YS Jagan Mohan Reddy Birthday
-
కర్నూలులో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లి వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో భారీ ఏర్పాట్లు
-
తుళ్లూరులో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
-
పేదలకు పెళ్లి కానుక: సీఎం వైఎస్ జగన్
-
దమ్ముంటే నాపై పోటీ చెయ్ : కేశినేని నాని
గంపలగూడెం(తిరువూరు): చంద్రబాబునాయుడికి దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ ఎంపీ స్థానం నుంచి తనపై నిలబడి గెలవాలని వైఎస్సార్ సీపీ విజయవాడ పార్టీమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని నాని సవాల్ విసిరారు. చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయమన్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల మ్యాంగో మార్కెట్లో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ మండల ఆత్మియ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చివరివని జోస్యం చెప్పారు. పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే, పేదలకు వ్యతిరేకంగా పాలన చేసిన ఘనుడు నారా చంద్రబాబునాయుడని అన్నారు. తన పుత్రరత్నం లోకేశ్ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక అజెండాతో చంద్రబాబు ముందుకు పోతున్నారని విమర్శించారు. సుదీర్ఘ రాజకీయం ఉన్న వ్యక్తినని చెప్పుకొనే చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్లో కనీసం ఇల్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. అమరావతి పేరిట ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు నష్టం తెచ్చారన్నారు. రూ.2.60 లక్షల కోట్ల మేర సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసిన ఘనత దేశంలో ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. అభ్యర్థుల డబ్బు చూసి చంద్రబాబు టికెట్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. మండలంలో ప్రధాన సమస్య అయిన కట్టెలేరు వంతెన నిర్మాణానికి వచ్చే నెల 3వ తేదీన శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. తిరువూరు నియోజకవర్గంలో 10వేల మెజారిటీతో పార్టీ అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ఓటు అడిగేహక్కు వైఎస్సార్ సీపీకి మాత్రమే ఉంది రాష్ట్ర ప్రజలకు 57 నెలలుగా మెరుగైన పాలన అందించిన వైఎస్సార్ సీపీకి మాత్రమే రోబోయే సాధారణ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. పార్టీ మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేసిన మంచిని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. తిరువూరు అభ్యర్థి ఎంపిక కోసం తలపట్టుకొంటున్నారు తనను వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన తర్వాత తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి కోసం వెతుకులాట ప్రారంభించిందని స్వామిదాసు అన్నారు. తనపై జగనన్న ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని పనిచేస్తానని చెప్పారు. ముందుగా అయోధ్యరామిరెడ్డి, కేశినేని నాని, స్వామిదాసు తోటమూలలో అంబేడ్కర్, జగ్జీవన్రామ్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. వినగడప పేరంటాళ్ళ గుట్ట వద్ద అచ్చం పేరంటాళ్ళకు పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎన్.సుధారాణి, ఎంపీపీ జి.శ్రీలక్ష్మీ, జెడ్పీటీసీ సభ్యులు కోట శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. -
సింగపూర్ లో ఘనంగా సీఎం వైయస్ జగన్ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు సింగపూర్ లోని ఎన్.ఆర్.ఐ లు మరియు వైస్సార్సీపీ సింగపూర్ టీం, సింగపూర్ వైస్సార్సీపీ అడ్వైసర్ కోటి రెడ్డి మరియు సింగపూర్ వైస్సార్సీపీ కన్వీనర్ మురళి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోటిరెడ్డి మరియు మురళి కృష్ణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని సమంగా పరుగులు తీయిస్తున్నారు. అలానే 99 శాతం హామీలు నెరవేర్చి సుపరిపాలన చేస్తున్నారు అని చెప్పినారు. విద్య, వైద్య రంగాలలో దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది. 38000 స్కూల్స్ అధునాతనంగా తీర్చిదిద్దారు. 15000 గ్రామసచివాలయాలు, 10000 రైతు భరోసా కేంద్రాలు, 10000 గ్రామ ఆరోగ్య కేంద్రాలు, 10 ఫిషింగ్ హర్బోర్స్ , 4 పోర్ట్స్, 9000 కోట్లతో రోడ్ల అభివృద్ధి, 17 కొత్త మెడికల్ కాలేజీలు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరిగింది కేవలం ఈ నాలుగు సంవత్సరాలలో. ఆరోగ్యశ్రీ ని 25 లక్షల వరకు పెంచటం, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్లి అన్ని 9 రకాల పరీక్షలు నిర్వహించటం అనేవి విదేశాలలో కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమాలు అని గుర్తుచేశారు.ఇవన్నీ ఇలా కొనసాగాలి అంటే మరల జగన్ గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవటం మన అందరి అవసరం మరియు బాధ్యత. కావున మన అందరం వచ్చే మూడు నెలలు ఒక సైనికుడిలా పని చెయ్యాలి అని చెప్పినారు. ఈ జన్మదిన వేడుకలలో భాస్కర్, శ్రీనివాసులు, గుండు కృష్ణ, సందీప్ రెడ్డి, కృష్ణ రెడ్డి, చంద్ర, అఖి రెడ్డి, సుధీర్, ప్రసాద్, మధు, రాంమోహన్, రంగా రెడ్డి, విష్ణు, దొర బాబు, లీల, చిట్టి బాబు, శ్రీనాధ్, సుహాస్, నాగ సత్యనారాయన రెడ్డి, పవన్ పాల్గొన్నారు. -
UAE: దుబాయ్లో సీఎం జగన్ జన్మదిన వేడుకలు
యూఏఈలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. దుబాయ్లోని కరమా పార్క్లో వైఎస్ జగన్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో యూఏఈ కన్వీనర్ సయ్యద్ అక్రం, ఇర్షాద్, చక్రి, అబ్దుల్లా, ఖాజా అబ్దుల్ , విజయ భాస్కర్ రెడ్డి ,సిరాజ్లతో పాటు వందలాది అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగన్ అన్న మీద ఉన్న అభిమానం దేశాలు దాటి ఇలా విస్తరించడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రజల దీవెనలతో జగన్ అన్న శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి అని వారు ఆకాంక్షించారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని యూఏఈ కన్వీనర్ సయ్యద్ అక్రం మహిళలకు చీరలు పంచిపెట్టారు. అనంతరం ప్రతి ఒక్కరికి విందు ఏర్పాటు చేసి వైభవంగా జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. -
ఊరూరా సంబరాలు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: సీఎం జగన్ పుట్టిన రోజును పురిష్కరించుకుని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పేదలు, అనాథలకు వస్త్రదానం చేశారు. భారీ ఎత్తున అన్నదానాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లండన్, తదితర దేశాల్లోనూ సీఎం జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం వరకు దారిపొడవునా వైఎస్సార్సీపీ నేత పుత్తా ప్రతాప్రెడ్డి.. సీఎం జగన్ చిత్రాలతో ఏర్పాటు చేసిన జెండాలు, ప్లెక్సీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, మహేశ్బాబు ఎక్స్ (ట్విటర్) ద్వారా సీఎం జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సీఎం మరిన్ని విజయాలు సాధించాలని, నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. వీరికి సీఎం జగన్ కూడా ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. పండుగలా జన్మదిన వేడుకలు ► చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా ఓ పెద్ద పండుగలా జరిగింది. తిరుపతిలో టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకరరెడ్డి ఆ«ధ్వర్యంలో 115 మంది వైఎస్సార్సీపీ శ్రేణులు రక్తదానం చేశారు. రుయాలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. చంద్రగిరిలో తుడా చైర్మెన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో 338 మంది రక్తదానం చేశారు. కేసీ పేటలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి లక్ష్మి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు ఆధ్వర్యంలో వంద మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, తట్టలో పూలు విక్రయించే వంద మందికి గొడుగులు, 15 మందికి బంకులు, 50 మంది నాయి బ్రాహ్మణులకు కిట్లు, 100 మందికి జంగమదేవర కిట్లు పంపిణీ చేశారు. వడమాలపేట మండలం అప్పళాయగుంట నుంచి నగరి వరకు మంత్రి రోజా పార్టీ శ్రేణులతో కలసి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పుత్తూరు ఎస్ఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు శిక్షణ పొందడానికి రూ.2.05 లక్షల విలువగల కుట్టుమిషన్లు అందించారు. ► ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. ఎస్ఆర్ఐటీ కళాశాలలో 430 మంది, తాడిపత్రిలో 100 మంది రక్తదానం చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో చిత్రావతి నదిలో బోట్లపై వైఎస్సార్ సీపీ జెండాలు ఎగురవేస్తూ సీఎం జగన్ చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో ఎంజీఎం పాఠశాల విద్యార్థులు ‘హ్యాపీ బర్త్డే జగన్ మామయ్యా’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి రక్తదానం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట, మాచర్లలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. మంత్రి అంబటి సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో రక్తదానం చేశారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి రక్తదానం చేశారు. వేమూరు సమీపంలోని ఓ చెరువు మధ్యలో జగన్ అభిమాని కారుమూరు వెంకటరెడ్డి ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ అంటూ ఏర్పాటు చేసిన అక్షరాల ఆకృతి ఆకట్టుకుంది. ► ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. విజయవాడ తూర్పు, పశ్చిమలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వేడుకలు అంబరాన్నంటాయి. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరై జగన్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు సంబరాలు సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కన్నులపండుగగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల కరతళధ్వానాలు, జై జగన్ నినాదాల మధ్య పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ను కట్ చేశారు. అంతకుముందు మహానేత వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. మత గురువులు సర్వమత ప్రార్థనలు జరిపి సీఎం జగన్ను ఆశీర్వదించారు. పేదలకు దుస్తులు, కుట్టుమిషన్లు, దివ్యాంగులకు ట్రైసైకిల్స్ అందజేశారు. పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే తిప్పేస్వామి, తెలుగు అకాడమి చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, పార్టీ నేతలు జూపూడి ప్రభాకరరావు, పుత్తా ప్రతాప్రెడ్డి, చల్లా మధు, ఎన్. పద్మజ, నారాయణమూర్తి, రవిచంద్రారెడ్డి, కాకుమాను రాజశేఖర్, ఎన్ఆర్ఐ పండుగాయల రత్నాకర్, కనకరావు మాదిగ, మనోహర్రెడ్డి, పానుగంటి చైతన్య, బందెల కిరణ్, నాగదేవి రవికుమార్, పాల్గొన్నారు. తెలంగాణలోనూ సంబరాలు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను తెలంగాణాలోనూ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. కూకట్పల్లి, బాలాజీనగర్, కేపీహెచ్బీ, మూసాపేట, మోతీనగర్, బాలానగర్, ఫతేనగర్ తదితర ప్రాంతాల్లో కేక్లు కట్ చేశారు. కేపీహెచ్బీకాలనీలోని రమ్యా గ్రౌండ్స్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రమ్యా గ్రౌండ్స్లో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం వైఎస్ఆర్సీపీ ఐటి విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాక్షి ఫైనాన్షియల్ డైరెక్టర్ వై.వి.ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి, సినీ నటుడు కృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు. భరత్నగర్ కాలనీ పోచమ్మ గ్రౌండ్లో అభిమానులు కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలిపారు. వెయ్యి ఇళ్లల్లో గృహప్రవేశం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అన్న, రక్తదాన, దుప్పట్లు, దుస్తుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. నందికొట్కూరు పట్టణానికి చెందిన కళాకారుడు దేశెట్టి శ్రీనివాసులు తన రక్తంతో ముఖ్యమంత్రి చిత్రాన్ని గీశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో అన్నదాన, రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించారు. కడపలో డిప్యూటీ సీఎం అంజద్బాషా, మేయర్ సురేష్ బాబు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు అవయవదానానికి హామీ పత్రం ఇచ్చారు. రామేశ్వరం జగనన్న కాలనీలో 1000 ఇళ్లలో గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారు. పులివెందుల్లో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి రక్తదానం చేశారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి స్థానిక వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో కేక్ కట్ చేశారు. మదనపల్లెలో మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల పవన్కుమార్ ఆధ్వర్యంలో 5 వేల మంది ఆటో కార్మికులకు యూనిఫారాలు, మహిళలకు చీరలను పంపిణీ చేశారు. రూ.7 కోట్ల విలువైన కానుకలు పంపిణీ చిత్తూరు అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్తూరులో ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎం.సి.విజయానందరెడ్డి మహిళలకు భారీగా కానుకలను పంపిణీ చేశారు. దాదాపు రూ.7 కోట్ల విలువ చేసే నూతన వస్త్రాలను అందజేశారు. రూ.1,300 విలువ చేసే కిట్లను చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, మేయర్ అముద చేతుల మీదుగా 44 వేల మంది మహిళలకు అందచేశారు. ఈ సందర్భంగా విజయానంద రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ బలమే మహిళలని, వారి ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురేస్తామని, చిత్తూరు నియోజకవర్గ నుంచి తొలి విజయాన్ని అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం గుడిపాల మండలంలో జరిగిన కార్యక్రమంలో 10 వేల మంది మహిళలకు సైతం ఈ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీకాంత్, సహదేవ, ఇందు, కోఆప్షన్ సభ్యులు చందు, అను, పలువురు సర్పంచ్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉప్పలపాడులో బజరంగ్ సేవా తత్పరత పెదకాకాని: గుంటూరు జిల్లా ఉప్పలపాడులో బజరంగ్ ఫౌండేషన్ పౌండేషన్ వ్యవస్థాపకుడు అంబటి మురళీకృష్ణ సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. వైద్య శిబిరంలో 1,211 మంది కంటి, గుండె పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 35 మందికి వైద్యులు యాంజియోగ్రాం సూచించగా, వారిని శనివారం ప్రత్యేక వాహనంలో విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లనున్నారు. ఏడుగురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, ఇద్దరికి జైపూర్ కాళ్లు, వెస్ట్రన్ కమోడ్లు అందజేశారు. మురళీకృష్ణ మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పాలనలో పేదల ఇంటి ముందుకే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కొనియాడారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని బజరంగ్ ఫౌండేషన్ అంకిత భావంతో ప్రజా సేవను కొనసాగిస్తోందన్నారు. గత సంవత్సర కాలంగా ‘బజరంగ్ జగన్నామ సంక్షేమ సంవత్సరం’లో కంటి సమస్యల నివారణకు నేత్రజ్యోతి ద్వారా ఉచిత నేత్ర వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఏడు పనిదినాల్లో కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో పెద్దేటమ్మ తల్లి పీఠం వద్ద కేక్ కట్ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం జగన్ బర్త్డే వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఆస్ట్రేలియా కన్వీనర్ చింతల చెరువు సూర్య నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకను ఉత్సాహంగా జరుపుకున్నారు.వైఎస్ఆర్పీ నాయకులు వెంకట్ మేడపటి,కరణం ధర్మశ్రీ ఈ సందర్భంగా జూమ్ కాల్లో మాట్లాడి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను మరోసారి గుర్తు చేసుకుంటూ.. జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన పాలన అందిస్తున్నారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో జగన్ను మళ్లీ గెలిపించి అబివృద్ధిలో కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. -
రూ.13.11 లక్షల కోట్ల ఒప్పందాలు.. 1.47 లక్షల మందికి ఉపాధి
సంక్షేమం కోసం అభివృద్ధిని పక్కనబెట్టినా, అభివృద్ధి పేరుతో సంక్షేమాన్ని విస్మరించినా కష్టమే. ‘నాలుగు బిల్డింగ్లు కట్టినంత మాత్రాన అభివృద్ధికాదు, నిన్నటి కంటే ఈ రోజు బాగుండటం, ఈ రోజు కంటే రేపు బాగుంటుందనే నమ్మకం కలిగించగలిగితే దాన్నే అభివృద్ధి అంటారు’ అనే కొత్త నిర్వచనంతో జగన్ ప్రభుత్వం దూసుకెళ్తోంది. అరకొర విమర్శలు చేయడం పారిపాటిగా పెట్టుకున్న కొంతమందికి ఈ కింది గణాంకాలు చూసైనా అర్థం అవుతుందేమో చూడాలి.అభివృద్ది అంటే ఒక్కరోజులో సాధ్యపడేది కాదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాల అభివృధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక వేత్తలను ఆకర్షించడం, పారిశ్రామిక పాలసీలను సులభతరం చేస్తూ.. రాష్ట్ర అభివృధికి అనుగుణంగా ఆ చట్టాను మారుస్తూ.. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. మార్చి నెలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు(జీఐఎస్)లో భాగంగా ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు చేసుకుంది. ఇందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించాయి. అవి రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో దాదాపు 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఆ యూనిట్లలో ప్రధానంగా గ్రీన్ల్యామ్, డీపీ చాక్లెట్స్, అగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరిజెస్, గోద్రెజ్ అగ్రోవెట్, ఆర్ఎస్బీ ట్రాన్స్ మిషన్స్, సూక్మా గామా, ఎల్ఎల్పీ వంటి సంస్థలు ఉన్నాయి.ఇవే కాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లకు భూ కేటాయింపు పూర్తయి నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ కంపెనీల ద్వారా మరో 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. అదనంగా 194 యూనిట్లు డీపీఆర్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. జీఐఎస్లో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది.స్థానికంగా పరిశ్రమల అభివృద్ధి..పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 5వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్ను ఏర్పాటు చేయనుంది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్ను ఆవిష్కరించనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పెట్టుబడులు సమకూర్చడంలో మేటి..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఈ అక్టోబర్ నెలలో గుజరాత్ (రూ.25,685 కోట్లు) తర్వాత అధిక పెట్టుబడులు సమకూర్చిన రాష్ట్రాల్లో ఏపీ(రూ.19,187 కోట్లు) రెండో స్థానంలో నిలిచింది. దేశంలో విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి బడ్జెట్ కేటాయింపుల్లో (రూ.72,622 కోట్లు) 56 శాతం ఖర్చుచేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అభివృద్ధి వ్యయంలో 54 శాతం ప్రజల సంక్షేమానికి ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. బాబు హయాంలో వచ్చిన పరిశ్రమల పెట్టుబడులు కేవలం రూ.60 వేల కోట్లు. జగన్ హయాంలో రెండేళ్లు కరోనా ఉన్నా ఇప్పటికే దాదాపు రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బాబు ప్రభుత్వంలో పారిశ్రామిక వృద్ధిరేటు 3.2 శాతంతో దేశంలో 22వ స్థానంలో ఉంటే, జగన్ ప్రభుత్వంలో 12.8 శాతం వృద్ధి రేటుతో దేశంలో మూడో స్థానంలో నిలిచింది.గతంలో కంటే భారీగా పెరిగిన ఎంఎస్ఎంఈలు..అధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే, జగన్ పాలన వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరింది. సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్పీసీఎల్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఎన్టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను ప్రారంభించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది.జీఎస్డీసీ సూచీలో బాబు దిగిపోయిన 2019లో ఏపీ 22వ స్థానంలో ఉంటే , 2021-22 నాటికి మొదటి స్థానానికి చేరుకుంది. రాష్ట్ర తలసరి ఆదాయంలో ఎల్లో ప్రభుత్వం నిష్క్రమించే నాటికి 17వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 9వ స్థానానికి వచ్చింది. గత ప్రభుత్వ ఒప్పందాల్లో వ్యాజ్యాల పరిష్కారంజగన్ ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్లు ఏర్పాటు చేస్తుంది. 750 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టులను గతంలో బాబు అదానీకు కట్టబెట్టాడు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) వాటి టెండర్లు, ఒప్పందాలన్నీ పర్యవేక్షించింది. ఈ తంతు 2018, 2019ల్లో జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ వద్ద ఒక్కోటీ 250 మెగావాట్ల సామర్థ్యం గల 3 సోలార్ ప్రాజెక్టులకు సెకీ 2018లో టెండర్లు పూర్తి చేసింది. డిస్కంలతో ఒప్పందాలు కూడా 2018 జూలై 27నే పూర్తి చేశారు. వీటిలో ఎస్బీ ఎనర్జీ సెవెన్ లిమిటెడ్ 250 మెగావాట్ల ప్రాజెక్టు ఒక సోలార్ప్రాజెక్ట్కు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.1,250 కోట్లు. మిగతా రెండు ప్రాజెక్టులను మరో రెండు కంపెనీలు పొందాయి. ఎస్బీ ఎనర్జీ సెవెన్ కంపెనీను అదానీ సంస్థ టేకోవర్ చేసింది. ఇందులో అదానీకి ప్రత్యేకంగా కలిగిన లబ్ధి ఏమీ లేదు. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన ఈ టెండర్లు, ఒప్పందాలను తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించక తప్పదు. లేదంటే రాష్ట్ర ఖజానా నుంచి పెద్ద మొత్తంలో ఆ సంస్థలకు డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కోర్టుల్లో ఆ కంపెనీలపై ఉన్న వ్యాజ్యాలను పరిష్కరించి జగన్ సర్కారు ప్రాజెక్టులను అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ చొరవతో చౌకైన విద్యుత్తుసెకీ ఒప్పందం వల్ల వ్యవసాయానికి కరెంటు లభిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సగటు ధరకన్నా ఎక్కువకు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అప్పట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.3.54 ఉంటే ఒప్పందాల ప్రకారం రూ.8.90 వెచ్చించారు. దాదాపు 7 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల వివిధ సంస్థలపై ఏటా అదనంగా రూ.3,500 కోట్లు భారం పడుతోంది. వచ్చే 25 ఏళ్ల వరకు ఈ భారాన్ని విద్యుత్ సంస్థలు భరించాలి. ఈ వ్యవహారంపై అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో తీవ్రంగా విమర్శించారు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను ప్రస్తుతం సగటు ధర యూనిట్కు రూ.5.10 ఉన్నప్పటికీ, యూనిట్ రూ.2.49కే ప్రభుత్వం సేకరిస్తోంది. దీంతో ఏటా దాదాపు రూ.3,750 కోట్లు ఆదా అవుతుంది. -
సంక్షేమ సామ్రాట్కి జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో 3 దశాబ్దాలపాటు సీఎంగానే ఉండాలని పలువురు ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. రాష్ట్రవాప్తంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు గురువారం ఘనంగా జరుగుతున్నాయి. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. సంక్షేమ సామ్రాట్ మా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నా. pic.twitter.com/q8RhHafAi4 — Vijayasai Reddy V (@VSReddy_MP) December 21, 2023 సంక్షేమ సామ్రాట్ మా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂#HBDJagananna pic.twitter.com/mY3WG5Tr2d — Roja Selvamani (@RojaSelvamaniRK) December 20, 2023 అనంతపురం జిల్లా: సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎస్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య కేక్ కట్ చేశారు. జననేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు ! — Ambati Rambabu (@AmbatiRambabu) December 20, 2023 -
CM Jagan: ఏపీకి జలాభిషేకం
సాక్షి, గుంటూరు: కడలి పాలవుతున్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత వైఎస్సార్ జలయజ్ఞం చేపట్టగా ఆయన తనయుడు సీఎం జగన్ ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నారు. ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందిస్తున్నారు. కోవిడ్, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి పనులను పరుగులెత్తించారు.రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2019, 2020, 2021, 2022 ఖరీఫ్, రబీతో కలిపి ఏటా కోటి ఎకరాలకు సీఎం జగన్ నీళ్లందించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రాష్ట్రంలో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులతో ఏపీని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా సీఎం జగన్ నిలిపారు.♦ వైఎస్సార్ చేపట్టిన సంగం, నెల్లూరు బ్యారేజ్లలో మిగిలిన పనులను సీఎం జగన్ పూర్తి చేసి 2022లో జాతికి అంకితమిచ్చారు.♦ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చెరువులను నింపడం ద్వారా లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్ పూర్తి చేసి సెప్టెంబరు 18న జాతికి అంకితం చేశారు.♦ గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండో టన్నెల్ను పూర్తి చేసి నవంబర్ 30న జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమం చేశారు.♦ వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021 జనవరి 13 నాటికే సీఎం జగన్ పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ.లో 7.506 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మిగిలిన 192 మీటర్ల పనులు పూర్తి చేసి సొరంగాలను జాతికి అంకితం చేయనున్నారు. ♦విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల దాహంతో పోలవరాన్ని నీరుగార్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్, ఫైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి 2021లో గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించారు. బాబు అవినీతితో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగా«దాలను పూడ్చి యధాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. నీటి పారుదలలో రికార్డు♦ కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును దివంగత వైఎస్సార్ సాకారం చేశారు. గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించిన సీఎం జగన్ 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించేందుకు మార్గం సుగమం చేశారు.♦ గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులో కూడా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్ గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. దీంతో గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.♦ తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్కు రూ.500 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్ను నింపడానికి సీఎం జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ♦ గత నాలుగున్నరేళ్లలో ఆరు రిజర్వాయర్లలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వకు మార్గం సుగమం చేయడం ద్వారా నీటి పారుదల రంగ చరిత్రలో సీఎం జగన్ రికార్డు సృష్టించారు. -
CM Jagan: అన్నదాతకు అభయం
సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) అన్నదాతకు అభయమిస్తున్నాయి. రాత్రనకా, పగలనకా సేద్యం చేసి ఉత్పత్తి చేసిన పంటలకు గిట్టుబడి లేక సతమతమయ్యే రైతన్న పాలిట భరోసా కల్పిస్తున్నాయి. విత్తు నుంచి పంట విక్రయం వరకు ప్రతీ రైతును గ్రామస్థాయిలో చేయి పట్టి నడిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎండనక, వాననక సొసైటీల వద్ద పడిగాపులు పడితే తప్ప విత్తనాలు దొరికేవి కావు.కానీ ప్రస్తుతం ఆర్బీకేల రాకతో రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎరువుల కోసం అర్రులు చాస్తూ క్యూలైన్లలో నిలబడే దృశ్యాలు మచ్చుకైనా కన్పించడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి న తర్వాత వ్యవసాయానికి పెద్ద పీట వేసి వాటి స్వరూపాన్ని మార్చేసింది. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించింది. ఆర్బీకేల్లో రాయితీలో అందించిన విత్తనాల వివరాలు ♦ రైతుల సంఖ్య: 54.34 లక్షలు♦ లబ్ధి: రూ. 881.47 కోట్లు ♦ పంపిణీ చేసిన విత్తనాలు: 31.16 లక్షలు (క్వింటాళ్లలో)♦ ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్లు – 421వాటికైన ఖర్చు–రూ.63.15 కోట్లు ♦ ఈ సెంటర్లలో సేవలు పొందిన రైతులు–4 లక్షల మంది♦ రూ.5.37 కోట్లతో ఏర్పాటైన శీతల గిడ్డంగుల సంఖ్య: 43 ♦ 30.99 లక్షల మంది రైతులకు రూ.1,289.52 కోట్ల విలువైన 11.66 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ రైతన్నకు భరోసా ఇలా.. ♦ రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలు 6.19 లక్షల మందికి రూ.715.84 కోట్లు ♦ క్లైయిమ్లు, సెటిల్మెంట్లు, చెల్లింపుల్లో తొలి ఏడాది రైతుల వాటాతో కలిపి ప్రభుత్వం చెల్లించిన బకాయిలు – రూ.971 కోట్లు♦ ఏటా సగటున 13.62 లక్షల మందికి రూ.1,950.51 కోట్ల చొప్పున నాలుగేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు చేకూరిన లబ్ధి – రూ.7,802.05 కోట్లు ♦ 2023–24 రూపాయి ప్రీమియంతో బీమా కల్పిస్తూ ఏపీ మోడల్లో నడిచే రాష్ట్రాలు– మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ ఏపీ మాదిరిగా ఈ పంట నమోదు చేస్తున్న రాష్ట్రాలు – తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ♦ భూముల్లేని కౌలుదారులకు ఈ–క్రాప్ ప్రామాణికంగా రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల పంపిణీ ♦ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ♦ రూ.లక్ష లోపు రుణాలు తీసుకుని చెల్లించిన రైతుకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద వడ్డీ రాయితీ జమ ♦ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా 3 విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం ♦ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ చివరలో ఇన్పుట్ సబ్సిడీ ♦ సీజన్కు ముందుగానే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారం ♦ యూనివర్సల్ కవరేజ్కు కేంద్రం అంగీకరించకపోవడంతో మొత్తం బీమా పరిహారం ప్రభుత్వమే చెల్లింపు ♦ 2022–23 నుంచి ఫసల్ బీమాతో అనుసంధానించి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు ♦ ప్రతి ఎకరాకు ఈ క్రాప్ ఆధారంగా యూనివర్శల్ బీమా కవరేజ్ను కల్పిస్తోన్న ఏకైక రాష్ట్రం ఏపీయే ♦ ఏటా లబ్దిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తూ అభ్యంతరాలు పరిష్కారం ♦ ఎన్నికల హామీ మేరకు 2019 ఖరీఫ్ సీజన్లో రూపాయి ప్రీమియంతో పథకం ♦ ఈ– పంట నమోదే అర్హతగా ఉచితంగా బీమా కవరేజ్ కల్పిస్తూ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి శ్రీకారం. ఆదర్శం.. ‘ఫిష్ ఆంధ్ర’ ♦ రాష్ట్రంలో ఏటా 50 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులతో దేశంలోనే మొదటి స్థానం. ♦ ఏటా 4.36 లక్షల టన్నులున్న మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని 2025 నాటికి కనీసం 15 లక్షల టన్నులకు పెంచాలన్న సంకల్పానికి పదును. ♦రూ.కోటి అంచనాతో జిల్లాకో ఆక్వా హబ్.. ♦జిల్లాకొకటి చొప్పున 26 ఆక్వా హబ్లు. 4,007 ఫిష్ ఆంధ్రా మినీ అవుట్లెñట్స్♦ 351 డెయిలీ, 149 సూపర్, 62 లాంజ్ యూనిట్లు ఏర్పాటు లక్ష్యం ♦ వీటికి అనుబంధంగా రిటైల్ మినీ అవుట్లెట్స్, ఈ మొబైల్ త్రీ వీలర్, 4 వీలర్ ఫిష్ వెండింగ్ డెయిలీ యూనిట్లు, ఏర్పాటు. ‘ఫిష్ ఆంధ్ర’లో ఏమేమి దొరుకుతాయి... మెత్తళ్లు, పండుగప్పలు, కాలువ రొయ్యలు, సముద్ర పీతలు, టూనా, కోనాం చేపలు ఇలా ఏది కావాలన్నా తాజాగా బతికున్నవి లభ్యం. రాయలసీమ ప్రాంతంలో సముద్ర మత్స్య ఉత్పత్తులకు డిమాండ్ క్రమేపీ పెరుగుదల. ఆక్వా రైతు ఆనందంఈ–ఫిష్ సర్వే ఆధారంగారాష్ట్రంలో ఆక్వా సాగు పరిస్థితి సాగు విస్తీర్ణం:4,65,877.54 ఎకరాలు ఆక్వాజోన్ పరిధిలోని భూమి:4,22,309.63 ఎకరాలు పదెకరాల లోపు విస్తీర్ణం:3,56,278 ఎకరాలు పదెకరాల పైబడి విస్తీర్ణం:6,60,321.63 ఎకరాలు నాన్ ఆక్వాజోన్ పరిధిలోని భూమి: 43,567.91 ఎకరాలు పదెకరాల లోపు విస్తీర్ణం: 23,042.02 ఎకరాలు పదెకరాలకు పైబడి విస్తీర్ణం:20,524.89 ఎకరాలు మొత్తం విద్యుత్ కనెక్షన్లు: 64,645సబ్సిడీ పరిధిలోని కనెక్షన్లు: 50,659 -
CM Jagan: ఏపీ ‘క్లిక్’ అయిందిలా..
సుమతి రోడ్డుమీద వెళుతుండగా ఆకతాయిలు ఫాలో అవుతున్నారు. భయం వేసింది. చేతిలోని ఫోన్లో ఓ బటన్ నొక్కింది. ఐదు నిమిషాలు గడవకముందే పోలీసులొచ్చారు. ఆకతాయిల్ని పట్టుకుని బుద్ధి చెప్పారు. ఇదంతా.. ‘దిశ’ టెక్నాలజీతోనే సాధ్యమయింది. సుమతి దిశ యాప్లోని బటన్ను ప్రెస్ చేయటంతో అది పోలీస్ కమాండ్ కంట్రోల్కు సమాచారం పంపింది. అక్కడి నుంచి దగ్గర్లోని పెట్రోలింగ్ బృందానికి మెసేజ్ వెళ్లింది. అంతా క్షణాల్లో జరిగిపోవటంతో.. సుమతికి ఆపద తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్ను.. 1.46 కోట్ల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిద్వారా అలెర్ట్ రావటంతో... 31,541 ఘటనల్లో పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ!. ఐటీ. హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చింది తానేనంటారు చంద్రబాబు. ఈ క్లెయిమ్పై ఉన్న విభిన్న వాదనలనిక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మరి 2014 నుంచీ ఏపీ ముఖ్యమంత్రిగాఉన్నపుడు ఐటీని ఏం చేశారు? ప్రపంచమంతా కొత్త ఆవిష్కరణలతో పరుగులు తీస్తున్నపుడు ఇక్కడ మాత్రం అన్నీ మాటలే తప్ప చేతల్లో ఎందుకు కనిపించలేదు? ఐటీకి పితామహుడినని చెప్పారే తప్ప... కొత్తగా టెక్నాలజీని వినియోగించిందెక్కడ? సువిశాల తీరం ఉందని... దాన్నే అడ్వాంటేజ్గా తీసుకోవాలని పదే పదే చెప్పారు తప్ప ఒక్క పోర్టును గానీ, హార్బర్ను గానీ తేలేదెందుకు? మరి వైఎస్ జగన్ మాత్రం మాటలు చెప్పకుండా ప్రతి విభాగంలోనూ టెక్నాలజీని సమర్థంగా అమలు చేస్తున్నారు కదా? కొత్త పోర్టులు, హార్బర్లను తెచ్చారు కదా? మనకు కావాల్సింది హోరెత్తించే మాటలా..? కళ్లముందు కనిపించే నిజాలా?రాష్ట్రంలో గత ఖరీఫ్లో 93,29,128 ఎకరాల్లో పంటలు వేశారు. దీన్లో వరి 32,83,593 ఎకరాల్లోను... వేరు శనక 5,93166 ఎకరాల్లోను వేశారు. ఈ లెక్కల్లో ఒక్క ఎకరా కూడా తేడా లేదు. ఎందుకంటే ‘ఈ–క్రాప్’ టెక్నాలజీ ఉందిప్పుడు. ప్రతి రైతూ తన పంటను నమోదు చేసుకునే ఈ పటిష్ఠమైన డిజిటల్ వ్యవస్థతో... రాష్ట్రంలోని 27,800 గ్రామాల్లో ఉన్న ప్రతి ఎకరాకూ లెక్క ఉంది. అది బీమాకైనా... పంట నష్టానికైనా.. దిగుబడికైనా.ఈ ఉదాహరణలన్నీ చూస్తే... రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలోనూ టెక్నాలజీని ఎంత సమర్థంగా వినియోగిస్తోందో అర్థమవుతుంది. భారీ ఎత్తున ఐటీ కాంట్రాక్టులివ్వకుండా, ఉన్న వనరులను... నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సేవలను సమర్థంగా వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విభాగంలోనూ పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడుతోంది. అందుకనే... మునుపెన్నడూ చూడని పారదర్శకత, జవాబుదారీతనం ఇపుడు కనిపిస్తోంది. చేసిన పని పావలాదే అయినా... పదిరూపాయల ప్రచారం చేసుకోవటమనేది ఈ ప్రభుత్వ విధానం కాదు కాబట్టే.. పెద్దపెద్ద ఆరంభాలు, ఆర్భాటాలు లేకుండానే ప్రజలకు సమర్థమైన ఐటీ సేవలు అందుతున్నాయి.ఏఎన్ఎం యాప్లో 15 మాడ్యూల్స్...2020లో ప్రభుత్వం రూపొందించిన ఏఎన్ఎం యాప్ ద్వారా... క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యక్రమాన్నీ వారు రిపోర్ట్ చేస్తుంటారు. ఎన్సీడీ–సీడీ సర్వే, ఫీవర్ సర్వే, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, పాఠశాల విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్, ఆరోగ్యశ్రీ ఫీడ్ బ్యాక్ ఇలా అన్నిటినీ నమోదు చేస్తారు. ఆశా వర్కర్లకు తెచ్చిన ‘ఈ–ఆశా’ యాప్ ద్వారా గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యాన్ని వైద్యశాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది. పీహెచ్సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకూ యాప్లున్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయి.స్కూళ్లకు పక్కా సమాచార వ్యవస్థ...ఈ ప్రభుత్వం తెచ్చిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం(సిమ్స్)లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఉన్న 82 లక్షల విద్యార్థుల వివరాలు అప్ టు డేట్గా ఉన్నాయి. విద్యార్థుల ఆధార్ను లింక్ చేస్తూ... ప్రత్యేక ఐడీ నెంబర్ కేటాయించారు. దీంతో స్టూడెంట్ హాజరు యాప్ ద్వారా ట్రాక్ చెయ్యటం... గ్రామ/వార్డు కార్యదర్శుల ద్వారా వారిని తిరిగి బడికి రప్పించటం సులువవుతోంది. ఇక టీచర్ల అటెండెన్స్కూ యాప్ ఉంది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్తో అనుసంధానించిన ఈ యాప్... టీచర్ తమ స్కూల్ పరిసరాలకు 10 మీటర్ల దూరంలో ఉంటేనే హాజరును తీసుకుంటుంది. జగనన్న గోరుముద్ద అమలును పర్యవేక్షించడానికి ‘ఇంటిగ్రేటెడ్ మోనిటరింగ్ సిస్టం ఫర్ మిడ్డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) వచ్చింది. వారంలో ఆరు రోజులు.. రోజుకు సగటున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారం తీసుకుంటున్నారు. టీచర్ల ఫోన్లోని ఈ యాప్ ద్వారా... హాజరుతో పాటు ఎంతమంది పిల్లలు ఆహారం తీసుకుంటున్నారు? ఏరోజు ఏం వడ్డించారు, ఇచ్చిన సరుకు ఎంత? ఎంత స్టాక్ ఉంది? వంటి వివరాలన్నీ తెలుస్తాయి. ప్రతిరోజు టాయిలెట్ల పరిస్థితులూ అప్డేట్ అవుతాయి. ఎంప్లాయి ఇన్ఫర్మేషన్ సిస్టంలో టీచర్ల çహాజరుతో పాటు ఎన్ఓసీ, సెలవులు, మెడికల్ రీయింబర్స్మెంట్, గ్రీవెన్స్ సహా సర్వీసు రికార్డు మొత్తం ఉంటోంది.♦ చైల్డ్ ఇన్ఫో సిస్టంలో విద్యార్థులు ఏ స్కూల్ నుంచి ఏ స్కూల్కు మారారు. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా లింకేజ్ వంటివన్నీ ఉంటాయి. ♦ జేవీకే యాప్ ద్వారా ప్రతి స్కూల్లో అవసరమైన జగనన్న విద్యాకానుక కిట్లు ఎన్ని? ఎన్ని అందించారు? ఎన్ని మిగిలాయి? వంటివన్నీ తెలుస్తాయి. పైపెచ్చు ఈ వ్యవస్థలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున నియమించి ఇబ్రహీంపట్నం, విశాఖపట్నంలో రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లున్నాయి. బడుల్లో టీచర్లు, పిల్లల అటెండెన్స్ వేశాక అది ఈ సెంటర్లకు వెళుతుంది.టెక్నాలజీతో రైతుకు దన్ను...‘ఈ–కర్షక్’ యాప్తో ఆర్బీకేలో రైతులు సీజన్లో తాము సాగు చేసే పంటల వివరాలను నమోదు చేసుకుంటారు. తర్వాత ఆర్బీకే సిబ్బంది పొలాలకు వెళ్లి స్వయంగా జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్ ద్వారా రైతుసాగు చేసే పంట పొలం విస్తీర్ణం, సర్వే నెంబర్తో పాటు పంట వివరాలనూ ధ్రువీకరిస్తారు. పొలం ఫోటో డిజిటైజ్ చేస్తారు. ♦ఆర్బీకేల్లోని వెటర్నరీ సహాయకుల పనితీరును పర్యవేక్షించడానికి ‘పశు సంరక్షక్’ యాప్ ఉంది. ♦రోజువారీ వ్యవసాయ పంటల హెచ్చుతగ్గులను పర్యవేక్షించడానికి మార్కెటింగ్ శాఖ ‘కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ అండ్ పేమెంట్స్’ (సీఎంయాప్)ను తీసుకొచ్చింది. ♦‘ఈ–మత్స్యకార’ పోర్టల్ను వివిధ యాప్లతో అనుసంధానించారు. అప్సడా రిజిస్ట్రేషన్లు, ఆర్బీకే ఇన్పుట్ సప్లయి, ఈక్రాప్, మత్స్య సాగుబడి, కేసీసీ, పీఎంఎంఎస్వై వంటివన్నీ దీని ద్వారానే నిర్వహిస్తున్నారు. ♦‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ యాప్తో 55607 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు.అర చేతిలో ఆరోగ్యశ్రీ...ఆరోగ్య శ్రీ యాప్లో లాగిన్ అయితే... తాము గతంలో ఏ చికిత్స పొందామన్నది లబ్ధిదారులు తెలుసుకోవచ్చు. పథకం కింద ఏ ఆస్పత్రుల్లో ఏ వైద్య సేవలు అందుతాయి? దగ్గర్లో నెట్వర్క్ ఆసుపత్రులు ఏమేం ఉన్నాయి? తెలుసుకోవచ్చు. వాటి లొకేషన్నూ ట్రాక్ చేయొచ్చు. ‘ఈహెచ్ఆర్– డాక్టర్ కేర్’ ఆన్లైన్ వేదికతో యూపీహెచ్సీలు, పీహెచ్సీల్లో డిజిటల్ వైద్య సేవలందుతున్నాయి. ఈ పోర్టల్ నుంచి రోగులకు అందించిన వైద్యం వివరాలను వారి ఆయుష్మాన్ భారత హెల్త్ ఖాతాలో అప్లోడ్ చేస్తున్నారు. ల్యాబ్ టెస్ట్ల ఫలితాలు ఈహెచ్ఆర్ నుంచి నేరుగా రోగుల మొబైల్కే ఎస్సెమ్మెస్ ద్వారా వెళుతున్నాయి. క్రొంగొత్తగా... రిజిస్ట్రేషన్ల వ్యవస్థదేశంలో దస్తావేజులు రాయటానికి కొన్ని స్టార్టప్లు ఆన్లైన్ రైటర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇక్కడ ప్రభుత్వమే ఆ పనిచేసింది. ‘కార్డ్ ప్రైమ్’ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా డిజిటలైజ్ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం... వినియోగదారులు ఎవరిపైనా ఆధారపడకుండా నేరుగా ఆన్లైన్లో డాక్యుమెంట్లు తయారు చేసుకునే వీలు కల్పించింది. ఆన్లైన్లోనే చలానాలు కట్టి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ టైమ్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళితే అరగంటలో పని పూర్తవుతుంది. గతంలోలా డాక్యుమెంట్ల స్కానింగ్ అక్కర్లేదు కూడా. డిజిటల్ సిగ్నేచర్ ఒక్కటీ చాలు. ♦ఇక వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆటో మ్యుటేషన్ జరిగే కొత్త విధానాన్ని తెచ్చిందీ ప్రభుత్వం. గతంలో రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులకిస్తే వాళ్లు మ్యుటేషన్ చేసేవారు. దీనికి సమయం పట్టేది. ఇప్పుడా అవసరం లేదు. ♦స్టాంపు పేపర్ల స్థానంలో ఈ స్టాంపింగ్ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. గతంలో భౌతికంగా స్టాంపులు కొని, వాటి ద్వారా అగ్రిమెంట్లు చేసుకునేవారు. ఇప్పుడు స్టాంపు పేపర్లతో పని లేదు. కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద కూడా ఈ–స్టాంపింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్టాంపు పేపర్ల అవకతవకలకు చెక్ పడింది.♦భూముల రీ సర్వే ద్వారా ఏ రాష్ట్రంలో లేని విధంగా డిజిటల్ రెవెన్యూ రికార్డులు తయారవుతున్నాయి. డ్రోన్లతో సర్వే చేసి శాటిలైట్ లింకు ద్వారా జియో కోఆర్డినేట్స్తో రైతుల భూముల హద్దులు నిర్ధారిస్తున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో యునిక్ ఐడీ ఉంటోంది. -
ఇదీ.. జగన్ కమిట్మెంట్
ఒకపక్క.. రోజుకు వంద రూపాయల సంపాదన కూడా లేక.. కనీస అవసరాలని చెప్పే తిండి, ఇల్లు, దుస్తులకు కూడా నోచుకోని జనం లెక్కించలేనంత మంది. మరోపక్క.. రోజుకు లక్ష రూపాయలు సైతం గ్యాంబ్లింగ్లో పోగొట్టుకుని చింతలేకుండా గడిపేసే శ్రీమంతులూ లెక్క లేనంతమంది. ఇదీ.. మన సమాజంలో ఉన్న విభజన. నానాటికీ పెద్దదవుతున్న ఈ రేఖ చెరిగేంతవరకూ అభివృద్ధి చెందిన దేశంగానో, రాష్ట్రంగానో మారటం అసాధ్యం. కనీస అవసరాలు తీర్చుకోలేని కోట్లాది మందిని విడిచిపెట్టేస్తే ఆ అభివృద్ధికి అర్థం ఉండదు. ఆ అభివృద్ధిలో వాళ్లకూ వాటా ఉండాలి. ఆ స్థాయికి వాళ్లను తీసుకురావాలి. వాస్తవానికి సంక్షేమ పథకాల పరమార్థం ఇదే. ఇపుడు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నది ఆ అభివృద్ధే. చదువుతోనే తలరాత మారుతుంది దీన్ని మనసావాచా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కాబట్టే తన పిల్లలిద్దరినీ టాపర్లుగా నిలబెట్టగలిగారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకూ సరైన విద్యనందించాలన్న ఉద్దేశంతోనే మేనిఫెస్టోలో ‘అమ్మ ఒడి’ని ప్రతిపాదించారు. చేతిలో డబ్బుల్లేక చిన్న పిల్లల్ని సైతం కూలికి పంపే పరిస్థితిని మార్చాలన్నదే దీనివెనకున్న ఆలోచన. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దీన్ని ఆచరణలోకి తెచ్చారు. ఆశించినట్టే ‘అమ్మ ఒడి’ ఊతంతో పిల్లలు బడి బాట పట్టారు. మరి ఇది సరిపోతుందా? ఇదిగో.. ఈ ఆలోచనే విద్యారంగంలో పెను సంస్కరణలకు బీజం వేసింది. స్కూళ్లకొచ్చే పిల్లల కడుపు నిండితేనే చదువు ఒంట బడుతుందన్న ఆలోచన.. పౌష్టికాహారంతో కూడిన ‘గోరుముద్ద’కు ప్రాణం పోసింది. బళ్లు తెరిచిన ఆరు నెలలకు కూడా పుస్తకాలు అందకపోతే పిల్లలెలా చదువుతారు? ఎవరి స్థాయిని బట్టి వారు దుస్తులు, బ్యాగులతో వస్తే.. ఒకరు షూ వేసుకుని, మరొకరు చెప్పులు లేకుండా వస్తే అంతా ఒక్కటేనన్న భావన ఎందుకొస్తుంది? వీటన్నిటికీ సమాధానమే.. స్కూళ్లు తెరవటానికి ముందే ప్రతి విద్యార్థికీ అందుతున్న ‘విద్యా కానుక’. సరే! మరి స్కూళ్లో? తమ వారి ప్రయివేటు ప్రయోజనాల కోసం గత ప్రభుత్వాలు వాటిని చిత్రవధ చేసి చంపేశాయిగా? ఆడపిల్లలు టాయిలెట్ కోసం ఇంటికెళ్లాలి. సరైన గదుల్లేవు. బెంచీలు, బ్లాక్ బోర్డులు అన్నీ అంతంతే! ఎందుకెళ్లాలి?... అనిపించేలా ఉన్నాయి మన బడులు. వీటిని మార్చాలనుకున్నారు జగన్. అందుకే.. ‘నాడు–నేడు’ పేరిట ఓ యజ్ఞాన్ని ఆరంభించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ కార్పొరేట్ స్కూలుకు దీటుగా సౌకర్యాలతో తీర్చిదిద్దారు. వేల కోట్లు ఖర్చు చేయాల్సి రావటంతో.. దశల వారీగా ఈ యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నారు. స్కూళ్లకు వస్తున్నారు. భోజనం, దుస్తులు ఓకే. స్కూళ్లూ మారాయి. మరి చదువో! మన పిల్లలు పోటీ పడాలంటే ఇంగ్లిష్ రావాలి. వస్తేనే రాణించగలరు. అంతర్జాతీయంగానూ పోటీ పడగలరు. అందుకే ప్రయివేటు స్కూళ్లకు మల్లే ప్రీప్రయిమరీ–1,2 తరగతులు వచ్చాయి. ఆది నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధన మొదలయింది. ఇలాగైతే ప్రయివేటు స్కూళ్లకు ఎవరూ రారు కనక.. మాతృభాషపై మమకారం లేదంటూ, ఇంగ్లీషు చదువులు వద్దంటూ మాఫియా గాళ్లంతా కలిసి మాయా యుద్ధానికి దిగారు. కేసులు వేశారు. అయినా సరే.. జగన్ సంకల్పం గట్టిది కావటంతో ఇంగ్లీషు మీడియం వచ్చింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడుతుండటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అక్కడితో ఆగలేదు జగన్.అగ్రశ్రేణి కార్పొరేట్ స్కూళ్లలోనే దొరికే ఎడ్యుటెక్ కంటెంట్ను దిగ్గజ సంస్థ ‘బైజూస్’ ద్వారా మన పిల్లలకూ అందుబాటులోకి తెచ్చారు. ఏటా 8వ తరగతి పిల్లలకు శాంసంగ్ ట్యాబ్లనూ అందజేస్తున్నారు. మిగిలిన తరగతుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ను (ఐఎఫ్పీ) ఏర్పాటు చేస్తున్నారు. డిజిటల్ క్లాస్రూమ్లనూ అందుబాటులోకి తెస్తున్నారు. దీన్ని బట్టి తెలిసేది ఒక్కటే. పిల్లల చదువుపై సీఎం జగన్కు అంతులేని నిబద్ధత ఉంది. చదివించటం ద్వారా వారి రాతలను మార్చాలన్న తపనతో.. యావత్తు విద్యా రంగాన్ని సమూలంగా సంస్కరించటం మొదలెట్టారు. ఇదంతా చేసింది జస్ట్ నాలుగున్నరేళ్ల వ్యవధిలోనే! వైద్యం.. ప్రతి ఒక్కరి హక్కు.. చదువుకైనా.. సరైన వైద్యం చేయించుకోవటానికైనా పేదరికం అడ్డు కాకూడదని, వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని జగన్ భావించారు. అందుకే.. వెయ్యి రూపాయలు దాటిన ఏ వైద్యానికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తానని మేనిఫెస్టోలో చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక దాన్ని అమల్లోకి తెచ్చారు. ఆరోగ్య సేవలకు అదొక బీజం మాత్రమే. అక్కడి నుంచి మొదలుపెడితే.. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంచెలంచెలుగా విస్తరిస్తూ పోయింది. ఆసుపత్రులన్నీ స్కూళ్ల మాదిరే ‘నాడు–నేడు’ కింద కొత్త రూపాన్ని, కొత్త సౌకర్యాలను సంతరించుకున్నాయి. ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా వైద్యులు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు... ఇలా ప్రతి పోస్టూ భర్తీ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యుల భర్తీతో పాటు.. అత్యాధునిక పరికరాలనూ తీసుకొచ్చారు.యావత్తు ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని కూడా కోవిడ్ వణికించినపుడు వీళ్లంతా కలిసి వలంటీర్ల సాయంతో ఎంత అద్భుతం చేశారన్నది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇతర రాష్ట్రాల్లో ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి వచ్చి, సంరక్షణ కేంద్రాల్లో ఉచితంగా చికిత్స తీసుకుని వెళ్లారంటే.. అది రాష్ట్రంలో వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన పక్కా వ్యవస్థ వల్లేనన్నది కాదనలేని నిజం. అంతేకాదు.. గ్రామ స్థాయి నుంచీ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తూ వచ్చారు. ఏకంగా 1,405 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏర్పడ్డాయి. ప్రతి చోటా వైద్యులొచ్చారు. ఉచిత మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటికీ తోడు విదేశాల్లోనే కనిపించే ‘ఫ్యామిలీ డాక్టర్’... మన ఊళ్లలో ప్రతి ఇంటికీ అందుబాటులోకి వచ్చారు.రాష్ట్రంలో ఇపుడు నిరుపేదలందరికీ కావాలనుకున్న వెంటనే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అపాయింట్మెంట్.. అదీ ఉచితంగా దొరుకుతోందంటే.. అదే వైఎస్ జగన్ విజన్. పరిస్థితులు మారి... కొన్ని చికిత్సలకు వ్యయం ఎక్కువవుతోందని గ్రహించటంతో ఇపుడు ఆరోగ్య శ్రీ చికిత్సకయ్యే ఖర్చును ఏకంగా రూ.25 లక్షల వరకూ ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చికిత్సా ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చేలా చికిత్స ప్రకిరయలను సైతం 1,059 నుంచి 3,257కి పెంచారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్యను 820 నుంచి 2,513కి పెంచారు. నాలుగున్నరేళ్లలో ఇవన్నీ చేయాలంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి మరి! ఇదీ వ్యవ‘సాయం’ అంటే.. దేశానికి రైతే వెన్నెముక. వైఎస్సార్ వారసుడిగా దీన్ని బలంగా నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఏడాదికి రెండుసార్లు పంట వేసే ముందు రైతుకు పెట్టుబడిగా రూ.12,500 చొప్పున ఇస్తామని భరోసా ఇచ్చారు. దాన్ని మరో రూ.వెయ్యి పెంచి కోవిడ్ కష్టకాలంలోనూ ఆపకుండా మరీ అమల్లోకి తెచ్చారు. నిజానికి రైతుకు ఏం చేసినా తక్కువే. ఎంత చేసినా తక్కువే. అందుకే గ్రామ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలూ అందించే ఓ బలమైన వ్యవస్థను సృష్టించాలని సంకల్పించారు. రైతు భరోసా కేంద్రాలకు ప్రాణం పోశారు. రైతు ఎదుర్కొంటున్న కష్టాలన్నిటికీ ఇది వన్స్టాప్ పరిష్కారంగా ఉండాలని భావించారు.నకిలీ విత్తనాల బారిన పడకుండా ఇక్కడే సర్టిఫైడ్ విత్తనాలు, పురుగు మందులు దొరుకుతాయి. భూసార పరీక్ష కేంద్రాల నుంచి పండిన పంటను నిల్వ చేసుకునే గిడ్డంగులు, ఆఖరికి ఖాతాలో పడ్డ నగదును డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు కూడా కొన్నిచోట్ల ఆర్బీకేలలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇపుడు ఆర్బీకే అనేది ఓ బలమైన ప్రభుత్వ వ్యవస్థ. రైతును విత్తు నుంచి పండిన పంటను విక్రయించుకునేదాకా చేయిపట్టి నడిపించే అమ్మ, నాన్న.. అన్నీ. మనసు మంచిదైతే ప్రకృతి కూడా సహకరిస్తుందనేది ఎంత నిజమో ఈ నాలుగున్నరేళ్ల వైఎస్ జగన్ పాలనలో ప్రస్ఫుటమైంది. సువిశాల కోస్తా తీరం కారణంగా కొన్నిసార్లు తుపాన్లు దెబ్బతీసినా.. తట్టుకుని రోజుల వ్యవధిలోనే బయటపడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. నష్టపోయిన ప్రతి కుటుంబానికీ అతివేగంగా సాయం అందించటంతో పాటు ప్రతి ఎకరాకూ ఉచితంగా ప్రభుత్వమే బీమా చేయించటం, ఒక సీజన్లో జరిగిన నష్టానికి మళ్లీ ఆ సీజన్ రాకముందే పరిహారాన్ని అందించటం.. ఏ సీజన్లో జరిగిన నష్టానికి ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని అందించటం.. ఇలా ప్రతిదీ నెరవేర్చేలా ‘ఈ–క్రాప్’ ద్వారా ఆర్బీకేల చుట్టూ ఓ బలమైన వ్యవస్థను సృష్టించారు. ఇదీ విజన్ అంటే. వికేంద్రీకరణకు కొత్త అర్థం వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వమిచ్చే పింఛన్లంటే ఇదివరకు ఓ మహా ప్రహసనం. పట్టణాల్లోనైతే బ్యాంకుల ముందు పడిగాపులు. పల్లెల్లోనైతే ఇచ్చే వ్యక్తి ఏ రోజున వస్తాడో తెలియని దైన్యం. అసలే వాళ్లు వృద్ధులు, దివ్యాంగులు. అలాంటి వారికిచ్చే సాయమేదైనా వారికి సాంత్వన కలిగించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదు కదా? ఇదిగో.. ఈ ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల సైన్యాన్ని సృష్టించారు. ప్రతినెలా ఒకటవ తేదీన ఠంచనుగా ఇళ్లకు వెళ్లి సామాజిక పింఛన్లు అందజేయటం ఈ సైన్యం బాధ్యత. ఆ తరవాత..! ఆ వలంటీర్లు మరిన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగమయ్యారు.పథకాలను లబ్ధిదారులకు చేరువ చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఓ వలంటీరు. ప్రభుత్వానికి – ఆ గడపలకు తనే సంధానకర్త. సూక్ష్మ స్థాయిలో వికేంద్రీకరణ ఫలితాలను కళ్లకు కట్టిన వలంటీర్ల మాదిరే... గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు చేరువ చేయడానికి వలంటీర్లయితే... ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి చేర్చేది గ్రామ సచివాలయాలు. అవసరమైన సర్టిఫికెట్ల నుంచి స్థానికంగా కావాల్సిన సేవలూ అక్కడే. ఈ వ్యవస్థ ఆలోచనతో ఏకంగా లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలొచ్చాయి. అవినీతికి, లంచాలకు ఆస్కారం లేకుండా యువత ఉన్న ఊళ్లోనే ఉద్యోగాలు తెచ్చుకుని కొలువుల్లో స్థిరపడింది. అక్కడితో ఆగకుండా గ్రామాల్లో రైతుల కోసం ఆర్బీకేలు, వైద్య సేవల కోసం పీహెచ్సీలు నిర్మించి, యావత్తు గ్రామ వ్యవస్థను బలోపేతం చేశారు జగన్. అందుకే ఇపుడు పల్లెల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. పల్లెల నుంచి వలసలు తగ్గాయి. ఒక బలమైన ఆలోచన... దాని ద్వారా మరింత మంచి చేయాలన్న తపన... ఈ రెండూ ఉంటే ఎంతటి అద్భుతమైన వ్యవస్థలను నిర్మించవచ్చో చేసి చూపించారు జగన్. అందుకే ప్రతి రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం వైపు చూస్తోంది. ♦ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.2,43,958.04 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 8,29,81,601♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.4,11,488.99 కోట్లు♦ నాన్ డీబీటీ ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటిదాకా అందిన మొత్తం రూ.1,67,530.95 కోట్లు♦ లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి రెండు మూడు పథకాల ద్వారా లబ్ధి) 4,44,04,251♦ డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య (పలువురికి 2, 3 పథకాల ద్వారా లబ్ధి) 12,73,85,852-రమణమూర్తి మంథా -
ఓర్పుకీ... ఓదార్పుకీ చిరునామా!
ఆయన పేరు... లక్షల గుండెల్లో ఒక లయ. కోటి తలల నాలుక. జయ జయ ఘోషల పల్లవి. కడలి హోరు లాంటి కరతాళ ధ్వనుల గీతిక! కష్టజీవికి ఇరువైపులా నిలిచిన వాడు. కర్మ జీవికై పాలన మలచిన వాడు. ఫ్యూడల్ శక్తుల కుహనా ఎత్తుగడలను ఎదిరించి గెలిచినవాడు. పాతికేళ్లకే ప్రతిభావంతుడు. సంపదల మధ్య పుట్టిన జగన్ మోహనుడు. కుట్ర రాజకీయాల ‘బంధం’లో బాధల గరళం మింగిన బాధాసర్ప దష్టుడు. కసిని అసిగా మార్చు కుని అసిధారావ్రతం చేసి, జయకేతనం ఎగురవేశాడు. అయితే ఈ విజయం ఆయన్ని తేలిగ్గా వరించలేదు. ఒకవైపు విషశక్తుల కుయుక్తులు ఎదుర్కొంటూనే జనసాగర తరగలపై తేలియాడిన నావికుడు. బాటలు నడిచి పేటలు కడచి వేలమైళ్ళ దుమ్ములో, మధ్యాహ్నపు సూర్య ధూళిలో స్నానమాడిన నిత్య పథగాముడు. అధో జగత్ సహోదరుల కష్టాలను కన్నాడు. గోడు విన్నాడు. అబలల కంటి తడి వీణ మీటాడు. అందుకే ఓర్పుకీ, ఓదార్పుకీ ‘జగన్’ అనే మూడు అక్షరాలు చిరునామా అయ్యాయి! సగటు ప్రజల మనో భావన భవన ప్రాంగణాల కట్టిన తోరణాలే ‘నవరత్నా’లై నిలిచాయి. సహజంగానే ప్రతిభావంతులకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ముద్ర ఉంటుంది. తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్నా తండ్రి చాటు బిడ్డగా రాజకీయం నడపలేదు. జనంతో కలిసి, జనంతో మమేకమై, జన ఘన జన నేతగా జగన్ ఆవిష్కృతమయ్యాడు. కుహనా శక్తులకు సింహ స్వప్నమయ్యాడు. సమ సమాజ చైతన్యానికి తెరలేపి, సామాజిక చైతన్యం అంటే ఏమిటో చాటి చెప్పాడు. ఈ చైతన్యం ఫ్యూడల్ శక్తులకు సహజంగానే కంటగింపుగా ఉంటుంది. దశాబ్దాల తమ పెత్తందారీ తనానికి ఎదురు నిలవడం సహించలేని శక్తులు అన్నీ ఒక్కటయ్యాయి. బుస కొట్టే భుజంగాలూ, ఘుర్ఘరించే ‘వరాహాలూ’, నక్కలూ, భల్లూకాలూ, ఉలూకాలూ ఒక్క టయ్యాయి. రాజ్యం తమ భోజ్యం కావాలని పద్మ వ్యూహాలను పన్నుతున్నాయి. కానీ వారికి తెలియదు జనార్దనుడికి పద్మవ్యూహం పటా పంచలు చేయడం వెన్నతో పెట్టిన విద్య అని! అయితే సగటు ప్రజలు కూడా ఈ కుట్రలు గ్రహించాలి. స్వేదంతో నిర్మించుకున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం అందరి విధి. పరిపాలన అంటే ‘ఆకాశ హార్మ్యాల నిర్మాణం, విదేశీ శక్తులకు ఆహ్వానం, లక్షల కోట్లు దోచేయడం’ అనే సంస్కృతికి వీడ్కోలు చెప్పి, అట్టడుగు వర్గాల సాధికారతే లక్ష్యంగా సాగిపోతున్నాడు జగన్ మోహన్ రెడ్డి. అయితే ఈ ప్రయాణం పూల పాన్పు కాదు. ఎన్నో అవరోధాలూ, సవాళ్లూ ఉన్నాయి. అయినా ఆత్మవిశ్వాసమే ఆలంబనగా సాగుతున్నాడు. మరి ఆ సంక్షేమ ఫలాలు అందని అసంతృప్తుల పరిస్థితి ఏమిటి? ఇక్కడే అసంతృప్తులు వివేకంతో ఆలోచించాలి. పరిపాలన అంటే సంపన్న వర్గాలు కోటానుకోట్లు దోచుకుంటూ పేదలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తూ, వాళ్లకు ఎంగిలి మెతుకులు విసరడం న్యాయమా? అసలు అంటూ సంక్షేమ ప్రభుత్వం వచ్చాక, ఆ ఫలాలు తమ సాటివారికి అందుతున్నప్పుడు, తమ వంతు కూడా వస్తుందనే విశాల దృక్పథంతో ఆలోచించాలి. ఎందుకంటే అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలనే లక్ష్యం జగన్కి ఉండవచ్చు. కానీ అందుకు ఆయన చేతిలో మంత్రదండం ఏమీ లేదు. అందుకే సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటూ దశలవారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఈ కొనసాగింపు తమ వరకు వచ్చేదాకా ఫలాలు అందని వారు ఓపిక పట్టడం ఎంతో అవసరం. ఇప్పటికే విద్య, వైద్యం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గృహాల నిర్మాణం వంటి ఎన్నో సంస్కరణలు అమలవుతున్నాయి. ఇవి మరింత విస్తృతం కావాలి అంటే ‘మళ్లీ జగన్ రావాలి!’ ఈ నేపథ్యంలో ఛద్మ వేషధారులు బయలుదేరి, కవి ఆలూరి బైరాగి చెప్పినట్టు, ‘నాకు కొంచెం నమ్మకమివ్వు కొండలు పిండి కొట్టేస్తాను, చితికిన టమేటో లాంటి సూర్యుణ్ణి, ఆరిన అప్పడం లాంటి చంద్రుని ఆకాశపు ఎంగిలి పళ్లెంలో నుంచి నెట్టేస్తాను’ అంటూ వీరంగాలు వేస్తున్నారు. ‘ఎర్ర పుస్తకాలతో’, ‘ఎర్రి’ ప్రసంగాలతో వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నారు. ఇంకోవైపు వీరికి చెందిన కార్పొరేట్ శక్తులు ఒకటయ్యాయి. దశాబ్దాలుగా తాము నంజుకు తింటున్న ప్రజా సంపద పేదలకు వెళ్లడం జీర్ణించుకోలేక పోతున్నాయి. గోబెల్స్ ప్రచారంతో జగన్పై చీకటి యుద్ధం ప్రారంభించాయి. ఇది జగన్ చెప్పినట్లు అచ్చంగా ‘క్లాస్ వార్’. పేదల ప్రభుత్వంపై పెద్దలు ప్రకటించిన యుద్ధం. ఒకవైపు పీడిత, తాడిత జన అక్షౌహిణుల ప్రతినిధిగా జగన్ నిలబడగా ఆయనతో కలబడుతున్న శక్తులు అత్యంత బలమైన కుహనా శక్తులు. ఒకే తానుకి చెందిన ఈ శక్తులు జ్యుడీషియరీ, మీడియా, ఎగ్జిక్యూటివ్, బిజినెస్, సినిమా... ఇలా ఒకటనేమిటీ? అన్ని రంగాలనుంచి మూకుమ్మడి దాడి ప్రారంభించాయి. అయితే ఈ కుట్ర రాజకీయాలకు అదిరే బెదిరే వ్యక్తి కాదు జగన్. ఇప్పుడు జగన్ నడుపుతున్నది సంప్రదాయేతర రాజకీయం. ఇది అర్థం కావడానికి కొంత సమయం పట్టవచ్చు. రాజకీయం అంటే కొద్దిపాటి వర్గాల సొత్తు అనీ, పాలన అంటే కొన్ని వర్గాలు మాత్రమే తర తరాలకు సరిపోను సంపద కూడబెట్టుకోవడం అనీ, పాలకులు వేరు, పాలితులు వేరు అనే ఫ్యూడల్ సంప్ర దాయ రాజకీయాలకు చెక్ చెప్పి, ‘సంక్షేమ రాజ్యం’ దిశగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ఈ దేశ రాజకీయాల్లోనే ఒక విలక్షణ పాలకుడు, సలక్షణ నాయకుడు. ఆయన జన్మ దినోత్సవ సందర్భంగా, పెద్దలు ‘జీవేమ శ్శరదమ్ శతమ్...’ అని దీవిస్తున్న వేళ, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు!! పి. విజయబాబు వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు -
ప్రజా సంక్షేమ రథ సారథి!
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటికే ఉన్న వ్యవస్థలను అత్యంత ప్రభావవంతం చేయడంతో పాటు, ప్రజల కోసం నూతన వ్యవస్థలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సంక్షేమ రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలూ, ప్రజలకు సంక్షేమ ఫలాలను చేరవేస్తున్న తీరూ విప్లవాత్మకం. అందుకే సంక్షేమ రంగానికి సంబంధించినంత వరకూ ప్రగతి గురించి చెప్పుకోవాలంటే జగన్కు ముందు, జగన్ తర్వాత అని చెప్పుకోవాలి. ఈ కారణంగానే యావత్ భారత దేశం ఈరోజున ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. జగన్ తన నాలుగేళ్ల పదవీ కాలంలోనే ఎవరూ పూర్తిగా గుర్తు పెట్టుకోలేనన్ని ఎక్కువ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పటి వరకూ ఉన్న వ్యవస్థల పని తీరును ప్రభావితం చేస్తూ వాటిని ప్రజలకు మరింత చేరువ చేయగలిగారు. ఉదాహరణకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు ఇచ్చే పథకాలు గత ప్రభుత్వాల హయాంలోనూ ఉన్నాయి. అయితే అప్పట్లో పెన్షన్ మంజూరు కావడం, పెన్షన్ మొత్తాలు చేతికి అందడం పెద్ద ప్రహసనంగా ఉండేది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అర్హత కలిగిన వారికి పెన్షన్ల మంజూరు చాలా సులభతరంగా మారింది. కచ్చితంగా ఒకటవ తేదీన సూర్యోదయానికి ముందే ఇంటి కొచ్చి తలుపుతట్టి పెన్షన్ మొత్తాలను అందించే సరికొత్త వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడింది. పెన్షన్లను మాత్రమే కాదు రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా పేదలకు అందించే బియ్యం తదితర చౌక వస్తువుల కోసం దుకాణాల వరకూ వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి ముంగిటకే రేషన్ వాహనాలను తెచ్చి పెట్టారు. అలాగే ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి ‘దిశ యాప్’ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అందరి మన్ననలూ పొందుతోంది. గతంలోనూ సంక్షేమ పథకాలు ఉన్నా... లబ్ధిదారులకు ఆ ఫలాలు చేరడానికి దళారీ వ్యవస్థ వాహకంగా ఉండేది. ‘కులం చూడం, మతం చూడం, పార్టీలు అసలే చూడం.. పేదరికం ఒక్కటే అర్హతకు ప్రామాణికం’ అన్నదే సంక్షేమ పథకాల అజెండాగా జగన్ పెట్టుకున్నారు. ఒక్క బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్న ‘డీబీటీ’ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ ఫర్) విధానం సీఎంగా జగన్ రాకతోనే వచ్చింది. ఈ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయ డంలో ఎక్కడైనా పొరపాట్లు దొర్లి దాని కారణంగా ఎవరైనా అర్హులు నష్టపోయే పరిస్థితి ఏర్పడితే అలాంటివారు ఎప్పుడైనా ఆ పథకాల కోసం దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందే వెసులుబాటు కలిగించారు. గతంలో కుల, ఆదాయ సర్టిఫికెట్లు లాంటివి తీసుకోవాలంటే పెద్ద తతంగమే ఉండేది. లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవ స్థకు రూపకల్పన చేశారు. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కం సర్టిఫికెట్, ఈడబ్లు్యఎస్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లాంటి ముఖ్యమైన సర్టిఫికెట్లను ఈ రోజున ప్రజలు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, ఎవ రినీ కలవాల్సిన అవసరం లేకుండా సచివాలయాల ద్వారా సులభంగా అందుకోగలుగుతున్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు ఎలాంటి వివాదాల్లేకుండా ఇళ్ల స్థలాలను అందించడం కూడా సచివాలయాల ద్వారా మత్రమే సాధ్యమైంది. సచివాలయాలకు అనుబంధంగా సీఎం జగన్ సృష్టించిన 2.56 లక్షల మంది ‘వాలంటీర్ల’ వ్యవస్థ... సిఫార్సులు, పైరవీలను పాతరేసింది. వ్యవసాయానికి వెన్ను దన్నుగా రైతుకు విత్తనాలు అందించడం దగ్గర నుంచి వ్యవసాయోత్పత్తుల అమ్మకాల దాకా ఆసరాగా నిలిచే ‘రైతు భరోసా కేంద్రాలు’ (ఆర్బీకే) కూడా ఈ రోజున దేశ, విదేశీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, బాబూ జగ్జీవన్ రామ్, మౌలానా ఆజాద్, కొమురం భీం, అల్లూరి సీతారామరాజు కోరుకున్న సమాజం దిశగా ప్రభుత్వ ఫలాలు అట్టడుగువర్గాల వారికి చేరాలంటే పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అత్యధిక ప్రాధా న్యత ఇవ్వాలన్నది జగన్ ప్రభుత్వం నమ్మిన సిద్ధాంతం. తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రిది. ఏ వర్గాలైతే ఇంత కాలం అణచి వేయబడ్డాయో, ఏ వర్గాలైతే ఇంత కాలం రాజకీయ పదవులకు దూరంగా ఉన్నాయో ఆ వర్గాలకు రాజ్యాధికారం దక్కుతోంది. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మన్గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన జకియా ఖానవ్ుకు అవకాశం ఇచ్చారు. ఇది కాకుండా శాశ్వత ప్రాతిపదికన ‘బీసీ కమిషన్’తో పాటుగా ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి, దాన్ని అమలు చేసిన తొలి ప్రభుత్వం జగన్దే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనతా జగన్ సర్కార్దే. గత మూడేళ్ల కాలంలోనే రెగ్యులర్, ఔట్ సోర్సింగ్లతో కలిపి ఇప్పటి వరకూ 2.61 లక్షల ఉద్యో గాలను బీసీ వర్గాల వారికి ఇవ్వడం, గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చిన 1.30 లక్షల శాశ్వత ఉద్యో గాలలో 83 శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయమే. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వర్గాల వారికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న చేయూతను చూసి ‘మేము కూడా ఈ సామాజిక వర్గాల్లో పుట్టి ఉంటే బాగుండేద’నే భావన ఈ రోజున అగ్రవర్ణాల వారిలో కలుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న జగన్ కలకాలం ఆయురారోగ్యాలతో విలసిల్లాలి! డా‘‘ మేరుగు నాగార్జున వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధిపై సీఎం జగన్ మార్క్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో విశాఖపట్నం సినీ పరిశ్రమ కేంద్రంగా వర్ధిల్లుతుందని అందరూ ఆశించారు. విభజన ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సినిమా పరిశ్రమ బాగు కోసం ఆయన ఎలాంటి కార్యచరణ ప్రారంభించలేదు. బాబు అధికారంలోకి వచ్చాక ఆయనకు అనుకూలంగా ఉండే సినీపెద్దలు విశాఖలోని భూములపై కన్నేశారు. ఆపై ఏపీలోని సినిమా థియేటర్ల లీజులు, క్యాంటీన్ కాంట్రాక్టుల, టికెట్ ధరలు ఇలా అన్నీ బాబుగారి మిత్రులుగా కొనసాగిన కొందరి గుప్పెట్లోకి వెళ్లాయి. దీంతో ఏపీలో సినిమా పరిశ్రమ విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి విషయంలో తొలి అడుగులు పడ్డాయి. సినిమా టికెట్ల ధరలు, బెన్ఫిట్ షోలు, ఏపీలో ప్రతి సినిమా షూటింగ్ కార్యక్రమాల పనులు, ఆన్లైన్లో టికెట్ల విక్రయం ఇలా అనేక నిర్ణయాలను సీఎం జగన్ తీసుకున్నారు. మొదటి స్టూడియో విశాఖలోనేసాగర తీరాల్లో ప్రపంచంలో ఎన్నో నగరాలు కొలువుదీరినా వాటిలో విశాఖ నగరానిది ప్రత్యేక స్థానం. ఇక్కడి సాగరతీరం.. పచ్చని కొండలు.. పర్యాటక ప్రాంతాలు పర్యాటక రంగానికే కాకుండా.. సినీ షూటింగులకూ స్వర్గధామాలు. అందువల్లే ఇక్కడ ఆంధ్రా సినీటోన్ పేరుతో 1936లోనే ఒక స్టూడియో ఉండేది. ఇది రాష్ట్రంలో రెండవది. అప్పటికే రాజమండ్రిలో దుర్గ సినీ టోన్ పేరుతో ఒక స్టూడియో ఉండేది. విశాఖలో సినీ స్టూడియో నిర్మించి నగరంలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలని జగన్నాధరాజు భావించారు. ఆయనతో సూర్యనారాయణ రాజు అనే వ్యక్తి కూడా తోడవడంతో ఇద్దరూ కలిసి ఆంధ్రా సినీ టోన్ స్టూడియోను పూర్తి చేశారు.కానీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధాని హైదరాబాద్ కావడంతో సినిమా రంగానికి చెందిన వారందరూ కూడా ఆనాడు హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దీంతో విశాఖ వెనుకపడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో చిత్ర పరిశ్రమ బాగు కోసం ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ఇండస్ట్రీలో బాబుగారికి భజన చేసే బ్యాచ్కు పెత్తనం అప్పజెప్పడం.. ఆపే వారికి మాత్రమే భూ కేటాయింపులు చేసే ప్రయత్నాలు చేయడం వంటివి జరిగిపోయాయి. భూములు పొందిన వారు అక్కడ సినీ పరిశ్రమ బాగు కోసం కాకుండా వారి స్వలాభం కోసమే ఉపయోగించుకున్నారు.విశాఖలో స్టూడియోలు, ఇల్లు నిర్మాణలకు స్థలాల కేటాయింపు విశాఖలో చిత్ర పరిశ్రమకు పెద్దపీట వేయాలని అధికారంలోకి వచ్చిన రోజు నుంచే జగన్ ప్రభుత్వం అడుగులేసింది. విశాఖకు రావాలని సినీ ఇండస్ట్రీ పెద్దలను ప్రత్యక్షంగానే సీఎం జగన్ కోరారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు,ప్రభాస్,రాజమౌళి, ఆర్. నారాయణ మూర్తి, కొరటాల శివ వంటి వారితో సినిమా పరిశ్రమ గురించి చర్చించారు. అపై ఇక్కడే స్టూడియోలు నిర్మించాలని ఆయన కోరారు. అలా ఎవరైనా ముందుకు వస్తే వారికి భూములు కేటాయిస్తామని ఆయన ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. ఈమేరకు విశాఖలో స్టూడియోల నిర్మాణాలకు ప్రభుత్వం సహకరిస్తుందని అప్పట్లో ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని బహిరంగానే ప్రకటించారు.సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్లకు అనుమతులను మంజూరు చేశారు. ఏపీలో షూటింగ్ జరుపుకుంటున్న పలు టాలీవుడ్ చిత్రాలు ప్రభుత్వం నుంచి ఇతర ప్రోత్సాహకాలను కూడా అందుకుంటున్నాయి. విశాఖలో సినీ ప్రముఖులు ఉంటామంటే ఇళ్ళ స్థలాలు కూడా ఇస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు. ఆ విధంగా వారు నివాసాలు ఏర్పాటు చేసుకుని ఇక్కడ సినీ కార్యకలాపాలు మొదలుపెడితే విశాఖలో మరో ఫిలిమ్నగర్, జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాలు తయారవుతాయని జగన్ చెప్పిన విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భీమిలి బీచ్రోడ్డు నిడిగట్టు పంచాయతీలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు 316 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఆ భూములు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఉపయోగిస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే..సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపుపై కీలక నిర్ణయంసినిమా టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. అదీ కూడా సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించి, రూపొందించిన నిబంధనలే. సినిమా టికెట్ల రేట్లను తొలి వారం, పది రోజులపాటు పెంచడానికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు 2022 ఏప్రిల్ 11న ఒక మెమో కూడా జారీ చేసి ఆ ప్రకారం హీరో హీరోయిన్, డైరెక్టర్ల పారితోషకాలు కాకుండా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చు కలిపి ఒక సినిమాకు బడ్జెట్ రూ.100 కోట్లు దాటాలి.ఆ సినిమా షూటింగ్లో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్లో చేయాలి. సినిమా నిర్మాణ వ్యయానికి సంబంధించిన అఫిడవిట్ను సమర్పించాలి. దాన్ని చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ధ్రువీకరించాలి. సినిమా నిర్మాణానికి చేసిన చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ/ ట్యాక్స్ రిటర్న్లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు సమర్పించాలి. మొత్తం ఇలా 12 రకాల సాధారణ పత్రాలను సమర్పించాలని నిబంధనలను ఏపీ ప్రభుత్వం పెట్టింది.అలా నిర్మించిన సినిమాలకు మాత్రమే ఏపీలో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు వచ్చేలా నిబంధనలు పెట్టింది. లేదంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్ల రేట్లు ఉండాల్సిందే. ఇందులో భాగంగా బెనిఫిట్ షోలను కూడా రద్దు చేసింది. బెనిఫిట్ షోల పేరుతో ప్రజల డబ్బుల్ని దళారుల రూపంలో దోచుకుంటున్న వ్యవస్థను క్లోజ్ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై సామన్య ప్రజల నుంచి సానుకూలత లభించింది. సినిమా టికెట్ల రేట్లు తగ్గించిన తర్వాత కొందరు హీరోలు సైతం వారి స్వలాభం కోసం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన విషయం తెలిసిందే. టికెట్ల ధరలు తగ్గించడం వల్ల చిన్ని సినిమాలకు మేలు జరుగుతుందని పలువురు నిర్మాతలు బహిరంగంగానే ఒప్పుకున్నారు. సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉంటే సినిమా చూసేందుకు మరికొందరు థియేటర్కు వస్తారు.. లేదంటే ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దాంలే అని ఆలోచించడం సహజం.ఆన్లైన్ టికెట్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయంఆన్లైన్ టికెట్ల యవ్వారంలో గోల్మాల్ సాగుతోందని చాలా ఏళ్ల నుంచి విమర్శలు ఉన్నాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే సమయానికి ఏపీలో డిస్ట్రిబ్యూషన్ మాఫియా బలంగా ఉంది. చిన్న సినిమాలను బతకనివ్వడం లేదు. ఎంతసేపూ పెద్ద హీరోలు, పెద్ద సినిమాలే. ఏపీలో షూటింగులు చేయడం లేదు. ఎపీలో చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎటువంటి యాక్టివిటీ లేకుండా పోయింది. దీంతో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ వ్యవస్థపై గురిపెట్టారు. ఓ నిర్ణయం తీసుకున్నారు.తెలుగు సినిమాల్లో ఎంత పెద్ద సినిమా అయినా కానివ్వండి ఏపీలో షూటింగ్ జరగాల్సిందే అని కొన్ని షరతులు తీసుకురావడం జరిగింది. రైల్వే ఆన్లైన్ ట్రాకింగ్ లాగే సినిమా టికెట్లకూ ఓ పద్థతి ఉండాలని ఆయ సంబంధించిన శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు బుక్ మై షో వంటి ప్రైవేటు ప్లాట్ఫాంల ద్వారా ఇప్పటివరకు సాగిన ఆన్లైన్ టికెట్ అమ్మకాలు కుదరదు. సినిమా థియేటర్లతో పాటు ప్రైవేటు సంస్థలు సైతం ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ ప్లాట్ఫాం(గేట్వే) ద్వారానే టికెట్లు విక్రయించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసింది.ఈ విధానంలో ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ ఎగరగొట్టడం వంటివి జరగవు. దీంట్లో ప్రభుత్వానికి మాత్రమే కాకుండా సినిమా రంగానికి కూడా మంచిదేనని అభిప్రాయాలు కూడా వచ్చాయి. తప్పుడు కలెక్షన్ల రిపోర్టులు, టికెట్లు కోసేసి, తప్పుడు కలెక్షన్లు చూపించేసి, సినిమాలకు ఇబ్బడిముబ్బడి లాభాలు వచ్చాయిని దొంగ లెక్కలు చూపించి, ఆపైన నిర్మాతల దగ్గర హీరోల రెమ్యూనిరేషన్ భారీగా పెంచేయడం అనే పని ఇకపై జరగదని సినీ ఇండస్ట్రీకి చెందిన వారు తెలిపిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో నిర్వహించగలిగితే, పన్నులు కచ్చితంగా అందడంతో పాటు సినిమా లెక్కలు కూడా కరెక్ట్గా ఉంటాయనేది అందరి ఆలోచనకు తగినట్లు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీనీ పరిశ్రమకు సీఎం జగన్ భరోసా► వైఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని సినీ పరిశ్రమలోని 24 విభాగాలను విశాఖలో స్థిరపడేలా చేస్తే రాష్ట్రానికి, తెలుగు సినీ పరిశ్రమకు మేలు కలుగుతుంది.►విశాఖ పరిసర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో సినీ హబ్ ఏర్పాటు చేసి.. దక్షిణాది సినీ నిర్మాతలందరికీ గమ్యస్థానంగా మార్చేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.►తెలుగు, తమిళ, మలయాళ, ఒడియా, బెంగాలీ చిత్రాల నిర్మాణ కేంద్రంగా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ కలసికట్టుగా ముందడుగు వేయాల్సి ఉంది. ►గతంలో సీఎం జగన్ను కలిసిన సినీ పెద్దలకు అడిగిందే తడవుగా షూటింగులకు అనుమతులివ్వడమే కాకుండా, ఇంకేం కావాలో చెప్పండని సీఎం వైఎస్ జగన్ అడిగి వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ► సినిమా రంగానికి చెందిన వారికి నివాస స్థలాలు ఇస్తామని సీఎం జగన్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. -
CM Jagan: ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రగతిపథంలోనే..
ఆంధ్రప్రదేశ్ విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, కార్మికరంగం.. ఇలా ఏ రంగంలో చూసిన గతంతోపోలిస్తే అభివృద్ధి చెందింది. కొవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నా..ద్రవ్యోల్బణం వెంటాడుతున్నా దేశంలోని కొన్ని రాష్ట్రాలు తిరిగి వాటి పూర్వస్థితి కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నో రంగాల్లో ముందుంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించాలంటే వివిధ శాఖల అనుమతులు అవసరం అవుతాయి. అవి పొందాలంటే యాజమాన్యాలకు కొంత శ్రమతో కూడుకున్న వ్యవహరం. అయితే వీటన్నిటినీ కేంద్రీకృతం చేసి ఇండస్ట్రీయల్ సింగిల్ విండో క్లియరెన్స్ను అమలులోకి తెచ్చిన వాటిల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రం. సోలార్ పవర్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల అభివృద్ధి కోసం రాష్ట్రం ప్రత్యేక చట్టాలను చేసింది. 2023-24 సంవత్సరానికిగాను స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ.14,49,501 కోట్లుగా ఉంది. ఇది చంద్రబాబు పాలన ముగిసిన 2018-19కి గాను రూ.8,70,849 కోట్లుగా ఉండేది. గడిచిన ఈ కొన్నేళ్లలో ఇది దాదాపు 65 శాతం ఎక్కువ. 2021-22లో స్థూల విలువ ఆధారిత (జీవీఏ)వృద్ధి 18.47%గా ఉంది. దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా నాణ్యమైన మౌలిక సదుపాయాలను సృష్టించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అక్టోబర్ 2019 నుంచి మార్చి 2023 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన విదేశీ సంస్థాగత పెట్టుబడులు రూ.6వేల కోట్లు. 2023లో రాష్ట్ర సరుకుల ఎగుమతులు రూ.1.58లక్షల కోట్లు. ఇందులో గరిష్ఠంగా సముద్ర ఉత్పత్తుల వల్ల దాదాపు 13.62% వాటా చేకూరింది. కొత్త పారిశ్రామిక విధానం ద్వారా రూ.22,282.16 కోట్లతో భారీ, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు స్థాపించేలా ప్రభుత్వం కృషిచేసింది. టీడీపీ హయాంలో పరిశ్రమల అభివృద్ధిలో 27వ స్థానానికి దిగజారిన రాష్ట్రం.. ప్రస్తుతం జగన్ పాలనలో మూడో స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్ 2023 నాటికి, ఆంధ్రప్రదేశ్ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 26,675.73 మెగావాట్లు. తలసరి ఆదాయంలో చంద్రబాబు హయాంలో 17 స్థానంలో నిలిచిన రాష్ట్రం ప్రస్తుతం 9వ స్థానానికి ఎదిగింది. చంద్రబాబు ప్రభుత్వకాలంలో కేవలం 34000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4.93లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారు. అందులో 2.13లక్షల శాశ్వత కొలువులు ఉన్నాయి. వ్యవసాయంలో రాష్ట్రం టీడీపీ కాలంలో మైనస్ 6.5శాతంతో అధ్వానంగా మారింది. అదే 2021-22కు గాను 8.2 శాతం వృద్ధి చెందింది. దాంతో వ్యవసాయ వృద్ధిలో దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 2022-23కుగాను వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు రూ.13,640 కోట్లు కేటాయించారు. ఇదీ చదవండి: రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వం.. -
కర్ణాటక రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘చిక్ బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసింది. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది. ప్రమాదంలో గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న మరో వ్యక్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నాం’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మరణం చెందడం ఎంతో కలచివేసింది. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు మన ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుంది.… — YS Jagan Mohan Reddy (@ysjagan) October 26, 2023 కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి -
ఇది మామూలు విషయం కాదు.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్..
ఒక లక్ష్యం, ఒక గమ్యం, ఒక ఆశయం, ఒక విధానం, ఒక మార్గం, ఒక దిశ... ఇవన్ని మనకు జీవితంలో చాలా మంది పెద్దవారు, చాలామంది తత్వవేత్తలు బోధించే పదాలు.. వీటిని ఆచరించడం అందరికి సాధ్యం కాదు. అలా సాధించగలిగినవారు నాయకులు అవుతారు. మార్గదర్శకులు అవుతారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ఒక ప్రజా నాయకుడుగా రూపాంతరం చెందడంలో వీటిలో పలు అంశాలు కీలకంగా కనిపిస్తాయి. ఆయన తన లక్ష్యాన్ని తానే ఎంపిక చేసుకున్నారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అనుసరించిన సంక్షేమ, అభివృద్ది విధానాన్నే ఆశయంగా పెట్టుకున్నారు. ఇంత పట్టుదలతో తన గమ్యం చేరుకున్న నాయకుడిగా, సినీ గ్లామర్ను మించి ప్రజాకర్షణలో సరికొత్త రికార్డును సృష్టించిన అధినేతగా జగన్ పేరు, ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయనపై ఎన్ని కుట్రలు, కుతంత్రాలు జరిగినా తట్టుకుని నిలబడ్డ అతికొద్ది మంది నేతలలో ఆయన ఒకరు. ఆయన వెన్నుపోట్లతోనో, ఎదురుపోట్లతోనో అధికారంలోకి రాలేదు. కేవలం ప్రజలను నమ్ముకుని వారి విశ్వాసాన్ని చూరగొని ముఖ్యమంత్రి అయ్యారు. అనూహ్య పరిస్థితులలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడుగా జగన్ ఎంచుకున్న మార్గం చాలా క్లిష్టతరమైనది, కష్టమైనది. తన దారిలో ముళ్లు ఉంటాయని తెలిసినా, అదే మార్గంలో ఆయన వెళ్లారు. కొండను ఢీకొంటున్నావని సన్నిహితులు హెచ్చరించినా వెనక్కి తగ్గని మనస్తత్వమే ఆయనను విజయతీరాలకు చేర్చింది. అంతా అనుమానించినట్లుగానే ఆనాటి అత్యంత శక్తిమంతమైన నేత సోనియాగాంధీ కక్షకు జగన్ గురి కావల్సి వచ్చింది. ఆమెకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తోడయ్యారు. ఇద్దరు కలిసి కేసులు పెట్టించారు. జైలుకు పంపారు. బెయిల్ రాకుండా పదహారు నెలలపాటు ఉంచగలిగారు. అయినా జైలులో ఉండే తన పవర్ ఏమిటో చూపించారు. 18 ఉప ఎన్నికలు జరిగితే 15 చోట్ల తన కొత్త పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. తద్వారా తనపై ప్రజలలో ఎంత అభిమానం ఉందో చాటిచెప్పగలిగారు. బహుశా రాజకీయాలలోకి వచ్చిన అనతికాలంలోనే ఇంతగా కష్టాలు పడిన నేత దేశంలో మరొకరు ఉండకపోవచ్చు. అయినా ఆయన సాహసంతో నిలబడగలిగారు. ధైర్యంతో పరిస్థితులను ఎదిరించారు. రాష్ట్ర విభజన తర్వాత పరిణామాలలో 2014లో తన పార్టీ అధికారంలోకి రాలేకపోయినప్పుడు పార్టీని ఖతం చేయడానికి కొందరు ప్రయత్నించకపోలేదు. అయినా ఆయన నిలబడి పోరాడారు. 23 మంది ఎమ్మెల్యేలను ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసినా ఏ మాత్రం చలించలేదు. వారిలో నలుగురికి చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇచ్చి అప్రతిష్టపాలైతే, ఆ ఘట్టాన్ని తనకు అనుకూలంగా మలచుకుని మొత్తం ప్రజాభిప్రాయాన్ని తనవైపు తిప్పుకున్నారు. ఆయన వ్యూహకర్త ప్రశాంత కిషోర్ టీమ్ను ఎంపిక చేసుకుని వాస్తవ పరిస్థితికి అనుగుణంగా పావులు కదిపారు. 2017లో ఎన్నికల ఎజెండాను ప్రకటించినప్పుడు ఇదంతా అయ్యేపనేనా?అని అనుకున్నవారే ఎక్కువ మంది ఉంటారు. కాని పాదయాత్ర ద్వారా ప్రజలలోకి వెళ్లి పేదల గుండెల తలుపుతట్టారు. తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో వివరించి వారి మద్దతు కూడగట్టారు. తండ్రి మాదిరి ప్రజాభిమానం చూరగొనాలన్న ఆశయాన్ని పెట్టుకున్న జగన్ ఇప్పుడు తండ్రిని మించిన తనయుడిగా ప్రజల ఆదరణ చూరగొంటున్నారు. ఎన్నికల మానిఫెస్టో ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం అంటే ఆషామాషీ కాదు. అందులోను వ్యతిరేక శక్తులు బలంగా ఉన్నప్పుడు మరీ కష్టం. అందుకే ఆయన ప్రజలలోనే నిత్యం సంచరించి తానేమిటో రుజువు చేసుకున్నారు. 2014 నాటి ఓటమి అనుభవం ఆయనకు విజయసోపానం అయింది. ఎన్నికల వ్యూహాలు ఎంత పదునుగా, ఎంత తెలివిగా ఉండాలో ఆయన నేర్చుకున్నారు. సొంత మామనే పదవి నుంచి పడవేసి, అధికారాన్ని కైవసం చేసుకున్న చంద్రబాబు నాయుడును చాలా మంది వ్యూహరచనలో సిద్దహస్తుడిగా భావిస్తారు. తెరచాటు రాజకీయాలు చేయడంలో కాని, కుట్రలు పన్నడంలో కాని చంద్రబాబు నేర్పరి అని అనుకుంటారు. అప్పటికే 14 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును పదవి నుంచి దించడం అంటే అయ్యే పనేనా అనుకుంటున్న తరుణంలో అదేమీ కష్టం కాదని, కుట్ర రాజకీయాల కన్నా, ప్రజా రాజకీయాల ద్వారానే అది సాధ్యమని స్పష్టమైన అభిప్రాయంతో ముందుకు సాగి తన లక్ష్యాన్ని చేరుకున్న నేత జగన్. అందువల్లే జగన్కు 151 సీట్లతో ప్రజలు పట్టం కట్టారు. సామాజిక సమీకరణలన్నీ తనవైపే ఉండేలా చూసుకున్న అసలైన వ్యూహకర్త ఈయనే అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి అయిన తొలిరోజే తాను ప్రభుత్వ సారధిగా కులం చూడను, మతం చూడను, రాజకీయ పార్టీని చూడను, ప్రాంతాన్ని చూడను, అర్హులైన ఎవరికైనా ప్రభుత్వ స్కీములు వర్తింప చేస్తానని చెప్పి అదే పద్దతి పాటిస్తున్న నేత జగన్. ఆయన ముఖ్యమంత్రి అవడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ప్రభుత్వాన్ని నడపడం మరో ఎత్తుగా ఉంది. తన ఎన్నికల మానిఫెస్టోని మంత్రులు, అధికారుల ముందు దానిని అమలుపర్చాల్సిందేనని స్పష్టంగా చెప్పారు. ఎన్నికల మానిఫెస్టోని వెబ్సైట్ల నుంచి తొలగించిన టీడీపీకి, తన వైఎస్సార్కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యత్యాసం ఏమిటో ఆయన అందరికి తెలిసేలా చేసి చూపించారు. అంతేకాదు. ప్రతిపక్ష టీడీపీ వారు న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నా, ఎక్కడా వెనుకడుగు వేయకపోవడం విశేషమే. గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నన్ని మార్పులను పాలన వ్యవస్థలో తీసుకు వచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డిది. వలంటీర్ల వ్యవస్థను సృష్టించారు. గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పి ప్రజల గడపవద్దకు పాలనను చేర్చిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే. గతంలో టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను వేధిస్తే, జగన్ అలాంటివేమీ లేకుండా, ఏ స్కీము ప్రయోజనం అయినా లబ్దిదారుల ఖాతాలలోకి వెళ్లేలా చేయడంలో సఫలం అయ్యారు. తత్ఫలితంగా సంక్షేమ పదకాల అమలులో అవినీతి లేకుండా చేయగలిగారు. అది సరికొత్త రికార్డు అని చెప్పాలి. ఇలా ఒకటేమిటి!. రైతు భరోసా కేంద్రాలు, విలేజీ క్లినిక్స్, స్కూళ్ల లో నాడు-నేడు, ఆంగ్ల మీడియంలో బోధన, విద్యాదీవెన, గోరుముద్ద, సిబిఎస్, ఈ విధానం, ఆస్పత్రులలో నాడు-నేడు, పల్లెలకు డాక్టర్ లు, ఆరోగ్యశ్రీలో చికిత్సకు అర్హమైన వ్యాధుల సంఖ్యను 3వేలకు పైగా పెంచడం, చేయూత, వృద్దులకు పెన్షన్ పెంచడమే కాదు. ప్రతి నెల మొదటి రోజే వలంటీర్లే ఇళ్లకు వెళ్లి అందించడం అంటే మామూలు విషయం కాదు. చదవండి: పేదోడి కోసం ఓ సీఎం ఇంతలా పరితపిస్తారా? అది జగన్ సాధించారు. కేవలం సంకల్ప బలంతోనే ఆయన చేయగలిగారు. అభివృద్దిపరంగా చూస్తే గతంలో ఏ సీఎం దృష్టి కేంద్రీకరించని తీర ప్రాంత అభివృద్దిని ఆయన తలపెట్టారు. పోర్టులు, పిషింగ్ హార్బర్లు, పలు పరిశ్రమలు రావడానికి వీలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ ఒన్ స్థానం, కొప్పర్తి పారిశ్రామికవాడ, వేల కోట్ల విలువైన గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, విశాఖలో ఐటి అభివృద్ది, ఆదాని డేటా సెంటర్ ఏర్పాటు యత్నాలు మొదలైవన్ని ఆయన చేపట్టారు. ఇవన్ని పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల జగన్ మరోసారి విజయం సాధించవలసిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తుంది. జగన్ ఎంత బలంగా ఉన్నారంటే ఒంటరిగా పోటీచేస్తే ఆయనను ఏమీ చేయలేమని ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు బహిరంగంగానే ఒప్పుకుంటున్నాయి. ఎలాగొలా పొత్తులు పెట్టుకుని ఫైట్ ఇవ్వాలని ఆ పార్టీలు యత్నిస్తున్నాయి. ప్రజలలో ఆయనను వ్యతిరేకించేవారు సైతం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారనే భావిస్తున్నారు. దానికి కారణం ఆయా వర్గాలలో ముఖ్యంగా పేదలలో ఆయన ఆపారమైన అభిమానం చూరగొన్నారు. పేదవర్గాలకు,పెత్తందార్లకు మధ్య పోటీ అన్న నినాదాన్ని ఆయన తీసుకువచ్చారు. జగన్ గెలిస్తేనే తమకు సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతాయని పేదలు భావిస్తున్నారు. ఇలా తనదైన శైలిలో ముఖ్యమంత్రిగా పదవి నిర్వహిస్తున్న ఆయనకు సవాళ్లు లేవని అనజాలం. మూడు రాజధానుల అంశం, ఆర్ధిక ఇబ్బందులు మొదలైవని ఉన్నా, జనంలో తీరుగులేని నేతగా జగన్ ఎదిగారు. ఆయనకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
జగనన్న బర్త్డే వేడుకలు నిర్వహించిన పుష్ప శ్రీవాణి (ఫొటోలు)
-
కొత్త శకానికి నాంది
సాక్షి, నరసరావుపేట: ‘ఇది కొత్త శకానికి నాంది పలికిన రోజు. మన విద్యార్థులు పోటీతత్వంతో ప్రపంచ వ్యాప్తంగా రాణించాలి. సీఎం జగన్ ఆలోచనలకు దిక్సూచిలా, రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలి’ అని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో బుధవారం ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ ట్యాబ్లు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగనన్న హయాంలో నిలదొక్కుకున్న భావి భారత పౌరులమని గర్వంగా చెప్పుకునేలా నిలవాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, నెల్సన్ మండేలా ఆలోచనా విధానాలు, ఆదర్శాలకు ప్రతిరూపం సీఎం జగన్ అని అన్నారు. థ్యాంక్యూ మామా..! జగన్ మామా.. హ్యాపీ బర్త్ డే. గత మూడేళ్లుగా విద్యా వ్యవస్థలో మీరు తెచ్చిన మార్పులను ప్రత్యక్షంగా చూస్తున్నాం. అమ్మ ఒడి పథకం పేద, మధ్య తరగతి విద్యార్థులకు వరం లాంటిది. నాడు నేడు కార్యక్రమం, ఇంగ్లిషు మీడియం, ట్యాబ్ల పంపిణీ ఇలా విద్యారంగంలో విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారు. మామా.. «థ్యాంక్యూ.. – సాయి నాగశ్రీ, 8 వ తరగతి విద్యార్థిని, జెడ్పీహెచ్ఎస్ ఐలవరం, వేమూరు నియోజకవర్గం బర్త్డే కానుక.. మామయ్యా.. మీరు సీఎం అయిన తర్వాత నాడు నేడు, అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద లాంటి ఎన్నో పథకాలు తెచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని వసతులు కల్పించారు. పుట్టినరోజు సందర్భంగా మేం మీకు కానుక ఇవ్వాలి. కానీ మీరే మాకు ట్యాబ్లు ఇస్తున్నారు. బాగా చదువుకుని మీ పేరు నిలబెడతాం జగన్ మామయ్యా. – సాత్విక, 8 వ తరగతి విద్యార్థిని, మునిసిపల్ గరల్స్ హైస్కూల్, తెనాలి -
బధిర చిన్నారుల నడుమ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
సాక్షి, పల్నాడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సాగాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగానూ పార్టీ శ్రేణులు, వైఎస్ జగన్ అభిమానుల కోలాహలం స్పష్టంగా కనిపించింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కొణతం సూర్య నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నడికుడిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఫాతిమా హాస్పిటల్లో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. బధిర బాలల నడుమ కేక్ కట్ చేయించిన ఆయన.. సీఎం జగన్ చల్లగా ఉండాలని అక్కడున్న వాళ్లంతా కోరుకున్నారు. -
CM YS Jagan Birthday: " పండుగలా దిగివచ్చాడు " సీఎం వైఎస్ జగన్
-
దటీజ్ సీఎం.. మరోమారు మానవత్వం చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
హ్యాపీ బర్త్ డే సీఎం సార్: ప్రతి పాట సీఎం జగన్ వ్యక్తిత్వం పట్టి చూపేదే
-
హ్యాపీ బర్త్ డే సీఎం సార్: ప్రతి ఒక్కరూ అభివందనం చేయాల్సిందే..
-
Happy Birthday CM YS Jagan: ఎవరైనా జేజేలు కొట్టాల్సిందే..
-
ఏపీ: ఊరువాడా జననేత పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
CM YS Jagan Birthday: చిన్నారులకు ట్యాబ్స్ అందజేసిన సీఎం జగన్
-
అనకాపల్లిలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
-
సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి రోజా
-
సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు
-
సంక్షేమ సారథి జగనన్న: మంత్రి రోజా
సాక్షి, తాడేపల్లి: మహిళా పక్షపాతి.. సంక్షేమ సారథి జగనన్న అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. జగన్ పాలన విలువలు, విశ్వసనీయతతో సాగుతోంది. తనకు ఓటేసిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన చేస్తున్నారు. జగనన్న పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర నలమూలల క్రీడా పోటీలను నిర్వహించాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్నాం. క్రీడా సంబరాలు పెట్టి రూ.50 లక్షలు ప్రైజ్ మనీ అందిస్తున్నాం. వారి టాలెంట్ని గుర్తించి ప్రోత్సాహిస్తున్నాం. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించారు. అందుకే రాష్ట్ర మంతటా పండుగలా జగన్ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు’’ అని మంత్రి రోజా అన్నారు. చదవండి: పెత్తందారుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదవాలా?: సీఎం జగన్ -
తెలుగు మీడియం పేద పిల్లలే చదవాలా..?
-
విద్యారంగంలో ఇది విప్లవాత్మక మార్పు : మంత్రి బొత్స సత్యనారాయణ
-
మళ్ళీ మీరే సీఎం కావాలి జగన్ మామా : విద్యార్థిని
-
CM YS Jagan Birthday Special: వైఎస్సార్సీపీ ప్రపంచ రికార్డ్
-
CM Jagan Birthday: శ్రీకాళహస్తి పట్టణం వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పండగల జననేత జగనన్న జన్మదిన వేడుకలు
-
సీఎం క్యాంప్ ఆఫీస్లో జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
CM YS Jagan Birthday: క్యాంప్ కార్యాలయంలో బర్త్డే వేడుకలు.. కేక్ కట్ చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం జగన్ను వేద పండితులు ఆశీర్వదించారు. సీఎంతో కేక్ కట్ చేయించిన మంత్రులు.. శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్కు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు బర్త్డే విషెస్ చెప్పారు. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. చదవండి: మేనమామ సీఎం జగన్కు చిన్నారుల ప్రత్యేక శుభాకాంక్షలు -
CM YS Jagan Birthday: జగన్ మామకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న విద్యార్థులు
-
CM YS Jagan Birthday: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బర్త్డే వేడుకలు
-
CM YS Jagan Birthday: రక్తదాన రిజిస్ట్రేషన్లలో వైఎస్సార్సీపీ ప్రపంచ రికార్డ్
సాక్షి, తాడేపల్లి: రక్తదాన రిజిస్ట్రేషన్లలో వైఎస్సార్సీపీ ప్రపంచ రికార్డ్సాధించింది. లక్షా 30 వేల మంది రిజిస్ట్రేషన్లతో వరల్డ్ రికార్డ్ సృష్టించింది. 72 వేల నిల్వలతో దక్షిణాఫ్రికా పేరిట గతంలో రికార్డు ఉండగా, దక్షిణాఫ్రికా రికార్డును వైఎస్సార్సీపీ బద్దలుకొట్టింది. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలోనూ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చల్లా మధుసూదన్రెడ్డి, సిబ్బందిని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభినందించారు. చదవండి: ట్విటర్ టాప్ ట్రెండింగ్గా #HBDYSJagan -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ బర్త్డే వేడుకలు
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్వమత ప్రార్థనలతో సీఎం పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 500 కిలోల కేక్ను పార్టీ నేతలు కట్ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, లక్ష్మీపార్వతి కార్పొరేషన్ల ఛైర్మన్లు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎంపీలు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, భరత్, వంగా గీత, తలారి రంగయ్య, రెడ్డప్పా, మాధవ్, గురుమూర్తి, మాధవి, సంజీవ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీధర్, ఆర్. కృష్ణయ్య, ఏపీ భవన్ ఉద్యోగులు, అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చదవండి: ఇండియాలోనే టాప్ ట్రెండింగ్గా -
CM Jagan Birthday: ట్విటర్ టాప్ ట్రెండింగ్గా #HBDYSJagan
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ట్విటర్లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్గా వైఎస్ జగన్ బర్త్డే ఉంది. #HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్తో అభిమానులు దేశ, విదేశాల నుంచి ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 4లక్షల ట్వీట్లు దాటాయి. Happy birthday to a truly magnificent leader @ysjagan anna. Your approach and passion to achieve what you set out to do for the people of Andhra Pradesh are so remarkable. you will be our forever inspiration and we stand by u till our last breath.#HBDYSJagan pic.twitter.com/nDAXudwGvm — Dr.Anil Kumar Yadav (@AKYOnline) December 21, 2022 ఇందులో భాగంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతోపాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. అలాగే ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేపట్టారు. రెడ్క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ట్విటర్లో సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజుకు సంబంధించి మూడు రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని ఇంతకుముందే వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 100K Tweets 🔥#HBDYSJagan pic.twitter.com/Mga1mdzrgP — Kodali Nani (@IamKodaliNani) December 20, 2022 కృతజ్ఞత చాటుకుంటున్న ప్రజలు.. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే నెరవేర్చారు. మూడున్నరేళ్లుగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ (డీబీటీ) రూపంలో రూ.1,77,585.51 కోట్లను జమ చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు, ఆరోగ్యశ్రీ తదితర పథకాల ద్వారా నాన్ డీబీటీ రూపంలో రూ.1,41,642.35 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి ఇప్పటివరకు రూ.3,19,227.86 కోట్లను అందించారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! My heartiest birthday wishes to the young & dynamic @AndhraPradeshCM Sh Y.S. Jaganmohan Reddy. May blessings of Lord Venkateshwara always be upon you, and may you continue to take #AndhraPradesh to new heights of growth & development.#HBDYSJagan pic.twitter.com/9oFhE5yJCN — Parimal Nathwani (@mpparimal) December 21, 2022 వివిధ సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సగటున 89 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. దీంతో లబ్ధిదారులు గత రెండు రోజులుగా జరుగుతున్న సీఎం జన్మదిన వేడుకల్లో భారీగా పాల్గొంటున్నారు. తద్వారా సీఎం వైఎస్ జగన్కు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోమవారం నిర్వహించిన క్రీడల పోటీల్లోనూ.. మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమంలోనూ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చదవండి: (సీఎం జగన్కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు) -
CM Jagan Birthday: ఏపీ సీఎం వైఎస్ జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్న విద్యార్థులు
-
CM YS Jagan Birthday: హ్యాపీ బర్త్డే జగన్ మామయ్య
-
ఢిల్లీ ఏపీ భవన్లో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు..
న్యూఢిల్లీ: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఢిల్లీలోని ఏపీ భవన్లో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, భరత్, వంగా గీత, తలారి రంగయ్య, రెడ్డప్పా, మాధవ్, గురుమూర్తి, మాధవి, సంజీవ్, లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీధర్, ఆర్. కృష్ణయ్య, ఏపీ భవన్ ఉద్యోగులు, అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగాా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. భారత రాజకీయల్లో వైఎస్ జగన్ది ప్రత్యేక స్థానమని కొనియాడారు. ప్రతిపక్షాలు వ్యవస్థలను మేనేజ్ చేసి ఆయనని ఇబ్బంది పెట్టాయని, అయినా వాటిని సీఎం జగన్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమం కోసం నిబద్దతతో పని చేస్తున్నారని చెప్పారు. '2009లో వైఎస్ జగన్ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆయన వ్యక్తిత్వంతో పార్టీ నిలబడింది. వైఎస్ కుటుంబంతో నాది మూడు తరాల అనుబంధం. సీఎం జగన్ వందేళ్లు చల్లగా జీవించాలి. ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలన చేయాలి' అని విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి: CM Jagan Birthday: ఊరూవాడా సీఎం జగన్ జన్మదిన వేడుకలు -
సీఎం జగన్కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రధాని ట్వీట్ చేశారు. సీఎం జగన్కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు కేంద్రమంత్రులు సీఎంకు బర్త్డే విషెస్ తెలిపారు. ఏపీవ్యాప్తంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు వేడుకలు, సేవా కార్యక్రమాలు చేపట్టాయి. నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, అన్నదానం, క్రీడా పోటీలు, కేక్ కటింగ్లతో కోలాహలంగా సంబరాలు జరుపుతున్నారు. చదవండి: AP CM YS Jagan: ప్రజా యోధుడు.. Best wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu on his birthday. May he be blessed with a long and healthy life. — Narendra Modi (@narendramodi) December 21, 2022 -
CM YS Jagan Birthday Special: జన హృదయనేత జగనన్న
-
CM YS Jagan Birthday Special: నడిపించే జన నాయకుడతడే!
-
CM Jagan Birthday Special Photos: సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు.. ప్రత్యేకం( ఫొటోలు )
-
HBDYSJagan: నేటి రాజకీయాల్లో ఓ సంచలనం వైఎస్ జగన్
ఓ సాహసి.. ఓ స్వాప్నికుడు.. ఓ దార్శనికుడు రాజకీయాల్లో కొత్త ఒరవడి వైఎస్ జగన్.. తెలుగు వారి ఆత్మబంధువు ప్రతి పల్లెగడపా కళకళలాడాలి. చదువులమ్మ ప్రాంగణాలు వెలగాలి. అందరికీ ఆరోగ్యశ్రీ.. అందాలి ప్రజాసంక్షేమం.. రాష్ట్రాభివృద్ధే శ్వాసగా.. ధ్యాసగా.. ముందడుగులేస్తున్న పీపుల్స్ లీడర్పై ప్రత్యేక కథనం.. జగన్...జగన్...జగన్ ఈ రోజు ఇటు ప్రతిపక్షల్లోనూ, అటు ప్రజల్లోనూ ప్రతి రోజూ ప్రతిధ్వనిస్తున్న పేరు. ఆ పేరంటేనే ఓ సంచలనం. ఆ పిలుపంటేనే ఓ ప్రభంజనం. సకల వర్గాల ప్రజలతో మమేకమవుతున్న వై.ఎస్. జగన్.. ది యూత్ ఐకాన్. రాజకీయాల్లో ట్రూ లీడర్. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి. డాక్టర్గారి ముద్దుల కొడుకు. రాజారెడ్డిగారి ముద్దుల మనవడు. ఆ తర్వాత ఎమ్మెల్యే కొడుకు. తర్వాత మంత్రి కొడుకు. చాలాకాలం ప్రతిపక్షనాయకుడి కొడుకు. వ్యాపారరంగంలో సాధించిన విజయాలను ముఖ్యమంత్రి వారసుడనే మబ్బు కమ్మేసింది. నడుస్తున్న రాజకీయచరిత్రలో తిరుగులేని శక్తిగా ఎదిగిన వై.ఎస్.జగన్ తనకు తానే సాటి. ఆయనకు ఎవరూ సరిలేరు. సరికారు. 1972 డిసెంబర్ 21. వైయస్ జగన్ పుట్టిన సంవత్సరం. సరిగ్గా యాభైఏళ్ల క్రితం కడపజిల్లా జమ్మలమడుగు మిషన్ ఆస్పత్రిలో ఆయన జన్మించారు. పులివెందుల నియోజకవర్గంలో వైయస్ కుటుంబం నివాసం. ప్రాథమికపాఠశాల విద్య వరకు అక్కడే చదువుకున్న జగన్మోహన్రెడ్డి తాత రాజారెడ్డికి ముద్దుల మనవడయ్యారు. తాత సాహసం, ధైర్యం, నమ్ముకున్న వారికోసం గట్టిగా నిలబడ్డడం చిన్ననాడే అలవాటయ్యాయి. జనంలో కలిసిపోవడం.. వారి కష్టనష్టాల గురించి, మంచిచెడుల గురించి మాట్లాడటం మామూలైపోయింది.. జనం మనిషిగా ఎదగడానికి ఆ పులివెందులలోనే బీజం పడింది. చిన్ననాడే నలుగురిని ఆకర్షించే శక్తి వచ్చింది. అది వ్యక్తిత్వబలం. తండ్రి రాజశేఖరరెడ్డి ఒక సంవత్సరం డాక్టర్గా పనిచేశారు. ఒకరూపాయి డాక్టర్గా ప్రజల మన్ననలు అందుకున్నారు. వైద్యసేవలు అందించడంలో అంకితభావంతో పనిచేశారు. ఉన్నట్టుండి రాజకీయాలవైపు అడుగులు వేయాల్సివచ్చింది. మొదటిసారి నిలబడ్డ ఎన్నికల్లోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఓటమన్నది తెలియకుండా పోయింది. కొంతకాలం మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్యేగానే కాకుండా ఎంపీగా కూడా చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా విలక్షణమైన పాత్ర పోషించారు. తండ్రి రాజకీయజీవితం కూడా వైఎస్జగన్పై ప్రభావం చూపడం మొదలైంది. రాజకీయనాయకుడు కావాలన్న పెద్ద లక్ష్యం ఏర్పడకున్నా, ప్రజాసంబంధాలు నెరపడంలో తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఆ తర్వాత డిగ్రీ ప్రగతి మహావిద్యాలయలో డిగ్రీ చేసిన జగన్ ఎన్సీసీలోనూ ఉన్నారు. వై.ఎస్ జగన్. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఐదేళ్ల తర్వాత, కాంగ్రెస్పార్టీని రెండోసారి అధికారంలోకి తెచ్చి, అనితరసాధ్యుడైన రాజకీయనాయకుడిగా ఎదిగిపోయారు వైయస్సార్. కానీ దురదృష్టవశాత్తు ఆకస్మికమరణంతో ఆయన దూరమైపోయారు. వైయస్జగన్ ఒంటరిగా మిగిలిపోయారు. ఇంటి పెద్ద ఆయనే అయ్యారు. తండ్రి రాజకీయాల్లో వున్నప్పుడే కుమారుడిని ప్రజలకు పరిచయం చేశారు. స్వంతపార్టీలో ఇబ్బందులు, తండ్రి మరణం తర్వాత ఆగిన గుండెలు, పోయిన ప్రాణాల కుటుంబాలకోసం తలపెట్టిన ఓదార్పు యాత్రకు సైతం ఆటంకాలు ఎదురవడం జగన్ను కలవరపెట్టాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇచ్చిన మాట తప్పని నైజం...వెనుకడుగువేయడానికి ససేమిరా అంది. ఇక రాజకీయాల్లో జగన్ ప్రస్థానం మొదలైంది. అలా ఓ అనితరసాధ్యుడి జీవితం ఊహించని మలుపుతో ముందుకు సాగుతూ పోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకేఒక్కడుగా జగన్ చరిత్రకు శ్రీకారం చుట్టుకుంది. బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలున్నవాడు అన్నది మిత్రుల అభిప్రాయం. వైఎస్సార్ కొడుకుగా ఎదుగుదల. అప్పట్నుంచే పరిచయమైన ప్రజాజీవితం. ప్రజాభిమానం పొందడమే గొప్ప వరమన్న సత్యం నాడే తెలుసుకున్నారు. నాన్నాలానే ప్రజాభిమానం పొందాలి. నాన్నలానే ప్రజాసేవలో మునిగిపోవాలి. నాన్నలానే ప్రజానాయకుడిగా ఎదగాలన్న లక్ష్యం ఆయన పరిసరాల ప్రభావమే. నిరంతరం ప్రజల మనిషిగా వున్న వైఎస్సార్ స్ఫూర్తి బలమే. ఒకటా రెండా. తండ్రి నుంచి చాలా లక్షణాలు జగన్ స్వంతమయ్యాయి. ఆయన వారసుడిగా.. వైఎస్సార్ వ్యక్తిత్వబలం కూడా జగన్పై ప్రభావం చూపింది. మరీ ముఖ్యంగా మాటతప్పని.. మడమ తిప్పని నైజం అలవడింది. రాజకీయమంటే ప్రజాజీవితంతో మమేకం కావడమే అన్న వైయస్సార్ లక్షణం జగన్కు పూర్తిగా అబ్బింది. సమకాలీన రాజకీయాలకు పూర్తి భిన్నమైన, విలువలు, విశ్వసనీయత ప్రాతిపదికగా తండ్రీకొడుకులు కొత్తరాజకీయానికి నిర్వచనం చెప్పడం మొదలుపెట్టారు. దాంతో ప్రజాసంక్షేమమే వారికి పరమావధిగా మారింది. కేవలం మనకోసం బతకడమే కాదు, అవతలివాళ్లకోసం కూడా బతకాలి. వాళ్ల జీవితాల్లో కూడా మంచి మార్పు తేగలగాలి. అప్పుడే జీవితానికి అర్థం వుంటుంది అన్నది జగన్ లైఫ్ ఫిలాసఫీ. ఇలాంటి మాటలు వైయస్ నోట తరచూ వినివుండటం వల్లో, నాన్ననడవడికను చూసీచూసీనో, జగన్కు చిన్నప్పటి నుంచి ప్రజలతో ఉండిపోవాలన్న ఉండేది. ఈ లక్షణం వాళ్ల నాన్న వల్లే అబ్బింది అంటుంది జగన్ తల్లి విజయమ్మ. తను రాజకీయాలు తనకు వద్దని చెప్పినా, ఆ మాటలు జగన్ను మార్చలేకపోయాయన్నది విజయమ్మ మాట. ఓ వైపు తండ్రి మాటలు, మరోవైపు తల్లి నేర్పిన విలువల పాఠాలు జగన్ వ్యక్తిగా ప్రత్యేకంగా మార్చాయి. మొత్తం మీద జగన్ రాజకీయాల్లోకి రావాలన్ననిర్ణయం మీద తండ్రి ప్రభావం ఎక్కువేనంటారు విజయమ్మ. రాజశేఖరరెడ్డి మాటలు, ఆయన వ్యవహారశైలి కారణంగా జగన్కు ప్రజాసేవమీద ఆసక్తి పెరిగిందన్నది తల్లి విజయమ్మ అభిప్రాయం. మొత్తానికి తనను తాను జనం మనిషిగా మార్చుకున్నాడు వై.యస్జగన్. అసలు సిసలు ప్రజానాయకుడిగా ఎదిగేందుకు ముందడుగులు వేశాడు. పదేళ్ల రాజకీయపోరాటం. అలుపన్నది తెలీదు. భయమన్నది లేదు. ప్రజలకోసం నడిచారు. నిలిచారు. ప్రజలమధ్య నుంచే ఎదిగారు. విశాలాంధ్రప్రదేశ్ అనుపానులన్నీ అర్థం చేసుకున్నారు. అన్నివర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు అండగా నిలవాలనుకున్న వైఎస్ జగన్.... చిన్నవయసులోనే ప్రజాక్షేత్రంలో అంకితభావంతో నడుస్తూ పోయారు. విజేతగా నిలిచి.. అనితరసాధ్యమైన ప్రజాసంక్షేమపాలనను అందిస్తున్నారు వైఎస్ జగన్. జగన్ రాజకీయప్రవేశం సులువుగా జరిగిపోయివుండవచ్చేమోగానీ, ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం అంత సులువుగా ఏమీ సాగలేదు. తండ్రి మరణం తర్వాత జగన్ ఎదుర్కొన్న అగ్ని పరీక్షలు అన్నీ ఇన్నీ కావు. ఒక దశలో జగన్నే ముఖ్యమంత్రి చేయాలని, కాంగ్రెస్కు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. కానీ అధిష్టానం ఎందుకో ఒప్పుకోలేకపోయింది. అక్కడే కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పడింది మరి!. తండ్రి మరణం తర్వాత పావురాలగుట్టకు వెళ్లిన జగన్కు అక్కడి అశేషజనాన్ని చూడగానే భావోద్వేగం పొంగింది. వారంతా నాన్న తనకిచ్చిన పెద్ద కుటుంబం అనిపించింది. ఆ ప్రజల సమక్షంలోనే వైయస్ మరణానికి తట్టుకోలేక చనిపోయిన వారి ప్రతి కుటుంబాన్ని ఓదారుస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాటపై ముందుకు సాగారు. కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానం కాదుకూడదు అంది. జగన్ వెనక్కు తగ్గలేదు. ఓదార్పు కొనసాగింది. జగన్పై అన్ని రకాల రాజకీయ కుట్రలు, కుతంత్రాలు మొదలయ్యాయి. ఆరోజుల్లో ఓదార్పు యాత్ర దేశ చరిత్రలోనే నభూతో న భవిష్యతి. జగన్ పట్ల జనానికి ఉన్న అభిమానానికి ఆ ఓదార్పు యాత్ర అద్దం పట్టింది. జగన్ యాత్రలకు జనం అంతగా రావటం వెనుక వైఎస్ పథకాలు ఒక కారణం కావచ్చు. తమకు అంతటి మేలుచేసిన వైఎస్ తనయుడి పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు నచ్చకపోవడంతో వైయస్ కుటుంబం పట్ట జనంలో సానుభూతి పెరుగుతూ పోయింది. ఇది కాదనలేని సత్యం. జగన్ పట్టుదల కూడా ఆయన్ను జనంలో తిరుగులేని నేతగా మార్చడంలో ముఖ్యపాత్ర పోషించింది. దేశరాజకీయాల్లోనే వైఎస్ జగన్ పాలన విప్లవాత్మకమైనది అని చెప్పకతప్పదు. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నింటినీ తుచ తప్పకుండా నెరవేర్చాలని కంకణం కట్టుకున్న ఏకైక రాజకీయనాయకుడు వైఎస్ జగన్. కలలోనైనా ప్రజలకిచ్చిన మాట తప్పకూడదన్నది ఆయన సిద్ధాంతం. పారదర్శకపాలన అందించాలన్నదే తపన. చిత్తశుద్దితో సంక్షేమ పథకాల అమలు, దూరదృష్టితో అభివృద్ది ప్రణాళికలు అమలు చేస్తు ముందుకు సాగుతున్న వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రకు దొరికిన ఆణిముత్యం స్వంత పార్టీ పెట్టిన తర్వాత వైయస్ జగన్ దేశచరిత్రలోనే అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత పార్టీని ముందుకు నడపడమే ఏకైక దీక్షగా సాగారు. అదే సమయంలో ఆయన జైలు జీవితం కూడా చూడాల్సి వచ్చింది. జైలునుంచి రాగానే 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ వైఎస్సార్ సీపీ బరిలో నిలిచింది. ఒంటరిగానే ముందుకు సాగింది. కేవలం ఐదులక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది. తర్వాత నవ్వాంధ్ర ప్రదేశ్లో వైఎస్ జగన్ శాసనసభలో ప్రతిపక్షనేతగా వున్నారు. ప్రతిపక్షనేతగా ప్రతిరోజూ ప్రజాసమస్యలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లేవారు. ఆయన మాటలు పట్టించుకునే వారే కరువయ్యారు. చివరాఖరుకు అసెంబ్లీలో మైకు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు అధికారపక్షం. ఇలా కాదనుకున్న వైఎస్జగన్ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలనుకున్నారు. గెలిచిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగుపెడతానని శపథం చేశారు. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. చరిత్రలో నిలిచిపోయిన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్రే నవ్యాంధ్ర చరిత్రను మార్చింది. ఇలా సాగిన ఈ పాదయాత్రే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ పాదయాత్రే వైయస్ జగన్లో మరింతగా రాజకీయ పరిణతి పెరిగేలా చేసింది. ఈ పాదయాత్ర కాలంలోనే వేలకిలోమీటర్లు నడిచిన జగన్ లక్షలాది మంది హృదయాలను సృజించారు. గుండెగుండెను తట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆత్మీయసమ్మేళనాలతో అన్ని వర్గాల, కులాల, మతాల వారి సమస్యలు తెలుసుకున్నారు. తనపై వారికున్న నమ్మకాన్ని గమనించారు. రుతువులు మారినా, వర్షాలు కుమ్మరించినా, ఎండలు మండినా, చలి వణికించినా చలించని జగన్ పాదయాత్ర అనుభవాలతోనే తన పార్టీ మేనిఫెస్టోను రూపొందించుకున్నారు. అందులో ఇచ్చే ప్రతి హామీ నెరవేర్చి తీరాలని తపించారు. ఈ మేనిఫెస్టోనే నేడు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తోంది. విద్య,వైద్యం ఇలా అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. సరికొత్తపాలను చవిచూపిస్తోంది. కులమత, వర్గ, ప్రాంత, పార్టీల కతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగే పాలనకు అసలుసిసలు అర్థం చెబుతోంది. ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల అపార నమ్మకం వున్నవారు ఏపీ సీఎం. వ్యవస్థలను స్వేచ్ఛగా ముందుకు నడిపించగలిగితే.. ప్రజలందరికీ సుపరిపాలన అందుతుంది అన్నది ఆయన విశ్వాసం. విలువలు, విశ్వసనీయతలే నాయకుడిగా వేసే ప్రతి అడుగుకూ సార్ధకత చేకూరుస్తాయని వైఎస్ జగన్ బలంగా విశ్వసిస్తారు. కుల, మత, పార్టీ, ప్రాంతాల కతీతంగా సాగుతున్న వైఎస్ జగన్ పాలన .. దార్శనికుడైన పాలకుడి సమర్ధతను పట్టిచూపుతోంది. అటు మేధావుల్ని, ఇటు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది. 2019 ఎన్నికల్లో జగన్పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కనివిని ఎరుగని రీతిలో మెజారిటీ సీట్లలో గెలిపించారు. మొత్తం 175 స్థానాల్లో వైఎస్సార్సీపి 151 సీట్లలో విజయకేతనం ఎగరేసింది. 25 పార్లమెంటు స్థానాల్లో 22 ఎంపీ సీట్లు వైఎస్సార్సీపీవి అయ్యాయి. ఇంతకన్నా విజయముండునా? ఇంతకన్నా ప్రజవిశ్వాసం గెలుచుకున్న పార్టీ ఉండునా. ఇదంతా ఒకే ఒకడుగా జగన్రెడ్డి సాధించిన విజయం. పొత్తుల్లేవు. ఒకటే గుర్తు.. ఒకటే జెండా.. ఒకడే నాయకుడు అన్నట్టుగా సాగిన 2019 ఎన్నికల్లో ఆ ఒకే ఒక్కడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి. నవ్యాంధ్రలో అన్ని ఎన్నికల్లోనూ రికార్డులు బద్దలు కొట్టిన జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఆరోజు నుంచి ప్రతిరోజు ఆయనకు మేనిఫెస్టోనే ఖురాన్, బైబిల్, భగవద్గీత అయ్యాయి. కలనైనా మరవకూడదన్న ఆలోచన కళ్లెదుటే కనిపించేలా మేనిఫెస్టోను అతికించుకున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆయన ఐదు సంతకాల ప్రాధాన్యత ప్రజల్లో ఆసక్తిని రేపింది. ఒక సగటు కుటుంబం మీద వాటి ప్రభావమెంత, రాష్ర్టప్రగతి దిశలో ఈ కీలక నిర్ణయాలతో ఒనగూరే నిజమైన ఉపయోగం ఏమిటి అన్నదానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అమ్మ ఒడి, సామాజిక పెన్షన్ల పెంపు, ధరల స్థిరీకరణ నిధి, డ్వాక్రా రుణాల మాఫీ, ఊరూరా జనసేవాల కేంద్రాలు ఇవీ ఆయన వాగ్దానాలు. చెప్పినవే కాకుండా చెప్పనవి కూడా ప్రజలకు ఉపయోగపడితే అమలు చేసే జగన్...అటు విద్యారంగంలోనూ ఇటు వైద్యరంగంలోనూ నాడు-నేడును ప్రకటించారు. ఆ వ్యవస్థల రూపురేఖలు పూర్తిగా మార్చేయాలన్న ప్రయత్నాలు శీఘ్రంగా సాగుతున్నాయిప్పుడు. వైఎస్ సంక్షేమ పథకాలన్నింటినీ మళ్లీ సంతృప్త స్థాయిలో నెరవేర్చాలని, వాటిని పటిష్టపరచి, వాస్తవ స్పూర్తితో తు.చ తప్పకుండా అమలు చేయాలనే భావన ముఖ్యమంత్రి వైయస్ జగన్ది. దీంతో పాటు అదనంగా మరికొన్ని పథకాలనూ ప్రవేశపెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. అంటే.. వైఎస్ స్ఫూర్తికి కొనసాగింపు అన్నమాట. మరింత విస్తరణ అన్నమాట. ప్రజాసేవలో నాన్నకన్నా రెండడుగులు ముందుకే వేస్తానన్న మాటలకు అర్థమన్నమాట. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులే తన బలం అని గట్టిగా నమ్మిన వైఎస్జగన్, ఆ విశ్వాసబలంతోనే ముందుకు సాగుతున్నారు. ఎక్కడా తగ్గేదేలా అన్న అపార ఆత్మవిశ్వాసం ఆయనకు మాత్రమే స్వంతం. తన పనితీరే తనకు శ్రీరామరక్ష అని గట్టిగా విశ్వసిస్తున్నారు. తన పాలనను, గత పాలకుడి పాలనను బేరీజు వేసి చూడాలని, తన సంక్షేమపథకాల లబ్ది ఏ మేరకు, ఎంతమందికి, ఎన్ని జీవితాల్లో వెలుగులు నింపుతోందో ఆలోచించమని ఆయన నేరుగా ప్రజలనే కోరుతున్నారు. నిరంతరం ప్రజలకు మేలు చేయడం మినహా మరో లక్ష్యం తనకు లేదని స్పష్టంగా ప్రకటిస్తున్న జగన్ నేటి రాజకీయాల్లో ఓ సంచలనం. -
విజయవాడ: హ్యాపీ బర్త్డే జగనన్న.. భారీ కేక్ కటింగ్ (ఫొటోలు)
-
YS Jagan:కెప్టెన్గా.. అరుదైన ఘనత సొంతం
రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్న నాయకుడు వైఎస్ జగన్.. చదువుకునే రోజుల్లోనూ ఎంతో చరుకుగా ఉండేవాడు. ఆ సమయం నుంచే ఆయనలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కనిపించాయి. అదే ఆయన చేత అరుదైన ఘనతను సాధించి పెట్టాయి. తండ్రి కంటే తాత దగ్గరే జగన్కు చనువెక్కువ. అందుకే స్కూల్లో చదువుతున్న రోజుల్లో కూడా సెలవులొస్తే చాలు పులివెందుల రావడం, తాత వాడే జీపులో ఊరంతా తిరగడం అలవాటుగా ఉండేది. హైదరాబాద్లో ఉన్న తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసేది కాదు. పైగా పులివెందులలోనూ ఒక మిత్రబృందం ఉండేది. వాళ్లందరినీ గుమికూడ్చి క్రికెట్ ఆడడం కూడా ఒక అలవాటుగా మారిపోయింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఐసిఎస్ఐ సిలబస్ కావడంతో.. అక్కడే 12వ తరగతి వరకూ చదివే వెసులుబాటు ఉండేది. అక్కడ చదివినంత కాలం ఏ ఒక్క ఆటకూ పరిమితం కాకుండా క్రికెట్, బాస్కెట్ బాల్ లాంటి రకరకాల ఆటల మీద ఆసక్తికనబరిచేవాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే శ్రీబాగ్ ఇంటి దగ్గర కూడా స్నేహితుల బృందంతో కలిసి క్రికెట్ ఆడేవాడు. చదవులో సగటు విద్యార్థి కంటే కాస్త ఎక్కువ అనిపించుకున్నా, అందరితో బాగా కలిసి మెలసి ఉండటంలో మాత్రం చురుగ్గా ఉండేవాడని స్కూల్ టీచర్లు, సిబ్బంది చెబుతారు. డాక్టర్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న సూరీడు, రోజూ మారుతీ కారులో జగన్మోహన్రెడ్డిన డ్రాప్ చేసి పికప్ చేసుకునేవాడు. నిజానికి మధ్యాహ్నం మూడు గంటలకే క్లాసులు పూర్తయినా, సాయంత్రం దాకా స్కూల్లోనే మిత్రులతో ఉండిపోయేవాడు. అలా హాస్టల్లో ఉండే మిత్రులతో కలిసి ఎక్కువసేపు గడపటానికి జగన్ ఇష్టపడేవాడు. మళ్లీ ఇంటికి వెళ్లగానే చదువు మామూలే. అలా అందరినీ కలుపుకుపోయే నాయకత్వ లక్షణాలుండటం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హౌజ్ కెప్టెన్ అయ్యేందుకు కారణమైంది. స్కూల్లో ఉన్న విద్యార్థులందరినీ నాలుగు హౌజ్లుగా విభజించడం అక్కడ ఆనవాయితీ. వాటికి రెడ్ హౌజ్, బ్లూ హౌజ్, గ్రీన్ హౌజ్, ఎల్లో హౌజ్ అని పేర్లు. ఏ పోటీలు జరిగినా.. ఆ నాలుగు హౌజ్ల మధ్యే జరుగుతాయి. అంటే క్రికెట్ అనగానే ఈ నాలుగు జట్ల మధ్య జరిగే పోటీలో విజేతను నిర్ణయిస్తారు. అదే విధంగా ఖో ఖో, బాస్కెట్ బాల్.. ఏదైనా అంతే. ఆటలతో పాటు వక్తృత్వం, వ్యాసరచన లాంటి పోటీలూ జరుగుతాయి. ఏటా జరిగే ఈ పోటీల్లో ఆల్ రౌండ్ చాంపియన్షిప్ సాధించడం ఒక ప్రతిష్టాత్మకమైన విషయం. 12వ తరగతిలో ఉన్నవాళ్లకి మాత్రమే హౌజ్ కెప్టెన్సీ దక్కుతుంది. అలా.. జగన్ 12వ తరగతిలో ఉన్నప్పుడు రెడ్ హౌజ్కు కెప్టెన్ అయ్యాడు. పైగా ఆ సంవత్సరం తన హౌస్కు ఆల్ రౌండ్ ఛాంపియన్షిప్ సాధించిన ఘనత కూడా దక్కించుకున్నాడు. అంతకు ముందుగా పదేళ్లుగా రెడ్ హౌజ్కు దక్కని గౌరవం.. జగన్ ఉన్నప్పుడే దక్కిందని మిత్రులు చెప్తుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. జగన్మోహన్రెడ్డి కంటే ముందు రెడ్ హౌస్ కెప్టెన్గా వ్యవహరించింది చెన్నారెడ్డి మనవడు ఆదిత్యరెడ్డి(శశిధర్ రెడ్డి కుమారుడు). హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆదిత్యరెడ్డి 12వ తరగతి చదువు, రెడ్ హౌస్ కెప్టెన్సీ ముగిసిన సంవత్సరమే చెన్నారెడ్డి సీఎం పదవి నుంచి దిగిపోయారు. ఆ సంవత్సరం ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అవుతారనుకున్న రాజశేఖర్రెడ్డి కాలేకపోయారుగానీ, ఆదిత్యరెడ్డి స్థానంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రెడ్ హౌస్ కెప్టెన్ పదవి మాత్రం జగన్మోహన్రెడ్డిని వరించింది. :::సీఎం జగన్ పుట్టినరోజు ప్రత్యేకం సంగ్రహణ: యువకెరటం(ఎ.ఎస్.ఆర్.మూర్తి, బుర్రా విజయశేఖర్) -
హ్యాపీ బర్త్డే సీఎం సార్.. 600 కేజీల భారీ కేక్ కట్ చేసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 600 కేజీల భారీ కేక్ను వైఎస్సార్సీపీ నేతలు కట్ చేశారు. ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. మైలు రాయి సెంటర్ జగ్జీవన్ రాం విగ్రహం నుంచి గ్రామ సచివాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు, సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు , కైలే అనీల్ కుమార్, ఎంపీ నందిగం సురేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహల్లా, ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతం రెడ్డి, కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
AP CM YS Jagan: ఒకే ఒక్కడై విజేతగా.. జగన్ అంటే సాహసం..
పువ్వుపుట్టగానే పరిమళిస్తుంది అన్నది ఓ నానుడి. మనిషి జీవితంలోనూ బాల్యంలోనే అతని భవిష్యత్తు కనిపిస్తుందన్నది ఒక నమ్మకం. ఒక నిజం. వైయస్ జగన్ విషయంలో ఈ విషయం సుస్పష్టం. ఆయనలో నాయకత్వ లక్షణాలు చిన్ననాడే, విద్యార్థిదశలోనే కనిపించాయి. విలువలు, ఆదర్శాలతో కూడిన జీవితాన్ని గడపాలన్న లక్ష్యంగా ఎదిగారు జగన్. అనుకున్నది సాధించే క్రమంలో చూపే పట్టుదల రాజకీయాల్లోనూ చూపారు. ఒకే ఒక్కడై విజేతగా నిలిచారు. ప్రాథమిక విద్య ఒకటిరెండు తరగతుల తర్వాత పులివెందుల నుంచి వైయస్ జగన్ చదువు హైదరాబాద్కు మారింది. హైదరాబాద్ పబ్లిక్స్కూల్లో ఆయన ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నారు. ఆ రోజుల్ని, ఆయనతో గడిపిన క్షణాల్ని ఇప్పటికీ గర్వంగా గుర్తుచేసుకుంటూ వుంటారు మిత్రులు. జగన్ అన్నివేళలా ఇన్స్ఫయిరింగ్ క్యారెక్టర్ అని చెబుతుంటారు. జగన్ అంటే ధైర్యం. జగన్ అంటే సాహసం. జగన్ అంటే ఒక విశ్వాసం. జగన్ అంటే స్నేహస్వభావం. జగన్ అంటే సాయపడే తత్వం. ఇది ఆయనపై మిత్రుల అభిప్రాయం. - వరప్రసాద్, జగన్ క్లాస్మేట్ - వెంకటన్న, జగన్ సహవిద్యార్థి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జగన్లోని నాయకత్వ లక్షణాలను పెంచింది. అక్కడ ఆయన ఎన్సీసీలోనూ ఉన్నారు. క్రమశిక్షణకు మారుపేరయిన ఆ స్కూలు, వైఎస్ జగన్పై చాలా ప్రభావాన్నే చూపింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూలు చదువు తర్వాత వైయస్ జగన్మోహన్రెడ్డి కోటీలోని ప్రగతి మహావిద్యాలయంలో బికాం డిగ్రీ చదివారు. ఈ మూడేళ్ల డిగ్రీ చదువులో ఆయనకు స్నేహితులుగా వున్నవారు, నేటికీ జగన్రెడ్డిని గుర్తు చేసుకుంటూనే వున్నారు. నాడు ప్రగతి మహావిద్యాలయలో పనిచేసిన లెక్కరర్లు కూడా జగన్ కాలేజీలో గడిపిన నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటుంటారు. విద్యార్థిగా ఆయన నడక, నడత బావుండేవని అంటున్నారు. - రమేష్, స్కూల్మేట్ - ప్రవీణ్, క్లాస్మేట్ - చంద్రకాంత్ నాయక్, క్లాస్మేట్ ఆ తర్వాత వైఎస్ జగన్ ఎంబీఏ నిమిత్తం లండన్ వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చిన అనంతరం బెంగళూరులో వ్యాపారాలు మొదలుపెట్టారు. సూక్ష్మగ్రాహి కావడం, ప్రతి విషయాన్ని డిటైల్డ్గా తెలుసుకోవడం, అనుకున్నది సాధించేంతవరకు శ్రమించడం అనే లక్షణాలు ఆయనను బిజినెస్లో సక్సెస్ అయ్యేలా చేశాయి.బ్రిలియెంట్, డేరింగ్, వాల్యూబేస్డ్ పర్శనాలిటీ వున్న స్టూడెంట్ అని నాటి నుంచి జగన్కు మంచి పేరుంది. - కృష్ణమోహన్ నాయుడు -
బిజినెస్లో ఆయనో సక్సెస్ పాఠం.. దార్శనికుడిగా పరిశ్రమలకు ఊతం
చదువు పూర్తవగానే బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాజకీయాల కన్నా చాలా ముందే ఆయన వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అక్కడా అదే పట్టుదల, ప్రతి విషయం తెలుసుకోవాలనే శ్రద్ధ, ఏకాగ్రత, సక్సెస్ కావడమే లక్ష్యం. లక్ష్యసాధన దిశలో ఆయన ఎంత కష్టానికైనా సిద్ధమయిపోయారు. కష్టపడ్డారు. విద్యుత్, సిమెంట్, మీడియా రంగాల్లో అనితర సాధ్యమైన విజయాలు సాధించారు. ఆ క్రమంలో ఆయన దార్శనికత బాగా ఉపయోగపడింది. ముందుచూపుతో కూడిన నిర్ణయాలు కార్పొరేట్ రంగంలో ఆయననొక ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. ఆయన్ను సన్నిహితంగా గమనించిన కార్పొరేట్ రంగ నిపుణులు, కంపెనీల యజమానులు అదే విషయాన్ని పదేపదే చెబుతుంటారు. ఆషామాషీగా వ్యాపార రంగంలోకి దిగలేదు.. వైఎస్ జగన్ ఏదో ఆషామాషీగా వ్యాపార రంగంలోకి రాలేదు. అప్పుడాయనకు రాజకీయాలు ప్రయారిటీ కూడా కాదు. డీప్ స్టడీతో, లోతైన అవగాహనతోనే ఆయన బిజినెస్ రంగంలోకి దిగారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనించారు. ప్రశ్నలు వేసి మరీ తెలుసుకున్నారు. ఆయన ప్రతి విషయాన్ని డీప్గా తెలుసుకుని నిపుణుల్ని అడిగేవారు. బిజినెస్ రంగంలో ఆయనకున్న అపారజ్ఞానం వల్లే ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేడు ఏపీ ముందంజలో వుంది. ఏ పరిశ్రమలు ఎక్కడ అవసరం, ఎక్కడి పరిస్థితులు అనుకూలం, ఏ ప్రాంతానికి ఉపయోగం అన్న విషయాలను గమనింపులోకి తీసుకునే సీఎంగా పారిశ్రామిక విధానం తెచ్చారు. - చావా సత్యనారాయణ, ల్యారస్ ల్యాబ్ సీఇవో భారతి సిమెంట్స్ బెస్ట్ ఎగ్జాంఫుల్ జగన్గారు గొప్ప విజనరీ అని చెప్పడానికి భారతి సిమెంట్స్ బెస్ట్ ఎగ్జాంఫుల్. ఆ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు మేము ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొన్నాం. సాంకేతికత విషయంలో జగన్ది రాజీలేని ధోరణి. రీసెర్చ్ ఓరియెంటెడ్ మెంటాలిటీ. ఉపాధి అవకాశాల కల్పన జగన్గారి ప్రయారిటీ అంశం. భారతీ సిమెంట్స్ ఈరోజు సక్సెస్పుల్ వెంచర్ కావడానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగన్ గారే అంటారు -రవీందర్రెడ్డి, భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ లోతుగా తెలుసుకుంటారు.. జగన్ గారు సిమెంట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టేముందు వైఎస్సార్ గారి ద్వారా నాకు పరిచయమయ్యారు. తనకు ఏమీ తెలీదన్న జగన్.. చెప్పిందంతా ఎంతో శ్రద్దగా విన్నారు. మరోసారి చెప్పించుకున్నారు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఏ విషయాన్నయినా ఎంత లోతుగా తెలుసుకుంటే అంత మేలన్నది జగన్ స్వభావమని. పరిశ్రమల విషయంలో ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అందుకే నేడు ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాల విషయంలో గొప్ప పేరు తెచ్చుకుంటూనే, దార్శనికుడిగా పరిశ్రమలకు ఊతమిస్తున్నారు. జగన్ హయాంలో కచ్చితంగా పారిశ్రామిక రంగం అభివృద్ది శిఖరాలు చేరుకుంటుందని నాకు గట్టి నమ్మకం. ప్రసాదరెడ్డి, బిజినెస్ వ్యవహారాల నిపుణుడు అది సామాన్యమైన విషయం కాదు ఆంధ్రప్రదేశ్లో పారదర్శకంగా, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. కరోనా మహమ్మారి సవాళ్లను అధిగమించి, పారిశ్రామికాభివృద్ధి సాధించడమన్నది సామాన్యమైన విషయం కాదు. అది ఏపీలో సీఎం జగన్ సాధించి చూపారని సాగర్ సిమెంట్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. 2019 జూన్ నుండి 2022 జూన్ వరకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. మూడేళ్లలో 30వేల 645 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. మూడేళ్లలో రూ.47వేల కోట్ల 662కోట్ల పెట్టుబడుల సమీకరణ జరిగింది. (YS Jagan పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం) -
తొలి రోజు ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
సాక్షి, విశాఖపట్నం/రేణిగుంట/సూళ్లూరుపేట: ఈ నెల 21న సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని మూడురోజులపాటు నిర్వహిస్తున్న వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలిరోజు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహింరు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్బాబు ప్రారంభించారు. అలాగే వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కోకో, త్రోబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. గాజువాక, భీమిలి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తిప్పలనాగిరెడ్డి, ముత్తంశెట్టి శ్రీనివాస్ క్రికెట్ పోటీలను నిర్వహించారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అడారి ఆనంద్కుమార్ నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని పంచకర్ల రమేష్బాబు ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ‘నవరత్నాలు– సంక్షేమపథకాలు’ పేరిట విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల్లో కబడ్డీ, హాకీ పోటీలను ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో పలుచోట్ల క్రీడా పోటీలు జరిగాయి. వీటిని ఎమ్మెల్యేలు చెట్టి పాల్గుణ, కె.భాగ్యలక్ష్మి, నాగులాపల్లి ధనలక్ష్మి ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎంపీ మార్గాని భరత్రామ్ మధురపూడి విమానాశ్రయంలో కేక్ కట్ చేశారు. అనపర్తి, గోపాలపురం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు క్రీడా పోటీలను నిర్వహించారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి వందమంది చిరు వ్యాపారులకు తోపుడుబండ్లను అందజేశారు. సూళ్లూరుపేటలో ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ముగ్గులతో సీఎం జగన్ చిత్రాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. నేడు, రేపు పలు కార్యక్రమాలు సాక్షి, అమరావతి: ఈ నెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 20న మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, కుల సంఘాల ప్రతినిధులతో ‘జగనన్న పరిపాలన.. రాష్ట్ర సంక్షేమం–అభివృద్ధి’పై చర్చ ఉంటుంది. ఇదే రోజు ముందస్తు జన్మదిన వేడుకలు కూడా నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 21న రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో రెడ్క్రాస్ సంస్థతో కలిసి పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను పార్టీ నిర్వహించనుంది. అనాథ, వృద్ధాశ్రమాల్లో పండ్లు, దుస్తుల పంపిణీ, అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టనుంది. అలాగే మహిళలకు పలు అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. పుట్టినరోజు వేడుకల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజలు, ముఖ్యంగా మహిళలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయనున్నారు. ఇప్పటికే సీఎం జన్మదిన వేడుకలు సోమవారం ప్రతి నియోజకవర్గ పరిధిలో ప్రారంభమయ్యాయి. గతేడాది సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా 38 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి రికార్డు సృష్టించారు. ఇది ఎందరినో అత్యవసర సమయాల్లో ఆదుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించనున్నారు. ఇలా సేకరించిన రక్తాన్ని భద్రపరిచి అవసరమైన రోగులకు అందిస్తారు. అలాగే రక్తదాతల నుంచి ప్లెడ్జ్ ఫామ్స్ సేకరించి రోగులకు అత్యవసరమైన సందర్భాల్లో రక్తం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ‘టేక్ ద ప్లెడ్జ్.. సేవ్ ఏ లైఫ్’ అనే నినాదంతో.. రక్తదానం చేయడానికి సుముఖంగా ఉన్నవారిని ysrcpblooddonation.comలో నమోదు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు పేర్లు నమోదు చేసుకోవచ్చు. డ్వాక్రా, మహిళా, కుల, ప్రజాసంఘాలు, మేధావులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులను భాగస్వాములను చేస్తూ సీఎం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. -
Cm YS Jagan: పేదోడి కోసం ఓ సీఎం ఇంతలా పరితపిస్తారా?
సాక్షి, ప్రత్యేకం: ఈ మూడున్నరేళ్ల కాలంలో ఏపీ ప్రజలు, ప్రత్యేకించి పేదల బతుకు చిత్రాన్ని మార్చేసేందుకే సీఎం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేశారు.. చేస్తున్నారు. అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడంతో పాటు ఆపదలో ఉన్నవాళ్లెందరినో సత్వరమే ఆదుకున్న మంచి మనసు ఆయనది. ఈ మాట స్వయంగా సాయం అందుకున్న వాళ్ల నోటి నుంచే వెలువడుతోంది మరి!. అయితే.. ఆ తల్లిదండ్రులు సీఎం జగన్ మనసున్న మారాజు అని కృతజ్ఞతలు చెబుతున్నారు. ఎందుకో తెలుసా? ఆడిపాడే వయసులో ఆ చిట్టితల్లికి పెద్ద కష్టమే వచ్చింది. అది ఆమె తల్లిదండ్రులు కూడా మోయలేనంతది!. హనీకి వచ్చిన పెద్దజబ్బుకు చికిత్స చేయడం తమకు చేతకాదనుకున్న ఆ అమ్మానాన్న.. దేవుడిపై భారం వేశారు. కానీ, ఆ దేవుడు ఎప్పటిలాగే మనిషి రూపేణా వచ్చాడు. కష్టం గురించి తెలియగానే.. సీఎం జగన్ శరవేగంగా స్పందించారు. ఆ చిట్టితల్లికి బతుకు భరోసా కల్పించారు. ఆ కుటుంబంలో వెలుగులు నింపారు. పశ్చిమగోదావరి జిల్లా అచంట మండలం అయోధ్యలంక గ్రామానికి చెందిన రాంబాబు, నాగలక్ష్మి దంపతులు కుమార్తె హనీ. పుట్టుకతోనే ఈ పాపకు గౌచర్ అనే వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి వచ్చిన వారిలో కాలేయం పనిచేయదు. చికిత్స కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అత్యంత అరుదైన ఈ వ్యాధితో దేశంలో 14 మంది బాధితులు బాధపడుతుండగా.. రాష్ట్రంలో చిన్నారి హనీ తొలి బాధితురాలు. ఏమి చెయ్యాలో ఈ తల్లిదండ్రులకు పాలుపోలేదు. గోదావరి వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా, సీఎం జగన్ కోనసీమకు వెళ్లారు. అక్కడ కిక్కిరిసిన జనం మధ్య పాపను ఎత్తుకుని తనను కలవడానికి ప్రయత్నిస్తున్న ఈ అమ్మానాన్నలు ఆయన కంటపడ్డారు. కాన్వాయ్ని ఆపించి, తల్లి వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చిన్నారికొచ్చిన కష్టం గురించి ఈ అమ్మానాన్నలు ఆయనకు వివరించారు. దీంతో చలించిపోయిన సీఎం జగన్..ఆ పాప వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అలా పసిబిడ్డ హనికి ప్రాణం పోశారు. ‘‘సీఎంగారి ఆదేశాల మేరకు చిన్నారిని చదివించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంది. అలాగే బాలిక కుటుంబానికి నెలకు రూ.10వేల చొప్పున పెన్షన్ కూడా మంజారు చేసింది. హనీ గౌచర్ వ్యాధికి సంబంధించిన 52 ఇంజక్షన్లను మంజూరు చేశారు. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ.1,25,000 కాగా, కంపెనీతో సంప్రదింపులు జరిపి, వాటిని తెప్పించారు. ప్రతి 15 రోజులకు ఒక ఇంజక్షన్ క్రమం తప్పకుండా చిన్నారికి ఇస్తున్నారిప్పుడు. తాము జన్మనిచ్చినా.. బతకదనుకున్న తమ బిడ్డకు సీఎం జగన్ పునర్జన్మనిచ్చారు. ఆయన బాగుండాలని తిరుమలకు పాదయాత్ర సైతం చేశారు. హనీ.. ఇప్పుడు హ్యాపీ.. హ్యాపీ.. పేదోడి కోసం ఓ ముఖ్యమంత్రి ఇంతలా పరితపిస్తారా.. మా పాపకు ప్రాణం దానం చేసిన సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆ రోజు కాన్వాయ్లో సీఎం జగనన్న మమ్మల్ని చూసి ఆగడం.. మా పాప అనారోగ్యం గురించి తక్షణమే స్పందించి కలెక్టర్కు చెప్పడం, ఇప్పుడు రూ.లక్షల విలువైన వైద్యం అందించడం చూస్తుంటే.. ఓ సీఎం ఇంతలా ఓ పేదవాడి కోసం తపిస్తారా.. అని ఆశ్చర్యమేస్తోంది. మా బిడ్డను ఆదుకుని మాపాలిట దైవంలా నిలిచిన జగనన్నకు చేతులెత్తి దండాలు పెడుతున్నాం. – తొలి ఇంజెక్షన్ అందుకున్న వేళ తల్లిదండ్రులు రాంబాబు, నాగలక్ష్మి భావోద్వేగం :::YS Jagan పుట్టినరోజుపై ప్రత్యేక కథనం -
CM YS Jagan: సంక్షేమ సారథికి అదే శ్రీరామరక్ష
రాజకీయ ప్రయాణంలో ఊహించని మలుపు.. ఎదురొచ్చిన అడ్డంకులు.. ఆటంకాలు. రాజకీయ కుట్రల, కుతంత్రాలు దుర్మార్గాలపై ఎదురు పోరాటం. వాటన్నింటిని ప్రజాభిమానమనే ఆయుధంతో పక్కకు తోసేసిన వైనం.. అనితరసాధ్యమైన రాజకీయ ప్రస్థానం ఆయన సొంతం. ఆ ఒకే ఒక్కడు వైఎస్ జగన్.. ఆ సంక్షేమ సారథికి జన్మదిన శుభాకాంక్షలు(డిసెంబర్ 21వ తేదీ).. తండ్రిని చూశాడు. ఆ మహానేత అడుగుజాడలు గమనించాడు. ఆ పెద్దాయన పేరుకే పొలిటీషియన్. కానీ, నిరంతరం ప్రజల మనిషి. అదే జీవితానికి సార్థకత అనుకున్న మంచి మనిషి. అలాంటి తండ్రిని గమనించిన తనయుడు.. మరోలా ఎందుకు అవుతాడు!. ప్రజలతో మమేకం కావడం, వారు చెప్పింది వినడం, వారి సమస్యలు తీర్చడం కోసం ఎలా పాటుపడాలనేది నేర్చాడు. ప్రజలతోనే ఉంటూ.. వారి జీవితాల్లో మేలు కోసం ఈ మూడున్నరేళ్లు కృషి చేశాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు. తిరుగులేని నేత కాలం పరీక్షలు పెడుతుంది. ఏడిపించేంత పనిచేస్తుంది. ఈ క్రమంలో ధీరోదాత్తుడు కూడా చలించాడు. కానీ, పరీక్షకు భయపడలేదు. సాహసికంగా ఎదుర్కొన్నాడు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా.. కుతంత్రాలు అడ్డుపడినా తన అడుగులు తడపడకుండా చూసుకున్నాడు. గుండెను సడలనివ్వకుండా.. ధైర్యాన్ని వీడకుండా ముందుకుసాగాడు. వైయస్ జగన్ రాజకీయ ప్రయాణం.. ఆయన్ని తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. మానవీయ రాజకీయాలు ఆయన మార్క్గా మారిపోయింది. తండ్రి బాటలో.. రాజకీయాల్లో వైయస్ కూడా ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నారు. ఆయన్ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి, వేధించడానికి కూడా అప్పటి హస్తం నేతలు ఎంతో ప్రయత్నించారు. సీనియర్ల దృష్టిలో అయితే వైఎస్ ఒక కొరకరానికొయ్య. చివరికి.. ఆయన ఆర్థికమూలాలను దెబ్బతీశారు. అయినా ఆయన తోణకలేదు. ప్రజా జీవితంతో పెనకేసుకుపోయిన.. పాదయాత్రతో ఆయన కీర్తి శిఖరాగ్రానికి చేరింది. ముఖ్యమంత్రిగా ఆ మహానేత ఐదేళ్ల పాలన సువర్ణయుగం. ఆయన తలపెట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి పథకాలు నభూతో న భవిష్యతి. అలా.. ఆ తండ్రి అడుగుజాడల్లోనే జగన్ తన రాజకీయప్రయాణాన్ని మొదలుపెట్టారు. అందరు వారసుల్లాగే తన రాజకీయ వారసుడు హస్తినలో జాతీయ నేతల వారసుల మధ్య తిరగాలని కోరుకున్నారు వైఎస్ఆర్. కానీ, విధి మరోలా తలిచింది. వైఎస్సార్ హఠాన్మరణం రాష్ట్ర రాజకీయ చరిత్రనే మార్చేసింది. అప్పటిదాకా తండ్రి ఆలోచనలు, సలహాలు. కానీ, అప్పటి నుంచి తనే ఆలోచించాలి.. తనే ఆచరించాలి అనుకున్నాడు. ఒక్కడిగానే తనదైన కొత్త చరిత్రను సృష్టించడానికి జగన్ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. వారసత్వంగా వచ్చిన బలమే కాదు.. వ్యక్తిత్వం బలం కూడా తోడయ్యింది. రాజకీయాలకు అతీతమైన వాదం. కులమతాల ఊసే లేని మానవత్వం. ప్రజాసేవ పరమావధిగా భావించిన ఆదర్శం వైఎస్ జగన్ది. అన్నీ స్వంత ఆలోచనలే. చివరకు.. తన రెక్కల కష్టంపై ఏర్పాటు చేసుకున్న సొంత పార్టీ. తన ఆలోచనలు, సిద్ధాంతాలే పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలుగా మలుచుకున్నాడు. అందుకే.. జగన్ రాజకీయప్రస్థానం అసామాన్యమైనది. యువతకు స్ఫూర్తిదాయకమైనది. సమస్యలతో నడుస్తూ.. పరిష్కరించే దాకా.. బహుశా .. భారత దేశ చరిత్రలో వైయస్సార్సీపీ ఆవిర్భావం..ఆ తర్వాతి ప్రస్థానం చారిత్రాత్మకమైనవేమో. ఆ చరిత్రకు సృష్టి కర్త, కర్మ, క్రియ అన్నీ జననేతనే. పార్టీ 2014 నుంచి ప్రతిపక్షంలో వున్న కాలంలోనూ ఆయన ప్రతిపక్షనేతగా సమర్ధవంతంగా పనిచేశారు. వైఎస్ జగన్.. ప్రజలకోసం అనేక దీక్షలు చేశారు. రైతుల తరఫున, చేనేతల తరఫున, మత్స్యకారుల తరఫున, విద్యార్థుల తరఫున ఇలా ఆయన.. లక్షలాది మంది సమక్షంలో దీక్షలకు పూనారు. వాటిని విజయవంతం చేశారు. నాటి ప్రభుత్వాల కళ్లు తెరిపించే పనులు చేశారు. ప్రజల కోసమే జగన్ రాజకీయాలు నడిచాయి పూర్తిగా. ఆపై పాదయాత్ర.. ఆయన ఆలోచల్నే కాదు.. రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. కోట్ల మందికి వైఎస్ జగన్ అభిమాన నాయకుడయ్యాడు. తానొక సాహసి అనే విషయాన్ని బయటి ప్రపంచానికి తెలియజేశాడాయన. తనేంటో తనకు తెలుసు. తన బలమేంటో తనకు తెలుసు. అదే పార్టీ సహచరులకు ధైర్యం అయ్యింది. ప్రజలకు నమ్మకమయింది. పాదయాత్ర విజయవంతమైంది. 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర ఆయన్ను ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అద్దంగా నిలిపింది. జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ బలంగా ప్రజా హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. ఫ్యాన్ దెబ్బకు సైకిల్ తుక్కుతుక్కు అయ్యింది. పాదయాత్ర నుంచే మేనిఫెస్టో పుట్టింది. దానికంటూ ఓ పవిత్రతను ఇచ్చిన ఆయన.. అధికారంలోనూ దాని అమలును అంతే చిత్తశుద్ధితో చేస్తున్నారు. మూడున్నర ఏళ్లు పూర్తి అయ్యింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయనలో కనిపించిన సంకల్పం.. ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతోంది. సీఎం జగన్ పాలనలో విప్లవాత్మక మార్పులకు ఏపీ వేదికయ్యింది. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలనే తపన.. ఆయనపై అభిమానాన్ని ప్రజల్లో మరింత పెంచుతూ వస్తోంది. మంత్రులు, తోటి నేతలు, ఉన్నతాధికారులు.. ఎవరినీ ఉపేక్షించలేదాయన. సంక్షేమం కోసం తనతో పాటు వాళ్లందరినీ పరుగులు పెట్టిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో సచివాలయం, ఆర్బీకే.. లాంటి వ్యవస్థలను దేశం ఆదర్శంగా తీసుకుంది. పారదర్శకపాలన.. పైగా గడపకే సంక్షేమ పథకాలు. ప్రతి సామాన్యుడికి ప్రతి పనీ సులువుగా అయిపోయింది. ఇంతకంటే సమర్థవంతమైన వ్యవస్థలను ఎవరు నడిపించగలరు?!.. ఒక్క వైఎస్ జగన్ తప్ప. సంక్షేమమే శ్రీరామరక్ష సామాజిక పెన్షన్లు, అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యార్థుల పథకాలు, నాడు - నేడు పేరిట విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం అన్ని పటిష్టంగా అమలయ్యేలా చేశారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి. నభూతో న భవిష్యతి అన్నట్టుగా తన పాలన ఉండాలని ఆదర్శంగా పెట్టుకున్నారు. ఆ దిశగానే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఈ విలక్షణ నాయకుడు. ఇంతగా ప్రజలతో మమేకమైన ఆ వయసు నాయకుడు గానీ, ప్రజా జీవితంతో పెనవేసుకుపోయిన నాయకుడు గానీ మరొకరు లేరు. చిన్నవయసులోనే పెద్ద బాధ్యతను ఎత్తుకున్న జగన్ నిజంగా ఓ రకంగా శిఖరాగ్రానికే చేరాడు. అక్కడే చాలినంత కాలం వుండటానికి ఆయనకు తనవైన కృష్టి, పట్టుదలలు తోడు నీడగా వుంటాయి. ఆయన సంకల్పబలమే ఆయన్ను విజేతగా నిలుపుతుంటుంది కూడా. అలాగే తనను తాను ఆల్రెడీ సీఎంగా ప్రూవ్ చేసుకున్న ది ట్రూ లీడర్ ఆయన. అయినప్పటికీ నిజాయితీ ఆయన అదనపు పొలిటికల్ క్వాలిఫికేషన్. అందుకే తన పాలనను గత పాలనతో బేరీజు వేసుకోమని, మంచి జరిగిందని భావిస్తే, ఒక బిడ్డగా ఆశీర్వదించమని ప్రజలను కోరుతున్నారు జగన్. YSJagan పుట్టినరోజుపై ప్రత్యేక కథనం -
పోస్టల్ శాఖ ద్వారా సీఎంకు శుభాకాంక్షలు
అవనిగడ్డ: సీఎం వైఎస్ జగన్కి రూ.10తో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం పోస్టల్ శాఖ కల్పిస్తోంది. ఈ నెల 21న సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకునే వారు పోస్టాఫీస్లో రూ.10 చెల్లిస్తే వారి అడ్రస్తో సందేశం చేరుతుంది. రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీస్ల నుంచి వచ్చే సందేశాలను మంగళగిరి ప్రధాన పోస్టాఫీస్ ద్వారా ముఖ్యమంత్రికి చేరవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20 లోపు ప్రధాన పోస్టాఫీస్కు వచ్చి రూ.10 చెల్లించి సీఎంకు జన్మదిన శుభాకాంక్షల సందేశం పంపవచ్చని కృష్ణా జిల్లా అవనిగడ్డ పోస్టుమాస్టర్ సింహాద్రి రామలింగేశ్వరరావు తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు స్థానిక హెడ్పోస్టాఫీస్ ద్వారా సీఎంకు శుక్రవారం జన్మదిన శుభాకాంక్షల సందేశం పంపించారు. -
నా కూతురి పెళ్లికి సీఎం జగన్ కానుక ఇచ్చారు : అలీ
-
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష
-
సీఎం జగన్ బర్త్డే రక్తదాన శిబిరాల రికార్డు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా 2020 డిసెంబర్ 21న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించిన రక్తదాన కార్యక్రమం అరుదైన రికార్డును నెలకొల్పింది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్లో నమోదైంది. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రక్త నిల్వలు తగ్గిన సమయంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో కూడా ముమ్మరంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. వీటి ద్వారా ఒక్కరోజులో 34,723 యూనిట్ల(12,153 లీటర్లు) రక్తాన్ని సేకరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, రోటరీ, రెడ్క్రాస్, లయన్స్ క్లబ్ ఇతర ఎన్జీవోలు ఈ శిబిరాల నిర్వహణలో పాలుపంచుకున్నాయి. ఒకేరోజు ఇంత పెద్ద ఎత్తున రక్తాన్ని సేకరించడంతో ఈ కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్లో నమోదైంది. గతంలో ఒకేరోజు అత్యధికంగా 10,500 యూనిట్ల రక్తాన్ని సేకరించిన రికార్డును ఇది అధిగమించింది. పైగా కేవలం 8 – 9 గంటల్లోనే మూడు రెట్లు అదనంగా రక్తాన్ని సేకరించటంపట్ల వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నిర్వాహకులు పార్టీ నాయకత్వాన్ని అభినందించారు. కరోనా నేపథ్యంలో రక్త దాతలు ముందుకొచ్చే వారు కాదు. దీంతో రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోయాయి. రక్తం దొరక్క చాలా ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలకు ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇలా సేకరించిన రక్తాన్ని రాష్ట్రంలోని వివిధ బ్లడ్ బ్యాంకులకు సరఫరా చేశారు. -
ప్రతి గడపలో అపూర్వ స్పందన
నెల్లూరు(సెంట్రల్): గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి జిల్లాలో అపూర్వ స్పందన వస్తోంది. ఇందులో భాగంగా స్వయంగా ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజల వద్దకు వెళ్తుండగా వారు ఆనందించి ఆశీర్వదిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అవి తమకు అందుతున్నాయని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన బాగుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా తమకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎల్లవేళలా తమ ఆశీస్సులుంటాయని దీవిస్తున్నారు. పక్కాగా పథకాల అమలు కందుకూరు నియోజకవర్గంలోని పలుకూరు ప్రాంతంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన చిన్న సమస్యలను ఎమ్మెల్యే అక్కడే పరిష్కరిస్తుండడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మానుగుంట మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. అర్హులకు పక్కాగా పథకాలు అందిస్తున్నామని, అదే విధంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలకు అండగా ప్రభుత్వం వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలం దేవరవేమూరు ప్రాంతంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు స్థానికులు సాదర స్వాగతం పలికారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆనందం వ్య క్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా భరోసా కల్పించినట్లు చెప్పారు. ఇంకా అభివృద్ధి చేస్తాం ఆత్మకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకుడు మేకపాటి విక్రమ్రెడ్డి మున్సిపల్ పరిధిలోని 12, 13 వార్డుల్లో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గడపలో ఆయనకు ఆత్మీక స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రజలకు విక్రమ్రెడ్డి సంక్షేమ పథకాలను వివరించారు. సమస్యల గురించి ఆరాతీశారు. ఈ సందర్భంగా విక్రమ్రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరికీ ఎంతో బాధ్యతగా అందిస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేశామని, ఇంకా చేస్తామని తెలిపారు. -
కువైట్లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
కువైట్లో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు వేడుకలు కువైట్లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ అవినాష్ యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. జననేత వైఎస్ జగన్ పేరుతో ప్రత్యేకంగా కేక్ను తయారు చేయించారు. ఏపీలో వైఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల జిలన్ బాషా, మాజ్, సురేష్, శ్యామల, సుబహన్ డేగ ఫిలిం, రైజ్ వన్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
విశాఖలో వైఎస్సార్ కప్ క్రికెట్ టోర్నీ ప్రారంభం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా విశాఖలోని పోర్టు స్టేడియంలో వైఎస్సార్ కప్ క్రికెట్ టోర్నీని మంగళవారం ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ టోర్నీలో 490 జట్లు పాల్గొంటున్నాయి. 15 మైదానాల్లో వచ్చే ఏడాది జనవరి 9 వరకూ మ్యాచ్లు జరగనున్నాయి. విజేతకు రూ.10 లక్షలు, రన్నరప్కు రూ.5 లక్షలు బహుమతిగా అందజేయనున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రధాన కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని ఏసీఏ ప్రెసిడెంట్ శరత్చంద్రారెడ్డిని కోరుతామన్నారు. ఆంధ్రా ఒలింపిక్ అసోసియేషన్ను కూడా విశాఖకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగానే కాకుండా క్రీడా రాజధానిగా కూడా మారనుందని వ్యాఖ్యానించారు. -
జీవించు నూరేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
సాక్షి నెట్వర్క్: ‘జీవించు నూరేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు’ అని ఆశీర్వదిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేక్లు కట్ చేసి వివిధ సేవా కార్యక్రమాలు జరిపారు. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు. కొన్నిచోట్ల నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ చేశారు. అనేకచోట్ల సీఎం వైఎస్ జగన్ అభిమానులు రక్తదాన కార్యక్రమాలు జరిపారు. పలుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. సీఎం నివాసంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను తాడేపల్లిలోని ఆయన నివాసంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం పండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. సీఎం జగన్కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, వి.బాలశౌరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ, సీఎం ప్రిన్సిపల్ అడ్వైజర్ అజేయకల్లం, ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఆదిత్యనాథ్దాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాష్, టీటీడీ ఈవో కేఎస్ జవహర్రెడ్డి, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, ముఖ్యమంత్రి కార్యదర్శులు సాల్మన్ ఆరోఖ్యరాజ్, రేవు ముత్యాలరాజు, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనంజయ్రెడ్డి, సమాచారశాఖ కమిషనర్ టి.విజయ్కుమార్రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ రాజేంద్రనాథ్రెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, శామ్యూల్, ఎమ్మెల్సీ టి.మాధవరావు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సీపీఆర్వో పూడి శ్రీహరి ఉన్నారు. వెల్లువెత్తిన సేవా కార్యక్రమాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తృతంగా జరిగాయి. సీఎం జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి రక్తదాన శిబిరాలు, దివ్యాంగులకు వీల్చైర్లు, వృద్ధులకు పండ్లు, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టారు. వివిధ నియోజకవర్గాల్లో మొక్కలు నాటారు. పేదలకు చీరలు, పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. మెగా వైద్య శిబిరం, మెగా రక్తదాన శిబిరాలు, విద్యార్థుల క్రీడా పోటీలు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. విశాఖ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, శ్రీకాకుళం జిల్లాలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అనేకచోట్ల రక్తదాన శిబిరాలు, పేదలకు వస్త్రాల పంపిణీ, యాగాలు, పూజలు చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, రోగులకు పండ్లు, లక్ష చామంతి పూజ, శత చండీ యాగం, మెగా మెడికల్ క్యాంప్ తదితర కార్యక్రమాలు జరిగాయి. మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా పేదలకు దుస్తుల పంపిణీ, రక్తదాన శిబిరాలు, సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జగనన్న సంపూర్ణ శాశ్వత గృహ హక్కు పథకం రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ, రక్తదాన శిబిరాలు, విభిన్న ప్రతిభావంతులకు పండ్లు, స్వీట్లు, విద్యార్థులకు టిఫిన్ బాక్సులు, పుస్తకాలు, వృద్ధులకు దుప్పట్లు, మొక్కలు నాటే కార్యక్రమాలు జరిగాయి. పలుచోట్ల ఎమ్మెల్యేలు రక్తదానం చేశారు. మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రక్తదాన, వైద్య శిబిరాలు, జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు, వృద్ధులకు దుస్తుల పంపిణీ, మొక్కలు నాటే కార్యక్రమాలు జరిగాయి. పలుచోట్ల ఎమ్మెల్యేలు రక్తదానం చేశారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వడి బియ్యం పేరిట వెయ్యి మంది మహిళలకు పట్టు చీరలు, సాధారణ చీరలు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు, పేదలకు దుప్పట్లు, చీరలు, పండ్లు, రొట్టెలు, దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ, కడపలో వైఎస్ విజయమ్మ పార్క్ ప్రారంభోత్సవం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు రక్తదానం చేశారు. డిప్యూటీ సీఎం అంజాద్బాషా, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు, వృద్థులకు చీరలు, దుప్పట్లు, పండ్ల పంపిణీ జరిగాయి. మంత్రి గుమ్మనూరు జయరాం తదితరులు హాజరయ్యారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో 2,969 మంది రక్తదానం చేశారు. జెడ్పీ డ్రైవర్లు, అటెండర్లకు యూనిఫామ్ పంపిణీ చేశారు. కాణిపాకం వినాయక ఆలయంలో సీఎం జగన్ పేరిట ప్రత్యేక హోమం, పూజలు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించగా, పుట్టపర్తిలో 3కే మారథాన్ జరిగింది. మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు జరిగాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి మొక్కలను నాటారు. సభా వేదికపై సర్వమత ప్రార్థనలు నిర్వహించి పేదలకు నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ చేశారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్ ఫొటోలతో కూడిన ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, పండుల రవీంద్రబాబు, జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహనరావు, మేరుగ నాగార్జున, ప్రభుత్వ విప్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఎల్లలు దాటిన అభిమానం సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ లోక్సభా పక్ష నేత మిథున్రెడ్డి నేతృత్వంలో పార్లమెంటులోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఎంపీలు పిల్లి సుభాష్చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, సంజీవ్కుమార్, గురుమూర్తి, తలారి రంగయ్య, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎన్.రెడ్డెప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ భవన్లోను, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లోను 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. లేపాక్షి డైరెక్టర్ ఆళ్ల శివగణేష్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి పాల్గొని కేక్ కట్ చేశారు. పార్లమెంట్లోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీలు కువైట్లో ఘనంగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్ అవినాష్ యూత్ ఆధ్వర్యంలో కువైట్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పులివెందుల జిలన్ బాషా, మాజ్, సురేష్, శ్యామల, సుబహన్ డేగ ఫిలిం, రైజ్ వన్, అభిమానులు పాల్గొన్నారు. రావి ఆకుపై సీఎం చిత్రం వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, వేమూరు నియోజకవర్గ నాయకుడు కారుమూరు వెంకటరెడ్డి రావి ఆకుపై ముఖ్యమంత్రి చిత్రాన్ని వేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. – కొల్లూరు స్కూబా డైవింగ్ చేస్తూ సీఎంకు శుభాకాంక్షలు తమిళనాడులో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్న నెల్లూరుకు చెందిన సుప్రీత్.. మహారాష్ట్రలోని చివల బీచ్లో సముద్రంలో 80 మీటర్ల లోతున స్కూబా డైవింగ్ చేస్తూ ఫ్లెక్సీని ప్రదర్శించి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. – నెల్లూరు (వీఆర్సీసెంటర్) పారాగ్లైడింగ్లో విహరిస్తూ వేడుకలు దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం దూబగుంట గ్రామానికి చెందిన సింగారెడ్డి వాసు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకల్ని పారా గ్లైడింగ్లో నిర్వహించారు. ఆకాశంలోనే జగనన్న ఫొటోను ప్రదర్శిస్తూ మిత్రులతో కలిసి కేక్ కట్ చేశారు. – అనుమసముద్రంపేట -
చంద్రబాబుపై విరుచుకుపడ్డ సీఎం జగన్
-
ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
-
జననేతకు జన్మదిన శుభాకాంక్షలు
-
మడమ తిప్పని వ్యక్తిత్వం.. పాలనలో సంక్షేమం
సాక్షి వెబ్డెస్క్: 12 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమారునిగా మాత్రమే వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ తెలుసు. ‘నన్ను అణచివేయాలని చూస్తే పడిలేచిన కడలి కెరటంలా పైకి ఎగసిపడతాను. గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంతో తిరిగి వస్తాను’ అన్న జగన్ ఆ మాటల్ని నిజం చేసుకున్నారు. ఎన్నో సవాళ్లు ఆటుపోట్లు ఎదురైనా ప్రజా సేవే పరమావధిగా మొక్కవోని విశ్వాసంతో సీఎం వైఎస్ జగన్ ముందడుగు వేస్తున్నారు. ఆత్మవిశ్వాసమే ఆయువుగా దేశంలోనే ఆదర్శ సీఎంగా ఎదిగారు. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, తప్పుడు ప్రచారాలు, గత టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ఎదుర్కొని పోరాట యోధుడిగా ఎదురు నిలిచి అకుంఠిత దీక్షకు సంకేతంగా మారారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ స్వచ్ఛమైన పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజలకిచ్చిన మాట కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, పరిస్థితులు సహకరించపోయినా.. సంకల్పబలంతో ముందుకుసాగుతున్నారు. రెండున్నరేళ్లలో దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పరిపాలన సాగిస్తున్నారు. ఒక వైపు కరోనా వంటి విపత్కర పరిస్థితులు.. ప్రతిపక్షాల కుట్రలు, కుతంత్రాలతో యుద్ధం చేస్తూనే, మరోవైపు సంక్షేమాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. విలువలకు కట్టుబడి.. 2009లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా.. సీఎం జగన్ ఇష్టపడలేదు. విలువలకే కట్టుబడ్డారు. 2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ హఠాన్మరణంతో. నాడు దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా వైఎస్ జగన్ సీఎం కావాలని సంతకాలు చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వద్దామని కొందరు ఆయనకు సూచించారు. కానీ ఆయన సమ్మతించలేదు. తన తండ్రి రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చబోనని వైఎస్ జగన్ రాజకీయ విలువలకు కట్టబడ్డారు. ఓదార్పు యాత్ర.. ఇచ్చిన మాట కోసం పార్టీకి రాజీనామా చేయడమే కాదు. ఎంపీ పదవిని సైతం వైఎస్ జగన్ తృణప్రాయంగా వదిలేశారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కడప స్థానం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. తన తండ్రి, దివంగత మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన అభిమానుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర ప్రారంభించారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించకపోవడంతో ప్రజలకు ఇచ్చిన మాట కోసం పార్టీని వీడారు. మాటకు కట్టుబడి ఓదార్పు యాత్ర చేశారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటానని వారికి కొండంత భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం.. రాజన్న ఆశయాల సాధనే లక్ష్యంగా 2011 మార్చి 12న వైఎస్ జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన కొద్దినెలలకే 2011 కడప పార్లమెంట్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి 5,45,672 ఓట్ల అఖండ మెజార్టీతో రికార్డు విజయం సాధించారు. కుట్రపూరితంగా.. రాజన్న ఆశయాలను నీరుగార్చిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఎన్నో పోరాటాలు చేశారు. రైతు దీక్ష, జలదీక్ష, విద్యార్థి దీక్ష, చేనేత దీక్ష ధర్నాలతో ఉద్యమించారు. ఆయనను అడ్డుకునేందుకు అప్పటి అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ కుమ్మక్కై కుట్రపూరితంగా వ్యహరించి అక్రమ కేసులు బనాయించారు. టీడీపీ అవినీతిపై పోరాటం.. 2014 ఎన్నికల అనంతరం ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మాణాత్మక పాత్ర పోషించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. టీడీపీ ప్రభుత్వం అవినీతి, అసమర్థతకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈక్రమంలోనే రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా టీడీపీ ఎన్నో కుట్రలు పన్నింది. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి చంద్రబాబు టీడీడీలో చేర్చుకున్నారు. ప్రజా సంకల్పయాత్ర.. అవినీతి, అసమర్థ పాలనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ దశ, దిశ మార్చేందుకు వైఎస్ జగన్ చారిత్రాత్మక ప్రజా సంకల్పయాత్ర చేపట్టారు. ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్సార్ సమాధివద్ద 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాలగుండా సాగిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9వ తేదీన ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ నడక సాగించారు. ముఖ్యమంత్రిగా.. 2019 మే 30న నవ్యాంధ్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. అపూర్వ ప్రజా మద్దతుతో 151 అసెంబ్లీ సీట్లు సాధించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా సంక్షేమ రథ సారథిగా, అభివృద్ధి కాముకుడిగా పాలన సాగిస్తున్నారు. -
కేక్ కట్ చేసిన సీఎం జగన్
-
ఏపీ సీఎం వైఎస్ జగన్కు చిరు, మహేశ్ బర్త్డే విషెస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నేడు (డిసెంబర్ 21) సీఎం జగన్ బర్త్డే సందర్బంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ట్విటర్ వేదికగా బర్త్డే విషెస్ వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరు ‘హ్యాపీ బర్త్డే శ్రీవైఎస్ జగన్మోహన్రెడ్డి గారు’ అంటూ ట్వీటర్ వేదికగా సీఎం జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. Wishing a very Happy Birthday to Sri @ysjagan Garu. Have a blessed one. Many Many Happy Returns!! — Chiranjeevi Konidela (@KChiruTweets) December 21, 2021 అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా సీఎం జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలి. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, మరెన్నో పుట్టిన రోజులు జరపుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. Wishing hon'ble CM @ysjagan a very happy birthday! May AP continue to rise and prosper under your leadership. Good health and happiness always. 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) December 21, 2021 -
మంత్రుల సమక్షంలో కేక్ కట్ చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రుల సమక్షంలో సీఎం వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. సీఎంను కలిసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, నారాయణస్వామి పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సర్వమత ప్రార్థనల అనంతరం కేక్ కట్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం జగన్కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు నేడు (మంగళవారం). ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం జగన్కు బర్త్డే విషెస్ తెలిపారు. జీవితాంతం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు వేడుకలు నిర్వహిస్తున్నారు. ట్విట్టర్లో #HBDManOfMassesYSJagan హ్యాష్ ట్యాగ్తో విషెస్ మోత మోగిస్తున్నారు. తమ ప్రియతమ నేత పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు Greetings to AP CM Shri @ysjagan Garu on his birthday. May Almighty bless him with a long and healthy life. — Narendra Modi (@narendramodi) December 21, 2021 -
పంజాగుట్టలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
-
స్వచ్ఛమైన చిరునవ్వు.. మాట తప్పని నైజం
అమరావతి: ‘చెదరని చిరునవ్వే ఆయుధం.. పోరాడే గుణమే ఆయన బలం.. మాట తప్పని నైజం .. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలే వారసత్వం.. ప్రజల ముఖాల్లో ఎల్లప్పుడూ సంతోషం కనిపించాలనే తపనతో సంక్షేమ పాలన అందిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. జననేత జన్మదినం పురస్కరించుకొని రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ఈ రెండున్నరేళ్ల పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి పాలన చిరకాలం ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం.. మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్. అందుకే రాష్ట్ర ప్రజలు జననేత వెంట నడుస్తున్నారు. జగన్కు జై కొడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తే అప్పట్లో అధికార పార్టీకి చెమటలు పట్టాయి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా పాలన సాగిస్తుంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలకు దిక్కుతోచడం లేదు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా ఇంతటి కష్ట సమయంలోనూ వైయస్ జగన్ హామీల అమలులో ముందుకు సాగుతున్నారు. తాను గతంలో ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం రాజీ పడటం లేదు. ఇందుకు ఉదాహరణగా వందకు పైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, విప్లవాత్మకమైన సంస్కరణలు, చట్టాలే సజీవ సాక్ష్యం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు రెండున్నరేళ్ల పాలనలోనే దాదాపు 96 శాతం అమలు చేసి జనరంజక పాలన అందిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధే గీటురాయిగా... రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు... వ్యయం చేస్తోందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విశ్లేషించింది. 2019 – 20 నుంచి వరుసగా పరిశీలిస్తే ..అభివృద్ధి వ్యయం ఏటా పెరుగుతోందని ఆర్బీఐ నివేదికతో స్పష్టమవుతోంది. అభివృద్ధి వ్యయం 2020–21తో పోల్చితే....2021–22లో ఏకంగా 33.5 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. సామాజిక రంగాల వ్యయం కూడా భారీగా పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. బడ్జెట్ కేటాయింపులు, వ్యయాలపై... ఆర్బీఐ విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. ఇక 2019–20 నుంచి ఉద్యోగుల జీతభత్యాలు బాగా పెరిగాయని.. అలాగే గతంలో చేసిన అప్పులకు ...వడ్డీ చెల్లింపులూ అధికమయ్యాయని నివేదిక పేర్కొంది. గత రెండేళ్లగా ప్రజారోగ్యం... కుటుంబ సంక్షేమంపై వ్యయం పెరిగిందని తెలిపింది. పెరిగిన జీతభత్యాల పద్దు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 27 శాతం మధ్యంతర భృతి పెంచారు. వైద్య ఆరోగ్య రంగంలో పెద్ద ఎత్తున శాశ్వత ఉద్యోగాలను కల్పించడంతో పాటు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న చిరు ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచారు. దీంతో జీత భత్యాల పద్దు భారీగా పెరిగింది. గత సర్కారు హయాంలో ... 2018–19లో ఉద్యోగుల జీతభత్యాల పద్దు...రూ.32,743.40 కోట్లు ఉండగా...2021–22లో అది రూ.50,662.20 కోట్లకు చేరిందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి. ఆహారం నిల్వ తదితర రంగాల వ్యయం.. 2019–20లో మొత్తం బడ్జెట్లో 45.4 శాతం ఉండగా...2021–22లో 49.4 శాతానికి పెరిగింది. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమంపై ... గత మూడు సంవత్సరాలుగా బడ్జెట్లో వ్యయం పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. 2019–20లో బడ్జెట్లో ఈ రంగంపై 4.3 శాతం వ్యయం చేయగా 2020–21లో 5.2 శాతం వ్యయం చేసినట్లు తెలిపింది. 2021–22లో 6.1 శాతం మేర కేటాయింపులు చేసినట్లు వెల్లడించింది. అభివృద్ధికే ఎక్కువ వ్యయం ప్రధాన ఆర్థిక సూచికల ప్రకారం చూస్తే మూడు ఆర్ధిక సంవత్సరాల్లో అభివృద్ధియేతర వ్యయం కన్నా అభివృద్ధికే ఎక్కువ వ్యయం చేస్తున్నట్లు ఆర్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. చదువుల్లో ఏపీ టాప్ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంస్కరణలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. వివిధ కేటగిరీల్లో మన ఏపీ దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలుస్తోంది. తాజాగా ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇన్ ఇండియా’ నివేదిక దీన్ని నిరూపించింది. కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ బిబేక్ దేబ్రాయ్ ఇటీవల విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. ఫౌండేషన్ విద్య అందుబాటు అంశంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. చిన్న రాష్ట్రాల కేటగిరీలోని వివిధ అభివృద్ధి సూచికల్లో ‘విద్య అందుబాటు’ అనే అంశంలో ఏపీ 38.50 స్కోరుతో అగ్రస్థానంలో ఉంది. ఇతర అభివృద్ధి సూచికల విషయంలో అగ్రస్థానంలో ఉన్న కేరళ ఈ విషయంలో మాత్రం ఏపీకన్నా తక్కువగా 36.55 స్కోరు మాత్రమే సాధించింది. ఇదే అంశాన్ని ప్రధాని ఎకనమిక్ అడ్వయిజరీ కౌన్సిల్ తన నివేదికలో ప్రస్తావిస్తూ.. ‘కొన్ని రాష్ట్రాలు ఇతరులకు రోల్ మోడల్గా నిలుస్తాయి. కానీ, కొన్ని సమయాల్లో సవాళ్లను పరిష్కరించేటప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నేర్చుకోవాలి. చిన్న రాష్ట్రాల్లో కేరళ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నప్పటికీ ‘విద్య అందుబాటు’ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి నేర్చుకోవచ్చు’ అని పేర్కొంది. అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం చదువులు, సీబీఎస్ఈ వంటి విప్లవాత్మక మార్పులతో దేశంలోనే ఏపీ ఆదర్శంగా నిలిచింది. పల్లెకు ప్రాణనాడి 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ 104 అంబులెన్స్ సేవలు పల్లెకు ప్రాణనాడిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామానికి 656 MMUలు వెళ్తున్నాయి. ఈ ఏడాదిన్నరలో గ్రామీణ వైద్యం రూపురేఖలు మారింది. గత జూలై నుంచి 1.03 కోట్ల మందికి వైద్య సేవలు అందించారు. మంచానికే పరిమితమైన 8.54 లక్షల మందికి ఇంటి వద్దే వైద్యం అందించారు. 43.36 లక్షల మందికి పరీక్షలు.. 41.96 కోట్ల మందుల పంపిణీ చేశారు. గత సర్కారు హయాంలో మంచం పట్టిన ఈ వ్యవస్థకు జవసత్వాలు కల్పించి ప్రతి మండలానికి ఒక 104 చొప్పున మొత్తం 656 వాహనాలను సీఎం జగన్ ప్రభుత్వం గతేడాది జూలై 1 నుంచి అందుబాటులోకి తెచ్చింది. గ్రామ వికాసానికి కృషి చేసేలా ‘రైతు భరోసా కేంద్రాలు విత్తనం నుంచి పంట విక్రయం దాకా అన్నదాతలకు అన్ని రకాలుగా అండగా నిలిచి అమిత ఆదరణ పొందుతున్న రైతు భరోసా కేంద్రాలు గ్రామ వికాసానికి పూర్తి స్థాయిలో దోహదం చేసేలా సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 9,899 పాల సేకరణ కేంద్రాల భవన నిర్మాణాలకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. భవనాల నిర్మాణం పూర్తి కాగానే వీటిని పొదుపు సంఘాల మహిళలకు అప్పగించనున్నారు. రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించేలా ఆర్బీకేల పరిధిలో పలు సదుపాయాలు కలిగిన మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను యుద్ధప్రాతిపదిక అందుబాటులోకి తేవాలని ఇటీవల సమీక్షలో సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రూ.9,104 కోట్ల వ్యయంతో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఏపీలో పారిశ్రామిక విప్లవం రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం మొదలైంది. కరోనాకు ఎదురొడ్డి రెండు భారీ పారిశ్రామిక పార్కులను వైయస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో .. 3,155 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు (25 వేల కోట్ల భారీ పెట్టుబడులు, 75వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి). 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (10 వేల కోట్ల పెట్టుబడులు,25 వేల మందికి ఉపాధి ) వీటి ద్వారా రూ.35,000 కోట్ల పెట్టుబడులు.. లక్ష మందికి ఉపాధి ఈ నెల డిసెంబర్ 23న ప్రారంభించనున్న సీఎం రూ.207 కోట్లతో ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ యూనిట్ డిక్సన్ కంపెనీలో ఉద్యోగాలకు నియామక పత్రాల జారీ మరో 4 భారీ ఎలక్ట్రానిక్ కంపెనీల పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూ.. మరో 18 చిన్న యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభం తైవాన్, రష్యా, ఇండియా సెమీ కండక్టర్స్ అసోసియేషన్స్తో కొప్పర్తికి పెట్టుబడుల ఒప్పందం 23న బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్కు, 24న పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ యూనిట్కు శంకుస్థాపన వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో అభివృద్ధి చేసిన వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎంఐహెచ్), 801 ఎకరాల్లో అభివృద్ధి చేసిన వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ) వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్ ద్వారా రూ.25,000 కోట్ల భారీ పెట్టుబడులు 75,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. వైఎస్సార్ ఈఎంసీ ద్వారా రూ.10,000 కోట్ల పెట్టుబడులతో 25,000 మందికి ఉపాధి కల్పించనుంది కీలక ఒప్పందాలు ఈఎంసీలో డిక్సన్ సంస్థ రూ.127 కోట్ల పెట్టుబడితో హెచ్ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్ యూనిట్ను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ ద్వారా 1,800 మందికి ఉపాధి లభించనుంది. డిక్సన్ రూ.80 కోట్ల పెట్టుబడితో ల్యాప్ట్యాప్లు, ట్యాబ్లెట్స్ తయారీ యూనిట్ను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్ ద్వారా మరో 1,100 మందికి ఉపాధి లభించనుంది. వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్లో రూ.401 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పిట్టి రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్కు ఎకరం రూ.10 లక్షలు చొప్పున 117.85 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ఈ యూనిట్ ద్వారా మరో 2,000 మందికి ఉపాధి లభించనుంది. ఏపీలో ఫ్లిప్కార్ట్ పెట్టుబడులు ఫ్లిప్కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి నేతృత్వంలో సంస్థ బృందం ఈ నెల 16న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమైంది. ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖపట్నంలో మరిన్ని పెట్టుబడులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో భాగస్వామి కావడానికి ఆసక్తి వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై ఫ్లిప్కార్ట్ సీఈవో కృష్ణమూర్తి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికత కలిగిన ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. బియ్యం ఎగుమతుల్లో దూసుకుపోతున్న ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బియ్యం ఎగుమతుల్లో దూసుకుపోతోంది. 2019–20 లో బియ్యం ఎగుమతులు రూ.1,902.65 కోట్లు 2020–21లో రూ.5,790 కోట్ల విలువైన 22.09 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి. ఈ ఏడాది అక్టోబర్కే రూ. 4,131.86 కోట్ల విలువైన 16.38 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి చేశారు. ఈ ఏడాది రాష్ట్ర బియ్యం ఎగుమతులు 30 లక్షల టన్నులు దాటుతాయని అంచనా . ప్రస్తుతం రాష్ట్ర ఎగుమతుల్లో 5 శాతం వాటాను కలిగి ఉన్న బియ్యం .. ప్రపంచదేశాల డిమాండ్ను అందిపుచ్చుకున్న రాష్ట్రం. కొత్త ఏడాదిలో పింఛన్ పెంపు కొత్త ఏడాదిలో అవ్వాతాతలకు వైయస్ జగన్ సర్కార్ కానుక ఇవ్వనుంది. 2022 జనవరి నుంచి వైయస్ఆర్ పెన్షన్ కానుక రూ.2500 అందించనున్నారు. వైయస్ఆర్ పెన్షన్ కానుక రూ.2250 నుంచి రూ.2500కు పెంచనున్నారు. జనవరి 1, 2022న అమలు కానుంది. జనవరి 1, 2022న అవ్వాతాతలు చేతిలో వైయస్ జగన్ సర్కార్ రూ.2500 పెట్టనుంది. సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజున ఓటీఎస్ ప్రారంభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు డిసెంబర్ 21న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. తణుకులో ఏర్పాటు చేసిన ఓటీఎస్ అవగాహన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తారు. ఏడాది మొత్తం అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లు 16 లక్షలు కాగా ఓటీఎస్ ద్వారా 51 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.10 వేల కోట్ల మేర భారీ బకాయిలను మాఫీ చేస్తోంది. క్లియర్ టైటిల్ ఇస్తోంది. ఆస్తిని అమ్ముకునేందుకు లేదా తమవారికి బహుమతిగా ఇవ్వడానికి పూర్తి హక్కులు కల్పిస్తోంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకునేందుకు కూడా అవకాశం దక్కుతుంది. ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. చాలావరకు ఈ ఇళ్లు ఉన్న చోట రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉంది. అంత మొత్తంపై రిజిస్ట్రేషన్ ఉచితంగా చేస్తున్నాం. ఉచిత రిజిస్ట్రేషన్ వల్ల పేదలకు దాదాపు రూ.6 వేల కోట్ల మేర లబ్ధి కలుగుతోంది. ఇలా మొత్తం రూ.16 వేల కోట్ల దాకా పేదలకు ప్రయోజనం కలుగుతుంది. -
జన్మదినం సందర్భంగా సీఎం వైఎస్ జగన్పై ప్రత్యేక గీతం
-
హ్యాపీ బర్త్ డే సీఎం జగన్
-
CM YS Jagan Mohan Reddy Birthday: అభిమానం.. అపు'రూపం'
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా తమ అభిమానాన్ని పలువురు వినూత్నంగా చాటుకున్నారు. వెండి నాణెంపై, రావి ఆకుపై, కోడి గుడ్డుపై, విభిన్న పూలతో సీఎం జగన్ రూపాన్ని చిత్రీకరించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో నైపుణ్యంతో రూపొందించిన ఆయా చిత్రాలు ఆకర్షిస్తున్నాయి. – రాజాం సిటీ/ జగ్గయ్యపేట అర్బన్/కడియం/శ్రీకాకుళం (పీఎన్కాలనీ) వెండి నాణెంపై.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయన తల్లి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆప్యాయంగా అభినందించిన చిత్రాన్ని వెండి నాణెంపై చెక్కి ఔరా అనిపించారు శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన స్వర్ణకారుడు, మైక్రో ఆర్టిస్ట్ ముగడ జగదీశ్వరరావు. 3 గ్రాముల వెండిపై 60 నిమిషాల్లో దీన్ని చెక్కినట్టు ఆయన తెలిపారు. పుష్పాభిషేకం తూర్పుగోదావరి జిల్లా కడియానికి చెందిన పల్ల వెంకన్న నర్సరీ యాజమాన్యం వివిధ రకాల పూలతో సీఎం వైఎస్ జగన్ రూపాన్ని తీర్చిదిద్దింది. చిట్టిబంతి, చామంతి, గులాబీలను వినియోగించినట్టు సత్యనారాయణ మూర్తి, సుబ్రహ్మణ్యం, గణపతి చెప్పారు. రావి ఆకుపై.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన చిత్రకారుడు అల్లి చంద్రశేఖర్.. పెన్సిల్ షేడ్స్తో, బియ్యం గింజలు, రాగులతో రావి ఆకుపై సీఎం జగన్ రూపాన్ని చిత్రీకరించారు. నవరత్నాలు వెరీ‘గుడ్’ నవరత్నాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్కు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు శ్రీకాకుళానికి చెందిన పొట్నూరి శ్రీనివాస్. కోడి గుడ్లపై నవరత్నాలతో పాటు, సీఎం జగన్ రూపాన్ని చిత్రీకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు. -
సీఎంపై అభిమానంతో.. 2,745 మంది రక్తదానం
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2,745 మంది సోమవారం రక్తదానం చేసి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించారు. రక్తదానం చేయడం ద్వారా జననేత జగన్పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జగన్ అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి వరుసగా మూడో ఏడాది కూడా ఒరవడిని కొనసాగించారు. మంగళవారం సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందే సోమవారం రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ప్రతినిధి జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శిబిరాన్ని ప్రారంభించగా సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, శాప్ చైర్మన్ బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్రహౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దివంగతనేత జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శాప్చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి తొలుత రక్తదానం చేశారు. జగన్ సీఎం అయ్యాక తొలుత 2019లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 2,043 మంది రక్తదానం చేయగా, 2020లో 2,143 మంది రక్తదానం చేశారు. ఈ ఏడాది 2,745 మంది రక్తదానం చేసి రికార్డు నెలకొల్పారు. ఉభయ గోదావరి జిల్లాల జెడ్పీ చైర్మన్లు విప్పర్తి వేణుగోపాలరావు, కౌరు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్తో.. వంద అడుగుల సీఎం ముఖచిత్రం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ఆవరణలోని గోశాల ముందు భాగంలో ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ విధానంలో గ్రాస్పై సీఎం వైఎస్ జగన్ ముఖచిత్రం ఏర్పాటు చేయించారు. వంద అడుగుల పొడవు, వంద అడుగుల వెడల్పుతో 2డీ ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. దేశంలోనే తొలి ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ ఇదే కావడం గమనార్హం. ఈ ముఖచిత్రాన్ని ప్రముఖ చిత్రకారుడు కాంత్ రీషా వేశారు. ఇందుకోసం గత పది రోజుల నుంచి గోశాల వద్ద చెవిరెడ్డి భాస్కరరెడ్డి దగ్గరుండి పనులు చేయించారు. డ్రోన్పై నుంచి చూస్తే సీఎం జగన్ ముఖచిత్రం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సీఎంపై ‘అధిపతి’ టైటిల్తో చెవిరెడ్డి భాస్కరరెడ్డి రూపొందింపజేసిన ‘వర్థిల్లు.. వెయ్యేళ్లు’ పాట ఆడియో సీడీని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ పాటను ఎం.కృష్ణవేణి రాశారు. ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య పాడగా.. కార్తీక్ సంగీతమందించారు. పాట సీడీని విడుదల చేస్తున్న సజ్జల, మంత్రులు పేర్ని నాని, కన్నబాబు, కొడాలి నాని, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి తదితరులు పేదలు అన్ని రంగాల్లో పోటీపడేలా.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దార్శనికత ఉంటే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయొచ్చో సీఎం జగన్ చేసి చూపించారని కొనియాడారు. పేదలు అన్ని రంగాల్లో పోటీపడేలా ఆయన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. జనహృదయ నాయకుడికి తామంతా శుభాకాంక్షలు చెబుతున్నామన్నారు. సీఎం జగన్ జన్మదినానికి ఒక రోజు ముందుగానే ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ చిత్రాన్ని ఏర్పాటు చేయించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అభినందించారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ పోరాటానికి ప్రతీకగా.. చెప్పిన మాట కోసం, నమ్మిన ప్రజల కోసం పనిచేస్తున్న ఆదర్శ నేత సీఎం జగన్ అని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. -
సీఎంకు ఆశీస్సులు ఇవ్వాలి
రాజమహేంద్రవరం రూరల్: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94 శాతం అమలు చేయడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అందరూ ఆశీర్వదించాలని ఉప ముఖ్యమంత్రి, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్ కోరారు. రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్స్లోగల ఎంపీ కార్యాలయంలో సోమవారం సీఎం జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్రామ్, రూరల్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్, రాజమహేంద్రవరం స్మార్ట్సిటీ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం ధర్మాన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. మరో ముఖ్య అతిథి, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ దేవుడిని కొలిచినప్పుడు ప్రతి ఆంధ్రుడూ అంబేడ్కర్ ఆశయాలతో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గురించి కూడా వేడుకోవాలని కోరారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సీఎం జన్మదిన వేడుకలను ఒక రోజు ముందుగానే వినూత్న రీతిలో జరిపారని అన్నారు. ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. చందన నాగేశ్వర్ ప్రసంగించారు. ఈ మంత్రులతో భారీ కేక్ కట్ చేయించారు. మొక్కలు నాటించారు. మూడువేల మందికి వస్త్రాలు పంపిణీ చేశారు. పింఛనును రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచినందుకు సీఎం జగన్ చిత్రపటానికి వృద్ధులు క్షీరాభిషేకం చేశారు. మహిళలు ప్లకార్డులతో ‘హ్యాపీ బర్త్డే సీఎం సార్’ అంటూ నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాష్ట్ర తెలికుల, గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిన భవానీప్రియ, తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు మార్తి లక్ష్మి, పిల్లి నిర్మల, కానుబోయిన సాగర్, రాష్ట్ర కార్యదర్శులు మింది నాగేంద్ర, గిరజాల బాబు, రావిపాటి రామచంద్రరావు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి గుర్రం గౌతమ్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను, కడియం మండల అధ్యక్షుడు యాదల సతీష్చంద్ర స్టాలిన్, అజ్జరపు వాసు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
గుంటూరు ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బ్రాడీపేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, మొక్కలు నాటారు. ►రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇచ్చిన ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాల గిరిధర్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి విశాఖపట్నం విశాఖ నగర పార్టీ కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి అవంతి శ్రీనివాస్.. ఎమ్మెల్సీలు వంశీ, కల్యాణి, మేయర్,జడ్పీ చైర్మన్తో కలిసి కేక్ కట్ చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కృష్ణా జిల్లా విజయవాడ సత్యనారాణయపురంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు,.. కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం రోడ్లపై నిద్రిస్తున్న యాచకులకు, వృద్ధులకు.. దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి శంకర నారాయణ పెనుకొండ బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ►పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయి గూడెం మండలం ముప్పిన వారి గూడెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ►సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ►మొక్కలు నాటి, శివాలయంలో పత్యేక పూజలు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం ప్రధానంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పార్టీ నిర్ణయించిందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పుట్టినరోజు పార్టీ శ్రేణులకే కాకుండా ప్రజలందరికీ పర్వదినం వంటిదన్నారు. అందుకే ఆ రోజు సేవా కార్యక్రమాలతోపాటు ప్రత్యేకంగా ప్రజల్లో అవగాహన పెంచే విధంగా ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో గతేడాది కరోనా నేపథ్యంలో రక్త నిల్వల కొరతను నివారించడానికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తద్వారా ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం మొక్కలు నాటడం, రక్తదానం, పేదలకు దుస్తులు, దుప్పట్లు, నిత్యావసరాల పంపిణీ, అన్నదానం తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సీఎం జగన్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారన్నారు. -
డిసెంబర్ 21న ‘సచివాలయ’ దినోత్సవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసి ఒకేసారి 1.34 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతగా.. ఆయన పుట్టినరోజైన డిసెంబర్ 21న గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతేడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని, ఈసారి మరింత ఉత్సాహంతో వేడుకలు నిర్వహించాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. (చదవండి: అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు) సచివాలయాల సిబ్బంది అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సచివాలయ ఉద్యోగులెవ్వరూ ప్రొబేషన్ డిక్లరేషన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు. కొత్త పీఆర్సీ కూడా వర్తిస్తుందని అధికారులు తెలియజేశారని పేర్కొన్నారు. (చదవండి: పరిశ్రమల ఖిల్లా ఆ జిల్లా.. రెండున్నర ఏళ్లలో ఆరు వేల ఉద్యోగాలు) గ్రామ, వార్డు స్థాయిలో సచివాలయ వ్యవస్థను సృష్టించి లక్షలాది ఉద్యోగాలు కల్పించడమే కాకుండా.. ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ ఇస్తున్న సీఎం వైఎస్ జగన్కు ఉద్యోగులు రుణపడి ఉంటారన్నారు. చదవండి: AP: అప్రమత్తతే ఆయుధం: సీఎం జగన్ -
తండ్రికి తగ్గ తనయుడు సీఎం జగన్: హీరో సుమన్
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్మల హృదయ భవన్లో మానసిక వికలాంగులు, పేదలకు.. పండ్లు , స్వీట్స్ , దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, హీరో సుమన్ పాల్గొన్నారు. చదవండి: ఓటీఎస్ ద్వారా 52 లక్షల మంది పేదలకు లబ్ధి: శ్రీరంగనాథరాజు ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరుకూ పలు ముఖ్యమంత్రుల పనితీరు పరిశీలించానని.. వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ అంతకంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ, సీఎంగా వైఎస్ జగన్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబంపై దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలన్నారు.పెదకూర పాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ, వైఎస్సార్ తాను అమలు చేసిన పథకాలతో రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అందకంటే ఎక్కువగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.