..
-
బీజేపీతో కెప్టెన్ దోస్తీ
భారతీయ జనతా పార్టీతో డీఎండీకే అధినేత విజయకాంత్ దోస్తీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పొత్తు ఖరారుపై మరో రెండురోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది . డీఎండీకేతో పొత్తుకోసం అన్ని ప్రయత్నాలు చేసి భంగపడిన బీజేపీ మళ్లీ చర్చలు ప్రారంభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, ప్రధాన కార్యదర్శి ఎస్ మోహన్రాజు రెండు రోజులుగా విజయకాంత్, ఆయన భార్య ప్రేమలతతో మంతనాలు జరుపుతున్నారు. రెండు పార్టీల్లో నెలకొన్న పంతా లు పొత్తు చర్చల ప్రతిష్ఠంభనకు దారితీశాయి. అయితే విజయకాంత్ ఒక మెట్టుదిగివచ్చి తొలుత డిమాండ్ చేసిన 20 స్థానాలను వదిలి 14 స్థానాలను కోరుతున్నారు. అయితే 12 స్థానాలు కేటాయించేందుకు బీజేపీ సుముఖం గా ఉంది. బీజేపీ కూటమిలో ఇప్పటికే ఎండీఎంకే, పీఎంకే, కొంగునాడు, ఇండియ జననాయక కట్చి తదితర పార్టీలు ఉన్నాయి. ఎండీఎంకే 10 స్థానాలు, పీఎంకే 12, తన మిత్రపక్షానికి 2 కోరుతున్నారుు. ఈ పార్టీలన్నింటీకి పంపాలు జరపాల్సి ఉందని బీజేపీ నేతలు కెప్టెన్కు నచ్చజెప్పారు. చర్చలు దాదాపు ఒక కొలిక్కి వచ్చిన దశలో పొత్తుపై మరో రెండురోజుల్లో అధికారిక ప్రకటన వెలువడయ్యే అవకాశం ఉంది. అన్బుమణి ఆగ్రహం : డీఎండీకేతో పొత్తు కోసం తమకు కేటాయించాల్సిన స్థానాల్లో కోత విధించడంపై పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ కుమారుడు అన్బుమణి రాందాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో పొత్తు ఖరారై 20 రోజులు దాటుతున్నా కెప్టెన్ కోసం తమ అంశాన్ని పెండింగ్లో పెట్టారని ఆయన విమర్శిస్తున్నారు. తమ పార్టీతో పొత్తు చర్చలు జరిపినప్పటి సామరస్య ధోరణి నేడు కరువైందని అన్నారు. తమ పార్టీకి 10, తమ మిత్రపక్షాలకు కనీసం రెండు స్థానాలకు తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో పార్టీకోసం జరుపుతున్న పాకులాటలో తమను బలిపశువును చేయడం తగదని ఆయన వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేతో పొత్తు ఖరారుచేసుకున్న సీపీఐ తమ పార్టీ నేతలకు కేటాయించాల్సిన స్థానాలపై శనివారం మూడో దశ చర్చలను పూర్తిచేసింది. అయితే ఇంకా స్థానాలపై స్పష్టత రాలేదు. -
ఢిల్లీకి ‘కెప్టెన్’సేన
డీఎండీకే అధినేత విజయకాంత్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం గురువారం ఢిల్లీకి బయలు దేరింది. శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్తో ఈ బృందం భేటీ కానుంది. ఈ పర్యటన కెప్టెన్ రాజకీయ ఎత్తుగడకు వేదిక కాబోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎండీకే ఓటు బ్యాంకు కోసం బీజేపీ, డీఎంకే, కాంగ్రెస్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నాయి. విజయకాంత్ మాత్రం ఎవరికీ చిక్కకుండా చకచకా ముందుకు కదులుతున్నారు. పార్టీ తరపు న ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులతో ఇం టర్వ్యూలు ముగించారు. నాలుగు రోజుల పాటుగా జరిపిన ఇంటర్వ్యూల మేరకు నియోజకవర్గానికి ఇద్దరు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేశారు. వీరి పనితీరు, వీరికున్న అన్ని రకాల బలం గురించి ఆయా జిల్లాల నేతల ద్వారా ఆరా తీసే పనిలో ఉన్న విజయకాంత్ హఠాత్తు గా ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయించారు. దీంతో ఈ పర్యటన రాజకీయ ఎత్తుగడలకు వేదిక కాబోతోందన్న సంకేతాలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వెలువడుతున్నాయి. సొంత నియోజకవర్గాలతోపాటు స్వగ్రామాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ గురువారం ఉదయం పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని విజయకాంత్ ఆదేశించారు. దీంతో ఉదయాన్నే ఎమ్మెల్యేలందరూ కోయంబేడుకు చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో విజయకాంత్ భేటీ అయ్యారు. రాత్రి ఏడు గంటలకు 21 మంది ఎమ్మెల్యేలతో కలసి కెప్టెన్ విజయకాంత్ తన సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్ను వెంటపెట్టుకుని ఢిల్లీకి బయలు దేరారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్తో విజయకాంత్ బృందం భేటీ కానుంది. రాష్ట్రంలోని సమస్యలు, జాలర్ల సమస్య, ఈలం తమిళుల సమస్య, శ్రీలంకకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో తీర్మానం తదితర అంశాలపై చర్చించి, వినతి పత్రాన్ని సమర్పించబోతున్నారు. రాజకీయ భేటీకి ఆస్కారం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఢిల్లీకి వస్తున్న విజయకాంత్ను తమ వైపు తిప్పుకోవడం లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు వ్యూహ రచనలు చేశారు. పొత్తుకు మార్గం: కాంగ్రెస్, డీఎంకే, డీఎండీకేలు ఒకే వేదిక మీదకు వచ్చే రీతిలో పది జనపథ్ వేదికగా వ్యూహ రచనలు జరుగుతున్నారుు. బుధవారం డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాలపట్టి కనిమొళి కూడా జన్పథ్ మెట్లు ఎక్కారు. ఏఐసీసీ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అంతా పొత్తు వ్యవహారం చుట్టూ సాగినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నారుు. విజయకాంత్ సైతం ఢిల్లీ వస్తుండటంతో ఆయన్ను టెన్ జన్పథ్ మెట్లు ఎక్కించేందుకు కసరత్తులు జరిగినట్టు సమాచారం. కేంద్ర మంత్రి జీకే వాసన్కు విజయకాంత్ సన్నిహితుడు కావడంతో ఆయన ద్వారానే ఈ ప్రయత్నాలు జరిగినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. విజయకాంత్ను ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్ తొలుత భేటీ అవుతారని, అనంతరం టెన్ జన్పథ్లో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్తో సమావేశం ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో తమ నేత ఢిల్లీకి రమ్మంటే వెళ్తున్నామని, ఆయన మదిలో ఏమున్నదో తమకు ఇంత వరకు తెలియదంటూ ఓ ఎమ్మెల్యే పేర్కొనడం గమనార్హం. ప్రధానితో భేటీ వరకు తనకు తెలుసునని, ఆ తర్వాత ఎలాంటి చర్చలు ఉంటాయో ఒక్క కెప్టెన్కు తప్ప మరెవ్వరికీ తెలియదంటూ ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. -
ఎన్నికల్లో పోటీ చేయను: అళగిరి
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని డీఎంకే పార్టీ బహిష్కృత నేత అళగిరి శనివారం చెన్నైలో స్పష్టం చేశారు. డీఎంకే పార్టీలో అవినీతి పెచ్చురిల్లిందని పేర్కొన్నారు.తనపై వచ్చిన ఆరోపణలు రుజువు చేసుకునేందుకు త్వరలో మదురై వెళ్ల నున్నట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం ఓ ప్రముఖ ఆంగ్ల చానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో డీఎంకే పార్టీపై అళగిరి నిప్పులు చెరిగిన విషయం విదితమే. డీఎంకే పార్టీలో ప్రజాస్వామ్యం మృగ్యమైందని అన్నారు. తన తండ్రి, కరుణానిధిని కొంత మంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం అళగిరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు డీఏంకే అధినేత ఎం.కరుణానిధి ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎండీకే అధినేత, సినీనటుడు విజయ్ కాంత్తో పొత్తు పెట్టుకోవాలని డీఎంకే ఉవ్విళ్లూరుతుంది. ఆ అంశంపై డీఎంకే పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. అయితే ఇటీవల అలగిరి ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ కాంత్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో కరుణానిధి ఆగ్రహానికి గురైయ్యారు. దాంతో అళగిరిని కరుణానిధి తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. ఆ కొద్ది సేపటికే అళగిరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కరుణానిధి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అళగిరిని బహిష్కరించడంపై ఆయన వర్గం ఆగ్రహంతో ఉండగా, స్టాలిన్ వర్గం మాత్రం ఆనందోత్సాహలతో ఉంది. కరుణానిధి కుమారులు ఎం.కె.అళగిరి, ఎం.కె.స్టాలిన్ల మధ్య వర్గ పోరు ఇటీవల కాలంలో తీవ్రమైన సంగతి తెలిసిందే. -
మల్లగుల్లాలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ పొత్తులపై దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినా డీఎండీకే అధినేత విజయకాంత్ మాత్రం ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కెప్టెన్కు గాలం వేసే పనిలో పడ్డాయి. అన్నాడీఎం, డీఎంకేలు తమ వైఖరిని స్పష్టం చేయడంతో ఇక మూడో ప్రాంతీయ పార్టీ అరుున డీఎండీకేపై రెండు జాతీయ పార్టీలు దృష్టి సారించాయి. రాజ్యసభ ఎన్నికల్లో తనకు స్నేహ హస్తం ఇవ్వలేదనే కోపంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోశారు. డీఎంకే సైతం చివరి వరకు ఆశచూపి కాంగ్రెస్ మద్దతును పొందడం విజయకాంత్ను బాధించింది. ఈ కారణంగా డీఎంకేపై సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో ఒక బలీయమైన శక్తిగా మారుతున్న బీజేపీవైపు వెళితే ఎలా ఉంటుందో తేల్చుకోలేక పోతున్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రానికి చెందిన మరో ప్రాంతీయ పార్టీకూడా బీజేపీ కూటమిలో చేరితే తన ప్రాధాన్యత ఉండదనే సంశయంలో ఉన్నారు. ఎండీఎంకే ఇప్పటికే బీజేపీకి పచ్చజెండా ఊపింది. పీఎంకే సైతం అదే బాటలో పయనించే అవకాశం ఉంది. తన నాయకత్వాన్ని మన్నించి, గౌరవించినవారికే తన పార్టీ మద్దతు పలుకుతుందని విజయకాంత్ ఇటీవలే ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర స్థాయిలో కొత్తకూటమికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ముందు ఉంది. ఈ కొత్తకూటమిల దృష్టిలో ప్రధానమైన అంశంగా డీఎండీకే ఉంది. మాజీ కాంగ్రెస్ నేత, గాంధేయ మక్కల్ ఇయక్కం అధినేత తమిళరువి కెప్టెన్కు నచ్చజెప్పే పనిలో పడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతును విజయకాంత్ కోరారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం డీఎంకే వైపు మొగ్గుచూపింది. అప్పుడు కాదని నేడు కలుపుకుపోతామని కోరితే కెప్టెన్ అంగీకరిస్తాడా అని కాంగ్రెస్ సంశయిస్తుండగా, ఎవ్వరూ దిక్కులేకపోవడంతో తనతో బేరసారాలకు దిగిందని కెప్టెన్ కాంగ్రెస్ వైపు గుర్రుగా చూస్తున్నారు. ప్రతి కీలకమైన అంశాన్ని నాన్చే అలవాటున్న కెప్టెన్ ఏర్కాడులో పోటీ చేయాలా వద్దా అని నెలరోజుల పాటు మీమాంసలో పడ్డారు. నేడు లోక్సభ వంతు వచ్చింది. ఏదేమైనా రానున్న లోక్సభ ఎన్నికల్లో డీఎండీకే ఏదో ఒక పార్టీ పంచన చేరకతప్పదని తెలుస్తున్నా, దాదాపు అన్ని పార్టీలు కెప్టెన్ చుట్టూ తిరుగుతున్నా అయోమయం వీడకపోవడం డీఎండీకే వర్గాల్లో అసహనాన్ని రేకెత్తిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో తాము అన్ని పార్టీల చుట్టూ తిరిగితే లోక్సభ ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు తమ చుట్టూ తిరగడం శుభపరిణామమంటున్నారు. -
విజయకాంత్కు ఊరట
టీనగర్, న్యూస్లైన్: ముఖ్యమంత్రి జయలలిత తరపున రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది దాఖలు చేసిన ఎనిమిది పరువు నష్టం కేసుల్లో హాజరయ్యేం దుకు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్కు మినహాయింపు ఇస్తూ హైకో ర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జయలలితను కించపరిచేలా మాట్లాడినట్లు డీఎండీకే నేత విజయకాంత్పై 20కి పైగా కేసులను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. ఇందులో ఎనిమిది కేసుల విచారణకు స్టే విధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో విజ యకాంత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో న్యాయమూర్తులు రాజేశ్వరన్, ప్రకాష్ ఎదుట ఈ కేసు విచారణకు వచ్చింది. విజయకాంత్ తరపున హాజరైన న్యాయవాది బాలాజీ వాదిస్తూ చెన్నై, ఊటీ, కన్యాకుమారి సహా ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి జయలలితను కించపరుస్తూ మాట్లాడినట్లు విజయకాంత్పై రాజకీయ దురుద్దేశంతో కేసులు దాఖలు చేశారని పేర్కొన్నారు. బాధితురాలైన ముఖ్యమంత్రి జయలలిత మాత్రమే కేసు దాఖలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఆమె తరపున ప్రభుత్వ న్యాయవాది కేసులు దాఖలు చేయ డం చట్టవిరుద్ధమని వివరించారు. అందుచేత కేసు విచారణపై స్టే విధించాలని కోరారు. అదేవిధంగా ఈ కేసుపై హాజరయ్యేందుకు విజయకాంత్కు సమన్లు పంపారని, ఈ సమన్లకు కూడా స్టే విధించాలని కోరారు. విజయకాంత్కు కేసులో హాజరయ్యేం దుకు మినహాయింపు ఇవ్వాలని విజ ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ను పరిశీలిం చిన న్యాయమూర్తులు ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 21వ తేదీన సంజాయిషి పిటిషన్ దాఖలు చేయాలని ఉత్తర్వులు ఇస్తున్నామని, ఎనిమిది కేసుల్లో విజయకాంత్ హాజరయ్యేందుకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. -
మద్దతు ఎవరికో...!
సాక్షి, చెన్నై : ఏర్కాడులోని డీఎండీకే ఓటు బ్యాంకు ఎవరికి దక్కుతుందోనన్న చర్చ మొదలైంది. ఆ పార్టీ మద్దతను కూడగట్టుకునేందుకు డీఎంకే ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తమ అధినేత కెప్టెన్ విజయకాంత్ మౌన ముద్రలో ఉండడంతో పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో గందరగోళానికి దారి తీస్తున్నది. ఏర్కాడులో డీఎండీకేకు కనీస ఓటు బ్యాంకు ఉంది. గతంలో ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొన్నప్పుడే డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్థులకు చుక్కలు చూపించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ధర్మానికి కట్టుబడి అన్నాడీఎంకే గెలుపునకు ఆ పార్టీ కృషి చేయడంతో పెరుమాల్ గట్టెక్కారు. ప్రస్తుతం పెరుమాల్ మరణంతో ఖాళీ ఏర్పడిన ఆ నియోజకవర్గానికి మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలకు దూరంగా ఉండేందుకు కెప్టెన్ నిర్ణయించడంతో డీఎంకే, అన్నాడీఎంకే దృష్టి ఆ పార్టీ ఓటు బ్యాంక్ మీద పడింది. ఎన్నికల్ని బహిష్కరించిన తమ అధినేత విజయకాంత్ మద్దతును ఎవరికి ప్రకటిస్తారోనన్న ఎదురు చూపుల్లో ఆ పార్టీ వర్గాలు ఉన్నాయి. ఎన్నికలను డీఎండీకే బహిష్కరించిందో లేదా తమకు మద్దతు ఇవ్వం డంటూ స్థానిక నాయకుల ఇళ్ల ముంగిట ఆది వారం ఉదయాన్నే డీఎంకే వర్గాలు వాలాయి. ఆ నాయకుల్ని తమ వైపు తిప్పుకునేందుకు అధికార అన్నాడీఎంకే కసరత్తు చేస్తోంది. దీంతో డీఎండీకే ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు కుస్తీలు పడుతున్నాయి. అయితే తమ నేత విజయకాంత్ ఎవరికి మద్దతు ప్రకటిస్తారో వారి గెలుపునకు కృషి చేస్తామంటూ కొందరు నాయకులు పేర్కొన్నారు. విజయకాంత్ మౌనంగా ఉండటంతో ఎవరి పక్క పనిచేయాలో, ఒక వేళ పని చేస్తే పార్టీ పరంగా ఎలాంటి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనన్న ఆందోళన నేతల్ని వెంటాడుతోంది. కొందరు నేతలు అయితే, చాప కింద నీరులా అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ గెలుపునకు సహకరించే పనిలో పడ్డారు. రాయబారం పంపేందుకు డీఎంకే యత్నం తమకు మద్దతు ఇవ్వాలంటూ విజయకాంత్ వద్దకు దూతను పంపించేందుకు డీఎంకే సిద్ధం అవుతోన్నది. ఇప్పటికే అన్ని పార్టీలకు రాసినట్టుగా విజయకాంత్కు డీఎంకే అధినేత కరుణానిధి మద్దతు లేఖ పంపించి ఉన్నారు. దీనికి ఇంత వరకు సమాధానం రాలేదు. ప్రస్తుతం ఆ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉన్నందున, తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ పార్టీ అధికార ప్రతినిధి టీకేఎస్ ఇళంగోవన్ను విజయకాంత్ వద్దకు పంపిం చేందుకు కరుణానిధి ప్రయత్నిస్తున్నారు. డీఎండీకే ఓట్లు డీఎంకేకు కలసి వచ్చిన పక్షంలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ భరితంగా మారడం తథ్యం. అయితే, అధికార అన్నాడీఎంకే తాయిలాలకు, ఒత్తిళ్లకు డీఎండీకే స్థానిక నాయకులు తలొగ్గే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. -
తంజావూరు కోర్టుకు డీఎండీకే అధినేత విజయకాంత్
సాక్షి, చెన్నై: పరువు నష్టం దావా కేసు విచారణ నిమిత్తం తంజావూరు కోర్టుకు డీఎండీకే అధినేత విజయకాంత్ బుధవారం హాజరయ్యారు. ఎన్ని కేసులు వేసినా తాను మాత్రం వెనక్కు తగ్గబోనని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత తరపున విజయకాంత్పై జిల్లాకో పరువు నష్టం దావా దాఖలైన విషయం తెలిసిందే. వీటి విచారణ నిమిత్తం ఏడాదిగా కోర్టుల చుట్టూ కెప్టెన్ తిరుగుతున్నారు. కొన్ని కోర్టుల మెట్లు ఎక్కడంలో ఆలస్యమవుతోంది. దీంతో న్యాయమూర్తులు ఆగ్రహం చెందుతున్నారు. అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నారు. కెప్టెన్ గైర్హాజరుపై తంజావూరు కోర్టు గత వారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి ఎదుట విజయకాంత్ బుధవారం హాజరయ్యారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్కు పోలీసులు ఈసారి గట్టి భద్రతే కల్పించారు. పటిష్ట బందోబస్తు నడుమ ఆయన ఉదయం తంజావూరు కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. వెనక్కు తగ్గను కోర్టు బయట మీడియూతో విజయకాంత్ మాట్లాడారు. చాలా రోజుల తర్వాత గట్టి భద్రత నడుమ కార్యకర్తల్లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. తనకు భద్రత కల్పించని దృష్ట్యా విచారణలకు హాజరుకావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. తనపై వందల కేసులు నమోదై ఉన్నాయని, వీటన్నింటినీ ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కేసులను ఎదుర్కోవడం, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఢీకొట్టడంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు. ఎన్ని కేసులు వేసినా, కుట్రలు కుతంత్రాలకు పాల్పడినా తాను భయపడబోనన్నారు. -
కరుణపై మరో దావా, విజయకాంత్కు అరెస్ట్ వారెంట్ జారీ
డీఎంకే అధినేత కరుణానిధిపై ముఖ్యమంత్రి జయలలిత మరో పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్ను ఆమె తరపున కార్పొరేషన్ న్యాయవాది ఎం.ఎల్.జగన్ బుధవారం చెన్నై మొదటి సెషన్స్ కోర్టులో దాఖలు చేశారు. అలాగే డీఎండీకే అధినేత విజయకాంత్కు తంజావూరు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు ఎవరు చేసినా పరువు నష్టం దావాల మోత మోగుతోంది. ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్పై రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో కేసులు దాఖలై ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిపై రెండేళ్ల కాలంలో పది పరువు నష్టం దావా పిటిషన్లను జయలలిత దాఖలు చేశారు. ఈ పిటిషన్లలో కొన్నింటి నుంచి కరుణకు విముక్తి లభించింది. మరికొన్ని పిటిషన్ల విచారణకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా కరుణానిధిపై 11వ పిటిషన్ను జయలలిత బుధవారం దాఖలు చేశారు. ఇదీ కారణం కార్పొరేషన్ న్యాయవాది ఎం.ఎల్.జగన్ చెన్నై మొదటి సెషన్స్ కోర్టులో బుధవారం ఉదయం పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో మద్రాసు వర్సిటీ స్నాతకోత్సవం ఘనంగా జరిగిందని తెలిపారు. ఇందులో ముఖ్యమంత్రి జయలలిత ప్రసంగిస్తున్న సమయంలో మంత్రులు హాయిగా నిద్రపోయారంటూ కల్పిత చిత్రాలతో మురసోలి పత్రిక కథనం ప్రచురించిందని పేర్కొన్నారు. ఆమె ప్రసంగాన్ని మంత్రులు వింటూ ఉంటే వాళ్లందరూ నిద్ర పోయినట్టు కథనాన్ని ప్రచురించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్టకు భంగం కలిగించారని వివరించారు. ఈ దృష్ట్యా కరుణానిధిపై సెక్షన్ 500, 501 కింద పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి చొక్కలింగం త్వరలో విచారణ చేపట్టనున్నారు. కెప్టెన్కు అరెస్ట్ వారెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్కు తంజావూరు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. కెప్టెన్ తన పుట్టినరోజును పురస్కరించుకుని గత ఏడాది అన్ని జిల్లాల్లో పర్యటించారు. ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ఆయనకు అనేక కోర్టులు పీటీ వారెంట్ జారీ చేశారుు. కోర్టుకు డుమ్మా కొడుతూ వస్తున్న విజయకాంత్పై తంజావూరు కోర్టు బుధవారం కన్నెర్ర చేసింది. మూడు వాయిదాలకు ఆయన రాకపోవడంతో న్యాయమూర్తి సేతుమాధవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో జిల్లా కోర్టులో జరుగుతున్న విచారణకు హాజరు కావాల్సి ఉన్నందునే ఇక్కడి రాలేదంటూ విజయకాంత్ తరపు న్యాయవాదులు వాదించినా ఫలితం లేకపోయింది. విజయకాంత్ను కోర్టులో హాజరు పరచాలంటూ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. -
కష్టాల్ని విజయాలుగా మలుచుకుందాం
సాక్షి, చెన్నై: ‘కష్టకాలంలో ఉన్నాం...అన్నింటినీ అధిగమిద్దాం... కష్టాల్ని విజయాలుగా మలుచుకుందాం...అండగా ఉండండి’ అని పార్టీ కార్యకర్తలకు డీఎండీకే అధినేత విజయకాంత్ లేఖ రాశారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని వంద మంది వికలాంగులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. తమిళ రాజకీయాల్లో రాష్ట్రేతరులు అనాది నుంచి తమ హవా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు వారి ప్రస్థానం లేకుండా ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటైన దాఖలు లేవు. 60 ఏళ్ల రాష్ట్ర రాజకీయాల్లో మార్పును కోరుతూ ప్రభుత్వ పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కింగ్ మేకర్గా నిలిచిన తెలుగువాడే విజయ్కాంత్. కరుపు ఎంజీఆర్ (నలుపు ఎంజీఆర్)గా, కెప్టెన్, పురట్చి కలైంజ్ఞర్ (విప్లవ నటుడు)గా మదురైలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన విజయ్రాజ్ నాయుడు తమిళ తెరపై తనదైన గుర్తింపుతో విజయ్కాంత్గా మెరిశారు. అలాగే రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేస్తానంటూ ఏకంగా పార్టీనే ప్రారంభించిన విషయం తెలిసిందే. డీఎండీకే (దేశీయ ముర్పోకు ద్రావిడ కళగం) పార్టీని ఏర్పాటు చేసిన ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి తన సత్తాను చాటుకున్నారు. పేదరికం, అవినీతి నిర్మూలన, ఎంజీఆర్ ఆశయ సాధన అజెండాగా చేసుకుని రాజకీయాల్లో దూసుకొచ్చిన విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. పార్టీ ఆవిర్భావంతో ఎనిమిదేళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఆయన ప్రతి ఏటా తన జన్మదినాన్ని పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. గత ఏడాది ఆయన పుట్టిన రోజు వివాదాలకు దారి తీసింది. ఒక్కో జిల్లాలోని పేదలకు రూ.25 లక్షల విలువైన సహాయకాలు పంపిణీ చేస్తూ నెల రోజులు జన్మదినాన్ని జరుపుకున్నారు. అలాగే ఏడాది పొడవునా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో ఏడాది కాలంగా డీఎండీకే కష్టాల్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ నుంచి వలసలు కూడా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ విజయకాంత్ పుట్టిన తేదీ రానే వచ్చింది. ఆగస్టు 25న ఆయన 59వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కార్యకర్తల్ని ఉత్సాహ పరుస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా తన పుట్టిన రోజు వేడుకలకు పిలుపునిస్తూ లేఖ రాశారు. ధైర్యంగా ముందుకు నడుద్దాం తన జన్మదినాన్ని పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందేనని విజయకాంత్ పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో గుర్తు చేశారు. ప్రతి ఏటా పేదల్ని ఆర్థికంగా ఆదుకునే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. వృద్ధాశ్రమాలు, పిల్లల సంరక్షణా కేంద్రాలను ఆదుకుంటున్నామని, ఉచిత కల్యాణ మండపాలు నిర్మించామని, విద్యార్థులకు చేయూత ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 60 చోట్ల ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే శిశు సంరక్షణ లక్ష్యంగా ఆడ శిశువుల పేరిట డిపాజిట్లు చేశామని తెలిపారు. గత ఏడాది ఒక్కో జిల్లాకు రూ.25 లక్షలు చొప్పున పేదలకు సహాయకాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. తాను సినీ రంగంలో ఉన్నప్పటి నుంచి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నానని గుర్తు చేశారు. కొంతకాలంగా కష్టాలు, కుట్రలను ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తనపై కేసుల మోత మోగించారని, కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావంతో తన మీద బాధ్యతలు పెరిగాయని, కార్యకర్తలు, నాయకులు, ప్రజల అండదండలతో ప్రధాన ప్రతి పక్షంగా అవతరించామన్నారు. త్వరలో మహా శక్తిగా డీఎండీకే రూపుదిద్దుకుంటుందని వివరించారు. కష్టాల్ని అధిగమించాల్సిన సమయం ఇదేనన్నారు. అందరూ ధైర్యంగా ముందుకు సాగుతూ కష్టాల్ని విజయాలుగా మలుచుకునే విధంగా శ్రమించాల్సి ఉందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కుట్రలు, కుత్రంతాలను తిప్పికొట్టి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా శ్రమిద్దామని సూచించారు. ఈ ఏడాది తన జన్మదినాన్ని పురస్కరించుకుని వంద మంది వికలాంగులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నామని ప్రకటించారు. అలాగే ఎంజీఆర్ బధిర పాఠశాలకు రూ.50 లక్షలు అందజేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు అందరూ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ వంతు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
పరువు నష్టం దావా కేసుల నుంచికెప్టెన్కు ఊరట
సాక్షి, చెన్నై: విజయకాంత్ గత ఏడాది ఆగస్టులో తన జన్మదినాన్ని రోజుకో జిల్లాలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వేదికలెక్కి ప్రసంగాలిచ్చారు. ముఖ్యమంత్రి జయలలిత, ప్రభుత్వ పనితీరుపై ఆరోపణలు సంధించారు. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లా కోర్టుల్లో పరువు నష్టం దావాలు నమోదయ్యాయి. విచారణ నిమిత్తం కెప్టెన్ స్వయంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కొన్ని కోర్టుల విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్టు వారెంట్లు సైతం జారీ అయ్యాయి. ఈ కేసుల ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విచారణకు స్వయంగా హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కెప్టెన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. హాజరు కానక్కర్లేదు: ముఖ్యమంత్రి జయలలిత కొడనాడులో కూర్చుంటే ప్రజా సమస్యలు పరిష్కరించేదెవరని తాను ప్రశ్నించానని కెప్టెన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ తప్పుల్ని ఎత్తిచూపే హక్కు తనకు ఉందన్నారు. అయితే తానేదో ఆరోపణలు, విమర్శలు చేసినట్లు పలు జిల్లా కోర్టుల్లో పరువు నష్టం దావాలు దాఖలయ్యాయని వివరిం చారు. ప్రస్తుతం తిరువళ్లూరు, శివగంగై, తిరునల్వేలి కోర్టుల్లో విచారణ నిమిత్తం స్వయంగా హాజరుకావాల్సిన పరిస్థితి ఉందన్నారు. తన మీద పరువు నష్టం దావాల్ని స్వయంగా ముఖ్యమంత్రి జయలలిత వేయూలేగానీ ఆమె తరపు ప్రభుత్వ న్యాయవాది కాదని పేర్కొన్నారు. పధాన ప్రతిపక్ష నేతగా ఉన్న తన మీద పరువు నష్టం దావాల్ని వేసే అధికా రం ప్రభుత్వ న్యాయవాదికి లేదని తెలియజేశారు. ఈ దృష్ట్యా ఆ కేసుల విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని విన్నవించారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తులు ధనపాలన్, సీపీ సెల్వన్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం విచారించింది. విజయకాంత్ తరపున న్యాయవాది బాలాజీ వాదనలు విన్పించారు. వాదనల అనంతరం విజయకాంత్కు ఊరట కలిగిస్తూ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తిరువళ్లూరు, తిరునల్వేలి, శివగంగై కోర్టులకు విచారణ నిమిత్తం స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొంది. అలాగే విజ యకాంత్ పిటిషన్కు సంబంధించి వారంలోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.