civil supplies
-
ధాన్యం దారి మళ్లితే ఉపేక్షించం.. రైస్ మిల్లర్లకు డీఎస్ చౌహాన్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ధాన్యం దారి మళ్లితే ఉపేక్షించేది లేదని.. చర్యలు కఠినంగా ఉంటాయంటూ పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ చౌహాన్ వార్నింగ్ ఇచ్చారు. రైస్ మిల్లర్ల వద్దకు చేరిన ధాన్యం నిల్వలపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాలుగు రోజులలోనే 11 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, పలువురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలులో సర్కార్ పారదర్శకంగా వ్యహరిస్తుందని తెలిపారు.ధాన్యం దారి మళ్లింపునకు అవకాశం ఉండబోదని రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్తోపాటు ఆయా జిల్లాల అసోసియేషన్లు ప్రభుత్వానికి ఇప్పటికే హామీ ఇచ్చాయన్నారు. కొందరు రైస్ మిల్లర్లు మాత్రం అవకతవకలకు పాల్పడుతూ దారి మళ్లిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లర్లు ఉత్తమ పనితీరు కనబరుస్తున్నారని చెప్పారు. -
సరుకులు లేవు..సమన్వయం లేదు
ఆరురోజులుగా విజయవాడ అతలాకుతలమవుతోంది. లెక్కలేనన్ని మరణాలు... అంతులేనంత నష్టం.. ఐదు లక్షల మంది ప్రజల జీవితాలు తల్లకిందులైపోయాయి.. ఇంతజరుగుతుంటే వరద నిండిన వీధుల్లో ముఖ్యమంత్రి రోడ్షోలు, తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా జేసీబీల్లో మంత్రుల ఊరేగింపులే తప్ప బాధితులకు రవ్వంత ఉపశమనం కలిగించలేకపోయారు. సరుకులు పంచుతున్నామని ప్రచారం చేయడంతో శుక్రవారం జనం ఆశగా ఎదురుచూశారు.. యథాప్రకారం అదీ లేదు... ఇక బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు.. వీధిలో చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ నెపాన్ని ఒకరిపై ఒకరు నెట్టుకోవడం చూసి జనం విస్తుపోయారు..సాక్షి, అమరావతి: వరద సహాయక కార్యక్రమాల్లో చంద్రబాబు సర్కారు తీరు అజిత్ సింగ్ నగర్ వంతెన సాక్షిగా నవ్వుల పాలైంది. శుక్రవారం ఏరియల్ వ్యూ ముగించుకున్న తర్వాత అజిత్సింగ్నగర్లో నిత్యావసర సరుకుల పంపిణీలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నిలదీయడంతో ఆయన పక్కనే ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్ వైపు తిరిగారు. ‘ఈ రోజు అటు నిత్యావసర సరుకులు పంచలేకపోయారు.. ఇటు ఆహారం అందించలేకపోయారు... అక్కడ ఉన్న ముసలాయన నా గతి ఏంటి? అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి..’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఈ రోజు ఒక్కరి ముఖంలో కూడా కళ లేదు. ఎందుకంటే వారికి ఆహారం అందలేదు. కడుపులో ఎంతో కొంత పడితే వారు కష్టాన్ని మర్చిపోతారు. మనం వ్యవహరిస్తున్నది మనుషులతో.. యంత్రాలతో కాదు’ అని అన్నారు. ‘అప్పటి వరకు పాజిటివ్గా ఉన్న ప్రజలు కూడా ఇలాంటప్పుడు ఎక్కువ నెగిటివ్గా బయటకొస్తారు. ఈ రోజు ఇక్కడ అదే జరిగింది’ అని అన్నారు. ఈ రోజు ఎన్ని నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని సీఎం అడగ్గా.. ఇప్పటి వరకు 9,000 పంపిణీ చేశామని, సాయంత్రానికి 15,000 చేస్తామని వీరపాండియన్ తెలిపారు. అంటే మనం పెట్టుకున్న 80,000 లక్ష్యంలో కనీసం 20 శాతం కూడా చేయలేదా? అని సీఎం నిలదీశారు. మధ్యలో కలగ చేసుకున్న మంత్రి నాదెండ్ల ఈ మొత్తం తప్పును పురపాలక శాఖ మంత్రి నారాయణ మీద తోసేశారు. సరుకుల పంపిణీ కోసం నారాయణ ట్రాక్టర్లను పంపిస్తామన్నారని, మా రేషన్ వాహనాలు సిద్ధం చేసి సరుకులు పంపిణీ మొదలు పెట్టడంతో ఆలస్యం అయ్యిందన్నారు. ‘సర్.. నేను మీకు ఫిర్యాదు చేయడం లేదు కానీ.. సరుకుల పంపిణీ నీకు సంబంధం లేదు.. నేను, మనోజ్ చూసుకుంటామని మంత్రి నారాయణ గురువారం రాత్రి ఫోన్ చేశారు’ అని నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకు చెప్పారు. ఇలా నాదెండ్ల అసలు విషయాన్ని బహిరంగంగా చెప్పడంతో చంద్రబాబు అవాక్కయ్యారు. వెంటనే వీరపాండియన్తో మంత్రులుగా మేం పాలసీలు మాత్రమే ఇస్తాం. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. ఏమి చేయాలో అది చేయండి అంటూ వ్యాన్ ఎక్కి వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన ప్రజలు ఇదేం ప్రభుత్వమంటూ నవ్వుకున్నారు. మరికొందరు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. -
ప్రజా‘వాణి’ వినిపించదా?
సాక్షి, హైదరాబాద్: ఇబ్బంది ఏదైనా, పరిష్కార వేదిక ఏదైనా.. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు మాత్రం పెండింగ్లోనే ఉండిపోతున్నాయి. భూసంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడికక్కడ ప్రజా సమస్యల అర్జీలు పేరుకుపోతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుల్లో రెవెన్యూ వర్గాలు పరిష్కరించినవి 30శాతం కూడా దాటలేదు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటివరకు రెవెన్యూ శాఖకు 13,513 దరఖాస్తులు రాగా.. అందులో పరిష్కారమైనవి 3,147 దరఖాస్తులు మాత్రమే. మిగతా 10,366 దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెవెన్యూ శాఖకు వెళ్లే దరఖాస్తుల్లో ఎక్కువశాతం ధరణి సంబంధిత సమస్యలే ఉంటాయని.. కొన్నిచోట్ల పింఛన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కేవలం విచారణతోనే సరి! ప్రజావాణి కింద వస్తున్న దరఖాస్తుల్లో ఎక్కువగా ధరణికి సంబంధించినవే ఉంటున్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ధరణి పోర్టల్లో తమకు వచ్చిన లాగిన్ల ఆధారంగా సదరు దరఖాస్తులను పరిశీలించి, విచారణ జరిపి రిపోర్టు పంపించే అధికారం మాత్రమే తమకు ఉందని తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. నిజానికి ఈ దరఖాస్తులను విచారించేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బంది కూడా లేరని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛిన్నాభిన్నమైన రెవెన్యూ వ్యవస్థ ఇంకా కోలుకోలేదని అంటున్నారు. మండలంలో ఉన్న ఒకరిద్దరు రెవెన్యూ ఇన్స్పెక్టర్లే (ఆర్ఐలే) ఈ దరఖాస్తులన్నింటినీ విచారించాల్సి వస్తోందని చెప్తున్నారు. విచారణ అనంతరం రిపోర్టులను పంపినా పైస్థాయిలో పరిష్కారం కావడం లేదని.. కొన్ని దరఖాస్తులు పరిష్కారమైనా ఆన్లైన్లో అప్డేట్ కావడం లేదని వివరిస్తున్నారు. తహసీల్దార్ల స్థాయిలోనే చాలా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. పైస్థాయికి పంపిన వాటిని కలెక్టర్లు పట్టించుకోకపోవడంతో అక్కడా ఆగిపోతున్నాయని అంటున్నారు. నాలుగు జిల్లాల్లోనే కాస్త మెరుగు.. ‘సీఎం ప్రజావాణి’ దరఖాస్తుల గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో మాత్రమే పరిష్కార కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. జగిత్యాల, కరీంనగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో 80శాతానికిపైగా దరఖాస్తులను పరిష్కరించారు. ఆరు జిల్లాలు వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, కామారెడ్డి, నాగర్కర్నూల్, భువనగిరి జిల్లాల్లో అయితే 100శాతం దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. అంటే ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఆ జిల్లాల్లో ఒక్క రెవెన్యూ అర్జీ కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. మిగతా జిల్లాల్లో మొక్కుబడిగా ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార కార్యక్రమం జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో కూడా దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్లో ఉండటం రెవెన్యూ యంత్రాంగం నిర్లిప్తతకు అద్దం పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. వారానికి వెయ్యి దాకా దరఖాస్తులు రాష్ట్రస్థాయిలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వెయ్యి వరకు దరఖాస్తులు వస్తున్నాయి. అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. గత శుక్రవారం 494 దరఖాస్తులురాగా.. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 125, హౌసింగ్ 43, పౌరసరఫరాల శాఖ 71, హోంశాఖ 45, పంచాయతీరాజ్ శాఖ 47, ఇతర శాఖలకు సంబంధించి 48 దరఖాస్తులు ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
రైతులకు మద్ధతు ధర లభించేలా చర్యలు తీసుకోండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వ్యవసాయం, పౌరసరఫరాల శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీదిరి అప్పరాజు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీ నాగిరెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాల కృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ సి హరికిరణ్, ఉద్యానవన శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్ ఎస్ శ్రీధర్,ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ►ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, మద్ధతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలి ►ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు మేలు జరిగేలా చూడాలి ►ఎప్పటిలానే మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించాలి ►పీడీఎస్ ద్వారా మిల్లెట్లను ప్రజలకు పంపిణీ చేయాలి ►మిల్లెట్ల వినియోగం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై కరపత్రాలతో అవగాహన కల్పించాలి ►ఈ ఏడాది రెండో విడత రైతు భరోసాకు సిద్ధం కావాలి ►ఆర్బీకేల స్థాయిలో భూసార పరీక్షలు చేసే విధంగా అధికారులు అడుగులు ముందుకేయాలి ►చేయూత కింద మహిళలకోసం స్వయం ఉపాధి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగించాలి ►బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా పాడి సహా ఇతర స్వయం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేయాలి చదవండి: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ దేశానికే ఆదర్శం -
పౌరసరఫరాల సంస్థలో విభేదాలు.. ‘సార్’ X ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థలో ఆధిపత్య పోరు నడుస్తోంది. సంస్థలో కీలక హోదా ల్లో ఉన్న ఉన్నతాధికారులకు, సంస్థ బాధ్యతలు చూసేందుకు నియమితులైన ‘సార్’కు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. తాను ప్రతిపాదించి న పనులేవీ సంస్థలో జరగడం లేదని, ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తున్నారని ‘సార్’ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోమంటే ఎలా అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రైస్మిల్లుల్లో ధాన్యం మిల్లింగ్, సీ ఎంఆర్ అప్పగింత మొదలు మిల్లులు, ఎంఎల్ఎస్ పాయింట్లపై విజిలెన్స్ దాడులు, రేషన్ దుకాణా లకు బియ్యం సరఫరాలో అవకత వకల వరకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం మొద లు అధికారుల బదిలీల వరకు పలు అంశాలపై విభేదా లు సంస్థ సిబ్బందిలో హాట్టాపిక్గా మారాయి. మిల్లుల్లో తనిఖీలు .. విజిలెన్స్ దాడులు రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిన నేపథ్యంలో రైస్మిల్లుల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయి, సీఎంఆర్ నిర్దేశిత గడువులోగా పూర్తి కావడం లేదు. దీంతో కొన్ని నెలల క్రితం మిల్లర్ల అక్రమాలను నిగ్గు తేల్చే పేరుతో ప్రభుత్వ ప్రతినిధిగా ‘సార్’ రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో స్థానిక విజిలెన్స్, జిల్లా అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. అయితే ఏ మిల్లులో ఎంత లోటు ఉంది, ఏ మేరకు అక్రమాలకు పాల్పడ్డాయనే అంశాలను మీడియాకు వెల్లడించేందుకు తాను చేసిన ప్రయత్నాలను ఉన్నత స్థాయిలో అధికారులు అడ్డుకున్నారని ఆయ న ఆరోపిస్తున్నారు. అయితే ఎండీకి గానీ, ప్రభుత్వ పెద్దలకు గానీ సమాచారం ఇవ్వకుండా ‘రహస్య ఎజెండా’తో ‘సార్’ తనిఖీలు చేశారని సంస్థ అధికారులు కౌంటర్ ఇస్తున్నారు. తనిఖీల పేరుతో దందాలు సాగుతున్నాయనే అనుమానాలే దీనికి కారణమని కొందరు చెబుతున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో రేషన్ బియ్యం పంపిణీ జరిగే ఎంఎల్ఎస్ పాయింట్లకు విజిలెన్స్ సిబ్బందిని పంపిస్తూ దాడుల పేరుతో భయపెడుతున్నారని, తనను ప్రసన్నం చేసుకున్న వారిని వదిలేసి, లేదంటే బెదిరిస్తున్నారనే ఆరోప ణలు వస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సీఆర్ఓ భవనానికి బ్రేక్ సికింద్రాబాద్లోని చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్ఓ) భవనాన్ని రెండు అంతస్తుల్లో నిర్మించాల ని బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సార్’ భావించారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా మిల్లర్ల ‘సహకారం’తో రూ.2 కోట్లతో నిర్మించాలని ఆయన ప్రయత్నించారు. ఈ మేరకు సంస్థలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న డీఈఈని ప్రతిపాదనలు అడిగితే, ఆయన కేవలం రూ.70 లక్షల అంచనాతో ప్రతిపాదనలు ఇచ్చారు. తర్వాత సదరు డీఈఈ డిప్యుటేషన్ రద్దు చేసుకొని వెళ్లిపోయారు. ఆయన స్థానంలో కరీంనగర్లో పనిచేసిన ఓ రిటైర్డ్ ఇంజనీర్ను డీఈఈగా తెచ్చేందుకు ‘సార్’ చేసిన ప్రయత్నం విఫలమైంది. దీన్ని కూడా ప్రభుత్వ పెద్దల ద్వారా ఉన్నతాధికారులు అడ్డుకున్నారనే వాదన విన్పిస్తుండగా, మిల్లర్ల ‘సహకారం’తో భవన నిర్మాణం చేపట్టడాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. 11 మంది సిబ్బంది ఆరుకు కుదింపు కీలక పదవిలో చేరిన తర్వాత ‘సార్’ తన పేషీలో 11 మంది సిబ్బందిని నియమించుకున్నారు. అయి తే సంస్థ ఎండీ.. వారి సంఖ్యను ఏకంగా ఆరుకు కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ మేరకు ఆదేశాలు వచ్చినా సిబ్బందిని తగ్గించే నిర్ణయం అమలుకాకపోవడంపై సంస్థలో చర్చ జరుగుతోంది. ఔట్సోర్సింగ్ నియామకాలకు నో రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో లేనివిధంగా పౌరసరఫరాల సంస్థలో 800 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి ‘సార్’ చేసిన సిఫారసులను అధికారులు ఆమోదించడం లేదని సమాచారం. ప్రధాన కార్యాలయంలో ఉండే లీగల్ అడ్వయిజర్ తరహాలో జిల్లాకో లీగల్ అడ్వయిజర్ను పెట్టాలని ప్రతిపాదించినప్పటికీ ఉన్నతాధికారి అంగీకరించలేదని తెలుస్తోంది. మూడు జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ముగ్గురికి అవకాశం ఇవ్వగా, మరి కొందరి కోసం చేస్తున్న ప్రయత్నాలకు కూడా అడ్డు పడుతున్నట్లు సమాచారం. జిల్లాల్లో పనిచేస్తున్న డీఎంలు, ఇతర ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా తన ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని ‘సార్’ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వసూళ్ల ఆరోపణలు ఇదే సమయంలో ‘సార్’పై పలు ఆరోపణలు సంస్థలో విన్పిస్తుండటం గమనార్హం. త్వరలో డిప్యుటేషన్ పూర్తయ్యే డీజీఎం–అడ్మిన్, డీజీఎం – ఫైనాన్స్ పోస్టుల నియామకం కోసం బేరసారాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు పీడీఎస్ బియ్యాన్ని సీఎంఆర్ కింద పంపించి ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిని మళ్లీ అదే పోస్టులో నియమించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఈ విషయంలో నలుగురు రైస్ మిల్లర్లు బేరం కుదిర్చారనే ఆరోపణలు కూడా విన్పిస్తున్నాయి. -
‘సీఎం కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారు’
సాక్షి,పశ్చిమగోదావరి:పారిశ్రామిక విధానం, గొప్ప ముఖ్యమంత్రి ఉన్నారన్న భరోసాతో రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఏపీకి వెల్లువలా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కారుమూరి స్పందిస్తూ.. దేశంలో అతి పెద్ద రెండో తీరప్రాంతం మన రాష్ట్రంలో ఉండడం.. దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో చేస్తోన్న కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్కు క్యూ కడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులే పెట్టుబడిదారులను ఏపీ వైపు మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించి ఊహించని రీతిలో 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. చంద్రబాబు లాగా మసిపూసి మారేడు కాయ చేయడం లేదని, ఆయన హయాంలో లాగా హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసే సిబ్బందికి సూట్లు, కోట్లు తగిలించి దొంగ ఒప్పందాలు చేసుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అంబానీ,ఆదానీ,అపాచీ మిట్టల్, జెఎస్డబ్ల్యు, జిఎంఆర్ తదితర బడా పారిశ్రామిక వేత్తలు వాస్తవ ఒప్పందాలు జరిగాయని చెప్పుకొచ్చారు. భావి తరాలకు చక్కని విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగాల కోసం సీఎం జగన్ బంగారు బాట వేస్తున్నారని కొనియాడారు. -
స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. కూతురి పెళ్లిరోజే రాష్ట్రస్థాయి పదవి
-
అంతా ముందస్తు ప్రణాళికతోనే! రూ.35 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం
కోదాడ: రూ.35 కోట్ల కస్టంమిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను మాయం చేసిన కేసులో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లుకు చెందిన మిల్లర్.. అంతా ముందస్తు ప్రణాళికతోనే పకడ్బందీగా పని కానిచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మూడు, నాలుగు నెలలుగా దశలవారీగా మిల్లు నుంచి ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు గ్రామస్తులు చెపుతున్నారు. నాలుగు నెలలుగా అధికారులు మిల్లులో ధాన్యం తనిఖీలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. పౌరసరఫరాల అధికారులు మిల్లర్తో కుమ్మక్కు కాకుంటే అది సాధ్యపడదని, దీనిపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మిల్లు సామగ్రి కూడా అమ్మకం?: మిల్లులో సీఎంఆర్ ధాన్యం మాయం చేసిన మిల్లర్, లోపల ఉన్న విలువైన యంత్ర సామగ్రిని కూడా దా దాపు రూ.3 కోట్లకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. మి ల్లంతా ఖాళీ అయిందని, ప్రస్తుతం ఉత్తి షెడ్డు మాత్ర మే ఉందని గ్రామస్తులు చెపుతున్నారు. దానికే అధికారులు తాళం, సీలు వేసి నిఘా పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు. ఈ మిల్లర్ తన స్వగ్రా మం మేళ్లచెరువు మండలం రేవూరులో గతంలో ధాన్యం కోనుగోలు చేసి, రైతులను మోసగించి ఐపీ పెట్టి కాపుగల్లుకు వచ్చాడని గ్రామస్తులు వెల్లడించారు. బ్యాంక్ తనఖాలో మిల్లు ఆస్తులు! కాపుగల్లు రైస్ మిల్లర్ కోదాడలోని ఓ జాతీయ బ్యాంక్ నుంచి మిల్లు మీద దాదాపు 3 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని కోసం మిల్లు ఆస్తులను మొత్తం బ్యాంక్కు తనఖా పెట్టాడు. దీంతో ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి బ్యాంక్ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పౌరసరఫరాల విభాగం అధికారులు ఆ మిల్లర్పై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించినా అక్కడ ఏమీ దొరకదని అంటున్నారు. మిల్లర్ కోసం గాలింపు.. రూ.35 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం చేసిన కేసులో మిల్లర్ ఆచూకీ కోసం కోదాడ రూరల్ పోలీసులు జల్లెడ పడుతున్నారు. మిల్లులో పనిచేసే వారంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారు కావడంతో వారి నుంచి పోలీసులకు ఎటువంటి సమాచారం దొరకడం లేదని తెలుస్తోంది. మిల్లర్ కారు డ్రైవర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. అతను ఇచ్చి న సమాచారంతో పోలీసులు హైదరాబాద్లోని మాదాపూర్కు వెళ్లగా, పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలుసుకుని మిల్లర్ అక్కడి నుంచి బెంగళూరుకు పారిపోయినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వెనుదిరిగి వచ్చినట్లు సమాచారం. -
మహా నగరంలో మాయగాడు.. సివిల్ సప్లయీస్ డెప్యూటీ కలెక్టర్నంటూ..
సాక్షి, గన్నవరం/విజయవాడస్పోర్ట్స్/చిట్టినగర్: విజయవాడ వన్టౌన్ బ్రాహ్మణ వీధిలో నివసించే పిళ్లా వెంకటరాజేంద్ర గతంలో సివిల్ సప్లయీస్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశాడు. పలు మోసాలకు పాల్పడటంతో ఉద్యోగంలో నుంచి తీసేశారు. జల్సాలకు అలవాటుపడిన అతను తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెరతీశాడు. తనను ఉద్యోగంలో నుంచి తీసేసిన సివిల్ సప్లయీస్లోనే డెప్యూటీ కలెక్టర్గా నకలీ ఐడీ కార్డు సృష్టించాడు. ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించాడు. రూ.లక్షల్లో నగదు, ఐఫోన్లు, ఖరీదైన గృహోపకరణాలను సమకూర్చుకున్నాడు. మాయమాటలతో బురిడీ పిళ్లా వెంకటరాజేంద్ర మూడేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తన చేతిలో ఉన్నారని, తన మాట వారి వద్ద వేదవాక్కని నమ్మిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్ట్ ఇప్పించడం చిటికెలో పనంటూ గొప్పలుపోతాడు. ఉద్యోగం కోసం వచ్చిన వారితో ఐ–ఫోన్ కొనిపించుకుంటాడు. ఆ తరువాత నుంచి ఒక్కో విడతలో రూ.2 లక్షల చొప్పున రూ.10 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేస్తాడు. ఉద్యోగం, కాంట్రాక్టు రాలేదని నిలదీసిన బాధితులను పోలీసుల పేర్లు చెప్పి బెదిరిస్తాడు. కొంత మంది బాధితులకు పోలీసుల పేరుతో ఫోన్ చేయించి బెదిరించిన ఘటనలూ ఉన్నాయి. అతని చేతిలో మోసపోయిన వారిలో సామాన్య ప్రజలతోపాటు కొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నారని సమాచారం. చదవండి: (కర్నూలు ప్రభుత్వాసుపత్రి.. రూ.150 కోసం పీడించారు) ఎలా పట్టుబడ్డాడంటే.. గన్నవరం సొసైటీ పేటకు చెందిన యామర్తి అరవింద్ డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ ఏడాది జూన్లో అతనికి పిళ్లా వెంకటరాజేంద్ర పరిచయమయ్యాడు. తాను కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పౌర సరఫరాల శాఖలో డెప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నట్లు రాజేంద్ర నమ్మబలికాడు. తమ శాఖలో ఒక టెండర్తో పాటు స్టోర్ మెయింటినెన్స్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని అరవింద్కు మాయమాటలు చెప్పాడు. వీటి నిమిత్తం ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పి అరవింద్ నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడు. అనంతరం పలు దఫాలుగా అరవింద్ నుంచి డిపాజిట్లు, అకౌంట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా మరో రూ.5.49 లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా అరవింద్తో రూ.73 వేల విలువైన ఐఫోన్, రూ.36 వేల విలువైన వాషింగ్ మెషిన్ను కొనుగోలు చేయించి రాజేంద్ర తీసుకున్నాడు. అయితే తాను చెల్లించిన డబ్బులకు రాజేంద్ర ఎటువంటి రశీదులూ ఇవ్వకపోవడం, కొన్ని రోజులుగా ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అరవింద్కు అనుమానం వచ్చింది. గతంలో రాజేంద్ర చూపించిన డెప్యూటీ కలెక్టర్ ఐడీ కార్డు ఫొటో ఆధారంగా విజయవాడలోని ఆతని ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. ఈ నేపథ్యంలో మరో రూ.1.50 లక్షలు కావాలంటూ ఫోన్చేసిన రాజేంద్రను నమ్మకంగా గన్నవరం పిలిపించి పోలీసులకు అప్పగించారు. రాజేంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే తరహాలో రాజేంద్ర కృష్ణా, గుంటూరు జిల్లాలో పలువురిని మోసగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. విజయవాడ చిట్టినగర్లో నివాసం ఉంటున్న ఓ పురోహితుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షలు వసూలు చేశాడని తెలిసింది. నగర పోలీస్కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్స్టేషన్లకు రాజేంద్ర బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 14 మంది బాధితులు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. -
AP: ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాన్ని ఖండించిన పౌరసరఫరాల శాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై–7) కింద నవంబర్ నుంచి జనవరి వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ వెల్లడించారు. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘ఉచిత బియ్యం ఊసెత్తరేం’ శీర్షికన ప్రచురితమైన కథనాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. రేషన్ డోర్ డెలివరీ విధానం ద్వారా ఇంటి వద్దకే నాణ్యమైన (సార్టెక్స్) బియ్యం పంపిణీచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. చదవండి: చిన్న పరిశ్రమలతో లక్షలాది ఉద్యోగాలు.. ఎంఎస్ఎంఈలకు ఏపీ సర్కార్ ప్రోత్సాహం అయితే, కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేఏవై కింద నాన్–సార్టెక్స్ బియ్యాన్ని మాత్రమే ఇస్తోందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీకి నాన్ సార్టెక్స్ నిల్వలు లేనందున మూడు నెలలకు సరిపడా బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ద్వారా అందించాలని, అక్టోబర్ నుంచి కాకుండా నవంబర్ నుంచి పంపిణీ చేసేలా అనుమతించాలంటూ ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్రం రాష్ట్రానికి 3.24 లక్షల టన్నుల బియ్యాన్ని విడుదల చేయాలని ఎఫ్సీఐని ఆదేశించిందన్నారు. ప్రస్తుతం ఎఫ్సీఐ నుంచి జిల్లాల్లోని మండల స్టాక్ పాయింట్లకు బియ్యం రవాణా జరుగుతోందన్నారు. వచ్చేనెల నుంచి జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి వచ్చే కార్డుదారుల్లోని ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం అందజేయనున్నట్లు ఆయన వివరించారు. గతంలో బియ్యం ఇవ్వని కేంద్రం.. ఇక ఆరో విడత ఉచిత బియ్యం పంపిణీని ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు కేంద్ర పొడిగించగా రాష్ట్రానికి అవసరమైన బియ్యం పంపిణీని విస్మరించిందన్నారు. నాన్ సార్టెక్స్ నిల్వలు లేనందున, అందుబాటులో ఉన్న సార్టెక్స్ బియ్యం కేవలం రెగ్యులర్ పీడీఎస్లో పంపిణీ చేసేందుకు సరిపోతాయని, ఎఫ్సీఐ నుంచి బియ్యం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు. పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వమే నాన్ సార్టెక్స్ బియ్యాన్ని సొంతంగా సేకరించి ఆగస్టు, సెపె్టంబర్లో పంపిణీ చేసిందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఆరు విడతల్లో 25 నెలల పాటు ఉచిత బియ్యం ఇస్తే.. రాష్ట్రం సొంతంగా 19 నెలల పాటు మానవతా దృక్పథంతో కేంద్రంతో సమానంగా స్టేట్ కార్డుదారులకు కూడా బియ్యాన్ని అందించిందన్నారు. ఇందుకోసం ఏకంగా రూ.5,700 కోట్లు ఖర్చుచేసిందని అరుణ్కుమార్ పేర్కొన్నారు. ఉచిత బియ్యం పంపిణీ ఇలా.. రాష్ట్రంలో 4.23 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉంటే కేంద్రం కేవలం 2.68 కోట్ల మందికి మాత్రమే ప్రతినెలా బియ్యం అందిస్తోందని అరుణ్కుమార్ తెలిపారు. మిగిలిన కార్డులకు రాష్ట్రమే సొంతంగా నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. ఉచిత బియ్యం పంపిణీలోనూ కేంద్రం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు మాత్రమే బియ్యాన్ని కేటాయిస్తోందన్నారు. ఇందులో భాగంగా గతంలో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సిఫారసుల మేరకు తిరుపతి, విశాఖపట్నం కార్పొరేషన్లలో మినహా ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని 1.67 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీరితో పాటు మిగిలిన జిల్లాల్లోని 89.20 లక్షల ఎస్సీ, ఎస్టీలకు, 24.60 లక్షల మంది అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు, ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉండటంతో అక్కడి లబ్ధిదారులకు ఉచిత రేషన్ను అందజేయనున్నట్లు అరుణ్కుమార్ వివరించారు. -
విచారణ విధులకు డుమ్మా.. ఎందుకు చెప్మా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కొత్తూరు పౌర సరఫరాల గోదాంలో జరిగిన అక్రమాలను ఆ శాఖ సీరియస్గా తీసుకుంది. రూ.కోటికిపైగా సరుకులు పక్కదారి పట్టిన వైనంపై ఉన్నత స్థాయి విచారణకు రంగం సిద్ధం చేసింది. ఇక్కడ మూడు నెలలుగా పర్యవేక్షణ లేదు. ఎవరూ భౌతిక తనిఖీలు చేపట్టిన దాఖలా కనిపించలేదు. దీంతో సరుకులు పక్కదారి పట్టాయి. ఈ మొత్తం వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటంతో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రంగంలోకి దిగింది. ఈ గుట్టు రట్టు చేసేందుకు నెల్లూరులో పనిచేస్తున్న విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ సుధాకర్ను విచారణాధికారిగా నియమించింది. ఆయన ఈ నెల 20న జిల్లాకు రానున్నారు. సంబంధిత ఎంఎల్ఎస్ పాయింట్ రికార్డులన్నీ సిద్ధం చేసి ఉంచాలని ఇప్పటికే ఆదేశించారు. చదవండి: కన్సల్టెన్సీ.. కంత్రీ.. జాబులు పేరుతో ‘టీడీపీ’ నేత దగా నిబంధనలు ఇవీ.. ♦రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు, వసతి గృహాల కోసం పౌరసరఫరాల సంస్థకు చెందిన ప్రైవేటు గోడౌన్లో సరుకులు ఉంచుతారు. ♦ప్రతి నెలా మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. వచ్చిన నిల్వలు, సంబంధిత సరఫరా ఏజెన్సీలకు వెళ్లిన సరుకులు, ఇంకా మిగిలి ఉన్న నిల్వలపై ప్రతి నెలా చివర భౌతిక తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ♦తనిఖీలో గుర్తించిన విషయాలపై సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్కు నివేదిక అందించాలి. ♦ఆ నివేదిక సవ్యంగా ఉంటే ఫర్వాలేదు. లేకపోతే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. వెలుగులోకి ఆసక్తికర విషయాలు.. కొత్తూరు ఎంఎల్ఎస్ పాయింట్ను ఏప్రిల్ నెలలో తనిఖీ చేసేందుకు ఏఎస్ఓ వంశీని నియమించారు. అయితే ఆయనకు ట్రాన్స్ఫర్ కావడంతో తనిఖీలు చేయలేదు. మే నెలలో తనిఖీ చేసేందుకు ఏఎం అకౌంట్స్ జ్యోతిని నియమించారు. ఆమె కూడా అనారోగ్యం కారణం చూపి తనిఖీలకు వెళ్లలేదు. జూన్లో తనిఖీ చేసేందుకు ఏప్రిల్లో నియమించిన ఏఎస్ఓ వంశీనే మళ్లీ నియమించారు. బదిలీ కారణంతో ఆ నెలలో కూడా తనిఖీలకు వెళ్లలేదు. ఈయన మొదటిసారి తనిఖీ చేయకపోయినా రెండోసారి మళ్లీ ఆయననే తనిఖీ చేయాలని ఆదేశించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తనిఖీ చేయకుండా సాకులు చెప్పడం వెనుక కారణాలేంటి..? అన్న అనుమానాలూ బలపడుతున్నాయి. సాధారణంగా ప్రతి నెలా చేసిన తనిఖీలకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నివేదిక వచ్చిందా? లేదా? అన్నది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డీఎం కార్యాలయం చూసుకోవాలి. దీన్ని బట్టి ఏ నెల ఏం జరిగిందో ఒక అవగాహనకు వస్తారు. కానీ, ఇక్కడ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తనిఖీలు జరిగాయో లేదో, ఫిజికల్ విజిట్ నివేదికలొచ్చాయో లేదా అన్నది ఏ ఒక్కరూ గుర్తించలేదు. జూలై నెల వస్తే గానీ ఈ విషయం బయటపడలేదు. ఈలోపే అక్రమాలు జరిగిపోయాయి. అయితే ఇదంతా పథకం ప్రకారం జరిగిందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. రామ్మోహన్పై చర్యలు.. భారీగా సరుకులు మాయమైన ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి, గ్రేడ్ 3 టెక్నికల్ అసిస్టెంట్ ఈ.రామ్మోహనరావును ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు అక్కడ పనిచేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డును కూడా విధుల నుంచి తొలగించారు. సరుకుల మాయంపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. దానితో పాటు సస్పెండైన రామ్మోహన్రావుపై చార్జెస్ ఫ్రేమ్ చేశారు. ఏడు రోజుల సమయం ఇచ్చారు. ఇంకా సమాధానం ఇవ్వలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో తదుపరి ఏం చేయాలన్నదానిపై సివిల్ సప్లై అధికారులు ఆలోచిస్తున్నారు. కుమ్మక్కయిందెవరు.. సరుకులు మాయమైన తర్వాత విచారణ చేస్తున్న కొద్దీ చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జిగా ఉన్న రామ్మోహన్ ఆ గోడౌన్ తాళం వాచ్మెన్కు ఇచ్చేసి రెగ్యులర్గా విధులకు హాజరు కాలేదని తెలిసింది. వాచ్మెన్పైనే ఆ పాయింట్ ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో 198.706 మెట్రిక్ టన్నుల బరువైన 3,982 బస్తాలు(50 కిలోలవి) బియ్యం, 176 బస్తాలు (50 కిలోలు) పంచదార, 148 పామాయిల్ ప్యాకెట్లు, 420బస్తాల(50కిలోలవి) కందిపప్పు మాయమయ్యాయి. దీంతో ఎవరెవరు కుమ్మక్కయ్యారు? దీంట్లో ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి, వాచ్మెన్తో పాటు ఇంకెవరు ఉన్నారనే దానిపై ఆరా తీయాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందంటే ఈ ఇద్దరే కాదు మరికొంతమంది ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 20న జిల్లాకు ప్రత్యేక అధికారి.. కొత్తూరు ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక అధికారిని ఉన్నతాధికారులు నియమించారు. ఈ నెల 20న జిల్లాకు వస్తున్నారు. రికార్డులన్నీ సిద్ధం చేసి ఉంచాలని సమాచారం ఇచ్చారు. కొత్తూరు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జీగా పనిచేసిన రామ్మోహన్రావును సస్పెండ్ చేయడమే కాకుండా చార్జెస్ కూడా ఫ్రేమ్ చేశాం. దానిపై వివరణ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం. – బి.జయంతి, డిస్ట్రిక్ట్ మేనేజర్, జిల్లా పౌరసరఫరా సంస్థ -
షావుకార్ల కక్కుర్తి!
బీఎండబ్ల్యూ, టయోటా, ఫార్చునర్, ఫోర్డ్స్, ఫోక్స్వ్యాగన్ తదితర విలాసవంతమైన కార్లు కలిగి ఉన్న కుటుంబాల వద్ద అంత్యోదయ, బీపీఎల్ రేషన్కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాలు అనేక ఏళ్లుగా ప్రతినెల నిరుపేదలకు అందించే ఉచిత బియ్యం, రాగులు, జొన్నలు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. విలాసవంతమైన కార్లు కలిగి నిబంధనలకు విరుద్ధంగా బీపీఎల్, అంత్యోదయ కార్డులతో బియ్యం తీసుకుంటున్న 12 వేల కుటుంబాలతో పాటు మరో 3.30 లక్షల కుటుంబాల రేషన్కార్డులను ఆహార పౌరసరçఫరాల శాఖ రదు చేసింది. బనశంకరి: రాష్ట్రంలో రేషన్కార్డులు పొందిన వేలాదికుటుంబాలు వైట్బోర్డు కారు ఉన్నట్లు ఆహార పౌరసరఫరాలశాఖకు సందేహం వచ్చింది. ఈ నేపథ్యంలో రవాణాశాఖను ఆశ్రయించిన పౌరసరఫరాల శాఖ... రేషన్కార్డులు కలిగి ఉన్న కుటుంబాలు కారు కొనుగోలు చేసి రిస్ట్రేషన్ చేయించిన వారి సమాచారం అందించాలని కోరింది. రవాణాశాఖ అందించిన సమాచారంతో రేషన్కార్డులకు అనుసంధానమైన ఆధార్కార్డును పరిశీలించగా 12,584 కుటుంబాలు కార్లు కలిగి ఉన్నప్పటికీ బీపీఎల్, అంత్యోదయ కార్డులను తీసుకున్నట్లు వెలుగుచూసింది. అందులో కలబుర్గిలో ఓ వ్యక్తి బీఎండబ్ల్యూ, బెంగళూరు గ్రామాంతర, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర, కలబుర్గిలో టయోటా, ఫార్చునర్, చామరాజనగరలో ఫోర్డు, మండ్యలో ఎంజీ మోటార్, హాసనలో ఫోక్స్వ్యాగన్, చిక్కమగళూరులో మహింద్రజీప్ కలిగిన కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిపై చర్యలు తీసుకున్నామని ఆహార పౌరసరఫరాలశాఖ తెలిపింది. కార్లు కలిగిన కార్డుదారుల సంఖ్య కార్లు కలిగిన కుటుంబాలు బీపీఎల్, అంత్యోదయ రేషన్కార్డులు తీసుకున్న వారి సమాచారం జిల్లాల వారిగా సేకరించారు. కలబుర్గిలో 2114, చిక్కమంగళూరులో 1912, బెంగళూరు1312, రామనగర 922, ఉత్తరకన్నడ 553, యాదగిరి 517,శివమొగ్గ 522, బీదర్ 554, బెంగళూరుగ్రామాంతర 547,బెంగళూరు పశి్చమ 485, తుమకూరు 307,చిక్కబళ్లాపుర 296,హావేరి 220, బాగల్కోటె 216,విజయపుర 214,బెంగళూరు ఉత్తర 201, మండ్య 137,దక్షిణకన్నడ 130, బళ్లారి 67, బెంగళూరు తూర్పు 89, చిత్రదుర్గ 43, దావణగెరె 62, ధారవాడ 15, గదగ 15, హాసన 86, కొడగు 21, కోలారు 65, కొప్పళ 29, మైసూరు 123, రాయచూరు 39, ఉడుపి 42 మంది నిబంధనలకు వ్యతిరేకంగా రేషన్కార్డుదారులు ఉన్నారు. 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల వద్ద రేషన్ కార్డులు: మానవవనరుల శాఖ నిర్వహణ వ్యవస్థ(హెచ్ఆర్ఎంఎస్) ఆయా శాఖల నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ మండలి, ప్రైవేటు సంస్థల ఉద్యోగుల సమాచారం సేకరించింది. వారి ఆధార్కార్డులను పరిశీలించగా 22 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలు ఉల్లంఘించి రేషన్ కార్డులు తీసుకున్నట్లు తేలింది. వీరికి నోటీస్ జారీచేసి జరిమానా చెల్లించాలని పౌరసరఫరాల శాఖ సూచించింది. జిల్లాల వారీగా రద్దైన కార్డులు నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థ్దికంగా నిరుపేదలమని తీసుకున్న 3,30,024 రేషన్కార్డులను పౌరసరఫరాలశాఖ రద్దు చేసింది. వీటిలో అంత్యోదయ 21,679, బీపీఎల్ 3,08,345 బీపీఎల్కార్డులు ఉన్నాయి. కొన్ని కార్డులను ఏపీఎల్ గా మార్చారు. అత్యధిక రేషన్కార్డులు రద్దుకాబడిన జిల్లాల సమాచారం ఆధారంగా బెంగళూరు 34,705, విజయపుర 28,735, కలబుర్గి 16,945,బెళగావి 16,765, రాయచూరు 16,693, చిత్రదుర్గ 16,537 రేషన్కార్డులను రద్దు చేసినట్లు పౌర సరఫరాలశాఖ తెలిపింది. (చదవండి: ప్రేమించలేదని గొంతు కోసుకున్నాడు) -
మళ్లీ రేషన్ కార్డుపై ఉచిత బియ్యం.. యూనిట్కు 10 కిలోల పంపిణీ
సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత (రేషన్) కార్డు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా యూనిట్కు పది కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ కానుంది. ఈ నెల ఐదు నుంచి ఉచిత బియ్యం కోటా పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ మధ్యలో రెండు నెలలు నిలిచిపోగా, గత నెల చివర్లో నెల సరి కోటాతో సంబంధం లేకుండా యూనిట్కు ఐదు కిలోల చొప్పున ఉచితంగా అదించారు. ఈ నెలలో మాత్రం పాత పద్ధతిలోనే యూనిట్కు పది కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. కార్డులో ఎన్ని యూనిట్లుంటే అన్ని పదికిలోల చొప్పన పంపిణీ చేస్తారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా నెలసరి ఉచిత కోటా ఈ నెల 29 వరకు డ్రా చేసుకోవచ్చు. గత రెండేళ్ల నుంచి.. కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఉచిత కోటా కేటాయిస్తూ అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం కోటా కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి పది కిలోల చొప్పున అందిస్తూ వస్తోంది. ఉచితం బియ్యం పథకం కాలపరిమితి మార్చి కోటాతో ముగియడంతో కేంద్రం మరోసారి సెప్టెంబర్ వరకు పథకాన్ని పొడగించింది. అయితే ప్రభుత్వ చౌకధరల దుకణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్న్ నెలల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ సాధ్యం కాలేదు. రూపాయి కిలో చొప్పున అందించారు. అయితే గత నెల చివర్లో మాత్రం నెలసరి కోటా పంపిణి గడువు ముగియగానే యూనిట్కు ఐదు కిలోల చొప్పున అందించింది. ఈ నెలలో మాత్రం పది కిలోల చొప్పున పంపిణీ చేయనుంది. చదవండి: పట్టు బిగించండి.. రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం -
మిల్లుల్లోని ధాన్యంపై ఎఫ్సీఐకి అధికారం ఎక్కడిది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చిన్నచిన్న కారణాలతో ధాన్యం కొనుగోలు చేయబోమని ఎఫ్సీఐ లేఖ రాయడంతోనే కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో తెలుస్తోందని పేర్కొన్నారు. మిల్లుల్లో అక్రమాలు జరిగినట్లు ఎఫ్సీఐ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని స్పష్టంచేశారు. బుధవారం ఆయన విలే కరులతో మాట్లాడుతూ ఎఫ్సీఐ తీరును తప్పు బట్టారు. మిల్లుల్లోని వడ్లు, బియ్యంపై ఎఫ్సీఐ కి ఏం అధికారముందని ప్రశ్నించారు. రాష్ట్రం లోని రైస్ మిల్లుల్లో వడ్లు, బియ్యం నిల్వలపై ఎఫ్సీ ఐకి ఎలాంటి అధికారం లేదని మంత్రి చెప్పారు. సీఎం ఆర్ కింద బియ్యం ఎఫ్సీఐకి ఇచ్చిన తరువాతే వారికి అధికారం వస్తుం దని పేర్కొన్నారు. తనిఖీ ల్లో తేడాలు వచ్చినా చర్యలు తీసుకో లేదని ఆరో పణలు చేస్తున్నారని, మార్చిలో ఆరు జిల్లాల్లోని 40 మిల్లులు తనిఖీ చేస్తే 4,53,896 బ్యాగులు లేవని చెప్పారని, రెండో మారు అవే మిల్లుల్లో తనిఖీ చేస్తే 10 మిల్లుల్లో మాత్రమే తేడా ఉందని అన్నారని పేర్కొన్నారు. ఒక్క గింజ తేడా వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఊరుకో దని, మూడు మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమి నల్ కేసులు పెట్టిందని తెలిపారు. మరో రెండు మిల్లుల్లో మొత్తం ధాన్యాన్ని రికవరీ చేశామని, మిగతా ఐదు మిల్లులపై చర్యలు తీసుకోవా లని కలెక్టర్లకు లేఖలు రాశామని చెప్పారు. రెండో దశలో 63 మిల్లుల్లో తే డా.. అని ఎఫ్సీఐ అధికారులు జూన్ 4న లేఖ రాశారని, దాన్ని కలెక్టర్లకు పంపి పరిశీలించ మని ఆదేశించినట్లు వెల్లడించారు. జూన్ నుంచి నవంబర్ వరకు ఉచిత బియ్యం.. కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యా న్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేయ డం లేదని ఎఫ్సీఐ చేసిన వ్యాఖ్యలు అర్థర హితమని మంత్రి గంగుల పేర్కొన్నారు. సాం కేతిక కార ణాల వల్ల 2 నెలలు ఉచిత బియ్యం సరఫరాలో ఆలస్యం అయిందని, ఈ జూన్ నుంచి యథాతథంగా సరఫరా చేస్తు న్నామని చెప్పారు. 2020 ఏప్రిల్ నుంచి కేంద్రంతో పాటు ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని ఇచ్చా మని, తద్వారా ప్రభుత్వంపై 8 నెలల పాటు రూ.980 కోట్ల భారం పడిందని తెలిపారు. ఇక 2021 జూన్ నుంచి ఏప్రిల్ 2022 వరకు కూడా ఉచితంగా బియ్యం ఇచ్చామని వివరించారు. 2022 మార్చిలో.. ఏప్రిల్ నుంచి ఆరు నెలల పాటు ఉచిత బియ్యం ఇవ్వాలని కేంద్రం లేఖ రాసిందని, తదనుగుణంగా మూడో దశ కూడా ఉచిత బియ్యం ఇవ్వాలని సీఎం నిర్ణయించిన ప్పటికీ సేకరణ, ఇతర కారణాల వల్ల పంపిణీ ఆలస్యం అయిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 90,46,000 కార్డుల్లో కేవలం 53 లక్షల కార్డుదారులకు మాత్రమే కేంద్రం ఉచిత బియ్యం ఇస్తోందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తొలివిడత అందరికీ ఉచితబియ్యం ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ జూన్ నుంచి తెల్ల రేషన్కార్డు దారులందరికీ రూ.436 కోట్ల భారాన్ని భరించి నవంబర్ వరకు ఆరు కిలోలకు అదనంగా మరో ఐదు కిలోలు కలిపి 11 కేజీల చొప్పున ఉచితబియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, పెట్రోల్, డీజిల్కు ఇబ్బంది లేకుండా చూడాలని ఆయిల్ కంపెనీలకు చెప్పామని, స్టాక్ ఉండి కూడా ప్రజలకు పెట్రోల్, డీజిల్ ఇవ్వకపోతే బంకులపై చర్యలు తీసుకొం టామని గంగుల హెచ్చరించారు. . -
నూనెలు అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసరాలు, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. వంటనూనెల ధరల నియంత్రణపై మంగళవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కృత్రిమ కొరత సృష్టించి వంట నూనెలను అధిక రేట్లకు విక్రయించినా, పరిమితికి మించి నిల్వలు ఉంచినా బైండోవర్ కేసులు నమో దు చేయాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ దందా పై నిరంతరం నిఘా ఉంచి, ఎప్పటికప్పుడు వ్యాపా ర దుకాణాలు, నూనె తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రణాళిక ప్రకారం రైతుబజా రులు, మున్సిపల్ మార్కెట్లలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి, బయటి ధరల కంటే తక్కువకు వంటనూనెలను అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా మండలాల వారీగా నూనె ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాల న్నారు. సోయాబీన్, రైస్ బ్రాన్ నూనెల వాడకాన్ని ప్రోత్సహించాలి పామ్ ఆయిల్ దిగుమతులపై ఆంక్షలున్న నేపథ్యంలో సోయాబీన్, రైస్ బ్రాన్ నూనెల వాడకం వైపు ప్రజలను ప్రోత్సహించాలని మంత్రి కారుమూరి సూచించారు. ఆ నూనెలను ఆయిల్ ఫెడ్ ద్వారా విక్రయించడంతో పాటు కనోల ఆయిల్ (ఆవనూనె) అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు. పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహించి, సాగు విస్తీర్ణం పెంచాలన్నారు. బ్లాక్ మార్కెట్, కల్తీ నూనెల విషయంలో ఇప్పటి వరకు 76 కేసులు నమోదు చేశామని, 22,598 క్వింటాళ్ల నూనెలను జప్తు చేశామని మంత్రి వివరించారు. వీటిల్లో కేసులు పరిష్కరించిన బ్రాండ్లను తిరిగి మార్కెట్లోకి విడుదల చేసినట్టు చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ వీరపాండియన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ శంకబ్రత బాగ్చి, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి మధుసూదనరెడ్డి, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ కిశోర్కుమార్, రైతుబజార్ సీఈవో శ్రీనివాస రావు, ఏపీ ఆయిల్ ఫెడ్ ఎండీ బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
‘వలంటీర్లు సీఎం జగన్ గుండెల్లో ఉన్నారు’
తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): పేదలు గడప దాటకుండా సంక్షేమం వారి గడపకు చేర్చేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ల వ్యవస్థ తెచ్చారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. తణుకు మండలం మండపాక గ్రామంలో వలంటీర్లకు సేవారత్న, మిత్ర, వజ్ర పురస్కారాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హాజరైన కారుమూరి.. మీడియాతో మాట్లాడారు. పేదలు గడప దాటకుండా సంక్షేమం వారి గడపకే చేర్చేలా సీఎం జగన్ వలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. వలంటీర్లు సీఎం జగన్ గుండెల్లో ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మావాళ్ళకే చేయండి.. మావాళ్లనే చూడండి అని కలెక్టర్ల మీటింగ్ లో చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలు, కులాలు భేదం లేకుండా సంక్షేమం అందరికీ అందాలని చెప్పారు. మండపాక గ్రామంలో టీడీపీ హయాంలో కోటి 8 లక్షల రూపాయిలు మాత్రమే ఖర్చు చేశారు.మండపాక గ్రామంలో వై యస్ ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక 11 కోట్ల 81 లక్షల రూపాయిలు ఖర్చు చేశాము. రెండున్నర ఏళ్లలో మేము రూ. 7,109 కోట్ల తణుకు మండలానికి ఖర్చు చేశాము. 346 ఎకరాలు సేకరించి 18 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము. దేశంలోని ముఖ్యమంత్రులు మన పాలనవైపు చూస్తున్నారు. 70 శాతం బీసీ ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు క్యాబినెట్ లో స్థానం కల్పించారు’ అని కారుమూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ విష్ణు చరణ్, జేసీ మురళీ, శెట్టి బలిజ కార్పోరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
సేవల్లో అలసత్వం వద్దు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని తాన క్యాంపు కార్యాలయంలో ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. కచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్పీ ధర లభించాలన్నారు. రైతులందరికీ ఎంఎస్పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఆ దిశగా ఆర్బీకేలు, అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే..: ♦రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదు ♦ఎక్కడా కూడా సమాచార లోపం ఉండకూడదు ♦తరచుగా రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలి ♦రంగుమారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గతంలో ఎవ్వరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవు ♦రైతులకు తోడుగా నిలవడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నాం: ♦ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు ♦కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలి: ♦ధాన్యం నాణ్యతా పరిశీలనలో రైతులు మోసాలకు గురికాకూడదు ♦ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వంనుంచే ఎగుమతులు చేసేలా చూడాలి ♦దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది: ♦కొనుగోలు కోసం ఆర్బీకేలో ఐదుగురు సిబ్బంది ♦ధాన్యం, పంటల కొనుగోలు కోసం ప్రతి ఆర్బీకేలో కూడా కనీసంగా ఐదుగురు సిబ్బంది ఉండాలి ♦టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇతర సిబ్బంది ముగ్గురు కచ్చితంగా ఉండాలి ♦ప్రతి ఆర్బీకేలో కూడా కేటగిరీతో సంబంధం లేకుండా ఐదుగురు సిబ్బంది ఉండాలి ♦వీళ్లే రైతుల దగ్గరకు వెళ్లి.. వారితో ఇంటరాక్ట్ అయ్యి.. కొనుగోలుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలి ♦గన్నీ బ్యాగులు, రవాణా వాహనాలు, అవసరమైన హమాలీలను ఈ ఐదుగరు సిబ్బందే ఏర్పాటు చేయాలి ♦వీటికోసం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండకూడదు: 21 రోజులలోగా పేమెంట్స్... ♦ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో వారికి పేమెంట్లు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ♦దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని పేమెంట్లు ఆలస్యం కాకుండా చూడాలి : సీఎం ఆదేశం ♦అన్ని కొనుగోలు కేంద్రాలు తెరిచారా? లేదా? అన్నదానిపై వచ్చే మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టండి: సీఎం ♦ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా సిబ్బంది ఉన్నారా? లేదా? చూడండి ♦కొనుగోలు ప్రక్రియ జరుగుతున్న తీరుపై పరిశీలన చేయండి ♦వీటిన్నింటిపైనా మూడు నాలుగు రోజుల్లో దృష్టిపెట్టండి ♦తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లండి ఫిర్యాదుల కోసం ఫోన్ నంబర్ ♦పంటల కొనుగోలు సంబంధిత సమస్యలపై ఫిర్యాదులు, విజ్ఞాపనల కోసం ప్రతి ఆర్బీకేలో ఒక నంబర్ను పెట్టాలని సీఎం ఆదేశం ♦ఆ నంబర్కు వచ్చే ఫిర్యాదులను సీరియస్గా తీసుకోవాలని సీఎం ఆదేశం ♦క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి రైతులు చెప్పే సమస్యలను వినాలని సీఎం ఆదేశం ♦దీనివల్ల సమస్యల తీవ్రతతో పాటు పరిష్కార మార్గాలు లభిస్తాయన్న సీఎం ♦రైతులతో ఇంటరాక్షన్, నిరంతర చర్చలు అధికారులు జరపాలని సీఎం ఆదేశం ♦జిల్లాల్లో ఉన్న జేసీలనుంచి కూడా పంటలకొనుగోలుపై నిరంతర ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్న సీఎం సీసీఆర్సీ కార్డ్స్పై మరింత అవగాహన ♦సీసీఆర్సీ కార్డ్స్ ( క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్)లపై అవగాహన నిరంతరం కల్పించాలన్న సీఎం ♦సీసీఆర్సీ కార్డ్స్ వల్ల రైతుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదన్న విషయాన్ని వారికి చెప్పాలి ♦రోజుకు సగటున ధాన్యం కొనుగోలు 42,237 మెట్రిక్టన్నులకు చేరిందన్న అధికారులు ♦రానున్న రోజుల్లో మరింత ఉద్ధృతంగా కొనుగోళ్లు జరుగుతాయన్న అధికారులు ప్రత్యామ్నాయ సాగు – ప్రోత్సాహం ♦రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుచేసేలా వారిలో అవగాహన కల్పించండి: సీఎం ♦ఇలా పంటలు పండించే వారికి ప్రత్యేక బోనస్ ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించాలి ♦ప్రత్యామ్నాయ పంటలు పండించేలా కార్యాచరణ సిద్ధంచేయండి ♦ప్రత్యామ్నాయ పంటల కొనుగోలు బాధ్యతను కూడా ప్రభుత్వమే చేపడుతుందన్న విషయాన్ని రైతులకు తెలియజేయండి ♦రైతులకు మంచి ఆదాయాలు కల్పన దిశగా చర్యలు తీసుకోవాలి: అధికారులకు సీఎం నిర్దేశం ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని), సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధనరెడ్డి, సివిల్ సఫ్లైస్ కమిషనర్ ఎం గిరిజాశంకర్, వ్యవసాయశాఖ కమిషనర్ హెచ్ అరుణ్కుమార్, అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీ ఎస్ ప్రద్యుమ్న, సివిల్ సఫ్లైస్ డైరెక్టర్ ఎస్ డిల్లీరావు, సివిల్ సఫ్లైస్ ఎండీ జీ వీరపాండ్యన్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: (పారిశ్రామిక విప్లవం) -
దొంగకు తాళాలు ఇచ్చిన అధికారులు
తాడేపల్లిరూరల్: సివిల్ సప్లయీస్ అధికారులు దొంగ చేతికి తాళాలు ఇచ్చి చేతులు దులుపుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... ఈనెల 7వ తేదీన తాడేపల్లి రూరల్ ప్రాంతంలోని ఇప్పటం శివారుల్లో రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటోకి పంచర్ అయ్యింది. ఆటోలో ఉన్న రేషన్ బియ్యాన్ని సగం వరకు దించి ముళ్ల పొదల్లో పెట్టి పంచర్ వేసుకుంటున్నారు. ఆ సమయంలో పొలాలకు వెళుతున్న గ్రామస్తులు గమనించి రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెవెన్యూ అధికారులు సంఘటనా స్ధలానికి వెళ్లి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ముళ్ల పొదల్లో ఉన్న బియ్యాన్ని ఆటోలోకి ఎక్కించి ఇప్పటం గ్రామంలో భద్రపరిచారు. ఈ సంఘటనపై వీఆర్వో సివిల్ సప్లయీస్ డీటీకి అదేరోజు సమాచారం ఇచ్చారు. ఇప్పటి వరకు ఆటోపైగానీ, ఆటోలో బియ్యాన్ని తరలిస్తున్న వారిపై గానీ ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం విశేషం. ఆటోలో ఉన్న రేషన్ బియ్యాన్ని దగ్గరలో ఉన్న రేషన్ షాపులో ఉంచి ఆటోను మాత్రం మూడు రోజుల అనంతరం వడ్లపూడిలోని ఒక రైస్మిల్లుకు తరలించారు. గతంలో ఇదే రైస్మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించగా రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి పలుమార్లు కేసులు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లుకు ఆటోను పంపండం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధంకావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆటో యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవని, అలా చేయకుండా మంగళగిరి సివిల్ సప్లయీస్ అధికారులు ఆటోను రైస్మిల్లులో భద్రపరచడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
నూనె మిల్లులపై దాడులు
నరసరావుపేట/తెనాలి రూరల్/భవానీపురం (విజయవాడ పశ్చిమ)/గుంటూరు (మెడికల్): ఆహార పదార్థాల కల్తీలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికన కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాలోను, విజయవాడలోను ప్రత్యేక బృందాలు బుధవారం దాడులు జరిపాయి. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని నూనె మిల్లులపై ఆహార కల్తీ నియంత్రణ శాఖ, పౌర సరఫరాలు, తూనికల, కొలతల శాఖల అధికారులు బుధవారం దాడులు జరిపారు. కొబ్బరి, వేరుశనగ, సన్ప్లవర్ ఆయిల్స్ను రీ ప్యాకింగ్ చేస్తున్న మిల్లుల్లో రూ.4.51,665 విలువైన 3,152 లీటర్ల ఆయిల్ ప్యాకెట్లను సీజ్ చేసి, ఏడు శాంపిళ్లను సేకరించినట్టు ఆహార కల్తీ నియంత్రణ శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ షేక్ గౌస్మొహిద్దీన్ తెలిపారు. కలెక్టర్ వివేక్ యాదవ్, జాయింట్ కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు ఆహార వివిధ శాఖల అధికారులతో ఆరు బృందాలుగా ఏర్పడి ఆయిల్ మిల్లులపై నిర్వహించామని ఆయన చెప్పారు. సత్తెనపల్లి రోడ్డులోని కనకదుర్గ ఇండస్ట్రీస్లో రూ.77,765 విలువ చేసే 480 లీటర్ల వేరుశనగ నూనె ప్యాకెట్లను, కోటప్పకొండ రోడ్డులోని వెంకటలక్ష్మి ట్రేడర్స్ మిల్లులో రూ.3,28,900 విలువైన 2,192 లీటర్ల సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను, హోం గాయత్రి ఇండస్ట్రీస్లో హెల్దీ ఆయిల్ కమ్ హెల్దీ లైఫ్ అని రాసిన రూ.45 వేల విలువైన 480 లీటర్ల సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను సీజ్ చేశామన్నారు. సత్తెనపల్లి రోడ్డులోని బొడ్డు నాగేశ్వరరావుకు చెందిన ధనలక్ష్మి నీమ్ ఆయిల్ మిల్లు, దివ్య నాగసాయి ఆయిల్ మిల్లులో వేరుశనగ నూనె, ఆంజనేయ ట్రేడింగ్ కంపెనీలో కొబ్బరినూనె శాంపిల్స్ సేకరించామన్నారు. నూనె తయారీ కేంద్రాలపై కేసులు ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తెనాలిలోని నూనె తయారీ కేంద్రాలపై బుధవారం దాడులు నిర్వహించారు. గంగానమ్మపేటలోని శ్రీనివాస ఆయిల్ అండ్ ప్రొవిజన్స్ సంస్థపైన, పూజ అండ్ నంది దీపారాధన తైలం తయారీ సంస్థపైనా కేసు నమోదు చేశారు. విజయవాడలో కొనసాగిన దాడులు విజయవాడ నగరంలో చేపట్టిన దాడులు బుధవారం కూడా కొనసాగాయి. భవానీపురం గాం«దీ»ొమ్మ రోడ్లోని వెంకటదుర్గ, మహేశ్వరి డాల్ మిల్స్పై ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు. రెండు మిల్లులలో రూ.3 లక్షల విలువైన పెసరపప్పు బస్తాలను సీజ్ చేసి నమూనాలను సేకరించారు. మహాత్మాగాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్లోని రాకేష్ ట్రేడర్స్ ఆయిల్ కంపెనీ రాయలసీమ నుంచి దిగుమతి చేసుకున్న విడి నూనెను, నూనె ప్యాకెట్ల నమూనాలను సేకరించారు. భవానీపురం ఐరన్ యార్డ్లో పప్పు ధాన్యాల నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. దాల్ మిల్స్లోని పెసరపప్పులో నిషేధిత రంగు కలుపుతున్నట్టు గుర్తించామన్నారు. కల్తీ చేసే వారిపై చర్యలు తప్పవు.. నిత్యావసర సరుకులు, ఆహార పదార్ధాలను కల్తీ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఆహారం .. హాహాకారం’, ‘బయో మాయా’ శీర్షికలతో ప్రచురితమైన కథనాలపై స్పందించిన కలెక్టర్ సివిల్ సప్లైస్, ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతల శాఖ అధికారులు, మునిసిపల్ కమిషనర్లతో కలెక్టర్ వివేక్యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సివిల్ సప్లైస్, ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతలు, పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు, మండలాల్లో తహసీల్దార్లతో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. రెస్టారెంట్లలో మాంసం కల్తీ ఎక్కువగా జరుగుతోందని, మునిసిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కల్తీ పురుగు మందులు, విత్తనాలు విక్రయించకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. -
తెలంగాణలో నాణ్యమైన బియ్యానికి.. చెల్లిన 'నూకలు'
►కింద ఫొటోలో బియ్యం చెరుగుతున్న మహిళ పేరు కవిత. మెదక్ జిల్లా రేగోడ్ మండలం సంగమేశ్వర తండాకు చెందిన ఆమె కుటుంబానికి నెలకు 12 కిలోల రేషన్ బియ్యం వస్తాయి. ఈసారి కూడా ఎప్పట్లాగే డీలర్ వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకుంది. కానీ సంచి విప్పితే సగం దాకా నూకలే. జల్లెడ పట్టి చూస్తే.. 12 కిలోల బియ్యంలో నాలుగున్నర కిలోల నూకలు వచ్చాయి. ►ఇదే జిల్లా చిన్నశంకరం పేట మండలం రుద్రారానికి చెందిన శివలింగం లింగయ్య కుటుంబానికి ప్రతి నెలా 30 కిలోల రేషన్ వస్తుంది. ఈ నెల వచ్చిన బియ్యాన్ని జల్లెడ పడితే పది కిలోల దాకా నూకలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి. బియ్యంలో గరిష్టంగా 20–25 శాతం వరకు నూకలు ఉండొచ్చు. కానీ పేదలకు అందుతున్న రేషన్ బియ్యంలో ఏకంగా 40–45 శాతం వరకు నూకలు ఉంటున్నాయి. సాక్షి, మెదక్(ఆదిలాబాద్/మహబూబ్నగర్) : రూపాయికే కిలో బియ్యం.. నాణ్యమైన బియ్యం.. రాష్ట్రంలో నిరుపేదల కడుపు నింపేందుకు అమలవుతున్న ప్రతిష్టాత్మక పథకం. లక్ష్యం అదుర్స్! కానీ పథకం అమల్లోనే పందికొక్కులు చొరబడ్డాయి. ప్రజలకు చేరాల్సిన మేలు రకం (ఫైన్ వెరైటీ) బియ్యం దారితప్పి విదేశాలు, పక్క రాష్ట్రాలకు తరలుతుండగా.. నిరుపేదలకేమో 40–45 శాతం వరకు నూకలే ఉన్న బియ్యం సరఫరా అవుతున్నాయి. కొన్ని నెలలుగా ఇలా నూకల బియ్యం నిరుపేదలకు సరఫరా అవుతున్న వైనంపై ‘సాక్షి’పరిశోధన చేపట్టింది. మార్చి నెలలో రేషన్ షాపుల ద్వారా మెదక్, ఆదిలాబాద్, జోగులాంబ, నారాయణపేట జిల్లాల్లో సరఫరా చేసిన బియ్యాన్ని పరిశీలించింది. ఇటీవల పలువురు లబ్ధిదారులు రేషన్ షాపుల నుంచి తెచ్చుకున్న బియ్యాన్ని కొలత వేయించి, జల్లెడ పట్టించి.. నూకలను వేరుచేసి చూసింది. దాదాపు అన్నిచోట్ల కూడా ప్రభుత్వం గరిష్టంగా నిర్దేశించిన 25శాతం (కిలోకు పావు కిలో) కంటే మించి.. ఏకంగా నలభై, నలభై ఐదు శాతం వరకు నూకలు ఉన్నట్టు గుర్తించింది. దీనికి కారణమెవరు? కొందరు మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై నిరుపేదలకు నాణ్యతలేని, నూకల బియ్యం అంటగడుతున్నట్టు ‘సాక్షి’పరిశీలనలో వెల్లడైంది. వాస్తవానికి మిల్లర్లు ఎఫ్సీఐ/పౌర సరఫరాల శాఖ పంపిన ధాన్యాన్నే మిల్లింగ్ చేసి అలా వచ్చిన బియ్యాన్ని తిరిగి ఇవ్వాలి. కానీ కొందరు మిల్లర్లు మంచి ధాన్యాన్ని తాము వాడేసుకుంటున్నారు. తాము బయట నేరుగా తక్కువ ధరకు కొన్న తడిసిన, నాణ్యతలేని ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పౌరసరఫరాల శాఖకు పంపుతున్నారు. అందుకే బియ్యంలో నాణ్యత తక్కువగా, నూకలు ఎక్కువగా ఉంటున్నట్టు వెల్లడైంది. అక్రమాలకు తోడ్పడుతున్నదెవరు? మిల్లర్లకు ధాన్యాన్ని పంపి.. తిరిగి బియ్యాన్ని తీసుకోవడాన్ని ‘కస్టమ్ మిల్లింగ్’అంటారు. ఇందుకు ప్రభుత్వం మిల్లర్లకు చార్జీలు చెల్లిస్తుంది. ఇలా ధాన్యాన్ని పంపి, మిల్లింగ్ అయ్యాక బియ్యాన్ని తిరిగి తీసుకునే క్రమంలో.. అధికారులు నాలుగు స్టేజీల్లో నాణ్యతను పరిశీలించాలి. కానీ కొందరు ఎఫ్సీఐ, పౌరసరఫరాల అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి మిల్లర్లకు సహకరిస్తున్నారు. ప్రతి స్టేజీలో ఓ రేటు మాట్లాడుకుని వదిలేస్తున్నారు. దీంతో నాణ్యత లేని బియ్యం గోదాములకు, అక్కడి నుంచి రేష¯Œ షాపులకు చేరుతున్నాయి. మంచి బియ్యం ఎక్కడికి పోతున్నాయి? నాణ్యతలేని, నూకల బియ్యాన్ని ప్రభుత్వానికి అంటగడుతున్న మిల్లర్లు.. ఎఫ్సీఐ నుంచి వచ్చిన మంచి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి నాణ్యమైన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని క్వింటాల్ రూ.2,500 నుంచి రూ.2,600 రేటుతో.. ఏపీలోని పెద్దాపురం, కాకినాడ కేంద్రంగా చైనా, వియత్నాం, దుబాయ్, థాయ్లాండ్, పలు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. ఈ సీజన్లో ఇప్పటికే పది లక్షల టన్నుల బియ్యం ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి అయినట్టు అంచనా. ఇందులో చాలావరకు కస్టమ్ మిల్లింగ్ కోసం ఎఫ్సీఐ పంపిన ధాన్యం నుంచి వచ్చిన బియ్యమే ఉండటం గమనార్హం. కాకినాడ పోర్టులో షిప్పులోకి బియ్యం లోడింగ్ (ఫైల్) కస్టమ్ మిల్లింగ్ ధాన్యం మాయం.. బియ్యం ఇవ్వలేదు.. శనివారం పెద్దపల్లి జిల్లాలోని ఒక రైస్మిల్లులో బియ్యం మిల్లింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో ఐకేపీ, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి ధాన్యం కొంటుంది. ఆ ధాన్యాన్ని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మిల్లర్లకు ఇస్తుంది. మిల్లర్లు ధాన్యాన్ని మర ఆడించి.. ముడి బియ్యం అయితే 67 కిలోలు, బాయిల్డ్ రైస్ అయితే 68 కిలోల చొప్పున తిరిగి అందజేయాలి. ఇందుకు ప్రభుత్వం మిల్లర్లకు క్వింటాల్ బాయిల్డ్ రైస్కు రూ.50 చొప్పున, ముడి బియ్యానికి రూ.30 చొప్పున చార్జీలు చెల్లిస్తుంది. పారాబాయిల్డ్ బియ్యమైతే గరిష్టంగా నూకలు 16 శాతం, డిస్కలర్ (రంగుమారిన) 5 శాతం, డ్యామేజ్ 4 శాతంలోపు ఉండాలి. ముడి బియ్యమైతే గరిష్టంగా నూకలు 25 శాతం, డిస్కలర్ 5, డ్యామేజ్ 5 శాతంలోపు ఉండాలి. వానాకాలం ధాన్యాన్ని ఏటా మార్చి 31 లోపు.. యాసంగి ధాన్యాన్ని సెప్టెంబర్ 31లోపు మర ఆడించి బియ్యం తిరిగివ్వాలి. కానీ మిల్లర్లు ఓ సీజన్కు సంబంధించిన బియ్యాన్ని మరో సీజన్లో ఇస్తున్నారు. ఈ గ్యాప్లోనే అక్రమాలకు పాల్పడుతున్నారు. వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, మిర్యాలగూడ, నిజామాబాద్ జిల్లాల్లో ఈ దందా భారీ స్థాయిలోనే నడుస్తోంది. ఇప్పుడు కూడా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. పలు జిల్లాల్లో మిల్లర్లు గత వేసవిలో తీసుకున్న ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని ఇంకా సర్కారుకు ఇవ్వలేదు. అంటే ముడి ధాన్యంగానీ, బియ్యంగానీ రైస్ మిల్లులు, గోదాముల్లోనే ఉండాలి. కానీ ఆయా ప్రాంతాల్లోని రైస్ మిల్లులు, గోదాములను ‘సాక్షి’పరిశీలించగా.. ఎక్కడా సీఎంఆర్ ధాన్యంగానీ, బియ్యం నిల్వలు గానీ లేవు. అంటే మిల్లర్లు ఇప్పటికే అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్టు అర్థమవుతోంది. చాలా చోట్ల ఇదే తీరు.. ►జోగులాంబ గద్వాల జిల్లా రాజోలికి చెందిన రాములమ్మ కుటుంబానికి నెలకు 24 కిలోల రేషన్ బియ్యం వస్తుంది. ఇటీవల వచ్చిన బియ్యాన్ని జల్లెడ పడితే ఆరు కిలోలపైన నూకలు వచ్చాయి. ►ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో నివసించే శాతల నాగమ్మ కుటుంబానికి ప్రతినెలా 35 కిలోల రేషన్ బియ్యం అందుతుంది. ఈ నెల తీసుకున్న బియ్యం చెరిగితే ఎనిమిది కిలోల దాకా నూకలు వచ్చాయి. ►మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణానికి చెందిన సర్గం మల్లమ్మ తనకు వచ్చిన 12 కిలోల బియ్యాన్ని చెరిగితే నాలుగు కిలోలకుపైగా నూకలు వచ్చాయి. ఇలాగైతే ఎలా అని ఆమె వాపోయింది. ►మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరుకు చెందిన పాలకుల లక్ష్మి రేషన్ బియ్యం తీరుపై మండిపడింది. ‘గత నెలలో వచ్చిన బియ్యం ముక్కవాసన వచ్చాయి. ఈసారి వచ్చిన బియ్యంలో నూకలే ఎక్కువగా ఉన్నాయి’అని వాపోయింది. సగం నూకలే.. అన్నం ముద్ద అవుతోంది రేషన్ షాపులో మంచి బియ్యం ఇస్తున్నారని సంతోషించినం. బియ్యం జల్లెడ పట్టి చూశాక ఉన్న సంతోషం పోయింది. సగం నూకలే ఉన్నాయి. వండిన అన్నం మెత్తగా ముద్దగా అవుతోంది. దొడ్డు బియ్యమే నయం అనిపిస్తున్నది. డీలర్ను అడిగితే గోదాం నుంచే బియ్యం అట్లా వస్తున్నయని చెప్తున్నడు. – స్వరూప, రేషన్ లబ్ధిదారు, చిలప్చెడ్, మెదక్ ఒక్కోసారి సగానికి సగం నూకలే.. 3 నెలల నుంచి బియ్యం ఒక్కో సంచిలో ఒక్కో రకం వస్తున్నాయి. ఒక్కోసారి సగానికి సగం నూకలు వస్తున్నాయి. ఈ మధ్య వస్తున్న బియ్యంలో మరీ ఎక్కువగా ఉంటున్నాయి. లబ్ధిదారులు గొడవ పడుతున్నారు. సముదాయించలేక తలపట్టుకోవాల్సి వస్తోంది. – నర్సింహులు, డీలర్, రుద్రారం, చిన్నశంకరంపేట, మెదక్ -
అనంతపురంలో కరపత్రాల కలకలం
అనంతపురం అర్బన్: పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. సంస్థ డీఎం డమ్మీగా మారారంటూ కొందరు ముద్రించిన కరపత్రాలు బయటకు రావడం కలకలం రేపింది. ప్రధానంగా అసిస్టెంట్ మేనేజర్ (ఏఎం)ని టార్గెట్ చేస్తూ కరపత్రంలో ఆరోపణలు సంధించారు. జిల్లా మేనేజర్ పేరుకే అధికారిగా అంటూ... కార్యాలయంలో పెత్తనం పూర్తిగా అసిస్టెంట్ మేనేజర్దే అంటూ విమర్శలు చేశారు. గతంలో ఆయన పనిచేసిన చోట ఉద్యోగులతో ఏ విధంగా వ్యవహరించారనేది చెబుతూ... ఇక్కడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారు అంటూ... ఇలా పలు ఆరోపణలతో కూడిన కరపత్రం బయటికి రావడం కార్యాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చాలా రోజులుగా ఉద్యోగుల మధ్య విభేధాలు సంస్థ ఉద్యోగుల్లో ఏడాది కాలంగా విబేధాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అవి తీవ్రస్థాయికి చేరుకుని ఏకంగా కరపత్రాలు ముద్రించే వరకు వచ్చాయి. ఇటీవల కాలంలో సంస్థలోని కొందరు ఉద్యోగులు, అధికారులపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. పర్సంటేజీ కోసం కాంట్రాక్టర్లపై ఒత్తిడి చేస్తున్నారని, ఉద్యోగులపై కొందరు అధికారులు బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఇక్కడి వ్యవహారాలపై దృష్టి పెట్టకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. కాగా, కరపత్రం విషయాన్ని సంస్థ జిల్లా మేనేజర్ మోహన్బాబు దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. దీనిపై ఆయన వివరణ ఇచ్చేందుకు కొంత ఇబ్బంది పడ్డారు. మాది ఈ ప్రాంతం కాదు.. ఒకటి రెండేళ్లు ఉండి వెళ్లిపోతాం..అంటూ ముభావంగా ఉండిపోయారు. -
6 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ
-
ఏపీ: ఐదు రోజుల్లోనే కొత్త రేషన్కార్డు..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరింత పకడ్బందీగా రేషన్ కార్డులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి కొత్త దరఖాస్తులకు రేషన్కార్డులు జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఐదు రోజుల్లో దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. (4 నెలల ముందుగానే వైఎస్సార్ వాహన మిత్ర) రేషన్ డోర్ డెలివరీలో భాగంగా కార్డుదారులకు బియ్యం సంచుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతీ కుటుంబానికి 10,15 కిలోల చొప్పున సంచులను అందిస్తామన్నారు.ఒక్కో సంచీ తయారీకి రూ.25 ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు కోన శశిధర్ తెలిపారు. (బీసీలకు ‘పథకాల’ పంట) -
3600 మందికి ఉద్యోగాలు : గంగుల
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్పై ఉన్న అభిమానంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్కు కరీంనగర్ అంటే సెంటిమెంట్ అని.. అందుకే నలుగురితో పాటు మరొకరికి క్యాబినెట్ హోదా పదవి ఇచ్చినందుకు ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. తొలి విడతలో మంత్రి పదవి ఆశించానని.. రెండో విడతలో అవకాశం రావడంతో తన జీవితకాలంలో రక్తం ధారపోసి పార్టీ కోసం పనిచేస్తానని పేర్కొన్నారు. మంగళవారమిక్కడ గంగుల విలేకరులతో మాట్లాడుతూ...తనకు కేటాయించిన పౌర సరఫరాల శాఖను నెంబర్ వన్గా చేస్తానని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి మంచి ఫలితాలు రాబట్టేలా సహకరించాలని విఙ్ఞప్తి చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేశా.. ‘కరీంనగర్లో వరుసగా గెలిచిన చరిత్ర ఏ నాయకుడికి లేదు. ఆ అదృష్టం నాకు దక్కింది. నగర ప్రజలకు రుణపడి ఉంటా. మచ్చలేకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశాను. నావల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తా. సంతృప్తిని ఇచ్చే శాఖ ఇచ్చారు. కాబట్టి సీఎం కేసీఆర్ ముఖంలో అనునిత్యం నవ్వు కనిపించేలా పనిచేస్తా. టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి కేసీఆర్ స్పూర్తితో.. టీడీపీలో తెలంగాణ వాదాన్ని వినిపించి పార్టీని వీడిన మొదటి ఎమ్మెల్యే నేను. కేసీఆర్ను చూస్తే ముఖ్యమంత్రిలాగా కనిపించడు.. ఓ డిక్షనరీగా కనిపిస్తాడు. గొప్ప మానవతావాది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి. 2018లో ఆయన బొమ్మతో గెలిచాము. రేపు ఏ ఎన్నికలు జరిగినా కేసీఆర్ బొమ్మతోనే గెలుస్తాం’ అని గంగుల పేర్కొన్నారు. ఇక తన నియోజకవర్గం గురించి మాట్లాడుతూ...‘కరీంనగర్లో స్మార్ట్ సిటి పనులు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి. స్మార్ట్ సిటి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్దే. నగరంలో రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతాం. రెట్టింపు అభివృద్ధి చేస్తాం. దసరాకు ఐటీ టవర్ కంప్లీట్ చేసి, 3600 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. బిజినెస్ సెంటర్గా, పర్యాటక కేంద్రంగా కరీంనగర్ను నెంబర్ వన్ చేస్తాం. గత పాలకులకు ఇవన్నీ ఎందుకు కనిపించలేదు. పార్టీ లైన్లో కార్యకర్తలు పనిచేయాలని కోరుతున్నా. మానేర్ రివర్ ఫ్రంట్ రూ. 506 కోట్లకు జీవో ఇచ్చారు. ఈసారి అదే ఎమౌంట్ ఈ బడ్జెట్లో క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కరీంనగర్లో మెడికల్ కాలేజీ కోసం కేంద్రం నుంచి ప్రయత్నిస్తున్నాం. నా శాఖలపై త్వరలో పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకుంటా. నాణ్యత లోపించినా, అవినీతి పనులకు పాల్పడినా సీరియస్ యాక్షన్ తప్పదు అని మంత్రి గంగుల హెచ్చరించారు. -
పౌరసరఫరాల శాఖ పనితీరుపై మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష
-
సెప్టెంబర్ 1 నుంచి ‘పథకాల’ డోర్ డెలివరీ
-
రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో ఈ ఏడాది ఖరీఫ్లో పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని సేకరించి రికార్డు సృష్టించింది. గత ఏడాది కంటే రెట్టింపుస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత ఏడాది ఖరీఫ్లో 2,716 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.17 లక్షలమంది రైతుల నుండి 18.24 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఖరీఫ్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,280 కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతుధర (గ్రేడ్–ఎ క్వింటాల్కు రూ.1,770, సాధారణ రకం– క్వింటాల్కు రూ.1750)కు 6.71 లక్షలమంది మంది రైతుల నుండి 34.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మరో రెండు నుంచి మూడు లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేస్తోంది. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలు, సాగునీటి ప్రాజెక్టుల వల్ల కొత్తగా ఆయకట్టు సాగులోకి రావడంతోపాటు నిరంతరం విద్యుత్ సరఫరా, రైతుబంధు వంటి కార్యక్రమాలతో రైతులు పెద్దఎత్తున వరి సాగు చేశారు. గత ఏడాది ఖరీఫ్లో 8 లక్షల హెక్టార్లలో వరిసాగు జరగ్గా, ఈ ఏడాది 10 లక్షల హెక్టార్లలో సాగైంది. ఈసారి పురుగులు(దోమకాటు), ఇతర రోగాలు లేకపోవడంతో గతంలో కంటే ఎకరానికి 10 క్వింటాళ్లు అధికంగా దిగుబడి పెరిగింది. రైతులకు కనీసమద్దతు ధర లభించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వారికి అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో దళారుల జోక్యానికి అడ్డుకట్ట పడింది. పంటకు కనీస మద్దతుధర గ్యారంటీగా లభిస్తుందనే భరోసా రైతుల్లో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించారు. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నల్లగొండ, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి అయింది. దీంతో మొత్తంగా ఈ ఏడాది ఖరీఫ్లో 3,280 కొనుగోలు కేంద్రాల ద్వారా 6,71,286 మంది రైతుల నుండి రూ.6,055 కోట్ల విలువ చేసే 34.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేశారు. ఇప్పటివరకు రూ.5,213 కోట్లు ఆన్లైన్ ద్వారా రైతుఖాతాలోకి జమ చేయగా, మిగిలిన మొత్తం కూడా ట్రాక్షీట్ జనరేట్ అయిన వెంటనే జమ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. లక్ష్యానికి మించి కొనుగోళ్లు చేశాం రాష్ట్రంలో ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాం. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావులేకుండా జిల్లాల కలె క్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ, సంస్థ అధికారులతోపాటు ఇతర విభాగాల అధికారులతో పూర్తి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. ఖరీఫ్లో 25 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 34 లక్షల టన్నులు సేకరించాం. 36 లక్షల టన్నుల వరకు వస్తుందని అంచనా వేస్తున్నాం. తుఫాన్ వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా రైతుల నుండి కొనుగోలు చేస్తున్నాం. దీని ప్రభావం రైతులపై పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా ధాన్యం దిగుబడి అయింది. కానీ, ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా విజయవంతంగా కొనుగోళ్లను పూర్తి చేయగలిగాం. – అకున్ సబర్వాల్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ -
బయోమెట్రిక్ లేకపోయినా రేషన్: ఈటల
సాక్షి, హైదరాబాద్: బయోమెట్రిక్ పనిచేయకపోతే మ్యానువల్ లేదా ఐరిస్తో వినియోగదారులకు రేషన్ సరుకులు ఇస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆగస్టు 15 తర్వాత ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు. మంగళవారం పౌరసరఫరాలు, తూనికల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. 31 జిల్లాల తూనికలు కొలతల అధికారులకు ల్యాప్టాప్లు, వాహనాలను ఈటల, సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్డి, కమిషనర్ అకున్ సభర్వాల్ అందజేశారు. కల్తీలపై ఉక్కుపాదం మోపుతున్నామని, మల్టీప్లెక్స్ మోసాలను కూడా అరికడుతున్నామని ఈటల తెలిపారు. -
సరుకుల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్లు సమ్మె విరమణకు అంగీకరించని నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. గ్రామాల్లోని ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) మహిళా సంఘాలతో సరుకుల పంపిణీ చేయించేలా ఏర్పా ట్లు చేస్తోంది. ఈ నెల 28 వరకు డీలర్లకు డెడ్లైన్ విధించడంతో అంతవరకు వేచిచూసిన తర్వాత తగిన ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంగళవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ జిల్లా డీఎస్వోలు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 28 నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా ల వారీగా కార్యాచరణ సిద్ధం చేసుకురావాలని ఆదేశించారు. అదే రోజున గ్రామాల వారీగా సరుకుల పంపిణీ చేసే ప్రాంతాన్ని గుర్తించడం, మహిళా సంఘాలను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సరుకుల పంపిణీకి డీలర్లు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సరుకులు అందించడం బాధ్యత.. ఈ నెల 28 వరకు మీ–సేవ కేంద్రాల్లో రేషన్ సరుకుల కోసం డబ్బులు చెల్లించి, ఆర్ఓ (రీలీజ్ ఆర్డర్) తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని పౌర సర ఫరాల శాఖ మంగళవారం డీలర్లకు విజ్ఞప్తి చేసింది. పేదలకు నిత్యావసర సరుకులను సకాలంలో అం దించాల్సిన కనీస బాధ్యత రేషన్ డీలర్లపై ఉందని పేర్కొంది. తెలంగాణ ప్రజాపంపిణీ వ్యవస్థ కం ట్రోలర్ ఆర్డర్ 2016 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ డీలర్నైనా తొలగించే అధికారం, నిత్యావసర సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్నైనా తొలగించి, వారి స్థానంలో ఇతరులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. నిర్దేశిత గడువులోగా డబ్బులు చెల్లించని డీలర్లను తొలగిస్తామంది. సకాలంలో సరుకులు ఇవ్వడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపింది. -
పౌరసరఫరాల శాఖ డీఎం ఆత్మహత్యాయత్నం
నెల్లూరు(పొగతోట): జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం ఎన్. కృష్ణారెడ్డి సోమవారం తన చాంబర్లో ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన డీఎం తన కార్యాలయానికి చేరుకుని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఈ ఘటన జిల్లాలో అధికారుల వర్గాల్లో సంచలనమైంది. వివరాల్లోకి వెళ్లితే.. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు మంత్రి సోమిరెడ్డి స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి డీఎం హాజరయ్యారు. సమావేశం నుంచి వచ్చిన తర్వాత తన చాంబర్లోకి వెళ్లాడు. జిల్లా అధికారి ఒకరికి ఫోన్ చేసి తన బాధను వ్యక్తం చేసి, ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. తన భార్యకు కూడా ఫోన్ చేసి అదే విషయం చెప్పి, నీవు, పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేశాడని తెలిసింది. ఇంతలోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. డీఎం భార్య వెంటనే కార్యాలయానికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో సిబ్బంది తలుపులు పగులగొట్టి ఆయన్ను రక్షించి బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆ శాఖ అధికారులను సంప్రదించాలని ఫోన్ చేస్తే ఒక్కరు కూడా స్పందించలేదు. విషయం తెలుకున్న మంత్రి సోమిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అక్కడే ఉన్న డీఎం భార్యతో మంత్రి మాట్లాడారు. డీఎం పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండి కోలుకుంటున్నట్లు సమాచారం. అవినీతి, అక్రమాలు మోపడంతోనే.. డీఎం కృష్ణారెడ్డి కొంత కాలంగా మనోవేదనకు గురవుతున్నాడని సమాచారం. ఆయనకు సంబంధం లేని అవినీతి, అక్రమాలను ఆయనకు ఆపాదించడంతో మనస్థాపానికి గురై కొంత మంది అధికారుల ఎదుట బాధపడినట్లు తెలిసింది. రెండు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న తనకు ఈ పరిస్థితి ఏమిటోనని ఆవేదన చెందినట్లు చెబుతున్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక దీర్ఘకాలిక సెలవుపై వెళతానని అడగ్గా అందుకు అధికారులు అంగీకరించలేదని సమాచారం. ఈ తిట్లు నేను భరించలేను కనీసం తనను సస్పెండ్ చేయమని అడిగినట్లు కూడా తెలిసింది. ధాన్యం కొనుగోలు, గతంలో సీఎంఆర్ బకాయిలు ఇతర విషయాలపై జిల్లా అధికారి అందరి ఎదుట తిడుతున్నట్లు సమాచారం. కింద సిబ్బంది ఎదుట తిడితే కార్యాలయంలో తనకు వారు ఏ విధంగా గౌరవం ఇస్తారని తోటి అధికారి ఎదుట వాపోయారని తెలిసింది. గత వారంలో నిర్వహించిన సమావేశంలో నీవు అసమర్థుడివి.. నీ ముఖం నాకు చూపించకు అంటూ పరుషంగా మాట్లాడారని, అప్పటి నుంచి తీవ్ర మనోవేదనతో ఉన్నట్లు కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. -
పౌర సరఫరాల్లో పారదర్శకతకే ‘ఈ–పాస్’
నిర్మల్టౌన్: అక్రమాలకు తావు లేకుండా నిత్యావసర సరుకులను పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంఎస్ ఫంక్షన్ హాలులో శుక్రవారం చౌకధరల దుకాణాల డీలర్లకు ఈ పాస్ యంత్రాల వినియోగంపై నిర్వహించిన శిక్షణ, అవగాహన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్, పెంబి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు నిర్మల్రూరల్, నిర్మల్అర్బన్, సోన్, లక్ష్మణచాంద, మామడ మండలాలకు సంబంధించిన రేషన్ డీలర్లకు ఈ పాస్పై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ, చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకులను పంపిణీ చేసేందుకు ఈ–పాస్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సౌలభ్యంగా, పారదర్శకంగా నిత్యావసర సరకులను పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ పాస్ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. దీనివల్ల రేషన్ సరుకులు పక్కదోవ పట్టకుండా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రేషన్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈపాస్ను ప్రవేశపెట్టిందన్నారు. రేషన్ డీలర్లకు అర్థమయ్యేలా ఈ పాస్ యంత్రాల పనితీరుపై ఆమె వివరించారు. అనంతరం ఈపాస్ బయోమెట్రిక్ మిషన్లను రేషన్ డీలర్లకు పంపిణీ చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఈపాస్ యంత్రాలతో 48 లక్షల లావాదేవీలు నిర్వహించినట్లు తెలిపారు. వచ్చే నెల 18 నుంచి... ఈ నెలలో కొత్తగూడెం, గద్వాల్, ఖమ్మం, నాగర్కర్నూల్, వనపర్తి, యాదాద్రి బోనగిరి జిల్లాల్లో ఈపాస్ యంత్రాలపై శిక్షణ కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. శనివారం నుంచి నల్గొండ, సూర్యాపేట్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పాస్ మిషన్ల ద్వారా ఆన్లైన్ బయోమెట్రిక్ విధానంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్డీవో ప్రసూనాంబా, జిల్లా పౌరసరఫరాల ఇన్చార్జి అధికారి వాజీద్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీకళ, ప్రాజెక్టు మేనేజర్ రఘునందన్, అసోసియేట్ మేనేజర్ శ్రావణ్, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజేందర్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
దిగొచ్చిన రేషన్ డీలర్లు
సాక్షి, హైదరాబాద్: డిమాండ్లు పరిష్కరించా లంటూ సమ్మె బాట పట్టిన పౌరసరఫరాల రేషన్ డీలర్లలో చాలామంది ప్రభుత్వ హెచ్చ రికతో వెనక్కి తగ్గారు. సరుకులు తీసుకోని డీలర్లను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సీఎం ఆదేశించడం, డిసెంబర్ నెల సరుకుల కోసం శనివారం లోగా డీడీలు కట్టాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ సీవీ ఆనంద్ గడువు విధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు డీడీలు కట్టడంలో మునిగిపోయారు. శనివారం సాయంత్రం వరకు 13 వేల 200 మంది డీలర్లు డీడీలు కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 17 వేల 200 రేషన్ దుకాణాలుండగా వాటిలో వెయ్యి షాపులకు రెగ్యులర్ డీలర్లు లేరు. మరో 3 వేల మంది డీలర్లు మాత్రమే డీడీలు చెల్లించాల్సి ఉంది. మంచిర్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మాత్రమే ఎక్కువ మంది డీలర్లు డీడీలు కట్టలేదని చెబుతున్నారు. అయితే మీ–సేవా కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల కొందరు డీడీలు కట్టేలక పోయారని తెలుస్తోంది. డీలర్లు సమ్మెకు పిలుపు ఇవ్వడంతో ఈ నెల సరుకుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా చాలామంది డీలర్లు డీడీలు కట్టిన నేపథ్యంలో సరుకుల పంపిణీకి ఇబ్బందులు తొలగిన ట్లేనని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల డీడీలు కట్టేందుకు డీలర్లకు 4వ తేదీ వరకు గడువు పెంచాలని, డీలర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, సభ్యుడు ఆనంద్ శని వారం పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్సీవీ ఆనంద్లను కలిసి విజ్ఞప్తి చేశారు. డీలర్లందరూ డీడీలు కట్టాలని సంఘం తరఫున కోరుతున్నామన్నారు. -
అదనంగా జీఎస్టీ వసూలు చేస్తే చర్యలు
సాక్షి, హైదరాబాద్: ప్యాక్ చేసిన సరుకుల మీద వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కన్నా అదనంగా జీఎస్టీ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. చట్ట విరుద్ధంగా పన్నుల పేరుతో వాస్తవ ధర కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తే వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని తూనికలు, కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం తూనికలు, కొలతల శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. గురువారం హైదరాబాద్లోని వర్తక, వ్యాపారు లతో సమావేశం నిర్వహించాలని అధికా రులను ఆదేశించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, వీరు గురువారం నుంచి ప్రత్యేక తనిఖీలు చేస్తారని తెలిపారు. పౌరసరఫరాల శాఖ వాట్సాప్ నంబర్ 7330774444తో పాటు తూనికల కొలతల శాఖకు చెందిన 7386136907, 27612170 నంబర్లలో, ఛి ఝ్టటఃnజీఛి.జీn వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేయొచ్చన్నారు. -
వాట్సాప్లో రేషన్ ఫిర్యాదులు
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాలో భాగంగా జరుగుతున్న రేషన్ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పౌర సరఫరాల శాఖ కొత్త ప్రయత్నానికి తెరతీసింది. ఇకనుంచి నేరుగా కమిషనర్కు రేషన్ ఫిర్యాదులు చేసేందుకు వీలుగా పౌరసరఫరాల భవన్లో వాట్సాప్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని శుక్రవారం ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఐటీ స్వరూపంలో పెను మార్పులు మార్పులు తీసుకొచ్చామని, ప్రైవేటు సంస్థలకు దీటుగా రాష్ట్ర ఐటీ శాఖ పనిచేస్తోందని జయేశ్రంజన్ అన్నారు. ఫిర్యాదుల స్వీకరణకు 7330774444 మొబైల్ నంబర్ను కేటాయించామని చెప్పారు. 24 గంటల పాటు పనిచేసే ఈ వాట్సాప్ కేంద్రానికి ప్రజలు సంక్షిప్త సందేశాలు, చిత్రాలు, ఆడియో, వీడియో క్లిప్పింగులను పంపవచ్చని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఆ విషయాన్ని 24 గంటల్లో ఫిర్యాదుదారుడికి సందేశం పంపేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సీసీ కెమెరాల ఏర్పాటు పౌరసరఫరాల సంస్థ గోదాముల నుంచి రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పౌరసరఫరాల సంస్థకు సంబంధించిన 171 ఎంఎల్ఎస్ పాయింట్లలో దశల వారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 43 గోదాముల్లో, రెండో దశలో మెదక్, నల్లగొండ కరీంనగర్ జిల్లాల్లో 54, మూడో దశలో వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 34, నాలుగో దశలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 40 గోదాముల్లో, వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం 162 గోదాముల్లో 1,657 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సాంకేతికత, పౌరదర్శకత, విషయంలో పౌరసరఫరాల శాఖ మరో అడుగు ముందుకేసిందని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
పౌర సరఫరాలకు 2 స్కోచ్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు జాతీయ స్థాయిలో రెండు స్కోచ్ అవార్డులు దక్కాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా కట్టడి లక్ష్యంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, పర్యవేక్షణ, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఏర్పాటు చేసిన ఎఫ్ఎంఎస్–ఓపీఎంఎస్ (ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్–ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్)లు జాతీయ స్కోచ్ అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ శాఖకు సంబంధించి దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసింది. 1,337 స్టేజ్ 1, స్టేజ్ 2 వాహనాలు, 46 కిరోసిన్ ట్యాంకర్లకు జీపీ ఎస్ అమర్చడం, హైదరాబాద్లోని మండల స్థాయి నిల్వ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను అమర్చి వీటన్నిటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేసింది. దీని ద్వారా రేషన్ బి య్యం తరలించే రవాణా వాహనాల కదలి కలను ప్రత్యక్షంగా పరిశీలించేలా ఏర్పాటు చేసింది. గోవా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రల మం త్రులు, కేంద్ర ఆహార సంయుక్త కార్యదర్శి, జార్ఖండ్ పౌర సరఫరాల శాఖ కార్యదర్శి ఈ సెంటర్ పనితీరును ప్రశంసించారు. సంస్థలో రోజూ జరిగే లావాదేవీలపై నిఘా ఉం చడానికి వీలుగా దీనిని రూపొందించింది. అవార్డులు రావడం సంతోషకరం ‘రెండు జాతీయ స్కోచ్ అవార్డులు రావడం సంతోషంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పౌర సరఫరాల శాఖలో చాలా వరకు అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయగలిగాం.’అని కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. -
జనగామలో ప్లాíస్టిక్ బియ్యం కలకలం
ఎగిరి పడుతున్న అన్నం ఉండలు భోజనం చేసిన కుటుంబ సభ్యులకు అస్వస్థత జనగామ: జనగామలో ప్లాస్టిక్ బియ్యం గురువారం కలకలం రేపింది. దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్ బియ్యం అమ్మకాలు జోరుగా సాగుతున్న క్రమంలో జిల్లా కేంద్రంలో అమ్మకాలు వెలుగులోకి రావడం సివిల్ సప్లయ్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తుంది. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్కు సమీపంలోని ఎస్బీఐ ఏడీబీ బ్యాంకు ఎదురుగా నివాసముంటున్న కంతి శివశంకర్ రెండు రోజుల క్రితం ఎల్జీ కంపెనీకి చెందిన 25 కిలోల బియ్యం కొనుగోలు చేశాడు. బుధవారం రాత్రి ఆయన భార్య చందన అన్నం వండగా కొత్త రకమైన వాసన రావడంతో అనుమానం కలిగింది. భర్తతో పాటు ఎల్కేజీ చదువుకుంటున్న కుమారుడికి వడ్డించింది. అదే రోజు రాత్రి కుమారుడు వాంతులు చేసుకోగా ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అనుమానం వచ్చిన శివశంకర్ పరిశీలి ంచగా ప్లాస్టిక్ బియ్యంగా అనుమానించాడు. ఈ విషయాన్ని స్థానికులకు తెలపడంతో భోజనాన్ని ముద్దలుగా తయరు చేసి నేలకు కొట్టడంతో బంతుల్లాగా పైకి ఎగిరి రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. చుట్టపక్కల కాలనీవాసులు తమ ఇంట్లో నిల్వ ఉన్న బియ్యాన్ని అనుమానంగా పరిశీలించుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని శివశంకర్ తెలిపాడు. కాగా జనగామలో ప్లాస్టిక్ రైస్ అమ్మకాలు చేస్తున్నారనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ప్లాస్టిక రైస్ లేక పాలిషింగ్ చేసిన బియ్యమా నిజానిజాలు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగాలని ప్రజలు కోరుతున్నారు. -
రేషన్ కోళ్ల ఫారాలకు వెళ్లింది నిజమే: మంత్రి
హైదరాబాద్: మా ప్రభుత్వం వచ్చిన తరువాత పౌర సంబంధాల శాఖ ప్రజా సంబంధాలు కలిగిన శాఖగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆయన శనివారం శాసన మండలిలో మాట్లాడుతూ..‘‘ లబ్ది దారులకు అందాల్సిన రేషన్ బియ్యం గతంలో కోళ్ల ఫారాలకు తరలిపోయిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని అరికట్టాం. ప్రస్తుతం ప్రతి పాఠశాలలో సన్నబియ్యం పెడుతున్నాం. గతంలో ఊళ్లో ఒకటి, హైదరాబాద్లో ఒకటి రెండు రేషన్ కార్డులు ఉండేవి. మా హయంలో దాన్ని అరికట్టాం. అడిగిన వారందరికీ బియ్యం అందజేస్తున్నాం. ఈ పాస్ యంత్రాల ద్వారా రేషన్ అక్రమాలను అడ్డుకున్నాం. త్వరలోనే రాష్ట్రమంతటా ఈ పాస్ యంత్రాల ద్వారా రేషన్ విక్రయాలు జరుపుతాం. -
ఈ–పాస్.. రేషన్ ఫెయిల్!
- వేలి ముద్రలు పడలేదని 19.92 లక్షల మందికి అందని సరుకులు - పేదల కడుపు కొడుతున్న సాంకేతికత - బ్యాంకు ఖాతాలో డబ్బులుంటేనే రేషన్.. - సర్కారు నిర్ణయాలతో వృద్ధుల్లో తీవ్ర ఆందోళన సాక్షి, అమరావతి వేలి ముద్రలు సరిగా లేక ఈ–పాస్ మెషిన్ వాటిని స్వీకరించక పోవడం, కొత్త రేషన్కార్డుల్లో తప్పుల తడకలు తదితర కారణాల వల్ల ఈ నెలలో 19.92 లక్షల మంది పేదలు రేషన్ సరుకులు పొందలేకపోయారు. బియ్యం, చక్కెర, గోధుమలు, గోధుమ పిండి, కిరోసిన్ తదితర రేషన్ సరుకులపై ఆధారపడి బతుకీడుస్తున్న లక్షలాది మంది వయోవృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఏ పనీ చేసుకోలేని వారి పరిస్థితి సాంకేతికత పుణ్యమా అని దయనీయంగా మారింది. రాష్ట్రంలో 1.38 కోట్ల తెల్లరేషన్ కార్డులు ఉంటే ఇలాంటి సమస్యలతో ప్రతి నెలా లక్షలాది మంది పేదలు రేషన్కు దూరం అవుతున్నారు. వేలి ముద్రలు సరిగా పడని వారికి గ్రామ రెవెన్యూ కార్యదర్శి (వీఆర్వో) సర్టిఫికెట్ ఇస్తే రేషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న మాట లు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. రేషన్షాపు వరకు నడవలేని వృద్ధులకు వారి ఇంటికే వెళ్లి రేషన్ ఇవ్వాలన్న ఆదేశాలు కూడా సరిగా అమలు కావడం లేదు. దీనికి తోడు నగదు రహితంగానే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా తీసుకోవడం కూడా పలు ఇబ్బందులకు కారణమ వుతోంది. కృష్ణా జిల్లాలో 85 శాతం పైగా నగదు రహితం గానే సరుకులు ఇవ్వాలని కలెక్టర్ అహ్మద్ బాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో ఇటు లబ్ధిదా రులు, అటు రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడలో ఒక వ్యక్తి రేషన్ కోసం వెళ్తే నగదు రహిత విధానంలో సరుకులు ఇస్తామని చెప్పారు. చేసేదిలేక ఆ వ్యక్తి బ్యాంకుకు ఆటోలో వెళ్లి ఖాతాలో సరుకులకు అయ్యే మొత్తం జమ చేసి వచ్చారు. ఇందుకు తనకు రూ.30 ఖర్చు అయ్యిందని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రతి నెలా బ్యాంకులో డబ్బు జమ చేసి ఆ తర్వాత సరుకులు తీసుకోవాలంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ–పాస్ మెషిన్లు సరిగా పనిచేయక గంటల తరబడి రేషన్ షాపులవద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 1.66 లక్షల కొత్తకార్డులు జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చామని చెబుతున్నా అందులో సగానికి పైగా కార్డులకు రేషన్ నిలిపివేశారనే ఆరోపణలున్నాయి. ఇలాగైతే ఎలా? తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెం గ్రామానికి చెందిన అడపా సత్యవతికి కుష్టువ్యాధి ఉంది. నగదు రహిత రేషన్ తీసుకోవాలంటే ఈ–పాస్ లో వేలి ముద్రలు వేయడం తప్పనిసరి. ఆమె వేలి ముద్రలు సరిగా లేనందున ఈ–పాస్ స్వీకరించలేదు. ఈ విషయమై డీలర్.. తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్ల డంతో ఆమెకు మాత్రం రేషన్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారే కాకుండా వయసు మీరి వేలి ముద్రలు సరిపోలక లక్షలాది మంది రేషన్ అందుకోలేకపోతున్నారు. పైగా బ్యాంకులో వారి ఖాతాల్లో డబ్బులుండేలా చూసుకుంటేనే ఇకపై రేషన్ అందుతుంది. లేదంటే లేదు. -
ఆగ్రహం–అడ్డగింత
అన్నదాతకు ఆగ్రహం వచ్చింది. నేతలు చెబుతున్నదొకటి...చేస్తున్నదొకటన్న విషయం తేటతెల్లం కావడంతో అక్రమంగా ధాన్యం తరలిస్తున్నారని భావించి అడ్డుకున్నారు. జిల్లా ఉన్నతాధికారికే సమాచారం ఇచ్చారు. స్పందించిన రెవెన్యూ అధికారులు వచ్చి ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీలను పోలీస్స్టేషన్కు తరలించారు. ఇదంతా ఒక ఎత్తయితే తరలింపు సమయంలో సంబంధిత వ్యక్తులు అధికార పార్టీకి చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ పేరిట ఉన్న లేఖను చూపడం కొసమెరుపు. వివరాల్లోకి వెళ్తే... నందిగాం : ఒడిశా రాష్ట్రం నుంచి ధాన్యం అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో నందిగాం గ్రామానికి చెందిన పలువురు రైతులు ధాన్యం బస్తాల లారీలను శుక్రవారం వేకువజామున అడ్డుకున్నారు. ఏపీ 30వీ 0889, ఏపీ 31 డబ్ల్యూ 8199, ఏపీ 35టీ 1767, ఏపీ 16టీసీ 8388 నంబర్లు గల మూడు లారీలు, ఒక వ్యాన్ను పెంటూరులో ఉన్న వెంకటేశ్వర, మహాలక్ష్మి, వినాయక రైస్ మిల్లులకు తరలిస్తుండగా రైతులు అడ్డుకొని కలెక్టర్ లక్ష్మీనరసింహంకు ఫోన్లో సమాచారం అందజేశారు. స్పందించిన కలెక్టర్ లారీలను నిలుపుదల చేయాలని బదులివ్వడంతో రైతులు లారీలను గ్రామం మధ్యలో నిలిపివేశారు. గత ఏడాది మండలంలో పండిన ధాన్యాన్ని కొనడానికి ఇష్టపడకుండా వేరే మండలాల వైపు మిల్లర్లు చూస్తూ ఇక్కడ రైతాంగాన్ని ముంచుతున్నారనే భావన రైతుల్లో నెలకొన్న సమయంలో ఈ ఏడాది కూడా మిల్లర్లు ఒడిశా నుంచి ధాన్యాన్ని తరలిస్తున్నారనే ఉద్దేశంతో రైతులు వీటిని అడ్డుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ లారీల ద్వారా ఒడిశా నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి కంచిలి మండలంలోని బురదపాడు, బోగాబంది, బెల్లుపొడ గ్రామానికి చెందిన కొంత మంది రైతులు పేరిట మూడు లారీలలో 385 బస్తాలు అక్రమంగా తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూడు లారీల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం నందిగాంలో ఉన్న ఐకేపీ కేంద్రాలకు తరలిస్తున్నట్టు ఉంది. కానీ వీరు కేంద్రాలకు కాకుండా మిల్లర్లకు తరలిస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే బురదపాడుకు చెందిన రైతుకు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ జిల్లా పౌరసరఫరాల మేనేజర్కు రికమెండ్ చేస్తూ రాసిన లెటర్ను వారు చూపడంతో రైతులు విస్తుపోయారు. సంతబొమ్మాళి మండలం మర్రిపాడుకు చెందిన పలువురు రైతుల ధాన్యాన్ని టెక్కలి మండలం బూరగాంకు చెందిన జనపాన రమేష్ దళారీగా వ్యవహరిస్తూ 280 బస్తాల కామన్ రకాలను తరలిస్తున్నారు. వీరు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తరలించవలసి ఉన్నప్పటికీ కేంద్రాలకు కాకుండా మిల్లులకు తరలించడంలో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మండలాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు విక్రయించకుండా నందిగాం మండలంలోని మిల్లులకు తరలించడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ నాలుగు వాహనాలకు వే బిల్ కూడా లేకుండా తరలిస్తుండటం విశేషం. కలెక్టర్ ఆదేశాల మేరకు టెక్కలి ఆర్డీవో ఎం.వెంకటేశ్వరరావు, తహసీల్దారు డి.రామ్మోహనరావు, ఎన్ఫోర్స్మెంట్ డీటీ గణపతి, పౌరసరఫరాల డీటీ ఎమ్.సతీష్, ఆర్ఐ పి.కామేశ్వరరావు తదితరులతో చేరుకొని రైతులను శాంతింపజేసి లారీలను స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ తరలింపు వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా విజెలెన్స్ డీటీ, పౌర సరఫరాల డీటీ, ఆర్ఐలకు అదేశించారు. అయితే వ్యవహారం పెద్దది కావడంతో కంచిలి మండలానికి చెందిన పలువురు అధికార పార్టీ నాయకులు రంగంలోకి దిగి ఈ ధాన్యాన్ని తామే విక్రయించినట్టు అధికారులకు తెలియజేసి వ్యవహారాన్ని చక్కబెట్టే ప్రయత్నాలు సాగించడం కొసమెరుపు. -
పౌరసరఫరాల సంస్థను మరింత బలోపేతం
సాక్షి , హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థను మరింత బలోపేతం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఈ మేరకు సంస్థ పాలక మండలి నిర్ణయించిందని తెలిపారు. బుధవారం రాత్రి జరిగిన పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పౌరసరఫరాల శాఖ కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో వివరించింది. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు సంస్థల అవసరాల మేరకు తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోవాలని బోర్డు తీర్మానించింది. కొత్తగా ఎన్ఫోర్స్మెంట్, ఐటీ, ఫైనాన్స, టెక్నికల్ విభాగాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సంస్థలో ఆర్థిక సలహాదారుడి నియామకానికి ఆమోదం తెలిపింది. పెద్ది సుదర్శన్రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి పాలకమండలి సమావేశానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ సీవీ ఆనంద్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కోసం రూ.3 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించిన ట్లు ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులకు చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోదాముల తనిఖీ: గురువారం హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో పౌరసరఫరాల సంస్థ గోదామును ఆయన తనిఖీ చేశారు. ప్రజాపంపిణీని మరింత సమర్థంగా నడిపించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో కందిపప్పును రైతు బజార్ల ద్వారా తక్కువ ధరకు విక్రరుుంచేందుకు కేంద్రం నుంచి కందులు కొనుగోలు చేసి మిల్లింగ్ చేరుుంచినట్లు చెప్పారు. ప్రస్తుతం సంస్థ గోదాములో 167 టన్నుల పప్పు నిల్వ ఉందని తెలిపారు. -
పౌరసరఫరాల శాఖపై స్పీకర్ సమీక్ష
వరంగల్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పౌరసరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థపై సమీక్షించారు. అలాగే రైతులకు వరి ధాన్యానికి మద్దతు ధరపై కూడా అధికారులతో సమీక్షించారు. సమీక్షా సమావేశానికి కలెక్టర్ మురళి, జాయింట్ కలెక్టర్ అమోయ్కుమార్, పౌరసరఫరాల శాఖాధికారులు హాజరయ్యారు. -
సివిల్ సప్లై గోదాంను తనిఖీ చేసిన పీడీ
రేగిడి : మండలంలోని సివిల్ సప్లై గోదాంను డ్వామా పీడీ ఆర్.కూర్మనాధం ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. వాస్తవంగా జాయింట్ కలెక్టర్ గోదాంను పరిశీలించాల్సి ఉన్నప్పటికీ ఆయన లేకపోవడంతో కలెక్టర్ లక్ష్మీనరసింహం ఆదేశాలతో సివిల్ సప్లై గోదాంను తనిఖీలు చేస్తున్నామని కూర్మనాధం విలేకరులకు తెలిపారు. గోదాంలో ఉన్న సరుకులతో పాటు రికార్డులను కూడా పరిశీలించారు. రికార్డులు సక్రమంగా ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. డిపోలకు సకాలంలో రేషన్ సరుకులు పంపిస్తున్నారా లేదా అని గోదాం అసిస్టెంట్ యర్రాపాత్రుని కన్నబాబును అడిగి తెలుసుకున్నారు. ఈయనతో పాటు డీలర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రామమూర్తినాయుడు, అంబళ్ల సత్యంనాయుడు ఉన్నారు. -
మిల్లర్ల మాయాజాలం
మిల్లర్ల గుప్పిట్లోనే రూ.50 కోట్ల సర్కారు ధాన్యం కస్టం మిల్లింగ్ బియ్యం బకాయిలు 23 వేల మెట్రిక్ టన్నులు సెప్టెంబర్ నెలాఖరు వరకే గడువు మారని మిల్లర్ల వ్యవహార శైలి సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రైసు మిల్లర్ల తీరు ఏ మాత్రం మారడం లేదు. కస్టం మిల్లింగ్ కోసం పౌర సరఫరాల సంస్థ నుంచి తీసుకున్న ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని అప్పగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఈ మిల్లర్లు సర్కారుకు ఇవ్వాల్సిన బియ్యం బకాయిల విలువ ఏకంగా రూ.50 కోట్లు ఉంటుందంటే సర్కారు సొమ్ముతో మిల్లర్లు ఏ స్థాయిలో వ్యాపారం చేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో గతేడాది రబీలో ప్రభుత్వం ఐకేపీ, సహకార సంఘాల ద్వారా జిల్లా వ్యాప్తంగా 175 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించింది. ఈ ఒక్క రబీ సీజన్లోనే 96,407 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు జిల్లాలోని సుమారు 35 మంది రైసు మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు వెంటనే బియ్యాన్ని పౌర సరఫరాల శాఖకు అప్పగించాల్సి ఉండగా, నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. మిల్లర్లు ఒక క్వింటాల్ ధాన్యం తీసుకుంటే 68 కిలోలు బాయిల్డ్ రైస్, 67 కిలోలు రా రైస్ చొప్పున సర్కారుకు అప్పగించాలి. ఇలా సర్కారు నుంచి తీసుకున్న 96,407 మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను మిల్లర్లు 65,113 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సర్కారుకు అప్పగించాలి. కానీ.. ఇప్పటివరకు కేవలం 41,443 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే పౌర సరఫరాల శాఖకు అప్పగించారు. ఇంకా 23,737 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు బకాయిలున్నారు. అంటే ఇచ్చిన బియ్యంలో 58 శాతం మాత్రమే అప్పగించారు. దగ్గర పడుతున్న గడువు.. రబీలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సెప్టెంబర్ నెలాఖరు వరకు కస్టం మిల్లింగ్ బియ్యం అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గడువు దగ్గర పడుతున్నా మిల్లర్లలో చలనం లేకుండాపోయింది. పూర్తిస్థాయిలో కస్టం మిల్లింగ్ బియ్యం సరఫరా చేసేందుకు మరో పక్షం రోజులు మాత్రమే గడువున్నా.. ఇంకా 40 శాతం అంటే 23 వేల మెట్రిక్ టన్నులు మిల్లర్ల వద్దే ఉంచుకున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నెలలైనా కస్టం మిల్లింగ్ బియ్యం మిల్లర్ల వద్దే ఉండే అవకాశాలున్నాయి. ఈ బియ్యాన్ని వెంటనే పౌరసరఫరాల శాఖకు అప్పగించాలని జిల్లా ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మిల్లర్లతో సమీక్షలు నిర్వహించినప్పటికీ బియ్యం బకాయిల గుట్ట తరగడం లేదు. గతేడాది కూడా కస్టం మిల్లింగ్ బియ్యాన్ని ఇచ్చేందుకు మిల్లర్లు తీవ్ర జాప్యం చేశారు. సర్కారు ధాన్యానికి సంబంధించిన డబ్బులతో కొందరు మిల్లర్లు సొంత వ్యాపారాలు చేసుకున్నారనే విమర్శలున్నాయి. ఈసారి కూడా పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. మిల్లర్ల తీరుపై కఠినంగా వ్యవహరిస్తే రాజకీయ ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ మిల్లర్లకు సీఎంఆర్ నో.. జిల్లాలో రూపాయికి కిలో బియ్యాన్ని పక్కదారి పట్టించిన ముగ్గురు రైసు మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ అధికారులు కొరఢా ఝులిపించారు. 6ఏ కేసులతోపాటు, క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ముగ్గురు మిల్లర్లకు కూడా ఈసారి మళ్లీ కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని కేటాయించాలని జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తేవడం గమనార్హం. -
సివిల్ సప్లయ్ అధికారుల చేతివాటం!
ఆమదాలవలస : రేషన్ డిపోల్లో తూనిక యంత్రాలకు సీళ్లు వేసే ప్రక్రియలో సివిల్ సప్లయ్ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని పలువురు డీలర్లు ఆరోపిస్తున్నారు. సీళ్లు వేసే ప్రక్రియలో భాగంగా ఆమదాలవలసలోని కుసుమంచివారివీధిలో గోదాము వద్దకు రావాలంటూ ఆదివారం సివిల్ సప్లయ్ అధికారులు డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీలర్లు తమ తూనిక యంత్రాలను తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా సీళ్లు వేసేందుకు అయ్యే ఖర్చు రూ.600గా పేర్కొంటూ రెండు రసీదులు ఇస్తూ ఒక్కో డీలర్ వద్ద రూ.900 వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించారు. ఈ విషయం బయటకు పొక్కితే డీలర్లపై ఉక్కుపాదం తప్పదని బెదిరించినట్లు కూడా సమాచారం. ఈ విషయమై సివిల్ సప్లయ్ డీ.టీ. టి.కూర్మారావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తూనికలు యంత్రాలకు సీళ్లు వేసే ప్రక్రియకు, తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. -
పౌర సరఫరాల శాఖ కమిషనర్గా సీవీ ఆనంద్
తొలిసారి ఓ ఐపీఎస్ అధికారికి బాధ్యతలు.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్గా ఓ ఐపీఎస్ అధికారిని నియమించడం ఇదే తొలిసారి. పౌర సరఫరాల విభాగంలో ప్రతి ఏటా రూ. 300 కోట్లకు పైగా విలువైన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని, వివిధ సరుకుల కొనుగోలులో భారీగా అవినీతి జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో పోలీసు, రెవెన్యూ విభాగంతో సంయుక్తంగా సీవీ ఆనంద్ సారథ్యంలో స్పెషల్ ఆపరేషన్ బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ విభాగానికి ఐపీఎస్ అధికారినే నియమించడం సరైందని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవలే సివిల్ సప్లయిస్ కమిషనర్గా ఉన్న రజత్కుమార్ను కార్మిక ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. -
కందిపప్పు.. గోధుమ పిండి..ఎక్కడ?
విజయనగరం కంటోన్మెంట్ : పౌరసరఫరాల శాఖ నుంచి కేటాయింపులు ఎక్కువగా వస్తున్నా.. ఆయా సరుకులు మాత్రం వినియోగదారులకు అందించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 15 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా 1,392 రేషన్ షాపులకు ప్రతి నెలా అందిస్తున్న సరుకులు నామమాత్రంగానే ఉంటున్నాయి. రేషన్ కార్డుల ద్వారా గతంలో మొత్తంగా తొమ్మిది సరుకులను ఇచ్చేవారు. అందులో వినియోగదారులు కొన్ని సరుకులను విడిచిపెట్టినా మిగతా సరుకులను మాత్రం తీసుకునే వారు. ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. వీటికి సంబంధించి ప్రతి నెలా క్లోజింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్లు చూపుతూ సరుకులను కేటాయిస్తున్నారు. అలాగే వీటితో పాటు ఇవ్వని సరుకులకు కూడా ప్రతి నెలా ఇంత ఇస్తున్నామని కేటాయింపులు చూపించడం విశేషం. కందిపప్పు, గోధుమ పిండి, గోధుమలను ఎక్కడా పంపిణీ చేయడం లేదు. అయినా ప్రతి నెలా కేటాయింపులో మాత్రం ఈ సరుకులను ఇస్తున్నట్లు పొందుపరుస్తున్నారు. జిల్లాలో 6,78,835 రేషన్ కార్డులుండగా అన్నపూర్ణ-839, అంత్యోదయ-76,009, తెలుపు రంగు కార్డులు-6,01,987 కార్డులున్నాయి. ఈ కార్డులన్నింటికీ కందిపప్పు, గోధుమ పిండి, గోధుమలు ఇస్తున్నామని కీ రిజిస్టర్లో చూపిస్తున్నారు. కానీ పంపిణీ మాత్రం జరగడం లేదు. పామాయిల్ పంపిణీ లేకపోయినా కేటాయింపుల్లో చూపించడం లేదు. అలాగే కందిపప్పు, గోధుమలు, గోధుమ పిండిని ప్రతి నెలా ఇస్తున్నట్లు చూపిస్తున్నారు. ఈ నెలకు సంబంధించి 6.74 టన్నుల కందిపప్పు, 6.58 టన్నుల గోధుమ పిండి, 6.71 టన్నుల గోధుమలు ఇస్తున్నట్లు కేటాయింపులో పొందుపరిచారు. అసలు సరుకులే ఇవ్వకుండా ఈ కేటాయింపులు ఎందుకని డీలర్లు, వినియోగదారులు విమర్శిస్తున్నారు. -
రెండు మండలాలు..రాసిచ్చేస్తా...
-అడ్డువచ్చిన వారి తోక కత్తిరిస్తా... -ఈ డీల్ కుదిర్చినందుకు నాకు ఎంత ఇస్తావ్... -నీవు కాదంటే చెప్పు వేరేవారికిచ్చేస్తా -పౌర సరఫరాల సరుకు పక్కదారిపై మంతనాలు -అధికార పార్టీ యువనేతే వ్యూహకర్త -‘సాక్షి’ చేతికి చిక్కిన ఆడియో సంభాషణ 'రెండు మండలాలు నీకు అప్పగిస్తాను. ఎవరైనా తోక జాడిస్తే నాతో చెప్పు అడ్డంగా తోక కత్తిరించేస్తా... నీ దోపిడీకి రహదారి వేసినందుకు నాకెంత ఇస్తావు... ముందుగా అది తేల్చు ... నాపై బాగా ఒత్తిళ్లున్నాయి. నువ్వు ఏ విషయం తేల్చకపోతే నేను నా వాళ్లకు అప్పగించేస్తాను...ఇదీ ప్రకాశం జిల్లా ఎస్.ఎన్.పాడు మండలంలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తితో యువనేత బేరసారాలు. దీనికి ఒక రేషన్ డీలర్ల అసోసియేషన్ నేత మధ్యవర్తిగా వ్యవహరించి కథ నడిపించాడు. ఆ సంభాషణ ఏ రీతిలో సాగిందంటే...' సాక్షి, టాస్క్ఫోర్స్: పౌర సరఫరాల వ్యవస్థను గాడిలో పెట్టడానికి పెద్ద ప్రభుత్వ యంత్రాంగమే ఉంది. అయినా బొక్కసానికి బొరియలు పడుతూనే ఉన్నారు. ఈ బొరియలు కప్పడానికి ప్రభుత్వం పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి కొంతమందికి కిరీటం పెట్టింది. సరిదిద్దాల్సింది పోయి బేరసారాలకు దిగుతున్నారు ... అరికట్టాల్సింది పోయి అడ్డంగా దోచుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు ... అధికారం మాదే అడ్డొచ్చినవాడెవడంటూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు ... పేదలకు, మధ్య తరగతికి అందాల్సిన బియ్యాన్ని బొక్కేస్తున్నారు ... బొక్కసానికి కన్నం వేస్తున్నారు. పంచాయితీ పెట్టి మరీ పంచుకుంటున్నారు. అదెలా అంటే... అక్రమ రవాణాదారుడు: ఈపాస్ వచ్చిన తర్వాత ఆదాయం తగ్గింది. అంత రావడం లేదు. యువనేత: ఈ పాస్ వల్ల డీలర్లకు ఆదాయం కొంచెం తగ్గిన మాట నిజమే. గతంలో ఒక షాపులో ఆరు వందలు కార్డులుంటే మూడు వందల కార్డులు అమ్ముకున్నారు. ఇప్పుడు రెండు వందల నుంచి 250 వరకూ అమ్ముతున్నారు. టెన్ పర్సెంట్ మాత్రమే తగ్గింది. చీమకుర్తిలో 900 టన్నులు బియ్యం రవాణా జరుగుతుంటే గతంలో 300 వందల టన్నులు అమ్ముకునేవారు. ఇప్పుడు 200 నుంచి 250 టన్నులు పక్కదారి పడుతోంది. ట్రాన్స్పోర్టు మొత్తం ఇవ్వు. కిలోకి రూపాయి ఇస్తావా? ఎక్కడ బియ్యం ఎంత వస్తుందో నాకు తెలుసు. ఇవన్నీ కాదు నువ్వు ఎంత ఇస్తావో చెప్పు? (మాటల్లో కొంత అసహనం)... ఈ వ్యాపారంలో ఎన్ని ఇబ్బందులున్నాయి? ఎక్కడైనా లారీ పట్టుబడితే బయటపడడానికి ఎన్ని చిక్కులు...ఆ చిక్కు ముడులు విప్పాలంటే ఏమి చేయూలో సుదీర్ఘంగా ముగ్గురి మధ్య చర్చ జరిగింది. యువనేత: నాపై చాలా ప్రెజర్ వస్తోంది...అడగడానికి భయపడాల్సిన వారు కూడా నా వద్దకు వచ్చి నాకు నాలుగు షాపులు ఇప్పించమని అడుగుతున్నారు. బంధుత్వాలు, పార్టీని అడ్డం పెట్టుకుని ఒత్తిడి చేస్తున్నారు. ఇంతకు ముందే చీమకుర్తికి చెందిన వ్యక్తి ట్రాన్స్పోర్టు కావాలని అడిగి వెళ్లాడు. ట్రాన్స్పోర్టు వర్క్ అవుట్ కాదని చెప్పాను. ట్రాన్స్పోర్టు ఉంటే డీలర్లతో సంబంధాలు ఉంటాయని చెబుతున్నాడు. మధ్యవర్తి: పెద్ద మనసు చేసుకో? పార్టీ మనిషిగా ఇతనికే ఇప్పించు. మొదటి నుంచీ పార్టీకి నమ్ముకున్నోడు. ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చిందని పార్టీలోకి వచ్చినవారు కాదు. అలా అని నీ సొంత మండలంలోకి వచ్చి దర్పం ప్రదర్శించేవాడు కాదు. వయా మీడియాగా అతనికి వచ్చేలా చూడు. ఏం చేయాలో నువ్వే చెప్పు యువనేత: ప్రతి నెలా 15 లారీలు వచ్చాయ్...20 వచ్చాయ్... ఈ పంచాయితీలు నాకనవసరం. సింగిల్ టెండర్ వేయిస్తాను. రెండు మండలాల్లో కొనుక్కొని, టెండర్ చేజిక్కించుకోమను. నెలకు ఎంత ఇస్తావు స్ట్రయిట్గా చెప్పు అని అడిగాను. ట్రాన్స్పోర్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోలుతాను. కిలోకు రూపాయి చొప్పున మీ కుర్రోళ్లకు ఇస్తానని ఒకతను నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడున్న వారి సంగతి తేల్చకుండా ఇవ్వడం కరెక్టు కాదని పెండింగ్ పెట్టా. ట్రాన్స్పోర్టు టెండర్ లేకుండా చేయిస్తా. నువ్వు ఎంతకైనా కొనుక్కో. రూ.12, రూ.13, రూ.15... ఎంతైనా. వంద టన్నులు కొనుక్కో.. లేకపోతే రెండు వందల టన్నులు కొనుక్కో. నీ ఇష్టం అది నాకు సంబంధం లేదు అని చెప్పాను. మధ్యవర్తి: ఇది మంచి ప్రతిపాదనే కదా... అక్రమ రవాణాదారుడు : మా వాళ్లను కనుక్కుని చెబుతానని చెప్పా. మా వారితో మాట్లాడితే అంత ఆదాయం రావడం లేదన్నారు. తెల్లగుడిపాడు వారు వేరే వారికి తోలుతున్నారని చెప్పారు. ఎన్ని వస్తున్నాయో చెప్పమని అడిగాను. ట్రాన్స్పోర్టు మొత్తం వారిని తీసుకోవాలని చెప్పు.. లేదంటే బియ్యం రెండు మూడు బళ్లు ఆయన చెప్పిన వారికి పంపిస్తానని మావాడు చెప్పాడు. మధ్యవర్తి: ఇదంతా అనవసరం. ట్రాన్స్పోర్టు ఎంత వస్తుంది. అక్రమ రవాణాదారుడు: 50 నుంచి 55 వేలు వస్తుంది. మధ్యవర్తి: ట్రాన్స్పోర్టు ఇతనే చేస్తాడు. బిల్లు నువ్వు తీసుకో. నెలకి ఇంతని చెప్పి సెటిల్ చేసుకో... యువనేత: త్వరలోనే సంతనూతల పాడు, చీమకుర్తి డీలర్ల సమావేశం పెట్టి వారికి కూడా చెబుతాను. మధ్యవర్తి: మిల్లర్లతో కూడా ఇబ్బందులుంటాయి. కొంతమంది పక్క మండలాల్లో కూడా వేలు పెడుతున్నారు. వారికి నువ్వు గట్టిగా చెప్పాలి. యువనేత: ట్రాన్స్పోర్టు నీకు ఇప్పిస్తాం. డీటీకి చెప్పేస్తాను. ట్రాన్స్పోర్టు డబ్బులు మా కుర్రాళ్లకు ఇచ్చేయి. ఇంకా నెలకు ఎంత ఇస్తావో తేల్చి చెప్పు.... యువనేత, మధ్యవర్తి, అక్రమ రవాణాదారుడి మధ్య చర్చల అనంతరం...ట్రాన్స్పోర్టు బిల్లు కాకుండా మరికొంత మొత్తం నెలనెలా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఒక మండలంలో బయటపడిన తంతు మాత్రమే ఇది. మిగిలిన మండలాల్లో ఇదే తరహా అక్రమాలకు తెరదీస్తున్నారు... అధికార దాహంతో జిల్లాను దోచేస్తున్నారు. యువనేత: ఏడేళ్ల నుంచి టీడీపీ బాధ్యతలు నేనే మోస్తున్నాను. ఈ రోజు డిపార్టుమెంట్లో ఉండి నా మనుషులకు, నాకు న్యాయం చేసుకోలేకపోతే ఎలా? నా పొజిషన్లో నువ్వుంటే ఏం చేస్తావు? ఇతనికి నాలుగు రోజుల కిందట మూడు ఆప్షన్స్ ఇచ్చాను. నువ్వే డిసైడ్ చేసుకోవాలని చెప్పాను. ఇంకో సెంటర్ వెతుక్కో. సంతనూతలపాడు.. చీమకుర్తి వదిలేసెయ్... ఇది ఫస్ట్ ఆప్షన్... అలా కాదంటే తోలడం మావాళ్లే చేస్తారు. అన్ని షాపుల నుంచి కలెక్షన్ ఎలా చేయాలో వారే చేస్తారు. వారే అమ్ముకుంటారు. నీకు ఏ సంబంధం లేదు. ట్రాన్స్పోర్టు నువ్వే ... తోలేదీ నువ్వే ... ఎంత కొనుక్కుంటావో కొనుక్కో. వంద కొనుక్కుంటావో, నూటయాభై కొనుక్కుంటావో నీ ఇష్టం. నా సంగతి ఏం చేస్తావ్. ఆప్షన్ నీదే... -
ఆయిల్ మిల్లులో తనిఖీలు
వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూరులోని వీరభద్ర ఆయిల్ మిల్లును గురువారం పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఆయిల్ నమూనాలను సేకరించారు. మిల్లులో ఆయిల్ కల్తీ జరుగుతున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని ఏఎన్వో తెలిపారు. నమూనాలను ల్యాబ్కు పంపి పరీక్షలు చేయించనున్నట్లు వివరించారు. -
బడ్జెట్పై ఆర్థిక శాఖ కసరత్తు
నేటి నుంచి 19 వరకు వివిధ శాఖలతో భేటీ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో ప్రాథమిక సమీక్ష సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తయారీలో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ సోమవారం నుంచి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం.. సోమవారం నుంచి 19వ తేదీ వరకు వివిధ శాఖల మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ భేటీ కావాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాను హాజరు కావాల్సిన సమావేశాలను కొద్ది రోజులు వాయిదా వేయాలని ఆయన ఉన్నతాధికారులకు సూచించారు. ఈలోగా అధికారుల స్థాయిలోనే సమీక్షలు జరపాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, కార్యదర్శులు రామకృష్ణారావు, శివశంకర్ వరుసగా అన్ని శాఖల కార్యదర్శులతో భేటీ కానున్నారు. 14వ తేదీన విద్య, వైద్యం, ఆరోగ్యం, సాధారణ పరిపాలన, 15న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పురపాలక పట్టణాభివృద్ధి, 16న ఎస్సీల అభివృద్ధి, బీసీలు, ఎస్టీలు, మహిళా శిశు సంక్షేమం, వికలాంగులు, మైనారిటీ సంక్షేమం, 17న వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశుసంవర్ధకం, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, రోడ్లు భవనాలు, రెవెన్యూ, హోం, 18న పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, కార్మిక ఉపాధి కల్పన, యువజన సర్వీసులు, పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రణాళికలు, 19న గృహ నిర్మాణం, పర్యావరణం, అటవీ, విద్యుత్, సమాచారం, సాంకేతిక, న్యాయ, శాసనసభా వ్యవహారాల శాఖలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు వివరిస్తారు. శాఖల పరిధిలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలకు సంబంధించిన సమస్యలు, సవాళ్లు, నిధుల అవసరం తదితర అంశాలను ప్రధానంగా ఈ సమీక్షల్లో చర్చిస్తారు. ఈ ప్రతి పాదనల ఆధారంగానే ఏయే పథకానికి ఎంత నిధులు కేటాయించే అవకాశముందో ఆర్థిక శాఖ అధికారులు అంచనాకు వచ్చే అవకాశముంది. ముఖ్య కార్యదర్శుల స్థాయిలో జరిగే ఈ సమీక్ష సమావేశాల అనంతరం మంత్రి ఈటల స్వయంగా రంగంలోకి దిగుతారు. వారం పాటు ఆయన మంత్రులతో భేటీ అవుతారు. అధికారుల స్థాయిలో వచ్చిన ప్రతిపాదనలపై ఆయా శాఖలకు ప్రాతినిధ్యం వహించే మంత్రులతో విడివిడిగా చర్చలు జరుపుతారు. ఈ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాల ఆధారంగానే బడ్జెట్ ముసాయిదాను తయారు చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
విధులు బహిష్కరించిన హమాలీలు
పార్వతీపురం: విజయనగరం జిల్లాలో పౌరసరఫరాల శాఖ గోదాముల్లో పనిచేస్తున్న హమాలీలు విధులు బహిష్కరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం పౌర సరఫరాల శాఖ గోదాముల వద్ద ఆందోళనలకు దిగారు. పార్వతీపురంలో ఆందోళన చేస్తున్న హమాలీలు గోదాముల వద్ద మూడున్నర టన్నుల కాంటాలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీకి ప్రస్తుతమున్న రూ.12 నుంచి రూ.25కు పెంచాలని కోరారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఆగస్టు 3వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
మిల్లర్లు..మింగేశారు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం సుల్తానాబాద్ ప్రాంతంలోని పలు మిల్లులపై సివిల్ సప్లయిస్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. రికార్డులు, ధాన్యం నిల్వలను పరిశీలించి కస్టమ్ మిల్లింగ్ బియ్యం మాయమైనట్లు గుర్తించారు. లాభసాటిగా ఉంటుందని ఈ బియ్యాన్ని విదేశాలకు అమ్ముకున్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో మిగిలిపోయిన కస్టమ్ మిల్లింగ్ బియ్యంపై కొరడా ఝుళిపించాలని అధికారులు యోచిస్తున్నారు. గత ఏడాది రబీ సీజన్లో సివిల్ సప్లయిస్ విభాగం జిల్లావ్యాప్తంగా కొనుగోలు చేసిన 4.32 లక్షల టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్కు అప్పగించింది. ఒక్కో క్వింటాలుకు 70 కిలోల బియ్యాన్ని తిరిగి అప్పగించాలని.. మిల్లింగ్ ఖర్చులకు రూ.26 చొప్పున చార్జీలు చెల్లించే ఒప్పందంపై మిల్లులకు చేరవేశారు. నెలరోజుల వ్యవధిలో ఈ బియ్యాన్ని తిరిగి ఇవ్వాల్సిన మిల్లర్లు.. రేపుమాపంటూ దాట వేశారు. ఇప్పటివరకు 1.66 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ ధాన్యం మిల్లుల్లోనే ఆగిపోయింది. దాదాపు 250 మిల్లులు ఈ ధాన్యాన్ని తిరిగి ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఈ బియ్యాన్ని ఏం చేశారు.. ఎక్కడికి తరలించారు.. అని ఆరా తీస్తే అసలు వ్యాపారం వెలుగులోకి వచ్చింది. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు అంతకంతకు పెరిగిపోవటంతో తమ గుప్పిట్లో చిక్కిన కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని సైతం మిల్లర్లు వ్యాపార సాధనంగా మలుచుకున్నారు. ఎక్కువ లాభం పొందే ఆలోచనతో ఈ బియ్యాన్ని అడ్డదారిలో అమ్ముకున్నారు. విదేశాల్లో గిరాకీ ఉం డటంతో జిల్లాలోని మిల్లర్లు ఇందులో నలభై శాతం బియ్యా న్ని ఎగుమతి చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జిల్లాలో 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లో ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీ ద్వారా 10.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అందులో 6.89 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మరపట్టించి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 5.23 లక్షల టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు అప్పగించారు. మిగతా 1.66 లక్షల టన్నుల ధాన్యం జిల్లా దాటి వెళ్లింది. ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ 30లోగా బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించాలి. ప్రస్తుతం ఎఫ్సీఐ కస్టమ్ మిల్లింగ్కు ఇచ్చే బియ్యం ధర సగటున క్వింటాల్కు రూ.1600 ఉంది. ఈ ధర ప్రకారం లెక్కలేసినా మిల్లర్లు అమ్ముకున్న బియ్యం ధర రూ.265 కోట్లు దాటుతోంది. భారీ మొత్తంలో వ్యాపారం కావటంతో మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని ఇచ్చేందుకు ఆసక్తి చూపటం లేదు. కోట్లాది రూపాయల వ్యాపారంతో భారీగా లబ్ధి పొందే ఎత్తుగడలు వేస్తున్నారు. అందుకే.. సర్కారు విధించిన గడువును తేలిగ్గా తోసి పారేస్తున్నారు. దీంతో పౌర సరఫరాల విభాగం ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోలేక పోతోంది. మిల్లింగ్ బియ్యం సేకరణకు మరో నెల గడువు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ.. మిల్లర్ల నుంచి స్పందన లేకపోవటంతో తనిఖీలను ముమ్మరం చేసినట్లు స్పష్టమవుతోంది. రికార్డుల్లో ఉన్న వివరాలకు.. నిల్వలకు పొంతన లేకపోవటంతో మిల్లర్ల లీలలు చూసి అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. -
అర్హత ఉంటే మళ్లీ కార్డులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇటీవల రేషన్ కార్డుల ఏరివేతతో కార్డు కోల్పోయిన వారికి అర్హతను బట్టి తిరిగి పునరుద్ధరించాలని జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. అలాంటి వారికి ఈనెల రేషన్ కోటా సైతం ఇవ్వాలని స్పష్టం చేశారు. పౌరసరఫరాలు, మీసేవ, సామాజిక సర్వే, రుణాల రీషెడ్యూల్ తదితర అంశాలపై బుధవారం కలెక్టరేట్ నుంచి మండల రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో మీసేవ కేంద్రాలకు సంబంధించి 72వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రుణాల రీషెడ్యూల్పై బ్యాంకుల వారీగా పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాన్ఫరెన్స్లో డీఆర్వో సూర్యారావు, డీఎస్ఓ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇన్ని ఫిర్యాదులా.. పద్ధతి మార్చుకోండి
సాక్షి, కాకినాడ :‘సివిల్ సప్లైస్ (పౌరసరఫరాలు) శాఖ అంటే అవినీతి శాఖ అన్నట్టు మార్చేశారు. ఈ ముద్ర నుంచి బయట పడేయాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా ఈ శాఖను మహిళనైన తనకు ఇచ్చారని ఆ శాఖమంత్రి పరిటాల సునీత అన్నారు. రేషన్షాపుల నిర్వహణ, గ్యాస్ సిలిండర్ల కొరత, లెవీ సేకరణ వంటి వాటికి సంబంధించిన ఇబ్బందుల విషయంలో అధికారుల తీరుపై శనివారం కాకినాడ కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో పలువురు ప్రజాప్రతి నిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిపై స్పందించిన మంత్రి సునీత ‘మీపై ఇన్ని విమర్శలా..ఇలా అయితే ఎలా?’ అంటూ మండిపడ్డారు. ‘మీ పద్ధతి మార్చుకోండి. పనితీరు మెరుగుపర్చుకోండి’ అంటూ హితవు పలి కారు. శాఖపై అవినీతి ముద్ర తొలగించేందుకు కృషి చేస్తానని..అందుకు అధికారులు సహకరించాలని కోరారు. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు సిద్ధం కావాలని ఆదేశించారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని, బుక్ చేసిన నెలరోజులకు కానీ రావడం లేదని పలువురు ఎమ్మెల్యేలతో పాటు విలేకరులు కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై హెచ్పీసీఎల్ కో ఆర్డినేటర్ వివరణ ఇస్తూ గెయిల్ పైపులైన్ పేలుడుతో పైపులైన్లను తనిఖీ చేస్తున్నందునే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పబోయారు. అయితే ఆ పైపులైన్కు..ఈ పైపులైన్కు సంబంధమేమిటని పలువురు ప్రశ్నించారు. వెంటనే ఈ పరిస్థితిని చక్కదిద్ది బుక్ చేసిన వారంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చేలా చూడాలని జేసీ ముత్యాలరాజును మంత్రి ఆదేశించారు. రేషన్షాపుల్లో బయోమెట్రిక్ విధానం అమలు తీరును పరిశీలించిన మంత్రి ఈ విధానంలో ఇచ్చే రశీదులన్నీ తెలుగులో ఉండేలా చూడాలన్నారు. త్వరలోనే జిల్లాలో అన్ని రేషన్షాపుల్లో ఈ-పాస్ ప్రక్రియ అమలుకుఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మద్దతుధర ముందే ప్రకటిస్తే మేలు : చినరాజప్ప ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ధాన్యం మార్కెట్కు వచ్చేలోపే మద్దతు ధర, సేకరణ విధానం ప్రకటిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. కేంద్రం ప్రకటించిన కొత్త లెవీ పాలసీ వల్ల రైతులకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. లెవీ సేకరణను 50 శాతానికి పెంచేలా చర్యలు చేపడతామని మంత్రి సునీత హామీ ఇచ్చారు. రైతుబ జార్, రేషన్షాపుల పరిశీలన అనంతరం మంత్రి సునీత ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న రైతుబజార్ను పరిశీలించారు. ఎస్టేట్ ఆఫీస్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. స్టాళ్లను సందర్శించి రైతులు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గొడారిగుంటలో రేషన్ షాపు నం: 87ను సందర్శించి ఈ-పాస్ విధానంలో ప్రజా పంపిణీ అమలును పరిశీలించారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో రూ.5 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని సునీత ప్రారంభించారు. పెనుగుదురులోని శ్రీ వెంకటేశ్వరా రైస్ మిల్లును సందర్శించి రికార్డులను తనిఖీచేశారు. జిల్లాలో ప్రతి సీజన్లో మిల్లర్లు రైతుల నుంచి మద్దతుధరకంటే రూ.100 నుంచి రూ.500 వరకూ అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నట్టు జిల్లా రైసుమిల్లర్ల సంఘం అధ్యక్షుడు ఎ.రామకృష్ణారెడ్డి మంత్రికి వివరించారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తే రైతులకు మరింత ధర లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు వనమాడి కొండబా బు, పిల్లి అనంతలక్ష్మి, వేగుళ్ల జోగేశ్వరరావు, డీఎస్ఓ రవికిరణ్, సివిల్ సప్లయిస్ డీఏం టీవీఎస్జీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల నోట్లో మట్టి
అనంతపురం టౌన్ : లాభాల కోసం మిల్లర్లు.. కమీషన్ల కోసం అధికారులు కుమ్మక్కై వరి రైతుల నోట్లో మట్టి కొట్టారు. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు సేకరించిన వరి ధాన్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో సేకరించిన ధాన్యం గోదాముల్లోనే నిల్వ ఉండిపోయింది. వివరాల్లోకెళితే.. ధాన్యానికి సరైన ధర లభించకపోవడంతో ‘వరి రైతు డీలా’ శీర్షికన సాక్షిలో గత నెల 28న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో ఈ నెల ఐదో తేదీన జిల్లా వ్యాప్తంగా ఆరు చోట్ల (ధర్మవరం, కల్లూరు, కణేకల్లు, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, నీలకంఠాపురం) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటా రూ.1345, సాధారణ రకానికి రూ.1310 మద్దతు ధర నిర్ణయించి మహిళా సంఘాల ద్వారా ధాన్యం సేకరణ చేయించారు. ఇప్పటివర కు ధర్మవరం, కల్లూరు, కణేకల్లు కేంద్రాల ద్వారా 1020 క్వింటాళ్లు సేకరించారు. నిబంధనల ప్రకారం రైతుల నుంచి మహిళా సంఘాలు ధాన్యం సేకరిస్తే వాటిని సివిల్సప్లయీస్ అధికారులు కొనుగోలు చేయాలి. మహిళా సంఘాలకు కమీషన్ పోనూ మిగిలిన మొత్తాన్ని రైతులకు చెల్లించాలి. ఇదే గనుక జరిగితే తమ ఆదాయానికి గండి పడుతుందనుకున్న ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్ అయ్యారు. రైతుల నుంచి క్వింటా ధాన్యం రూ.900 నుంచి రూ.950కే కొని అధిక ధరలకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్న వీరంతా ఒక నిర్ణయానికి వచ్చారు. సివిల్ సప్లయీస్ అధికారులతో కుమ్మక్కై ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కొనకుండా అడ్డుకట్ట వేయించారని తెలుస్తోంది. అధికారులు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో మహిళా సంఘాలు సేకరించిన 1020 క్వింటాళ్ల ధాన్యం ఆయా కొనుగోలు కేంద్రాల గోడౌన్లలోనే నిల్వ ఉండిపోయింది. దీంతో రైతులకు కూడా మహిళా సంఘాలు డబ్బు చెల్లించలేకపోతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. రేపు డబ్బులిస్తాం ఇందిరా క్రాంతి పథం ద్వారా మహిళా సంఘాలు ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలకు పెద్దగా ధాన్యం రావడం లేదు. కల్లూరు నుంచి మాత్రమే కొంత వరి వచ్చింది. మహిళా సంఘాలు కొనుగోలు చేస్తే డబ్బులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన ధాన్యానికి రేపే డబ్బులిస్తాం. కొనుగోలు కేంద్రాలు ఎక్కడా మూత వేయాల్సిన అవసరం లేదు. - వెంకటేశం, జిల్లా మేనేజర్, పౌరసరఫరాలశాఖ -
జిల్లావాసులకు కీలక బాధ్యతలు
పార్థసారథికి పౌరసరఫరాలు తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన శాఖలలో 39 మంది ఏఎఎస్ అధికారులకు పోస్టింగ్ లు ఇచ్చారు. అందులో పార్థసారథికి పౌరసరఫరాల శాఖ కమిషనర్గా నియమించారు. చిన్ననాటి నుంచి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో విద్యను కొనసాగించిన పార్థసారథికి మొదట ఆర్డీఓగా ఉద్యోగం సాధించారు. తన లక్ష్యమైన ఐఏఎస్ను పదోన్నతిపై పొందవచ్చని ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తన పనితీరుతో రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా, డీఆర్వోగా, పీడీగా పని చేశారు. యూపీఎస్సీ ప్రొసిజర్ ఆధారంగా 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. సంయుక్త కలెక్టర్గా, కలెక్టర్గా, మార్క్ఫెడ్ ఎండీగా, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్గా, చలనచిత్ర, టీవీ, నాటక రంగ సంస్థ ఎండీగా పలు కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. కలిసి వచ్చిన సాన్నిహిత్యం పార్థసారథి కరీంనగర్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజవకర్గం నుంచి కేసీఆర్ ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గం సమస్యల పరిష్కారంలో కేసీఆర్తో ఉన్న సాన్నిహిత్యం పార్థసారథికి కలిసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సంచాలకులుగా పని చేస్తున్న ఆయనకు తెలంగాణ రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆర్మూర్ పట్టణంలోని ఆయన బంధువులు, మిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆర్మూర్వాసి కీలకమైన బాధ్యతలు నిర్వహించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగదీశ్వర్కు విద్యాశాఖ గ్రామీణ నేపథ్యం నుం చి ఐఏఎస్ స్థాయికి ఎదిగిన జగదీశ్వర్కు నూతన రాష్ట్రంలో కీలకమైన పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా బాధ్యతలతో పాటు అదనంగా రవా ణాశాఖను అప్పగించారు. బీ ర్కూర్కు చెందిన మునిగెల విశ్వనాథం-ప్రేమల దంపతు ల కుమారుడైన జగదీశ్వర్ పదోతరగతి వరకు బీర్కూర్ లో చదివారు. ఇంటర్ బోధన్లోని మధుమలాంచ, డిగ్రీ నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలల్లో పూర్తిచేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంకామ్ పూర్తిచేసి, గోల్డ్మెడల్ సాధించారు. తొలి ప్రయత్నంలో జగదీశ్వర్ చదువు పూర్తికాగానే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తొలి ప్రయత్నంలోనే 1983లో హైదరాబాద్లోని సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా ఉద్యోగాన్ని సంపాదించారు. 1987లో గ్రూప్-1లో ఉత్తీర్ణత సాధించి డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలను తీసుకున్నారు. వివిధ శాఖల్లో పనిచేస్తూ ఐఏఎస్ స్థాయికి ఎదిగారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే జగదీశ్వర్ను మహబూబ్నగర్ కలెక్టర్గా నియమించారు. అనంతరం హైదరాబాద్ జలమండలి, ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా విధులు నిర్వహించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఆయనను పాఠశాల విద్యాశాఖ కమిషనర్గా నియమిస్తూ.. అదనంగా రవాణా శాఖను సైతం అప్పగించా రు. ఉన్నత స్థానాలకు ఎదిగినా జగదీశ్వర్ కన్నఊరిని మరిచిపోకుండా బీర్కూర్కు సేవలందిస్తున్నారు. తనకు జన్మనిచ్చిన ఊరికి మరిన్న సేవలందిస్తానని ‘న్యూస్లైన్’తో జగదీశ్వర్ పేర్కొన్నారు. -
తొలి అమాత్యులు
- మన జిల్లాకు రెండు మంత్రి పదవులు - ఈటెలకు ఆర్థిక శాఖ, పౌరసరఫరాలు - కేటీఆర్కు ఐటీ, పంచాయతీరాజ్ శాఖ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ తొలి ప్రభుత్వంలో జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. అందరూ ఊహించిన విధంగానే కేసీఆర్ కేబినేట్లో ఈటెల రాజేందర్తో పాటు కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారకరామారావుకు చోటు దొరికింది. సోమవారం హైదరాబాద్లోని రాజ్భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన కొలువు దీరిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబినేట్ మంత్రులుగా తమ బాధ్యతలు స్వీకరించారు. శాఖల కేటాయింపులోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు పెద్దపీట వేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్కు ఆర్థికశాఖతోపాటు పౌర సరఫరాలు, ప్లానింగ్, చిన్న మొత్తాలు, తూనికలు, కొలతల శాఖలు అప్పగించారు. వరుస గా అయిదుసార్లు ఎన్నికల్లో గెలిచి రికార్డు సృష్టించిన ఈటెల ఉద్యమంలోనూ క్రియాశీలపాత్ర పోషించారు. గత ప్రభుత్వ హయాంలోనూ టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా అందరి దృష్టిని ఆకర్షించారు. వరుసగా మూడుసార్లు సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి న యువ నేత కేటీఆర్కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు పంచాయతీరాజ్ శాఖ కేటాయించారు. చిన్న వయసులో నే మంత్రి పదవిని పొందిన కేటీఆర్ అటు సీఎం తనయుడిగా.. ఇటు ఉద్యమ నేతగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గడిచిన అరవై ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా నుంచి మొత్తం 16 మంది నేతలు రాష్ట్రంలో మంత్రి పదవులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి అమాత్య పదవులను అందుకున్న రికార్డు ఈటె ల, కేటీఆర్లు సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు జిల్లా నుంచి మంత్రులైన వారి సంఖ్య 18కి చేరింది. గత ప్రభు త్వ హయాంలో శ్రీధర్బాబు పౌరసరఫరాల శాఖను నిర్వహించారు. ప్రస్తుతం ఈటెలకు ఆ శాఖ అప్పగించటంతో వరుసగా రెండోసారి పౌరసరఫరాల శాఖ సారథ్యం మన జిల్లాకే దక్కింది. గతంలో వైఎస్ హయాంలో జీవన్రెడ్డి, జువ్వాడి రత్నాకర్రావు ఏకకాలంలో జిల్లా నుంచి మంత్రులుగా ఉన్నారు. అదే తీరుగా జోడు మంత్రి పదవుల అవకాశం మళ్లీ వచ్చినట్లయింది. హరీశూ మన జిల్లావాడే.. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రిగా నియమితుడైన తన్నీరు హరీశ్రావు మనవాడే. బెజ్జెంకి మండలం తోటపల్లి ఆయన స్వగ్రామం. ఆయన విద్యాభ్యాసమంతా కరీంనగర్లోనే సాగింది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత హరీశ్రావు కేసీఆర్ వెంట హైదరాబాద్కు మకాం మార్చారు. కేసీఆర్ రాజీ నామాతో ఖాళీ ఏర్పడడంతో సిద్దిపేట నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయిదుసార్లు గెలిచిన రికార్డు నమోదు చేసుకున్నారు. సిద్దిపేట నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా జిల్లా తో అనుబంధాన్ని కొనసాగించారు. ఆయన కుటుంబీకులు ఇప్పటికీ జిల్లాలోనే ఉన్నారు. మెదక్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఆయన పుట్టి, పెరిగింది, రాజకీయ అరంగేట్రం చేసింది కరీంనగర్ జిల్లానే కావడంతో జిల్లా నుంచి ముగ్గురికి మంత్రులుగా అవకాశం కల్పించినట్లయింది. కొప్పులకు ఛాన్స్ మిస్ కేసీఆర్ తొలి దఫా మంత్రివర్గంలో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్కు చోటు దొరక్కపోవటం చర్చనీయాం శంగా మారింది. దళిత నాయకుడు కావటంతో బెర్త్ ఖాయమని ముందునుంచీ ప్రచారం జరిగింది. డెప్యూటీ సీఎం రేసులో డాక్టర్రాజయ్యతోపాటు ఆయన పేరు పరిశీలనలో ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తీరా.. కేసీఆర్తో ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల జాబితాలో ఆయన లేకపోవటంతో ధర్మపురి నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. తదుపరి మంత్రివర్గ విస్తరణలో కొప్పులకు చోటు దొరుకుతుందని.. ఈ నెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల సమయంలో స్పీకర్ లేదా డెప్యూటీ స్పీకర్ పదవుల నియామకంలో ఆయనకు అవకాశం కల్పిస్తారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. -
పేరుకుపోయిన ధాన్యం నిల్వలు
నల్లగొండ, న్యూస్లైన్: అధికారుల నిర్లక్ష్యం.. సిబ్బందికి ముందు చూపు లేకపోవడంతో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం నిల్వలు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయాయి. ధాన్యం దిగుబడులు మొదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికి పూర్తి స్థాయిలో జిల్లా పౌరసరఫరాల సంస్థ, డీఎం సివిల్ సప్లయీస్లు ధాన్యం రవాణా, మిల్లులకు సంబంధించి ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఫలితంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. అయితే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పథం కొనుగోలు కేంద్రాలు రైతులకు సౌకర్యంగానే ఉన్నా, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో అధికారుల, సంఘాల తీరు పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల సంఘాల నిర్వహకులను నిర్బం దించిన సంఘటనలు, ధర్నా రాస్తారోకోలు వెలుగు చూస్తున్నాయి. దీంతో కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం అకాల వర్షాలతో తడిసి ముద్దయ్యే పరిస్థితి కనిపిస్తోంది. పేరుకుపోయిన నిల్వలివే.. ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమయ్యా యి. వాస్తవానికి కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోళ్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తే 45 రోజుల్లోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి. కానీ అధికారుల వైఫ్యలం వల్ల కేంద్రాలు ప్రారంభించి రెండు నెలలు కావస్తున్నా సమస్యలు పరిష్కరించడం పైనే ఇంకా కింద మీదా పడుతున్నారు. ‘న్యూస్లైన్’ సేకరించిన సమాచారం మేరకు జిల్లాలోని 45 ఐకేపీ కేంద్రాల వద్ద ప్రస్తుతం లక్షా 46 వేల 527 క్విం టాళ్లు ధాన్యం నిల్వలు పేరుకుపోయా యి. ఇది గాక రైతుల కల్లాల వద్ద నుంచి ఇంకా 6 నుంచి 7 లక్షల క్వింటాళ్ల వరకు ధాన్యం వచ్చే అవకా శం ఉంది. ఈ సీజ న్లో ఐకేపీ కేంద్రాలు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 21 లక్షల 58 వేల 915 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో మిల్లులకు దాదాపుగా 20 లక్షల క్వింటాళ్ల వరకు తరలించారు. ఎక్కడెక్కడ..అంటే.. అనుముల మండలం తిరుమలగిరి కేంద్రంలో 4,360 క్వింటాళ్లు, కొట్టాలలో3,200 క్విం టాళ్లు, కట్టంగూరు మండలం కురుమర్తి 3,124 క్వింటాళ్లు, తిరుమలగిరి మండలం మామిడిపల్లి 3,161 క్వింటాళ్లు, నూతనకల్ మండలం గోరంట్ల 2,466 క్వింటాళ్లు, తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం 1394 క్వింటాళ్లు, మామిడాల 1,177 క్వింటాళ్లు, తుర్కపల్లి 2, 304, పెన్పహాడ్ మండల ఎన్ అన్నారంలో 2,443 , తుంగతుర్తిలో 2,096, ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరులో 2,354 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉంది. ముందుచూపేదీ..? గతేడాది భారీ వర్షాలు పడటంతో ఈ సీజన్లో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ సీజన్లో పంట దిగుబడి పది లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఆ మేరకు ఐకేపీ కేంద్రాలు కొనుగోలు చేయాల్సిన ధాన్యాన్ని నిర్ధేశించిన అధికారులకు ఏర్పాట్లు విషయంలో మాత్రం ముందుచూపు కొరవడింది. ధాన్యం దిగుబడి దండిగా రావడంతో ఐకేపీ కేంద్రా లు, మిల్లులు ధాన్యం రాశులతో కిక్కిరిసిపోయాయి. దీంతో మరో గత్యం తరం లేక డివిజన్ నుంచి మరొక డివి జన్ పరిధిలోని మిల్లులకు ధాన్యం రవాణా చేస్తున్నారు. అయితే డివిజన్ దాటి ధాన్యం రవాణా చేయ డం వల్ల ట్రాన్స్పోర్టు ఖర్చుచాలడం లేదని కాంట్రాక్టర్లు పేచీపెట్టారు. ఈ సమస్యను పరి ష్కరించడంలో ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయలేకపోతున్నాయి. దీంతో పా టు మిల్లుల యజమానులపై చర్యలు తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం చూసీచూడన్నట్లుగా వ్యవహరిస్తోం దన్న విమర్శలు కూడా ఉన్నాయి. లారీలు రావడం లేదు కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుకు తరలించేందుకు లారీలు రావడం లేదు. పక్షం రోజు లుగా మా సంఘ బంధం ద్వారా 17, 551 బస్తాల ధాన్యం కొనుగోలు చేశాం. కానీ 2500 బస్తాల ధాన్యం మాత్రమే లారీల్లో మిల్లుకు తరలించాము. రోజుకో లారీ కూడ రావడం లేదు. లారీల కోసం మిల్లులు, పోలీస్స్టేషన్ చుట్టు తిరగాల్సి వస్తుంది. ఏమి చేయాలో ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. - తిరపతమ్మ, సంఘ బంధంసభ్యురాలు, తిరుమలగిరి, హాలియా మండలం మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదు కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి చేసుకునేందుకు మిల్లర్లు ఆసక్తి కనబర్చడం లేదు. ధాన్యం తీసుకుపోయిన లారీ 24 గంటలు అయితే గాని దిగుమతి కావడం లేదు. దీంతో లారీ యజమానులు రెండు రోజుల కిరాయి అడుగుతున్నారు. ప్రభుత్వం క్వింటా ధాన్యాన్ని రవాణా చేస్తు క్వింటాకు రూ.16 ఇస్త్తూ మిల్లర్లు సకాలంలో దిగుమతి చేసుకోకపోవడం వల్ల రూ.32 చెల్లించాల్సి వస్తుంది. - బి. మంగమ్మ, సంఘ బంధం సభ్యురాలు, తిరుమలగిరి, హాలియా మండలం -
బియ్యం.. మాయం!
=లోడ్లకు లోడ్లు పక్కదారి =చక్రం తిప్పుతున్న డీటీలు =లక్షల్లో వసూళ్లు =పౌర సరఫరా నుంచి రెవెన్యూ వరకు అందరికీ వాటాలు =పైపై తనిఖీలతోనే సరి =అరకొరగానే రికవరీలు పేదల కడుపు నింపాల్సిన బియ్యాన్ని పెద్దలు స్వాహా చేస్తున్నారు. చౌకగా వచ్చే సరకును తేరగా మింగేస్తున్నారు. అధికారుల సహకారంతో అవలీలగా దారి మళ్లిస్తున్నారు. ప్రభుత్వ పథకాల సంరక్షకులుగా బాధ్యతతో వ్యవహరించాల్సిన ఉద్యోగులు అక్రమాలకు యథాశక్తి సాయం చేస్తున్నారు. దండిగా దండుకుంటున్నారు. లక్షల్లో వస్తున్న అక్రమార్జనను వాటాలు వేసి మరీ పకడ్బందీగా పంపిణీ చేస్తున్నారు. దాంతో పేదల బియ్యం పక్కాగా పెద్దవారి ఖజానాలో కాసుల రాసులుగా రూపాంతరం చెందుతోంది. పైపై తనిఖీల పుణ్యమాని ఈ వ్యవహారం నిరాఘాటంగా కొనసాగుతోంది. విశాఖ రూరల్, న్యూస్లైన్: పేదల బియ్యానికి రెక్కలొస్తున్నాయి. మండల స్థాయి నిల్వ కేంద్రాల నుంచి లోడ్లకు లోడ్లు మాయమైపోతున్నాయి. పెద్దల గోదాముల్లోకి చేరుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. పౌర సరఫరా శాఖ అధికారుల మామూళ్ల వ్యవహారం ఫలితంగా చౌక బియ్యం రాశులు గోదాముల్లోకి చేరకుం డానే రాష్ట్రాలు దాటిపోతున్నాయి. చాలా మంది ఉద్యోగులు, అధికారుల సహకారంతో వ్యాపారం, రవాణా సాఫీగా సాగిపోతున్నాయి. జిల్లాలో చౌక సరకుల పంపిణీలో కొంత మంది డిప్యూటీ తహశీల్దార్లు చక్రం తిప్పుతున్నారు. రేషన్ దుకాణాల నుంచి స్టాకు పాయింట్ల వరకు ప్రతీ చోటా దండుకుంటున్నారు. పౌర సరఫరా శాఖ అధికారుల నుంచి రెవెన్యూ ఉన్నతాధికారుల వరకు ప్రతీ ఒక్కరికీ ఎవరి వాటాలు వారికి పంపిణీ చేస్తూ తమ స్థానాలు పదిలం చేసుకుంటున్నారు. జిల్లాలో ఉన్న 11.36 లక్షల తెల్లరేషన్ కార్డులకు బియ్యం సరఫరా చేసేందుకు వీలుగా 30 మండల స్థాయి నిల్వ కేంద్రాలు (ఎంఎల్ఎస్ పాయింట్లు) ఉన్నాయి. వీటిలో 9 జీసీసీ పాయింట్లు ఏజెన్సీలో ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించే బియ్యం ముందుగా ఎఫ్సీఐ గోడౌన్లకు చేరుకుంటుంది. అక్కడ నుంచి కార్డుల సంఖ్య ప్రకారం స్టేజ్-1లో ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలిస్తారు. ఆ గోదాముల నుంచి స్టేజ్-2లో చౌక దుకాణాలను సరఫరా చేస్తారు. పైపైనే తనిఖీలు : సాధారణంగా రేషన్ డీలర్లు కొద్ది మొత్తంలో తరలించే బియ్యాన్ని పట్టుకొని హడావుడి చేసే పౌర సరఫరా అధికారులు.. గోదాముల నుంచి లోడ్లకు లోడ్లు మాయమైపోతున్నా స్పందించక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతీ నెలా ఎంఎల్ఎస్ పాయింట్లలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఆమధ్య మర్రిపాలెం ఎంఎల్ఎస్ పాయింట్కు చేరాల్సిన లారీ లోడ్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇలా ఎఫ్సీఐ నుంచి పౌర సరఫరా గోదాములకు రాకుండానే బియ్యం తరలిస్తున్న వ్యవహారం బయటపడడంతో అధికారులు హడావుడి చేశారు. ఇద్దరు సిబ్బందిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు. ఈ తరలింపు వెనుక అసలు వ్యక్తుల కోసం దర్యాప్తు జరుగుతూనే ఉంది. నిజానికి స్టాక్ పాయింట్కు చేరాల్సిన బియ్యాన్ని పైవారి ప్రమేయం లేకుండానే తరలించే అవకాశం ఉంటుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. గత నెలలో సుమారుగా 1,637 కిలోల వరకు నిల్వల్లో తేడా ఉన్నట్టు అధికారులు లెక్కలు రాసుకున్నారు. రికవరీలు చేస్తున్నట్లు రికార్డులు చూపిస్తున్నారు. అందరికీ వాటా : నిత్యావసర సరకుల సరఫరా ద్వారా జిల్లా పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారుల పంట పండుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది డిప్యూటీ తహశీల్దార్లు ప్రతీ నెలా లక్షలకు లక్షలు వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చౌక దుకాణాల ద్వారా సరకులు సక్రమంగా సరఫరా అవుతున్నాయో లేదో ఎవరూ పట్టించుకోవడం లేదు. గోదాముల నుంచి మండలాల పరిధిలోని రేషన్ షాపులకు సరకులు సరఫరాపై దృష్టి సారించాల్సిన డిటీలు ఆ సరకులు గోదాములకు చేరుకుండానే తరలించే పనిలో నిమగ్నమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ డీలర్ల నుంచి స్టాకు పాయింట్లలో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు ప్రతీ ఒక్కరి నుంచి మామూళ్లు వసూలు చేస్తూ వాటిని ఉన్నతాధికారులకు పంపిణీ చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. -
కొత్త కార్డులకు డిసెంబరు కోటా
సాక్షి, గుంటూరు : వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం రచ్చబండ లో ప్రజలకిచ్చిన వరాలపై దృష్టి సారిస్తోంది. కొత్తగా మంజూరు చేసిన రేషన్ కార్డులకు డిసెంబరు నెల కోటాను విడుదల చేసి పేదల ఓట్ల కోసం గాలం విసిరింది. రచ్చబండ-3 కింద ప్రజలకు పంపిణీ చేసిన 70,159 రేషన్ కార్డులకు డిసెంబరు నెల కోటా కింద 620 మెట్రిక్ టన్నుల కిలో రూపాయి బియ్యాన్ని విడుదల చేసింది. రచ్చబండ సభల్లో రేషన్కార్డులు, కూపన్లు పంపిణీ చేసిన వారందరికీ డిసెంబరు నెల సరుకుల్ని 25 లోగా పంపిణీ చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం 10,98,964 తెల్లకార్డులు, 82264 అంత్యోదయ అన్నయోజన, 1401 అన్నపూర్ణ కార్డులున్నాయి. రచ్చబండ -3 కార్యక్రమం ముగిసే నాటికి కొత్తగా పంపిణీ చేసిన 70,159 కార్డులతో కలిపి వీటి సంఖ్య 14,34, 993 అయ్యాయి. వీటన్నింటికీ డిసెంబరు నెల కోటా కింద 19,704 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. డీలర్లు వెంటనే మండల లెవల్ స్టాక్పాయింట్ల నుంచి సరుకును తీసుకెళ్లి కార్డుదారులకు పంపిణీ చేయాలని డీఎస్వో రవితేజనాయక్ పేర్కొన్నారు. ఆధార్కార్డుల లింకు 71 శాతం పూర్తి.. జిల్లాలో 11,53,451 మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 8,19,078 మంది(71శాతం) ఆధార్కార్డుల్ని గ్యాస్ ఏజెన్సీల్లో లింకు చేయించుకున్నారు. కాగా బ్యాంకుల్లో మాత్రం 5,00,687 మంది(44శాతం) మాత్రమే పేర్లను నమోదు చేయించుకున్నారు. జిల్లాలో ఉన్న 48,89,230 మంది జనాభాలో 48,46,100 మంది ఆధార్ గుర్తింపు కార్డుల కోసం పేర్లను నమోదు చేయించుకున్నారు. ఇంకా 43,130 మంది ఆధార్ కార్డుల కోసం పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. కోస్తా జిల్లాల్లో ఎక్కువ మంది (99.12 శాతం) పేర్లను నమోదు చేయించుకున్న జిల్లాగా గుంటూరు నిలిచింది. -
సన్నాలు @30
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సన్నబియ్యం ధరలను అదుపు చేసేందుకు పౌరసరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో రూ.40కిపైగా సన్నబియ్యం విక్రయిస్తుండగా.. వీటిని మరింత తక్కువకే వినియోగదారులకు విక్రయించేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. సోనామసూరి(సన్నాలు) బియ్యం కిలో రూ.30 చొప్పున అమ్మేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శనివారం నుంచే ఈ బియ్యం రైతుబజార్లలో లభించనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లోని తొమ్మిది రైతు బజార్లతోపాటు రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి మార్కెట్ యార్డుల్లో విక్రయాల కోసం అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో రైతుబజార్ల ద్వారా సోనామసూరి బియ్యం విక్రయించేందుకు ప్రభుత్వం 700మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించింది. వీటిని ఉత్తరప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కోటా మొత్తాన్ని జిల్లాలోని అన్ని విక్రయ కేంద్రాలకు చేరవేశారు. ఒక్కో వ్యక్తికి గరిష్టంగా 20కిలోలు విక్రయించనున్నారు. అయితే ఈ కోటా పూర్తయ్యేలోపు డిమాండ్ను బట్టి మరింత కోటా తెప్పించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.