aid
-
‘ఈసీ’కి అమెరికా సాయం..? మాజీ ‘సీఈసీ’ ఫైర్
న్యూఢిల్లీ:భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అమెరికా నిధులిచ్చిందనే విషయాన్ని మాజీ సీఈసీ ఎస్వై ఖురేషి ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారమేనని ఆయన కొట్టిపారేశారు. ఇలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ భారత్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా ఇచ్చే 21 మిలియన్ డాలర్ల సాయాన్ని నిలిపివేసిందన్న వార్తలపై ఖురేషి ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.‘భారత్లో ఓటర్ టర్నౌట్ విషయంలో సాయం కోసం తాను సీఈసీగా ఉండగా ఎన్నికల కమిషన్ అమెరికాతో ఒప్పందం కుదర్చుకుందనడంలో కొంచెం కూడా నిజం లేదు.నేను 2012లో సీఈసీగా ఉన్నపుడు ఐఎఫ్ఈస్తో మాత్రమే సిబ్బంది శిక్షణ కోసం ఒప్పందం జరిగింది.ఈ ఒప్పందంలో ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రస్తావన లేనే లేదు.ఆర్థిక,న్యాయపరమైన బాధ్యతలేవీ ఉండవని ఒప్పందంలో స్పష్టంగా రాసుకున్నాం’అని ఖురేషి తెలిపారు. భారత్లో ఓటర్ టర్నౌట్ కోసం ఉద్దేశించిన 21 మిలియన్ డాలర్ల సాయాన్ని మస్క్ నేతృత్వంలోని ‘డోజ్’ ఇప్పటికే ప్రకటించింది.ఈ ప్రకటనపై ప్రధాని మోదీ సలహాదారు సంజీవ్ సన్యాల్ మండిపడ్డారు. ప్రపంచ దేశాలకు అమెరికా సాయం అనేది అతి పెద్ద స్కామ్ అని ఫైర్ అయ్యారు. -
Trump: సాయం కోసం ఇంత ఏడుపులు దేనికి?
‘‘అది మీ ప్రభుత్వం కాదు. మీ దేశం అంతకన్నా కాదు. మీరేం అక్కడ పన్నులూ కట్టడం లేదు. ఏదైనా సాయం అందించడానికి వాళ్లకు కారణాలు అక్కర్లేదు కదా. అలాంటప్పుడు ఈ ఏడుపులు దేనికి? ముమ్మాటికీ ఇది మనకు ఓ మేలుకొలుపే..’’ అని ఓ సదస్సులో ఆఫ్రికా దేశాలను ఉద్దేశించి కెన్యా మాజీ అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఫెడరల్ గ్రాంట్లు, రుణాల నిలిపివేత నిర్ణయమే ఆయన అలా మాట్లాడటానికి కారణం. సాయాన్ని నిలిపివేస్తానని ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచమంతా ఆగమాగమైంది. పలువురు దేశాధినేతలు ట్రంప్ను బహిరంగంగానే తిట్టిపోశారు. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం ఇచ్చే సాయం మీద ఆధారపడి బతుకుతున్న చిన్న దేశాల తీవ్ర ఆందోళనకు గురయ్యాయి.అమెరికా నుంచి వెళ్తున్న అన్ని గ్రాంట్లపై సమీక్ష జరపాలని ట్రంప్ ప్రభుత్వం భావించింది. దీంతో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిడ్ మినహా అమెరికా అందిస్తున్న అన్ని సాయాలు ఆపేద్దామనుకుంది. ఈ విధానం అమెరికాకు ప్రయోజకారిగా లేకపోగా.. విలువలకు విరుద్ధంగా ఉందని ట్రంప్ ఈ ఆదేశాలను జారీ చేశారు. అందుకే మూడు నెలలపాటు వాటిని సమీక్షించాలనుకున్నారు. ఈజిప్ట్, ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిడ్కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ నిర్ణయం వెలువడిన కాసేపటికే.. మ్యాటర్ కోర్టు గడప తొక్కింది. దీంతో విచారణ వేళ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను వెనక్కి తీసుకుంటున్నట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. అయితే కెన్యా మాజీ అధ్యక్షుడు చెబుతున్నట్లు అమెరికా సాయం నిజంగా ఈ ప్రపంచానికి అవసరమా?.కిందటి ఏడాది అమెరికా నుంచి వివిధ దేశాలకు వెళ్లిన సాయం పరిశీలిస్తే.. ఉక్రెయిన్కు 16.5 బిలియన్ల డాలర్ల సాయానికిగానూ.. 16.2 బిలియన్ డాలర్లు పంపిణీ చేసింది.ఇథియోపియాకు 1.6 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించి.. 2 బిలియన్ డాలర్లు పంపిణీ చేసింది.జోర్దాన్కు 1.2 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించి.. అందజేసింది.డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. 1 బిలియన్ డాలర్ సాయం ప్రకటించి, 982 మిలియన్ డాలర్లు ఇచ్చిందిసోమాలియాకు 1 బిలియన్ డాలర్ల సాయం ప్రకటించి, 1.1 బిలియన్ డాలర్లను పంపిణీ చేసిందియెమెన్కు 939 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించి.. 1.1 బిలియన్ డాలర్లు అందజేసింది.నైజీరియాకు 904 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించి.. 886 మిలియన్ డాలర్లు ఇచ్చిందిఅఫ్గనిస్థాన్కు 815 మిలియన్ డాలర్ల సాయానికిగానూ.. 1.2 బిలియన్ డాలర్ల సాయం అందజేసిందిదక్షిణ సూడాన్కు 794 మిలియన్ డాలర్ల సాయానికిగానూ 891 మిలియన్ డాలర్లు అందజేసిందిసిరియాకు 748 మిలియన్ డాలర్లకుగానూ.. 894 మిలియన్ డాలర్ల సాయం అందించిందిమానవతా కోణంలో సాయం అందించడం, ఆయా దేశాల అభివృద్ధిలో భాగంగా అమెరికా ఈ సాయం అందించింది. అయితే అమెరికాతో పాటు వివిధ దేశాలకు ఎంత గ్రాంట్లు కేటాయించాలన్నది మాత్రం అక్కడి చట్ట సభలే నిర్ణయిస్తాయి. ఈ అమెరికాకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని ఈ పద్ధతి మారాలని ట్రంప్ అనుకుంటున్నారు.ట్రంప్ నిర్ణయంతో విదేశాలకు, స్వచ్ఛంద సంస్థలకు చేసే ఆర్థిక సాయం ఆగిపోవడంతోపాటు విద్య, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, నిర్మాణ, విపత్తు నిర్వహణ కార్యక్రమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఆహారం, ఆశ్రయం, వైద్య సేవల్లాంటి మానవతా సాయం ఆగిపోతుంది. ఇది నేరుగా ఉద్యోగాల తొలగింపు.. అవసరమైతే ఆ వ్యవస్థల రద్దుకు దారి తీయొచ్చు. పౌష్టికాహార లోపం, రకరకాల జబ్బుల.. వైరస్లతో బాధపడుతున్న ఆఫ్రికన్ దేశాలకు ఇది ముప్పుగా మారచ్చు. మరికొన్ని దేశాల్లో సంక్షోభాలు ముదిరేలా చేయొచ్చు. అయితే సామాజిక భద్రత, మెడికేర్ చెల్లింపులు, వ్యక్తులకు నేరుగా అందించే ఆర్థికసాయంపై ప్రభావం చూపదని వైట్హౌస్ వర్గాలు చెబుతున్నా.. ఎక్కడా రాతపూర్వకంగా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. అమెరికాలోనే మాత్రం కాదు.. ఆ దేశం నుంచి సాయం పొందుతున్న దేశాలకూ వర్తించనుంది. ఆర్థికంగా, సామాజికంగా ఆ దేశాలు సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఎదురుకానున్నాయి. అందుకే ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలు.. ప్రత్యేకించి ఆఫ్రికన్ దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి.నిజంగా అమెరికా ఈ సాయం చేయడం అవసరమా? అంటే.. లేదు. కానీ, ఈ తరహా సాయంతో అమెరికాకు ఎంతో మేలు చేకూరుతుంది. దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపర్చుకోవడం, వ్యాపార రంగంలో కీలక ఒప్పందాలు, అంతర్యుద్ధాలు-సంక్షోభాల నివారణ.. ఉగ్రవాద అంతం.. తద్వారా ఆ దేశాల్లో జాతీయ భద్రతను పెంపొందించడం ద్వారా మిత్రపక్షాలుగా మార్చుకోవడం, జబ్బుల నివారణకు మానవతా కోణంలో సాయం.. అందుకోసం పరిశోధనలకు భారీగా నిధులు వెచ్చించడం, ఇలా ఇతరత్రా సాయాలతో ప్రపంచదేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తూ వస్తోంది అమెరికా. Hilarious. Former President of Kenya on Trump cutting off foreign aid: “Why are you crying? It’s not your government. It’s not your country. He has no reason to give you anything. You don’t pay taxes in America. This is a wake up call for you to ask what are we going to do”. pic.twitter.com/tfjETD2qkS— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 29, 2025అయితే.. ప్రపంచవ్యాప్తంగా వైద్య సాయాన్ని కూడా నిలిపివేయాలనుకున్న ట్రంప్ నిర్ణయం.. తూర్పు ఆఫ్రికా దేశాల ఐకమత్యానికి, పరస్పర సాయానికి ఓ పిలుపులాంటిదని ఉహురు కెన్యట్టా అభిప్రాయపడ్డారు. అమెరికాను, ట్రంప్ను విమర్శించడం కన్నా స్వీయ సమీక్ష చేసుకోవాలని నేతలకు పిలుపు ఇచ్చారు. ఇతరుల సాయంపై ఆధారపడే బదులు.. ఉన్న వనరులతోనే ఇక్కడి దేశాలు ఒకరికొకరు సాయం చేసుకోవడం, తద్వారా ఆర్థిక పురోగతికి దోహదపడడం ఏనాటికైనా మంచిదని అంటున్నారాయన. మానవతా సాయం విషయంలో భారత్ కూడా ఏం తీసిపోలేదు. 2021-2022లో 2.1 బిలియన్ డాలర్ల(రూ.18,154 కోట్లు) సాయాన్ని పొరుగుదేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, అప్ఘనిస్థాన్ల అభివృద్ధికి భారత్ అందజేసింది. -
బంగ్లాదేశ్కు ట్రంప్ బిగ్ షాక్
వాషింగ్టన్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ షాకిచ్చారు. బంగ్లా ప్రభుత్వానికి అమెరికా సాయాన్ని రద్దు చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్లో ఆహారభద్రత, ఆరోగ్యం, విద్య తదితర కీలక రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు ఆగిపోనున్నాయి. 90 రోజుల పాటు పలు దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేసే పాలసీలో భాగంగా బంగ్లాదేశ్కు సాయం నిలిపివేశారు. ఈజిప్ట్, ఇజ్రాయెల్లకు తప్ప ఇతర అన్ని దేశాలకు 90 రోజులపాటు అమెరికా సాయాన్ని నిలిపివేశారు. ట్రంప్ ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వలసదారుల విధానాలు, ఫెడరల్ వర్కర్లు ఆఫీసు నుంచి విధులు నిర్వహించడం, లేకెన్ రిలే చట్టం అమలు, పారిస్ ఒప్పందం నుంచి తప్పుకోవడం వంటి నిర్ణయాలు వీటిలో ఉన్నాయి.వీటికి తోడు అమెరికాలో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రపంచంలోని ఇతర దేశాలకు సాయాన్ని 90 రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: 90 వేల మంది ఉద్యోగుల తొలగింపు..ట్రంప్ కఠిన నిర్ణయం -
అమెరికా కార్చిచ్చు పెద్ద కుట్ర..?
-
‘బుడమేరు వరద సాయం ఇదేనా బాబూ?’
విజయవాడ, సాక్షి: ఏపీలో చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో చెప్పే పరిస్థితి ఇది. విజయవాడ ఎంపీతో పాటు కూటమి ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బుడమేరు వరద సాయం ఇంకా పూర్తి స్థాయిలో అందలేదంటూ బహిరంగంగానే పెదవి విరిచారు. ఈ క్రమంలో.. ఇవాళ జరిగిన తొలి డీఆర్సీ సమావేశంలో సమస్యలను ఏకరువు పెట్టారు వాళ్లు.బుడమేరు వరద సాయం ఇంకా చాలామందికి అందలేదంటూ డీఆర్సీలో ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని),ఎమ్మెల్యేలు నిజాలు ఒప్పుకున్నారు. బుడమేరు వరద ముంపు బాధితుల్లో బాధితులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. మరోమారు ఎన్యుమరేషన్ చేయాలి అని ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) అన్నారు. కొండచరియలు విరిగిపడి చనిపోయిన వారికి పరిహారం ఇవ్వలేదు. కొండ ప్రాంత ప్రజలను ఆదుకోవాలి అని ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.వరద బాధితులను ఇంకా కొంత మందికి నగదు అందలేదు. మేము బయటకు వస్తుంటే ప్రజలు అడుగుతున్నారు. అన్ని ప్రాంతాల్లో వాటర్ డ్యామేజ్ జరిగింది. బుడమేరు డైవర్షన్ చర్యలు తీసుకోవాలి. పట్టి సీమ నీళ్లు వదిలినప్పుడు బుడమేరులోకి వస్తున్నాయి. బుడమేరు వల్ల మైలవరం నియోజకవర్గం పూర్తిగా దెబ్బతింది. జి.కొండూరులో 13,800 ఎకరాల రైతులు ఇబ్బది పడుతున్నారు. 1 కోటి 20 లక్షల మోటార్లు రిపేర్లు ఉన్నాయి అని మైలవరం ఎమ్మెల్యే,వసంత కృష్ణప్రసాద్ అన్నారు.నందిగామ ఎమ్మెల్యే,తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. నందిగామలో పంట పూర్తిగా దెబ్బతింది. రైతులకు నష్ట పరిహారం అందించాలని అన్నారు.గన్నవరం ఎమ్మెల్యే,యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. విజయవాడ, అంబాపురం , గన్నవరంలో 200 కోట్లు అభివృద్ధి పనులు చేయాలి. అభివృద్ధి పనులకు నిధులు కేటాయంచాలి. విజయవాడ రూరల్ మండలంలో అభివృద్ధి చేయాలి అని అన్నారు.ఇక జగ్గయ్యపేట ఎమ్మెల్యే,శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ.. త్రాగునీరు విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నారు.ధాన్యం కనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తిరువూరు,ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఆలోచన చేయాలి. తిరువూరులో పత్తి పంట కొనేవారు లేదు. పత్తి పండుతున్నా ఇక్కడ కొనుగోలు కేంద్రం లేదు..గుంటూరులో ఉంది అని గుర్త చేశారాయన.ఇక.. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. కండ్రిక, జక్కంపూడి ప్రాంతంలో ఇంకా ఆటో డ్రైవర్లకు పరిహారం అందలేదన్నారు. అలాగే.. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. -
‘వరద’ సాయం పంపిణీలో హాహాకారాలు!
పాయకాపురం (విజయవాడరూరల్): వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. కుక్కర్లు, గ్యాస్ స్టవ్ల పంపిణీ ప్రారంభించి.. ఒక్కసారిగా గేట్లు తీయడంతో బాధితులంతా కల్యాణ మండపంలోకి ప్రవేశించడంతో జరిగిన తొక్కిసలాటలో వృద్ధులు, మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 64వ డివిజన్ కండ్రికలోని కల్యాణమండపంలో వరద బాధితుల సహాయార్థం టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి గ్యాస్స్టవ్లు, కుక్కర్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.అయితే గురువారం రాత్రే టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలకు కూపన్లు పంపిణీ చేశారు. సర్వం కోల్పోయిన బాధితులంతా అక్కడికి చేరుకుని క్యూలైన్లలో నిలబడ్డారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే బొండా ఉమా, అధికార ప్రతినిధి పట్టాభి, బుద్ధా వెంకన్న పంపిణీ ప్రారంభించారు. కల్యాణ మండపం గేట్లు తెరవడంతో బాధితులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో భారీ ఎత్తున తోపులాట జరిగింది. వృద్ధులు, మహిళలు కిందపడిపోయారు. వారిపై బారికేడ్లు పడడం, వెనుక నుంచి వచ్చే వారు తొక్కుకుంటూ వెళ్లడంతో ఊపిరాడక హాహాకారాలు చేశారు. ఆ ప్రాంతమంతా బాధితుల ఆర్తనాదాలతో మార్మోగిపోయింది. వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడంతో వారు తోపులాటలో చిక్కుకుని గాయపడ్డారు. పోలీసులు అదుపు చేయలేక చేతులెత్తేశారు. మహిళా పోలీసులు బారికేడ్లను తొలగించడంతో ప్రాణ నష్టం తప్పింది. టీడీపీ జనసేన కార్యకర్తలకే టోకెన్లు పంచుకున్నారు. ముఖాలు చూసి మరీ టోకెన్లు ఇచ్చారు. టీడీపీ జనసేన కార్యకర్తలే వరద బాధితులా? మేం బాధితులం కాదా అంటూ కండ్రిక వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'బుడమేరు వరద' సాయం స్వాహా
విజయవాడస్పోర్ట్స్: బుడమేరు ముంపు వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు అందిస్తున్న సాయాన్ని టీడీపీ నాయకులు స్వాహా చేస్తున్నారు. వరద వల్ల ఈ నెల ఒకటో తేదీ నుంచి పది రోజులపాటు విజయవాడ నగర శివారులోని కొత్త రాజరాజేశ్వరిపేట, వాంబేకాలనీ, సుందరయ్యనగర్, శాంతినగర్, ప్రశాంతినగర్, కండ్రిక, రాజీవ్నగర్, ఉడా కాలనీ తదితర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. బాధితుల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంతోమంది ముందుకొచ్చారు. ఆటోలు, ట్రాక్టర్లు, లారీల్లో ఆహారం, నీళ్లు, దుప్పట్లు, సరుకులు తీసుకొచ్చారు. వాటిపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. చాలావరకు సింగ్నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలోనే వాటిని ఎగరేసుకుపోయారు. అంతటితో ఆగకుండా తమ పలుకుబడి ఉపయోగించి స్వచ్ఛంద సంస్థలు, దాతలు తెచ్చిన సరుకులు, దుప్పట్లు, దుస్తులు వంటివి సింగ్నగర్ కృష్ణా హోటల్ సమీపంలోని ఎమ్మెల్యే బొండా ఉమా కార్యాలయానికి తరలించారు. వాటిని పసుపు సంచుల్లో వేసి టీడీపీ పంపిణీ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఈ సరుకుల పంపిణీకి కూడా పలు ప్రాంతాల్లో ముందుగా టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్ల కోసం వాంబేకాలనీలోని ఫంక్షన్ హాలు వద్దకు గురువారం అధిక సంఖ్యంలో పేదలు చేరడంతో గందరగోళం నెలకొంది. అక్కడి నుంచి టోకెన్లు తీసుకుని టీడీపీ కార్యాలయానికి వెళితే షట్టర్ మూసి ఉందని పలువురు వరద బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. సాయం చేస్తామని చెప్పి వారం నుంచి టోకెన్లు, సరుకులు అంటూ తిప్పుకుంటున్నారని వాంబేకాలనీకి చెందిన మహిళలు కె.జయలక్ష్మి, ఎస్.కనకదుర్గ, ఎ.నాగమణి, కె.దుర్గాభవాని, వి.లక్ష్మి, బి.నాగరాణి, శాంతి, ఎస్.సన్యాసమ్మ తదితరులు ఆగ్రహం వ్యక్తంచేశారు.మహిళ పేరు బాణావతు మల్లేశ్వరి. టీడీపీ నాయకురాలు. 20 ఏళ్లుగా కొత్త రాజరాజేశ్వరిపేటలో నివసిస్తూ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. బుడమేరు వరద కారణంగా ఆమె నివాసం ఉంటున్న కొత్త రాజరాజేశ్వరిపేట అంతా మునిగిపోయింది. తమ పేటలోని బాధితులకు దాతలు అందిస్తున్న సాయాన్ని టీడీపీ నేతలు స్వాహా చేస్తున్న విషయాన్ని తేల్చుకునేందుకు పలువురు మహిళలతో కలిసి మల్లేశ్వరి గురువారం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కార్యాలయం వద్దకు వెళ్లారు. అయితే కార్యాలయం షట్టర్ మూసి ఉంది. ‘మా ప్రాంతానికి ఇప్పటి వరకు టీడీపీ తరఫున ఎటువంటి సాయం చేయలేదు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఇచ్చే సాయాన్ని కూడా మా పార్టీకే చెందిన మాజీ కార్పొరేటర్ యరబోతు రమణ పక్కదారి పట్టిస్తున్నాడు. సాయం చేసేందుకు వచ్చేవారిని మా పార్టీ నాయకులు వారి ఇళ్ల వద్దకు పిలిపించుకుని సరుకులు, దుస్తులు కాజేస్తున్నారు’ అని మల్లేశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు. వరద నష్టం అంచనాలు కూడా కొందరి ఇళ్లకే పరిమితం చేశారని, సామాజిక పింఛన్లు ఇంకా ఇవ్వలేదని పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు.నీచమైన బతుకులు అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు మాకు ఎలాంటి సాయం చేయలేదు. సాయం చేసేందుకు వచ్చిన వారి నుంచి సరుకులన్నీ టీడీపీ నాయకులే తీసుకుంటున్నారు. వాటిని బయటపెట్టడం లేదు. ఎవరికీ పంచడం లేదు. మాకు అందాలి్సన వాటిని కాజేస్తూ నీచాతినీచమైన బతుకు బతుకుతున్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఆఫీసుకు వెళ్లి అడిగితే రోడ్డు పక్కన పడేసే చిరిగిన దుస్తులు పంపించారు. వాటనీ్నంటినీ బుధవారం రాత్రి మా వీధిలో పడేసి తీసుకువచ్చిన టీడీపీ నాయకుల ముందే తగలబెట్టేశాం. – రాజులపాటి తిరుపతమ్మ, న్యూఆర్ఆర్పేటసాయం అడిగితే పార్టీలు అంటగడుతున్నారుఇంట్లో సామాన్లు అన్నీ పోయి ఇబ్బందులు పడుతున్నాం. సాయం చేయాలని అడుగుతుంటే టీడీపీ నాయకులు పార్టీలను అంటగడుతున్నారు. మా పార్టీకి ఓటు వేయలేదు... మీకు ఇవ్వం అని ముఖం మీదే చెప్పేస్తున్నారు. రెండు రోజుల క్రితం జగన్ పార్టీ వాళ్లు వచ్చి అందరికీ సాయం అందించారు. టీడీపీ వాళ్లు మాత్రం పార్టీల పేరుతో వేరు చేసి మాట్లాడుతున్నారు. వాళ్లు సాయం చేయకపోగా, సాయం చేసే వాళ్లని మా వరకు రానివ్వడం లేదు. – గుడిసే నాగమణి, న్యూఆర్ఆర్పేట -
ఉదారంగా సాయం చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఊహించని విపత్తు తలెత్తిందని.. అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలను ఆదుకునేందుకు ఉదారంగా సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం గురువారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణంగా.. గతంలో వచ్చిన వరదల్లా చూడొద్దు. రికార్డు స్థాయి వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేశాయి. రెండు రోజుల వ్యవధిలో 50 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కృష్ణా బ్యారేజీ చరిత్రలో ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదు. 11.90 లక్షల క్యూసెక్కుల వరదకు అనుగుణంగా ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరగ్గా.. మొన్న కురిసిన వర్షాలకు 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 14 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పరిస్థితి ఏంటనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పంటలు నీట మునిగి రైతులు కుదేలయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు.. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక ప్రజలు ప్రాణభయంతో తీవ్ర క్షోభను అనుభవించారు. ప్రజలను తిరిగి నిలబెట్టేలా కేంద్రం సాయం చేసేలా చూడండి’ అని కేంద్ర బృందాన్ని కోరారు. ‘బుడమేరు’కు శాశ్వత పరిష్కారం కావాలన్నారు..అనంతరం కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం వరద ప్రాంతాల్లో తమ అనుభవాలను సీఎంకు వివరించారు. ‘భారీగా పంట నష్టం జరిగిందని, మౌలిక సదుపాయాలపరంగా తీవ్ర నష్టం జరిగిందని గుర్తించాం. బుడమేరు వరదలపై ప్రజలు తమ బాధలు చెప్పుకున్నారు. ఈ సమస్య నుంచి శాశ్వత పరిష్కారం చూపించాలని వారు కోరారు. తమకు ప్రభుత్వం సాయం చేస్తుందనే నమ్మకంలో ప్రజలున్నారు. మా పరిశీలనకు వచ్చిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తగిన సాయం అందేలా కృషి చేస్తాం’ అని కేంద్ర బృందం తెలిపింది. ఎంఎస్ఎంఈలతో డ్వాక్రా సంఘాల అనుసంధానంరాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేసి, ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు విలువ జోడించడం, ప్యాకింగ్ వంటి ఉమ్మడి సౌకర్యాల వినియోగంతో పాటు మార్కెటింగ్, టెక్నాలజీని అందుబాటులోకి తేవాలన్నారు. సీఎం చంద్రబాబు గురువారం సచివాలయంలో ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రోసెసింగ్ రంగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష వివరాలను ఎంఎస్ఎంఈ మంత్రి కె.శ్రీనివాస్ విలేకరులకు వివరించారు. రాష్ట్రంలో తయారయ్యే ఉత్పత్తులను ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా విక్రయించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. విశాఖలోని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరహాలోనే అమరావతిలో మరొకటి ఏర్పాటు చేసి, దానికి అనుబంధంగా 10కి పైగా వివిధ రంగాల హబ్ అండ్ స్పోక్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈ క్రెడిట్ గ్యారంటీ స్కీం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తోందని, కేంద్రం రూ.5,000 కోట్లు గ్యారంటీ ఇవ్వడంతో చిన్న పరిశ్రమలకు ఎటువంటి తనఖా అవసరం లేకుండా రుణాలు లభిస్తాయని అన్నారు.ఎంఎస్ఎంఈలకు ఇవ్వాల్సిన రూ.1,500 కోట్ల ప్రోత్సాహక బకాయీలను కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో రైతుల భాగస్వామ్యంతో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై కసరత్తు చేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు. రాజధానిలో రైతులకు లబ్ధి చేకూర్చిన విధానాన్నే ఈ ఎంఎస్ఎంఈ పార్కులకూ అవలంభించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. రైతులు పండించే పంటలకు వారే విలువను పెంచుకునేలా పాలసీ తేవాలని సీఎం సూచించారు. విజయవాడ వరదల్లో దెబ్బతిన్న పరిశ్రమలను ఏ విధంగా ఆదుకోవాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్ భేటీతెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి సీఎం నారా చంద్రబాబునాయుడును మర్యాద పూర్వంగా కలిశారు. వారు గురువారం మధ్యాహ్నం సచివాలయానికి వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. -
వరద సాయంపై వదిన-మరిది.. తలోమాట!
అమరావతి, సాక్షి: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సాయం విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. తక్షణ సాయం కింద కేంద్రం మూడు వేల కోట్ల రూపాయలు ప్రకటించిందని ఓ ప్రచారం జరగ్గా.. కాసేపటికే అతి ఉత్తదని చంద్రబాబు ప్రకటనతో తేలిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి రూ.3,448 కోట్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు కేటాయిస్తున్నట్టు ఒక ప్రచారం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర బృందాలతో పాటు పర్యటించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ ఈ మేరకు ప్రకటన చేశారన్నది ఆ ప్రచారసారాంశం. అయితే..ఒకవైపు.. కేంద్రం ఆ సాయాన్ని విడుదల చేసిందంటూ తన ఎక్స్ ఖాతాలో ఏకంగా ఓ పోస్ట్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. త్వరగతిన సాయం విడుదల చేసినందుకుగానూ ఏపీ ప్రజల తరఫున నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారామె. మరోవైపు.. ఏపీ తెలంగాణకు తక్షణ సహాయం కింద ఎస్డీఆర్ఎఫ్ నుంచి 3,448 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నామని, ఈ నిధులలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుందని, తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని, వరద నష్టం పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారని శివరాజ్ సింగ్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది. అయితే కాసేపటికే అది ఉత్తప్రచారం అని తేలింది.కేంద్రం ఇంకా సాయం ప్రకటించలేదు. అదంతా రూమర్ మాత్రమే. అసలు ఇంకా నష్టంపై నివేదికను కేంద్రానికి పంపనే లేదు. రేపు(శనివారం) ఆ రిపోర్టును పంపుతాం అని స్పష్టత ఇచ్చారు చంద్రబాబు. అధికారులపై మళ్లీ చిందులువరద బాధితులకు రేషన్ పంపిణీ విషయంలో సీఎం చంద్రబాబు.. మరోసారి అధికారులపై చిందులు తొక్కారు. ‘‘ఎక్కువ వాహనాలు పెట్టారు. మా వాళ్ళు పద్ధతి లేకుండా చేశారు.ప్యాకింగ్ కూడా సక్రమంగా చెయ్యలేదు. ఈరోజు రేషన్ పంపిణీ చేయలేకపోయాం అని యంత్రాంగంపై ఆక్రోశం ప్రదర్శించారు. ఇవాళ 80 వేలు కుటుంబాలకు ఇవ్వాలి అనుకున్నాం. ఈరోజు కేవలం 15 వేలు కుటుంబాలకే ఇచ్చాం. రేపు మరో 40 వేల కుటుంబాలకు అందించే ప్రయత్నం చేస్తాం. ఎల్లుండి నుండి సరుకులను రేషన్ షాపుల్లో మాత్రమే పంపిణీ చేస్తాం అని చంద్రబాబు వెల్లడించారు. -
స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్పై దాడి కేసులో ప్రధాననిందితుడైన బిభవ్కుమార్కు కోర్టు 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు బిభవ్కుమార్ను రిమాండ్కు తరలించారు. ఇటీవల తమ పార్టీ అధినేత కేజ్రీవాల్ను కలిసేందుకు సీఎం నివాసానికి వెళ్లినపుడు తనపై దాడి జరిగిందని స్వాతిమలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కుమార్ తనను కింద పడేసి తన్నారని ఫిర్యాదులో తెలిపారు. ఢిల్లీలో లోక్సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మలివాల్పై దాడి ఘటనపై రాజకీయ దుమారం పెద్దదవుతూనే ఉంది. -
Bihar: ఎన్నికల వేళ ఈడీ దూకుడు.. లాలూ సన్నిహితుడి అరెస్టు
పాట్నా: లోక్సభ ఎన్నికల వేళ బిహార్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు ప్రదర్శిస్తోంది. ఆర్జేడీ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్య అనుచరుడు, ఇసుక మైనింగ్ వ్యాపారి సుభాష్యాదవ్ను ఈడీ శనివారం(మార్చ్ 9) రాత్రి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ కేసులో శనివారం తెల్లవారుజాము నుంచే సుభాష్యాదవ్కు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లో మొత్తం ఆరు చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు జరిపింది. ఈ సోదాలు ముగిసిన తర్వాత సుభాష్యాదవ్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సోదాల్లో రూ.2.30కోట్ల నగదుతో పాటు పలు డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇసుక అక్రమ మైనింగ్, అమ్మకాల ద్వారా రూ.161 కోట్లు ఆర్జించినట్లు సుభాష్యాదవ్కు చెందిన కంపెనీపై గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఈడీ అరెస్టు చేసింది. కాగా, 2019లోక్సభ ఎన్నికల్లో సుభాష్ యాదవ్ ఆర్జేడీ టికెట్పై జార్ఖండ్లోని ఛాత్రా లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. పాట్నాలోని గాంధీమైదాన్లో మార్చి 3న జరిగిన మహాబంధన్ జనవిశ్వాస్ మహా ర్యాలీలో సుభాష్ యాదవ్ చురుగ్గా పాల్గొన్నారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి భారీ స్పందన రావడం గమనార్హం. రాష్ట్రంలో ఇటీవలే ఆర్జేడీతో సంకీర్ణాన్ని వీడిన సీఎం నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ బీజేపీతో జట్టుకట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో ఆర్జేడీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో ఆర్జేడీ నేతలపై ఈడీదాడులు చరచర్చనీయాంశమయ్యాయి. ఇదీ చదవండి.. యూపీలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి -
ఉక్రెయిన్కు ఈయూ భారీ సాయం
బ్రస్సెల్స్: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్కు సాయం చేసేందుకు యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉంటుందని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైకేల్ చెప్పారు. గురువారం బ్రస్సెల్స్లో సమావేశమైన ఈయూలోని 27 సభ్య దేశాల నేతలు ఉక్రెయిన్కు 54 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.48 లక్షల కోట్లు)సాయం ప్యాకేజీని అందించేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన తీర్మానంపై కేవలం గంటలోపే చర్చించి ఆమోదించినట్లు వివరించారు. సాయానికి సంబంధించిన తీర్మానాన్ని వీటో చేస్తామంటూ సభ్య దేశం హంగెరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్ కొంతకాలం చేస్తున్న హెచ్చరికలను కూడా పట్టించుకోలేదన్నారు. -
పాలస్తీనాకు భారత్ రెండోదఫా మానవతా సాయం
ఢిల్లీ: యుద్ధంతో అతలాకుతలం అవుతున్న పాలస్తీనాకు భారత్ రెండోసారి మానవతా సహాయాన్ని అందించింది. ఈజిప్టులోని ఎల్-అరిష్ ఎయిర్పోర్ట్కు 32 టన్నుల సాయంతో రెండో ఇండియన్ ఎయిర్ఫోర్స్ సి17 విమానం బయలుదేరింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. పాలస్తీనాకు కావాల్సిన అన్ని రకాల మానవతా సహయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. భారతదేశం అక్టోబర్ 22న పాలస్తీనాకు వైద్య, విపత్తు సహాయాన్ని మొదటిసారి పంపించింది. గాజా స్ట్రిప్కు చేరుకోవడానికి చేరుకోవడానికి అల్-అరిష్ ఎయిర్పోర్టు అతి దగ్గరగా ఉంటుంది. ఇది రఫా బార్డర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో ప్రస్తుతం రఫా సరిహద్దు సమీపంలో పరిస్థితులు భీకరంగా తయారయ్యాయి. నిత్యం బాంబుల మోతతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం అయింది. హమాస్ అంతమే ధ్యేయంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. రాకెట్ దాడుల అనంతరం భూతల యుద్ధం చేపట్టింది. హమాస్ మూకలను మట్టికరిపిస్తూ ఇప్పటికే ఉత్తర గాజాను ఆక్రమించింది. అటు దక్షిణ గాజాను కూడా ఖాలీ చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు చేసింది. అటు అల్-షిఫా ఆస్పత్రిని రక్షణ కవచంగా హమాస్ మూకలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపిస్తూ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు 1,200 మంది మరణించగా.. పాలస్తీనా వైపు 12,500 మంది మరణించారు. ఇందులో 5,000 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇదీ చదవండి: దక్షిణ గాజాను వీడండి.. పాలస్తీనాకు ఇజ్రాయెల్ హెచ్చరికలు -
ఈజిప్ట్ గ్రీన్సిగ్నల్ .. గాజాకి అందనున్న మానవతా సాయం
గాజా ప్రాంతమంతా ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైంది. వందల మంది ప్రాణాలు కోల్పోగా.. ఆవాసాలు కోల్పోయి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న వాళ్లు లక్షల్లోనే ఉన్నారు. ఆకలితో అలమటిస్తూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మానవతా సాయం అందించేందుకు ఈజిప్ట్ అంగీకరించింది. ఇజ్రాయెల్కి తాజా పర్యటనలో గాజాకి రూ. 832 కోట్ల సాయం ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అయితే, ఈ సాయం గాజాలోకి ప్రవేశించాలంటే గాజా-ఈజిప్ట్ సరిహద్దులోని రఫా క్రాసింగ్ దాటాల్సి ఉంటుంది. ఇప్పటికే మానవతా సాయం కింద సామగ్రితో కూడిన వందలాది ట్రక్కులు రఫా సరిహద్దు వద్ద బారులుతీరి ఉన్నాయి. కానీ, భద్రతా కారణాలను చూపిస్తూ ఈజిప్ట్ ఈ మార్గాన్ని మూసివేసింది. గాజా ప్రజలు తమ దేశంలోకి ప్రవేశించి స్థిరపడే అవకాశముందని, అలాగే ఉగ్రవాదులు తమ దేశంలోకి చొరబడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో బైడెన్.. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి Abdel Fattah El Sisi తో చర్చించి రఫా బార్డర్ క్రాసింగ్ తెరిపించేందుకు ఒప్పించారు. అయితే గాజాకు సాయం చేయడానికి మార్గం సుగమమైనప్పటికీ.. అది పరిమితంగానే ఉంటుందని ఈజిప్ట్ చెబుతోంది. పైగా హమాస్ దాడుల్లో రోడ్లు దెబ్బ తినడంతో.. వాటి పునరుద్ధరణకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అదే సమయంలో మరిన్ని దాడులు జరగవచ్చనే ఆందోళనను వ్యక్తం చేసింది. దీంతో శుక్రవారం నుంచి సాయం అందించేందుకు అనుమతిస్తామని ఈజిప్ట్ తెలిపింది. ఇదే విషయంపై జో బైడెన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈజిప్ట్ అధ్యక్షుడితో మాట్లాడాను. రఫా బార్డర్ తెరిచి మానవతా సాయం కింద ఇచ్చే సామగ్రితో కూడిన దాదాపు 20 ట్రక్కులను గాజాలోకి పంపించడానికి ఒప్పుకొన్నారు’’అని తెలిపారు. మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌజ్ ప్రకటన ప్రకారం.. ‘‘గాజాకు మానవతా సాయం చేయడం కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసితో చర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు ఇరు దేశాలు గాజాకు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. అమెరికా, ఈజిప్ట్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ఇరుదేశాల అధినేతలు కట్టుబడి ఉన్నారు’’ అని పేర్కొంది. క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి -
సీఎం జగన్ మానవత్వం.. చిన్నారి వైద్యానికి రూ.41.5 లక్షల సాయం
అమలాపురం రూరల్: బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారి ప్రాణాన్ని కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. ఆమె వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక పలివెల బ్లెస్సీ కొన్నాళ్లుగా తలనొప్పితో బాధపడుతోంది. తల్లిదండ్రులు వైద్యులకు చూపించగా.. బ్రెయిన్ క్యాన్సర్గా వైద్యులు నిర్ధారించారు. చికిత్సకు రూ.41.50 లక్షలు అవుతుందని చెప్పారు. బిడ్డకు చికిత్స చేయించే స్తోమత లేకపోవడంతో తండ్రి రాంబాబు తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11న అమలాపురం పర్యటనకు వచ్చిన సీఎం జగన్ దృష్టికి తన బిడ్డ సమస్యను రాంబాబు.. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ద్వారా తీసుకువెళ్లారు. ఆ చిన్నారి సమస్య విని చలించిపోయిన సీఎం జగన్ రూ.41.50 లక్షలు మంజూరు చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి విశ్వరూప్ భార్య బేబీమీనాక్షి, కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ సోమవారం ఆ కుటుంబానికి అందజేశారు. చదవండి: దమ్ము లేకనే.. దత్తపుత్రుడు -
అమెరికా కంపెనీలకు మహీంద్రా సాయం
న్యూఢిల్లీ: వాహన రంగంలో ఉన్న కంపెనీలకు సాయం చేసేందుకు మహీంద్రా గ్రూప్ ఒక ప్రత్యేక వేదికను యూఎస్లో ఏర్పాటు చేసింది. యూఎస్ కంపెనీలు భారత్లో తయారీని విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈవో అనీష్ షా సోమవారం తెలిపారు. నియంత్రణ, విధానపర అంశాల్లో తమకు అపార అనుభవం ఉందని ఆయన చెప్పారు. అమెరికన్ కంపెనీలు భారత్లో తయారీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు.. సంస్థకు చెందిన నిపుణుల బృందం తయారీ మౌలిక వసతులు, సరఫరా వ్యవస్థ, సాంకేతిక వంటి అంశాల్లో తమ నైపుణ్యాన్ని అందజేస్తారని మహీంద్రా వెల్లడించింది. -
అమెరికా సాయం పొందిన దక్షిణ కొరియా ఏ స్థాయికి చేరింది?
పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం అక్కడ చదువుకున్న యువతను నేడు ఉపాధి కోసం విదేశాలకు వలసపోయేలా చేస్తోంది. మెరుగైన జీవనశైలి, మరింత నాణ్యత గల ఉన్నత విద్య కోసం భారతదేశం నుంచి యువతీ యువకులు అమెరికా, ఐరోపా తదితర పారిశ్రామిక దేశాలకు వెళుతున్నారు గాని స్వదేశంలో అవకాశాలు లేకకాదు. ఉద్యోగాలు లేక కాదు. 1971లో బంగ్లాదేశ్ అవతరణకు దారితీసిన భారత-పాకిస్తాన్ యుద్ధ సమయంలో పాకిస్తానీయులు ఏ స్థాయిలో విదేశాలకు తరలిపోయారో ఇప్పుడు అంత కన్నా ఎక్కువ మంది ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్లిపోతున్నారు. 2022లో పాక్ నుంచి చదువుకున్న యువత 8,32,339 మంది విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించి వెళ్లిపోయారు. 2021తో పోల్చితే పాక్ నుంచి చదువుకున్నవారి వలస 189 శాతం పెరిగింది. 2023 మొదటి ఐదు నెలల్లో ఇలా ఇతర దేశాల్లో ఉపాధి కోసం వలసపోయినవారి సంఖ్య 3,15,787కు చేరుకుందని వలసలు, ఇతర దేశాల్లో ఉపాధి బ్యూరో (బీఈఓఈ) వెల్లడించింది. పాక్ అంతర్గత సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రతిభాపాటవాలున్న విద్యావంతులైన యువకులు విదేశాలకు వలసపోవడం ఎప్పటి నుంచో సాగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో అక్కడ ఉత్పత్తి, సేవల కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయి స్థూల దేశీయ ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. మరో పక్క పాక్ మాదిరిగానే కొన్ని దశాబ్దాలు సైనిక పాలనలో మగ్గిన దక్షిణ కొరియా గత 30 ఏళ్లలో అనూహ్య పారిశ్రామిక ప్రగతి సాధించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే వరకూ జపాన్ పాలనలో మగ్గిన దక్షిణ కొరియా దేశ విభజనతో మరింత కుంగిపోయింది. అయితే, మహాయుద్ధంలో జపాన్ ను ఓడించిన అమెరికా దక్షిణ కొరియా ప్రగతి బాధ్యత తీసుకుంది. సైనిక నియంతల పాలనలో ఉన్న ఈ ఆసియా దేశానికి అన్ని విధాలా ఈ అగ్రరాజ్యం సాయపడింది. కోట్లాది డాలర్ల ఆర్థిక సాయంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం అందించింది. రెండు దేశాలకూ అమెరికా డాలర్లు అందినా ప్రజాస్వామ్యం, ప్రగతి కనపడని పాక్! ఈ క్రమంలో 1990ల నాటికి సైనిక పాలనకు తెరపడి దక్షిణ కొరియాలో ప్రజాస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకోవడం మొదలైంది. 21 శతాబ్దం ఆరంభ సమయానికి శాంసంగ్, హ్యుందయ్, ఎల్జీ, కియా, పోస్కో వంటి అనేక అంతర్జాతీయ ప్రసిద్ధిపొందిన బ్రాండ్లతో ప్రపంచీకరణలో కీలక పాత్ర పోషించే స్థాయికి దక్షిణ కొరియా చేరుకుంది. పైన వివరించిన పాకిస్తాన్ కూడా తన భౌగోళిక స్థితిగతుల కారణంగా మొదటి నుంచీ పాశ్చాత్య దేశాల నుంచి భారీ స్థాయిలో సాయం పొందింది. ఇంకా పొందుతూనే ఉంది. అప్పట్లో పూర్వపు సోవియెట్ యూనియన్ ఉనికి కారణంగా దాన్ని తట్టుకోవడానికి పాకిస్తాన్ ను అమెరికా తన సైనిక అవసరాలకు వీలుగా మలుచుకుంది. అత్యధిక కాలం సైనిక పాలనలో కునారిల్లిన పాక్ ప్రభుత్వాలకు ఆర్థిక సాయంతోపాటు అత్యంత ఆధునిక ఆయుధాలు కూడా సమకూర్చింది అమెరికా. అయితే, పాక్ పాలకులు అమెరికా సాయాన్ని తమ దేశ పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగించు కోలేకపోయారు. ఆర్థికాభివృద్ధితోపాటు ప్రజాస్వామ్య పంథాలో పయనించిన దక్షిణ కొరియా తరహాలో పాకిస్తాన్ ను అక్కడి పాలకులు నడిపించలేకపోవడం పాక్ ప్రజల దురదృష్టం. పాకిస్తాన్ లో మాదిరిగా సైనిక పాలన కొనసాగిన దేశమైనా దక్షిణ కొరియా ఆర్థికరంగంలో వినూత్న విజయాలు సాధించింది. టెక్నాలజీ రంగంలో కొత్తపుంతలు తొక్కింది. ఏభయి సంవత్సరాల క్రితమే భూసంస్కరణలు అమలు చేయడం ద్వారా దేశంలో పారిశ్రామికీకరణకు మార్గం సుగమం చేసింది దక్షిణ కొరియా. అమెరికా ఆర్థిక సాయాన్ని ఉన్నత విద్యకు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి చక్కగా వాడుకున్నారు దక్షిణ కొరియా పాలకులు. చాలా కాలం సాగిన సైనిక పాలన, ప్రజాస్వామ్యం బలహీనంగా ఉండడం పాకిస్తానీయులకు శాపాలుగా మారాయి. జనాభాలో, వైశాల్యంలో బాగా చిన్నదైన దాయాది దేశం పాకిస్తాన్ ఇలా ఎదుగూబొదుగూ లేకుండా విఫలరాజ్యంగా మారడం భారతదేశానికి ఏమాత్రం వాంఛనీయ పరిణామం కాదు. తన సైజుకు మించి అతిపెద్ద సైన్యం ఉన్న పొరుగుదేశంలో సుస్థిరతనే ఇండియా ఎప్పుడూ కోరుకుంటుంది. విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ, రాజ్యసభ సభ్యులు -
జగన్ దూకుడు.. పచ్చ బ్యాచ్కి కడుపులో మంట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అరుదైన ఘనత సాధించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన పోలవరం ప్రాజెక్టుకు ఒకేసారి 12, 911 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడానికి కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి కేంద్రమంత్రి వర్గం ఆమోదించడమే తరువాయి. కొద్ది కాలం క్రితం జగన్ ప్రధాని మోదీని, ఆర్దిక మంత్రి నిర్మల సీతారామన్ లను కలిసి పోలవరం నిధులు గురించి చర్చించారు. ఒకేసారి అడ్ హాక్ గా పదివేల కోట్లు ఇస్తే ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకు వెళ్లవచ్చని ఆయన వివరించారు. దీనిపై కేంద్ర పెద్దలు కూడా ఆలోచన చేసి, జగన్ ప్రతిపాదనకు ఓకే చేశారు. ఇందుకు జగన్ తో పాటు ,మోదీని, నిర్మలా సీతారామన్ ను అభినందించాలి. ✍️ వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఈసారికే పూర్తి కావల్సి ఉంది. కానీ.. వివిధ కారణాల వల్ల జాప్యం అవుతూ వస్తోంది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఇది పూర్తిగా కేంద్ర ప్రాజెక్టు. కానీ, గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను వదలుకోవడానికి సిద్దపడి, ప్యాకేజీకి అంగీకరించారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి ఇవ్వాలని కోరగా కేంద్రం అంగీకరించింది. అదే ప్రమాదంగా మారింది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి, సంబంధిత బిల్లులను పోలవరం ప్రాజెక్టు అధారిటీ ద్వారా కేంద్రానికి పంపి వసూలు చేసుకోవలసి ఉంటుంది. దీనివల్ల రాష్ట్రంపై ఒత్తిడితో పాటు ,కేంద్రం వేసే కొర్రీల వల్ల సమస్యలు వచ్చేవి. తానైతేనే ప్రాజెక్టును నిర్మించగలుగుతానని కేంద్రం భావించిందని చంద్రబాబు గొప్పలు చెప్పేవారు. ఆ తర్వాత అంతవరకు ఉన్న కాంట్రాక్టర్ టాల్ స్ట్రాయును మార్చి నవయుగ కు అప్పగించారు. తదుపరి పలు కాంట్రాక్టు పనులను తమకు కావల్సినవారికి అప్పగించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ✍️ ఇక పోలవరం ప్రాజెక్టులో ఏ చిన్నపరిణామం జరిగినా శంకుస్థాపన, ప్రారంభోత్సవం అంటూ హడావుడి చేసేవారు. నిజానికి 2014 లో ఎన్నికలు పూర్తి అయి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టును చేపట్టి ఉంటే ఈపాటికి పూర్తి అయిపోయి ఉండేదేమో!. కానీ చంద్రబాబు ఈ ప్రాజెక్టుకన్నా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై అధిక శ్రద్ద పెట్టారు. పోలవరం ప్రాజెక్టుపై ఆ నిధులు వ్యయం చేసి ఉంటే బాగుండేది. కానీ, ఆయన లక్ష్యం వేరు. చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపై ఉన్ననమ్మకం తక్కువే. అవి అయితే సత్వరమే పూర్తి కావని , ఎన్నికల టైమ్ లో ఉపయోగం ఉండదని ఆయన భావించేవారు. తర్వాత కాలంలో ఆయన మాట మార్చి పోలవరం తన కల అని కొత్త పాట పాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుపై పూర్తి దృష్టి పెట్టారు. ఆయన చేసిన కృషి వల్లే ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు ఒక రూపానికి వచ్చిందన్నది పచ్చి వాస్తవం. ✍️ 2019లో వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ అధికారంలోకి రావడంతో ఆయనకు ఈ ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం వచ్చింది. మధ్యలో రెండేళ్ల కరోనా సంక్షోభం, తదుపరి వరదలు, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో తీసుకోవలసిన జాగ్రత్తలపై నిర్ణయాలకు టైమ్ పట్టడం వంటి కారణాల వల్ల ఈ ప్రాజెక్టు మరికాస్త ఆలస్యం అయింది. స్పిల్ వే, ఎగువ,దిగువ కాఫర్ డామ్ నిర్మాణాలు పూర్తి కావడంతో , ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డామ్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఏడాదిలోగా ఇది తొలి దశను పూర్తి చేసుకుని 41.5 మీటర్ల లెవెల్ లో నీటిని నిల్వచేసుకోవడానికి అవకాశం వస్తుంది. ప్రస్తుతం అన్ని విఘ్నాలు అధిగమించి ప్రాజెక్టు పురోగమించే ఆశాభావ వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పోలవరం వెళ్లి అన్ని పరిస్థితులను స్టడీ చేసి వచ్చారు. ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడానికి అవసరమైన చర్యలపై ఆదేశాలు ఇచ్చారు. ✍️ ఇక అసలు విషయానికొస్తే.. కేంద్రం ఇలా ఒకేసారి 13 వేల కోట్ల రూపాయలు ఇస్తుందని ప్రతిపక్ష తెలుగుదేశం కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా సంస్థలు కాని ఊహించి ఉండరు. ఇప్పటికే పదివేల కోట్ల రూపాయల మేర రెవెన్యూలోటు కింద ఆర్దిక సాయం సాధించిన జగన్ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు ఈ స్థాయిలో నిధులు తీసుకురావడం వారికి అర్దంకాని పరిస్థితిగా మారింది. చంద్రబాబు అప్పట్లో నిత్యం కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని, రాష్ట్రం ఆర్ధిక కష్టాలలో ఉందని చెబుతుండేవారు. కేంద్రం ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని, తానే శ్రమిస్తున్నానని కలరింగ్ ఇచ్చేవారు. అదే జగన్ అయితే ఈ నాలుగేళ్లలో ఎన్నడూ రాష్ట్రం ఆర్దిక సమస్యలలో ఉందని , అందువల్ల తాను అది చేయలేకపోతున్నా..ఇది చేయలేకపోతున్నా.. అన్నమాటలే చెప్పకుండా తన ప్రణాళిక ప్రకారం పనులు చేసుకుపోతున్నారు. ప్రతి దానికి కేంద్రంపై విమర్శలు చేయకుండా.. వారిని ఒప్పించి పనులు చేసుకుంటూ వస్తున్నారు సీఎం జగన్. ఈ క్రమంలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కూడా తగు భూమిక పోషిస్తున్నారు. ఈ నేపధ్యంలో దీనిని చెడగొట్టడానికి , ఈ ఆర్దిక సాయం పై కూడా వ్యతిరేక కధనాలు రాయడానికి టీడీపీ పత్రికలు వెనుకాడకపోవడం దురదృష్టకరం. ✍️ కేంద్ర ఉత్తర్వులలో తొలి దశ అని పేర్కొనలేదని, 41.5 మీటర్ల వద్దే ప్రాజెక్టు నిలిపివేస్తారేమోనన్న అనుమానం కలిగేలా ఈనాడు కధనం ఇస్తే, పోలవరానికి 12 వేల కోట్లే అంటూ ఆంధ్రజ్యోతి వార్త ఇచ్చింది. వారు ఎక్కడ జగన్ ఈ నిధులను సాధించారని , అది గొప్ప విషయమని రాయని జర్నలిజం వారిది. పైగా స్ట్రక్చర్ తో సంబంధం లేని కట్టకు ఏదో చిన్నసమస్య వచ్చింది. గైడ్ వాల్ అనే కట్టడం కొంచెం కుంగిందనే కథనాలు ఇచ్చాయి. ఆ వార్త ఇవ్వడం తప్పుకాదు. కానీ.. అదేదో ప్రాజెక్టు దెబ్బతినిపోయిందేమో అన్న భావన పాఠకులలో కలిగించేలా బ్యానర్ కధనం ఇచ్చారు. ✍️ పోలవరం సందర్శనలో జగన్ కూడా దీని గురించి ప్రస్తావించి చిన్న సమస్యను బూతద్దంలో చూపుతున్నారని అన్నారు. అదే డయాఫ్రమ్ వాల్ కూలిన విషయంలో మాత్రం కాఫర్ డామ్ లో గ్యాప్ లు ఉంచిన గత ప్రభుత్వ నిర్వాకం అని రాయలేదు. దానిని కూడా జగన్ ప్రభుత్వానికి అంటకట్టే యత్నం చేశారు. ఇప్పుడు వారికి అసలు కడుపు నొప్పి వచ్చి ఉండాలి. జగన్ కోరిన వెంటనే ప్రధాని మోదీ పోలవరం ప్రాజెక్టుకు పదమూడు వేల కోట్లు ఇవ్వడం వారికి షాకింగ్ గా ఉంటుంది.అందుకే ఇక ఎన్ని వ్యతిరేక కథనాలు రాస్తారో చూడాల్సి ఉంది. కేంద్రం ఇచ్చిన నిధులు ఫలానా పనికే ఖర్చు చేయాలని నిబంధన పెట్టకుండా ఎక్కడ అవసరమైతే అక్కడ వెచ్చించడానికి వీలుగా కేంద్రం ఆదేశాలు ఇవ్వడం మరింత వెసులుబాటు వస్తుంది. ఈ ఏడాది కాలం చాలా క్రూషియల్ అని చెప్పాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 41.15 మీటర్ల లెవెల్ లో నీటిని నిలబెట్టగలిగితే గొప్ప విషయమే అవుతుంది. ఆ స్థాయి వరకు పునరావాస చర్యలకు కూడా ప్రభుత్వం పూనుకుంటుంది. తదుపరి క్రమేపీ నీటి మట్టం పెంచుకుంటూ వెళతామని ప్రభుత్వం చెబుతున్నా, ఎల్లో మీడియా మాత్రం అది జరగదేమో అన్న అనుమానం కలిగించాలని యత్నించింది. ✍️ కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తను అధికారంలో ఉంటే పోలవరం పూర్తి అయ్యేదని డాంబికంగా చెప్పారు.2018 నాటికే పూర్తి అవుతుందని అధికారంలో ఉన్నప్పుడు అనేవారు. మరి ఏమైంది! ఆయన హయాంలో ఎన్నడైనా ఈ స్థాయిలో నిధులు వచ్చాయా?కరోనా, వరదలు వంటివాటిని కూడా ఆపి ఆయన ప్రాజెక్టు పూర్తి చేసేవారా? కబుర్లు చెప్పడం తేలిక. పని జరిగినా, జరగకపోయినా జయము,జయము చంద్రన్న అంటూ పాటలు పాడించుకోవడం అలవాటైతే ఇలాగే మాట్లాడతారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాజెక్టు తొలి దశను విజయవంతంగా పూర్తి చేసి,తనకు, ఈ ప్రాజెక్టు కోసం విశేష కృషి చేసిన తన తండ్రి రాజశేఖరరెడ్డికి మంచి పేరు తెస్తారని ఆశిద్దాం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
మామిడి రైతుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అకాల వర్షం, ఈదురు గాలులకు నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అకాల వర్షాలు, ఈదురు గాలులకు రాలిపోయిన, దెబ్బతిన్న మామిడి కాయలను కొని, వాటి నుంచి పౌడర్ తయారు చేసే సరికొత్త మామిడి ప్రాసెసింగ్ యూనిట్కు శ్రీకారం చుట్టింది. అది కూడా స్థానికంగా ఉండే మహిళా రైతులను యజమానులుగా మార్చి వారి భాగస్వామ్యంతోనే మామిడి పౌడర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయిస్తోంది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనిట్లో వెయ్యి మంది మహిళలు రూ. 50 లక్షల భాగస్వామ్యం కలిగి ఉంటారు. మిగిలిన రూ.4.50 కోట్లు సబ్సిడీగా లభిస్తుంది. ఏలూరు జిల్లా నూజివీడులోని మార్కెట్ యార్డులో ఈ పరిశ్రమ ఏర్పాటు కానుంది. నూజివీడు మామిడికి ప్రసిద్ధి. ఏలూరు, కృష్ణా జిల్లాల్లో 1.40 లక్షల ఎకరాల్లో ఈ రకం మామిడి సాగవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది మామిడికి మంచి ధర ఉన్నప్పటికీ అకాల వర్షాలకు కాయకు మంగు రావడం, మచ్చలు ఉండటం, ఇతర కారణాలతో మార్కెట్ పూర్తిగా పతనమైంది. ప్రధానంగా నూజివీడులో పెద్ద రసాలు, చిన రసాలు, జలాలు, సువర్ణరేఖ, హిమామ్పసంగ్, బంగినపల్లి, తొతాపూరి తదితర వెరైటీలు సాగవుతుంటాయి. అయితే ఎక్కువగా తొతాపూరి, చిన్న రసాలు, పెద్ద రసాలు 90 శాతం మార్కెట్లో ఉంటాయి. ఈ ఏడాది అకాల వర్షాలు, ఈదురు గాలలకు కాయ రాలిపోవడంతో మామిడి రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. వీటికి పరిష్కారం చూపే విధంగా పంటకు మంచి ధర ఉండేలా స్ధానికంగా మార్కెట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూజివీడు మార్కెట్ యార్డ్లో ఎకరం విస్తీర్ణంలో మామిడి ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుజ్జు (పల్ప్) సేకరించే యూనిట్ కాకుండా పచ్చడి మామిడికాయ నుంచి పౌడర్ తీసే యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. స్థానికంగా వెయ్యి మంది మహిళా రైతులను గుర్తించి ఇప్పటికే వారితో ఒక సమాఖ్య రిజి్రస్టేషన్ చేయించారు. ఒక్కొక్కరు రూ. 5 వేల మూలనిధితో రూ. 50 లక్షలు సమకూర్చుకోగా మిగిలిన రూ. 4.50 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డులో స్ధలం కేటాయించింది. పథకం అమలు కోసం జిల్లా కలెక్టర్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. మరో నెల రోజుల్లో ప్రభుత్వ ఆమోదముద్రతో పనులు ప్రారంభమై మూడు నెలల్లో ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం కానుంది. డీఆర్డీఏ నేతృత్వంలో మహిళా సమాఖ్య దీన్ని నిర్వహించనుంది. ప్రత్యేకంగా చెట్టు నుంచి కోసిన కాయలతో పాటు, రాలిపోయిన కాయలు, వర్షానికి దెబ్బతిన్న కాయలను కూడా సమాఖ్య మార్కెట్ ధరకు కొంటుంది. రైతుకు వెంటనే డబ్బు చెల్లిస్తుంది. కాయల నుంచి మామిడి పౌడర్ను తయారు చేసి క్యాండీ, జెల్లీలు తయారు చేసే పరిశ్రమలకు విక్రయించేలా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొదటి ప్రాసెసింగ్ యూనిట్ రాష్ట్రంలోనే మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మొట్టమొదటి మ్యాంగో పౌడర్ యూనిట్ ఇది. నూజివీడులోని మార్కెట్ యార్డులో ఎకరం స్ధలంలో రూ. 5 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం. నూజివీడులో 12 వేల ఎకరాలు, ఆగిరిపల్లిలో 20 వేల ఎకరాల్లో మొత్తంగా 32 ఎకరాల్లో రైతులకు ప్రాసెసింగ్ యూనిట్ ఉపయుక్తంగా ఉంటుంది. మహిళలే యజమానులుగా దీన్ని డీఆర్డీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. – ప్రసన్న వెంకటేష్, జిల్లా కలెక్టర్, ఏలూరు చదవండి: బాలికను కాపాడిన ‘దిశ’ -
పాక్, చైనాలకు విదేశీ సాయం కట్ చేస్తా
రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష బరిలోకి దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాను అదికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటుందో చెబుతూ.. ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే నిక్కీ అమెరికా విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే పాక్, చైనాతో పాటు అమెరికాను ద్వేషించే శత్రు దేశాలకు విదేశీ సాయంలో కోత విధిస్తానని చెప్పారు. గర్వించదగ్గ అమెరికా ఎప్పుడూ ప్రజల సొమ్మును వృధా చేయదన్నారు. అమెరికా గతేడాది విదేశీ సహాయం కోసం 46 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అది ఇతర దేశాల కన్నా ఎక్కువ అని కూడా చెప్పారు. అంతేగాదు ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో పన్ను చెల్లింపుదారులు తెలుసుకునే హక్కు ఉందన్నారు. వాస్తవానికి ఆ సొమ్ము అంతా అమెరికాను వ్యతిరేకించే దేశాలకు నిధులు సమీకరించడానికి వెళ్తుందని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. తాను అధికారంలో ఉంటే మాత్రం అమెరికా విరోధులకు అందించే సాయంలోని ప్రతి పైసాలో కోత విధిస్తానని కరాకండీగా చెప్పారు. బైడెన్ ప్రభుత్వం పాక్కి మళ్లీ సైనిక సాయాన్ని ప్రారంభించిందన్నారు. ఉగ్రవాదులకు నిలయమైన ఆ దేశ ప్రభుత్వం అమెరికాను వ్యతిరేకించే చైనాకు లోబడి ఉంది. అంతేగాదు పాలస్తీనా ప్రజల కోసం అని అమెరికా యూఎన్ అవినీతి ఏజెన్సీని అర బిలియన్ డాలర్లతో పునురుద్ధరించిందన్నారు. అలాగే ఇరాన్కి యూఎస్ సుమారు రెండు బిలయన్ డాలర్లు సాయం అందిస్తే..అది యూఎస్ దళాలపైనే దాడులకు దిగింది. అంతేగాదు యూఎన్లో అమెరికాకు అత్యంత వ్యతిరేకంగా ఓటింగ్ వేసే దేశాల్లో ఒకటైన జింబాబ్వేకు కూడా వందల బిలయన్ డాలర్లు అందించింది. అత్యంత హాస్యాస్పదమైన విషయమేమిటంటే. .చైనా నుంచి అమెరికాకు తీవ్ర స్థాయిలో ముప్పు ఉన్నప్పటికీ పర్వావరణ కార్యక్రమాల పేరుతో చైనాకు డాలర్లు అందిస్తోంది. అంతేగాదు రష్యన్ నియంత వ్లాదిమర్ పుతిన్ అత్యంత సన్నిహితమైన బెలారస్కి కూడా సాయం అందించాం. అలాగే క్యూబాకి కూడా సాయం అందించాం. " అంటూ విరుచుకుపడ్డారు నిక్కీ హేలీ. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. కేవలం అధ్యక్షుడు జో బైడెన మాత్రమే కాదు ఇరు పార్టీల అధ్యక్షులు దశాబ్దాలుగా విదేశీ సాయం విషయంలో ఇలాగే కొనసాగారు. వారంతా మా సహాయన్ని స్వీకరించే దేశాల ప్రవర్తనను పరిగణలోకి తీసుకోలేదన్నారు. తాను అధికారంలోకి వస్తే అమెరికా వ్యతిరేక దేశాలకు సాయం చేసి డాలర్లను వృధా చేయనని చెప్పారు. మన ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును అలాంటి దేశాలకు నిధులుగా అందించేదే లేదని తెగేసి చెప్పారు నిక్కీ హేలీ. (చదవండి: పాపం శ్రీలంక.. తిందామంటే జనాలకు తిండి లేదు.. ఇక ఎన్నికలు ఎలా?) -
బుద్ధిమారని పాక్.. టర్కీకి భారత్ సాయం అందకుండా మోకాలడ్డు!
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. భూకంపంతో విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న టర్కీకి సాయం అందించేందుకు వెళ్తున్న భారత యుద్ధ విమానాలు తమ గగనతలం మీద నుంచి వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో భారత సీ-17 యుద్ధ విమానం వెనక్కి వచ్చి వేరే దేశం మీదుగా టర్కీకి చేరుకోవాల్సి వచ్చింది. ఈమేరకు భారత మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే భారత యుద్ధవిమానాలు అసలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లలేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమతులు కూడా పాకిస్తాన్ను భారత్ అడగలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. భారత్లోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ కూడా ఈ విషయంపై స్పందించారు. భారత యుద్ధవిమానాలు ఎగిరేందుకు పాకిస్తాన్ అనుమతి నిరాకరించిందనే విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. 2021లో కూడా అఫ్గానిస్తాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పుడు భారతీయులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొచ్చింది కేంద్రం. అప్పుడు కూడా మనం పాక్ గగనతలాన్ని వినియోగించుకోలేదు. మన విమానాలు అఫ్గాన్ నుంచి ఇరాన్ మీదుగా భారత్ చేరుకున్నాయి. రెండు యుద్ధవిమానాలు.. భూకంపం అనంతరం టర్కీకి భారత్ తనవంతు సాయం చేస్తోంది. ఇప్పటివరకు రెండు యుద్ధ విమానాల్లో సహాయక సిబ్బంది, పరికరాలు, ఔషధాలను పంపింది. మొదటి యుద్ధ విమానం సోమవారం రాత్రే టర్కీ చేరుకోగా.. రెండో యుద్ధ విమానం మంగళవారం వేకువజామున టర్కీకి వెళ్లింది. ఈ విమానాల్లో జాతీయ విపత్తు నిర్వహణ దళాలు, ప్రత్యేక శిక్షణ తీసుకున్న డాగ్ స్క్వాడ్లు, డ్రిల్లింగ్ మెషీన్లు, ఔషధాలు, పరికరాలు సహా ఇతర సామగ్రిని భారత్ టర్కీకి పంపింది. First Indian C17 flight with more than 50 @NDRFHQ Search & Rescue personnel, specially trained dog squads,drilling machines, relief material, medicines and other necessary utilities & equipment reaches Adana,Türkiye. Second plane getting ready for departure. @MevlutCavusoglu pic.twitter.com/sSjuRJJrIO — Dr. S. Jaishankar (@DrSJaishankar) February 7, 2023 చదవండి: భూకంపం తర్వాత టర్కీలో పరిస్థితి ఇదీ..! డ్రోన్ వీడియో వైరల్.. -
ఉక్రెయిన్కు చేసేది సాయం కాదు.. పెట్టుబడి..
వాషింగ్టన్: రష్యా తమపై దండయాత్ర చేపట్టిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. బుధవారం అమెరికా కాంగ్రెస్లో ప్రసంగించారు. అగ్రరాజ్యం తమ దేశానికి అందిస్తున్న భారీ సాయానికి కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఉక్రెయిన్కు అమెరికా అందిస్తుంది సాయం కాదని, ప్రాజాస్వామ్యం, అంతర్జాతీయ భద్రతకు అగ్రరాజ్యం పెడుతున్న పెట్టుబడి అని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. 2023లోనూ తమకు సాయాన్ని కొనసాగించారని కోరారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై అమెరికా విజయం సాధించినట్లు తాము కూడా వెనుకడుగు వేయకుండా రష్యాపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని జెలన్స్కీ స్పష్టం చేశారు. ఆయన ప్రసంగాన్ని అమెరికా కాంగ్రెస్ అభినందించింది. సభ్యలందరూ లేచి నిలబడి కరత్వాల ద్వనులతో జెలెన్స్కీ పోరాట స్ఫూర్తిని మెచ్చుకున్నారు. అగ్రరాజ్యం ఇప్పటికే ఉక్రెయిన్కు 50 బిలియన్ డాలర్లకుపైగా సాయం అందించింది. త్వరలో పేట్రియట్ మిసైల్స్ కూడా పంపిస్తామని హామీ ఇచ్చింది. అయితే అమెరికా అందిస్తున్న సాయాన్ని జెలెన్స్కీ పెట్టుబడి అనడం వెనుక కారణం లేకపోలేదు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి అమెరికా ప్రతినిధుల సభ రిపబ్లికన్ల చేతిలోకి వెళ్లనుంది. ఉక్రెయిన్కు భారీ ప్యాకీజీపై వారు సుముఖంగా లేరు. డెమొక్రాట్లు భారీ మొత్తాన్ని యుద్ధ సాయంగా సమకూర్చడంపై ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు దిగవ సభ వాళ్ల నియంత్రణలోకే వస్తుంది కనుక కచ్చితంగా ప్యాకీజీ బిల్లును అడ్డుకుంటారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లికన్ల మనసు మార్చే విధంగా జెలెన్స్కీ మాట్లాడారు. కాంగ్రెస్లో ప్రసంగించడానికి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో శ్వేతసౌధంలో భేటీ అయ్యారు జెలెన్స్కీ. ఇద్దరూ కలిసి ఓవల్ ఆఫీస్లో కన్పించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. చదవండి: వరదలో చిక్కుకున్న పిల్లలు.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరో.. -
చైనా దిమ్మ తిరిగిపోయేలా నిర్ణయం
ఒక దెబ్బకు రెండు పిట్టలు. డ్రాగన్ కంట్రీ దిమ్మ తిరిగిపోయేలా నిర్ణయం తీసుకుంది ఉత్తర అమెరికా దేశం కెనడా. ఈ మేరకు ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేసింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం భారీగా వెచ్చించ్చనున్నట్లు కెనడా ప్రకటించింది. తద్వారా ఈ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని బాగా తగ్గించాలనే ఆలోచనలో కెనడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు.. ఈ ప్రభావంతో ఈ రీజియన్లో తమ బలాన్ని పెంచుకోవాలని కూడా భావిస్తోంది. ఈ మేరకు విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆదివారం ఉదయం కీలక ప్రకటన చేశారు. కెనడా తన పసిఫిక్ వాణిజ్య సంబంధాలను చైనాకు మించి విస్తరించడానికి చాలా కష్టపడుతోంది. ఈ క్రమంలో అమెరికా తర్వాత చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇప్పుడు ఆ స్థానంపై కెనడా కన్నేసినట్లు స్పష్టమవుతోంది. తాజాగా ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగంగా కెనడా తరపున 1.7 బిలియన్ డాలర్ల ఖర్చు చేయబోతున్నట్లు మెలానీ జోలీ ప్రకటించారు. ఆ డబ్బును ఇండో-ఫసిఫిక్ రీజియన్లో మరింత నౌకాదళ గస్తీ కోసం, మెరుగైన నిఘా కోసం, సైబర్ సెక్యూరిటీ చర్యలకు ఉపయోగించనున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాదు.. తూర్పు-దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో ప్రాంతీయ భాగస్వాముల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. చైనా లక్ష్యంగా.. ఈ ప్రకటనకు ముందు ఆమె బ్లూమ్బర్గ్ న్యూస్తో గంటకు పైగా ఇంటర్వ్యూ ఇచ్చారు. యూరప్తో సుదీర్ఘకాలంగా తమ అనుబంధం కొనసాగుతోందని.. ఇక ఇప్పుడు ఫసిఫిక్పై దృష్టిసారించాల్సిన అవసరం వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. తద్వారా చైనా తీరును ఖండిస్తూ.. ఆ దేశానికి వ్యతిరేకంగానే తమ చర్యలు ఉండబోతున్నాయంటూ ఇంటర్వ్యూలో దాదాపుగా మాట్లాడారామె. అంతకు ముందు శుక్రవారం ఆమె మాంట్రియల్లో మాట్లాడుతూ.. ‘‘ చైనా విషయానికి వస్తే.. యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉందని మాకు తెలుసు. కాబట్టి మేము మా ఆటను కొనసాగిస్తాం’’ అంటూ ఆమె దూకుడు ప్రకటన చేశారు. ఇండోనేషియా బాలి జీ20 సదస్సు సందర్భంగా.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్-కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వాళ్ల మధ్య జరిగిన భేటీ సారాంశం మీడియాకు లీక్ కావడంపై జిన్పింగ్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. అందులో తప్పేం ఉందంటూ స్ట్రాంగ్కౌంటర్ ఇచ్చారు ట్రూడో. -
పెద్ద మనసు చాటుకున్న సీఎం జగన్
అమలాపురం రూరల్(కోనసీమ జిల్లా): తలసేమియా వ్యాధితో బాధపడుతోన్న బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నారాయణపేటకు చెందిన బాలుడు దంగేటి యశ్వంత్(7) చికిత్సకు సీఎం వైఎస్ జగన్ సహాయం అందించారు. బాలుడు హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి రూ.22 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? శుక్రవారం గోకవరం మండలం గుమళ్లదొడ్డిలో ఇథనాల్ ప్రాజెక్ట్ శంకుస్థాపనకు వచ్చిన సీఎంను గోదావరి సెంట్రల్ డెల్టా బోర్టు చైర్మన్ కుడుపూడి వెంకటేశ్వరబాబు కలిశారు. బాలుడు తండ్రి ఆర్థిక పరిస్థితిని విన్నవించారు. దీనిపై చలించిన సీఎం వెంటనే స్పందించారు. సీఎం సహాయ నిధి నుంచి రూ. 22 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సంతకం చేసి కార్యదర్శి జవహర్రెడ్డికి అందజేశారు. -
Anganwadi teacher: చిరుద్యోగి పెద్ద మనసు
సేవ చేయడానికి ధనవంతులే కానక్కర్లేదు. నలుగురికి సేవ చేసే భాగ్యం లభించడం కూడా అదృష్టమే! ఇదే విషయాన్ని తన చేతల ద్వారా నిరూపిస్తోంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో పదేళ్ల నుంచి అంగన్వాడీ టీచర్గా పనిచే స్తున్న ఉమర్ సుల్తానా. తన సంపాదనలో సగ భాగం సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తూ చుట్టూ ఉన్నవారికి ఆదర్శంగా నిలుస్తున్న సుల్తానా గురించి.. మహ్మద్ ఉమర్ సుల్తానా ఓ సాధారణ అంగన్వాడి టీచర్. పదేళ్లుగా విధులను నిర్వర్తిస్తోంది. ఉన్న ఊళ్లోనే కాదు, మండలంలోని మిగతా ఊళ్లలోనూ సుల్తానాకు మంచి పేరుంది. మా మనసున్న టీచరమ్మ అంటుంటారు స్థానికులు. ఏ ఆధారం లేనివారికి ఓ దారి చూపడమే కాదు ఏ ఆసరా లేదని కుంగిపోయేవారికి ధైర్యం చెబుతూ, అండగా నిలబడుతోంది. ‘మన మాట మంచిదయితే చాలు అందరూ మనవాళ్లే’ అంటుంది ఉమర్ సుల్తానా. దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో సుల్తానా అంగన్వాడీ టీచర్గా విధులను నిర్వర్తిస్తుంటే ఆమె భర్త మహ్మద్ ఉమర్ గజ్వేల్లో ఓ మెకానిక్ షాపు నడిపిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరేమీ ధనవంతులు కాదు, కానీ ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు తమకు చేతనైన సాయం అందించడమే కర్తవ్యంగా భావిస్తారు. గ్రామం నుంచి మొదలు... దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్ మండలాలలో వందకు పైన బాధిత కుటుంబాలకు సాయం అందించింది సుల్తానా. కరోనా సమయంలో గ్రామంలోని నిరుపేదలకు నిత్యవసర సరుకులు అందజేసింది. జిల్లా వ్యాప్తంగా 108 సిబ్బంది అందిస్తున్న సేవలకు గాను వారికి సన్మానం చేసింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అత్యవసరమైన వస్తువులను అందజేస్తుంది. వివిధ రకాల కారణాలతో చదువు మధ్యలోనే ఆపేసిన బాలికలకు నచ్చజెప్పి, వారి తల్లిదండ్రులను ఒప్పించి తిరిగి వారు బడిలో చేరేలా ప్రోత్సహిస్తుంది. బాలికలకు అవసరమైన పుస్తకాలు, యూనిఫారమ్ కొనిస్తుంది. రక్తదానం... అత్యవసర సమయంలో తన కుటుంబంలోని వారు రక్తదానం కూడా చేస్తుంటారు. లేదంటే, తెలిసిన మిత్రుల నుండి బాధితులకు సహాయం అందేలా చేస్తుంటారు. తాము సంపాదిస్తున్న కొద్ది మొత్తంలోనే సగ భాగాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దంపతులు. సంపాదన కన్నా ఎప్పటికీ నిలిచి ఉండేది నలుగురికి ఉపయోగపడే పనే. పెద్ద మొత్తంలో డబ్బు సాయం చేయలేకున్నా, పిడికెడు ధైర్యం ఇవ్వగలిగితే చాలు అదే కొండంత అండ అనుకుంటాను. నా ఆలోచనలకు తగినట్టు నా భర్త కూడా సహకారం అందిస్తున్నారు. ఎంత సంపాదించినా రాని తృప్తి, నలుగురి కష్టాలను పంచుకోవడంలోనే ఉంటుంది. ఆ ఆలోచనతోనే మా జీవన ప్రయాణం కొనసాగిస్తున్నాము. – సుల్తానా, అంగన్వాడి టీచర్ ఆమె సాయం మరువలేనిది అనారోగ్య కారణంతో నా భర్త మరణించాడు. తట్టుకోలేక మా అత్తమ్మ తనువు చాలించింది. ముగ్గురు పిల్లలతో దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు మొదటగా సాయం అందించింది సుల్తానా. ఆమె ముందుకు రావడంతో మరికొంతమంది మేమూ ఉన్నామని సాయంగా వచ్చారు. మాకు ఆమె ఇచ్చిన భరోసా కొండంత బలాన్ని ఇచ్చింది. కష్టకాలంలో మా కుటుంబానికి తోడుగా నిలిచింది. –షేక్ జానీ బి, సయ్యద్ నగర్ అమ్మలా తోడైంది అమ్మా నాన్నలను కోల్పోయి అనాథగా మిగిలిన నాకు ఒక అమ్మలా తోడైంది. నాలో బాధ పోయేవరకు రోజూ పలకరించింది. ఆమె అందించిన భరోసాతోనే ఇప్పుడు నా జీవితాన్ని నిలబెట్టుకోగలిగాను. – బండారు రేణుక, మంథూర్, రాయపోల్ మండలం – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట -
సునీత చదువుకు సాయం అందిస్తా: కేటీఆర్
హైదరాబాద్: తన ఇంట్లో పని చేసే మహిళను అత్యంత పైశాచికంగా హింసించిన ఉదంతంలో జార్ఖండ్ బీజేపీ సస్పెండెడ్ నేత సీమా పాత్రా అరెస్ట్ అయ్యింది. బాధితురాలు సునీతకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడం, అందులో ఆమె సీమ చేతిలో ఎంత దారుణంగా హింసించబడిందో వివరించడంతో దుమారం రేగింది. ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కోలుకుంటే.. తనకు చదువుకోవాలని ఉందంటూ బాధితురాలు చెప్పిన వీడియో ఒక దానిని ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్ పోస్ట్ చేశారు. ‘‘ఆమె పళ్లు విరిగిపోయాయి. ఎనిమిదేళ్లుగా నరకం అనుభవించింది. సీమాపాత్ర ఆమెను క్రూరంగా హింసించింది. కోలుకున్నాక చదువుకోవాలని బాధితురాలు చెబుతోంది’’ అంటూ దత్ ఆ పోస్ట్లో పేర్కొన్నారు. దీనికి ట్విటర్లో స్పందించారు కేటీఆర్. తాను వ్యక్తిగతంగా ఆమె చదువుకు అవసరమయ్యే సాయం అందించేందుకు సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు ఆమె కుటుంబ సభ్యుల వివరాలను పంపాలంటూ బర్ఖా దత్ను కోరారాయన. కేటీఆర్ బదులును అభినందించిన దత్.. అలాగే చేద్దాం అంటూ బదులిచ్చారు. Barkha, I would be happy to contribute in my personal capacity to the young girl’s education Please send me her family’s details https://t.co/bZ3VLO5EmF — KTR (@KTRTRS) August 31, 2022 రాంచీ అశోక్ నగర్లోని తన లగ్జరీ ఇంటి పనుల కోసం గిరిజన మహిళ సునీతను ఎనిమిదేళ్ల కిందట తెచ్చుకుని.. దారుణంగా హింసించింది సీమా పాత్ర. ఈ ఉదంతం సంచలనం సృష్టించగా.. ఎట్టకేలకు ఇవాళ ఉదయం పారిపోతున్న సీమను వెంబడించి అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది కూడా. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సీమపై కఠిన చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ డీజీపీని ఆదేశించింది. ఇదీ చదవండి: పనిమనిషిని చిత్రహింసలు పెట్టిన బీజేపీ నేత అరెస్టు -
పాకిస్తాన్కి అమెరికా రూ. 200 కోట్ల మానవతా సాయం
ఇస్లామాబాద్: గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించి పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా పాకిస్తాన్లో ప్రకృతి విలయం సృష్టించింది. దీంతో వేలాదిమంది చనిపోయారు, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రపంచ దేశాలను సాయం చేయాల్సిందిగా పిలుపునిచ్చింది. ఈ మేరకు అమెరికా పాకిస్తాన్కి సుమారు రూ. 200 కోట్ల మానవతా సాయాన్ని ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నెషనల్ డెవలప్మెంట్ ద్వారా పాకిస్తాన్లోని వరద బాధితుల కోసం అందిస్తున్నట్లు వెల్లడించింది. ఇది వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడానికి, ప్రాణాలను రక్షించేందుకు ఈ మానవతా సాయాన్ని అందిస్తున్నట్లు ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది (చదవండి: అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా) -
జగనన్న తోడు: నగదు జమ చేసిన సీఎం జగన్
-
Russia Ukraine war: అమెరికా భారీ ‘సైనిక’ సాయం!
వాషింగ్టన్: రష్యాపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా నుంచి భారీ స్థాయిలో సాయం అందనుంది. 1 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సాయం చేసేందుకు అమెరికా సిద్ధమైంది. శతఘ్నులు, మందుగుండు సామగ్రి, తీరప్రాంత రక్షణ వ్యవస్థలు ఇలా పలు విధాల సైనికఅవసరాలు అమెరికా తీర్చనుంది. మరోవైపు, నాటో కూటమి పంపిన ఆయుధాలు ఉంచిన ఆయుధాగారంపై రష్యా క్షిపణుల వర్షం కురిపించింది. పశ్చిమ ఉక్రెయిన్లోని లివివ్ ప్రాంతంలోని ఆయుధాగారాన్ని నేలమట్టంచేశామని రష్యా తెలిపింది. కాగా, సివిరోడోనెట్సŠక్లో ఇరుదేశాల పోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కార బాధ్యతలో నిర్మాణాత్మక పాత్ర పోషిస్తానని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. బుధవారం ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించారు. అయితే, ఉక్రెయిన్, రష్యాలకు చైనా మధ్యవర్తిత్వం వహిస్తుందా లేదా అనేది జిన్పింగ్ చెప్పలేదు. మరోవైపు ఉక్రెయిన్కు మద్దతుగా ఆ దేశంలో పర్యటిస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చెప్పారు. కీవ్లో పర్యటించాల్సిన సమయం ఆసన్నమైందని రొమేనియాలో మీడియాతో అన్నారు. కాగా, రష్యాలో తమ వ్యాపారాన్ని తగ్గించుకుంటామని ఐకియా సంస్థ తెలిపింది. కాగా, యుద్ధం కారణంగా ఈ సీజన్లో 24 లక్షల హెక్టార్లలో పంటలు పండించబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. -
కష్టకాలంలో ఉక్రెయిన్కు భారీ సాయం, కానీ ఓ షరతు!
యుద్ధకాలంలో ఉక్రెయిన్కు భారీ ఆర్థిక సాయం ప్రకటన వెలువడింది. కానీ, ఈ సాయాన్ని షరతుల మేరకు అందిస్తున్నట్లు ప్రకటించింది ఈయూ. ఈ మేరకు ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, యుద్ధ సంక్షోభంలో ఉన్న ఉక్రెయిన్కి తొమ్మిది బిలియన్ యూరోల(రూ. 73 వేల కోట్లు) ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. యుద్ధంతో అట్టడుకుతున్న ఉక్రెయిన్కి రుణ రూపంలో ఈ సాయాన్ని అందచేయనున్నట్లు వెల్లడించారు. యుద్ధం ముగిసిన తదనంతరం ఈయూ సాయంతో ఉక్రెయిన్ను పునర్నిర్మించడం పై దృష్టి కేంద్రీకరించాలని చెప్పారామె. ఉక్రెయిన్ పునర్నిర్మాణ ప్రయత్నాలకు ఈయూ వ్యూత్మక నాయకత్వం వహించేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు ఆమె తెలిపారు. మిగతా దేశాలు కూడా ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈయూ నిబంధనలకు లోబడే ఈ సాయం ఉంటుందని ఆమె తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం అనేది.. గత కొన్నిసంవత్సరాలుగా రక్షణ కోసం కేటాయిస్తున్న తక్కువ వ్యయం పై దృష్టి కేంద్రీకరించేలా చేసిందన్నారు. ఆయుధాల ఉత్పత్తి, జాయింట్ ప్రొక్యూర్మెంట్ను మరింత మెరుగ్గా సమన్వయం చేసేందుకు ఈ కూటమి ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతేకాదు యూరప్ కంపెనీలను ఆ మార్గంలో పయనించేలా ఆర్థిక పన్ను ప్రోత్సాహాకాలను అందిస్తామని చెప్పారు. ఇది ఈయూ స్వతంత్ర శక్తి సామర్థ్యాలను బలపరుస్తుందన్నారు. అలాగే ఇంధన సరఫరాలపై రష్యా పై ఆధారపడకుండా చౌకగా, వేగవంతంగా ఇంధనాన్ని పోందే దిశగా అడుగులు వేస్తోంది. అదీగాక ఇప్పటికే ఈయూ యూరోపియన్లను థర్మోస్టాట్లను తగ్గించాలని, లైట్లను ఆపివేయాలని, ప్రజారవాణ వినియోగించమని సూచించింది కూడా. (చదవండి: ‘సీ’దదీరుతూ....అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్) -
ఉక్రెయిన్కు స్పీడుగా సహాయం
వాషింగ్టన్: ఉక్రెయిన్తో పాటు తూర్పు యూరప్లోని మిత్రదేశాలకు మరింత సాయం వేగంగా అందించేందుకు వీలు కల్పించే బిల్లుకు అమెరికా హౌస్ ఆఫ్ కామన్స్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దీనికింద రష్యా ఆక్రమణను నిరోధించేందుకు ఈ దేశాలకు అమెరికా ఆయుధ సంపత్తిని అందిస్తారు. తమ మద్దతుతో రష్యాపై ఉక్రెయిన్ గెలుస్తుందని యూఎస్ ప్రతినిధి గ్రెగరీ మీక్స్ చెప్పారు. ఆ దేశానికి మరో 3,000 కోట్ల డాలర్ల సాయమందించేందుకు అమెరికా కాంగ్రెస్ మద్దతు కోరతానని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. డోన్బాస్పైనే ఫోకస్ తూర్పు ఉక్రెయిన్లోని డోన్బాస్పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. వాటిని ఉక్రెయిన్ సమర్థంగా అడ్డుకుంటోందని బ్రిటన్ తెలిపింది. ఐరాస చీఫ్ గుటెరస్ కీవ్లో పర్యటిస్తుండగానే ఆ నగరంపై రష్యా తీవ్ర దాడులకు దిగింది. అక్కడి మిలటరీ ఫ్యాక్టరీపై దాడి చేశామని ప్రకటించింది. వరదలతో నిరోధం కీవ్ను సమీపించకుండా రష్యా సేనలను నిరోధించేందుకు పరిసర గ్రామాలను ప్రజలు నీటితో ముంచెత్తుతున్నారు. దీనివల్ల మౌలిక వసతులు దెబ్బతింటున్నా పర్లేదంటున్నారు. శత్రువుల ఆక్రమణ ముప్పు కన్నా ఆస్తి నష్టం ఎక్కువేమీ కాదని చెప్పారు. ఇటీవలే దెమిదివ్ గ్రామ ప్రజలు ఇలాగే రష్యా సేనలను నిలువరించారు. ఘోస్ట్ ఆఫ్ కీవ్ మృతి ఉక్రెయిన్ సైన్యం కీలకమైన జవానును కోల్పోయింది. ‘ఘోస్ట్ ఆఫ్ కీవ్’గా పేరు పొందిన మేజర్ స్టెపాన్ టారాబాల్కా(29) గత నెలలో రష్యా బాంబు దాడుల్లో మృతి చెందినట్లు తాజాగా తెలిసింది. అతను 40 రష్యా యుద్ధ విమానాలను నేలకూల్చాడని ఉక్రెయిన్ చెబుతోంది. ‘ఉక్రెయిన్’ వైద్య విద్యార్థులకు సుప్రీం ఊరట న్యూఢిల్లీ: యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి మధ్యలోనే స్వదేశానికి వచ్చిన వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఉక్రెయిన్తో పాటు ఇతర దేశాల నుంచి మధ్యలో వచ్చిన వాళ్లు స్థానిక కాలేజీల్లో అడ్మిషన్ పొందేందుకు రెండు నెలల్లో పథకం రూపొందించాలని జాతీయ వైద్య కమిషన్ను శుక్రవారం ఆదేశించింది. స్వదేశీ కాలేజీల్లో చేరికకు అవసరమైన క్లినికల్ ట్రైనింగ్ను ఈ పథకంలో భాగంగా అందిస్తారు. చైనా వర్సిటీకి చెందిన ఓ వైద్య విద్యార్థిని సూత్రప్రాయంగా రిజిస్టర్ చేసుకోవాలంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్ఎంసీ సుప్రీంలో సవాలు చేసింది. మానవాళికి కరోనా కొత్త సవాళ్లు విసిరిందని విచారణ సందర్భంగా ఎన్ఎంసీకి జస్టిస్ గుప్తా, జస్టిస్ రామసుబ్రమణ్యంతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చైనా వర్సిటీలో క్లినికల్ శిక్షణ పూర్తి చేసుకోనంత మాత్రాన విద్యార్థి ప్రతిభ వృథా కాకూడదని అభిప్రాయపడింది. వారికి ఒక్క అవకాశం ఇవ్వాలని సూచించింది. ఇలాంటి విద్యార్థులను ఎన్ఎంసీ ఒక నెలలో పరీక్షించవచ్చని, సరైన శిక్షణ పొందారని కమిషన్ భావిస్తే దేశీయంగా 12 నెలల ఇంటర్న్షిప్ పూర్తి చేసేందుకు వారికి వీలు కల్పించవచ్చని తెలిపింది. -
Sri Lanka crisis: లంకకు అండగా నిలిచిన ప్రధాని మోదీ..
సాక్షి, న్యూఢిల్లీ: అన్నిరకాలుగా సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ సెంట్రల్ లంకలోని రంబుక్కన వద్ద హైవేను, రైల్వే ట్రాక్ను దిగ్బంధించారు. వారిపై పోలీసుల కాల్పుల్లో ఒకరు మరణించారు. పలువురు గాయపడ్డారు. కాగా, లీటర్ పెట్రోల్ మంగళవారం ఏకంగా 84 రూపాయలు పెరిగి రూ.338కి చేరింది. బస్సు చార్జీలు కూడా ఏకంగా 35 శాతం పెరిగాయి. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. సంక్షోభంలో ఉన్న లంకు మరోసారి భారత్ భారీ సాయాన్ని అందించనుంది. చమురు కొనుగోలు కోసం అదనంగా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3800 కోట్లు) అందించనుందని శ్రీలంక విదేశాంగ మంత్రి జీఎల్ పిరిస్ వెల్లడించారు. అంతకు ముందు కూడా భారత్.. శ్రీలంకకు భారీ మొత్తంలో డీజిల్, ధాన్యాన్ని పంపించింది. అలాగే, ఐఎంఎఫ్ నుండి(అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) నుండి వచ్చే సాయం ప్రస్తుతం దశల వారీగా అందుతోందన్నారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ నుండి అందే ఆర్థిక సాయం 450 మిలియన్ డాలర్లు కొంత ఆలస్యం కానున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు.. ఆర్థిక సంక్షోభం, దేశవ్యాప్త నిరసనలతో సతమతమవుతున్న శ్రీలంకలో సోమవారం పాత ప్రధాని మహింద రాజపక్స సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మొత్తం 17 మందితో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కొత్త కేబినెట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ప్రధాని విడివిడిగా జాతినుద్దేశించి మాట్లాడారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని వ్యవస్థలో సమూల మార్పు తీసుకొస్తామని గొటబయ ధీమా వెలిబుచ్చారు. స్వచ్ఛమైన, సమర్థమైన పాలన అందించేందుకు సహకరించాల్సిందిగా మహింద కోరారు. -
కాకినాడ నుంచి శ్రీలంకకు బయల్దేరిన మానవతా సాయం
సాక్షి, కాకినాడ: శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తమవంతు మానవతా సాయంగా కేంద్ర ప్రభుత్వం 45 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరాకు హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా తొలి దశలో 11 వేల మెట్రిక్ టన్నులు ఎగుమతి చేసేందుకు కాకినాడ జిల్లా కాకినాడలోని ఓ ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించింది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో గత రెండు రోజులుగా నౌకలో బియ్యం లోడింగ్ ప్రక్రియ సాగింది. అత్యవసర కారణాల దృష్ట్యా 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని చెన్గ్లోరీ అనే నౌక శుక్రవారం సాయంత్రం కాకినాడ నుంచి శ్రీలంకకు బయల్దేరింది. ఈ నౌక సముద్ర మార్గంలో మూడు రోజులపాటు ప్రయాణించి సోమవారం సాయంత్రానికి శ్రీలంకకు చేరనుంది. అనంతరం అక్కడి నుంచి బియ్యాన్ని శ్రీలంకలో చౌక ధరల దుకాణాలకు తరలిస్తారు. -
పాక్ చెత్త.. భారత్ బంగారం!: తాలిబన్లు
అఫ్గనిస్థాన్ పునర్మిర్మాణంలో పలు దేశాలు పాలు పంచుకుటున్న విషయం తెలిసిందే. తాలిబన్లు అఫ్గన్ను ఆక్రమించుకున్నాక.. ఆర్థిక ఆంక్షల వల్ల సంక్షోభంలో కూరుకుపోయింది. తాలిబన్ ప్రభుత్వానికి ఇంకా గ్లోబల్ గుర్తింపు దక్కనప్పటికీ.. నానాటికీ పరిస్థితి దిగజారిపోతుండడంతో మానవతా కోణంలో భారీ సాయమే అందుతోంది. ఈ క్రమంలో.. అఫ్గన్ పొరుగున ఉన్న పాక్ గోధుమలను అందించగా.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది అక్కడి ప్రభుత్వం. ‘‘పాక్ నుంచి పంపించిన గోధుమ నాసికరంగా ఉన్నాయి. తినడానికి అస్సలు పనికిరావు. చెత్తలోపారబోయడానికి తప్ప. ఎందుకు పంపారో ఆ దేశ ప్రభుత్వానికే తెలియాలి. బహుశా ఖరాబును జమ చేసుకోవడం ఇష్టం లేక పంపారేమో’’ అంటూ మండిపడ్డారు అక్కడి అధికారులు. అదే సమయంలో భారత్ అందించిన గోధుమలపైనా స్పందించారు. భారత్ మేలిమి రకపు గోధుమలను అందించిందని, అందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని తెలిపారు. తాలిబన్ ప్రతినిధులు పాక్-భారత్ గోధుమ సాయంపై స్పందించిన వీడియో ఒక దానిని అఫ్గన్ జర్నలిస్ట్ అబ్దుల్లా ఒమెరీ ట్వీట్ చేశారు. దీనికి అఫ్గన్ నెటిజనుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. జై హింద్ అంటూ పలువురు అఫ్గన్ పౌరులు ట్వీట్లు చేస్తుండడం విశేషం. #Afghanistan : #Taliban officials allege that wheat sent by @ImranKhanPTI #Pakistan Govt is rotten not fit for consumption while @narendramodi’s Indian Govt’s 50,000 MT of wheat is very good.pic.twitter.com/5NSnQBVEKo — Arun (@arunpudur) March 4, 2022 ఇదిలా ఉండగా.. సంక్షోభ సమయం నుంచే భారత్, అఫ్గనిస్థాన్కు సాయం అందిస్తోంది.ఈ క్రమంలో రోడ్డు మార్గం గుండా సరుకులు పంపే సమయంలో పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేసి అడ్డుపడగా.. తమ దేశం గుండా అనుమతించి పెద్ద మనసు చాటుకుంది ఇరాన్. ఇదిలా ఉండగా.. అమృత్సర్ నుంచి మొన్న గురువారం 2వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగామ్లో భాగంగా యాభై వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపాలనే కమిట్మెంట్కు కట్టుబడి.. సాయం అందిస్తూ పోతోంది భారత్. ఈ సందర్భంగా కోలుకుంటున్న అఫ్గన్తో భారత్ మంచి సంబంధాలు కోరుకుంటోందని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. -
అఫ్గన్లకు ఇక మంచిరోజులు!
అఫ్గన్ పౌరులకు మంచిరోజులు మొదలయ్యాయి!. చరిత్రలో మునుపెన్నడూ చూడలేనంత దీనస్థితిని ఒక దేశం ఎదుర్కొనుందన్న విశ్లేషణలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్ నేలకు సాయం అందించేందుకు అగ్ర రాజ్యంతో పాటు పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. అంతేకాదు ఆహార, ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడేసేందుకు భారీ విరాళాల కోసం ఐక్యరాజ్య సమితి ప్రణాళిక రచించింది. తాజాగా అమెరికా 308 మిలియన్ డాలర్ల (రెండువేల కోట్ల రూపాయలకు పైనే) తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆశ్రయం, ఆరోగ్య భద్రత, చలికాల పరిస్థితుల నేపథ్యంలో సాయం, అత్యవసర ఆహార సాయం, మంచి నీరు, శానిటేషన్, శుభ్రత సర్వీసులు తదితరాల కోసం ఈ భారీ సాయం వినియోగించనున్నట్లు, ఇందుకోసం స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకోనున్నట్లు వైట్ హౌజ్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో మానవతా ధృక్పథంతో అమెరికా అందించిన సాయం(గత అక్టోబర్ నుంచి) ఇప్పటిదాకా 782 మిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు 27 దేశాలు అఫ్గన్కు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి కూడా. గతంలో అఫ్గన్ బడ్జెట్ 80 శాతం విదేశీ నిధుల ద్వారానే సమకూరేది. అయితే తాలిబన్ల రాకతో ఎక్కడిక్కడే నిధులు ఆగిపోయాయి. పైగా అఫ్గన్కు చెందిన అకౌంట్లు సైతం నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఐదు నెలల తాలిబన్ల పాలనలో అఫ్గన్ ఆర్థిక వ్యవస్థ గాడితప్పి సంక్షోభం దిశగా అడుగులు పడ్డాయి. ఒకానొక టైంలో కరెన్సీ కొరత కారణంగా వస్తు మార్పిడి విధానం వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఒకవైపు ఆహార కొతర, మరోవైపు ఆహార ఉత్పత్తుల ధరలు 20 శాతం పెరగడంతో ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు. ఈ తరుణంలో ఆదుకోవాలంటూ అమెరికాతో సహా అన్ని దేశాలకు తాలిబన్ ప్రభుత్వం పిలుపు ఇవ్వగా.. అనూహ్యమైన స్పందన లభిస్తోంది. యూఎన్ భారీ ప్రణాళిక సాయం కోసం చూస్తున్న కోట్ల మంది అఫ్గన్ పౌరుల ముఖం తలుపులు వేయొద్దంటూ యూఎన్ ఎయిడ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిథ్స్ ప్రపంచానికి పిలుపు ఇచ్చారు. అఫ్గనిస్థాన్ సంక్షోభం నుంచి బయటపడాలంటే 2022 ఒక్క ఏడాదిలోనే 5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అవసరమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దేశంలో ఉన్న పౌరుల కోసం 4.4 బిలియన్ డాలర్లు, సరిహద్దుల అవతల ఆశ్రయం పొందుతున్న పౌరుల కోసం 623 మిలియన్ డాలర్లు అవసరం పడొచ్చని యూఎన్ భావిస్తోంది. ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితి ఒక దేశం కోసం ఇంత పెద్ద ఎత్తున్న సాయం కోసం ప్రపంచానికి పిలుపు ఇవ్వడం ఇదే మొదటిసారి. పాక్ సహకరించకున్నా.. ఇదిలా ఉంటే అఫ్గనిస్థాన్కు సాయం అందించే విషయంలో భారత్ ముందు నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. గత ఆగష్టు నుంచి ఆహార ఉత్పత్తులతో పాటు మందులను సైతం పంపించింది. కిందటి నెలలో ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్లను అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కాబూల్లోని ఇందిరాగాంధీ ఆస్పత్రికి మందుల్ని సరఫరా చేసింది. మరోవైపు ఆహార కొరత నేపథ్యంలో అక్కడి ప్రజల కోసం యాభై వేల టన్నుల గోధుమల్ని పంపించింది భారత్. ముందుగా పాక్ మార్గం గుండా వెళ్లాల్సి ఉండగా.. అఫ్గన్తో సరిహద్దు ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పాక్తో భారత్ ప్రభుత్వం సంప్రదింపులు సైతం జరపగా.. లాభం లేకుండా పోయింది. అ తరుణంలో అనూహ్యంగా ఇరాన్ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. తమ గుండా సరుకుల్ని,మందుల్ని అఫ్గన్ను పంపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చదవండి: అఫ్గన్పై అమెరికా కొర్రిలు.. తలవంచిన తాలిబన్ ప్రభుత్వం -
తాలిబన్లకు చైనా మరింత మద్దతు, కీలక హామీ
కాబూల్: అఫ్గానిస్తాన్ను వశం చేసుకున్న తాలిబన్ల పట్ల మొదటినుంచీ సానుకూలంగా ఉన్న చైనా మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అఫ్గాన్లోని తమ రాయబార కార్యాలయాన్ని తెరిచి ఉంచుతామని చైనా హామీ ఇచ్చిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అలాగే సంక్షోభంతో నష్టపోయిన అఫ్గాన్కు అందించే మానవతా సహాయాన్ని పెంచుతామని చైనా హామీ ఇచ్చినట్లు తాలిబాన్ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. అయితే దీనిపై చైనా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మేరకు దోహాలో తాలిబన్ల ప్రతినిది అబ్దుల్ సలాం హనాఫీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా డిప్యూటీ విదేశాంగ మంత్రి వు జియాంగావోతో ఫోన్ ద్వారా సంభాషించినట్టు సుహైల్ షాహీన్ ట్వీట్ చేశారు. కాబూల్లో తమ రాయబార కార్యాలయాన్ని నిర్వహించడం తోపాటు, గతంతో పోలిస్తే సంబంధాలు మరింత బలపడతాయని వు జియాంగావో తెలిపారన్నారు. అలాగే కోవిడ్-19 చికిత్సకు సంబంధించి తన సాయాన్ని పెంచనుందని అబ్దుల్ సలాం వెల్లడించారు. కాగా అఫ్గాన్లో 20 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లతో తొలిసారిగా మద్దతు ప్రకటించింది చైనా మాత్రమే. ఆ తరువాత పాకిస్తాన్, రష్యా కూడా తాలిబన్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. భద్రత క్షీణించడంతో తమ పౌరులను తరలిస్తున్నప్పటికీ కాబూల్లోని చైనా రాయబార కార్యాలయం పనిచేస్తోంది. ప్రస్తుత భద్రతా ఆందోళన దృష్ట్యా తక్షణమే కాకపోయినా, విస్తారమైన రాగి, లిథియం గనులపై చైనా కంపెనీలు కూడా దృష్టి పెట్టనున్నాని నిపుణులు చెబుతున్నారు. అలాగే తాలిబన్లు చైనాను పెట్టుబడి, ఆర్థిక మద్దతుకు కీలకమైన వనరుగా పరిగణించవచ్చని భావిస్తున్నారు. అఫ్గాన్లో శాంతి స్థాపన సయోధ్యతోపాటు, ఆ దేశ పునఃనిర్మాణంలో ఇప్పటికే చైనా ప్రకటించిన సహకారాన్ని స్వాగతించిన తాలిబన్లు అఫ్గాన్ అభివృద్దిలో చైనాదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 1/3 Abdul Salam Hanafi, Deputy Director, PO held a phone conversation with Wu Jianghao, Deputy Foreign Minister of the People’s Republic of China. Both sides discussed the ongoing situation of the country and future relations. The Chinese Deputy Foreign Minister said that — Suhail Shaheen. محمد سهیل شاهین (@suhailshaheen1) September 2, 2021 -
Afghanistan: అమెరికా నిర్ణయం.. భారత్కు భారీ నష్టం
సాక్షి, వెబ్డెస్క్: క్షేత్రస్థాయిలో పరిస్థితులు సరిగా అంచనా వేయకుండా హడావుడిగా అమెరికా తీసుకున్న నిర్ణయం ఇటు అఫ్ఘన్తో పాటు భారత్కి శాపంగా మారింది. ఇంటిలిజెన్స్లో తమకు తిరుగులేదని చెప్పుకునే అమెరికా తాను పప్పులో కాలేయడమే కాకుండా తనని నమ్మిన అఫ్ఘన్లకు, వారికి అండగా నిలిచిన ఇండియాకు నష్టాన్ని తెచ్చింది. బిన్లాడెన్తో మొదలు ఓసామా బిన్లాడెన్ పీచమణిచే లక్ష్యంతో 2001లో వైమానికదాడులతో అఫ్ఘనిస్తాన్లో అమెరికా అడుగు పెట్టింది. ఆ తర్వాత తాలిబన్లను గద్దె నుంచి తోసి తమకు అనుకూలంగా ఉండే హమీద్ కర్జాయ్ని దేశ అధ్యక్షుడిని చేసింది. ఆ తర్వాత అక్కడ ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తామంటూ చెప్పింది. దీంతో అఫ్ఘనిస్తాన్ పునర్మిణం పేరుతో ప్రపంచ దేశాలు సాయం అందించాయి. ఈ క్రమంలో గడిచిన 20 ఏళ్లలో అఫ్ఘన్లో పలు ప్రాజెక్టులపై ఇండియా 3 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. ద్వైపాక్షిక సంబంధాలు బలపడ్డాయి. ఇరు దేశాల మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం 2019-20లో జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో కుదిరిన ఒప్పందాలు అమలయ్యేది లేదని తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇండియా సాయం - ఇరవై ఏళ్ల కాలంలో అఫ్ఘనిస్తాన్ పునర్ నిర్మాణం కోసం 3 బిలియన్ డాలర్లు ఇండియా ఖర్చు చేసింది. వీటితో ఆ దేశంలోని 34 ప్రావిన్సుల్లో మొత్తం 400 పనులు చేపట్టింది. ఇందులో చాలా వరకు పూర్తవగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. - నీటి వనరులు పరిమితంగా ఉండే అఫ్ఘనిస్తాన్లో 42 మెగావాట్ల జలవిద్యుత్ సామర్థ్యంతో సాల్మా జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. ఈ డ్యామ్ వాటర్తో కాబుల్ జిల్లాలో రెండు వేల గ్రామాలకు మంచినీటిని అందించే వీలుంది. - 90 మిలియన్ డాలర్ల వ్యయంతో అఫ్ఘనిస్తాన్ పార్లమెంటు భవనాన్ని ఇండియా నిర్మించింది. 2015లో ప్రధానీ మోదీ దీన్ని ప్రారంభించారు. - 19వ శతాబ్ధంలో నిర్మించిన స్టార్ ప్యాలెస్ పునరుద్ధరణ పనులు ఇండియాకు చెందిన ఆగాఖాన్ ట్రస్ట్ చేపట్టింది. 2013లో పనులు ప్రారంభించి 2016లో పూర్తి చేసింది. - 80 మిలియన డాలర్ల వ్యయంతో కాబూల్ జిల్లాలో శతూత్ డామ్ నిర్మాణానికి ఇండియా అంగీకరించింది. ఈ డామ్ నిర్మాణం పూర్తయితే ఇరవై లక్షల కుటుంబాలకు తాగునీటి సమస్య తీరిపోయి ఉండేది. - అఫ్ఘనిస్తాన్, ఇండియాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య వన్ బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని 2019-20లో అంచనా వేశారు. ప్రస్తుతం ఈ ఒప్పందం ఎంత మేరకు అమలవుతుందనేది సందేహంలో పడింది. - ద్వైపాక్షిక ఒప్పందలో భాగంగా అఫ్ఘనిస్తాన్ వస్తువులకు ఇండియాలో పన్ను రాయితీలు కల్పించారు. ఏం జరుగుతుందో - 150 మిలియన్ డాలర్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరాజ్ - దేలారమ్ హైవేను మన దేశానికి చెందిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మించింది. ఈ హైవే నిర్మాణం వల్ల ఇరాన్లో ఉన్న చాహబార్ పోర్టుతో రోడ్ కనెక్టివిటీ ఉంటుందని, గల్ఫ్ దేశాలతో పాటు యూరప్కి వాణిజ్య మార్గం అవుతుందని ఇండియా అంచనా - పాకిస్తాన్తో ఉన్న వైరం కారణంగా అఫ్ఘనిస్తాన్ మీదుగా చబహార్ పోర్టు ఉండే కనెక్టివిటీ ఇండియాకు ఎంతో ఉపయోకరంగా ఉండేది. ఇప్పుడు ఈ హైవే వాడకంపై ఆంక్షలు ఉండవచ్చు. - రెండు దేశాల మధ్య స్నేహానికి ప్రతీకగా అఫ్ఘనిస్తాన్ అధ్యక్ష భవనాన్ని ఇండియా నిర్మించించింది. ప్రస్తుతం ఈ భవనం తాలిబన్లు ఆక్రమించుకున్నారు. - పాకిస్తాన్ దేశం తరచుగా తన గగనతలంపై ఆంక్షలు విధిస్తోంది. దీని వల్ల విమానయానరంగంపై అదనపు భారం పడుతోంది. ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ సైతం ఇలాంటి నిర్ణాయాలు అమలు చేస్తే విమాన ప్రయాణం మరింత దూరభారం, ఆర్థిక భారంగా మారుతుంది. -
ఇండోనేషియాకు కోవిడ్పై పోరాటంలో భారత్ భారీ సాయం
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్పై పోరాటం చేయడానికి ఇండోనేషియాకు భారత్ భారీ సాయం అందించింది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా రాజధాని జకార్తాకు భారత నౌక ఐఎన్ఎస్ ఐరావత్ చేరుకుంది. ఆ నౌకలో100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సామర్థ్యంతో 5 క్రయోజనిక్ ట్యాంకర్లు,300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపింది. భారత్, ఇండొనేషియా దేశాల మధ్య సాంస్కృతిక, వ్యాపార ద్వైపాక్షిక సంబంధాలు కలిగి వున్నాయి. -
వరద భాదితులకు భారతి సిమెంట్స్ సాయం
-
సొమ్మొకరిది.. సోకొకరిది అంటే ఇదే!
వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. వైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసింది. ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి.. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడం కోసం పలు దేశాలు భారీ ప్యాకేజీలను ప్రకటించాయి. దానిలో భాగంగా అమెరికాలో చిన్న కంపెనీలను కాపాడటం కోసం అక్కడి ప్రభుత్వం ‘పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్’ (పీపీపీ) రుణాల పేరుతో కరోనా రిలీఫ్ ఫండ్ ఇస్తోంది. 500 లేదా అంతకన్నా తక్కువ ఉద్యోగులు ఉన్న కంపెనీలకు అత్యవసర ఆర్థిక సాయం అందించడానికి అమెరికా ప్రభుత్వం కరోనావైరస్ ఎయిడ్, రిలీఫ్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ (కేర్స్) చట్టం ప్రకారం ఈ పీపీపీ రుణాలు మంజూరు చేసింది. దానిలో భాగంగా ఫ్లోరిడాకు చెందిన డేవిడ్ టీ హైన్స్కు కూడా ప్రభుత్వం 4 మిలియన్ డాలర్ల కోవిడ్-19 ఫెడరల్ రుణం మంజూరు చేసింది. ఉద్యోగుల సంక్షేమం కోసం ఇచ్చిన ఈ డబ్బును డేవిడ్ తన సొంతానికి ఖర్చు పెట్టుకున్నాడు. (అమెరికాలో ‘చైనా’ పార్శిళ్ల కలకలం!) ఈ మొత్తంలో నుంచి సుమారు 3,18,000 డాలర్లు ఖర్చు చేసి ఏకంగా లంబోర్గిని కారు కొన్నాడు. మిగిలిన డబ్బుతో ఆభరణాలు కొనడమే కాక ఓ స్టార్ హోటల్లో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ గడిపాడు. ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కష్టపడకుండా వచ్చిన సొమ్ము కావడంతో విచ్చలవిడిగా జల్సా చేస్తూ.. ఈ నెల ప్రారంభంలో ఓ యాక్సిడెంట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆరా తీయడంతో ఇతగాడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల కోసం ఇచ్చిన డబ్బును ఇలా సొంతానికి వాడుకోవడంతో డేవిడ్పై బ్యాంక్ మోసం, ఆర్థిక సంస్థకు తప్పుడు సమాచారం ఇవ్వడం, చట్టవిరుద్ధమైన ఆదాయంలో లావాదేవీలకు పాల్పడటం వంటి కేసులు నమోదు చేశారు. -
కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం
కాలిఫోర్నియా: ప్రపంచ వ్యాప్తంగా మహారక్కసిలా విరుచుకుపడుతున్న కరోనాపై యుద్ధానికి తమ వంతుగా కార్పొరేట్ దిగ్గజాలు కదిలి వస్తున్నాయి. ఈ క్రమంలో కోవిడ్-19పై పోరుకు సెర్జింజన్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది. చిన్న,మధ్య తరహా వ్యాపారులను (ఎస్ఎంబీస్) ఆదుకునేందుకు, 800 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,990 కోట్లు) సహాయాన్ని ప్రకటించింది. చిన్న వ్యాపారాలతోపాటు మహమ్మారి కరోనాపై చేస్తున్న ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. అలాగే వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలా నిరోధించాలనే దానిపై సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు(డబ్ల్యూహెచ్ఓ), ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా ప్రభుత్వ సంస్థలకు 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,872 కోట్లు) యాడ్ గ్రాంట్స్ను గూగుల్ అందిస్తుందని ఆయన తెలిపారు. వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ), ఇతర వైద్య పరికరాల ఉత్పత్తిని పెంచడానికి ఆర్థిక సహాయం అందిస్తామని కంపెనీ తెలిపింది. అయితే ఎంత మొత్తం అనేది వెల్లడించలేదు. అవసరమైన పరికరాల తయారీ దారులకు, ఫెడరల్ ప్రభుత్వం సహాయం చేయడానికి గూగుల్ తన ఉద్యోగులను గుర్తిస్తామని గూగుల్ పేర్కొంది. రాబోయే కొన్ని వారాల్లో 2 నుంచి మూడు మిలియన్ల ఫేస్మాస్క్లను ఉత్పత్తి చేసేందుకు మాజిడ్ గ్లోవ్స్ అండ్ సేఫ్టీతో కలిసి గూగుల్ పనిచేస్తోంది. అలాగే కమ్యూనిటీ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఎన్జీవోలకు ప్రకటన గ్రాంట్లలో 20 మిలియన్ డాలర్లు ఇవ్వనుండగా, గూగుల్ యాడ్స్ క్రెడిట్స్లో 340 మిలియన్ డాలర్లు మేర అర్హత ఉన్న ఖాతాలకు గూగుల్ స్వయంచాలకంగా క్రెడిట్ను అందుబాటులో ఉంచనుంది. చిరువ్యాపారులను ఆదుకునే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్జీవోలు, ఫైనాన్షియల్ సంస్థలకు 200 మిలియన్ డాలర్ల నిధిని ప్రకటించింది. ఈ పెట్టుబడుల నిధిని సమకూర్చడం ద్వారా నగదు లభ్యత అందించనున్నామని, తద్వారా వ్యాపారాలకు, ఇతర ప్రభుత్వేతర సంస్థల ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు లభిస్తుందన్నారు. కరోనా వైరస్ మహమ్మారిపై అధ్యయనం చేసేందుకు విద్యాసంస్థలు, పరిశోధకులకు గూగుల్ క్లౌడ్లో 20 మిలియన్ డాలర్లను అందించనుంది. తద్వారా టీకాలు రూపకల్పన, చికిత్సలను అధ్యయనం చేయడానికి లేదా డేటాను ట్రాక్ చేయడానికి ఉపయోగించుకోవచ్చని పిచాయ్ వివరించారు. -
కేరళ వరదలు : సాయం వద్దంటే నిధులెలా..?
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో వరద సహాయక చర్యలకు అంతర్జాతీయ సాయాన్ని తాము ఆమోదించబోమని భారత్ విస్పష్టంగా పేర్కొందని థాయలాండ్ అంబాసిడర్ ట్వీట్ చేయడంతో కేరళ పునర్నిర్మాణంపై విస్తృత చర్చ మొదలైంది. కేరళకు కేంద్రం ప్రకటించిన సాయం ఏమాత్రం సరిపోని క్రమంలో ఇతరులు చేసే సాయాన్ని కేంద్రం తిరస్కరించరాదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్ తేల్చిచెప్పారు. వరదలతో తల్లడిల్లిన కేరళకు దుబాయ్ రూ 700 కోట్ల సాయం అందించేందుకు ముందుకు రాగా ప్రధాని నరేంద్ర మోదీ నిరాకరించారని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. వరద సాయం కింద తాము కేంద్రాన్ని రూ 2000 కోట్లు కోరితే కేవలం రూ 600 కోట్లు ఇచ్చారని, ఈ పరిస్థితుల్లో ఇతర ప్రభుత్వం, వ్యక్తులు సాయంతో ముందుకు వస్తే ఎందుకు కేంద్రం అడ్డుపడుతున్నదో తనకు అర్థం కావడం లేదని కేరళ మంత్రి థామస్ ఇస్సాక్ ఆవేదన వ్యక్తం చేశారు. దుబాయ్, కేరళల మధ్య దీర్ఘకాల అనుబంధం కొనసాగుతుందని, దుబాయ్లో అత్యధిక జనాభా మళయాళీలేనని చెప్పారు. దుబాయ్లో దాదాపు 30 లక్షల మంది భారతీయులు పనిచేస్తుంటే వారిలో 80 శాతం మంది కేరళకు చెందినవారేనన్నారు. కేంద్రం ప్రకటించిన వరద సాయం అరకొరగా ఉందని, ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ స్పందన రావడంతో గండం నుంచి గట్టెక్కామని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే కేరళ పునర్నిర్మాణమే ఇప్పుడు తమ ముందున్న సవాల్ అన్నారు. -
కేరళ వరదలు : దుబాయ్ను అలా చూడలేం..
తిరువనంతపురం : వరదలతో ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళకు దుబాయ్ ప్రకటించిన రూ. 700 కోట్ల సాయాన్ని స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. దుబాయ్ను వేరే ఇతర దేశంగా పరిగణించలేమని, భారతీయులు ముఖ్యంగా కేరళ ప్రజలు దుబాయ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని విజయన్ వ్యాఖ్యానించారు. తనకు తెలిసినంతవరకూ దుబాయ్ కేరళకు వరద సాయాన్ని తన సొంతంగా ప్రతిపాదించిందని, వారి దేశ నిర్మాణంలో భారతీయులు ముఖ్యంగా కేరళ ప్రజలు ఇతోధిక సాయం చేశారని ఆ దేశ పాలకులు గుర్తెరిగిన క్రమంలో దుబాయ్ను వేరే ఇతర దేశంగా పరిగణించలేమని విజయన్ స్పష్టం చేశారు. అబుదాబి రాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నయాన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సాయంపై ప్రతిపాదించారని సీఎం విజయన్ చెప్పారు. కాగా, 2004లో ఏర్పాటైన విపత్తు సాయం విధానానికి అనుగుణంగా భారత్ వ్యవహరిస్తుందని, అప్పటి నుంచి విదేశ సాయాన్ని తిరస్కరిస్తూ వస్తున్నదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. (చదవండి: యూఏఈ సాయానికి కేంద్రం నో!) -
‘సాగునీటి ప్రాజెక్టులకు సాయం చేయండి’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభు త్వం చేపట్టిన పలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి తగిన సాయం చేయాలని ఆ పార్టీ లోక్ సభాపక్ష నేత ఏపీ జితేందర్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ప్రకృతి విపత్తుల అంశంపై బుధవారం లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడా రు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని కోణాల్లో సంక్షేమ చర్యలు చేపట్టిందని, సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 46వేల చెరువులను పునరుద్ధరిస్తోందన్నారు. -
ఆ ఒక్క కిడ్నీ ఆగిపోతుంది!
న్యూఢిల్లీ: పాస్పోర్టు వివాదంలో హిందూ–ముస్లిం జంటకు సాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ను హేళన చేస్తూ పలువురు నెటిజెన్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తనను లక్ష్యంగా చేసుకుని పోస్ట్ చేసిన ట్వీట్లను సుష్మ రీట్వీట్ చేశారు. అందులో ఓ నెటిజెన్ స్పందిస్తూ..‘సుష్మా జీ ఒక్క కిడ్నీపైనే కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణమైనా ఆ కిడ్నీ కూడా పనిచేయడం మానేస్తుంది’ అని అన్నాడు. సుష్మ ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించినందుకు సిగ్గు పడుతున్నానని మరొకరు పోస్ట్ చేశారు. -
లాంచీ బాధిత కుటుంబాలకు రూ. 50 వేల సాయం
సాక్షి, కాకినాడ : గోదావరిలో లాంచీ ప్రమాద ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయూత అందించనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మృతుల కుటుంబీల వద్దకు వెళ్లి ఆర్థిక సాయం అందచేయనున్నట్లు పార్టీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన పెద్దలకు, రూ.50వేలు, చిన్నారులకు రూ.25వేలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ సీపీ నేతలు ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, తెల్లం బాలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, అనంత ఉదయభాస్కర్ తదితరులు సంఘటనా స్థలంలో బాధితులను పరామర్శించారు. -
గిఫ్ట్స్ వద్దు.. ఛారిటీ ముద్దు
లండన్ : ప్రపంచం అంతా ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నది బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హారీ, మేఘన్ మార్కెల్ల వివాహం గురించి. మే 19న విండ్సోర్లో వివాహంతో ఒక్కటవనున్న ఈ జంట తమ వివాహవేడుకకు హజరయ్యే అథిదులకు ఒక విన్నపం చేసింది. అదేంటంటే తమ వివాహానికి వచ్చేవారు బహుమతులు తేవద్దని, ఆ మొత్తాన్ని ముంబైలోని ‘మైనా మహిళ ఫౌండేషన్’కు విరాళంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. వివాహ వేడుక సందర్భంగా ఈ జంట కొన్ని సంస్థలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకుగాను కొన్ని సేవా సంస్థలను ఎన్నుకున్నారు. ఇవన్నీ మహిళా సాధికరత, సామాజిక మార్పు, పర్యావరణ మార్పు, ఎయిడ్స్ బాధితులు, నిర్వాసితులు, సాయుధ దళాలు, క్రీడలు, అనాథల కోసం పనిచేసే సంస్థలు. ఈ విషయం గురించి కెన్సింగ్టన్ రాజ ప్రసాదం అధికారులు మాట్లాడుతూ ఇవన్ని చాలా చిన్నసంస్థలు వీటికి, ప్రిన్స్ హారీ జంటకు ఎటువంటి అధికారిక సంబంధాలు లేవని ప్రకటించారు. కేవలం ఆ సంస్థలకు సహాయం చేయడం కోసమే వీటిని ఎంపిక చేసుకున్నారని వెల్లడించారు. వీటిల్లో మన దేశంలోని ముంబైకి చెందిన ‘మైనే మహిళ ఫౌండేషన్’ ఒకటి. మేఘన మార్కెల్ గత ఏడాది ఈ ఫౌండేషన్ను సందర్శించారు. ఈ ఫౌండేషన్ వారు మహిళలకు ఉపాధి కల్పించడం కోసం కృషి చేస్తుంది. అందుకుగాను ఈ సంస్థ మహిళలకు సానీటరీ నాపికిన్ల తయారీలో శిక్షణ ఇస్తుంది. దీనివల్ల మహిళలకు ఉపాధితో పాటు వ్యక్తిగత శుభ్రత గురించి కూడా వారికి సమాచారం అందించే వీలు కలుగుతుంది. ఈ సంస్థ చేసిన కృషి ఫలితంగా పాఠశాలల్లో ఆడపిల్లల డ్రాపవుట్స్ కూడా తగ్గాయి. ఈ సంస్థవారు కేవలం సానీటరి పాడ్ల తయారీ గురించి మాత్రమే కాక గణితం, ఆంగ్లం, మహిళల ఆరోగ్యం, ఆత్మ రక్షణ వంటి అంశాల్లో కూడా మహిళలకు శిక్షణ ఇస్తుంది. ప్రిన్స్ హారీ - మేఘన జంట తమ వివాహ సందర్భంగా మా ఈ సంస్థను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. వీరి సహాయంతో మేము మా సంస్థ సేవలను మరిన్ని మురికి వాడలకు విస్తరించే అవకాశం లభిస్తుందని సంస్థ స్థాపకురాలు సుహాని జలోతా హర్షం వ్యక్తం చేశారు. సుహానీ 2015లో మైనే మహిళా ఫౌండేషన్ను స్థాపించారు. ముంబై మురికి వాడల మహిళలకు ఉపాధి కల్పనతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశారు. మైనే మహిళ ఫౌండేషన్తో పాటు మరో ఆరు సంస్థలను ఈ జంట ఎంపిక చేసుకున్నారు. అవి క్రైసిస్, స్కాటీస్ లిటిల్ సోల్జర్స్, స్ట్రీట్ గేమ్స్, సర్ఫర్స్ ఎగెనెస్ట్ సెవేజ్, సీహెచ్ఐవీఏ, వైల్డరనెస్ ఫౌండేషన్ యూకే. -
278 మందికి తాళికి బంగారం పంపిణీ
గుమ్మిడిపూండి: తాళికి బంగారం పథకం కింద 278మంది పేద యువతుల వివాహానికి బంగారం పంపిణీ కార్యక్రమం గుమ్మిడిపూండిలో ఆదివారం జరిగింది. స్థానిక బీడీవో కార్యాలయంలో గుమ్మిడిపూండి, ఎల్లాపురం యూనిట్లకు చెందిన లబ్ధిదారులకు తాళికి బంగారాన్ని గుమ్మిడిపూండి ఎమ్మెల్యే కె.ఎస్.విజయకుమార్ అందజేశారు. కార్యక్రమానికి బీడీవో దయానిధి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే విజయకుమార్ పాల్గొన్నారు. ముందుగా పది, ప్లస్ టు చదివి వివాహం చేసుకున్న గ్రామీణ ప్రాంతాల్లోని పేద యువతులు 278మందికి ఒక్కొక్కరికి 8 గ్రాముల బంగారాన్ని పంపిణీ చేశారు. అలాగే పేద యువతులు పెళ్లి చేసుకుంటే 10, 12, తరగతులు చదివే వారికి రూ.25వేలు, డిగ్రీ చదివిన వారికి రూ.50వేలు చొప్పున 86 మందికి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబాలను అభివృద్ధిపరచుకోవాలని కోరారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి మీనా, అడిషనల్ బీడీవో ఉమాదేవి, జిల్లా మాజీ కౌన్సిలర్ నారాయణమూర్తి, అన్నాడీఎంకే పట్టణ కార్యదర్శి ఎం.కె.శేఖర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
మరో బాంబు పేల్చిన ట్రంప్
వాషింగ్టన్ : ట్విటర్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస మంటలు పుట్టిస్తున్నారు. పాకిస్తాన్ను నిధులు నిలిపివేయడంతో పాటు సంచలన ఆరోపణలు చేసిన ట్రంప్.. తాజాగా పాలస్తీనాను లక్ష్యంగా చేసుకున్నారు. ఇజ్రాయిల్ రాజధానిగా జెరూసలేను గుర్తించే విషయంపై ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో.. పాలస్తీనాకు నిధులు నిలిపేస్తామంటూ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వరుస ట్వీట్లతో ఆ దేశంపై విరుచుకుపడ్డారు. ప్రతి ఏడాది వందల మిలియన్ డాలర్ల సహాయాన్ని తీసుకుంటూ.. అమెరికాపై ఏ మాత్రం గౌరవం చూపడం లేదని అన్నారు. ఇజ్రాయిల్తో శాంతి చర్చలను కొనసాగించేందుకు సూతం పాలస్తీనా అథారిటీ ఆసక్తి చూపడం లేదన్నారు. పాలస్తీనా అథారిటీ శాంతిని కోరుకోవడం లేదు.. అటువంటి పరిస్థితుల్లో వారికి సహాయ నిధులు అందించాల్సిన అవసరం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అగ్రరాజ్యం ప్రతి ఏడాది పాలస్తీనా అథారిటీకి 300 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందిస్తోంది. అదే ఇజ్రాయిల్కు 3.1 బిలియన్ల సైనిక సహాయం చేస్తోంది. దీనిని వచ్చే ఏడాది నుంచి 3.8 బిలియన్ డాలర్లకు పెంచుతంది. ఇదిలావుండగా.. జెరూసలేం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీనా అథారిటీ అగ్రరాజ్యం నుంచి తమ రాయబారిని వెనక్కు పిలిపించింది. ...peace treaty with Israel. We have taken Jerusalem, the toughest part of the negotiation, off the table, but Israel, for that, would have had to pay more. But with the Palestinians no longer willing to talk peace, why should we make any of these massive future payments to them? — Donald J. Trump (@realDonaldTrump) January 2, 2018 -
ఆర్టీసీలో కానరాని ఫస్ట్ ఎయిడ్
ప్రమాదాలు జరిగితే ప్రథమ చికిత్స లేనట్లే! పట్టించుకోని ఆర్టీసీ అధికారులు రాయవరం : ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం. ఇలా ప్రకటనలు గుప్పిస్తున్న రాష్ట రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ప్రథమ చికిత్స బాక్సుల ఏర్పాటులో నిర్లక్ష్యం వహిస్తోంది. బస్సు ప్రమాదానికి గురైతే అప్పటికప్పుడు తాత్కాలిక వైద్య సేవలు పొందేందుకు ప్రతి ఆర్టీసీ బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. ప్రస్తుతం అటువంటివి బస్సుల్లో కానవరావడం లేదు. బస్సు షడన్ బ్రెక్ వేసినప్పుడు ప్రయాణికులకు చిన్నపాటి గాయాలపాలైతే వారు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాల్సిందే. 3.23 లక్షల కిలోమీటర్ల ప్రయాణం జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, రావులపాలెం, రాజోలు, రామచంద్రపురం, ఏలేశ్వరం, తుని, గోకవరంలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలో మొత్తం 840 బస్సులు వివిధ మార్గాల్లో ప్రతి రోజు 3.23 లక్షల కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ఆర్టీసీలో ఉద్యోగంలో చేరే కొత్త డ్రైవర్లకు, కండక్టర్లకు తొలుత ఫస్ట్ ఎయిడ్ ధ్రువపత్రం ఇచ్చిన తర్వాతనే ఉద్యోగాలిస్తారు. ప్రయాణికులు గాయపడితే.. వారికి అత్యవసర చికిత్స చేసే సామర్థ్యం సంబంధిత బస్సు డ్రైవర్, కండక్టర్లకు ఉంటుంది. కాని ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురై ప్రయాణికులకు గాయాలైతే 108 వాహనం వచ్చే వరకూ ఆగాల్సిందే. అప్పటి వరకు క్షతగాత్రులు నొప్పితో బాధపడాల్సిందే. ప్రథమ చికిత్స అందక పోవడం వలన కొన్ని సందర్భాల్లో ప్రాణాప్రాయం కూడా కలుగుతుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో... ఫస్ట్ ఎయిడ్ బాక్సులో రెండు బ్యాండేజ్ కట్టలు, టించర్ అయోడిన్, గ్లాస్ బ్యాండేజ్, నొప్పి తగ్గించే ఆయింట్మెంట్, అత్యవసర మందులు ఉంటాయి. పట్టించుకోని అధికారులు.. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ల్లో మందులను ఏర్పాటు చేయక పోతే బస్సులను సీజ్ చేసే అధికారం ఆర్టీవో స్థాయి అధికారులకు ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వ బస్సులేనన్న భావనతో సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. -
నేపాల్ కు భారత్ భారీ ఆర్థిక సాయం
న్యూఢిల్లీ: భారత్, నేపాల్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో సమావేశమైన నేపాల్ ప్రధాని ప్రచండ, నరేంద్రమోదీలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. నేపాల్ భూకంప బాధితులకు సహాయార్థం భారత్ దాదాపు రూ. 5,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ప్రచండ గురువారం భారత్ చేరుకున్నారు. ప్రచండ మొదటి సారి ఇండియాలో పర్యటిస్తున్నారు. -
న్యాయ సహాయానికి కృషి
జిల్లా న్యాయమూర్తి సిహెచ్.విజయ్కుమార్ ఖమ్మం లీగల్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో త్రివర్ణ పతాకాన్ని జిల్లా న్యాయమూర్తి సిహెచ్.విజయ్కుమార్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ న్యాయ సహాయం అందించేందుకు న్యాయ సేవాసదన్ కృషి చేస్తున్నదన్నారు. అదనపు జిల్లా జడ్జి రాధాకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారుపల్లి గంగాధర్, జడ్జీలు మాధవీకృష్ణ, అమరావతి, పంచాక్షరి, సతీష్కుమార్, న్యాయ సేవాసదన్ కార్యదర్శి వీఏఎల్ సత్యవతి, న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దండి ప్రేమ్కుమార్, బార్ అసోసియేషన్ బాధ్యులు మేకల సుగుణారావు, శ్రీనివాస గుప్తా, ఎన్.రాము, అమర్నా«ద్, లక్ష్మీనారాయణ, ఇంద్రాచారి, కన్నాంబ తదితరులు పాల్గొన్నారు. -
ఫేస్బుక్ ద్వారా వినూత్న స్టడీ, వాలంటీర్లు కావాలి
న్యూయార్క్: మతిమరుపు అనేది మనిషి జీవితంలో ఊహించని పరిణామాలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వయసుమళ్లిన వారిపై దాడి చేసిన వారి జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న వ్యాధి అల్జీమర్స్. ఈ అల్జీమర్స్ వ్యాధి బారినపడ్డ రోగి జీవితంలో అనూహ్యంగా ఎంత గందరగోళం ఏర్పడుతుందో వారి సంరక్షకులపై అంతకంటే ఎక్కువ ఒత్తిడి నెలకొంటుంది. ఇరవై నాలుగ్గంటలూ వారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన సంరక్షకులకు డిప్రెషన్, ఆతురత, నిద్రలేమి, హృదయసంబంధ (కార్డియోవాస్క్యులర్) తదితర వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని ఇటీవల ఓ స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి ఉపయోగపడేలా ఫేస్బుక్ వెబ్ యాప్ ద్వారా ఒక అధ్యయనం చేపట్టనున్నారు. ఇండియానా యూనివర్శిటీ-పర్డ్యూవిశ్వవిద్యాలయం ఇండియానాపోలిస్ పరిశోధకుల బృందం స్వచ్ఛందంగా ఒక వినూత్న రీతిలో పైలట్ అధ్యయనం నిర్వహిస్తోంది. ఈ అధ్యయానికి గాను వాలంటీర్లను ఆహ్వానిస్తోంది. ఈ పార్టిసిపెంట్స్ తో మైక్రోవాలంటరీంగ్ గ్రూపు ను క్రియేట్ చేసి వారితో చర్చలు నిర్వహించనుంది. దీనికోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వెబ్ యాప్ ద్వారా సంరక్షకుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనుంది. దీని ద్వారా అల్జీమర్స్ పీడితుల సంరక్షలకు ఉపయోగపడాలని భావిస్తోంది. ఆరువారాల పాటు నిర్వహించనున్నఈ పైలట్ అధ్యయనంలో పాల్గొనే ఆసక్తి వున్నవారు alzgroup.iu.edu ద్వారా తెలుసుకోవచ్చని యూనివర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది. -
పరిహారమా.. పరిహాసమా..
గత ఏడాది వరద నష్టంపై ఇప్పటికీ అందని సాయం పంట నష్టం అంచనాలకే పరిమితం ఏడు నెలలుగా రైతుల ఎదురుచూపు గత ఏడాది నవంబరులో కురిసిన భారీ వ ర్షానికి పంటలు కోల్పోయిన జిల్లా రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. అట్టహాసంగా పంటల నష్టాన్ని అంచనాలు వేసిన ప్రభుత్వం, పరిహారం చెల్లించడంలో రైతులకు ఏడు నెలలుగా మొండిచేయి చూపుతోంది. ముంపునకు గురైన పంటలకు సంబంధించిన రైతులు నష్టపరిహారం అందుతుందని నెలల తరబడి ఎదురుచూసి నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. చిత్తూరు (అగ్రికల్చర్) దశాబ్ద కాలంగా వరుస కరువులతో జిల్లావాసులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ తరుణంలో జిల్లా వ్యాప్తంగా గత నవంబర్లో అనుకోని రీతిలో భారీ వర్షం కురిసింది. నవంబర్లో సాధారణ వర్షపాతం 164.1 మిల్లీమీటర్లు. గత ఏడాది నవంబర్లో అత్యధికంగా 650.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షంతో 5,593 హెక్టార్ల మేరకు పంటలు ముంపునకు గురయ్యాయి. రైతులకు రూ. 11.78 కోట్ల మేరకు నష్టం కలిగినట్లు అధికారులు అంచనా వేశారు. అందులో ఉద్యాన పంటలు 3,164 హెక్టార్లు దెబ్బతినగా, రూ. 4.78 కోట్లు నష్టం వాటిల్లింది. ఇతర పంటలు 2,429 హెక్టార్ల మేరకు ముంపునకు గురికాగా రూ. 7 కోట్లు నష్టం సంభవించింది. ఇందులో వరి 1,790 హెక్టార్లు, వేరుశనగ పంట 167 హెక్టార్లు, ఇతర పంటలు 472 హెక్టార్లు ముంపునకు గురయ్యాయి. నెలలు గడుస్తున్నా అందని పరిహారం జిల్లాలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిని నెల లు గడుస్తున్నా రైతులకు ప్రభుత్వం నష్టపరి హారం చెల్లించక కాలయాపన చేస్తోంది. నష్టపోయిన పంటలను కేంద్ర ప్రభుత్వ బృందం కూ డా జిల్లాకు విచ్చేసి పరిశీలించి అంచనా వేసింది. పంటలకు పరిహారాన్ని రైతులకు అందించడాన్ని మాత్రం మరచిపోయింది. పరిహారం అందకపోవడంతో రైతులు రోజురోజుకూ ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఓ పక్క చేతికందే దశలో పంటలను వర్షాల కారణంగా కోల్పోవడం, మరో పక్క వర్షం కురవడంతో కొత్త పంటలకు పెట్టుబడులు కూడా పెట్టలేక సతమతమయ్యారు. రబీలో పంటల సాగుకు రైతులకు బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోగా, ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా పరిహారం అందితే ఈ ఖరీప్ సీజనుకైనా ఆశించిన మేరకు అప్పులు చేయకుండా పంటలను సాగుచేసుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుచూస్తుంటే ముంపునకు గురైన పంటలకు నష్టపరిహారాన్ని అందించే పరిస్థితులు ఏమాత్రం కానరావడం లేదు. ఇప్పటి వరకు పైసా వుుట్టలేదు నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. పొలం పైభాగంలో వెళుతున్న తెలుగుగంగ కాలువకు వుూడుచోట్ల గండ్లు పడ్డారుు. వెరుు్య ఎకరాల పంట నీట వుునిగింది. 300 ఎకరాలకు ఇసుక దిబ్బలు కట్టారుు. దానిలో నా భూమి ఐదు ఎకరాలు మొదట్లోనే ఉంది. వుంత్రులతోపాటు స్థానిక నాయుకులు, అధికారులు పదేపదే పరిశీలన చేస్తే న్యాయుం జరుగుతుందని భావించాం. నెలలు గడిచిపోతున్నా పైసా కూడా అందలేదు. -ఈశ్వరయ్యు, చిన్నకనపర్తి గ్రావుం, తొట్టంబేడు వుండలం ప్రభుత్వం నుంచి పరిహారం రాలేదు నవంబరులో కురిన భారీ వర్షాలకు దె బ్బతిన్న పంటలకు నష్టపరిహారం అంచాలు వేసి ప్రభుత్వానికి పంపాం. వాటికి సంబందించిన నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇంతవరకు రాలేదు. -విజయ్కుమార్, వ్యవసాయశాఖ జేడీ -
పాక్కు సాయంపై శ్వేతసౌధం మెలిక
వాషింగ్టన్: పాకిస్తాన్కు 300 మిలియన్ల డాలర్ల ఆర్థిక సహాయం అందజేయాలంటే షరతులు విధించాలనే సెనేట్ ప్రతిపాదనను శ్వేతసౌధం వ్యతిరేకించింది. ఇటువంటి షరతులు ద్వైపాక్షిక సంబంధాలకు ప్రతిబంధకాలుగా మారతాయని, ఇలా చేయడం జాతి ప్రయోజనాలకు వ్యతిరేకమని ఒబామా యంత్రాంగం స్పష్టం చేసింది. -
తెలంగాణకు రెండో విడత కరువు సాయం
► రూ. 328 కోట్లు విడుదల చేసిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: కరువు సాయంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో రూ.328 కోట్లు విడుదల చేసింది. ముందుగా కేంద్రం ప్రకటించిన సాయంలో రెండో విడతగా ఈ నిధులను కేటాయించింది. రాష్ట్రంలో 231 మండలాలను ప్రభుత్వం డిసెంబరులోనే కరువు మండలాలుగా ప్రకటించింది. వర్షాభావంతో నెలకొన్న దుర్భర పరిస్థితులు, కరువును అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలకు తక్షణ సాయం అందించాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం నుంచి వచ్చిన అధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించి కరువు పరిస్థితులను పరిశీలించారు. ఈ బృందం చేసిన సిఫారసుల మేరకు జనవరిలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.791 కోట్ల కరువు సాయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం కావటంతో జనవరిలో ఈ నిధులు విడుదల చేయకుండా పెండింగ్లో పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రకృతి విపత్తుల సహాయ నిధిలో అందుబాటులో ఉన్న రూ.78.56 కోట్లు వాడుకోవాలని సూచించింది. మిగతా నిధులను త్వరలోనే విడుదల చేస్తామని లేఖ రాసింది. ఈ మేరకు ఫిబ్రవరిలో మొదటి విడతగా రూ.56.30 కోట్లు విడుదల చేసింది. రెండో విడతగా ఇప్పుడు రూ.328 కోట్లు కేటాయించింది. మిగతా నిధులను చివరి విడతగా విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. మరో రూ.328 కోట్ల సాయం కేంద్రం నుంచి రావాల్సి ఉంది. కరువు మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాల్సి వచ్చింది. వచ్చే పంటకు పెట్టుబడి రాయితీగా అందించే ఈ మొత్తానికి దాదాపు రూ.900 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపు ఆలస్యమవటంతో కరువు మండలాల్లోని రైతులు తమకెప్పుడు సాయం అందుతుందా? అని నిరీక్షిస్తున్నారు. మే నెలలోగా ఇన్పుట్ సబ్సిడీని రైతులకు చెల్లిస్తామని ఇటీవలే వ్యవసాయశాఖ మంత్రి పోచారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్రం అరకొరగా విడతల వారీగా నిధులు విడుదల చేయటం.. చెల్లింపులపై ప్రభావం చూపనుంది. -
కుక్కలు, పిల్లులే ఆహారమౌతున్నాయ్...!
సిరియా ప్రభుత్వ సైన్యాధికారంలో ఉన్న నగరాల్లోని ప్రజలు ఇప్పుడు ఆకలితో అల్లాడుతున్నారు. వేలాదిమంది పస్తులతో మరణిస్తున్నారు. కడుపు నింపుకొనేందుకు పిల్లులు, కుక్కలను తినాల్సిన స్థితికి చేరుకున్నారు. ఒకప్పుడు సిరియన్ల ప్రముఖ హాలీడే రిసార్ట్ గా ఉన్న మధ్య నగరం.. ఇప్పుడు బస్తర్ అల్ అసద్ ప్రభుత్వాధీనంలోకి వెళ్ళిపోయింది. ముట్టడిలో ఉన్న ఆ ప్రాంతంలోని జనం తిండి, నీళ్ళు, నిద్రా లేక అవస్థలు పడుతున్నారు. అయితే ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా మీడియా దృష్టి పెట్టడంతో సిరియన్ ప్రభుత్వం ఇప్పుడు వారికి సాయం అందించేందుకు ఆయా పట్టణాలకు అనుమతిస్తోంది. సిరియా ప్రభుత్వ ఆమోదాన్ని తాము స్వాగతిస్తున్నామని, రాబోయే రోజుల్లో మానవతా దృక్పధంతో అక్కడి వారికి సహాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి చెప్పారు. అయితే చలికాలం కావడంతో 'మధ్య'లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆకలి తట్టుకోలేక అక్కడివారు పిల్లులు, కుక్కలను తినేందుకు వెనుకాడటం లేదు. అందుకు ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ఓ చిత్రం సాక్ష్యంగా నిలుస్తోంది. కొందరు ఆకులు తిని కడుపు నింపుకుంటున్నారు. ఆకలి తీరేందుకు చాలా కుటుంబాలు గడ్డి తిని నీరు తాగడం, లేదా సుగంధ ద్రవ్యాలు, జామ్ వంటి వాటిని ఆశ్రయిస్తున్నారు. నీరు నింపిన ప్లేట్ లో ఏదో పచ్చని పదార్థం కలిపి సేవిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మరో ఫోటో కూడ అక్కడి పరిస్థితిని కళ్ళకు కడుతోంది. బియ్యం కిలో 170 యూరోలు అమ్ముతుండటంతో అక్కడివారికి కొనలేని పరిస్థితి నెలకొంది. మధ్య ప్రాంతవాసుల దారుణ పరిస్తితి వారి కళ్ళలో చూశానని రెడ్ క్రాస్ ప్రతినిధి డైబర్ ఫాకర్ అంటున్నారు. ''మహిళలు తమకు తిండిలేక.. పిల్లలకు పాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆకలిని తట్టుకోలేక రోజుకు ఇద్దరు ముగ్గురు చనిపోతున్నారు'' అని మధ్య ప్రాంతంలోని మెడికల్ కౌన్సిల్ మేనేజర్ చెప్తున్నారు. చనిపోయేవారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉంటున్నారని ఆయన తెలిపారు. నీరసించి, చావుబతుకుల్లో ఉన్నవారిని ఆరోగ్య సిబ్బంది ఇరవై నాలుగు గంటలు కనిపెట్టుకొని ఉంటున్నారని, అయితే తమ సంస్థ మరి కొద్ది రోజుల్లో వీరికి సహాయం అందించేందుకు ప్రయత్నిస్తోందని చెప్తున్నారు. మధ్య నగరానికి అక్టోబర్ ప్రాంతంలో సుమారు ఇరవై లారీల వైద్య, ఆహార పదార్థాలను అనుమతించారు. అప్పటినుంచి పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. అయితే ఇటీవలి కొన్ని వారాల్లోనే ఆహారం లేక పదిమంది, ఆహారంకోసం ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ బలగాల కాల్పుల్లో 13 మంది వరకూ చనిపోయారని బ్రిటన్ కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ హ్యూమన్ రైట్స్ చెప్తోంది. సిరియాలో యుద్ధం అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యునైటెడ్ నేషన్స్ పేర్కొంది. -
తెలుగు సినీ నటులు ఆర్ధిక సాయం
-
కొందరికే ‘బంధు’వయా!
ఆదుకోని ‘ఆపద్బంధు’ నిధుల మంజూరులో అలసత్వం పేద కుటుంబాలకు అందని సాయం సిటీబ్యూరో: ఆపద్బంధు పథకానికి నిధుల కొరత వేధిస్తోంది. హైదరాబాద్ జిల్లాలో అర్హులను ఎంపిక చేసినా.. సాయం అందడం లేదు. నిరుపేద కుటుంబాల్లో పోషించే వ్యక్తి (ఇంటి యాజమాని) ప్రమాదవశాత్తూ చనిపోతే... మిగిలిన వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2013-14 సంవత్సరానికి జిల్లాలో 82 కుటుంబాలు ఈ పథకానికి ఎంపికయ్యాయి. వీరికి రూ.41 లక్షలు సాయం అందించాల్సి ఉంది. ప్రభుత్వం రూ.27 లక్షలు మాత్రమే విడుదల చేసింది. ఈ మొత్తం 54 కుటుంబాలకు పంపిణీ చేశారు. మిగిలిన వారికి నిరాశే మిగిలింది. ఈ పథకం ద్వారా సాయం పొందేందుకు స్థానిక తహశీల్దార్ కార్యాలయంతో పాటు నాంపల్లి, సికింద్రాబాద్లలోని ఆర్డీఓ కార్యాలయాలు, అబిడ్స్లోని కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధిత కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదీ అంతేనా? ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2014-15) ఈ పథకం పరిస్థితి అలాగే ఉంది. దరఖాస్తుల పరిశీలన, మంజూరు వంటి అంశాలపై ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు లేవు. బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు వీటిని ఏం చేయాలనే సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటి వరకు తహశీల్దార్ కార్యాలయాలు, ఆర్డీ ఓ50 దరఖాస్తులు అందినట్టు అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్నా... మార్గదర్శకాలు లేకపోవడంతో అధికారులు వీటిని పరిశీలించే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆపద్బంధు పథకం కింద తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాల వారు కోరుతున్నారు. -
ప్రశ్నించిన చూపులు!
ఫొటో స్టోరీ ఈమె కళ్లలో ఏం కనిపిస్తోంది? ఎవ్వరూ సమాధానం చెప్పలేని ఓ ప్రశ్న కదలాడుతున్నట్టుగా అనిపించడం లేదూ! అవును. ఆమె నిజంగానే ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని... వారి నిర్లక్ష్యాన్ని! అధికారుల్ని... వారి అలక్ష్యాన్ని! జనాలని... వారి నిస్సహాయతని! నవంబర్ 13, 1985. కొలంబియాలోని నెవడో డెల్ రూయిజ్ అగ్నిపర్వతం బద్దలై నిప్పులు కక్కింది. లావా పరవళ్లు తొక్కింది. చుట్టుపక్కల ఉన్న పద్నాలుగు గ్రామాలను అతలాకుతలం చేసింది. వాటిలో అర్మెరో ఒకటి. అగ్నిపర్వతానికి అతి దగ్గరలో ఉన్న ఆ ఊరిలోనే ఉండేది ఒమైరా సాంచెజ్ (13) కుటుంబం. అగ్నిపర్వతం బద్దలయ్యే సమయానికి ఇంట్లోవాళ్లంతా బయటకు వెళ్లారు. పిన్నితోపాటు ఒమైరా మాత్రమే ఉంది. ఇల్లు కూలిపోయింది. బురద ముంచెత్తింది. పిన్ని చనిపోయింది. ఒమైరా బురద, కాంక్రీటు, నీరు కలిసిన మడుగులో చిక్కుబడిపోయింది. తెల్లారేసరికి రెస్క్యూ టీములు వచ్చాయి. ఒమైరాని బయటకు తీసే ప్రయత్నాలు మొదలెట్టాయి. కానీ ఆమె కాళ్లు ఇటుకల మధ్య ఇరుక్కుపోవడంతో ఫలితం లేకుండా పోయింది. ఓ దుంగను ఆసరాగా పట్టుకుని మూడు రాత్రులు అలానే ఉండిపోయింది ఒమైరా. నన్ను కాపాడలేరా అన్నట్టుగా ఆమె దీనంగా చూస్తుంటే అక్కడున్నవారంతా కన్నీళ్లు పెట్టారు. అవసరమైతే ఆమె కాళ్లు కోసేసి అయినా బయటకు లాగేయాలనుకున్నారు. కానీ తక్షణ చికిత్స అందించే అవకాశం లేకపోవడంతో... ఆమెనలా చనిపోనివ్వడమే మంచిదనుకున్నారు. విషయం తెలిసినా నాయకులు గానీ, అధికారులు గానీ ఆమెను కాపాడేందుకు ప్రత్యేక ఏర్పాట్లేమీ చేయలేదు. అరవై గంటల పాటు నరకయాతన అనుభవించింది ఒమైరా. ఒళ్లంతా పాలిపోయింది. ముఖం ఉబ్బిపోయింది. కళ్లు వాచి, ఎర్రబడ్డాయి. ‘ఇక నన్నిలా వదిలేయండి, మీరెళ్లి విశ్రాంతి తీసుకోండి’ అని చెప్పింది. ఆసరాగా పట్టుకున్న దుంగను మెల్లగా వదిలేసింది. నిస్సహాయంగా ప్రాణాలు విడిచింది. అంతకు కొద్ది నిమిషాల ముందు ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ ఫ్రాంక్ ఫార్నియర్ ఈ చిత్రాన్ని తీశాడు. ప్రపంచ నేత్రాన్ని చెమ్మగిల్లేలా చేశాడు. పులిట్జర్ పురస్కారాన్ని అందుకున్నాడు!