-
డీబీటీలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
సాక్షి, విజయవాడ: రైతుల ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన నిధులను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ రైతులు, విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. డీబీటీలపై వాదనలు ముగియగా, తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.కాగా, నిధుల విడుదలకు నిరాకరించిన ఈసీ.. పోలింగ్ తర్వాత నిధుల విడుదలకు అనుమతిస్తామని పేర్కొంది. కోడ్ వచ్చాక కొనసాగుతున్న పథకాలైనా, కొత్త పథకాలైన ఒక్కటే.. కోడ్ వచ్చాక నిధులు విడుదల చేస్తే ఓటర్లపై ప్రభావం ఉంటుందని ఈసీ తెలిపింది.అయితే, ఇప్పటివరకు వేర్వేరు రాష్ట్రాల్లో అనుసరించిన విధానాన్ని కొనసాగించాలని పిటిషనర్లు కోరారు. నోటిఫికేషన్ కంటే ముందు అమల్లో ఉన్న అన్ని పథకాలు అన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయన్న పిటిషనర్లు.. ఒక్క ఆంధ్రప్రదేశ్లో విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోకుండా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషనర్లు కోరారు. -
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
సచిన్ టెండూల్కర్ స్టేడియంలో జూలు విదిలిస్తే ఎలా ఉంటుంది.. ప్రతి బాలు బౌండరీ దాటుతుంది.. స్టేడియం మొత్తం హోరెత్తుతోంది.. తుపానొచ్చినపుడు సముద్రానికి పోటు వస్తే ఎలా ఉంటుంది? కెరటాటు తీరం వైపు పోటెత్తుతాయి.. అడ్డం వచ్చిన వాటిని ఊడ్చి పడేస్తాయి.అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజైతే ఏమవుతుంది... ఏమీ కాదు... భారత్ మొత్తం స్థంభించిపోతుంది... కోట్లాదిమంది అమితాబ్ క్రేజ్ గురించి మాట్లాడుకుంటారు.. ఏ రచ్చబండ దగ్గరైనా అదే చర్చ నడుస్తుంది.. అచ్చం.. అలాగే... పైన చెప్పిన మాదిరిగానే... సీఎం వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ఒక సంచలనం సృష్టించింది. టీవీ-9 లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూ లక్షల్లో వ్యూస్ సాధించింది.. దాంతో బాటు యు ట్యూబ్ లో యువత లక్షల్లో ఆ ఇంటర్వ్యూ చూసింది..అందులో అభివృద్ధి, సంక్షేమం... వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ప్రజల మనస్సులో ఉన్న సందేహాలను టీవీ-9 యాంకర్ రజనీకాంత్ జగన్ ముందు లేవనెత్తారు.. భూ సర్వే గురించి... టైట్లింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు... సంధించిన ప్రశ్నలకు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. అసలు తన విజన్ ఏమిటి... తన పాలనా విధానం ఏమిటి అనేదాని మీద స్పష్టంగా తాను వివరణ ఇచ్చారు. దాంతోబాటు పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన పంచ్ జనంలో బాగా పేలింది... ఒకసారి తప్పు చేస్తే పొరపాటు... రెండో సారి చేస్తే గ్రహపాటు... మూడు నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయి. దాంతోబాటు ఆ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన కొన్ని అంశాలు..పాయింట్స్ కట్ చేసి వీడియోలను ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్హును లక్షల్లో ప్రజలు తమ ఫోన్లలో చూసారని లెక్కలు కనిపిస్తున్నాయి. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది... ఆ ఇంటర్యూ ను ఫోన్లలో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు.. ఈ ఇంటర్వ్హు తమకు బాగా మైలేజి ఇస్తుందని క్యాడర్ సంతోషిస్తోంది.మరోవైపు అదే సమయంలో ఏబీఎన్ ఛానెల్లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదు..చూసేవాళ్ళు కరువయ్యారు... అటు జగన్ ఇంటర్వ్యూను లక్షల్లో చూడగా చంద్రబాబు మాటలు వేలల్లోనే ఉన్నాయ్.. దీంతో బాబు మాటలు గాలిమూటలు అని ప్రజలు నిర్ణయానికి వచ్చారని.. అందుకే చూడడం లేదని ఒక అంచనాకు వచ్చారు. బాబు గత ముప్పయ్యేళ్లుగా చెప్పినవే చెబుతున్నారని... వాటిల్లో నిబద్ధత లేదని.. అందుకే ఆ గాలిమాటలు వినడానికి ప్రజలు ఇష్టపడడం లేదని అంటున్నారు.ఒక పక్క మోదీ రోడ్ షో జరుగుతున్నా.. లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి. అదే సమయంలో సీబిఎన్ ఇంటర్వ్యూ ఏబీఎన్ లో ప్రసారమైతే కనీసం వ్యూస్ కూడా రాలేదు. ఇది సీఎం వైయస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఈమేజ్. వైయస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి ప్రజలకు తెలిసింది. ఇదే ఈమేజ్ మరోసారి జగన్ను సీఎం పీఠం ఎక్కించబోతుందనే సంకేతాలు ముందుగానే తెలుస్తోంది.-సిమ్మాదిరప్పన్న -
రాసలీలల రామ్మోహన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం బట్టబయలైంది. పలువురు మహిళలతో అసభ్యకరంగా చాటింగ్ చేసినట్టు వెల్లడైంది. ప్రస్తుతం వాట్సప్ చాటింగ్, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విజయవాడలోని వివిధ వాట్సప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్ పేజీల్లో, ఇన్స్ట్రాగాం వేదికల్లో అవి చక్కెర్లు కొడుతుండటంతో ఆయన లీలలపై తూర్పు నియోజకవర్గ ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళా ఓటర్లయితే గద్దెకు గుణపాఠం చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇన్నాళ్లకు గద్దె నిజ స్వరూపం బట్ట బయలైందని టీడీపీ వర్గీయులే వ్యాఖ్యానించిడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనకు 15 ఏళ్లుగా అనుచరుడిగా ఉన్న ఒకరు ఆయన రాసలీలల వ్యవహారాలను ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విజయవాడ నగరంలో హాట్ టాపిక్గా మారింది. ఇటీవల గద్దె ప్రధాన అనుచరుడు మహిళలను వేధింపులకు గురిచేసి, దాడి చేయడంతో పటమట పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా గద్దె వాట్సప్ చాటింగ్ వెలుగులోకి రావడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే తూర్పు నియోజక వర్గంలో గద్దె గ్రాఫ్ పడిపోవడంతో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాట్సప్ చాటింగ్స్ వ్యవహారం వెలుగులోకి రావడంతో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నాయకులే తేల్చిచెబుతున్నారు. -
డాబుశౌరి కబుర్లు... ఓటమి భయంతో బెంబేలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరిని ఓటమి భయం పట్టి పీడిస్తోంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎంత ప్రయత్నించినా పార్టీ మారిన ఆయనపై ఓటర్లలో సానుకూలత కనపడడం లేదు. ద్వితీయశేణి నాయకులకు గాలం వేసి, అడ్వాన్స్ ఇచ్చి కండువాలు కప్పుతూ హైప్ క్రియేట్ చేసే యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒకవేళ వారు పార్టీలో చేరినా తరువాత వారి గురించి పట్టించుకోకపోవడంతో వారు బయటికి చెప్పుకోలేక, లోలోన కుమిలిపోతున్నారు. రోజురోజుకూ పడిపోతున్న బాలశౌరి గ్రాఫ్ మచిలీపట్నం జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం పరిధిలో రోజురోజుకూ గ్రాఫ్ పడిపోతుండటంతో ఫ్రస్టేషన్కు లోనవుతున్నారు. దీంతో పిట్టలదొరను మించేలా హామీలు గుప్పిస్తున్నారు. ఐదేళ్లూ ఏమీ చేయలేని ఆయన ఈ సారి గెలిపిస్తే అద్భుతాలు చేస్తానంటూ ఓటర్లకు గాలం వేస్తున్నారు. కులాలు, మతాలు, వర్గాల వారీగా విడగొట్టి లబ్ధి పొందాలని చూసినా ప్రయోజనం లేకపోవడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు తెరతీయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చివరి అస్త్రంగా కులాల మధ్య చిచ్చు పెట్టి, ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారు. వీటన్నింటిని ఓటర్లు గమనిస్తూ సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఓటమి భయం వెంటాడుతుండటంతో, వైఎస్సార్సీపీ నేతల ప్రచారాల్లో , తమ అనుచరులతో గొడవ పెట్టుకొనేలా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. పిట్టలదొర వాగ్దానాలుమచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఎంపీగా ఈ పని చేశాను అని వల్లభనేని బాలశౌరి చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మచిలీపట్నం పోర్టు, మెడికల్ కాలేజీ తన గొప్పతనమే అని డబ్బా కొట్టుకుంటున్నారు. సీఎస్ఆర్ నిధులతో అక్కడక్కడా కమ్యూనిటీ భవనాలు నిర్మాణాలకు శంకుస్థాపనలు మాత్రమే జరిగాయి. ఈ ఐదేళ్లలో ఏమీ చేయలేని బాలÔౌరి ఈ సారి గెలిపిస్తే అన్నీ చేసేస్తానని హామీలు గుప్పించడం పట్ల ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఓటమి భయంతో రెచ్చగొట్టే చర్యలు మచిలీపట్నం పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు, మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణరావు తనయుడు సింహాద్రి చంద్రశేఖరరావు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓటమి ఖాయమని భావించిన బాలÔౌరి రెచ్చగొట్టే వ్యాఖ్యలతో లబ్ధి పొందేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మచిలీపట్నంలో బాలశౌరి వేటాడుతాం, వెంటాడుతాం అంటూ యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. తొలి నుంచి ఆయన వ్యవహార శైలి అలానే ఉంది. ఆయన ఏపార్టీలో ఉన్నా తనకంటూ వర్గాలను ఏర్పాటు చేసుకోవడం వారితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పనులు చేయించడం వాటి ద్వారా లబ్ధి పొందడం పరిపాటి. మచిలీపట్నంలో ఎస్పీ కార్యాలయానికి తన అనుచరులతో వెళ్లి పోలీసులు వారిస్తున్నా వినకుండా గేట్లను తోసుకుని వెళ్లారు. చేతులు మడిచి రౌడీలా అరుస్తూ నానా హంగామా చేశారు.ఈ ప్రశ్నలకు బదులేవి? ఎదురుమొండి, ఎడ్లంక గ్రామాలకు వారధి నిర్మిస్తానని చెప్పే బాలÔౌరి రెండుసార్లు ఎంపీగా పనిచేసినా ఎందుకు పట్టించుకోలేదు. 👉ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబుకి పేరు వస్తుందన్న అక్కసుతో ఎదురుమొండి వారధి టెండర్లు జరగకుండా అడ్డుకున్నది ఎందుకు? 👉 దివిసీమ తీర ప్రాంత సముద్రపు కరకట్టను ఆధునికీకరిస్తానని హామీ ఇస్తున్న బాలÔౌరి గత ఐదేళ్లూ ట్రక్కు మట్టి కూడా ఎందుకు వేయించలేక పోయావు. 👉 నాచుగుంట రహదారి నిర్మాణం చేస్తానని చెబుతున్న బాలశౌరి తెనాలి, మచిలీపట్నం ఎంపీగా ఉండి ఎందుకు ఉద్ధరించలేదు. 👉 తీర ప్రాంత రహదారులు అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ ఒక్క రోడ్డుకు నిధులు ఎందుకు తీసుకురాలేదు.టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం తనకు రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్సార్సీపీని కాదని స్వార్థ ప్రయోజనాల కోసం జనసేనలో చేరిన బాలÔౌరికి టీడీపీ నాయకుల నుంచి ఆశించిన మేర మద్దతు రావడం లేదు. దీంతో ఆయన నైరాశ్యం చెంది మతాలు, వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నుంచి బహిష్కరించిన నేతలు, ఆ పార్టీ పక్కన పెట్టిన నేతలకు డబ్బుల ఎరచూపి జనసేనలో చేర్చుకుంటున్నారు. ఓటర్లను ఎలాంటి ప్రభావం చూపని ఈ నేతలకు సామాజిక మాధ్యమాల్లో విస్త్రతం ప్రచారం ఇచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేనకు ఆదరణ లభించక పోవడంతో బాలÔౌరి కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారు. -
కొలికపూడికి ప్రజా ప్రతిఘటన
సాక్షి ప్రతినిధి, విజయవాడ: తిరువూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన దురుసు స్వభావం, అహంకారపూరిత ధోరణి ఓటర్లను మరింత దూరం చేస్తోంది. గతంలో ఆయన ట్రాక్ రికార్డు సైతం ప్రజల్లో భయందోళన రేకెత్తిస్తోంది. దీంతో పారీ్టల కతీతంగా సామాన్య ఓటర్లు సైతం ఈయనను ఎమ్మెల్యేగా భరించగలమా అనే చర్చ సాగుతోంది. టీడీపీ సామాజికవర్గ నేతలు సైతం కొలికపూడి విషయంలో కినుకు వహిస్తున్నారు. కొలికపూడి సైతం వారిని కలుపుకొనిపోకుండా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలను టీడీపీ నేతలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొలికపూడి గ్రాఫ్ రోజు రోజుకు దిగజారిపోతోంది. దీంతో చివరి అస్త్రంలా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కుట్రలను సైతం పసిగట్టిన ఓటర్లు తిప్పికొడుతుండటంతో ఆయన విలవిల్లాడుతున్నాడు. ప్రతి సారీ ఎన్నికల సమయంలో పారాచ్యూట్ నేతలను తెచ్చి తమవైపు రుద్దుతున్నారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు, చినబాబుకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. హంగామా చేసి... టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే తాగునీటి సమస్య పరిష్కారం కోసం అందోళన చేసినట్లు కలరింగ్ ఇచ్చారు. ఏకొండూరు మండలంలో తాగునీరు సజావుగా సరఫరా అవుతున్నా, గిరిజనులు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పాదయాత్ర పేరుతో రెండు కిలోమీటర్లు కూడా నడవకుండానే హడావిడి చేసి అభాసుపాలయ్యారు. మూడునెలల తరువాత రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ విగ్రహాలన్నీ కూల్చివేస్తామని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నియోజకవర్గంలోని ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. డ్రెయినేజీలో ఉన్న కప్పలను పట్టి కూర వండి పంపిప్తాను తినండి అంటూ మున్సిపల్ అధికారులను కించపరిచేలా సందేశం పంపారు. ఆర్యవైశ్యుల సమావేశంలో మిగతా కులాలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి వెళ్లి ప్రచారం చేసి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించారు. ఇలా కొలికిపూడి శ్రీనివాస్ నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. గంపలగూడెం మండలం మంచిరాలపాడులో కొలికపూడికి మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. ఆయన ప్రచారంలో భాగంగా నోటి దురుసుతో సైకిల్ రావాలి..సైతాన్ పోవాలి.. అని అనగానే అక్కడ ఉన్న మహిళలు గట్టిగా ప్రతిస్పందించారు. ఫ్యానుకే మా ఓటు అంటూ మహిళలు చేతులు చూపుతూ కౌంటర్ ఇచ్చారు. ఊహంచని పరిణామం నుంచి వెంటనే తేరుకొని ఇంకా అక్కడ ఉంటే మహిళల నుంచి పరాభవం తప్పదని గ్రహించి రోడ్షో చేయకుండానే జారుకున్నాడు. ప్రలోభాలకు తెర.. ఎన్నికల్లో గట్టెక్కడం కష్టం అనే భావనకు వచ్చిన కొలికపూడి ఏ.కొండూరు మండలంలో గిరిజన తండాలల్లో తొలుత హోలి కానుకల పేరుతో మభ్యపెట్టే యత్నం చేశారు. పలు సామాజిక వర్గాల వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి, వారికి రకరకాల హామీలు గుప్పించారు. స్థలాలు కొని, సామాజిక భవన నిర్మాణాలు చేపడతానని మభ్య పెట్టారు. ఇప్పుడేమో ఎన్నికల తరువాత చూస్తానని నాలుక మడతేశారు. పదో తరగతిలో 500 కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు రూ.10 వేలు పారితోíÙకం ఇస్తామని చెప్పి అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్నికల తరువాత డబ్బులు ఇస్తామని చెబుతున్నాడు. ప్రచారంలో సైతం జనాలు లేకపోవడంతో, ఆ గ్రామాల్లో అద్దె మనుషులను ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందని టీడీపీలోని నేతలే పేర్కొంటున్నారు. -
జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
సాక్షి, అమరావతి: గాజుగ్లాసు గుర్తు విషయంలో తెలుగుదేశం పార్టీ వెనక్కితగ్గింది. తమ పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీచేస్తున్నాయని, అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో గాజుగ్లాసు గుర్తును జనసేన పార్టీకే రిజర్వ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను టీడీపీ ఉపసంహరించుకుంది. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ మొదలైందని, ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడానికి రాజ్యాంగం అంగీకరించదంటూ ఎన్నికల సంఘం నివేదించడంతో హైకోర్టు ఆ దిశగా ఉత్తర్వులివ్వడానికి సిద్ధమైంది. దీంతో టీడీపీకి పరిస్థితి అర్థమైంది. తమ పిటిషన్ను కొట్టేయడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో పిటిషన్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించి, హైకోర్టు అనుమతి కోరింది. వెంటనే హైకోర్టు పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులిచ్చారు. పొత్తు నేపథ్యంలో గాజుగ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకుగానీ, గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలకుగానీ కేటాయించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలంటూ టీడీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.రు. -
సలాం బాబా సాహెబ్
‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్’ ప్రాంగణం అడుగడుగునా అద్భుతమైన ఆవిష్కరణలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. అణగారిన వర్గాల ఆత్మగౌరవ సూర్యుడు అంబేడ్కర్ స్ఫూర్తి అంబరమంత ఎత్తున నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంతో రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహా శిల్పం దేశానికే రోల్ మోడల్గా నిలిచింది. 18.81 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 206 అడుగుల ఎత్తయిన సామాజిక న్యాయ మహా శిల్పంతో పాటు ప్రతి నిర్మాణం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. రూ.404.35 కోట్లతో చేపట్టిన నిర్మాణంలో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు సందర్శకులకు గొప్ప అనుభూతిని పంచుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జాతికి అంకితమిచి్చన ఈ సామాజిక మహా శిల్పం, అంబేడ్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు ప్రపంచంలోనే అతి పెద్దవిగా రికార్డు సొంతం చేసుకున్నాయి. నాలుగేళ్లకు పైగా పట్టే ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధతో, ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏడాదిన్నరలోనే పూర్తి చేసినట్టు ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్(డీజెడ్ఎం) మహ్మద్ అబ్దుల్ రహీమ్ సాక్షికి తెలిపారు. తుపాను... భూ కంపాలు తట్టుకునేలా ‘మహా స్థూపం’ 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహా స్థూపం (కోర్ వాల్) తుపాను గాలులు, భూ కంపాల తీవ్రతను తట్టుకునేలా డిజైన్ చేశారు. భూ కంపాలతో పాటు 250 కిలోమీటర్ల వేగంతో వీచే తుపాను గాలుల తీవ్రతను తట్టుకునేలా దీన్ని నిర్మించారు. వంద అడుగుల లోతు పునాదితో పాటు 81 అడుగుల పీఠం, దానిపై 510 మెట్రిక్ టన్నుల బరువు, 125 అడుగుల ఎత్తుతో, విగ్రహాన్ని ఠీవిగా నిలబెట్టారు. కాలచక్ర మహా మండపం నీటి కొలను మధ్యలో కాలచక్ర మహా మండపం డిజైన్తో 81 అడుగుల ఎత్తు, 3,481 చదరపు అడుగుల వెడల్పుతో పీఠం నిరి్మంచారు. బౌద్ధం, మయన్, ఈజిప్ట్ నాగరికతలను సమ్మిళితం చేసి 50 డిగ్రీల వంపుతో ఇది ఉంటుంది. పింక్ శాండ్ స్టోన్ (ఇసుక రాయి)తో తాపడం చేయించారు. కలర్ స్టోన్ నిర్మాణం దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదు. పీఠం లోపల జి+2 అంతస్తులను ఐసాసిలెస్, ట్రెపీజియం ఆకారంలో నిరి్మంచారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం పాదాల వద్దకు వెళ్లేందుకు రెండు లిఫ్ట్లున్నాయి. అంబేడ్కర్ చైత్య అంబేడ్కర్ చైత్య (బౌద్ధంలో చైత్య అంటే పవిత్ర క్షేత్రం) పేరుతో గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆ మహనీయుని జననం నుంచి మరణం వరకు అన్ని ప్రధాన ఘట్టాలు ఇందులో డిజిటల్ టెక్నాలజీతో ఆవిష్కరించారు. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని ఉపయోగించుకుని మనం ఏదైనా ప్రశ్న అడిగితే అంబేడ్కర్ బదులిచి్చనట్టు అనుభూతిని కలిగించేలా వీడియో సిస్టమ్ను కూడా అభివృద్ధి చేస్తున్నారు.‘విహార’ థియేటర్ గ్రౌండ్ ఫ్లోర్లో 75 మంది కూర్చొని సినిమా చూసేలా విహార థియేటర్ను నిరి్మంచారు. అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలుసుకునేందుకు, విజ్ఞానం, భౌగోళిక, సంస్కృతి, చరిత్ర వంటి అనేక అంశాలకు సంబంధించిన సినిమాలు ప్రదర్శించనున్నారు. సినిమా టైమింగ్స్, టికెట్ ధర నిర్ణయించాల్సి ఉంది. దక్షిణ భారత్తో అంబేడ్కర్ అనుబంధం దక్షిణ భారత్తో అంబేడ్కర్ అనుబంధానికి సంబంధించిన ఘట్టాలతో మొదటి అంతస్తును తీర్చిదిద్దారు. దక్షిణ భారత దేశంలో అంబేడ్కర్ తిరిగిన ప్రదేశాలు, సభలు, సమావేశాలకు సంబంధించిన ఘట్టాలకు అద్దం పట్టేలా మ్యూజియం ఏర్పాటు చేశారు. ఒక భాగంలో ఉన్న స్టడీ రూమ్లో ఆయన కూర్చున్న మైనపు బొమ్మను పెట్టారు. మరొక భాగంలో 50 మంది విద్యార్థులు కూర్చొని అంబేడ్కర్ జీవిత చరిత్రపై స్టడీ చేసేందుకు ఇంటరాక్షన్ క్లాస్ రూమ్, మరో భాగంలో లైబ్రరీ ఉన్నాయి. మరెన్నో ప్రత్యేకతలు ఈ ప్రాంగణంలో ధ్యాన మందిరం, కుడ్య చిత్రాలు, అతి పెద్ద మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్, చి్రల్డన్ ప్లే ఏరియా, యువత కోసం మల్టీ ప్లే విభాగాలు, అవుట్డోర్ జిమ్, రెండు క్రికెట్ ప్రాక్టీస్ నెట్స్(ఎరీనా), అతి పెద్ద ఫుడ్ కోర్ట్లను తీర్చిదిద్దారు. భూమిపై రెండు నెమలి (పికాక్) ఆకారంలో తీర్చిదిద్దిన పచ్చదనం, ఆగ్రాలోని మొఘల్ గార్డెన్ తరహాలో తీర్చిదిద్దిన పూలవనం, సాహిత్య, కళారూపాల ప్రదర్శనకు యాంఫీ థియేటర్, కిలో మీటరున్నర మేర కాలిబాట.సందర్శన వేళలు: ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు. ఎంట్రీ ఫీజు: రూ.5 యిర్రింకి ఉమా మహేశ్వరరావు, సాక్షి, అమరావతి -
బాబు–మోదీ ఇద్దరూ తోడు దొంగలే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికల సాక్షిగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాని మోదీ ఇద్దరూ తోడు దొంగలేనని స్పష్టమైంది. ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో టీడీపీ, బీజేపీలు జట్టుకట్టి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల్ని మోసగించారు. హోదాను అటకెక్కించారు. హోదా వస్తే రాయలసీమ భవిత బంగారం అవుతుందనుకున్న ఆ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొత్త రాగం అందుకున్న చంద్రబాబు హోదాను మోదీకి తాకట్టు పెట్టారు. 2019 ఎన్నికల ముందు కేంద్రం మోసం చేసిందంటూ దొంగ ఏడుపులు ఏడ్చారు.ఇప్పుడు మళ్లీ ఎన్డీఏ కూటమిగా జట్టుకట్టిన ఆ రెండు పారీ్టలు మళ్లీ రాయలసీమ ప్రజల్ని మోసగిస్తున్నాయి. ప్రధాని బుధవారం రాయలసీమలో ఎన్నికల ప్రచారానికి వచ్చి, ఆ ప్రాంత అభివృద్ధి గురించి ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. ప్రత్యేక హోదాపై, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీపై మోదీని చంద్రబాబు కనీసం ప్రశ్నించలేదు. హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసిందని అప్పుడు గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీతో కలిసి ప్రచారానికి ఎలా వచ్చారని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు.రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. గుండెకాయ లాంటి రాజధాని పోయింది. హైదరాబాద్ను కోల్పోవడంతో కనీసం ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపన వేగం పుంజుకుని రాష్ట్రం గాడిన పడుతుందని రాష్ట్ర ప్రజలు భావించారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయంపై మొరపెట్టుకుంటే ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీనిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే.. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే రాష్ట్ర ప్రజల ఆశల్ని చంద్రబాబు.. కేంద్రం వద్ద తాకట్టుపెట్టి తన స్వార్థం చూసుకున్నాడు. చివరికి ప్రత్యేక ప్యాకేజీ కూడా లేకుండా చేసి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలను మోసగించారు. ‘ప్రత్యేక హోదా సంజీవని కాదు. హోదాతో ఏం మేలు జరుగుతుంది. అంతకంటే ప్యాకేజీతోనే మేలు.. అవగాహన లేనివాళ్లే హోదా గురించి మాట్లాడుతున్నారు’ అని 2017లో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చంద్రబాబు వ్యాఖ్యానించడం అందరికీ గుర్తుండే ఉంటుంది.2014లో కేంద్రంలో టీడీపీ మిత్రపక్షం బీజేపీ అధికారంలో ఉండడంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని అంతా ఆశపడ్డారు. ఆ సమయంలో కేంద్రంపై ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు పూర్తిగా కేంద్రానికి లొంగిపోయారు. హోదాతో ఒరిగేదేమీ లేదని, ప్యాకేజితో అంతకంటే మేలు చేస్తుందని కొత్తపల్లవి ఆలపించారు. ఆ ప్రకటనతో ఏపీ ప్రజలు అవాక్కయ్యారు. అతన్ని వ్యతిరేకించిన వారిని జైల్లో పెడతానని బెదిరించారు.సీమకు తీరని అన్యాయం.. రాయలసీమలో 69 శాతం భూమి సాగు ప్రాంతం కాగా.. మిగతా 31 శాతం భూమి పరిశ్రమలు స్థాపనకు అనుకూలం.1. పరిశ్రమల స్థాపనకు తక్కువ ధరలో భూములు అందుబాటులో ఉన్నాయి. 2. సమీపంలో బెంగళూరు, కర్నూలు, కడప, తిరుపతి ఎయిర్పోర్టులు ఉన్నాయి. 3. ఎగుమతులు, దిగుమతులకు చెన్నై, గోవా, కృష్ణపట్నం పోర్టులు అందుబాటులో ఉన్నాయి. 4. కృష్ణా, తుంగభద్ర నదుల్లో పుష్కలంగా నీరు ఉంది. హంద్రీ–నీవాతో వైఎస్సార్ రిజర్వాయర్లు నిర్మించారు.పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ‘హోదా’ వచ్చుంటే ‘సీమ’ రూపరేఖలే మారిపోయేవి. ‘సీమ’ అభివృద్ధితో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేవి. నిజానికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలో కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు, గరుడ స్టీల్స్, కియా మినహా పరిశ్రమల జాడ లేదు. ఇవి మినహా 2019 వరకూ వెయ్యి మంది ఉద్యోగులు పనిచేసే ఒక్క పరిశ్రమ కూడా లేదు. ప్రస్తుత ప్రభుత్వం చొరవతో గ్రీన్కో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో ప్రపంచంలోనే అతి పెద్ద రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంటు నిర్మిస్తోంది. దీంతో 25 వేల ఉద్యోగాలు రానున్నాయి.ప్రత్యేక హోదా వచ్చుంటే..1. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల్లో పూర్తి మినహాయింపు ఇస్తారు. 2. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్80(సి) కింద కార్పొరేట్ ఆదాయపు పన్ను పూర్తి మినహాయింపు ఉంటుంది. కేంద్రం కూడా 25–30 శాతం రాయితీ ఇస్తుంది. 3. పరిశ్రమల కోసం తీసుకునే వర్కింగ్ కేపిటల్పై 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది. 4. 20 ఏళ్లకు తగ్గకుండా విద్యుత్చార్జీలపై 50 శా>తం రాయితీ ఇస్తారు. 5. పరిశ్రమలకు రవాణా సబ్సిడీ లభిస్తుంది. ముడిసరుకు తీసుకెళ్లేందుకు, తయారీ వస్తువుల ఎగుమతి ఖర్చును కేంద్రం భరిస్తుంది.పరిశ్రమల ప్లాంట్లు, యంత్రాలపై పెట్టుబడిలో 30 శాతం రాయితీ వస్తుంది. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలతో పాటు ఇప్పటికే ఉన్న పాత పరిశ్రమలకు ఇది వర్తిస్తుంది. పరిశ్రమలు స్థాపించినవారికి 25–55 శాతం వెసులుబాటు ప్రత్యేక హోదాతో లభిస్తుంది. ఇలాంటి అవకాశాలతోనే ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ వంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. హోదా ప్రకటిస్తే భూములు, పారిశ్రామికీకరణకు యోగ్యంగా ఉన్న ‘‘సీమ’లో పదుల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పడతాయి. లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు కూడా అభివృద్ధి చెందేవి. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలోనూ మోసమే.. విభజన చట్టంలో రాయలసీమతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజి ఇస్తామని విభజన చట్టంలో 46(ఏ), 46(బి)లో పేర్కొన్నారు. ఈ లెక్కన రూ.22,400 కోట్లు ఈ ప్రాంతాలకు 2014–2019లో మంజూరు చేయాలి. సెక్షన్ 46లో బుందేల్ఖండ్ అనే మాట తీసేసి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి పేరుతో జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఏటా రూ.350 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మనకు హక్కుగా రావల్సిన బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇస్తే ప్రత్యేక ప్యాకేజితో పనిలేకుండా సీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి బాట పట్టేవి. ఈ విషయంలో కూడా చంద్రబాబు కేంద్రంతో రాజీపడ్డారు. అపారమైన ఖనిజం ‘సీమ’ సొంతం!రాయలసీమలో డోలమైట్, ఐరన్ఓర్, గ్రానైట్, యురేనియం, సిలికా, బైరెటీసీ, లైమ్స్టోన్, క్వారŠట్జ్తో పాటు ఎన్నో విలువైన ఖనిజ నిక్షేపాలున్నాయి. రామగిరి, జొన్నగిరి ప్రాంతంలో గోల్డ్ మైన్స్, వజ్రకరూరల్, తుగ్గలి మండలాల్లో వజ్ర నిక్షేపాలున్నాయి. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే సీమలో ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటయ్యేవి. తాడిపత్రి, బేతంచెర్ల, కొలిమిగుండ్లలో నాపరాయి గనులు ఉండడంతో సిమెంట్ పరిశ్రమల స్థాపన పెరిగేది. హోదాతో వ్యవసాయాధారిత పరిశ్రమలకూ ఊతం..‘సీమ’కు హంద్రీ–నీవాతో ఏటా 40 టీఎంసీల జలాలు వస్తాయి. దీంతో వ్యవసాయాధారిత పరిశ్రమలు ఎక్కువ స్థాపించే అవకాశం ఉంది. వేరుశెనగ, పత్తి, పొద్దుతిరుగుడుతో పాటు హారి్టకల్చర్ అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఆపిల్ మినహా అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. దీంతో ప్రాసెసింగ్ ప్లాంటు, కాటన్ పరిశ్రమలు, చీనీ జ్యూస్ తయారీ పరిశ్రమ, వేరుశెనగ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు వ్యవసాయ, ఉద్యానపంటల ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా స్థాపించే అవకాశం ఉంది. దీంతో రైతులు పండించే పంట సులభంగా మార్కెట్కు చేరుతుంది. ధర్మవరం, హిందూపురం, పెనుగొండ, నగరి, ఎమ్మిగనూరు, ఉరవకొండ, మాధవరం ప్రాంతాల్లో నేత కారి్మకులు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో టెక్స్టైల్ పార్కులు నిరి్మస్తే, చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హోదా వస్తే సంబంధిత పరిశ్రమలకు ఎక్కువగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మానవ వనరులు పుష్కలం!రాయలసీమలో జేఎన్టీయూతో పాటు ఎస్కేయూ, ఎస్వీ, రాయలసీమ, యోగి వేమన విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. వీటితో పాటు పుట్టపర్తి సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ ఉంది. ఈ వర్సిటీల ద్వారా ఏటా వేలాదిమంది విద్యార్థులు ఉద్యోగాల వేటలో ఉంటున్నారు. వీరికి వృతినైపుణ్య శిక్షణ ఇస్తే పరిశ్రమలకు అవసరమైన మానవవనరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.రాయలసీమకు బాబు ద్రోహం!2014–19 మధ్య కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ఆ ఐదేళ్లలో ప్రత్యేక హోదా వాణి విని్పంచలేదు. చంద్రబాబు ఏం చెబితే దానికి సీమకు చెందిన ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తలూపారు. ‘సీమ’ భవిష్యత్తును బలిపెట్టారు. హోదా వస్తే పరిశ్రమలు స్థాపించిన వారికి మేలు జరుగుతుంది, నిధుల స్వాహాకు అవకాశం తక్కువ! ప్యాకేజీ వస్తే అంతా స్వాహా చేయొచ్చు! ఇదే సూత్రాన్ని చంద్రబాబు నమ్మి హోదాను కేంద్రం ముందు తాకట్టుపెట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. -
అవినీతి శ్రీశైలం కొండంత
శ్రీశైలం మల్లన్న సాక్షిగా... కర్నూలు జిల్లాకు చెందిన ఈ టీడీపీ నేత నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేశారు. నైతికంగా దిగజారిపోయాక నాకేంటి సిగ్గన్నట్టు అవినీతికి తెగించేశారు. పాలు తాగి రొమ్ము తన్నేసిన ఈ నేత చంద్రబాబు 23 సంఖ్యలో భాగస్వామి. 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచి, నమ్మిన పారీ్టకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ పంచన చేరిపోయారు. తన నియోజకవర్గాన్ని అవినీతికి అడ్డాగా మార్చేశారు. రోడ్లు, డ్రైన్లు, ఎర్రమట్టి తవ్వకాలు, నీరు–చెట్టు, చెరువులు, కుంటల్లో పూడికతీత పనులు... ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీశైలం కొండంత. తన మాట వినని వారిపై దాడులు, బెదిరింపులకు పాల్పడడం అతనికి అతి సాధారణం. సాక్షి, టాస్క్ఫోర్స్: తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ ఈ నేత ఇంట్లో సిరుల వర్షం కురిసింది. ప్రధానంగా నీరు– చెట్టు పనులు ఈ నేతకు కల్పతరువులా మారాయి. ప్రతి పనికి 10 నుంచి 15 శాతం కమీషన్లు చెల్లిస్తేనే పనులు మంజూరు అయ్యేవి. నీరు–చెట్టు పనులకు మండలానికి రూ.50 కోట్లు మంజూరయ్యేవి. ఆత్మకూరు, బండి ఆత్మకూరు, మహానంది, వెలుగోడు మండలాల్లో ఈ పనులు చేయాలంటే ఈ నేతకు కప్పం కట్టాల్సిందే. నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా సార్ గారికి నచ్చదు. ఇతన్ని కాదని అధికారులు ముందుకు వచ్చే వారు కాదు. ఒక్క నీరు–చెట్టు పనుల్లోనే దాదాపు రూ.30 కోట్ల మేర దండుకున్నారు. నాసిరకం పనులు...ఆత్మకూరు మండలంలో ఈ అవినీతి తారస్థాయికి చేరింది. కురుకుంద, ముష్టపల్లి, సిద్ధపల్లి, కృష్ణాపురం తదితర గ్రామాల్లో దాదాపు రూ.60 కోట్లకు పైగా పనులు జరిగాయి. రైతుల పచ్చని పొలాల్లో పంటలను ధ్వంసం చేసి రహదారులు ఏర్పాటు చేశారు. సిద్ధపల్లి గ్రామంలో సాగులో ఉన్న వరి, మిరప, ఆముదాలు లాంటి పంటలను ప్రొక్లెయిన్లతో ధ్వంసం చేసి మట్టి రోడ్లు నిరి్మంచారు. కళ్ల ముందర చేతికి వచి్చన పంటలను నాశనం చేయొద్దని రైతులు అధికార పార్టీ నాయకుల కాళ్లు పట్టుకుని బతిమాలినా ఏమాత్రం చలించలేదు. కురుకుంద గ్రామంలో చెరువు పూడిక తీత పనుల్లో అనుమతికి మించి మట్టిని కొల్లగొట్టి రూ.10 లక్షల బిల్లులు మంజూరు చేయించుకున్నారు. అదే చెరువులో మరోసారి పూడిక తీసి మరికొన్ని లక్షలు దండుకున్నారు. 👉 వెలుగోడు మండలంలో ఈ మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు ఒకరు రూ.10 లక్షల పనికి లక్షకు రూ.15 వేల చొప్పున కమీషన్ వసూలు చేశారు. పంట పొలాలకు వెళ్లే రహదారులు, పంట కాల్వల్లో పూడిక తీత పనులు, మట్టి రోడ్ల మరమ్మతులు, తెలుగు గంగ పరిధిలో రాస్తా పనులు, కేసీ కెనాల్ పరిధిలో చేపట్టిన ప్రతి పనిలోనూ కమీషన్లు దండారు. 👉 బండి ఆత్మకూరు మండలంలో రూ.50 కోట్లకు పైగా పనులు మంజూరు అయ్యాయి. కేసీ కెనాల్, కుందు ఆయకట్టు రోడ్ల అభివృద్ధి పేరుతో నిధులు మంజూరు చేయించుకొని దాదాపు 20 నుంచి 30 శాతం కమీషన్లు వసూలు చేశారు. కుందు నది వెడల్పు 50 మీటర్లు ఉంటే మొత్తం పూడిక తీసినట్లు కొలతలు వేసి బిల్లులు స్వాహా చేశారు. మద్దిలేరు, పోతుల వాగు, సంకలవాగు, అభివృద్ధి పనులు కూడా తూతూ మంత్రంగా చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. 👉 మహానంది మండలంలో సీసీ రోడ్లు, ఎర్రమట్టి తవ్వకాలతో ప్రభుత్వ ఖజానాను గుల్ల చేశారు. రహదారులు, చెరువులు, కుంటల పూడికతీతకు రూ.11.62 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు చేసిన స్థానిక టీడీపీ నాయకులు తమ నేతకు 15 నుంచి 20 శాతం ముడుపులు చెల్లించారు. గాజులపల్లి అంకిరెడ్డి చెరువులో ఎర్రమట్టి తరలింపులో స్థానిక ఎమ్మెల్యే 60 శాతం, అప్పటి జిల్లా మంత్రిగా ఉన్న నేత 40 శాతం మేర డబ్బులు పంచుకున్నట్లు సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు. అన్ని అర్హతలున్నా రెండు నెలల మొత్తం ముందుగా ఇస్తేనే పింఛను మంజూరు చేస్తామని జన్మభూమి కమిటీ సభ్యులు బహిరంగంగానే వసూలు చేశారు. ఆదరణ పథకం కింద కుల వృత్తి దారులకు సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చే వాషింగ్ మిషన్లు, ఇతర పరికరాలపై కూడా కమీషన్లు వసూలు చేశారు. నాటి పరిస్థితి తలుచుకుంటేనే భయమేస్తుందని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటారు. క్రిమినల్ కేసులు ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులున్నాయి. బెదిరింపులు, దాడులు తదితర నేరాలపై ఐపీసీ 504, 506 సెక్షన్ 155(3), ఐపీసీ 143, 341, 149, 324, 506, 34, సీఆర్పీసీ 151 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. -
ఫ్లాష్బ్యాక్.. నీచంగా మాట్లాడింది గుర్తుందా?
సాక్షి, అమరావతి : ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇప్పుడు ఎనలేని ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వారిని ముప్ప తిప్పలు పెట్టారు. 2019 ఎన్నికల సమయంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఏబీఎన్ చానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, సీఎంగా ఉన్న చంద్రబాబు అవమానకరంగా మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి అప్పట్లో లీకైంది. ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రయోజనాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రాధాకృష్ణ బూతు పురాణం మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవమానించేలా, కించపరుస్తూ మాట్లాడుతుంటే.. చంద్రబాబు ఆస్వాదిస్తూ ఉండిపోయారు. పైగా రాధాకృష్ణ చెప్పినవన్నీ నిజాలేనని కితాబిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులపై తనకున్న కక్షను పరోక్షంగా చాటుకున్నారు. లీకైన వీడియోలో వారి సంభాషణ ఇలా.. చంద్రబాబు : ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీ ఇస్తామని చెప్పాంగానీ... రాధాకృష్ణ : ఏంది? ఉద్యోగులకు సెంట్రల్ పీఆర్సీనా? మీరందరూ కలిసి రాష్ట్రాన్ని ఎక్కడకు తీసుకెళదామనుకుంటున్నారు? నాన్ ప్లాన్ (ప్రణాళికేతర వ్యయం) ఇప్పటికే తడిసి మోపెడవుతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే. ఇది అంతే. రెండూ ఒకటే. ఆ నా కొడుకులకు (ఉద్యోగులకు) జీతాలివ్వడానికా.. జనం ట్యాక్సులు కట్టేది? అది వద్దు. వద్దే వద్దు. తీసేయండి. చంద్రబాబు : అదేం కాదు. వాళ్లను కూడా లాగాలి కదా? రాధాకృష్ణ: సరే అది మీ ఇష్టమనుకోండి. అది వేరే విషయం. బాబు : కాదు కాదు. నేను చెబుతాను వింటావా? మీరు చెప్పినవన్నీ కరెక్టు. కానీ అధికారం లేకపోతే మనమేమీ చేయలేం. దాని కోసం.. ఇంట్రెస్టింగ్ అంశం చెబుతా. నేను ఎప్పుడూ ప్రజలకు డబ్బులు ఇచ్చేవాడిని కాదు. ఇది నా వ్యక్తిత్వానికి విరుద్ధం. కానీ ఇవ్వకపోతే చేతకానివాణ్ని అనుకుంటారు. ఇటీవల కాలంలో ఏమి చేశానంటే బిగినింగ్లో మరీ డిజాస్టర్స్గా ఉన్నప్పుడు (హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేటప్పుడు) పది వేలిచ్చాను. ఆ తర్వాత అంతెందుకులే అనుకుని రూ.5 వేలిచ్చా. ఆ తర్వాత దాన్ని రూ.2,000 వేలకు తగ్గించా. ఇలా ఇచ్చింది 1,300 మందికే. నేనేమంటానంటే నాలాంటి వాడు కాస్త లిబరల్గా కనబడకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ తర్వాత మేనేజ్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం ఈజీగా వచ్చేస్తాయి. రాధాకృష్ణ: ఇప్పుడు అడ్రస్ చేయగలిగింది కూడా ఏమీ లేదులే.. చంద్రబాబు: రుణమాఫీ చేస్తానన్నాను. ఎంత చేస్తాను.. ఎంత మందికి అన్నది తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు. ముందు అట్లా చేయాలి. -
ఏపీ: జిరాక్సులు కాదు.. ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారు
సాక్షి, అమరావతి/అక్కిరెడ్డిపాలెం (గాజువాక): స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాక ఒరిజినల్ డాక్యుమెంట్లు కాకుండా జిరాక్సు కాపీలు మాత్రమే ఇస్తున్నారనే ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. రిజిస్ట్రేషన్లు చేయించుకున్న అనేక మంది తమకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారని చెబుతున్నారు. వారంతా ఒరిజినల్ డాక్యుమెంట్లను కూడా చూపిస్తున్నారు. ఈ–స్టాంపింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లకూ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తున్నారని వినియోగదారులు తెలిపారు. పలుచోట్ల నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు అందుబాటులో ఉండటంతో అక్కడా రిజిస్ట్రేషన్లు చేసి గతంలో మాదిరిగానే ఒరిజినల్ డాక్యుమెంట్లు జారీ చేస్తున్నారు. ఆస్తి పత్రాలను ప్రభుత్వం వద్దే ఉంచుకుంటారనే ప్రచారం నిజం కాదని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న వారికి స్పష్టంగా తెలుస్తోంది. అనుమానాలు సృష్టిస్తున్న సోషల్ మీడియా ప్రచారం భూముల రిజిస్ట్రేషన్పై సోషల్ మీడియా, టీడీపీ ప్రచారం చేస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ విన్న వారు మాత్రం అది నిజమేనని భ్రమపడుతున్నారు. అనుమానం ఉన్నవారు ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళితే.. అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల తీరు, ఇస్తున్న డాక్యుమెంట్లు ఒరిజినల్సా, జిరాక్సులా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరో ముఖ్యాంశం ఏమిటంటే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి అసలు సంబంధమే లేదనే విషయం కూడా అక్కడికి వెళ్లిని వారికి అవగతమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించడం కోసమే జిరాక్సుల ప్రచారం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. భూ హక్కు చట్టంపై వదంతులు నమ్మొద్దు ఆస్తి తాలూకా ఒరిజనల్ డాక్యుమెంట్లను చూపుతున్న ఆర్.కృష్ణగాజువాక ప్రాంతానికి చెందిన ఈయన పేరు ఆర్.కృష్ణ. ప్రస్తుతం హైదరాబాద్లోని ఎంఎస్సీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇటీవల గాజువాకలోని ఓ ఆస్తిని ఈయన కొనుగోలు చేశారు. గాజువాక జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బుధవారం తన ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘ల్యాండ్ టైట్లింగ్పై వస్తున్న వదంతులను, సోషల్ మీడియాలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని కొందరు వక్రీకరించడంపై అనుమానం వచ్చి సబ్ రిజిస్ట్రార్ను వివరణ కోరాను. ఆస్తి హక్కు పత్రాల ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారా, జిరాక్స్ డాక్యుమెంట్లు ఇచ్చారా అని అడిగాను. ఈ వదంతులన్నీ అవాస్తవమని సబ్ రిజిస్ట్రార్ చెప్పారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆస్తి హక్కుదారునైన నాకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందజేశారు. సోషల్ మీడియాలో భూ హక్కు చట్టంపై వస్తున్న వదంతులన్నీ అవాస్తవాలే. వీటిని ఎవరూ నమ్మవద్దు’ అని చెప్పారు. ఈ విషయాలపై ఓ వీడియో కూడా విడుదల చేశారు.ఒరిజినల్సే ఇచ్చారు ఉయ్యూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. రిజిస్ట్రేషన్ అయ్యాక ఒరిజనల్ దస్తావేజులు ఇచ్చారు. ఒరిజినల్స్ ఇవ్వడం లేదు, జిరాక్స్ కాపీలు ఇస్తున్నారంటూ కొన్ని టీవీల్లో వస్తున్న వార్తలు నిజం కాదు. – తాతినేని రామ్మోహనరావు, గోపువానిపాలెం, పమిడిముక్కల మండలం, కృష్ణా జిల్లా ఆ ప్రచారం నిజం కాదు నా తల్లితో కలిసి ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. పావు గంటలో రిజ్రస్టేషన్ చేశారు. వెంటనే డాక్యుమెంట్ ఇచ్చారు. రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ ఇవ్వడం లేదని బయట జరుగుతున్న ప్రచారం నిజం కాదు. మా చేతికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. – ప్రసాద్, చింతలపూడి, ఏలూరు జిల్లాఒరిజినల్ తీసుకున్నాను నేను భీమునిపట్నం రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో స్థలం కొన్నాను. రిజిస్ట్రేషన్ కోసం వెళితే వెంటనే పూర్తి చేశారు. సబ్ రిజిస్ట్రార్ను కలిసి కొత్త విధానంలో డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని చెబుతున్నారని అడిగాను. అది అబద్ధమని చెప్పారు. వెంటనే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. – శ్రీకాంత్, భీమిలి, విశాఖ జిల్లా -
నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు అధికారమే పరమావధి. ఇందుకోసం ఎవరినైనా వెన్నుపోటు పొడుస్తారు.. విమర్శిస్తారు.. వ్యతిరేకిస్తారు. విలువలు, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చేస్తారు. మళ్లీ అవసరమైతే తాను తిట్టినవారి ఒళ్లోనే చేరతారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 10న ప్రధాని నరేంద్ర మోదీ గుంటూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. తాజాగా బుధవారం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించిన విజయవాడ రోడ్డుపైనే నాడు టీడీపీ నేతలు ప్రధానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ నేతలు నల్ల జెండాలు ఎగరవేస్తూ ‘గో బ్యాక్ మోదీ’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు నాలుగైదు రోజుల ముందు చంద్రబాబు విజయవాడ బెంజి సర్కిల్లో నల్లచొక్కా తొడుక్కొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు ఆరు నెలలు ముందే బీజేపీని వ్యతిరేకించి టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ మళ్లీ ఇప్పుడు 2024 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు అదే బీజేపీతో పొత్తు పెట్టుకొని తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరిపోవడం గమనార్హం. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డిఅయినా కరుస్తారనడానికి ఈ ఉదంతం ఒక నిదర్శనం. నాడు ఎన్నికల ముందు బాబు డ్రామా.. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా చేరింది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ చేరి మంత్రి పదవులు కూడా తీసుకుంది. అయినప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరంకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రైల్వే జోన్ ఇలా ఏ ముఖ్యమైన హామీని సాధించలేకపోయింది. ఇలా అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగింది. రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనందుకు తప్పుకుంటున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కూడా బీజేపీ ప్రత్యేక హోదాపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయినప్పటికీ చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరారు. అప్పట్లో ‘నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు. భార్యనే చూసుకోనివాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు’ అంటూ చంద్రబాబు వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనికి తానేమీ తక్కువ తినలేదన్నట్టు ప్రధాని మోదీ సైతం ‘చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు’ అంటూ విమర్శించారు. అంతేకాకుండా ‘పోలవరం ప్రాజెక్టును డబ్బులు డ్రా చేసిపెట్టే ఏటీఎం లాగానే చంద్రబాబు వాడుకుంటున్నారు’ అని తీవ్ర విమర్శలు చేశారు. నాడు ప్రధాని మోదీపై చంద్రబాబు వ్యక్తిగతంగా దారుణమైన విమర్శలు చేసి.. ఇప్పుడు అధికారమే పరమావధిగా పొత్తు పెట్టుకోవడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మోదీని ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు.. దేశ రక్షణ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న రూ.59,000 కోట్ల రఫెల్ ఒప్పందం, అందుకు సంబంధించిన నివేదికలు, ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. దానిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వ విధ్వంసక నిర్ణయాలను తెలియజేస్తోంది. మోదీ జీ మీరు దేశాన్ని మోసం చేసినప్పుడు సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు. 2019 ఫిబ్రవరి 8న తన ట్విట్టర్లో మీకూ, బ్రిటిష్ వాళ్లకూ తేడా ఏమిటి? వాళ్లే నయం. కాటన్ దొర ఇచి్చన నీళ్లయినా తాగుతున్నాం. మేం మీ బానిసలమా? రాజధానిని 50 ఏళ్లకు నిరి్మస్తారా? నాలాంటి సీనియర్ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నారంటే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. 2002లో మోదీ, నిన్న అమిత్షా రాజకీయాల్లోకి వచ్చారు. నేను 1978లోనే ఎమ్మెల్యేనయ్యా. ప్రధాని మోదీని సార్ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి, నీరు ముఖాన కొట్టిపోతారా? –2019 ఫిబ్రవరి 2న శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకొని ఢిల్లీ వెళ్లా. కేంద్రం ముందు చేయి చాచా. ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి. 2018 జూన్ 9న నెల్లూరు సభలో బీజేపీకి ఒకటే చెబుతున్నా.. టీడీపీతో పెట్టుకుంటే ఖబడ్డార్.. మీ కుట్రలు ఏ రాష్ట్రంలోనైనా చెల్లుతాయోమో.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సాగవు. 2018లో శృంగవరపుకోటలో నేను ఎవరికీ భయపడేది లేదు. నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందను కాను. ఒక్కో రాష్ట్రంలో నాయకత్వాన్ని బలహీనపరచడానికి ఇష్టమొచ్చినట్టు ఆడుకోవడం వీళ్లకు అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశాను. ఎప్పుడు భయపడలేదు. భయమనేది నా జీవితంలో లేదు. 2018 మార్చి 6న విజయవాడలో విభజన హామీలను నాలుగు బడ్జెట్లలో పట్టించుకోలేదు. చివరి బడ్జెట్లోనూ ఏపీ పేరు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయలేదు. –2018 మార్చి 7న వివిధ సందర్భాల్లో మోదీ చంద్రబాబునుద్దేశించి చేసిన విమర్శలు.. » అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. ళీ ఎన్టీఆర్ ఏపీకి కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలనుకున్నారు. అందువల్లే టీడీపీ ఆవిర్భవించింది. కానీ, ఈ రోజు కాంగ్రెస్ వారసత్వపు అహంకారాన్ని ఎదుర్కొవాల్సిన చంద్రబాబు అదే వంశపారంపర్య కుటుంబం ముందు మోకరిల్లారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్ను దుష్టకాంగ్రెస్ అని ఎన్టీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి (చంద్రబాబు) అదే కాంగ్రెస్తో దోస్తీ కట్టారు. » చంద్రబాబుకు ఏమైంది? ఆయన నా కంటే చాలా సీనియర్నని మళ్లీ మళ్లీ నాకు గుర్తు చేస్తుంటారు. ఇందులో వివాదం ఏముంది? మీరు (చంద్రబాబు) సీనియర్. అందువల్లే గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడూ తక్కువ చేయలేదు. కానీ, మీరు సీనియర్.. కూటములు మార్చడంలో.. కొత్త కూటములు కట్టడంలో.. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో.. ఈ రోజు ఎవరిని తిడతారో.. రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో. నేనైతే ఈ విషయాల్లో సీనియర్ను కానే కాదు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం. –2019 ఫిబ్రవరి 10న గుంటూరులో ప్రధాని మోదీ » కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందించినప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. ఎప్పుటికప్పుడు ప్రాజెక్టు ఖర్చు అంచనాలు పెంచుతూ, ఎక్కువ నిధులు పొందుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న నాయకుల (చంద్రబాబు)కు ఒక ఏటీఎం లాంటిది. అందులో నుంచి డబ్బులు తీసేసుకోవడమే. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలని యూటర్న్ బాబు అనుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. » ప్రజలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేవారైతే.. ఇక్కడి యూటర్న్ బాబు మాత్రం తన కుటుంబం మొదట, ఆ తర్వాత తన అనుయాయులు అన్నట్టు పాలన సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హెరిటేజ్ (సంస్కృతి) మంచి పాలనతో అభివృద్ధి చెందాలని. కానీ యూటర్న్ బాబు నైజం మాత్రం తన సొంత హెరిటేజ్ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరు. – 2019 ఏప్రిల్ 1న రాజమండ్రి ఎన్నికల సభలో ప్రధాని మోదీ -
బాబు, పవన్, బాలయ్య, కిరణ్.. కూటమి ప్రముఖుల ఎదురీత
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేక గుంపుగా వస్తున్న టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలోని ప్రముఖ నేతలు తమ సొంత స్థానాల్లో ఎదురీదుతున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం సంగతి ఎలా ఉన్నా సొంత నియోజకవర్గాల్లోనే వీళ్లంతా ఓటమి బాటలో పయనిస్తుండడం ఆసక్తికరంగా మారింది. పైకి వీరంతా గంభీరంగా పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నా గెలిచే పరిస్థితిలేదని పలు సర్వేలు తేటతెల్లం చేస్తున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఎప్పుడూలేని విధంగా కుప్పం ప్రజలు వణికిస్తున్నారు.ఈసారి ఆయన గెలవడం కష్టమనే పరిస్థితి నెలకొనడంతో టీడీపీ అక్కడ ప్రత్యేకంగా దృష్టిసారించినా పెద్దగా మార్పురాలేదని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో కుప్పం మున్సిపాల్టీని చేజార్చుకోవడంతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లోనూ చంద్రబాబు తొలిసారి భంగపడడంతోనే ఆయన ఓటమికి బీజంపడింది. దీంతో కుప్పంలో గెలవడమే తప్ప ఎప్పుడూ నియోజకవర్గాన్ని పట్టించుకోని చంద్రబాబు నియోజకవర్గం చుట్టూ తిరగక తప్పలేదు. ఇప్పుడు ఆయన సతీమణి భువనేశ్వరి కూడా అక్కడే మకాం వేసి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.గతంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఆమె ఇలా ప్రచారం చేసిన దాఖలాల్లేవు. శాంతిపురం మండలంలో ఈసారి చంద్రబాబుకు గట్టి షాక్ తగిలే పరిస్థితి ఉంది. బెంగుళూరు నుంచి 200 మంది ఐటీ ప్రొఫెషనల్స్ని రెండునెలలుగా కుప్పంలో ఉంచి పనిచేయిస్తున్నా గెలుస్తామనే నమ్మకం చంద్రబాబులో కనిపించడంలేదు. సీఎంగా చేసినప్పుడు కూడా కుప్పం గురించి ఆయన పట్టించుకోలేదనేది స్థానికుల నిశ్చితాభిప్రాయం. ఆయన్ను కుప్పం ప్రజలు ఎనిమిదిసార్లు గెలిపించినా చంద్రబాబు కుప్పంను రెవెన్యూ డివిజన్గా చేయలేకపోయారు. వైఎస్ జగన్ వచ్చాక కుప్పం రెవెన్యూ డివిజన్, పోలీసు సబ్డివిజన్ ఏర్పాటుచేశారు. ఇన్నాళ్లూ కనీసం కుప్పంలో సొంత ఇల్లు కూడా చంద్రబాబు కట్టుకోలేదు. కేవలం తనకు ఓట్లేసే మిషన్లుగా అక్కడి జనాన్ని ఆయన చూశారు. దీన్నిబట్టే ఆయనకు కుప్పంపై ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని అక్కడి ప్రజలు గమనించారు.మరోవైపు.. అభివృద్ధితోపాటు ప్రజలకు ఎలాంటి భేదాలు లేకుండా సంక్షేమ పథకాలు అందడంతో వైఎస్ జగన్పట్ల ఆదరణ కనిపిస్తోంది. దీంతో కుప్పంలో చంద్రబాబును ఓటమి భయం వెంటాడుతోంది. ఇవే తన చివరి ఎన్నికలు కాబట్టి తనను గెలిపించాలంటూ ఆయన అభ్యర్థిస్తుండడాన్ని బట్టి ఆయన్ను ఓటమి భయం వెంటాడుతోందని స్పష్టమవుతోంది. పిఠాపురంలో పవన్కు నాన్లోకల్ గండంజనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో గెలుపునకు చాలా దూరంలో ఉన్నారు. ఒక్కసారి తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఆయన దీనంగా ప్రాథేయపడుతున్నా జనం మాత్రం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. సినిమా స్టార్ కాబట్టి చూడ్డానికి రావడం తప్ప ఓటు వేస్తారా లేదా అనే దానిపై జనసేన నాయకులకే నమ్మకం కలగడంలేదు.నాన్ లోకల్ కావడం, కేవలం కులం ఓట్ల ప్రాతిపదికనే పవన్ అక్కడ పోటీచేస్తుండడం ఆయనకు పెద్ద మైనస్ పాయింట్లుగా మారాయి. పవన్ తమ ఎమ్మెల్యే అయితే ఆయన్ను కలవడం కుదరదని, తమకు ఏమైనా సమస్య వస్తే వెళ్లి చెప్పుకునే అవకాశం ఉండదనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. ఆయన పూర్తిస్థాయి రాజకీయ నేత కాకపోవడంతో ఎంతవరకూ నమ్మవచ్చనే అనుమానాలూ జనంలో ఉన్నాయి.అయితే, జబర్దస్త్ షో ఆర్టిస్టులు, సినిమా వాళ్లు, పలువురు మెగా ఫ్యామిలీ హీరోలు పిఠాపురంలో ఆయనకు అనుకూలంగా ప్రచారం చేస్తూ హడావుడి చేయడం అక్కడి జనానికి వినోదం పంచుతోంది. టీడీపీ ఇన్ఛార్జి వర్మ పైకి పవన్ కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా, లోపాయకారీగా టీడీపీ కేడర్ను సైలెంట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎంత హంగామా చేసినా జనంలో మాత్రం పవన్ గెలుపునకు దోహదపడే అంశాలు కనిపించడంలేదు. ఈసారి బాలయ్యకూ నిరాశే..హిందూపురంలో నందమూరి బాలకృష్ణ కూడా ఈసారి గట్టెక్కడం కష్టంగా మారింది. మైనారిటీలు ఎక్కువగా ఉండడంతో వారు ఈసారి బాలయ్యకు ఝలక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు.. కూటమి రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామి టీడీపీ ఓట్లను భారీ సంఖ్యలో చీల్చే అవకాశం ఉంది. అలాగే, టీడీపీ కేడర్, ద్వితీయశ్రేణి నేతల్లోనూ బాలకృష్ణ పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాలకృష్ణ వల్ల ఉపయోగం లేకుండాపోయిందని బాధపడుతున్నారు. ఆయన ఇక్కడ ఎవరికీ అందుబాటులో ఉండకపోవడం, ఎప్పుడూ నందమూరి కుటుంబాన్ని గెలిపించడమే తప్ప వారిక్కడ లేకుండా తమపై పెత్తనం చేయడంపై వారిలో అసహనం కనిపిస్తోంది. దీనికితోడు వైఎస్సార్సీపీ బీసీ అభ్యర్థిని నిలబెట్టడంతో ఆ ఓట్లలోనూ భారీ చీలిక తప్పదంటున్నారు. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ కంచుకోట బద్దలవుతుందని గట్టిగా వినిపిస్తోంది.ఓటమి అంచున ఉత్తరాంధ్ర ముఖ్యనేతలు..ఉత్తరాంధ్రలో టీడీపీ ముఖ్య నేతలైన గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, అశోక్గజపతిరాజు కుమార్తె అదితిలు సైతం ఈ ఎన్నికల్లో గెలవడం కష్టంగా మారింది. » తరచూ నియోజకవర్గాలు మార్చే నేతగా ముద్రపడిన గంటా శ్రీనివాసరావును భీమిలి జనం నమ్మడంలేదు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే భూ కుంభకోణాలతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేయడాన్ని వారింకా మరచిపోలేదు. గంటా గెలిస్తే తమ భూములు ప్రమాదంలో పడతాయనే ఆందోళన ఉంది. అలాగే, గెలిచినా నియోజకవర్గాన్ని పట్టించుకోరనే వాదనా ఉంది. వీటికితోడు విశాఖను పరిపాలనా రాజధానిగా చేసే విషయంలో ఆయన వైఖరిపైనా వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో గంటా గెలవడం సాధ్యంకాదని చెబుతున్నారు. » నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా ఎదురీదుతున్నారు. వివాదాలు, నోటి దురుసుతనంతో ఆయన ప్రజల ఆదరణ కోల్పోయారు. » ఎవరూ పోటీచేయడానికి ముందు రాకపోవడంతో చీపురుపల్లి బరిలో నిలుచున్న కళా వెంకట్రావుకు గెలుపు ఆశలేలేవని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణను ఎదురొడ్డి కళా నిలబడడం అసా«ద్యమని ఆదిలోనే తేలిపోయింది. ఆయన మొక్కుబడిగానే ప్రచారం చేస్తున్నారు. » ఇక విజయనగరంలో అశోక్గజపతిరాజు కుమార్తె అదితి సెంటిమెంటునే నమ్ముకుని తనను గెలిపించాలని కోరుతున్నా స్థానికంగా అంత స్పందన రావడంలేదు. ఆమె గెలిచినా కోటకే పరిమితమవుతారని అందుబాటులో ఉండరనే అభిప్రాయం నెలకొంది. టీడీపీ రెబల్గా మీసాల గీత ఉండడం, ఆమె చీల్చే ఓట్లు గణనీయంగా ఉండే అవకాశం ఉండడంతో అదితికి ఓటమి తప్పదంటున్నారు. » అనకాపల్లిలో జనసేన తరఫున కొణతాల రామకృష్ణ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఆయన ప్రజలకు దూరమై చాలాకాలం కావడంతో ఇప్పుడు గెలిచి ఏం చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. » రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, డోన్లో కోట్ల సూర్యప్రకాశరెడ్డి గెలుపు అవకాశాలకు దూరంగానే ఉన్నారు. » మంగళగిరిలో చంద్రబాబు తనయుడు లోకేశ్ ఎంత ప్రయత్నిస్తున్నా గెలుపు ఊపు రావడంలేదు. తాయిలాలపైనే నమ్మకం పెట్టుకున్నా అది కూడా నెరవేరే సూచనలు కనిపించడంలేదు. రెండోసారి మంగళగిరి ప్రజలు ఆయన్ను తిరస్కరిస్తారనే వాతావరణం కనిపిస్తోంది.సీఎం రమేష్, సుజనా, కిరణ్, పురందేశ్వరి, నాదెండ్ల..పొత్తులో సీట్లు దక్కించుకుని బీజేపీ తరఫున అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట ఎంపీ స్థానాల నుంచి పోటీచేస్తున్న సీఎం రమేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డిలకు గెలుపుపై ఆశలు వదిలేసుకున్నారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి, తెనాలి నుంచి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ధనబలం, కులబలంతో గెలవొచ్చని వారు బరిలోకి దిగినా అందుకు అవకాశాలు లేకపోవడంతో వారికి కళ్లెదుటే ఓటమి సాక్షాత్కరిస్తోంది. -
నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల మద్దతు లేదేని, ఓటమి ఖాయమని తేలిపోవడంతో చంద్రబాబు తన నల్ల ఖజానా గేట్లు ఎత్తేశారు. పచ్చ నోట్ల వరద పారిస్తున్నారు. ఇందుకు నిదర్శనాలివి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు, ఎన్నికల అధికారుల తనిఖీల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, అనుచరుల వద్ద భారీ మొత్తంలో అక్రమ నగదు, కానుకలు పట్టుబడ్డాయి.వెలుగులోకి రాని అక్రమాలు, పట్టుబడకుండా టీడీపీ నేతల వద్ద గుట్టలు గుట్టలుగా ఉన్న అక్రమ సొమ్ముకు లెక్కే లేదు. ఎన్నికల కమిషన్ (ఈసీ)ని బురిడీ కొట్టిస్తూ కొత్తదారుల్లో పచ్చ నోట్లు వెదజల్లుతున్నారు. అందుకోసం షెల్ కంపెనీల నుంచి రామోజీరావుకు చెందిన మార్గదర్శి, నారాయణ విద్యా సంస్థలు, ఇతర టీడీపీ నేతల వ్యాపార సంస్థల్లోకి భారీగా అక్రమ నిధులు మళ్లిస్తున్నారు.గొల్లపూడిలో దొరికింది పెద్దమొత్తమే!భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు ఆలూరి సురేష్ ఇంటిపై ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసు అధికారుల దాడిలో దొరికింది రూ. కోటి అని చెబుతున్నప్పటికీ, ఇంకా పెద్దమొత్తంలోనే నగదు బయటపడినట్లు భావిస్తున్నారు. సురేష్ ఇంట్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు భవానీపురం పోలీసులకు అందిన సమాచారాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి సుధకు తెలియజేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గొల్లపూడి టెలికాం కాలనీలోని సురేష్ ఇంట్లో సోదాలు చేశారు.దాదాపు నాలుగు గంటలపాటు సోదాలు చేసి, సురేష్ను విచారించారు. సొమ్మును లెక్కించేందుకు కౌంటింగ్ మిషన్ కూడా తెప్పించారు. దీంతో పెద్ద మొత్తమే దొరికి ఉండవచ్చని భావిస్తున్నారు. సాయంత్రం 6.30 తరువాత ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిణి సుధ బయటకు వచ్చి తమ సోదాలో కోటి రూపాయలు దొరికాయని ముక్తసరిగా చెప్పారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేసి వెళ్లిపోయారు. అసలు ఈ డబ్బు సురేష్ వద్దకు ఎలా వచ్చింది, ఇతర విషయాలు గోప్యంగా ఉంచడం అనేక అనుమానాలకు తావిచ్చింది. మైలవరం నియోజకవర్గంలో పంచాయితీరాజ్ డీఈఈగా ఉన్న సుధకు ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్తో పరిచయాలు ఉండటం వల్లే ఇంత గోప్యంగా వ్యవహరించారన్న అనుమానాలు కలుగుతున్నాయి. కృష్ణప్రసాద్ ఇదే విధంగా తన సామాజికవర్గానికి చెందిన పలువురి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు డంప్ చేసినట్లు సమాచారం.ఉప్పందించింది దేవినేని ఉమా వర్గమే!ఎన్టీఆర్ జిల్లా కవులూరుకు చెందిన ఆలూరి సురేష్ కొన్నేళ్లుగా గొల్లపూడిలో శ్రీనివాస లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నడుతున్నాడు. గతంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావు వెంట ఉండేవారు. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వచ్చి మైలవరం అభ్యర్ధిగా పోటీ చేస్తుండటంతో ఆయనకు అనుచరుడిగా మారారు. సురేష్ బుల్లెట్ బైక్ వెనుక నంబరు కూడా లేదు. ‘మన మైలవరం..మన వసంత’ అని స్టిక్కర్ ఉంది. మైలవరం నియోజకవర్గంలో కృష్ణప్రసాద్కు, మాజీ మంత్రి దేవినేని ఉమా వర్గానికి పడదు. దీంతో దేవినేని వర్గమే సురేష్ వద్ద ఉన్న డబ్బు సమాచారాన్ని పోలీసులకు చేరవేసి ఉంటారని భావిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓటర్లకు టీడీపీ పంపిణీ చేస్తున్న ఓటర్ల స్పిప్పులు ఇవి. ఎన్నికల్లో ఓటర్ల స్లిప్పుల పంపిణీ సాధారణమే. కానీ అక్కడే ఉంది చంద్రబాబు మాయోపాయం. ఓటర్లకు పంచుతున్న ఆ ఓటరు స్లిప్పుల మీద హోలోగ్రామ్ ముద్రించారు. ఈ డబ్బు ఇచ్చేందుకు ప్రతి బూత్కు ఓ ఏజెంటును నియమించారు. ఓటరు స్లిప్పును ఆ ఏజెంటుకు ఇస్తే, ఆయన దానికి స్కాన్ చేసి, ఓటరు ఖాతాలో రూ.3 వేలు వేస్తారు. ఇలా నియోజకవర్గంలోని 1.70 లక్షల మంది ఓటర్లకు ఓటుకు రూ.3 వేలు చొప్పున రూ. 51 కోట్ల పంపిణీకి చంద్రబాబు బరితెగించారన్నది సుస్పష్టం. పోలింగ్ రోజు వరకు మద్యం పంపిణీ, చోటా మోటా నేతలు, బూత్ కమిటీలకు యథేచ్ఛగా డబ్బుల పందేరం అదనం. ఇలా నియోజకవర్గంలో ఎన్నికల అక్రమాలకు చంద్రబాబు రూ.100 కోట్లతో పకడ్బందీ స్కెచ్ వేసినట్టు స్పష్టమైంది. మాచర్లలో పోలీసులు దాడులు చేసి టీడీపీ నేతల ఇళ్లలో ఉన్న ఈ స్లిప్పులను స్వాధీనం చేసుకోవడంతో చంద్రబాబు పన్నాగం బట్టబయలైంది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్కు అత్యంత సన్నిహితుడు ఆలూరి సురేశ్ బాబు నివాసంలో ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసు అధికారులు తనిఖీ చేసి, రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. ఆయన విజయవాడలోని స్వీట్ మ్యాజిక్ హోటల్స్ భాగస్వామి. మైలవరం నియోజకవర్గంలో ఓట్లు కొనేందుకే ఈ నిధులు అక్రమంగా తరలించినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులకు దొరికింది రూ. కోటే అయినా, స్వీట్ మ్యాజిక్ హోటల్స్ యజమానుల ద్వారా షెల్ కంపెనీలను ఉపయోగించి దాదాపు రూ.10 కోట్ల వరకు తరలించాలని కుతంత్రం పన్నినట్టు భావిస్తున్నారు. మిగిలిన నిధుల కోసం పోలీసులు సోదాలు ముమ్మరం చేశారు.రాష్ట్రం అంతటా మాచర్ల ఫార్మూలానే!మాచర్ల ఫార్మూలానే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని చంద్రబాబు పకడ్బందీ ప్రణాళిక రచించారు. హోలోగ్రామ్లు ముద్రించిన ఓటర్ల స్లిప్పులతో ఓట్లు కొనుగోలుకు రంగం సిద్ధం చేశారు. దీంతోపాటు మద్యం, నేతలకు ముడుపులకూ నల్ల ధనాన్ని తరలిస్తున్నట్లు సమాచారం. ఇలా నియోజకవర్గానికి రూ.100 కోట్లు చొప్పున 175 నియోజకవర్గాలకు మొత్తం రూ.17,500 కోట్లు వెదజల్లి ఎన్నికల అక్రమాలకు బరితెగించాలన్నది చంద్రబాబు లక్ష్యం. అందుకోసం ఎంతకైనా తెగించాలని, ఎంతటి బీభత్సమైనా సృష్టించాలని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఈమేరకు నియోజకవర్గాల్లో దౌర్జన్యాలకు, చివరికి హత్యలకు కూడా తెగించేందుకు టీడీపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ఓ రిటైర్డ్ రాష్ట్ర పోలీస్ బాస్, రిటైర్డ్ డీఐజీ, సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్లతో ఓ ముఠాను తయారు చేసి పచ్చ పన్నాగం అమలు బాధ్యతను అప్పగించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో చంద్రబాబుతో కలసి చదువుకున్న ఓ రిటైర్డ్ ప్రొఫెసర్, ఓ రిటైర్డ్ ఐఏఎస్ (ఈయన చంద్రబాబు కేసుల్లో సహా నిందితుడు కూడా), టీడీపీ ప్రభుత్వంలో సలహాదారుగా వ్యవహరించిన ఆర్థిక నిపుణుడు ఈ కుట్ర అమలు కోసం టీడీపీ నేతలతో సమన్వయం చేస్తున్నట్లు సమాచారం.అంతా చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లోనేఎన్నికల అక్రమాలకు పాల్పడేందుకు నల్ల ధనం తరలింపు వ్యవహారం మొత్తం చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లోనే సాగుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్చగా కుంభకోణాలకు పాల్పడి కొల్లగొట్టిన నిధులను చంద్రబాబు వివిధ షెల్ కంపెనీల ద్వారా తరలించారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన నిధులను షెల్ కంపెనీల ద్వారా హైదరాబాద్లోని నాలుగు బ్యాంకుల్లో ఉన్న టీడీపీ ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు ఇప్పటికే ఆధారాలతోసహా గుర్తించిన విషయం తెలిసిందే. అదే విధంగా అమరావతి భూములు, మద్యం, ఇసుక, ఫైబర్ నెట్ తదితర కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన లక్షల కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. ఆ అక్రమ ఖజానా నుంచే ప్రస్తుతం ఎన్నికల అక్రమాల కోసం నిధులను వివిధ రూపాల్లో తరలిస్తున్నారన్నది తేటతెల్లమవుతోంది. మార్గదర్శి, నారాయణ, రాయల్ మెరైన్ సీఫుడ్స్, సోమా అగ్రిటెక్, స్వీట్ మ్యాజిక్... ఇలా వివిధ సంస్థల ద్వారా నియోజకవర్గాలకు తరలిస్తున్న వేల కోట్ల రూపాయలు చంద్రబాబు అక్రమ ఖజానా నుంచి మళ్లిస్తున్నవేనన్నది సుస్పష్టం. పోలింగ్నాటికి చంద్రబాబు ఇంకెంతగా బరితెగిస్తారో.. ఈ అక్రమాలను ఈసీ, పోలీసులు ఎలా కట్టడి చేస్తారో అన్నది చూడాల్సిందే.ఇటీవలి కాలంలో పట్టుబడ్డ ‘పచ్చ’ ధనంలో ప్రధానమైనవి మరికొన్ని..» అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలో తరలిస్తున్న రూ.2 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. » బాపట్ల టీడీపీ అభ్యర్థి వేగేశ్న నరేంద్రవర్మకు చెందిన రాయల్ మెరైన్ ఫుడ్స్ కంపెనీ కంటైనర్లలో భారీ మొత్తంలో తరలిస్తున్న నగదును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. » ఏకంగా చంద్రబాబు రాజగురువు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల నుంచే గుట్టుచప్పుడు కాకుండా నల్లధనం పంపిణీ జరుగుతుండటం గమనార్హం. విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది అక్రమ నిధులు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. రాష్ట్రంలోని 37 మార్గదర్శి చిట్ఫండ్స్ శాఖల ద్వారా నెలకు రూ.200 కోట్ల టర్నోవర్ అని అక్రమంగా చూపిస్తూ.. కొన్ని నెలలుగా టీడీపీ ఎన్నికల అక్రమాలకు భారీగా నల్లధనాన్ని వెదజల్లేలా సాగిస్తున్న కుట్ర బట్టబయలైంది. » టీడీపీ సీనియర్ నేత, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణకు చెందిన విద్యా సంస్థల తరపున ఏర్పాటు చేసిన ఇన్స్పైరా కంపెనీ వ్యవహారాల ముసుగులో ఎన్నికల అక్రమాలకు భారీగా నల్లధనాన్ని మళ్లించిన బాగోతం ఇటీవల బట్టబయలైంది. పోలీసులు సోదాల్లో నగదుతోపాటు, షెల్ కంపెనీల ద్వారా భారీగా నల్లధనం తరలించినట్లు వెలుగులోకి వచ్చింది.» బీజేపీ తరపున పోటీ చేస్తున్న చంద్రబాబు ముఠా సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి నల్లధనం పంపిణీకి ఏకంగా ప్రత్యేక వ్యవస్థను నెలకొల్పారు. ఓట్ల కొనుగోలు, ఇతర అక్రమాల కోసం సుజనా చౌదరికి ఉమ్మడి కృష్ణా జిల్లా, సీఎం రమేశ్కు ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను అప్పగించారు.» బాపట్ల జిల్లా పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు తన నోవా అగ్రిటెక్ కంపెనీ బ్యాంకు ఖాతాల్లోకి అక్రమ నిధులు మళ్లించి, ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డ బాగోతం కూడా డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కంపెనీ వ్యాపార లావాదేవీల ముసుగులో ఓట్లు కొనుగోలు, ఇతర ఎన్నికల అక్రమాలకు నిధులు తరలించిన కుతంత్రం ఆధారాలతోసహా బయటపడింది. -
మానవాభివృద్ధే నిజమైన అభివృద్ధి
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచారని, ఇంతకంటే అభివృద్ధి ఏముంటుందని వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి చెప్పారు. అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కాదని, మానవాభివృద్ధే నిజమైన అభివృద్ధి అన్న విషయం అర్బన్ ఓటర్లు గుర్తించాలని తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు సీఎం జగన్ నవరత్నాల సంక్షేమాన్ని పంచుతూ వారిని ఆర్థికంగా అభివృద్ధి పరిచి, విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రతతో కూడిన మంచి భవితను అందించారని తెలిపారు. హ్యూమన్ క్యాపిటల్ కంటే గొప్ప అభివృద్ధి ఏముంటుందని ప్రశ్నించారు. అదే చంద్రబాబు దృష్టిలో పేదలంటే ఐదేళ్లకో సారి ఓట్లు అమ్ముకునే జీవచ్ఛవాల్లాంటి వారని చెప్పారు.సంపద సృష్టిస్తాం అనే చంద్రబాబు.. ఆయన సీఎం అయినప్పటి నుంచి దిగేవరకు ప్రతి బడ్జెట్లో రెవెన్యూ లోటు కనిపిస్తుందని, మరి సంపద ఎక్కడ సృష్టించాడని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మానవత్వానికి నిలువెత్తు రూపమైతే, మోసానికి మారుపేరు చంద్రబాబు అని అన్నారు. పోసాని బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘పేదలకు ఇచ్చే స్కీములు పప్పుబెల్లాలు కావు. అవి హ్యూమన్ క్యాపిటల్. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ఖజానా సొమ్మును పేదలకు పప్పుబెల్లాల్లా పంచడం ఎంతవరకు సబబు అని నన్ను కొందరు అడిగారు. సీఎం జగన్ ప్రభుత్వ ఖజానా ధనాన్ని పేద ప్రజలకు పంచకపోతే ఈ పాటికి చంద్రబాబులాంటి అవినీతిపరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనమైపోయుండేవారని నేను వారికి చెప్పాను.ఎందుకంటే.. చంద్రబాబుకు పేదవాళ్లను ఇంకా పేదవాళ్లుగా మిగల్చడమే తెలుసు. అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించేవారికి నా సమాధానం ఏమిటంటే.. ఎత్తైన సిమెంట్ స్తంభాలతో, పెద్ద పెద్ద బిల్డింగులతో అభివృద్ధి ఏమీరాదు. మానవాభివృద్ధి జరగాలి. మనిషనేవాడు జీవచ్ఛవం స్థాయి నుంచి తానొక మనిషిని అని రోడ్డు మీదకొచ్చి చెప్పుకోగలగాలి. ఈ పరిస్థితి చంద్రబాబుకు చేతగానిది. చంద్రబాబుకు తెలిసిందల్లా ఐదేళ్లకోసారి ఎన్నికలనగానే పేదలు, కూలీల దగ్గరకొచ్చి, వారి ఓటుకు విలువ కట్టి, ఓటుకు నోటు పంచడమే’ అని చెప్పారు. ప్రజలకు చిరంజీవి వెన్నుపోటు పొడిచారు ‘ప్రజలకు వెన్నుపోటు పొడిచిన పొలిటికల్ బిజినెస్మేన్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని అమ్మేసుకున్న బిజినెస్మేన్ కూడా ఆయనే. ఇప్పుడు తమ్ముడ్ని గెలిపించాలని ప్రజలనడిగే అర్హత చిరంజీవికి లేదు. ఆయనకు రాజకీయం, సినిమా ఒకటే. డబ్బు గానీ, అధికారం గానీ వస్తే చేద్దామని, లేకపోతే ఐదేళ్లు ఖాళీగా ఉండాల్సిన ఖర్మేంటని 18 మంది ఎమ్మెల్యేలను అడ్డంగా అమ్మేసుకుని వెళ్లిపోయిన వ్యక్తి. తప్పు తెలుసుకోని రాజకీయ అనర్హుడు చిరంజీవి’ అని పోసాని దుయ్యబట్టారు.అర్బన్ ఓటర్లంతా బాబు మోసాల్ని గుర్తుంచుకోవాలి‘చంద్రబాబు చేసిన మోసాలను అర్బన్ ఓటర్లంతా గుర్తుంచుకోవాలి. సీఎం వైఎస్ జగన్ ఎవరినీ మోసం చేయరన్న విషయాన్ని గుర్తించాలి. ఆయన ఇప్పటివరకు ఎవరినీ దగా చేయలేదు. సీఎం జగన్ పేద, మధ్యతరగతి వర్గాలను అన్ని విధాలుగా పైకి తెచ్చారు. పెత్తందార్లకు సీఎం జగన్ నచ్చడేమో కానీ, పేదలపాలిట ఆయన దేవుడు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కూడా రైతులు, పేదల పట్ల దేవుడై నిలిచారు కదా? అధికారంలోకి రాగానే రైతుల్ని రుణ విముక్తులను చేశారు. అప్పుడు అందరూ ఆయన్ని అభినందించారు తప్ప పప్పుబెల్లాల్లా పంచిపెట్టారని అనలేదు. ఇప్పుడు సీఎం జగన్ చేసిందీ అదే. ప్రభుత్వం ఉన్నది పేదలను ఆదుకోవడానికే అని నిరూపించారు. ధనవంతులు కొందరు వారి కులాల్లో పేదలను ఆదుకుంటుంటారు. వారి కులాల్లోని పేద పిల్లల చదువులకు డబ్బులిచ్చి ప్రోత్సహిస్తుంటారు. అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేదల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమ చేసి, వారి బతుకులు మారుస్తున్నారు. కులం, మతం , ప్రాంతం, రాజకీయం అనేది చూడకుండా ప్రభుత్వ సొమ్మును పేదవాడికి పంచి వారి జీవనప్రమాణాల్ని పెంచడం మంచి సంప్రదాయం. ఓట్ల కోసమే సీఎం జగన్ పేదవాళ్లకు డబ్బులు అకౌంట్లలో వేశారనడం ముమ్మాటికీ తప్పు. గతంలో రూపాయిలో పావలానే పేదవాడికి చేరేది. మిగతాదంతా అవినీతిపరుల జేబుల్లోకి పోయేది. ఇప్పుడు పైసా అవినీతి లేదు. నాలాంటి ఎంతోమంది ధనవంతులకు పేదవాడిని ఆదుకోవాలనే మనసు రావడానికి సీఎం జగనే స్ఫూర్తి’ అని చెప్పారు. -
కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ 3 నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. గురువారం తొలుత కర్నూలు సిటీలోని వైఎస్సార్ సర్కిల్లో ఎస్వీ కాంప్లెక్స్ రోడ్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. ఆపై మధ్యాహ్నం అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్లో, అక్కడి నుంచి అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభ స్థానం పరిధిలోని కోడూరు రోడ్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. -
మా పిల్లల చదువులపై కుట్రలొద్దు బాబూ
సాక్షి, అమరావతి: పేదింటి పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని తమ పెత్తందారుల పిల్లలకు ఎక్కడ పోటీకు వస్తారోనని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఎత్తేయడానికి చంద్రబాబు కుట్రలు పన్నుతుండటంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పిల్లలకు ఉన్నత భవిష్యత్ దక్కాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు ఉండాల్సిందేనని వారంతా డిమాండ్ చేస్తున్నారు. తాము ఇంగ్లిష్ చదువుల్లేక జీవితంలో ఎదగలేకపోయామని.. తమ పిల్లలకు ఇలాంటి దుస్థితి తలెత్తకూడదని కోరుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ తమ పిల్లలకు మేనమామలా ఉంటూ అనేక విప్లవాత్మక సంస్కరణలు, పథకాలు ప్రవేశపెట్టి అత్యుత్తమ విద్యను అందిస్తున్నారని ఘంటాపథంగా చెబుతున్నారు. రాష్ట్రంలోని 15,784 ప్రైవేటు స్కూల్స్లోనూ ఇంగ్లిష్లోనే బోధన ఉందని గుర్తు చేస్తున్నారు. వాటికి లేని తెలుగు భాషాభిమానం ప్రభుత్వ స్కూళ్ల విషయంలోనే వచ్చిందా.. అంటూ నిలదీస్తున్నారు. తమ పిల్లలకు ఇప్పుడు ఇంగ్లిష్ చదువులు అందకపోతే వారి జీవితం అంధకారమైనట్టేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తన మేనిఫెస్టోలో ‘కేజీ టు పీజీ సిలబస్ రివ్యూ’ అనే అంశాన్ని చేర్చడం వెనుక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ఎత్తేసే కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. నిరుపేదల పిల్లల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని వారికి సీఎం వైఎస్ జగన్ ఉత్తమ బోధన, ఇంగ్లిష్ మీడియం చదువులను ఉచితంగా అందిస్తుంటే చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడుతున్నారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం బోధిస్తే మాతృభాష మరుగున పడిపోతుందంటూ మొసలికన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఉన్నత విద్యకు ఇంగ్లిష్ తప్పనిసరి పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు చదవాలంటే ఇంగ్లిష్పై గట్టి పట్టు ఉంటే తప్ప సాధ్యం కాదు. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం లేనివారు ఉన్నత విద్యలో వెనుకబడుతున్నారు. మరికొందరు అర్థం చేసుకోలేక డ్రాపవుట్ కావడమో లేదా సాధారణ డిగ్రీ కోర్సులకు మారిపోవడమో చేస్తున్నారు. వీరిలో ప్రతిభ ఉన్నా ఇంగ్లిష్ భాషపై పట్టులేకపోవడంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం చదువుతున్న విద్యార్థులు ఉన్నత విద్యలోనూ అద్భుతంగా రాణిస్తారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీంతో 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2020లో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించగా.. 97 శాతం మంది ఇంగ్లిష్ మీడియం బోధన తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను 2020–21 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని పెంచేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలను కూడా అందించింది. ఇటీవల ముగిసిన పరీక్షలను దాదాపు 93 శాతం పైగా విద్యార్థులు ఇంగ్లి‹Ùలోనే రాశారు. పదో తరగతిలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయకున్నా 2.23 లక్షల మంది విద్యార్థులు ఇందులోనే పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. వీరిలో 1.96 లక్షల మందికి పైగా ఉత్తీర్ణత సాధించడం విశేషం. దీన్ని బట్టి ఇంగ్లిష్ బోధనను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలోనూ 90 శాతం పైగా ఇంగ్లిష్ మీడియం చదువులనే కోరుకున్నారు. ఇంగ్లిష్ మీడియం లేకపోతే ఉద్యోగాలు ఎలా? సరైన ఇంగ్లిష్ చదువులు లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. దాన్ని అందకుండా చేస్తే పిల్లలు పెద్దయ్యాక ఎలా బతుకుతారు? ఉద్యోగాలు ఎలా వస్తాయి? జగన్ ప్రభుత్వం ఉచితంగానే ఇంగ్లిష్ మీడియం బోధన అందిస్తోంది. అమ్మఒడి కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పిల్లల చదువులకు ఉపయోగపడుతోంది. మా పిల్లలను ఇంగ్లిష్ మీడియంలోనే చేర్పించాం. ఎల్రక్టీíÙయన్గా కుటుంబాన్ని పోషిస్తున్న నాకు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించడం ఆర్థికంగా భారమే. – షేక్ బాజీ, నజ్మా, గుంటూరు ఇంగ్లిష్ మీడియం పేదలకు వరం కూలి పనులు చేసుకుంటే తప్ప జీవనం గడవని మాలాంటి కుటుంబాలకు పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చే స్తోమత లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులు చెప్పించడం మాలాంటి పేదలకు వరం. మా ఇద్దరు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లిష్లో మీడియంలో చదువుకుంటున్నారు. ఇప్పుడే పేద విద్యార్థులకు మంచి జరుగుతోంది. కార్పొరేట్ పాఠశాలలకు మించి చదువు చెబుతున్నారు. కొంతమంది నాయకులు ఇంగ్లిష్ మీడియం వద్దని చెబుతున్నారు. మరి వారి పిల్లలను ఏ పాఠశాలలో చదివిస్తున్నారో చెప్పాలి. వారికో న్యాయం, మాకో న్యాయమా? – రాగోలు విజయలక్ష్మి, వంగర, విజయనగరం జిల్లా పిల్లల భవిష్యత్కు భరోసా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ద్వారా పిల్లల భవిష్యత్కు భరోసా లభిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావిధానంలో తీసుకొచ్చిన సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చంద్రబాబు ఇంగ్లిష్ విద్యాబోధనపై ఆరోపణలు చేయడం అన్యాయం. పేదల ఉత్తమ చదువులు అందడం ఆయనకు ఇష్టం లేదు. ఇంగిŠల్ష్ మీడియంను రద్దు చేయాలని చూస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ స్కూళ్లు మూతపడే ప్రమాదముంది. – వాడపర్తి సుబ్బు, కోటనందూరు, కాకినాడ జిల్లా ఇప్పుడెన్నో సదుపాయాలు మా చిన్నప్పుడు ఇన్ని అవకాశాలను ఏ ప్రభుత్వం కల్పించలేదు. టీడీపీ ప్రభుత్వంలో అయితే పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువులు దేవుడెరుగు.. అసలు స్కూళ్లనే పట్టించుకోలేదు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేద, మధ్య తరగతి పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంతో పాటు మరెన్నో సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు ఇంగ్లిష్ మీడియం స్థానంలో తెలుగు మీడియం తీసుకువస్తామని చెప్పడం పిల్లల భవిష్యత్ను నాశనం చేయడానికే. మా పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించకలేకపోయాను, కానీ జగన్ దయవల్ల మా మనవళ్లు, మనవరాళ్లను ఇంగ్లిష్ మీడియంలో చదివించుకుంటున్నాను. – కర్రి రామ్గోపాల్, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా -
ఆ పథకాల నిధుల విడుదలకు ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి: లబ్దిదారులకు వైఎస్సార్ ఆసరా నాల్గవ విడత నిధులను విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతినివ్వకపోవడాన్ని సవాలుచేస్తూ హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని గుంటూరు నగరానికి చెందిన కె. వెంకటదుర్గాదేవి, జె. రత్నకుమారి దాఖలు చేశారు. ఆసరా కింద వెంటనే నిధుల విడుదలకు ఆదేశాలివ్వాలని వారు కోర్టును కోరారు.అలాగే, వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులను కూడా విడుదల చేసేందుకు ఈసీ అనుమతినివ్వకపోవడాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన డి. శివపార్వతి పిటిషన్ దాఖలు చేశారు. ఈ నిధుల విడుదలకు వెంటనే ఆదేశాలు జారీచేయాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ లంచ్మోషన్ రూపంలో బుధవారం అత్యవసరంగా విచారణ జరిపారు. నిధుల పంపిణీ ఆవశ్యకతపై వినతిపత్రాలిచ్చాం.. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాల కింద నిధుల పంపిణీకి ఈసీ అనుమతిని నిరాకరించిందన్నారు. లబి్ధదారుల గుర్తింపు ఎప్పుడో పూర్తయిందని, నిధుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు కూడా చేశామన్నారు. ఈ రెండు పథకాలు కొత్తవి కావని, నాలుగేళ్లుగా అమలవుతున్నాయని చెప్పారు. నిధుల పంపిణీకి బ్రేక్వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిధుల పంపిణీ అత్యవసరాన్ని వివరిస్తూ ఎన్నికల సంఘానికి వినతిపత్రాలు ఇచ్చిందన్నారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని గురువారం ఉదయం కోర్టు ముందుంచేలా ఈసీని ఆదేశించాలని ఆయన కోరారు. మీ నిర్ణయాన్ని మా ముందుంచండి.. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్.. ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా పథకాల కింద లబి్ధదారులకు నిధుల పంపిణీ విషయంలో అత్యవసరాన్ని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వినతిపత్రాలపై తగిన నిర్ణయం తీసుకుని, దానిని ప్రొసీడింగ్స్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన ఆదేశించారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. చేయూత, విద్యాదీవెన నిధుల పంపిణీ నిలిపివేతపై దాఖలైన వ్యాజ్యాలతో తాజా వ్యాజ్యాలను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. మహిళలు ఇబ్బంది పడతారు.. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్ ఆసరా కింద గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. నాలుగు విడతల్లో నిధులను విడుదల చేస్తుందన్నారు. ఈ పథకం కింద 7.98 లక్షల స్వయం సహాయక బృందాలకు చెందిన 79.84 లక్షల మంది ఈ నాలుగేళ్లలో రూ.25,570 కోట్ల మేర లబ్దిపొందారన్నారు. ఇప్పటికే మూడు విడతల కింద రూ.4,551 కోట్ల మేర నిధులు పంపిణీ చేశామని, నాల్గవ విడత కింద రూ.1,843 కోట్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ మొత్తాన్ని పంపిణీ చేసేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిని నిరాకరించిందన్నారు. అలాగే, ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం కింద రూ.15వేల ఆర్థికసాయం అందిస్తోందన్నారు. మూడు విడతలుగా ఈ మొత్తం చెల్లించారని.. ఇప్పడు మరో విడత మొత్తం చెల్లించాల్సి ఉందన్నారు. అలాగే, ఈబీసీ నేస్తం కింద నిధుల పంపిణీకి కూడా ఈసీ అనుమతిని నిరాకరించిందని తెలిపారు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక అవసరాలకు అప్పులుచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యంచేసుకుని నిధుల పంపిణీకి ఆదేశాలు జారీచేయాలని కోరారు. -
ఏపీ కూటమి: ఉత్తరాంధ్రలో ఒకలా.. బెజవాడలో మరోలా!
సాక్షి, అమరావతి: ఏ ఎండకు ఆ గొడుగు!.. ఏ రోటికాడ ఆ రోటి పాట! ఏరు దాటాక తెప్ప తగలేయడమే తన ఆనవాయితీ అని టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి మరోసారి విస్పష్టంగా చెప్పింది! ప్రజాక్షేత్రంలో మరోసారి ఘోర పరాజయం ఖాయమని నిర్ధారణకు రావడంతో ఉనికి కోసం ఒక్కో ప్రాంతంలో ఒక్కో డ్రామాలాడుతోంది. రాజధానిపై బుధవారం దినపత్రికల్లో కూటమి ఇచ్చిన ప్రకటనలే ఇందుకు తార్కాణం. ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు పొందేందుకు రాజధానిపై ప్రాంతాల వారీగా రెండు రకాల ప్రకటనలు ఇచ్చే స్థాయికి దిగజారింది. సాధ్యం కాదన్న బాలయ్య అల్లుడువిశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీభరత్ ఓట్ల కోసం విశాఖే రాజధాని గ్రోత్ ఇంజన్ అని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కాదని స్పష్టం చేస్తూ.. అమరావతిని అభివృద్ధి చేయాలంటే చాలా పెట్టుబడి అవసరమని ఓ ప్రైవేట్ చానల్కు ఇచ్చిన ఇండర్వ్యూలో భరత్ తేల్చి చెప్పారు. అన్ని డబ్బులు వెచ్చించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. అదే విశాఖ అయితే వేగంగా అభివృద్ధి చెందుతుందని, గ్రోత్ ఇంజన్ ఏమిటనేది చూడాలని వ్యాఖ్యానించారు. గ్రోత్ ఇంజన్ విశాఖతో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందంటూ ఓట్ల కోసం రెండు నాలుకల ధోరణితో మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో రాష్ట్ర అప్పులు మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు చేరుకోగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రూ.వేల కోట్లు పెట్టుబడి పెట్టే స్థితిలో లేదని భరత్ చెప్పారు. అమరావతి అనేది 20 సంవత్సరాల తరువాత మాట అని, అదే విశాఖ మనకు వెంటనే గ్రోత్ ఇంజన్ లాంటిదని బాలకృష్ణ అల్లుడు భరత్ తెలిపారు. టీడీపీతో పాటు బీజేపీ, పవన్ అమరావతే రాజధాని అని చెబుతుండగా విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న భరత్ మాత్రం విశాఖ రాజధాని గ్రోత్ ఇంజన్ అని పేర్కొనటాన్ని బట్టి కూటమి లక్ష్యం ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు పొందడమేనని స్పష్టమవుతోంది. రెండు ప్రాంతాలు.. రెండు నాలుకలు!తాజాగా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా విజయవాడ, విశాఖ ఎడిషన్లలో ఆయా ప్రాంతాల ప్రజలను మభ్యపుచ్చేలా కూటమి వేర్వేరు ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. ఈమేరకు విజయవాడ, విశాఖలో ఈనాడు, హిందూ దినపత్రికల తొలి పేజీల్లో కూటమి ప్రచార ప్రకటనలు జారీ చేసింది. వీటిలో ప్రధాని మోదీతో పాటు బాబు, పవన్ ఫొటోలున్నాయి. విజయవాడ ఎడిషన్లో మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి అంటూ పత్రికల్లో ప్రకటన ఇవ్వగా విశాఖలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికాసం కోసం అంటూ ముగ్గురి ఫొటోలతో ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఓ విధానం లేకుండా..జాతీయస్థాయిలో ఎనీడీఏ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న పార్టీలు రాజధాని విషయంలో ఒక విధానం లేకుండా ప్రాంతానికో రకంగా వ్యవహరించడం అంటే ఓటర్లను మోసం చేయడమేనని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓటమి భయంతోనే ప్రాంతాలవారీగా మభ్యపెడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతిని రాజధాని చేయాలంటే రూ.లక్షల కోట్లు అవసరమని, అంత ఖర్చు చేసినా చాలా ఏళ్లు పడుతుందని తొలి నుంచీ వైఎస్సార్సీపీ వాస్తవిక దృక్పథంతో చెబుతోంది. అదే విషయాన్ని ఇప్పుడు ఓట్ల కోసం భరత్ వల్లె వేయడం గమనార్హం. రాజధాని అమరావతి సాధ్యం కాదని పేర్కొనడం విశేషం. రాష్ట్రంలో విజయవాడ భాగమైనప్పటికీ ఉత్తరాంధ్ర ఎడిషన్లలో మాత్రం అమరావతి ప్రస్తావన లేకుండా ప్రచార ప్రకటనలు జారీ చేయటాన్ని బట్టి ఇదంతా ఓట్ల రాజకీయమేనని స్పష్టమవుతోంది. -
ఓటమి భయంతో.. బూతులు.. దాడులు.. కుట్రలు
ఓటమి తప్పదన్న నిరాశానిస్పృహలు టీడీపీ కూటమిని ఏ స్థాయికి దిగజారుస్తున్నాయంటే... చంద్రబాబు స్థాయి మరిచి, సిగ్గెగ్గులు వదిలి ‘అమ్మ మొగుడు.. అమ్మమ్మ మొగుడు’ అంటూ అడ్డూఅదుపూ లేకుండా పిచ్చిపట్టినట్లు అరుస్తున్నాడు. వృద్ధుల ఇంటికి పింఛను రాకుండా వారిని మండటెండల్లో రోడ్లమీదికి తేవటమే కాదు..భూములు లాక్కున్నారంటూ పచ్చి అబద్ధాలతో చెలరేగుతున్నాడు. రైతులు, విద్యార్థులు, మహిళల ఖాతాల్లో పడాల్సిన నిధులను కుట్రతో అడ్డుకోవటమే కాదు... బాబు, దత్తపుత్రుడు కలిసి కిరాయి గూండాలతో దాడులు చేయిస్తున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య కావచ్చు... హోంమంత్రి తానేటి వనిత కావచ్చు... ప్రచారానికి వెళుతున్న మహిళా నేతలపై దాడులకు తెగబడుతున్నారు. ఎన్ని చేసినా.. ఇది నారాసురుడికి క్లయిమాక్సే.సాక్షి, అమరావతి/వెల్దుర్తి/ముప్పాళ్ల/సాక్షి, నరసరావుపేట: రూ.కోట్ల కట్టలు వెదజల్లుతున్నా.. అక్రమ మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. కళ్ల ముందు మరోసారి ఘోర పరాజయం స్పష్టంగా కనిపిస్తుండటంతో కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లో ఫ్రస్టేషన్ (నిరాశ, నిస్పృహ) తార స్థాయికి చేరుకుంది. చివరకు అధికార పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మహిళలపై సైతం దాడులు చేసే స్థాయికి దిగజారిపోవడం వారిద్దరినీ ఆవరించిన నైరాశ్యాన్ని రుజువు చేస్తోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి నీ అమ్మ మొగుడు..! నీ అమ్మమ్మ మొగుడు..! అంటూ ఈ నెల 6న అనకాపల్లి సభలో చంద్రబాబు బూతు పురాణం లంకించుకోవడంతో మహిళలంతా నివ్వెరపోయారు. అంతకుముందు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన సభలో.. జగన్ను చంపితే ఏమవుతుందంటూ టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారు. ఒకపక్క ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, మార్పులను ప్రజలకు వివరిస్తూ, వారినుంచే జవాబులు రాబడుతూ ప్రచారం నిర్వహిస్తుండగా మరోపక్క కూటమి నేతలు చంద్రబాబు, పవన్ దాడులు, దుర్భాషలనే నమ్ముకోవడం వారి వ్యక్తిత్వాలకు ప్రతీకగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ సైతం బాబు శైలిని అనుకరిస్తూ వ్యక్తిత్వహననం, దుర్భాషలకు దిగడం తెలిసిందే. దీంతో టీడీపీ, జనసేన రౌడీ మూకలు పేట్రేగుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలపై ఇనుపరాడ్లు, రాళ్లు, కర్రలతో దాడులకు దిగుతూ హత్యాయత్నాలకు పాల్పడుతున్నాయి. నల్లజర్లలో ‘ముళ్లపూడి’, మాచర్లలో ‘జూలకంటి’ గూండాయిజం తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో మంగళవారం రాత్రి ప్రచారం ముగించుకుని పార్టీ నేత వెల్లంకి సుబ్రమణ్యం ఇంట్లో భోజనం చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి, హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రాజు, జడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడి చేసి హత్యాయత్నానికి తెగబడ్డారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో బుధవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై టీడీపీ గూండాలు రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. పలువురు మహిళలు సైతం గాయపడ్డారు. ఏడు హత్య కేసుల్లో నిందితుడైన మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి టీడీపీ గూండాలను దాడులకు పురిగొల్పారు. పచ్చి అవకాశవాదం.. ఎన్నికల్లో సీఎం జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీని ఒంటరిగా ఎదుర్కోనే సత్తాలేక జనసేనతో జట్టు కట్టి బీజేపీతో కాళ్ల బేరానికి దిగిన చంద్రబాబు దాడులు, హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా దగా చేయడం, ఇప్పుడు మళ్లీ జత కట్టటాన్ని ప్రజలు పచ్చి అవకాశవాదంగా గుర్తించారు. మళ్లీ కూటమి ముసుగులో చంద్రబాబు మోసం చేస్తారనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి జనస్పందన కరువైంది. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాను రప్పించినా ప్రయోజనం కానరాకపోవడంతో ఓటర్లపై ధనా్రస్తాన్ని ఎక్కుపెట్టారు. నోట్ల కట్టలతో ప్రైవేట్ సైన్యాలు విదేశాల్లోని తన సామాజిక వర్గానికి చెందిన ఆరు వేల మంది ఎన్నారైలను రప్పించిన చంద్రబాబు వారిని గ్రామాల్లో మోహరించి నోట్ల కట్టలు వెదజల్లుతున్నారు. నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ, విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, నరసరావుపేట లోక్సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తదితరుల ద్వారా నోట్ల కట్టలతో ప్రైవేట్ సైన్యాలను సమాయత్తం చేశారు. ఎన్నికల అధికారులకు భారీ ఎత్తున పట్టుబడుతున్న కోట్ల కట్టలన్నీ టీడీపీ నేతలవే కావడం గమనార్హం. కర్ణాటక, గోవా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీ ఎత్తున మద్యాన్ని తరలించి ఏరులై పారిస్తున్నారు. ఎన్నికల అధికారులు సీజ్ చేస్తున్న మద్యం డంపులే అందుకు నిదర్శనం. కోట్ల కట్టలను వెదజల్లుతున్నా.. మద్యాన్ని ఏరులై పారిస్తున్నా.. ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం, ఘోర పరాజయం కళ్ల ముందు కానరావడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ తారస్థాయికి చేరుకుంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడి, వేటాడి రక్తపుటేరులు పారించి భయోత్పాతం సృష్టించడం ద్వారా ఉనికి చాటుకోవాలని ఎత్తు వేశారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన గూండాలను దాడులు, హత్యాకాండకు పురిగొలిపారు. ‘ఫ్యాన్’కి ఓటేశాడని..!పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హోం ఓటింగ్ ప్రక్రియలో భాగంగా పరిమి పెద్దభూషయ్య అనే వృద్ధుడు వైఎస్సార్సీపీకి ఓటు వేసేందుకు సుముఖత చూపటాన్ని జీర్ణించుకోలేక బెదిరిస్తూ వాదనకు దిగాయి. తనకు కులాలతో పనిలేదని, మంచి చేసిన పార్టీకే ఓటు వేస్తానని పెద్దభూషయ్య తేల్చి చెప్పడంతో వాగ్వాదం నెలకొంది. టీడీపీ సానుభూతిపరుడు రావిపాటి నాగేశ్వరరావు కర్రతో దాడి చేయడంతో వైఎస్సార్ సీపీకి చెందిన కానాల పుల్లారెడ్డి తలకు తీవ్ర గాయమైంది. వైఎస్సార్ సీపీకి చెందిన షేక్ దమ్మాలపాటి బాజికి కూడా ఘటనలో గాయాలయ్యాయి. పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.మాచర్ల ఘటనపై ఈసీ సీరియస్మాచర్ల నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణితో పాటు పలువురు మహిళలపై టీడీపీ మూకలు దాడులకు తెగబడిన ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. మాచర్ల టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి.శరత్బాబు, వెల్దుర్తి ఎస్సై వంగా శ్రీహరి, కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్న మల్లయ్యను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురూ తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దౌర్జన్యాలు.. హత్యాయత్నాలు⇒ నంద్యాల జిల్లా బనగానపల్లె మార్కెట్ వద్ద మంగళవారం ప్రచారం చేస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి భార్య కాటసాని జయమ్మపై దాడికి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్రెడ్డి గూండాలను పురిగొల్పారు. ఈ విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న ఆమె తనయుడు ఓబుళరెడ్డిపై కూడా టీడీపీ గూండాలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కోనేటి దుర్గ, సయ్యద్ అబ్బాస్, ఇంతియాజ్, ఖాజా హుస్సేన్, జమీర్, గుర్రప్ప తీవ్రంగా గాయపడ్డారు. ⇒ అనంతపురం నియోజకవర్గంలో గత నెల 30న ఎన్నికల ప్రచారం నిమితం బైక్పై వెళ్తున్నవైఎస్సార్సీపీ నాయకుడు గుజ్జుల నగేష్పై టీడీపీ గూండాలు కళ్లల్లో కారం చల్లి కర్రలు, ఇనుపరాడ్లతో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ⇒ శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పిచ్చిరెడ్డికొట్టాల గ్రామంలో గత నెల 27న ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా‹Ùరెడ్డి, సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి వాహనాలపై టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీ నేత కురుబ ముత్యాలు వాహనంతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ⇒ ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో మిట్టమీదిపల్లి, మాల్యవంతునిపాడు గ్రామాల మధ్య వైఎస్సార్సీపీకి చెందిన మూడు ప్రచార రథాలపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. డ్రైవర్లు వీరాంజనేయులు, ఆంథోని, రాజును రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. ⇒ శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఇదే రీతిలో టీడీపీ, జనసేన రౌడీ మూకలు వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతూ భయోత్పాతం సృష్టిస్తున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పీఆర్కే సతీమణిపై దాడిఎన్నికల వేళ టీడీపీ అరాచకాలు ఏ స్థాయికి దిగజారాయంటే ఇప్పటివరకు పల్నాడు ప్రాంతంలో మహిళలు, పిల్లలపై దాడులు చేసిన సంస్కృతి లేదు. అలాంటిది మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహా్మరెడ్డి ప్రోద్బలంతో పచ్చమూకలు బరి తెగించాయి. ఎన్నికల ప్రచారం చేస్తున్న మాచర్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాదేవితోపాటు పలువురు మహిళలపై బుధవారం రాళ్లు, సీసాలతో దాడులకు దిగి హత్నాయత్నానికి పాల్పడ్డాయి. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో ఇంటింటి ప్రచారం చేస్తున్న రమాదేవిపై టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి కుమారుడు శివారెడ్డి, కల్లం రామాంజిరెడ్డి తమ అనుచరులతో కలసి రాళ్ల దాడికి పాల్పడ్డారు. పీఆర్కే సతీమణి రమాదేవి, మాజీ ఎంపీపీ దాసరి చౌడేశ్వరి, కౌన్సిలర్ గట్ల అరుణ కుమారి, కో ఆప్షన్ సభ్యురాలు అన్నెం అనంతరావమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. మాజీ ఎంపీపీ చౌడేశ్వరికి చెందిన స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకునే యత్నం చేసిన ఎస్ఐ శ్రీహరిపై సైతం పచ్చమూకలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రశాంత వాతావరణంలో ప్రచారం చేస్తున్న మహిళలపై దాడులకు దిగటాన్ని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో గెలవలేక టీడీపీ హింసకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. ఏడుగురి హత్య కేసులో నిందితుడైన జూలకంటి బ్రహా్మరెడ్డిని చంద్రబాబు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించడంతో ఫ్యాక్షన్ రాజకీయాలు తిరిగి మొదలయ్యాయని పేర్కొంటున్నారు. ఓటమి భయంతోనే మహిళలపై టీడీపీ దాడులుఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలపై దాడులు చేయిస్తున్నాడని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దళిత మహిళ.. అందులోనూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనితపై దాడి చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో బొండా ఉమా మహిళలపై దాడులకు పురిగొల్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ రాజకీయ పదవుల్లో మహిళలకు పెద్ద పీట వేసి.. దళితులకు రాజ్యాధికారం కల్పించారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల అభివృద్ధికి కృషి చేశారని వివరించారు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సీఎం జగన్పై కక్ష కట్టాయన్నారు. విద్యార్థులకు విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, మహిళలకు ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం తదితర పథకాలను రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మరోసారి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల మే 9 వ తేదీ షెడ్యూల్ను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ బుధవారం విడుదల చేశారు.సీఎం జగన్.. గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు సిటీ వై ఎస్సార్ సర్కిల్లోని ఎస్వీ కాంప్లెక్స్ రోడ్డులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం పార్లమెంట్ పరిధిలోని కళ్యాణ దుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్డులో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట నియోజకవర్గంలో కోడూరు రోడ్డులో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. -
సంతోషాలు పంచిపెట్టె
నరసరావుపేట: వారు రైతు బిడ్డలు. భూమాతను నమ్ముకున్న అన్నదాతల కష్టాలు తెలిసిన మానవతావాదులు. జన్మభూమి రుణం తీర్చుకోవాలనుకున్నారు. ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీలు చేసినా ఉద్యోగం చేయాలనే ఆలోచనలకు స్వస్తి పలికారు. ఉన్న ఊరిలోనే పలువురికి ఉపాధి కలి్పస్తూ సొంతంగా వ్యాపారం చేయాలని సంకలి్పంచారు. ప్యాకింగ్ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ రాయితీలతో వ్యాపారాన్ని విస్తరించారు. ఇదీ నరసరావుపేట ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ విజయ ప్రస్థానం.ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ విజయప్రస్థానం ∙ స్వయం ఉపాధితో పాటు 40 మందికి బతుకుతెరువుప్రభుత్వ ప్రోత్సాహంతో వ్యాపారం విస్తరిస్తున్నామన్న యాజమాన్యం ∙ ఉన్నత చదువులు చదివినా ఉన్న ఊరికి మేలు చేయాలనే సంకల్పంఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ చేశారు. అయినా ఉద్యోగాల కోసం ఎదురుచూపులు చూడలేదు. స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రాంత అవసరాలపై దృష్టి కేంద్రీకరించారు. అధ్యయనం చేశారు. ఆయిల్, స్పిన్నింగ్, మిల్క్ యూనిట్లు అనేకం ఉండడంతో ఆయా ఉత్పత్తులు ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన అట్ట పెట్టెలు తయారీ పరిశ్రమ నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ (ఏపీఐఐసీ) ద్వారా ప్యాకింగ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇదీ నరసరావుపేట పెద్దచెరువు ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ అధినేత కామిరెడ్డి కృష్ణకిషోర్రెడ్డి విజయగాథ.వైఎస్సార్సీపీ ప్రభుత్వ రాకతో ఉజ్వల ప్రగతి పరిశ్రమ ఏర్పాటుచేసిన కొన్ని నెలలకే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ విధానాలతో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీసింది. ఓ వైపు కోవిడ్ తో ప్రభుత్వానికి ఆరి్థక కష్టాలు వెంటాడుతున్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వంలో 2015–20 పాలసీ కింద ఏర్పాటుచేసిన పరిశ్రమలకు చెల్లించాల్సిన సబ్సిడీలను విడుదల చేశారు. దీంతో ఆంజనేయ ఇండస్ట్రీస్ కు రూ. 13 లక్షల సబ్సిడీ లభించింది. దీంతోపాటు విద్యుత్ టారిఫ్ల మినహాయింపులు, చెల్లించాల్సిన రుణానికి వడ్డీలో సబ్సిడీ మంజూరు చేశారు. ప్రభుత్వ చర్యలతో యజమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. సుమారు 40 మంది ఉద్యోగులు, కూలీలను నియమించుకొని వ్యాపారాన్ని మరింత విస్తరించారు. మూడు షిప్టులుగా పనిచేస్తున్న సిబ్బందికి ఒకొక్కరికి నెలకు రూ.40వేలు నుంచి రూ.15వేలు వరకు జీతాలు చెల్లించి ఉపాధి చూపించారు. జిల్లాలోని పలు వ్యాపారులు, పరిశ్రమలకు కావాల్సిన అట్టపెట్టెలను ఆర్డర్లు తెప్పించుకొని వారికి నచ్చిన రీతిలో తయారుచేసి సకాలంలో అందిస్తూ వ్యాపారుల మన్ననలు పొందుతున్నారు. ఇంతితై వటుడింతై అన్న చందంగా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందింది. ఐదేళ్ల కాలంలో ఏడాదికి రూ.3 నుంచి 4కోట్ల టర్నోవర్ చేస్తూ ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం రిక్త హస్తం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రచారాలు చేసిన గత టీడీపీ పాలకులు హామీలను తుంగలో తొక్కారు. ఎటువంటి సబ్సిడీని మంజూరు చేయకపోయినా కృష్ణకిషోర్ రెడ్డి ఆటుపోట్లను ఎదుర్కొని సొంత పెట్టుబడితో పరిశ్రమను స్థాపించాడు. సంస్థ కార్యకలాపాలు విస్తరించాలనుకున్నా ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. దీంతో కష్టంగానే వ్యాపారాన్ని నెట్టుకొచ్చారు.40 మందికి ఉపాధి నరసరావుపేటకు చెందిన కామిరెడ్డి కృష్ణకిషోర్రెడ్డి ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ చేశారు. నరసరావుపేటలోనే ఏదైనా పరిశ్రమ పెట్టాలని భావించారు. ఈ ప్రాంతంలో ఆయిల్, స్పిన్నింగ్ మిల్లులు, మిల్క్ యూనిట్లు, లాంటి సంస్థల ఆవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్యాకింగ్కు ఉపయోగించే అట్టపెట్టెల పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నారు. ఎంఎస్ఎంఈ ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్ (ఏపీఐఐసీ) ద్వారా ప్యాకింగ్ పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. 2015 నుంచి 2020 పరిశ్రమల ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ పాలసీ కింద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తన స్నేహితుడు గెల్లి అరుణ్రెడ్డిని భాగస్వామిగా చేసుకొని 2019 జనవరిలో పట్టణంలోని పెద్దచెరువు ఇండ్రస్టియల్ ఎస్టేట్లో ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ అనే చిన్నతరహా పరిశ్రమను ఏర్పాటు చేశారు. మెషినరీ కోసం రూ.60లక్షలు, మరో రూ.25లక్షల ఓవర్ డ్రాప్్టతో సంస్థను ప్రారంభించారు. నా ఆశయం నెరవేరింది మా లాంటి చిన్నతరహ పరిశ్రమలకు ప్రస్తుత ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. ఏ అధికారి వత్తిళ్లు లేవు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లిస్తున్నాం. ఉన్న పట్టణంలోనే పదిమందికి ఉపాధి కలి్పంచాలనే నా ఆశయానికి ప్రభుత్వ సహకారం తోడైంది. వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం. –కామిరెడ్డి కృష్ణకిషోర్రెడ్డి, ఎం.డి. ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీ ఉన్న ఊరిలో ఉపాధి దొరికింది ఈ పరిశ్రమ రావడంతో నాకు ఉన్న ఊరిలోనే ఉపాధి లభించింది. ఐదేళ్లుగా పనిచేస్తున్నాను. నెలకు రూ. 15 వేలు జీతం ఇస్తుండడంతో కుటుంబ అవసరాలకు ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది. పనిలో ఎటువంటి ఒత్తిడి లేకుండా అట్ట పెట్టెలు తయారుచేస్తున్నాను. –కె.కోటేశ్వరరావు, కూలీ యూనిట్ పేరు : ఆంజనేయ ప్యాకింగ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి : అట్ట పెట్టెల తయారీ యజమానులు : కృష్ణకిషోర్రెడ్డి, అజయ్ రెడ్డి పెట్టుబడి : రూ. 85 లక్షలు టర్నోవర్ : రూ. 3 కోట్లుఉపాధి : 40 మంది కేటగిరి : చిన్నతరహా ప్రాంతం : నరసరావుపేట -
అది విజనరీ కాదు..‘విష’నరీ
సాక్షి, విశాఖపట్నం/అనంతగిరి: ‘అరకు నియోజకవర్గంలో పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకుంటున్నా. స్మార్ట్ విలేజ్గా మార్చేస్తా. ప్రతి ఇంటికీ నిరంతరం నీటిని అందిస్తాను’ అని సీఎం హోదాలో చంద్రబాబు 2015 జనవరిలో బీరాలు పలికారు. ఏడాదిన్నర గడిచినా ఆ ఊరి వైపు కన్నెత్తి చూడలేదు. చివరికి ప్రజలు రోడ్డెక్కడంతో 2016 మేలో ఆగమేఘాలపై అక్కడకు వచ్చి మంచినీటి కుళాయిల కోసం రూ.5 కోట్లు, సిమెంట్ రోడ్లకు రూ.9 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.ఆ నిధులూ వచి్చంది లేదు.. పనులు జరిగిందీ లేదు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక బాబు దత్తత తీసుకున్న ఈ గ్రామంలో సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. ప్రతి ఇల్లు అభివృద్ధి పథంలో నడుస్తోంది. గిరి గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఆయా గ్రామాలు నేడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. పెదలబుడు మేజర్ పంచాయతీలో ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు వెచి్చంచారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ అందుబాటులోకి వచ్చాయి. మూడు సచివాలయాల పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలు రూ.37 కోట్ల లబ్ధి పొందారు. -
CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
ఇచ్చిన హామీలు అమలు చేయడం ఆయనకే చెల్లు జగన్లోని పట్టుదల ఎందరికో స్ఫూర్తిదాయకం సాక్షి ఇంటర్వ్యూలో సినీనటి, యాంకర్ శ్యామల ‘వైఎస్సార్సీపీ నవరత్నాలు అమలు సాధ్యమేనా అన్న నోళ్లు మూతపడేలా అమలు చేసి చూపించారు సీఎం జగన్. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రతి ఒక్కరికీ ఓ లెసన్. ‘జగన్ గెలుపు అంటే జనం గెలుపు’ అన్నది ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది’ అని సినీనటి, ప్రముఖ బుల్లితెర యాంకర్ శ్యామల అన్నారు. కొంత కాలంగా వైఎస్ జగన్కు మద్దతుదారుగా ఉన్న ఆమె ఈ ఎన్నికలలో వైఎస్సార్సీపీ తరఫున చురుకుగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడారు. జగన్పై తనకు అభిమానం కలగడానికి కారణాలను... తన భవిష్యత్తు రాజకీయ ప్రయాణాన్ని ఆమె తెలియజేశారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...వైఎస్ అంటే ఇష్టం.. జగన్పై అభిమానం... తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం సమీపంలోని ఇంద్రపాలెం మాది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నాకు రాజకీయ నేపథ్యం ఏమీ లేదు. ఎదుగుతున్న సమయంలో లీడర్స్ చేపట్టే పనులు మన మీద చాలా ప్రభావం చూపుతాయి కదా. అలా తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేసినప్పటి నుంచీ వైఎస్ అంటే నాకు చాలా ఇష్టం. కట్టు బొట్టు నుంచి ఆయన ఆహార్యం దాకా అన్నీ గమనిస్తుండేదాన్ని. ఆయన హుందాతనం, మందహాసం బాగా నచ్చేవి. కెరీర్ కోసం హైదరాబాద్ వచ్చేసిన తర్వాత.. వైఎస్సార్ మరణించిన సమయంలో ఉప్పల్లో ఓ ప్రైవేట్ చానల్లో పనిచేస్తున్నాను. ఎంతగానో బాధనిపించినా... ఆ సమయంలో ఎటూ కదలడానికి వీలు కాలేదు. వైఎస్ మరణం తర్వాత జగన్ను బాగా గమనిస్తూ ఉండేదాన్ని, ఆయన చేసిన పోరాటం, అడ్డంకులు ఎదుర్కొంటూ ఆయన వేసిన అడుగులు చూశాక ఆయనపైనా కొండంత అభిమానం కలిగింది. నా భర్త కూడా జగన్ అభిమాని కావడంతో... ఆయన్ను స్వయంగా కలవడం, ఆయన చేతుల మీదుగా వైఎస్సార్సీపీ కండువా ధరించడం జరిగిపోయాయి. హామీల ఆమల్లో ఆయనకు ఆయనే సాటి ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి? ప్రజలకు ఆపద వస్తే ఎలా స్పందించాలి? ఇలాంటివన్నీ జగన్ను చూసి నేర్చుకోవాలి. అందుకే భవిష్యత్తు రాజకీయ నేతలకు ఆయన పాలన ఒక పాఠం అంటాను నేను. ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి మొదట్లో విని... బాబోయ్ ఇన్ని పథకాలా? ఎలా ఇస్తారో అని భయపడిన మాట నిజం. కాని అవి పక్కాగా అందించడానికి గ్రామ వలంటీర్ పేరిట ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది కలిగిందీ అంటే ఫిర్యాదు చేసిన 10–20 రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అయిపోయేలా పక్కాగా నిర్వహించడం అద్భుతం అనిపించింది.కోవిడ్ సవాల్నూసమర్థంగా ఎదుర్కొని... ప్రపంచమే బిత్తరపోయిన సంక్షోభం కోవిడ్. మహామహులే ఆ సమయంలో చేతులెత్తేశారు. అలాంటిది ఒక కొత్త సీఎం, అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఇలాంటి తరుణంలో అనూహ్యమైన ఈ చాలెంజ్ ఎదురైనా.. జగన్ అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా రెండు వేవ్స్నూ సమర్థంగా ఎదుర్కొన్నా రు. అందుకే నేను ఫిదా అయ్యా. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లోని ప్రజల్ని కలిసినప్పుడు వారు చెబుతున్నదీ అదే. ‘కోవిడ్ టైమ్లో సొంత వారు కూడా మా మొహం చూడలేదమ్మా.. అలాంటిది వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతీదీ మా చేతికి అందించింది’ అని.జగన్ గురించి తెలుసుకున్న కొద్దీ సంతోషం మా సొంత ఊరితో పాటు మా అత్తగారి ఊరు చీరాలకు రాకపోకలు సాగించినప్పుడు, షూటింగ్ కోసం గ్రామాలకు వెళ్లినప్పుడు... అక్కడి స్థితిగతుల గురించి కనుక్కునేదాన్ని. వీలైనంతమందితో మాట్లాడేదాన్ని. వాళ్లందరి స్పందన తెలుసుకుంటున్న కొద్దీ జగన్ మీద ఇష్టం పెరుగుతూ వచి్చంది. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన నాడు నేడు కార్యక్రమం నా ఆల్ౖ టెమ్ ఫేవరెట్. నేను కాకినాడ ప్రభుత్వ పాఠశాలలో చదువు కున్నా. ఆ స్కూల్లో 7వ తరగతి వరకూ అసలు ఇంగ్లిష్ మీడియం ఉండేది కాదు. ఇప్పుడు ఏకంగా డిజిటల్ బోధన, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్స్, షూస్, సాక్స్... ఇవన్నీ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఇటీవల ఒక ప్రభుత్వ పాఠశాల విద్యారి్థని జగన్ ముందు అద్భుతమైన ఇంగ్లిష్ లో మాట్లాడితే షాక్ అయిపోయా. ఆ భాషా పరిజ్ఞానం నాకు కూడా లేదు. కేవలం రాజకీయాల కోసం ఓ పాపను దారుణంగా ట్రోల్ చేయడం దారుణం.అవకాశాలు పోతాయని వారించినా...అయితే నేను ఇంకా సినీ–టీవీ కెరీర్ ప్రారంభంలోనే ఉండడంతో పార్టీ మనిషిగా ముద్ర వేసుకోవడం మంచిది కాదంటూ చాలా మంది హెచ్చరించారు. నిజానికి ఇప్పటికీ చాలా మంది అలాగే చెబుతుంటారు. అయితే ఏదో రాజకీయ పారీ్టలో ఉన్నానని ఒక క్యారెక్టర్కి నేను సరిపోతానని తెలిసినా పిలవకుండా ఉంటారా? అలా జరగదని నా నమ్మకం. ఇప్పటివరకూ అలాంటి అనుభవాలు కూడా ఎదురవ్వలేదు. నేను కేవలం టీవీ యాంకర్గానే కాకుండా మాచర్ల నియోజకవర్గం, బెంగాల్ టైగర్... తదితర సినిమాల్లో మంచి పాత్రల్లో చేశాను. -
అవినీతి ‘కాలువ’
ప్రభుత్వ అక్రమాలను ఎత్తిచూపే పాత్రికేయమే రాజకీయ అవతారమెత్తితే...ఇంకేముంది..ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలో ...ఎంతగా దోచుకోవాలో ఆనుపానులు కనిపెడుతుంది...అనంతపురం జిల్లాలోని కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గంలో ఇలాంటి ప్రతినిధి ఒకరు పచ్చ మీడియా అధినేత ఆశీస్సులతో టీడీపీలోకి ప్రవేశించి, మొదట ఎంపీ అయ్యారు.. అ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. చీఫ్విప్ ...మంత్రి పదవులూ దక్కించుకున్నారు.. పనిలోపనిగా గుడ్విల్ పేరిట అక్రమార్జన పనిలో పడ్డారు.అతి తక్కువ వ్యవధిలోనే రూ.1500 కోట్లను ఆర్జించారంటే ఈ నేత దోపిడీ పనితనం ఎంత గొప్పదో అర్థమవుతుంది.. ఇసుక... మట్టి, సాగునీటి ప్రాజెక్టులు.. చెరువుల పూడికతీత పనుల్లో దోపిడీకి అవకాశమున్న మేరకు దోచుకున్నారు... ఈ అపర వెంకన్న దోపిడీ ధనం ‘కాలువై’ పొంగి పొర్లుతోంది.. ఆ దోపిడీ ప్రవాహం ఎలా సాగిపోయిందంటే....సాక్షి టాస్క్ఫోర్స్: ఆయన పేరు తిరుమల వేంకటేశ్వరుడికి పర్యాయ నామం. పేరుకు తగ్గట్టుగా వ్యవహరించడం ఆయనలో లేదు. మనిషిని చూస్తే తెల్లగా, ఎర్రగా కనిపించినా అవినీతిలో మాత్రం స్వభావం నలుపే. పాత్రికేయ వృత్తితో అతి సామాన్య జీవనం ఆరంభించినా, రాజకీయం రారమ్మని తలుపు తట్టింది. రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగి టీడీపీ అధినేత చంద్రబాబుకు విధేయుడిగా మార్కులు కొట్టేశారు. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడిగా పదవి దక్కించుకున్నారు. ఆ పార్టీ తరఫున ఎంపీగా ఓ సారి గెలిచి.. రెండో సారి ఓటమి పాలయ్యారు.తన జిత్తుల మారి ఎత్తులతో 2014లో అసెంబ్లీ టికెట్ సాధించుకున్నారు. స్వల్ప మెజారీ్టతో ఎమ్మెల్యేగా గట్టెక్కారు. ఆ తర్వాత చీఫ్విప్గా ఉంటూ అమాత్యుడిగా అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ అవకాశాన్ని రెండు చేతులతో సద్వినియోగం చేసుకుని ఆరి్థక బకాసురుడిగా ఎదిగారు. ఇసుక నుంచి మట్టిదాకా.. ప్రాజెక్టుల నుంచి రోడ్ల వరకూ దేన్నీ వదలకుండా దోచేశారు. ప్రతి పనిలోనూ అంచనాలు పెంచి గుడ్విల్ పేరుతో దిగమింగారు. ఈ విషయాలను అప్పట్లో సొంత పార్టీ నేతలే బాహాటంగా వ్యతిరేకించారు. తల్లి పంట మేస్తే... పిల్ల మేర మేసినట్టు తామేమీ తక్కువ కాదన్నట్టు ఆ నాయకుడి అండదండలతో తమ్ముళ్లూ అవినీతిలో మునిగి తేలారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రూ.1,500 కోట్లకు పైగా అవినీతి సొమ్ము పోగుచేసి ఉంటారనే అభియోగాలు ఉన్నాయి. ప్రజల్లో హాట్టాపిక్గా నిలిచిన ఈ వ్యవహారం ఇప్పటికీ మరచిపోలేని పరిస్థితి. ఆ మరకను ఎదుటి వారికి అంటించి కడుక్కోవాలని చూసినా ప్రజలు నమ్మలేకపోతున్నారు. ఆ మాజీ నేత మళ్లీ ప్రజాప్రతినిధిగా గెలవడానికి చేయని పనులు లేవు. అక్రమాల తీరిలా.. : జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవానితిప్ప (బీటీ) ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తెస్తామనే నెపంతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు ఈ మాజీ నాయకుడు. ఈ నేపథ్యంలో ఫేజ్–1 కింద రూ.450 కోట్లను కేటాయిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. మొత్తంగా రూ.968 కోట్లకు పరిపాలన అనుమతులను జారీచేశారు. అయినా భూనిర్వాసితులకు పిసరంతైనా నష్టపరిహారం అందించలేదు.ఆ పనులను ప్రస్తుతం మరో దుర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత సంస్థకు కట్టబెట్టి దోపిడీ పర్వానికి తెరలేపారు. ఆయన డీకేటీ భూముల్లో మాత్రమే కాలువ తవ్వకం పనులు చేపట్టి, రైతులను నమ్మించే ప్రయత్నం చేశారు. బోరంపల్లి లిఫ్ట్ నుంచి 56 కిలోమీటర్ల దూరంలోని బీటీప్రాజెక్టుకు నీరివ్వాలి. అప్పటి ధర ప్రకారం కిలో మీటర్కు రూ.3 కోట్లు ఖర్చవుతుందని కాంట్రాక్టర్లు అంచనా వేశారు. మెకానికల్ పనులతో కలిపితే రూ.350 కోట్లలోపే వ్యయంతో నీరివ్వొచ్చు.దోచుకోవాలి కాబట్టి ఏకంగా రూ.968 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో తలా కొంచెం పంచుకుతినేలా కుట్రలు పన్నారు. ఈ పనుల్లో అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారు. ప్రాజెక్టు వద్ద వేసిన పైలాన్ మొదలు ల్యాండ్స్కేప్, రంగులు తదితర పనుల్లో రూ.కోట్లు మెక్కేసిన వైనంపై ఈ ప్రాంతంలో ఎవరినడిగినా చెబుతారు. ⇒ నియోజకవర్గ ముఖ్యపట్టణం నుంచి కళ్యాణదుర్గం రోడ్డు విస్తరణ పనుల్లోనూ రూ.20 కోట్ల వరకు ఈ నేత గుడ్విల్ మెక్కారనే ఆరోపణలూ బలంగా ఉన్నాయి. ఈ పనులకు అప్పటి ప్రభుత్వం రూ.222 కోట్లతో టెండర్ పిలిచింది. కిలోమీటర్కు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల చొప్పున 56 కిలోమీటర్లకు రూ.112 కోట్ల నుంచి రూ.168 కోట్లు ఖర్చవుతుంది. అలా చేస్తే తమకు మిగిలేదేమీ ఉండదు కాబట్టి రూ.54 కోట్ల నుంచి రూ.110 కోట్ల మేర అంచనాలు పెంచి రూ.222 కోట్లకు తుది అంచనాలు రూపొందించారు.ఈ పనులను కేసీపీఎల్– లికాన్ ఏజెన్సీ 15.35 శాతం తక్కువతో రూ.194 కోట్లకు దక్కించుకుంది. దీనివల్ల ఏజెన్సీకీ లాభమే. ఈ పనుల్లో 10 శాతం అంటే రూ.20 కోట్ల వరకు అప్పట్లో మంత్రిగా ఉన్న ఈ నేతకు ముడుపులు అందినట్టు ఆరోపణలున్నాయి. ⇒ ఈ మాజీ ఎమ్మెల్యే హయాంలోనే కణేకల్లు, బొమ్మనహాళ్, డి హీరేహాళ్ మండలాల్లో ఇసుక–మట్టి అక్రమ రవాణా జిల్లాలోనే ఓ మాఫియాను తలపించింది. రచ్చుమర్రి వద్ద వేదావతి హగరి నదిలో తవ్విన ఇసుకను ఈనేత అండదండలతో ఓ సంస్థ సహకారంతో నేరుగా బెంగళూరుకు తరలించి రూ.కోట్లను కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పత్రికలు, టీవీ చానళ్లలోనూ ఈ అవినీతి బాగోతంపై అనేకమైన కథనాలు వచ్చాయి. చివరకు తమ మానస పుత్రికగా చెప్పే ఈనాడులోనే ‘మంత్రి ఇలాకాలో కంత్రీల కులాసా’ శీర్షికతో కథనాన్ని ప్రచురించారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క వ్యవహారంలోనే రూ.350 కోట్లకు తక్కువ కాకుండా కూడగట్టారనే అభియోగం నేటికీ ఉంది. అప్పట్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను కణేకల్లు పోలీసులు పట్టుకుంటే పోలీస్స్టేషన్ ముందు నేరుగా ఈ మాజీ మంత్రి ధర్నా చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిచి్చంది.రాయదుర్గం మండలం టీ వీరాపురం, డి హీరేహాళ్ ప్రాంతాల్లో రూ.కోట్ల విలువ చేసే మట్టిని కర్ణాటక ప్రాంతానికి తరలించారు. ఆనాటి అక్రమాల ఆనవాళ్లు నేటికీ తన అవినీతిని బట్టబయలు చేస్తున్నాయి. ⇒ముఖ్య పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో విలువైన రిజర్వ్ స్థలాన్ని టీడీపీ కౌన్సిలర్ ఒకరు ప్లాట్లు వేసి అమ్మేశారు. ఈయన్ని అనుసరిస్తూ మరింత మంది దురాక్రమణకు పాల్పడి విలాసవంతమైన భవనాలను నిరి్మంచారు. వాటిని రూ.లక్షలకు అమ్ముకుని సొమ్ము కూడగట్టారు.మల్లాపురం, గౌడ, భంభంస్వామి, ముత్రాసకాలనీ, బీటీపీ, గ్యాస్గోడౌన్ లేఅవుట్లలో భవిష్యత్తు అవసరాల కోసం వదిలిన రిజర్వ్ స్థలాలను సైతం మాజీ ఎమ్మెల్యే అండతో తమ్ముళ్లు ఆక్రమించారు. ఒక్కో స్థలాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు అమ్మేశారు. ఇటీవలే టీడీపీ నాయకుడి సహకారంతో పేదలకు చెందిన నాలుగు ప్లాట్లను రూ.6 లక్షలకు ఓ వ్యక్తి అమ్ముకున్నాడు. ఆ విషయమూ వివాదంగా మారింది. ⇒ ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే హయాంలో కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో ఇసుక మేటల నివారణలో భాగంగా రూ.కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసినట్టు రికార్డుల్లో చూపారు. పొలాల్లో మాత్రం ఇసుక అలాగే ఉండిపోయింది. ఆ రికార్డులు సైతం మాయం చేయడం గమనార్హం. నీరు–చెట్టు పనుల్లో సైతం రూ.50 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు తమ్ముళ్ల జేబులోకి చేరాయి. ఇందులో ఈ మాజీ ప్రజాప్రతినిధికీ కమీషన్ల వరద పారింది. గుమ్మఘట్ట, డి హీరేహాళ్, కణేకల్లు ప్రాంతాల్లో జరిగిన అనేక పనులకు ఆనవాళ్లే లేవంటే దోపిడీ తీరు అర్థం చేసుకోవచ్చు. ⇒అప్పట్లో కణేకల్లు చిక్కణ్ణేశ్వర చెరువు పూడికతీత కోసం రూ.2 కోట్లను కేటాయించారు. ఈ పనులనూ కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రకు చెందిన ఎస్ఆర్సీ కంపెనీకే అప్పగించారు. సరిగ్గా వారం రోజుల పనులయినా చేయకముందే చెరువులోకి హెచ్ఎల్సీ నీరొచి్చచేరింది.నీరు నిండిపోవడంతో అరకొరగా చేసిన పనులు కనిపించలేదు. పక్కా ప్లాన్తోనే నీరొదిలి రెండు దుర్గాల నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేతలు కలసి రూ.2 కోట్లను దిగమింగారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ నిధులతోనే ఈ మాజీ ఎమ్మెల్యే విలాసవంతమైన భవనం కట్టుకున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ⇒టీడీపీ పాలనంతా అవినీతి, నిధుల మేతగా సాగినా... నేడు ఈ మాజీ ఎమ్మెల్యే నీతిమంతుడిలా బిల్డప్ ఇస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకు మళ్లీ పట్టం కడితే రెండింతల అవినీతి తప్పదని స్థానిక ప్రజలు మాజీమంత్రిపై నమోదైన కేసుల వివరాలు.. ⇒19–04–2014న ఎంసీసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడడంతో .. ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదయింది. (క్రైమ్ నంబర్ –157/ 2014) ⇒27–04–2014 న ఎంసీసీ ఉల్లంఘన పై ఐపీసీ 188 సెక్షన్ కింద మరో కేసు నమోదయింది. క్రైమ్ నంబర్ – 188/14 ⇒14–03–2020న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ విషయంలో అనుచరులతో కలిసి ఈ మాజీ ఎమ్మెల్యే .. కార్యాలయంలో దౌర్జన్యం చేశారు.. ఈ విషయంపై ఐపీసీ 343, 506 సెక్షన్ల కింద ఆర్పీ యాక్ట్ కేసు నమోదయింది. క్రైమ్ నంబర్ 88/20 ⇒07–12–2021న ఓ యాక్సిడెంట్ కేస్ విషయంలో.. శవ రాజకీయం నిర్వహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టిన విషయంపై.. ఐపీసీ 341, 188ల సెక్షన్ల కింద కేసు నమోదయింది. క్రైమ్ నంబర్ 525/21. ⇒27–11–2022 న చెన్నేకొత్తపల్లి వద్ద టీడీపీ నిర్వహించిన ధర్నాకు ఈ మాజీ ఎమ్మెల్యే ఎలాంటి అనుమతులు లేకుండా పాల్గొనేందుకు వెళ్లే ప్రయత్నం చేశారు.. పోలీసులు అడ్డుకోవడంతో.. రోడ్డుపై ధర్నా చేస్తూ రాద్ధాంతం చేశారు. ఈ ఘటనపై ఐపీసీ 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదయింది. క్రైమ్ నంబర్ 330/ 22 ⇒16–09–23 న చంద్రబాబు స్కిల్స్ స్కామ్ అరెస్టుపై అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహిస్తూ.. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించడంపై.. ఐపీసీ 143, 188, 341 ల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. క్రైమ్ నంబర్ 157/23 ⇒ 27–09–2023 న స్కిల్ స్కామ్ కేసులో మరో ర్యాలీ చేపట్టడంతో.. ఐపీసీ 143, 188, 341 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు.. క్రైమ్ నంబర్ 165/23 ⇒28–08–23న స్కిల్ స్కాం కు నిరసనగా ర్యాలీలు, నిరసనలు పోలీసు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టడంతో.. ఐపిసి 143, 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 167/23 ⇒ 08–10–2023న మళ్లీ అవే సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఈ (9 కేసులు.. రాయదుర్గం అర్బన్ పీఎస్ లో నమోదు) క్రైమ్ నంబర్ 167/23 ⇒ 02–04–2024న బొమ్మనహళ్ మండలం ఉంతకల్లులో ఎంసీసీ కోడ్ నిబంధనలకు విరుద్ధంగా.. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించడంతో.. బొమ్మనహళ్ పీఎస్ పరిధిలో.. 188, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. క్రైమ్ నంబర్: 64/24
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కౌంటీల్లో ఆడనున్న సన్రైజర్స్ మాజీ బౌలర్
ఉచిత రేషన్తో ప్రజల బతుకులు బాగుపడవు: ప్రియాంక గాంధీ
బాహుబలి పట్టాభిషేకం సీన్ తలపించిన సీఎం జగన్ సభ
చంద్రబాబు పై గాడిద సామెత
"నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.." ఫుల్ జోష్ లో వంగా గీత
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
తప్పక చదవండి
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement