Akun Sabarwal
-
టాలీవుడ్లో మళ్లీ డ్రగ్స్.. నాడు ఏం జరిగింది?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ దుమారం తెరపైకి వచ్చింది. తాజాగా కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో తెలుగు చిత్రసీమను కుదిపేస్తుంది. ఇప్పటికే అతని కాల్ లిస్ట్లో ఇద్దరు స్టార్ హీరోయిన్లతో పాటు నలుగురు మహిళా నటులు ఉన్నారని సమాచారం. ఈ లింక్ వెనుక ప్రముఖ డైరెక్టర్ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలుగు పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా కొత్త కాదు. 2017లో టాలీవుడ్లో డ్రగ్స్ కేసు భారీగా ప్రకంపనలు రేపింది. గతంలో టాలీవుడ్ను డ్రగ్స్తో షేక్ చేసిన అలెక్స్ను పోలీసులు పట్టుకోవడంతో సినీ తారల పేర్లు ఒక్కోక్కటిగా బయటకొచ్చాయి. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ నియమించి విచారణ చేపట్టారు. రవితేజ, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాధ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను విచారించి..వారి నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించారు. మొత్తం 12 కేసులు నమోదుచేసిన పోలీసులు 7 చార్జిషీట్లు వారిపై అప్పట్లో దాఖలు చేశారు. (ఇదీ చదవండి: Drugs Case: కేపీ చౌదరి ఫోన్ లిస్ట్లో సినీ ప్రముఖల లిస్ట్) నాటి విచారణలో ఏం తేల్చారు దర్యాప్తులో భాగంగా అప్పటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో టాలీవుడ్కు చెందిన అనేక మందిని విచారించి.. వారి వాంగ్మూలం నమోదు చేశారు. డ్రగ్స్ వాడుతున్నదీ, లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వీరందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తుతో పాటు సాక్షులనూ విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా మత్తుమందుల వాడకంపై ప్రాథమిక ఆధారాలూ లభించలేదు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ముగిసిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై మళ్లీ కొత్తగా సినీ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. (ఇదీ చదవండి: రాయలేని భాషలో బూతులు.. ‘సైతాన్’ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..) దీనిలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరో రవితేజ, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాధ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ వంటి వారిలో 12మందిని విచారించారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. అలా ఈడీ విచారణ కూడా సుమారు 2 నెలలు కొనసాగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని ఈడీ తేల్చేసింది. వారిలో ఎవరూ కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసును మూసివేసినట్లు అయింది. ఈడీ ఎంట్రీతో ఆయన బదిలీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్న సమయంలో ఈడీ రంగంలోకి దిగడం అబ్కారీ శాఖకు సంకటంగా మారింది. ఆ సమయంలో అకున్ సబర్వాల్ ఆకస్మికంగా బదిలీ కావడం సంచలనం కలిగించింది. తర్వాత ఆ సిట్కు వేరే అధికారుల నేతృత్వంతో కేసు నీరుగారిపోయిందని, సిట్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఆ సమయంలో పలు విమర్శలు వచ్చాయి. బాలీవుడ్లో డ్రగ్స్.. అక్కడా ఇదే స్టైల్ బాలీవుడ్ బాద్షా షారుక్ కొడుకు ఆర్యన్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అప్పట్లో దుమారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ అతనికి క్లీన్ చిట్ వచ్చింది..అతను నిర్దోషిగా తేల్చి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వదిలేసింది. మరి ఆర్యన్ నిర్దోషి అయితే 28 రోజులు ఎందుకు జైల్లో పెట్టారు? రెండు సార్లు బెయిల్ ఎందుకు తిరస్కరించారు? అసలు ఏ ఆధారాలతో పట్టుకున్నారు? అనే ప్రశ్నలకు ఇప్పటికి సమాధానాలు దొరకలేదు. (ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ అని చెర్రీకి చెప్పా.. అలా చేయొద్దన్నాడు: ఉపాసన) ఆర్యన్ కేసుకు ముందు కూడా బాలీవుడ్లో డ్రగ్స్ కలకలం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి ఫోన్లో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయని చెప్పారు. రియా సుశాంత్కు డ్రగ్స్ తెప్పించేదని ఆరోపణలొచ్చాయి. డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడంతో.. సుశాంత్ మృతి కేసు కూడా మరుగున పడిపోయింది. అక్కడి నుంచి రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ సింగ్ నుంచి శ్రద్ధ కపూర్, దీపికా పదుకునే లాంటి టాప్ స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. వీళ్లందర్నీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించింది. ఆ సమయంలో కూడా బాలీవుడ్ మూలస్తంభాలకూ డ్రగ్స్ లింకులున్నాయని, టాప్ హీరోలందరికీ నోటీసులిస్తారని పెద్దఎత్తున దుమారం రేగింది. కానీ అక్కడా కేసు సైలెంటైపోయింది. సినిమా రంగంలోనే ఎందుకు? సినిమా అనేది అనేక రంగుల ప్రపంచం. అక్కడ డబ్బు, ఫేమ్ సంపాదించే క్రమంలో నటీనటులతో పాటు టెక్నీషియన్స్లలో కొందరు ఈ డ్రగ్స్ కల్చర్కు అలవాటు పడుతారని తెలుస్తోంది. అంతేకాకుండా ఫిట్ నెస్, సౌందర్యం కోసం కూడా డ్రగ్స్ తీసుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాడీని మైంటైన్ చేయడంతో పాటు వయసు మీద పడకుండా ఉండటానికి కూడా కొన్ని రకాల మాదక ద్రవ్యాలు తీసుకుంటారని కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. సినీ ఇండస్ట్రీలలో జరిగే పార్టీ కల్చర్ లో వీటిని అలవాటు చేసుకొని.. మెల్లమెల్లగా డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్కి బానిసలైన సెలబ్రిటీలను లొంగదీసుకుని... సెలబ్రిటీలను డ్రగ్స్ ఉచ్చులోకి డీలర్స్ దింపుతారని తెలుస్తోంది. ఆ మధ్య బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్ - మాధవీలత వంటి వారు సినీ ఇండస్ట్రీలో జరిగే పార్టీలలో డ్రగ్స్ కంపల్సరీ అని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. -
వైద్యుల నిర్లక్ష్యం.. నిరుపేదకు 8 లక్షల పరిహారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వినియోగదారుల సహాయ కేంద్రం ఓ బాధితుడికి అండగా నిలిచింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఆపరేషన్ వికటించి ఉపాధి కోల్పోయి తీవ్ర అనారోగ్యానికి గురైన యోగా మాస్టర్కు రూ.8 లక్షలు నష్టపరిహారం ఇప్పించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లికి చెంది న పి.దేవయ్య(31) యోగా శిక్షకుడు. జాతీయ పోలీసు అకాడమీలో కూడా పనిచేశారు. యోగాలో అంతర్జాతీయస్థాయిలో కాంస్య పతకం సాధించాడు. 2018 ఫిబ్రవరి 24 సికింద్రాబాద్లోని పైల్స్ క్లినిక్లో రూ.25 వేల ప్యాకేజీతో లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. డిశ్చార్జి అయిన తర్వాత రక్తస్రావం కావడంతో మరుసటిరోజు అదే క్లినిక్లో సంప్రదించాడు. దీంతో యశోదా హాస్పిటల్కు వెళ్లాలని వైద్యులు రిఫర్ చేశారు. చికిత్స కోసం పెద్దమొత్తంలో డబ్బులు అవసరమని డాక్టర్లు చెప్పడంతో దేవయ్య కుటుంబసభ్యులు, సన్నిహితులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ను సంప్రదించారు. ఆయన స్పందించి రూ.5.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేయించారు. కానీ, నెలన్నర పాటు యశోద హాస్పిటల్లో చికిత్స చేసుకున్న దేవయ్యకు మొత్తం రూ.18 లక్షల ఖర్చు అయింది. మిగతా డబ్బుల కోసం తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మి, మరికొంత అప్పు చేసి హాస్పిటల్ బిల్లు చెల్లించారు. అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత పైల్స్ క్లినిక్పై తెలంగాణ వినియోగదారుల సహాయకేంద్రాన్ని ఆశ్రయించారు. సహాయ కేంద్రం నిర్వాహకులు హాస్పిటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి ఇరవై రోజుల్లో కేసును పరిష్కరించి దేవయ్యకు రూ.8 లక్షల నష్టపరిహారం ఇప్పించారు. ఈ చెక్కును పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదివారం దేవయ్యకు అందజేశారు. న్యాయం జరిగింది: దేవయ్య ‘తీవ్ర అనారోగ్యానికి గురై, ఉపాధి కోల్పోయిన నాకు కేటీఆర్, వినియోగదారుల సహాయ కేంద్రం అండగా నిలిచింది. ఆపరేషన్ విషయంలో నిర్లక్ష్యం చేసిన హాస్పిటల్ నుంచి రూ.8 లక్షల నష్టపరిహారం ఇప్పించారు. ఉచితంగా ఇరవై రోజుల్లోనే సమస్యను పరిష్కరించి తనకు న్యాయం చేశారు’అని దేవయ్య తెలిపారు. -
62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ చర్యలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి ఏటేటా భారీగా ధాన్యం దిగుబడి పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు పౌరసరఫరాల శాఖ 11 లక్షల మంది రైతుల నుండి 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇందులో ఖరీఫ్లో 3,297 కొనుగోలు కేంద్రాల ద్వారా 8,09,885 మంది రైతుల నుండి 40.41 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. రబీలో ఇప్పటివరకు 3,447 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.52 లక్షల మంది రైతుల నుండి 22.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిం దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలతో గిట్టుబాటు ధర పంటకు కనీస గిట్టుబాటు ధర లభిస్తుందన్న భరోసాతో రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ధాన్యం కొనుగోలు, కొనుగోలు కేంద్రాల సమాచారాన్ని రైతులకు సెల్ఫోన్ ద్వారా అందించేలా, కనీస మద్దతు ధర చెల్లింపులతో రైతులకు మరింత ప్రయోజనం కలిగేలా ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓపీఎంఎస్) సాఫ్ట్వేర్ను పౌరసరఫరాల శాఖ అభివృద్ధి చేసింది. రేషన్ డీలర్ల నుంచి గోనె సంచులను సేకరించింది. ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యం లేకుండా ఏరోజుకారోజు ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. ఫిర్యాదుల స్వీకరణకు పౌరసరఫరాల శాఖ కేంద్ర కార్యాలయంలో ముగ్గురు సీనియర్ అధికారులతో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నంబర్ 1800 425 00333, వాట్సప్ నంబర్ 7330774444లను అందుబాటులో ఉంచింది. కంట్రోల్ రూంకు 506 ఫిర్యాదులు రాగా 477 పరిష్కరించింది. ముమ్మర పర్యటనలు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ నల్లగొండ, సూర్యాపేట్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. అకాల వర్షాలు, మండుటెండల నేపథ్యంలో ధాన్యం సేకరణలో సమస్యలు రాకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా పౌరసరఫరాల శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి సూచనల మేరకు కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రతిరోజూ జిల్లా జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. -
అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు
సాక్షి, హైదరాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఉద్యోగులందరూ ఆ దిశగా పనిచేయాలని పౌరసరఫరాల కమిషనర్ అకున్ సబర్వాల్ సూచించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులను జారీచేశారు. ఎన్నికల కోడ్ ముగిసిన జూన్ 1 నుంచి రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని ఆదేశించారు. చీఫ్ రేషనింగ్ కార్యాలయం (సీఆర్ఓ) పరిధిలో రేషన్ కార్డుల జారీ, 6ఏ కేసుల పరిష్కారం, రేషన్ డీలర్ల నుంచి గోనె సంచుల సేకరణలో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి బుధవారం సీఆర్ఓ కార్యాలయంలో కమిషనర్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల జారీని వేగం చేయడానికి శాఖ చర్యలు చేపట్టింది. నలుగురు ఉన్నతాధికారులతో 2 కమిటీలను వేసి అవి చేసిన సిఫారసులు అమలయ్యేలా ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో జిల్లాల వారీగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల దరఖాస్తులను త్వరితగతిన ఎలా పరిష్కరించాలనే దానిపై హెచ్ఎండీఏ పరిధికి సంబంధించి ఇద్దరు, గ్రామీణ ప్రాంతాలకు చెంది మరో ఇద్దరు ఉన్నతాధికారులతో 2 కమిటీలు ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఆ దరఖాస్తులను డీసీఎస్ఓలు, ఏసీఎస్ఓల లాగిన్కు వచ్చిన 7 రోజుల్లో కార్డుల జారీ పూర్తి చేయాలి’ అని అన్నారు. -
పౌరసరఫరాల ఐటీ సేవలపై అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పౌర సరఫరాలశాఖలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, అమలుతీరుపై అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియాన్) దేశాల అధికారుల బృందం అధ్యయనం చేసింది. రాష్ట్రంలో కోట్లాది మంది పేదప్రజలకు సేవలందిస్తున్న పౌరసరఫరాల శాఖ సాంకేతికతను ఉపయోగించుకుంటున్న విధానం బాగుందని కొనియాడింది. శుక్రవారం ఇండోనేసియా, కంబో డియా, మయన్మార్, థాయ్లాండ్, వియత్నాం, మలేసియా దేశాల నుంచి గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమాభివృద్ధి తదితర విభాగాలకు చెందిన 13 మంది అధికారులు పౌర సరఫరాల భవన్లో కమిషనర్ అకున్ సబర్వాల్తో సమావేశమయ్యారు. శాఖలో చేపట్టిన వినూత్న చర్యలు, సంస్కరణలు, విధానాలపై 18 దేశాల ప్రతినిధులు అధ్యయనం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు, ఈ–పాస్, ఐరిస్ విధానం, టి–రేషన్ యాప్, గోదాముల్లో సీసీ కెమెరాలు, రేషన్ సరుకులు తరలించే వాహనాలకు జీపీఎస్, ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పనితీరును పరిశీలించారు. సరుకుల పంపిణీ విధానం, రేషన్షాపులు, రేషన్ కార్డుల సంఖ్య, అక్రమాలకు తావులేకుండా లబ్ధిదారులకు ఏ విధంగా సరుకులు చేరుతున్నాయనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శాఖలో చేపట్టిన చర్యలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషనర్ వివరించారు. -
39 లక్షల టన్నులు.. 3,732 కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కోసం పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా సన్నద్ధమవుతోంది. 39 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందులో ఏప్రిల్లో 14.25 లక్షల టన్నులు, మేలో 20.22 లక్షలు, జూన్లో 5.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా వేసింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 3,732 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వీటిలో ఐకేపీ 1,366, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) 2,163, డీసీఎంఎస్, ఐటీడీఏ 203 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను నిర్వహిస్తాయి. కనీస వసతులపై దృష్టి పెట్టండి యాసంగి ధాన్య సేకరణ ఏర్పాట్లపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ బుధవారం జాయింట్ కలెక్టర్లు, డీసీఎస్ఓలు, జిల్లా మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్థానిక అవసరాలను బట్టి రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే అప్పటికప్పుడు కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. వర్ష ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎగువ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. మిల్లుల సామర్థ్యం మేరకు రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపులు జరపాలని, పౌరసరఫరాల శాఖకు కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)కు సంబంధించి బియ్యం ఎగవేతదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం కేటాయింపులు జరపకూడదన్నారు. ధాన్యం దిగుబడిని దృష్టిలో పెట్టు కొని ప్రాధాన్యత క్రమంలో జిల్లాల వారీగా గోనె సంచులను కేటాయించడం జరుగుతోందని, స్థానికంగా ఎక్కడైనా అవసరమైతే రేషన్ డీలర్ల నుంచి ఒక్కో గోనె సంచి ధర రూ.16 చొప్పున కొనుగోలు చేయాలన్నారు. అంతా నిఘా నీడలో.. ప్రభుత్వానికి, రైతులకు, మిల్లర్లకు ప్రయోజనకరంగా ఉండేలా ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్)ను మరింత అభివృద్ధి చేశామని అకున్ సబర్వాల్ చెప్పారు. రైస్మిల్లు సీడింగ్ సామర్థ్యం తెలుస్తుందని, మిల్లులకు ధాన్యం కేటాయించడానికి వాటి మిల్లింగ్/బాయిలింగ్ సామర్థ్యం సమాచారం ఉంటుందని తెలిపారు. ధాన్యం కేటాయించిన 7 రోజులకైనా మిల్లుల నుంచి సమాచారం అందకపోతే ఆయా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు, జిల్లా మేనేజర్లకు హెచ్చరికలు జారీ చేస్తుందన్నారు. ఆన్లైన్లో రైతుల రిజిస్ట్రేషన్ జరుగుతుందని, జియో ట్యాగింగ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు, మిల్లులపై నిఘా ఉంటుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు ధాన్యాన్ని తరలించే వాహనాలకు జీపీఎస్ యంత్రాలను అమర్చడం జరుగుతుందని తెలిపారు. -
వరికి అభిషేకం
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానంతో పౌరసరఫరాల శాఖలో అక్రమాలకు అడ్డు వేసిన తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో ముందడుగు వేసింది. పౌరసరఫరాల సంస్థ గోదాముల్లో 5 టన్నుల సామర్థ్యం ఉన్న ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను (ఈవేయింగ్ మెషీన్), ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని నింపే యంత్రాలను (ప్యాడీ ఫిల్లింగ్ మెషీన్) ప్రవేశపెట్టాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే రబీ నుంచి కొన్ని కొనుగోలు కేంద్రాల్లో వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనుంది. అనంతరం ఖరీఫ్ నాటికి పూర్తిస్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. రేషన్ డీలర్లకు కచ్చితమైన తూకంతో నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థకు చెందిన 170 గోదాముల్లో ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ఏర్పాటు చేయబోతోంది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ శనివారం చర్లపల్లిలోని మెట్వే ఇండియా ఫ్యాక్టరీలో ఈ యంత్రాల పనితీరును పరిశీలించారు. మార్చి 31 నాటికి అన్ని గోదాముల్లో ఎలక్ట్రానిక్ తూకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ యంత్రాలను సాఫ్ట్వేర్ ద్వారా పౌరసరఫరాల భవన్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు, జిల్లాల్లో మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానం చేస్తామని చెప్పారు. దీని ద్వారా వేయింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఎనిమిదో తరగతి విద్యార్థి అభిషేక్ కనిపెట్టిన ధాన్యాన్ని నింపే యంత్రాన్ని వచ్చే యాసంగి (రబీ) నుంచి ప్రయోగాత్మకంగా కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రవేశపెట్టాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. విద్యార్థి అభిషేక్కు అభినందన.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న అభిషేక్ ప్యాడీ ఫిల్లింగ్ మెషీన్ను తయారుచేశారు. అభిషేక్ తల్లిదండ్రులు రాజవ్వ, లక్ష్మీరాజ్యం, సిరిసిల్ల జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మీన్, స్కూల్ హెడ్మాస్టర్ ఉమారాణి, గైడ్ వెంకటేశంలు శనివారం పౌరసరఫరాల భవన్లో కమిషనర్ అకున్ సబర్వాల్కు ఈ యంత్రం పనితీరు గురించి వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ అభిషేక్కు రూ. 10 వేల నగదు, రోబో బొమ్మను బహూకరించి, అభిషేక్కు మంచి భవిష్యత్తు ఉందని ప్రశంసించారు. రైతులకు ఎంతో ఉపయోగపడే ఈ యంత్రాన్ని కనిపెట్టిన అభిషేక్ను అభినందించారు. యంత్రానికి సంబంధించి కొన్ని మార్పులు సూచించారు. అభిషేక్ తయారు చేసిన యంత్రం చిన్నదిగా ఉందని, హమాలీలకు సరిపోయే విధంగా ఎత్తును పెంచాలని కోరారు. ప్రస్తుతం ఈ యంత్రం 20 కేజీల బరువును మాత్రమే తూకం చేసే విధంగా ఉందని, దీన్ని 40–45 కిలోల బస్తా బరువు మోసే విధంగా, కొద్దిగా వెడల్పుగా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మార్పులు చేసిన తరువాత కొనుగోలు కేంద్రాల్లో ప్రవేశ పెడతామని పేర్కొన్నారు. యంత్రం భద్రత విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వరి అభిషేక్ పేరుతో పేటెంట్ హక్కులు.. తెలంగాణ ప్రభుత్వం పేరుతో పాటు ’వరి అభిషేక్’ పేరుతో పేటెంట్ హక్కులను తీసుకుంటామని అకు న్ సబర్వాల్ అన్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మెషీన్తో నలుగురు చేసే పనిని ఒక్కరే చేయవచ్చు. దాని బరువును కూడా కొలవవచ్చు. బస్తా నిండిన తర్వాత ఎక్కడ నిల్వ చేయాలో అక్కడి వరకు ఈ యంత్రంతోనే తరలించవచ్చు. రైతులకు సమయం, డబ్బు ఆదా చేయడమే కాకుండా, శ్రమ కూడా తగ్గుతుంది. ఈ యంత్రాన్ని రైతులు వారి పొలంలో, ఇళ్ల వద్ద, ఐకేపీ సెంటర్లలో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఈ యంత్రం ద్వారా కూలీల కొరతనూ అధిగమించవచ్చు. -
వినియోగదారుల పాత్ర ఉండాలి: అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వ్యక్తుల ఫొటో లు, పేర్లను వారి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా ప్రచారానికి వాడుకుంటున్న ఒక రెడీమేడ్ షాపుపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి.. వినియోగదారుల సలహా కేంద్రానికి ఫిర్యాదు చేసి షాపు యాజమాన్యంపై విజయం సాధించారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన సలహా కేంద్రం నిర్వాహకులు షాపు యజమానులకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫొటో వాడుకున్నందుకు సలహా కేంద్రం రూ.10 వేల జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని వినియోగదారుల సలహా కేంద్రం బి.ఆకాశ్ కుమార్కు అందజేసింది. ఈ సందర్భంగా ఆకాశ్ను రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి అకున్ సబర్వాల్ అభినందించారు. ఇటువంటి కేసు మా విభాగానికి రావడం ఇది తొలిసారి అని, ఆకాశ్ లాగా ప్రతి ఒక్క వినియోగదారుడు వివిధ రూపాల్లో జరుగుతున్న మోసాలను గుర్తించి ప్రభుత్వానికి తగిన సమాచారం ఇవ్వడంలో తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు. -
రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలో ఈ ఏడాది ఖరీఫ్లో పౌర సరఫరాల శాఖ రైతుల నుంచి అంచనాలకు మించి ధాన్యాన్ని సేకరించి రికార్డు సృష్టించింది. గత ఏడాది కంటే రెట్టింపుస్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత ఏడాది ఖరీఫ్లో 2,716 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.17 లక్షలమంది రైతుల నుండి 18.24 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఖరీఫ్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 3,280 కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతుధర (గ్రేడ్–ఎ క్వింటాల్కు రూ.1,770, సాధారణ రకం– క్వింటాల్కు రూ.1750)కు 6.71 లక్షలమంది మంది రైతుల నుండి 34.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. మరో రెండు నుంచి మూడు లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేస్తోంది. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వర్షాలు, సాగునీటి ప్రాజెక్టుల వల్ల కొత్తగా ఆయకట్టు సాగులోకి రావడంతోపాటు నిరంతరం విద్యుత్ సరఫరా, రైతుబంధు వంటి కార్యక్రమాలతో రైతులు పెద్దఎత్తున వరి సాగు చేశారు. గత ఏడాది ఖరీఫ్లో 8 లక్షల హెక్టార్లలో వరిసాగు జరగ్గా, ఈ ఏడాది 10 లక్షల హెక్టార్లలో సాగైంది. ఈసారి పురుగులు(దోమకాటు), ఇతర రోగాలు లేకపోవడంతో గతంలో కంటే ఎకరానికి 10 క్వింటాళ్లు అధికంగా దిగుబడి పెరిగింది. రైతులకు కనీసమద్దతు ధర లభించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వారికి అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో దళారుల జోక్యానికి అడ్డుకట్ట పడింది. పంటకు కనీస మద్దతుధర గ్యారంటీగా లభిస్తుందనే భరోసా రైతుల్లో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించారు. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నల్లగొండ, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో అంచనాలకు మించి ధాన్యం దిగుబడి అయింది. దీంతో మొత్తంగా ఈ ఏడాది ఖరీఫ్లో 3,280 కొనుగోలు కేంద్రాల ద్వారా 6,71,286 మంది రైతుల నుండి రూ.6,055 కోట్ల విలువ చేసే 34.26 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం చేశారు. ఇప్పటివరకు రూ.5,213 కోట్లు ఆన్లైన్ ద్వారా రైతుఖాతాలోకి జమ చేయగా, మిగిలిన మొత్తం కూడా ట్రాక్షీట్ జనరేట్ అయిన వెంటనే జమ చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. లక్ష్యానికి మించి కొనుగోళ్లు చేశాం రాష్ట్రంలో ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాం. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావులేకుండా జిల్లాల కలె క్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ, సంస్థ అధికారులతోపాటు ఇతర విభాగాల అధికారులతో పూర్తి సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. ఖరీఫ్లో 25 లక్షల టన్నుల లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 34 లక్షల టన్నులు సేకరించాం. 36 లక్షల టన్నుల వరకు వస్తుందని అంచనా వేస్తున్నాం. తుఫాన్ వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా రైతుల నుండి కొనుగోలు చేస్తున్నాం. దీని ప్రభావం రైతులపై పడకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా ధాన్యం దిగుబడి అయింది. కానీ, ఎక్కడా ఎలాంటి సమస్య రాకుండా విజయవంతంగా కొనుగోళ్లను పూర్తి చేయగలిగాం. – అకున్ సబర్వాల్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ -
మేలుకో.. మేలు తెలుసుకో
వినియోగదారులకు అండగా పౌర సరఫరాల శాఖ రిడ్రెసల్ సెల్, వినియోగదారుల ఫోరంమోసాల బారి నుండిచట్టం ద్వారా రక్షణనిర్దేశిత గడువులోగా కేసుల పరిష్కారమే లక్ష్యంఫోరంలో 94,105 కేసులకుగానూ 89,057 కేసుల పరిష్కారరిడ్రెసల్ సెల్లో 3,275 కేసులకు పరిష్కారం చట్టం.. వినియోగదారుల చుట్టం.. మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకే వినియోగదారుల చట్టం ఉంది. వినియోగదారుల ఫోరం పేరిట ఏర్పడిన ఈ చట్టానికి, 1986 డిసెంబర్ 24న రాష్ట్రపతి ఆమోదం లభించి, అదేరోజు నుండి అమల్లోకి వచ్చింది. జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా మూడు అంచెలుగా ఫోరం ఉంటుంది. రూ.20 లక్షల లోపు పరిహారం కోసం జిల్లా ఫోరంలో, రూ.20 లక్షల నుంచి రూ.కోటిలోపు హైకోర్టు, రూ.కోటి పైబడి పరిహారం కోసం సుప్రీంకోర్టు వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చు. న్యాయవాది అవసరం లేకుండానే వినియోగదారుల ఫోరంలో నేరుగా కేసు దాఖలు చేయొచ్చు. తెలంగాణ రాష్ట్ర వినియో గదారుల ఫోరంలో నాలుగేళ్లలో 5,684 కేసులు నమోదు కాగా, 2,999 కేసులు పరిష్కార మ య్యాయి. 2,685 కేసులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా వినియోగదారుల ఫోరంలలో 94,105 కేసులు నమోదు కాగా, 89,057 కేసులు పరిష్కారమయ్యాయి. 5,048 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వినియోగదారులకు వారి హక్కులపట్ల అవగాహన కల్పించడమే కాకుండా, ఉచితంగా సమస్యలను పరిష్కరించి బాధితులకు నష్టపరిహారం ఇప్పించేలా పౌర సరఫరాలశాఖ పరిధిలో తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం ఏర్పా టైంది. దీనికి వచ్చిన ఫిర్యాదులపై గత ఏడాది కాలంలో తూనికలు, కొలతల శాఖ మల్టీప్లెక్స్లు, షాపింగ్ మాల్స్, విత్తన, ఎరువులు, పురుగు మందుల కంపెనీలు, పెట్రోల్ పంపులు, వే బ్రిడ్జీలు, బహుళజాతి సంస్థల గోదాములు, నగల దుకాణాలు, ఫైర్ క్రాకర్స్ షాపుల్లో తనిఖీలు నిర్వ హించి 3,059 కేసులను నమోదు చేసి, రూ. 25.08 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసింది. సోమ వారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా, రాష్ట్ర వినియోగదారుల ఫోరంలలో పెండింగ్ కేసులను గడువులోగా పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదా రుల వ్యవహారాల విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది కాలంలో తెలంగాణ వినియోగదారుల వ్యవహారాల విభాగం హెల్ప్లైన్కు వివిధ అంశా లకు సంబంధించి 3,344 ఫిర్యాదులను నమోదు చేసింది. 3,275 కేసులను పరిష్కరించింది. ఇలా ఫిర్యాదు.. అలా పరిష్కారం.. నష్టం జరిగిందని, మోసపోయామని భావించిన వినియోగదారులు రిడ్రెసల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 180042500333కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను పరిశీలనకు స్వీకరించిన తరువాత ప్రతివాదుల సంజాయిషీకి రెండు, మూడు వారాల కాలపరిమితి విధిస్తూ నోటీసు జారీ చేస్తారు. ఒక నిర్ణీత తేదీనాడు వారిని కేంద్రానికి పిలిపించి వాదనలను వినిపించుకునే అవకాశం కల్పిస్తారు. ఇరుపక్షాలకు అంగీకారయోగ్యమైన పరిహారాన్ని నిర్ణయించడానికి ప్రయత్నిస్తారు. రిడ్రెసల్ సెల్లో ప్రతి శనివారం ఈ ‘కౌన్సెలింగ్’ నిర్వహిస్తారు. ఇది ఉచితం. సమస్య పరిష్కారంకాని పక్షంలో జిల్లా వినియోగదారుల ఫోరంకు కేసును బదిలీ చేస్తారు. బాధితులకు అండగా ఫోరం ఖర్చు పెట్టే ప్రతి పైసాకు నాణ్యమైన వస్తువులను, సేవలను పొందడం వినియోగదారుల హక్కు. ఆ హక్కుకు భంగం కలిగితే ఒక తెల్లకాగితంపై సూచించిన పద్ధతిలో రాసి రాష్ట్ర వినియోగదారుల సమాచార, సలహా, సహాయ కేంద్రానికి ఫిర్యాదు చేయవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. త్వరితగతిన సమస్యలు పరిష్కారం కావడంతో ఈ కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – అకున్ సబర్వాల్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఇలా.. ప్రతిచోట వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు. అడుగడుగునా దగా పడుతూనే ఉన్నారు. తినే ఆహారం మొదలు వేసుకునే బట్టలు, తొడుక్కునే చెప్పుల వరకు అన్నీ కల్తీ, నకిలీమయమే. రియల్ ఎస్టేట్, చిట్ఫండ్, బ్యాంకులు ఇలా రకరకాల సంస్థలు వినియోగ దారులను మోసం చేస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల్లో కల్తీల వల్ల అన్నదాత బలి అవుతున్నాడు. వినియోగదారులు తమ హక్కుల గురించి తెలుసుకోగలిగితే ఇలాంటి మోసాల బారి నుంచి వినియోగదారుల చట్టం ద్వారా రక్షణ పొందొచ్చు. – సాక్షి, హైదరాబాద్ ►రాంబాబు ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ షాపులో రూ.30 వేలు పెట్టి ఎల్ఈడీ టీవీ కొన్నాడు. వారం తిరగక ముందే మరమ్మతుకు గురైంది. దాని స్థానంలో కొత్త టీవీ కావాలని కోరితే ఆ షాపు యాజమాన్యం నుంచి నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. ►ప్రశాంత్ ఓ హోల్సేల్ షాపులో నూనె ప్యాకెట్ కొని ఇంటికొచ్చి తెరిచి చూడగా అది నాసిరకమని తేలింది. ఇదేంటని షాపు సిబ్బందిని ప్రశ్నిస్తే ప్రశాంత్ను అక్కడి నుంచి గెంటేశారు. -
తడిసిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారిని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. జనగామ, జగిత్యాల, నిర్మల్, మహబూబాబాద్, తాండూర్, మేడ్చల్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, అక్కడి పరిస్థితులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఉన్నతాధికారులతో కమిషనర్ సమీక్షించారు. ఆయా అధికారులతో మాట్లాడారు. తడిసిన ధాన్యానికి సంబంధించిన చివరి గింజను కూడా పౌరసరఫరాల శాఖ కొనుగోలు చేస్తుందని, అకాల వర్షాల ప్రభావం రైతాంగం మీద ఏమాత్రం పడకుండా తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రకటించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు జిల్లా స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు పౌరసరఫరాల కమిషనర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఫిర్యాదుల కోసం వాట్సాప్ నంబర్ 7330774444, టోల్ ఫ్రీ నంబర్ 1800 425 00333ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని సరైన పద్ధతిలో, నిబంధనలకు అనుగుణంగా తీసుకురావాలని, ఈ విషయంలో రైతులకు ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని తెలిపారు. తేమ శాతం విషయంలో రైతాంగానికి అధికారులు అవగాహన కల్పించాలని, ఈ బాధ్యత ప్రధానంగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై ఉంటుందన్నారు. మార్కెటింగ్ శాఖతో సమన్వయం చేసుకొని ఎక్కడైనా టార్పాలిన్ల కొరత ఉంటే దాన్ని అధిగమించాలని, వచ్చే రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్లో భారీగా ధాన్యం దిగుబడి అవుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఖరీఫ్ కార్యాచరణపై పౌరసరఫరాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, సంస్థ మేనేజర్లతో అకున్ సబర్వాల్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కనీస మద్దతు ధరపై రైతుల్లో అవ గాహన కల్పించేలా రూపొందించిన వాల్పోస్టర్ను విడుదల చేశారు. అక్టోబర్ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో స్థానిక అవసరాలను బట్టి 5 కిలోమీటర్లకు ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయా లని అధికారులను ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు వేచి చూడాల్సిన పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పీపీసీల్లో తేమ కొలిచే యం త్రాలు, ప్యాడీ క్లీనర్స్, విన్నోవింగ్ మిషన్లతోపాటు తాగునీరు, టాయిలెట్స్ వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ చైర్మన్గా జిల్లాస్థాయిలో ధాన్య సేకరణ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచిం చారు. ఈ కమిటీలో డీసీఎస్వోలు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్లు, మార్కెటింగ్, ఆర్టీఏ అధికారులు, వ్యవసాయ శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలు, ధాన్యం సేకరణ, కనీసమద్దతు ధర వంటి అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు కనీస మద్దతు ధరను తప్పనిసరిగా చెల్లించాలని, కొనుగోలులో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై టోల్ ఫ్రీ నంబర్.. ధాన్యం ఎంత కొనుగోలు చేశాం, ఎంత తిరస్కరించింది, చెల్లింపులు వంటి వాటిని ఆన్లైన్లో ఏ రోజుకారోజు పొందుపర్చాలని అధికారులను అకున్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై ఐకేపీ, పీఏసీ, పౌరసరఫరాలు, ఎఫ్సీఐ సాంకేతిక సిబ్బందికి కేంద్రాల ఏర్పాటుకు ముందే శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్లో పౌరసరఫరాల భవన్లో టోల్ ఫ్రీ నంబర్ 180042500333 ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా స్థాయిలో కూడా టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ గోదాములకే తొలి ప్రాధాన్యత మిల్లర్ల నుంచి సేకరించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను స్టోరేజ్ చేయడానికి ప్రభుత్వ గోదాములకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అకున్ తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో జిల్లాల వారీగా గన్నీ సంచులను కేటాయించామని, 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణకు 8.59 కోట్ల గోనె సంచులు అవసరం అవుతాయని అంచనా వేశామని చెప్పారు. -
పారదర్శకంగా నాణ్యత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: బంకుల్లో పెట్రోల్, డీజిల్ తూకం, నాణ్యతల పరీక్షలు మరింత పారదర్శకం గా ఉండేందుకు తూనికల కొలతల శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా గాజుతో తయారు చేసిన 5 లీటర్ల ఓ కొత్త జార్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ గాజు జార్ను యుఎస్పీ టైప్ క్లాస్–ఏతో తయారు చేశారు. అందులో పోసే ఇంధనం స్పష్టంగా కనబడటంతోపాటు సరైన తూకాన్ని సూచిస్తుంది. ఈ జార్లో ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. సోమవారం పౌరసరఫరాల భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పెట్రోల్ అండ్ డీజిల్ డీలర్స్ అసోసియేషన్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ ఆయిల్ కంపెనీలతో జరిగిన సమావేశంలో ఈ పరికరాన్ని తూనికల కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ పరిశీలించారు. ఈ పరికరాలను ఆయా పెట్రోల్ బంక్ యాజమాన్యాలే సమకూర్చుకోవాలని సూచించారు. వీటిని వినియోగించేందుకు తూనికల కొలతల శాఖ నుంచి ధ్రువీకరణపత్రం పొందాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ అమరం, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి అమరేందర్రెడ్డి, హెచ్పీసీఎల్ డీజీఎం (రిటైల్) రాజేశ్, బీపీసీఎస్ మేనేజర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
సినిమా హాళ్లలో పక్కాగా ఎంఆర్పీ అమలు
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్లు, సినిమా హాళ్లలో వస్తువుల ఎంఆర్పీ, పరిమాణం పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ శుక్రవారం ఆదే శాలు జారీ చేశారు. వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తే సంస్థలపై కేసులు నమోదు చేసి, అధిక మొత్తం లో జరిమానాలు విధిస్తామ న్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు పంపారు. 23, 24 తేదీల్లో జిల్లాలో తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్లు మల్టీప్లెక్స్, సినిమాహాళ్ల యజమానులతో సమావేశమవ్వాలని ఆదేశించారు. తినుబండారాలు, శీతల పానీయాలు, ప్యాకింగ్ చేయని ఇతర ఉత్పత్తులధర, పరిమాణం తెలుపుతూ డిస్ప్లే బోర్డుల ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విక్రయానికి వినియోగదారులకు బిల్లు ఇవ్వాలని చెప్పారు. ఈ నెల 24 వరకు ధర, పరిమాణానికి సంబంధించి స్టిక్కర్ అంటించేందుకు అనుమతించామని, సెప్టెంబర్ 1 నుంచి కచ్చితంగా ధరలను ముద్రించుకోవాలన్నారు. అధిక ధరలు వసూ లు చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1967, వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
వినియోగదారులను మోసం చేస్తే కేసు: అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: మల్టీప్లెక్స్లు, సినిమా హాళ్లలో ప్యాకేజ్డ్ వస్తువులపై వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తే ఆ సంస్థలపై కేసులు నమోదు చేస్తామని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు. మంగళవారం పౌరసరఫరాల భవన్లో సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అకున్ సబర్వాల్తో సమావేశ మయ్యారు. ప్రతి దానిపై బరువు, పరిమాణం కచ్చితంగా కనిపించాలని సూచించారు. బోర్డుపై కూడా స్పష్టంగా ధరలు కనిపించేలా ఉండాలని, వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారునికి కచ్చితంగా బిల్లు ఇవ్వాలని ఆదేశించారు. అధిక ధరలు వసూలు చేస్తే 1967, వాట్సప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
రేషన్ డీలర్ల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్
-
నోటీసులు.. ఆపై సస్పెన్షన్!
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్లు జూలై ఒకటి నుంచి తలపెట్టిన సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. గడువులోగా సరుకుల కోసం డబ్బులు చెల్లించి ఆర్ఓ (రిలీజ్ ఆర్డర్) తీసుకోని డీలర్లకు ముందుగా నోటీసులు ఇచ్చి అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది. డీలర్లను తొలగించి వారి స్థానంలో జూలై 5 నుంచి మహి ళా సంఘాల ద్వారా సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో పేదలకు సకాలంలో సరుకులు అందించేలా ప్రణాళికలు రూపొందించింది. సరుకుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు... గౌరవ వేతనం, కమీషన్ల పెంపు తదితర అంశాలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రేషన్ డీలర్లు జూలై ఒకటి నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ప్రకటించడం తెలిసిందే. సరుకుల కోసం ఈ నెల 28లోగా డీడీలు కట్టాలని పౌరసరఫరాలశాఖ డీలర్లకు డెడ్లైన్ పెట్టగా 17,200 మంది డీలర్లకుగాను గురువారం సాయంత్రానికి కేవలం 609 మందే డీడీలు కట్టారు. దీంతో వారిపై చట్ట ప్రకారం ముందుగా నోటీసులు ఇచ్చి అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులను వెలువరించే అవకాశాలున్నాయి. అయితే డీలర్ల సమ్మె నేపథ్యంలో పేదలకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా నిత్యావసర సరుకుల పంపిణీకి పౌరసరఫరాలశాఖ అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఎంసీహెచ్ఆర్డీలో గురువారం జాయింట్ కలెక్టర్లు, డీసీఎస్వోలు, డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. అర్హులైన ఆహార భద్రత కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఈ నెల 5 నుంచి పంపిణీని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సరుకుల పంపిణీని చేపట్టాలని, స్థానిక పరిస్థితులనుబట్టి అవసరమైతే గడువు పొడిగించాలని సూచించారు. మహిళా సంఘాలకు బాధ్యతల అప్పగింత... పేదలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు మహిళా సంఘాలు, అందుబాటులో ఉన్న చోట ఎన్ఆర్ డీలర్ల ద్వారా సరుకుల పంపిణీ చేపట్టాలని అధికారులను పౌర సరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదేశించారు. జిల్లా, మండల, గ్రామ రేషన్ షాపులవారీగా మహిళా సంఘాలను గుర్తించడంలో పారదర్శక విధానాన్ని పాటించాలని, గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా అధికారులు వాటిని పర్యవేక్షించాలని సూచించారు. రికార్డుల నిర్వాహణ కోసం మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వడంతోపాటు డీలర్షిప్ బాధ్యతలు తీసుకున్న మహిళా సంఘాలతో జులై 1న మీ–సేవ కేంద్రాల్లో అధికారులు డీడీలు కట్టించాలన్నారు. సరుకుల పంపిణీ కంటే ముందు ఆయా ప్రాంతాల్లో సరుకుల నిల్వ, పంపిణీ కోసం లబ్ధిదారులకు అందుబాటులో ఉండే విధంగా గ్రామ పంచాయతీ, ఐకేపీ, కమ్యూనిటీ హాళ్లు, యూత్ బిల్డింగ్లను గుర్తించాలని సబర్వాల్ పేర్కొన్నారు. వేయింగ్ మెషిన్లను సమకూర్చుకునేందుకు తూనికలు, కొలతలశాఖ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. ఆ తర్వాత పౌరసరఫరాల సంస్థ గోదాముల నుంచి సరుకులను తరలించేందుకు రవాణా వాహనాలను, సరుకుల లోడింగ్ కోసం హమాలీలను సిద్ధం చేసుకోవాలని, కాంట్రాక్టర్లతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని అకున్ సబర్వాల్ అధికారులకు సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు రేషన్ సరుకుల పంపిణీలో సమస్యలు, ఫిర్యాదులతోపాటు సమన్వయం కోసం 24 గంటలు పనిచేసేలా రాష్ట్ర స్థాయిలో పౌరసరఫరాల కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నామని, టోల్ ఫ్రీ నంబర్ 1967, వాట్సాప్ నంబర్ 7330774444ను అందు బాటులో ఉంచామని అకున్ సబర్వాల్ తెలిపారు. మహిళా సంఘాలకు డీలర్ల బాధ్యతలు అప్పగించే క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రేషన్ పంపిణీలో జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామ స్థాయిలో వీఆర్వోలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించామని చెప్పారు. సమ్మె విరమించే ప్రసక్తే లేదు: రేషన్ డీలర్ల సంఘం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా రేషన్ డీలర్ల సమ్మె విరమించే ప్రసక్తే లేదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. భయపెట్టేందుకు అక్రమంగా 14 వేల మంది డీలర్లను సస్పెండ్ చేయడం విచారకరమని వాపోయారు. డీలర్లకు నోటీసులు మాత్రం అందలేదని పేర్కొన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం డీలర్లకు రావాల్సిన సుమారు రూ.600 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మాదిరిగా డీలర్లకు వేతనాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం, భయపెట్టడం తగదని హితవు పలికారు. బంగారు తెలంగాణలో రేషన్ డీలర్ల బతుకులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
సరుకుల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్లు సమ్మె విరమణకు అంగీకరించని నేపథ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. గ్రామాల్లోని ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) మహిళా సంఘాలతో సరుకుల పంపిణీ చేయించేలా ఏర్పా ట్లు చేస్తోంది. ఈ నెల 28 వరకు డీలర్లకు డెడ్లైన్ విధించడంతో అంతవరకు వేచిచూసిన తర్వాత తగిన ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై మంగళవారం పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ జిల్లా డీఎస్వోలు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 28 నాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా ల వారీగా కార్యాచరణ సిద్ధం చేసుకురావాలని ఆదేశించారు. అదే రోజున గ్రామాల వారీగా సరుకుల పంపిణీ చేసే ప్రాంతాన్ని గుర్తించడం, మహిళా సంఘాలను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయనున్నారు. సరుకుల పంపిణీకి డీలర్లు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సరుకులు అందించడం బాధ్యత.. ఈ నెల 28 వరకు మీ–సేవ కేంద్రాల్లో రేషన్ సరుకుల కోసం డబ్బులు చెల్లించి, ఆర్ఓ (రీలీజ్ ఆర్డర్) తీసుకుని ప్రభుత్వానికి సహకరించాలని పౌర సర ఫరాల శాఖ మంగళవారం డీలర్లకు విజ్ఞప్తి చేసింది. పేదలకు నిత్యావసర సరుకులను సకాలంలో అం దించాల్సిన కనీస బాధ్యత రేషన్ డీలర్లపై ఉందని పేర్కొంది. తెలంగాణ ప్రజాపంపిణీ వ్యవస్థ కం ట్రోలర్ ఆర్డర్ 2016 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ డీలర్నైనా తొలగించే అధికారం, నిత్యావసర సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్నైనా తొలగించి, వారి స్థానంలో ఇతరులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. నిర్దేశిత గడువులోగా డబ్బులు చెల్లించని డీలర్లను తొలగిస్తామంది. సకాలంలో సరుకులు ఇవ్వడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపింది. -
రేషన్ డీలర్ల సమ్మె తప్పదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో రేషన్ డీలర్ల చర్చలు విఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామీకి డీలర్లు అంగీకరించలేదు. ముందు చెప్పినట్లు సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని, సరుకులకు డీడీలు కట్టబోమని డీలర్లు స్పష్టం చేశారు. గౌరవ వేతనం, కమీషన్ల పెంపు, పాత బకాయిల విడుదల తదితర సమస్యల పరిష్కారానికి జూలై 1 నుంచి సమ్మె చేస్తామని రేషన్ డీలర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మె విషయమై డీలర్ల సంఘం ప్రతినిధులతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదివారం చర్చలు జరిపారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజుతోపాటు సంఘం ప్రతినిధులు బత్తుల రమేశ్, నాగరాజు, సంజీవరెడ్డి, కొండల్రెడ్డి, అన్వర్ పాషా, ప్రసాద్గౌడ్, సురేందర్ తదితరులు చర్చలకు హాజరయ్యారు. కేరళ, తమిళనాడు మాదిరి డీలర్లకు వేతనాలివ్వాలని, పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా సంఘం నేతలు కమిషనర్ను కోరారు. అకున్ సబర్వాల్ స్పందిస్తూ.. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, కమిటీ నివేదిక ఆధారంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమ్మె వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడతారని, సమ్మె విరమించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రేషన్ దుకాణాల నిర్వహణతో వచ్చే ఆదాయం, లాభంపై నివేదిక రూపొందించి సీఎం కేసీఆర్, పౌర సరఫరాల మంత్రి ఈటల రాజేందర్కు సమర్పిస్తామని.. మూడు రోజుల తరువాత మళ్లీ చర్చలకు పిలుస్తామని వివరించారు. కానీ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని డీలర్ల సంఘం ప్రతినిధులు స్పష్టం చేయడంతో.. మహిళా సంఘాలతో రేషన్ పంపిణీకీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీకి సిద్ధం: అకున్ సబర్వాల్ డీలర్ల సమ్మె చట్ట విరుద్ధమని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ కంట్రోలర్ ఆర్డర్–2016, నిత్యావసర సరుకుల చట్టం–1955 ప్రకారం సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్నైనా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మె విషయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. డీలర్లు సమ్మెకు వెళ్లినా ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు పౌరసరఫరాల శాఖ సంసిద్ధంగా ఉందన్నారు. పేదలకు సరుకులు అందించే కనీస బాధ్యత పౌరసరఫరాల శాఖపై ఉందని.. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించే సామర్థ్యం కూడా తమ వద్ద ఉందని చెప్పారు. -
‘ధాన్యం కొనుగోలు నిధుల విడుదల’
సాక్షి, హైదరాబాద్: రబీలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి వంద శాతం నిధులను విడుదల చేశా మని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ తెలిపారు. రబీలో 3,313 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.11 లక్షల మంది రైతుల నుంచి 35.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని శాఖ కొనుగోలు చేసిందని, దీని కోసం రూ.5,601.97 కోట్లు విడుదల చేశామన్నారు. వినియోగదారుల ఫిర్యా దుల కోసం ఫేస్బుక్, ట్విట్టర్ హ్యాండిల్ను గురువారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ప్రారంభించారు. ఇప్పటికే వినియోగదారుల ఫిర్యాదు కొరకు సమాచార సలహా, సహాయ కేంద్రం (రిడ్రెసల్ సెంటర్) టోల్ఫ్రీ నంబర్ అందుబాటులో ఉన్నా యి. వినియోగదారుల సేవా కేంద్రం టోల్ ఫ్రీ నెం: 1800 425 00333 , ఫేస్బుక్ ConsumerInformation RedressalCentre, , ట్విట్టర్ Telangana Consumer Info and Redressal Center, వెబ్సైట్. www.consumeradvice.in లో కూడా ఫిర్యాదు చేయవచ్చని సబర్వాల్ వివరించారు. -
‘రేషన్ డీలర్లు చేసేది సామజిక సేవే’
సాక్షి, హైదరాబాద్: ‘రేషన్ డీలర్లు సామజిక సేవ చేస్తున్నారనే విషయం మరచిపోవద్దు. వారు సమ్మె చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. చర్చల ద్వారా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నామ’ని తెలంగాణ తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. తూనికలు, కొలతల్లో జరిగే మోసాలపై వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కొన్ని రోజుల క్రితం నగరంలోని ఒక స్కానింగ్ సెంటర్ తప్పుడు పరీక్షల వల్ల ఒక శిశువు, ఆమె కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురయిందని ఆయన తెలిపారు. పాప తల్లిదండ్రులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయిచడంతో.. సదరు స్కానింగ్ సెంటర్ను దోషిగా తేలుస్తూ ఫోరం 2 లక్షల జరిమానా విధించిందని అన్నారు. ఆ మొత్తాన్ని బాధిత కుంటుంబానికి చెక్కు రూపంలో గురువారం అందజేశారు. ఇటీవల నగరంలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి 12 కోట్ల రూపాయల వరకు జరిమానాలు విధించామని పేర్కొన్నారు. వస్తు, సేవల్లో మోసాలకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు వినియోగదారుల సేవా కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ప్రతి వ్యాపారీ అతను అందించే వస్తు, సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడే వ్యాపారులపై వినియోగదారులు 180042500333 టోల్ ఫ్రీ నెంబర్, ఫేస్బుక్, ట్విటర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. దోషిగా తేలితే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని ఉద్ఘాటించారు. -
తూకంలో తేడాలు రానివ్వొద్దు’
సాక్షి, హైదరాబాద్: ఉత్పత్తుల విక్రయాల విషయంలో తూకంలో తేడాలు రావొద్దని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఖరీఫ్ సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో విత్తన కంపెనీల ప్రతినిధులు సోమ వారం అకున్ సబర్వాల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీడ్స్మెన్ అసోసియేషన్ ప్రతినిధులు జగదీశ్వర్, నిరంజన్, మల్లారెడ్డి, నారాయణ పలు విజ్ఞప్తులు చేశారు. అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. రైతులకు విక్రయించే విత్తనాల విషయంలో నిజాయితీగా వ్యవహరించాలని, తూకంలో తేడా లేకుండా, రైతాంగానికి నష్టం కలగకుండా చూడాలన్నారు. నిర్దేశించిన తూకం కంటే తక్కువ పరిమాణంలో విక్రయిస్తే రైతుల కు నష్టం చేసిన వారవుతారని, ఇది క్షమించరానిదని పేర్కొన్నారు. తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని, నిబంధనలపై సీనియర్ ఆఫీసర్లను పంపి ఉత్పత్తిదారులకు అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు. సాంకేతిక తప్పుల విషయంలో కేసులు నమోదు చేసే విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తామన్నారు. -
రైతులను మోసగిస్తే కఠిన చర్యలు: అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: ఎరువులు, పురుగు మందులు, విత్తనాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతూ, తూకాల్లో రైతులను మోసం చేస్తున్న వ్యాపార సంస్థలపై తూనికలు కొలతల శాఖ ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆ శాఖ.. నిబంధనలకు విరుద్ధంగా తూకంలో తేడాలు, విత్తన ప్యాకెట్ల పరిమాణంలో హెచ్చుతగ్గులతో విక్రయిస్తున్న పలు కంపెనీలపై కేసులు నమోదు చేసింది. రైతులకు విక్రయించే విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువుల తూకాల్లో మోసాలకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, చట్టపరమైన చర్యలు చేపడతామని తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ అన్నారు. ఇప్పటికే విత్తనాల కంపెనీల మోసాలపై గతవారంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, 154 కేసులు నమోదు చేసి, రూ.2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశామని తెలిపారు. ఇక మీదట ఏ వ్యాపారి అయినా తూకం పేరుతో రైతులను మోసం చేసినా, చేయడానికి ప్రయత్నించినా సహించబోమని, భారీ జరిమానాలు, అరెస్టులు తప్పవని ఆయన హెచ్చరించారు. రైతులు కూడా తమకు జరుగుతున్న మోసాలపై నేరుగా 7330774444 వాట్సాప్ నంబర్కు ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. -
తూనిక.. రైతు రక్షణకు పూనిక
సాక్షి, హైదరాబాద్: విత్తనాలు, ఎరువుల కొనుగోలులో రైతులు మోసపోకుండా తూనికలు, కొలతల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. 4 రోజులుగా విస్తృత తనిఖీలు చేపట్టింది. కొన్ని విత్తన కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి నడుస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. చాలావాటికి తయారీ లైసెన్సు లేకపోవడమేకాకుండా తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఎరువుల బస్తాలపై బరువు సూచికల్లో వ్యత్యాసాలున్నట్లుగా కూడా గుర్తించారు. విత్తనాల తయారీ.. గడువు వివరాలు కూడా సంచులపై లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. తయారీ లైసెన్సులు లేకుండానే కొందరు వ్యాపారం చేస్తున్నట్లు, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు తనిఖీల్లో వెల్లడైందని కంట్రోలర్ అకున్ సబర్వాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి గడిచిన 3 రోజులుగా జరిపిన తనిఖీల్లో 154 కేసులు నమోదు చేసి, రూ. 2.35 కోట్ల విలువ చేసే విత్తనాలను సీజ్ చేశారు. ఈ కంపెనీలపై జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు. ఇదేవిధంగా మోసాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకొని నిరంతరం తనిఖీలను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. విత్తన కంపెనీల మోసాలకు సంబంధించి ఏ మాత్రం సమాచారమున్నా రైతులు వెంటనే వాట్సప్ నంబర్కు 73307 74444కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
బియ్యం నిల్వలకు గోదాములు చూపించాలి
సాక్షి, హైదరాబాద్: గోదాముల్లో బియ్యం (బాయిల్డ్ రైస్) నిల్వలకు అవసరమైన స్థలాన్ని చూపించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కి విజ్ఞప్తి చేశారు. డిమాండుకు సరిపడా గోదాముల సంఖ్యను పెంచాలని కోరారు. శుక్రవారం ఆయన ఎఫ్సీఐ అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అకున్ సబర్వాల్ మాట్లాడుతూ.. బియ్యం నిల్వలకు సరిపడా నిల్వ స్థలం చూపించడమే కాకుండా, బియ్యాన్ని ఎప్పటికప్పుడు గోదాముల్లో అన్లోడింగ్ చేసుకోవాలని ఎఫ్సీఐ అధికారులను కోరారు. నిల్వ సమస్య తీవ్రంగా ఉన్న నిజామాబాద్, కామారెడ్డి తదితర జిల్లాలపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుతం రబీలో పౌరసరఫరాలశాఖ 39.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుందని, మిల్లర్ల నుంచి 23.93 లక్షల మెట్రిక్ టన్నుల (90%) బాయిల్డ్ రైస్ను ఎఫ్సీఐకి అందజేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం 11 నుంచి 12 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ స్థలం అవసరమన్నారు. ప్రతి రైస్ మిల్లు నుంచి ప్రతిరోజు 40 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని సబర్వాల్ అన్నారు. -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బుధ వారం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుద్దెడ, సిద్దిపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ సాగుతోందన్నారు. ఈ ఏడాది రబీలో 38 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతులకు అందుబాటులో 3,008 కొనుగో లు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి 17% తేమకు లోబడి ఉండేలా చూసి విక్రయించాలన్నారు. 2,962 కొనుగోలు కేంద్రాల ద్వారా 2.36 లక్షలమంది రైతుల నుంచి రూ.2,526 కోట్ల విలువ చేసే 15.91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నా రు. ఇందులో 15.01 లక్షల మెట్రి క్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.1,400 కోట్లు జమ చేశామన్నారు. ముందస్తు వర్ష సూచనలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా వీలైనంత త్వరగా రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ విషయంలో మిల్లర్లు వేగంగా స్పందించాలన్నారు. ఇదే అంశంపై ఆయన హైదరాబాద్లో ఓ ప్రకటన విడుదల చేశారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోండి 11వ తేదీ నుంచి వర్షాలు కురిసే సూచనలున్నాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల దృష్ట్యా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు 9.78 కోట్ల గోనె సంచులు అవసరం కాగా, ఇప్ప టికే 9.31 కోట్ల సంచులను అందుబాటులో ఉంచామన్నా రు. ఈ పర్యటనలో అకున్ సబర్వాల్ వెంట జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఎస్వో వెంకటేశ్వర్లు ఉన్నారు. -
రేషన్ దుకాణాలపై సామాజిక తనిఖీ
సాక్షి, హైదరాబాద్: రేషన్ దుకాణాల్లో వినియోగదారులకు అందుతున్న సేవలపై సామాజిక తనిఖీ చేసేలా తాజా మార్గదర్శకాలు జారీచేస్తూ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రతీ ఆరు నెలలకోసారి గ్రామసభ పెట్టి రేషన్ దుకాణాల రికార్డులు, సరుకుల పంపిణీ తదితర అంశాలపై సామాజిక తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. తాజా మార్గదర్శకాల ప్రకారం..అర్బన్ ఏరియాలో గత ఆరు నెలల డాక్యుమెంట్లను సభల్లో ప్రవేశపెట్టాలి. గ్రామసభ ఎక్కడ పెట్టేది, ఏ తేదీన నిర్వహించేది తదితర వివరాలను వీఆర్వో విజిలెన్స్ కమిటీకి తెలియపరచాలి. ఆ గ్రామంతో పాటు, శివారు గ్రామ వినియోగదారులకూ తనిఖీ విషయం తెలిసేలా ప్రచారం చేయాలి. ఉదయం 8–10 మధ్య లేదా సాయంత్రం 4–6 గంటల మధ్య సామాజిక తనిఖీ జరిగేలా చూడాలి -
మొలాసిస్తో సారా తయారీ లేదు..
సాక్షి, హైదరాబాద్: మొలాసిస్తో సారా కాయటం అన్నది ఎక్సైజ్ చరిత్రలో ఇప్పటివరకు లేదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. ‘నాటుసారాకు కొత్త రెక్కలు’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. 2016 అక్టోబర్ నాటికే తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా చేశామంటూ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సుజ్ఞానపురంలో మాత్రమే 27 టన్నుల చక్కెర నిల్వలు పట్టుకున్నామని, నిరంతర నిఘాతో గుడుంబాను నియంత్రించామన్నారు. చక్కెర కర్మాగారాల నుంచి మొలాసిస్ బయటికి రావాలంటే ఎక్సైజ్ డీసీ అనుమతి తప్పనిసరని వివరించారు. రాష్ట్రంలో గుడుంబా నియంత్రణ కోసం ఇప్పటివరకు 94 పీడీ యాక్టు కేసులు, బైండోవర్లు పెట్టడం జరిగిందన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
అల్గునూర్: మత్తు పదార్థాలు, డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్సబర్వాల్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో డ్రగ్స్ వాడకం–దుష్పరిణామలపై బుధవారం అవాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ మహమ్మారి నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత భయంకర వ్యసనమన్నారు. దీనిని తరిమికొట్టాల్సిన బాధ్యత యువత, విద్యార్థులపై ఉందని పేర్కొన్నారు. డ్రగ్స్తో విచక్షణ కోల్పోతారని, ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదని అన్నారు. డ్రగ్స్ మాఫియా యువతను టార్గెట్ చేసుకునే చాపకింద నీరులా తమ వ్యాపారాన్ని విస్తరిస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల నడవడికను, అలవాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు. 15 నుంచి 25 ఏళ్లలోపు యువత ఎక్కువగా మత్తుకు బానిసవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. డ్రగ్స్ మాఫియా సమాచారం తెలిస్తే టోల్ఫ్రీ నంబర్ 1800–425253 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు. ఎక్కువ మద్యం విక్రయాలు జరిగే మద్యం షాపుల్లో ఫిబ్రవరి మొదటి వారంలో ధరల పట్టిక ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అధిక ధరలకు మద్యం విక్రయించే వారిపై ఫిర్యాదు చేసేందుకు త్వరలో ఆన్రైడ్ అప్లికేషన్ కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. దీనిద్వారా ఫిర్యాదు చేస్తే టాస్క్ఫోర్స్, ఎక్సైజ్ సిబ్బందికి వెంటనే సమాచారం అందుతుందని పేర్కొన్నారు. సమాజసేవపై దృష్టి పెట్టాలి.. యువత సమాజసేవపై దృష్టి సారించాలని అకున్సబర్వాల్ సూచించారు. సేవచేయాలనే ఆసక్తి ఉన్నవారికి సివిల్ సర్వీసెస్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు డ్రగ్స్కు సంబంధించిన అడిగిన పలు ప్రశ్నలకు అకున్సబర్వాల్ ఓపికగా సమాధానాలు చెప్పారు. కొంతమంది విద్యార్థులు మద్యనిషేధం అమలు చేయాలని కూడా కోరడం గమనార్హం. అనంతరం అకున్సబర్వాల్ను కళాశాల సంయుక్త కార్యదర్శి డి.శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో పెద్దపల్లి, కరీంనగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, రావికుమార్, డిప్యూటి కమిషనర్ వెంకటేశ్నేత, జిల్లా ఎక్సైజ్ సీఐలు, ఎస్సైలు, సిబ్బంది, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. మొక్కలు నాటిన అకున్.. హరితహారం కార్యక్రమంలో భాగంగా అకున్సబర్వాల్ వాగేశ్వరి కళాశాల ఆవరణలో బుధవారం మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణ బాధ్యతను కూడా విద్యార్థులు, యువతే తీసుకోవాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణం, తాగునీరు అందించాలంటే విరివిగా మొక్కలు పెంచాలని సూచించారు. -
డ్రగ్స్ కేసు కథ కంచికే..!
-
డ్రగ్స్ కథ కంచికే!
సాక్షి, హైదరాబాద్ : రోజుకో లీకుతో, ఏదేదో జరిగిపోతోందన్న ప్రచారంతో సస్పెన్స్ సినిమాను తలపించిన సినీ ప్రముఖుల డ్రగ్స్ వినియోగం కేసు కథ కంచికి చేరినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎక్సైజ్ సిట్ పూర్తిస్థాయి ఆధారాలను సేకరించలేక పోయిందని... సిట్ చేసిన హడావుడి, గంటల తరబడి విచారణ అంతా ఉత్తదేనని తేలిపోయింది. అకున్ సబర్వాల్ సారథ్యంలోని ఎక్సైజ్ సిట్ 10 మంది సినీ ప్రముఖులను విచారించగా.. ముగ్గురి నుంచి మాత్రమే రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకుని ఫోరెన్సిక్ పరిశీలనకు పంపింది. ఇందులో కేవలం ఒక్కరు మాత్రమే నిషేధిత డ్రగ్స్ తీసుకున్నారని శాస్త్రీయంగా నిర్ధారణ అయిందని... ఈ మేరకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఎక్సైజ్ సిట్కు నివేదిక అందిందని విశ్వసనీయ సమాచారం. ఫోరెన్సిక్ నివేదిక అందిన నేపథ్యంలో ఈ నెల చివరి వారంలోగా చార్జిషీటు వేసేందుకు సిట్ కసరత్తు చేస్తోంది. కోర్టులో నిలబడతాయా? ఇప్పటివరకు సేకరించిన డాక్యుమెంటరీ సాక్ష్యాలు, ఆధారాలు ఎంతవరకు కోర్టులో నిలబడతాయన్న దానిపై ఎక్సైజ్ సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి సినీ ప్రముఖులు దోషులేనని తేల్చదగిన కచ్చితమైన ఆధారాలేవీ అధికారులకు లభించలేదని తెలుస్తోంది. అరకొర ఆధారాలు కోర్టులో నిలవకపోతే... కేసుతో ఇబ్బందిపడ్డ సినీ ప్రముఖులు పరువు నష్టం దావా వేసే అవకాశముందని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తొలి చార్జిషీటుతోనే కేసును తేల్చకుండా.. అనుబంధ చార్జిషీట్లు వేస్తూ కేసును పొడిగించాలని భావిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెల్విన్ ‘బెదిరింపు’లతో.. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్. అతను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు దొరికే సమయానికే బాగా మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రోజున కెల్విన్ను సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్లో రహస్యంగా విచారించారు. ఉన్నతాధికారి అకున్ సభర్వాల్ కూడా సాధారణ దుస్తుల్లో అక్కడికి వచ్చారు. అంతా సాధారణ సిబ్బందేనని భావించిన కెల్విన్... అధికారులను బెదిరించడానికి ప్రయత్నించాడు. ‘నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారు. నా సత్తా ఏమిటో చూపిస్తా. మీకు 10 నిమిషాల్లో ఫోన్ వస్తుంది. నా కోసం ఆ దర్శకుడు ఫోన్ చేస్తాడు. ఫలానా రాజకీయ నాయకుడి కుమారుడు వస్తాడు.. ఆ హీరోయిన్ నన్ను వెతుక్కుంటూ వస్తుంది..’అంటూ పలువురు ప్రముఖుల పేర్లను చెప్పినట్లు సమాచారం. ఈ మాటలను సీరియస్గా తీసుకున్న అధికారులు.. కెల్విన్ ఫోన్కాల్ లిస్టు, మెసేజీలు, అతడి వద్ద దొరిన ఫొటోల ఆధారంగా విచారణ చేపట్టారు. అందులో భాగంగానే పూరీ జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, నందు, తనీష్, ఛార్మి, ముమైత్ఖాన్, సుబ్బరాజు, శ్యాం కే నాయుడు తదితరులను పిలిపించి విచారించారు. ఎక్సైజ్ సిట్కు ఏమేం దొరికాయి? విచారణ ఎదుర్కొన్న హీరోయిన్ ఫోన్ నుంచి కెల్విన్కు 40 ఎస్సెమ్మెస్లు వెళ్లాయి. అందులో ఒక్క ఎస్సెమ్మెస్లో మాత్రమే ఎల్ఎస్డీ అనే పదం ఉంది. మిగతా వాటిలో బ్లాటింగ్, మెటీరియల్ అనే పదాలను వాడినట్లు సిట్ గుర్తించింది. ఇక ఆ హీరోయిన్ నుంచి కెల్విన్కు ఎస్సెమ్మెస్ వెళ్లిన ప్రతిసారి అరగంట గంట సమయంలోపు సదరు దర్శకుడి బ్యాంకు ఖాతా నుంచి కెల్విన్ ఖాతాలోకి డబ్బు ట్రాన్స్ఫర్ జరిగినట్లు సిట్ నిర్ధారించింది. ఈ హీరోయిన్, దర్శకుడు, కెల్విన్ కలసి ఉన్న ఫొటోలు కూడా దొరికాయి. ఈ అంశాల ఆధారంగానే విచారణ కొనసాగింది. ఆ దర్శకుడిని సుదీర్ఘంగా విచారించి, వాంగ్మూలాన్నీ నమోదు చేశారు. అయితే ఈ ఆధారాలేవీ కోర్టులో గట్టిగా నిలవవని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఎల్ఎస్డీ అంటే సినీ పరిభాషలో ‘లైట్ స్కేల్ డిన్నర్ (తక్కువ స్థాయిలో భోజనం)’అనే వాడుక ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక కెల్విన్ ఈవెంట్ మేనేజర్ కాబట్టి సినీ ప్రముఖుల బ్యాంకు ఖాతాల నుంచి ఆయనకు డబ్బు వెళ్లేందుకు చాలా అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నాయి. ఒకరు డ్రగ్ తీసుకున్నట్లు తేలినా.. ఫోరెన్సిక్ పరిశీలనలో ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్టు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అరెస్టు చేసే అవకాశముంది. అయితే తరచూ విదేశాలకు వెళ్లే ఆ ప్రముఖుడు ఎక్కడ డ్రగ్ తీసుకున్నాడో చెప్పటం కష్టమని, ఫలానా చోట, ఫలానా దేశంలో డ్రగ్ తీసుకున్నాడని నిరూపించటం సాధ్యం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కొన్ని దేశాల్లో సందర్భం, అవసరాన్ని బట్టి డ్రగ్స్ వాడకానికి చట్టబద్ధత ఉందని.. ఆ దేశాల్లో డ్రగ్స్ తీసుకుని ఉంటే పరిస్థితి ఏమిటన్న అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకునే అవకాశముందని పేర్కొంటున్నారు. ఇక మిగతా ప్రముఖుల విషయంలో ఈ మాత్రం ఆధారాలు కూడా లభ్యం కాలేదు. కేసుకు సంబంధించి ఇంకొన్ని వివరాలు.. ⇒ విచారణ ఎదుర్కొన్న ఒక నటుడు కొన్నేళ్ల కింద ఒకటి రెండు సార్లు డ్రగ్స్ తీసుకున్నట్లుగా అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది. కానీ ఇప్పుడా విషయాన్ని నిరూపించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. విచారణ సమయంలో తన పరువు తీశారంటూ కన్నీరు పెట్టిన ఆ నటుడు.. ఎక్సైజ్ సిట్ చార్జిషీటు వేయగానే పరువునష్టం దావా వేయాలన్న యోచనతో ఉన్నట్టు సమాచారం. ⇒మరోవైపు డ్రగ్స్ విక్రయించినవారిని కాకుండా కేవలం డ్రగ్స్ వాడిన వారిని అరెస్టు చేసి, చర్యలు చేపట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా లేనట్టు తెలుస్తోంది. వారిని అరెస్టు చేశాక కోర్టుల్లో నిరూపించలేకపోయినా, వారు పరువు నష్టం దావాలు వేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేసును కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడమే ఉత్తమమని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు అంశంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ వివరణ కోసం ప్రయత్నించగా.. ఆయన గుజరాత్ ఎన్నికల విధుల్లో ఉండటంతో అందుబాటులోకి రాలేదు. ఇతర అధికారులను సంప్రదించినా.. కేసుపై మాట్లాడేందుకు నిరాకరించారు. -
కలసికట్టుగా ‘మత్తు’ వదిలిద్దాం
- డ్రగ్స్ నియంత్రణకు ‘ఎక్సైజ్’ కార్యాచరణ - డీఆర్ఐ, ఎన్సీబీ, పోలీస్ శాఖలతో సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా నియం త్రించేందుకు ఎక్సైజ్ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. డ్రగ్స్ మాఫియాకు చెక్ పెట్టేందుకు పలు దర్యాప్తు విభాగాల ఆధ్వర్యంలో సంయుక్తంగా కలసి పని చేయాలని నిర్ణయించింది. మంగళవారం ఈ మేరకు రాష్ట్ర ఆబ్కారీ శాఖ భవనంలో ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ నేతృత్వంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్, రాష్ట్ర ఇంటెలిజెన్స్, సీఐఎస్ఎఫ్, డ్రగ్ కంట్రోల్ బోర్డు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచి వచ్చిన అధికారులతో నాలుగు గంటల పాటు సమావేశం కొనసాగింది. ఆ నెట్వర్క్లను ఛేదించాలి ప్రస్తుతం రాష్ట్రంలోకి వివిధ దేశాల నుంచి వస్తున్న నార్కోటిక్ డ్రగ్, సైకోట్రోఫిక్ మత్తు పదార్థాల నియంత్రణకు ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, ఓడరేవుల్లో విజిలెన్స్ను పటిష్టం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఆఫ్రికన్ డ్రగ్ రవాణా నెట్వర్క్ను ఛేదించేందుకు కేంద్ర హోంశాఖ నుంచి నిధులు ఉపయోగించుకొని ఉమ్మడిగా పని చేయా లని నిర్ణయించారు. ఇటీవల డ్రగ్ కేసు వ్యవహారంతో ఈ విభాగాలన్నీ చేసిన దాడులు, పట్టుబడ్డ మత్తు పదార్థాలు, వాటి లింకులపై చర్చించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తయారవుతున్న మత్తు పదార్థాల కేంద్రాలపై దాడులు, కేసుల నమోదు, వాటి దర్యాప్తునకు కావాల్సిన అవసరాలపై దృష్టి కేంద్రీకరించినట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. -
గ్లామర్ పార్ట్ పూర్తయింది
-
గోళ్లు, వెంట్రుకలు మరియు సిట్!
అక్షర తూణీరం మహా సంగ్రామాలప్పుడు కొన్ని వ్యూహాలు శత్రు పక్షాన్ని దారి తప్పిస్తాయ్. ప్రస్తుతం డ్రగ్స్పై విచారణలో గొప్ప వ్యూహ రచన సాగిందని తెలుస్తూనే ఉంది. అసలైన గొప్ప గుర్రాల్ని జాగ్రత్తగా కప్పెట్టడానికే ఈ వ్యూహం పన్నారని జనం అనుకుంటున్నారు. నాస్తికులు నమ్మరుగానీ దేవుడు భలే అసాధ్యుడు. సృష్టిలో బోలెడు మెలికలు పెడతాడు. గోళ్లు మిక్కిలి నిష్ప్రయోజనమైనవనుకుం టాం. శరీరాన్ని అంటిపెట్టుకు ఉన్నా రక్త సంబంధంలేని భాగాలు గోళ్లు, వెంట్రుకలు. వాటి దారిన అవి పెరుగుతూ ఉంటాయి. వాటి పోషణ ఇటీవలి కాలంలో పెనుభారం అయ్యింది. గోళ్ల వ్యవ హారమూ తక్కువది కాదు. వీటిని చాలా తృణీకారంగా తీసేస్తుంటాం. అదే మన అజ్ఞానం. మన పెద్దవాళ్లు బిడ్డ పుట్టగానే బొడ్డుని భద్రపరచి, తాయత్తులో పదిలపరిస్తే మూఢ నమ్మకం అనుకున్నాం. కానీ మూల కణాల చరిత్రని క్షణాల్లో అది చెబుతుందని నిన్న మొన్నటిదాకా మనకు తెలిసిరాలేదు. అకున్ సబర్వాల్ పుణ్యమా అని కొన్ని కీలక ఘట్టాలలో గోళ్లు, వెంట్రుకలు గుట్టు విప్పుతాయని జన సామాన్యానికి విశదమైంది. విచారణకు వచ్చిన వారిలో కొందరు వెంట్రుక ముక్కలు ఇవ్వడానికి ససేమిరా అన్నారు. గోళ్లు ఆత్మరక్షణకే అనుకున్నాం గానీ ఇలా గమ్మత్తు కథలు చెప్పగలవని ఎవరికీ తెలియదు. నెత్తుట్లో సైతం దొరకని కొన్ని మధుర స్మృతులు వీటిలో చూడవచ్చుట. మొత్తానికి నెల రోజులపాటు అటు ఆబ్కారీ శాఖ, ఇటు మీడియా కావల్సినంత సందడి చేశారు. కొన్ని చానెల్స్ స్వయంగా ఇంకొన్ని మసాలాలు జోడించి రేటింగులు సాధించుకున్నాయి. అందరూ పేరూ ప్రఖ్యాతి కలిగినవారు. ముఖ విలువ ఉన్నవారు. నాబోటి వాళ్లకి విషయాలు తెలుసుకోవాలని విప రీతమైన ఆసక్తి. ఈ మహా మత్తులో చిక్కుకున్న వారికి డబ్బు నిషా ఆనదు. విలాస జీవన శైలి ప్చ్... గ్లామర్ నిషా చాలదు. అప్పుడు అవసరపడతాయీ అదనపూ కిక్కులు. తొలి అడుగులోనే ఆనంద స్థితికి చేర్పిస్తాయి టాటూలు, బ్లాసమ్లు. ఒక్కసారి రుచి మరిగితే వీడటం కష్టం. గంజాయి, నల్లమందు, భంగు అతి ప్రాచీనమైన దేశవాళీ నిషాలు. తర్వాత అనేకానేక పై సంగతులు వచ్చి పడ్డాయి. ఇవీ కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఓ మూల ఈ కోడ్ నడుస్తూనే ఉంది. ఇప్పుడెందుకో తీగె లాగారు. డొంకంతా కదల్లేదుగానీ కొద్దిగా హడావుడి చేశారు. గంటలు గంటలు, రోజులు రోజులు ఇంటరాగేషన్ చేశారు. అందరూ సహకరించారు. అయినా అసలు సంగతి ఏమిటో ఎవరికీ తెలియదు. వారాల తరబడి టీవీ తెరలకు అతుక్కుపోయిన జనం పిచ్చివాళ్లుగా మిగిలారు. మహా సంగ్రామాలప్పుడు కొన్ని వ్యూహా లుంటాయ్. అవి శత్రు పక్షాన్ని దారి తప్పిస్తాయ్. ఇప్పుడు కూడా గొప్ప వ్యూహ రచన సాగిందని తెలుస్తూనే ఉంది. అసలైన గొప్ప గుర్రాల్ని జాగ్రత్తగా కప్పెట్టడానికే ఈ వ్యూహం పన్నారని జనం అను కుంటున్నారు. తిమింగలాలు సముద్ర మధ్యంలో నిశ్చిం తగా జోగుతున్నాయ్. ఒడ్డున చిన్న చేపతో అలజడిని సృష్టించి, ఆయా శాఖలు తమ నిజాయితీని చాటుకుం టున్నాయి. అకున్ సబర్వాల్ జీ! ఇంతకీ దీని ఫలశ్రుతి ఏమిటో చెప్పరా ప్లీజ్! గోళ్లు, వెంట్రుకలు మరియు రాజకీయం. వడ్ల గింజలో బియ్యపు గింజ! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
బెండు తీస్తారా ? బెండైపోతారా ?
-
డ్రగ్స్ కేసు : హైదరాబాద్ చేరుకున్న ముమైత్
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను కలవరపెడుతున్న డ్రగ్స్ రాకెట్ కేసులో మరో కీలక పరిణామం. ఇప్పటివరకు ఆరుగురు సినీ ప్రముఖులను ప్రశ్నించిన ఎక్సైజ్ సిట్ అధికారులు గురువారం సినీ నటి ముమైత్ఖాన్ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె గురువారం సిట్ విచారణకు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు ఆమె విచారణకు హాజరుకానున్నారు.ఇందుకోసం ఆమె బుధవారం పుణె నుంచి హైదరాబాద్కు వచ్చారు. ప్రస్తుతం మొమైత్ఖాన్ బిగ్బాస్ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ షో నిబంధనల ప్రకారం ఆమె అర్ధంతరంగా బిగ్బాస్ హౌస్ నుంచి బయటకు రావడానికి వీలు లేకపోయినా డ్రగ్స్ కేసు తీవ్రత దృష్ట్యా ఆమెకు ఈ వెసులుబాటు కల్పించినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం తిరిగి ఆమె షోలో పాల్గొంటారా లేదా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు దర్శకుడు పూరీ జగన్నాథ్, శ్యాం కే నాయుడు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, చార్మి తదితరులు సిట్ విచారించిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాల వినియోగానికి సబంధించి లోతుగా సాగుతున్న సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నట్టు తెలుస్తోంది. -
సిట్ విచారణకు మొమైత్.. ఇరకాటంలో బిగ్బాస్!
-
సిట్ ఎదుట చార్మి.. ఆరు గంటలు!
హైకోర్టు ఆదేశాలతో ఐదులోపే ముగిసిన విచారణ హైదరాబాద్: టాలీవుడ్ను కుదుపుతున్న డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిపై సిట్ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటలపాటు సిట్ అధికారులు ఆమెను ప్రశ్నించారు. నలుగురు మహిళా అధికారుల బృందం ఆమెకు ప్రశ్నలను సంధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం ఐదుగంటలలోపే చార్మిపై సిట్ విచారణ ముగిసింది. చార్మి వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న సిట్ అధికారులు.. మరోసారి పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం ఉల్లాసంగా మీడియాకు చేతులు ఊపుతూ చార్మి వెళ్లిపోవడం గమనార్హం. ప్రధానం డ్రగ్స్ ముఠా సభ్యుడు కెల్విన్తో సంబంధాలపైనే చార్మిని సిట్ ప్రశ్నించినట్టు సమాచారం. కెల్విన్తో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? మీరు డ్రగ్స్ తీసుకుంటురా? పబ్లకు వెళుతారా? పబ్ల్లో డ్రగ్స్ సంస్కృతిపై మీ అభిప్రాయం ఏమిటి? టాలీవుడ్లో డ్రగ్స్ అలవాటు ఎవరెవరికి ఉంది? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు చార్మికి వేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ సినీ ప్రముఖులతో సంబంధాల గురించి కూడా ఆరాతీసినట్టు సమాచారం. ప్రధానంగా సాక్షిగా భావించి చార్మిని విచారిస్తున్నామని సిట్ ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసింది. చార్మిని ప్రధానంగా కెల్విన్ గురించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. చార్మి హీరోయిన్గా తెరకెక్కిన 'జ్యోతిలక్ష్మి' సినిమా వేడుకలో కెల్విన్ పాల్గొన్న ఫొటోలను చూపించి.. ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. చట్టప్రకారం నిబంధనలను అనుసరించే హీరోయిన్ చార్మి కౌర్ను విచారించాలని ఎక్సైజ్ సిట్ అధికారులను హైకోర్టు ఆదేశిం చిన సంగతి తెలిసిందే. చార్మి ఇష్టానికి విరుద్ధంగా ఆమె రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సేకరించవద్దని.. ఈ విషయంలో ఆమెపై ఒత్తిడి చేయవద్దని సూచించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, మహిళా అధికారుల సమక్షంలో మాత్రమే ప్రశ్నించాలని పేర్కొంది. విచారణ పూర్తికాకుంటే మరుసటి రోజు కొనసాగించవచ్చని సూచించింది. అంతకుముందు చార్మి తరఫున న్యాయవాది పి.విష్ణువర్ధన్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సిట్ అధికారులు విచారణకు పిలిచిన వారినుంచి బలవంతంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు సేకరిస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. చార్మి విషయంలోనూ అలాగే జరిగే అవకాశముందని.. ఇది హక్కు లను ఉల్లంఘించడమేనన్నారు. దీనికి సిట్ తరఫు లాయర్ బదులిస్తూ సిట్ అధికారులు ఎవరి నుంచీ బలవంతంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకోవడం లేదని తెలిపారు. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ పై చార్మీ ఫిర్యాదు
హైదరాబాద్ : ఎక్సైజ్ కానిస్టేబుల్ శ్రీనివాస్పై సినీనటి చార్మీ సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం విచారణకు సిట్ కార్యాలయానికి వచ్చిన తనపట్ల కానిస్టేబుల్ ఓవరాక్షన్ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న చార్మీ విచారణ నిమిత్తం ఇవాళ అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. అప్పుడు లోనికి వెళ్లే సమయంలో మహిళా కానిస్టేబుల్స్ ఉన్నప్పటికీ తనను తాకుతూ శ్రీనివాస్ అత్యుత్సాహం ప్రదర్శించాడని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తాను ఒక్కసారిగా తాను షాక్కు గురైనట్లు చార్మి వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు చార్మీని నలుగురు మహిళా అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా, ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఎలా పరిచయం అనేవాటిపై ప్రశ్నిస్తున్నారు. -
సిట్ విచారణకు హీరోయిన్ చార్మీ
-
సిట్ విచారణకు హీరోయిన్ చార్మీ
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో సిట్ అధికారుల విచారణ ఏడో రోజు కొనసాగుతోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న సినీనటి చార్మి విచారణ నిమిత్తం బుధవారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. నలుగురు బౌన్సర్ల భద్రత మధ్య చార్మీ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఆమె కొండాపూర్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో పైసా వసూలు సినిమా షూటింగ్లో పాల్గొని అక్కడ నుంచే నేరుగా నాంపల్లిలోని అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పైసా వసూలు చిత్రానికి చార్మీ లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఇటీవలే పూరీ జగన్నాథ్తో కలిసి ‘పూరీ కనెక్ట్’ పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. కాగా చార్మిని హైకోర్టు ఆదేశాలతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ విచారణ చేయనున్నారు. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన సమయంలో విచారణ పూర్తి కాకుంటే ఆమెను రేపు (గురువారం) కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్ ముఠాతో పాటు, సినీ ప్రముఖులతో సంబంధాలపై మహిళా అధికారుల బృందం ఆమెను విచారణ చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నోటీసులు అందుకున్న పలువురు సినీ ప్రముఖులు సిట్ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నాలను సిట్ అధికారులు విచారణ చేశారు. -
మాపై అభాండాలు ఆపండి.
-
మాపై అభాండాలు ఆపండి
లేదంటే పరువు నష్టం దావా వేస్తాం: అకున్ సబర్వాల్ - సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే విచారణ ఎవరినీ టార్గెట్ చేయడం లేదు - ఇప్పటిదాకా 27 మందికి నోటీసులిచ్చాం.. 19 మందిని అరెస్ట్ చేశాం - విద్యార్థులను విచారించం.. తల్లిదండ్రుల ఎదుటే కౌన్సెలింగ్ ఇస్తున్నాం సాక్షి, హైదరాబాద్: తమ విభాగంపై, తమపై ఇష్టా రాజ్యంగా ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే తాము డ్రగ్స్ కేసులో దర్యాప్తు చేస్తున్నామని స్పష్టంచేశారు. కేవలం సినిమా వాళ్లనే టార్గెట్ చేసినట్టు వస్తున్న వార్తలను ఖండించారు. ఇప్పటివ రకు ఈ కేసులో 27 మందికి నోటీసులిచ్చామని, అలాగే కెల్విన్తో కలిపి 19 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్రెండ్లీ వాతావరణంలో విచారిస్తున్నాం.. సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులిచ్చా మని, వారిలో ఇప్పటికి ఐదుగురిని ప్రశ్నించామని అకున్ పేర్కొన్నారు. అందరినీ మర్యాదపూర్వకంగా, ఫ్రెండ్లీ వాతావరణంలో విచారిస్తున్నామన్నారు. ‘‘ప్రత్యేకమైన గదిలో విచారణ జరుగుతోంది. ప్రతీ అంశాన్ని వీడియో రికార్డు చేస్తున్నాం. శ్రీనివాస్రావు, శ్రీనివాస్ నేతృత్వంలో రెండు సిట్ బృందాలు విచారి స్తున్నాయి. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులు స్వతంత్రంగా, రాతపూర్వకంగా ఒప్పుకున్నాకే వారి నుంచి నమూనాలు సేకరిస్తున్నాం. విచారణలో ప్రతీ 8 గంటలకోసారి తమ బృందంలోని వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నాం’’ అని ఆయన వివరించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడలేం సినీ ప్రముఖుల మాదిరే విద్యార్థులను విచారిస్తారా అని వస్తున్న ప్రశ్నలపై అకున్ స్పందించారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడలేమని, అందరికీ పిల్లలున్నారని, తాము అలాంటి పొరపాటు ఎట్టి పరిస్థితుల్లో చేయమని స్పష్టంచేశారు. వారంతా మైనర్లు కావడం వల్ల తల్లిదండ్రుల ఎదుటే కౌన్సెలింగ్ ఇస్తున్నామని, అలాగే డ్రగ్స్ నియంత్రణపై పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మాకు అన్ని అధికారాలున్నాయి.. డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ విభాగానికి విచారణ అధికా రం లేదని, దర్యాప్తు అధికారులు సరిగ్గా లేరని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై అకున్ తీవ్ర స్థాయి లో స్పందించారు. గతేడాది జూన్లో ఎక్సైజ్ విభా గానికి ప్రభుత్వం ప్రత్యేకమైన అధికారాలు కట్టబెట్టిం దని స్పష్టంచేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఇలాంటి కేసుల్లో తమ విభాగానికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. సెక్షన్ 41, 42, 53 కింద నమోదైన కేసుల్లో లోతుగా దర్యాప్తు చేసే అధికారం ఉందని తేల్చిచెప్పారు. డ్రగ్స్ తీసుకున్నా, కొనుగో లు చేసినా, విక్రయించినా, ఇంట్లో పెట్టుకున్నా కేసు లు నమోదు చేసే అధికారం ఉందని వెల్లడించారు. మహిళా అధికారులే విచారిస్తారు.. నిజాయితీ కలిగిన సీనియర్ ఐపీఎస్లు, డిటెక్టివ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో.. తదితర విభాగాలతో ప్రతీక్షణం టచ్లో ఉంటున్నామని, దర్యాప్తులో సందేహాలుంటే తీర్చుకుంటున్నామని అకున్ తెలిపారు. పోలీస్ శాఖలో ఉన్న సీనియర్ ఐపీఎస్ల సలహాలు కూడా తీసుకుంటున్నామని వివరించారు. తమ వద్ద ఎక్సైజ్లో టాప్ మోస్ట్ ఇన్వెస్టిగేషన్ అధికారులు న్నారని, సిట్ బృందంలో మహిళా అధికారులను కూడా నియమించామని తెలిపారు. విచారణలో ఇన్స్పెక్టర్ జయలక్ష్మి చురుగ్గా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. డ్రగ్స్ కేసులో మహిళలను ప్రశ్నించేందుకు మహిళా అధికారులుంటారని స్పష్టంచేశారు. తనకు వస్తున్న బెదిరింపు ఫోన్కాల్ వ్యవహారంలో భయపడాల్సిన అవసరం లేదని, అలాంటివి చూసుకోవడానికి తన వద్ద ఉన్న ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు సరిపోతారని నవ్వుతూ బదులిచ్చారు. చట్టానికి లోబడే విచారణ: చంద్రవదన్ డ్రగ్స్ కేసు విచారణలో తమ సిట్ బృందం చట్టానికి లోబడి, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ముం దుకు వెళ్తోందని ఎౖక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. సిట్ విచారణకు మరి కొందరు హాజరుకావాల్సి ఉందన్నారు. ఆగస్టు 2 వరకు వారంతా విచారణకు వస్తారని మీడియాకు వివరించారు. సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోం దని, సమర్థవంతమైన అధికారులున్నారని, ఈ కేసులో ఎవరినీ వదలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఒకరిని టార్గెట్గా చేసుకొని వెళ్లాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఇప్పటివరకు 3 వేల యూనిట్ల ఎల్ఎస్డీ డ్రగ్, 100 యూనిట్ల ఎండీ ఎంఏ, 45 గ్రాముల కొకైన్ ఇతరత్రా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సినీ నటి చార్మి హైకోర్టుకు వెళ్లడంపై చంద్రవదన్ స్పంది స్తూ... ‘‘మాకు కోర్టు నుంచి ఎలాంటి అధికారిక పత్రాలు అందలేదు. అయినా మా న్యాయ బృందం ఆ అంశాలపై కౌంటర్కు రెడీ అవుతోంది. బ్లడ్, ఇతర శాంపిల్స్ను ఎవరిని నుంచి బలవం తంగా తీసుకోవడం లేదు. స్వచ్ఛందంగా ఇస్తేనే తీసుకుంటున్నాం’’ అని అన్నారు. చార్మితోపాటు ముమైత్ఖాన్ సిట్ కార్యాల యంలోనే విచారణకు హాజరవుతారని భావిస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం సిట్ ఎదుట సినీ ఆర్డ్ డైరెక్టర్ ధర్మారావు అలియాస్ చిన్నా హాజరవుతారని తెలిపారు. -
అకున్తో బాహుబలి–3 తీయాలేమో!
డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ విచారణపై రాంగోపాల్వర్మ - ఫేస్బుక్లో వివాదాస్పద కామెంట్లు - నటీనటులను విచారించినట్టే విద్యార్థులను విచారిస్తారా అని ప్రశ్న - వర్మపై మండిపడ్డ ఎక్సైజ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం - అరెస్ట్ తప్పదంటూ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్పై ఫేస్బుక్లో అనుచిత కామెంట్లు పెట్టారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు, సిట్, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా స్పందించింది. అరెస్టు తప్పదంటూ హెచ్చరించింది. అకున్ను బాహుబలిలా చూపుతున్న మీడియా: వర్మ ‘సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజులను 12 గంటలపాటు ప్రశ్నించినట్టుగానే డ్రగ్స్ తీసుకున్న స్కూల్ విద్యార్థులను కూడా గంటల తరబడి ప్రశ్నిస్తారా? డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకొని ఎక్సైజ్ విభాగం తన ప్రచారానికి సినీ నటులను ట్రైలర్, టీజర్గా వాడుకుంటోంది. డ్రగ్స్ ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదన్న విషయం చట్టపరంగా బయటపడుతుంది. కానీ అకున్ సబర్వాల్ విచారణలో సినీ వ్యక్తులు చెప్పిన విషయాలు, చెప్పని విషయాలను మీడియాకు లీకులిస్తున్నారు. అకున్ను మీడియా అమరేంద్ర బాహుబలి తరహాలో చూపిస్తోంది. బహుశా అకున్ సబర్వాల్తో రాజమౌళి బాహుబలి పార్ట్–3 తీయాలేమో. డ్రగ్స్ తీసుకున్నట్టు ఎక్కడా ఎలాంటి కేసులు లేకున్నా విచారణ పేరుతో మీడియాకు లీకులిచ్చి సంబంధిత నటీనటుల కుటుంబీకులు బాధపడేలా, వారి గౌరవం దెబ్బతినేలా అకున్ సబర్వాల్, అతడి దర్యాప్తు బృందం వ్యవహరిస్తోంది. డ్రగ్స్ నియంత్రణలో అకున్ పాత్ర సరైనదే కానీ, విచారణకు హాజరవుతున్న వారితో సిట్ వ్యవహరిస్తున్న తీరుపై మీడియాలో వచ్చే ఊహాగానాలను ఆపడం మీ బాధ్యత కాదా? విచారణ జరుగుతున్న తీరుపై మీడియాకు లీకులిచ్చి సంబంధిత విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తుల పట్ల మీ విభాగం అమర్యాదగా ప్రవర్తిస్తోంది’ అంటూ రాంగోపాల్ వర్మ ఫేస్బుక్లో కామెంట్లు చేశారు. కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాం... డ్రగ్స్ కేసు విచారణ జరుపుతున్న అధికారులు, అకున్ సబర్వాల్పై వివాదాస్పద కామెంట్లు చేసిన వర్మపై ఎక్సైజ్ సిట్తోపాటు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఎలాంటి ఆధారాల్లేకుండా విచారణ సంస్థ, అధికారులపై ఆరోపణలు చేసిన వర్మపై హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తామని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహమూద్ అలీ మీడియాకు తెలిపారు. అరెస్టు తప్పదని హెచ్చరించారు. వర్మ విజ్ఞతకే వదిలేస్తున్నాం: చంద్రవదన్ రాంగోపాల్వర్మ చేసిన కామెంట్లు సరికాద ని, అయినా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. అన్ని ఆధారాలతోనే విచారణ జరుగుతోందని, అంద రూ సహకరిస్తున్నారని తెలిపారు. చట్టాలకు లోబడే చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం పూర్తి అధికారం ఇచ్చిందని చెప్పారు. కేవలం సినిమా వాళ్లనే టార్గెట్ చేశామని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఎక్సైజ్ శాఖను దెబ్బతీసే ప్రయత్నం కొంత మంది చేస్తున్నారని, వాటిని ఖండిస్తున్నామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పబ్బులకు నోటీసులిచ్చి విచారణ జరిపామన్నారు. వీటిలో నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్న ‘ఎఫ్ క్లబ్’ పబ్ లైసెన్స్ రద్దు చేశామన్నారు. మరో 14 పబ్బుల యాజమాన్యాలకు హెచ్చరిక నోటీసులిచ్చామని, సీసీ కెమెరాలు, రికార్డులు తదితర వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశామన్నారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అనుమానం వస్తే సమాచారం ఇవ్వాలని, అక్కడ పార్టీలు చేసే ఈవెంట్మేనేజర్లు, డ్యాన్సర్ల వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. ఆరు నెలల నుంచి ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు సమర్పించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్బుల లైసెన్స్ సస్పెన్డ్ చేస్తామని హెచ్చరించారు. -
ఎఫ్ క్లబ్ లైసెన్స్ రద్దు, 14 పబ్లకు వార్నింగ్
-
ఎఫ్ క్లబ్ లైసెన్స్ రద్దు, 14 పబ్లకు వార్నింగ్
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో సిట్ దూకుడు పెంచింది. నిబంధనలు అతిక్రమించిన ‘ఎఫ్’ క్లబ్ లైసెన్స్ను సిట్ రద్దు చేసింది. అంతేకాకుండా మరో 14 పబ్లు, బార్లకు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు మరోవైపు నోటీసులు జారీ చేసినవారిని విచారణ చేస్తున్నారు. ఇప్పటివరకూ విచారణ ఎదుర్కొన్నవారు వెల్లడించిన ప్రకారం...పబ్బుల్లోనే డ్రగ్స్ కల్చర్ నడుస్తున్నట్లు వెల్లడించడంతో సిట్...పబ్బులపై దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా నగరంలోని 17 పబ్బుల నిర్వాహకులను ఇవాళ (శనివారం) విచారణకు పిలిచారు. విచారణలో భాగంగా డ్రగ్స్ సరఫరా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే డ్రగ్స్ కేసులో మరో ఇద్దర్ని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన మహ్మద్ ఉస్మాన్, అర్నవ్ మండల్ నుంచి 20 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. -
‘అవసరం అయితే అకున్కు భద్రత పెంపు’
హైదరాబాద్ : ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కు బెదిరింపు కాల్స్పై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ స్పందించారు. బెదిరింపు కాల్స్ను ధ్రువీకరించిన ఆయన ... అవసరం అయితే అకున్ సబర్వాల్కు అదనపు భద్రత కల్పిస్తామన్నారు. బెదిరింపు కాల్స్పై ఇంటెలిజెన్స్ అధికారులకు అకున్ సబర్వాల్ ఫిర్యాదు చేశారన్నారు. ఈ కాల్స్పై విచారణ జరుగుతోందని, అవి ఎక్కడ నుంచి వచ్చాయో ఇంటెలిజెన్స్ పరిశీలిస్తోందని డీజీపీ పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో బెదిరింపు కాల్స్పై స్పష్టత వస్తుందన్నారు. కాగా డ్రగ్స్ మాఫియా కేసు విచారణను తక్షణమే నిలిపేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు అకున్ సబర్వాల్కు కాల్ చేసి హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసంటూ ఇంటర్నెట్ ద్వారా అగంతుకుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫోన్ చేసిన డ్రగ్స్ మాఫియా ముఠాకు చెందిన వ్యక్తి ఆఫ్రికన్ భాషలో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ముఠా నెదర్లాండ్, ఐరోపాలోని పలు దేశాలు, అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు కెల్విన్ ద్వారానే అంతర్జాతీయ మాఫియా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు స్పష్టమైంది. -
అకున్కు బెదిరింపు కాల్స్.. ఆఫ్రికన్ భాషలో..
-
అకున్కు బెదిరింపు కాల్స్.. ఆఫ్రికన్ భాషలో..
హైదరబాద్: రాష్ట్రాన్ని కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారం అంతు తేల్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. డ్రగ్స్ విచారణ ఉన్నపలంగా నిలిపేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు కాల్ చేసి హెచ్చరికలు చేశారు. అకున్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారో తమకు తెలుసంటూ బెదిరించారు. ఇంటర్నెట్ ద్వారా అగంతుకుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన డ్రగ్స్ మాఫియా ముఠాకు చెందిన వ్యక్తి ఆఫ్రికన్ భాషలో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు వారం రోజులుగా కూడా ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయంట. దీంతో డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ముఠా నెదర్లాండ్, ఐరోపాలోని పలు దేశాలు, అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు కెల్విన్ ద్వారానే అంతర్జాతీయ మాఫియా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు స్పష్టమైంది. దీంతో డ్రగ్స్ మాఫియా తాజాగా చేసిన ఫోన్ కాల్స్పై ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఇప్పటి వరకు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామేన్ శ్యామ్కే నాయుడు, నటుడు సుబ్బరాజును విచారించిన విషయం తెలిసిందే. సుబ్బరాజు విచారణ ఆధారణంగా తాజాగా మరో 15మంది సినీనటులకు నోటీసులు పంపించనున్నారు. నేడు (శనివారం) తరుణ్ విచారణ జరగనుంది. -
కొనసాగుతున్న సుబ్బరాజు విచారణ
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో మూడోరోజు సిట్ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న సుబ్బరాజు విచారణ నిమిత్తం ఇవాళ ఉదయం (శుక్రవారం) అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. ఆయనను సిట్ అధికారులు సుమారు ఎనిమిది గంటలకు పైగా విచారణ జరుపుతున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్తో గల సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీశారు. తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను చూపించి ఆయనపై సిట్ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. ఓ దశలో సుబ్బరాజు విచారణ ముగిసిందని వార్తలు వెలువడ్డా... మరికొన్ని గంటల పాటు సుబ్బరాజు ప్రశ్నిస్తామని ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. కొద్దిసేపు బ్రేక్ ఇచ్చామని, అనంతరం విచారణ కొనసాగుతుందన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 70 పబ్లకు నోటీసులు ఇచ్చామని, రేపు పబ్లు, బార్ల యజమానులతో సమావేశం కానున్నట్లు ఆయన తెలిపారు. తమ అదుపులో ఉన్న పలువురు పబ్లో డ్రగ్స్ అమ్ముతున్నట్లు సమాచారం ఇచ్చారని, 16 పబ్ల్లో డ్రగ్స్ అమ్ముతున్నారని వాళ్లు వెల్లడించారన్నారు. రేపు నటుడు తరుణ్ను విచారణ చేస్తామని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 27న ముమైత్ ఖాన్ విచారణకు పిలిచామన్నారు. విచారణ పూర్తయిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. అంతకు ముందు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాట్లాడుతూ సుబ్బరాజు విచారణకు సహకరిస్తున్నారని తెలిపారు. సుబ్బరాజును ప్రశ్నిస్తుంటే కీలక విషయాలు బయటపడుతున్నాయని, ఇవాళ కీలక విషయాలు తెలుస్తాయని భావిస్తున్నట్లు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ కేసులో లోతుగా విచారణ చేయాల్సి ఉందని, ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఆ వివరాల గురించి విచారణ అనంతరం వెల్లడిస్తామన్నారు. డ్రగ్స్ మాఫియాతో టాలీవుడ్ లింకులపై ఆధారాలు లభిస్తున్నాయని, అలాగే నోటీసులు అందుకున్న ముమైత్ఖాన్, ఛార్మీ కూడా విచారణకు హాజరు అవుతారని ఆయన తెలిపారు. మరోవైపు సుబ్బరాజు రక్తనమునా సేకరణ కోసం ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సిట్ అధికారులు వరుసగా నోటీసులు ఇచ్చినవారిని విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యాం కె నాయుడును విచారణ చేశారు. శనివారం నటుడు తరుణ్ సిట్ ఎదుట హాజరు అవుతారు. -
డ్రగ్స్ కేసులో రేపటి నుంచి సినీ నటుల విచారణ
హైదరాబాద్ : సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు జారీ చేసిన సినీ నటులను రేపటి (బుధవారం) నుంచి, ఈ నెల 27 వరకూ రోజుకొకరిని విచారణ చేస్తామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ నటి ముమైత్ ఖాన్ మినహా అందరూ విచారణకు హాజరు అవుతారని తెలిపారు. డ్రగ్స్ మాఫియాపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని, తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. కాగా డ్రగ్స్ వ్యవహారంతో సినీ ప్రముఖుల లింకు బయటపడటంతో సినీ హీరో, హీరోయిన్లు, దర్శకుడు సహా 12 మందికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసింది. వారంతా ఈ నెల 19 నుంచి 27 మధ్య సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. పేరుమోసిన డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్ కాల్లిస్ట్ ఆధారంగా వీరికి తెలంగాణ ఎక్సైజ్శాఖ నోటీసులు జారీచేసింది. ఈ నెల 19న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, 20న హీరోయిన్ ఛార్మీ, 22న నటుడు సుబ్బరాజు, 23న ప్రముఖ కెమెరామెన్ శ్యాం కే నాయుడు సిట్ ఎదుట హాజరుకాబోతున్నారు. ఇక ప్రముఖ హీరో రవితేజ ఈ నెల 24న సిట్ను ఫేస్ చేయబోతున్నాడు. 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను, 26న హీరో నవదీప్, 27న హీరో తరుణ్, 28న యువ హీరోలు తనీష్, నందులను సిట్ విచారించనుంది. కాగా ఓ టీవీ చానల్లో బిగ్ బాస్ కార్యక్రమంలో ముమైత్ ఖాన్ బిజీగా ఉండటంతో ఆమె స్వయంగా సిట్ ఎదుట హాజరు అయ్యేందుకు మినహాయింపు లభించినట్లు తెలుస్తోంది. -
అకున్ సబర్వాల్ అనూహ్య నిర్ణయం!
సెలవులు రద్దు.. ఇక ఫుల్ ఫోకస్ డ్రగ్స్ కేసుపైనే హైదరాబాద్: రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం. ఉన్నట్టుండి సెలువులపై వెళుతున్నట్టు ప్రకటించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ మనస్సు మార్చుకున్నారు. ఆయన తాజాగా తన సెలువులు రద్దు చేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ కీలక దశలో ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన సెలువులు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో డ్రగ్స్ కేసుసస దర్యాప్తు పూర్తయ్యే వరకు సెలవులు రద్దు చేసుకుంటున్నట్టు అకున్ సబర్వాల్ తెలిపారు. ‘డ్రగ్స్’ వ్యవహారాన్ని మూలాల నుంచి పెకలిస్తున్న ఆయన అనూహ్యంగా సెలువుపై వెళుతున్నట్టు శుక్రవారం ప్రకటించడంతో పలు అనుమానాలు, విమర్శలు వెల్లువెత్తాయి. ఆదివారం నుంచి ఈ నెల 27 వరకు పది రోజులు విధులకు దూరంగా ఉండనున్నానని అకున్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీచేసి, విచారించనున్న కీలక సమయంలో ఆయన సెలవుపై వెళుతున్నట్టు ప్రకటించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇతర కేసుల లాగానే ఈ డ్రగ్స్ కేసు పనికూడా అయిపోయినట్లేననే విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే అకున్ సబర్వాల్ తన సెలువులను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల అసంతృప్తితో.. డ్రగ్స్ వ్యవహారం కేసు తొలి నుంచి వివాదాస్ప దం అవుతోంది. డ్రగ్స్ మాఫియా స్కూల్ పిల్లల ను కూడా వదిలిపెట్టడం లేదని.. పలు ఇంటర్నేషనల్ స్కూళ్ల పిల్లలు డ్రగ్స్ బారిన పడ్డారని అకున్ సబర్వాల్ బయటపెట్టారు. డ్రగ్స్ వ్యవహారంపై ఈనెల 18న నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరుకావాలని దాదాపు 40 పాఠశాలలు, 80 కళాశాల యాజమాన్యాలకు అడ్వైజరీ నోట్లు కూడా పంపారు. అయితే దీనిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తప్పుబ ట్టారు. విచారణ అధికారి (సబర్వాల్) అత్యు త్సాహం చూపిస్తున్నారంటూ బాహాటంగానే విమర్శించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు ఇదే సమయంలో డ్రగ్స్ వ్యవహారంతో సినీ ప్రముఖుల లింకు బయటపడింది. దీంతో సినీ హీరో, హీరోయిన్లు, దర్శకుడు సహా 12 మందికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసింది. వారంతా ఈ నెల 19 నుంచి 27 మధ్య సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అంతేగాకుండా మరింత మంది సినీ పెద్దలకూ నోటీసులు అందించేందుకు సిద్ధమైంది. ఇలా కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో విచారణాధికారి అకున్ సబర్వాల్కు 10 రోజుల పాటు సెలవులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం.. కలకలం రేపింది. అకున్ సబర్వాల్ ఉన్నట్టుండి సెలవుపై వెళ్తాననడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇది కేసును నీరుగార్చడానికేనన్న ఆరోపణలు వినవచ్చాయి. సెలవు తీసుకోవడానికి సబర్వాల్ చెప్పిన పరస్పర విరుద్ధ కారణాలు ఈ ఆరోపణలకు బలాన్నిచ్చాయి. ఉదయం ఒక టీవీ చానల్తో మాట్లాడిన ఆయన.. సెలవు పెట్టి హిమాలయాల్లో పర్వతారోహణకు వెళ్తు న్నట్లు చెప్పారు. జాతీయ పోలీసు అకాడమీ బృందంతో కలసి వెళ్లేందుకు అనుమతించాలంటూ గతంలోనే ప్రభుత్వాన్ని కోరానన్నారు. అయితే గంట సేపటి అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సెలవుపై మాట మార్చారు. రెండు నెలల కింద తన తల్లి చనిపోయారని, మరణం అనంతరం నిర్వహించే కార్యక్రమాల కోసం పంజాబ్లోని స్వగ్రామానికి వెళుతున్నానని చెప్పారు. ఈ ఆరోపణలు, అనుమానాల నేపథ్యంలోనే అకున్ తన మనస్సు మార్చుకొని డ్రగ్స్ కేసు విచారణ కోసం సెలువులు రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. -
అకున్ సబర్వాల్ అనూహ్య నిర్ణయం!
-
‘డ్రగ్స్’ కేసుకు సెలవు?
-
‘డ్రగ్స్’ కేసుకు సెలవు?
- రేపటి నుంచి 27వ తేదీ వరకు సెలవులో అకున్ సబర్వాల్ - పర్వతారోహణకు వెళ్తున్నా అంటూ ఓ చానల్కు వెల్లడి - కొద్దిసేపటికే తమ స్వగ్రామానికి వెళ్తున్నానంటూ మాట మార్పు సాక్షి, హైదరాబాద్: ‘డ్రగ్స్’వ్యవహారాన్ని మూలాల నుంచి పెకలిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ఉన్నట్టుండి సెలవుపై వెళుతున్నారు. ఆదివారం నుంచి 27 వరకు పది రోజులు విధులకు దూరంగా ఉండనున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి, విచారించనున్న కీలక సమయంలో ఆయన సెలవుపై వెళుతుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర కేసుల లాగానే ఈ డ్రగ్స్ కేసు పనికూడా అయిపోయినట్లేననే అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల అసంతృప్తితో.. డ్రగ్స్ వ్యవహారం కేసు తొలి నుంచి వివాదాస్ప దం అవుతోంది. డ్రగ్స్ మాఫియా స్కూల్ పిల్లల ను కూడా వదిలిపెట్టడం లేదని.. పలు ఇంటర్నేషనల్ స్కూళ్ల పిల్లలు డ్రగ్స్ బారిన పడ్డారని అకున్ సబర్వాల్ బయటపెట్టారు. డ్రగ్స్ వ్యవహారంపై ఈనెల 18న నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరుకావాలని దాదాపు 40 పాఠశాలలు, 80 కళాశాల యాజమాన్యాలకు అడ్వైజరీ నోట్లు కూడా పంపారు. అయితే దీనిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తప్పుబ ట్టారు. విచారణ అధికారి (సబర్వాల్) అత్యు త్సాహం చూపిస్తున్నారంటూ బాహాటంగానే విమర్శించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు ఇదే సమయంలో డ్రగ్స్ వ్యవహారంతో సినీ ప్రముఖుల లింకు బయటపడింది. దీంతో సినీ హీరో, హీరోయిన్లు, దర్శకుడు సహా 12 మందికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసింది. వారంతా ఈ నెల 19 నుంచి 27 మధ్య సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అంతేగాకుండా మరింత మంది సినీ పెద్దలకూ నోటీసులు అందించేందుకు సిద్ధమైంది. ఇలా కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో విచారణాధికారి అకున్ సబర్వాల్కు 10 రోజుల పాటు సెలవులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన శుక్రవారమే హైదరాబాద్ నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. విరుద్ధ సమాధానాలతో.. అకున్ సబర్వాల్ ఉన్నట్టుండి సెలవుపై వెళ్లటం అనేక అనుమా నాలకు తావి స్తోంది. ఇది కేసును నీరుగార్చడానికేనన్న ఆరోపణలు వస్తున్నాయి. సెలవు తీసుకోవడానికి సబర్వాల్ చెప్పిన పరస్పర విరుద్ధ కారణాలు ఈ ఆరోపణలకు బలాన్నిస్తున్నాయి. ఉదయం ఒక టీవీ చానల్తో మాట్లాడిన ఆయన.. సెలవు పెట్టి హిమాలయాల్లో పర్వతారోహణకు వెళ్తు న్నట్లు చెప్పారు. జాతీయ పోలీసు అకా డమీ బృందంతో కలసి వెళ్లేందుకు అనుమతించాలంటూ గతంలోనే ప్రభు త్వాన్ని కోరానన్నారు. అయితే గంట సేపటి అనంతరం మీడియాతో మాట్లా డిన ఆయన సెలవుపై మాట మార్చారు. రెండు నెలల కింద తన తల్లి చనిపో యారని, మరణం అనంతరం నిర్వహించే కార్యక్రమాల కోసం పంజాబ్లోని స్వగ్రామానికి వెళుతున్నానని చెప్పారు. కేసు దర్యాప్తుకు, సెలవుకు సంబంధం లేదన్నారు. ఎన్నో సందేహాలు అకున్ సబర్వాల్ పర్వతారోహణకు వెళ్లనున్నట్ల యితే... కీలకమైన కేసు విచారణ, సంచలన అంశాలు బయటికి వస్తున్న నేపథ్యంలో సెలవును రద్దు చేసుకోవ చ్చు. ఒక వేళ తన తల్లి మర ణానంతర కార్యం అనుకుంటే... హిందూ సంప్రదాయాల ప్రకారం ఆ క్రతువులో తన జీవిత భాగస్వామి స్మితా సబర్వాల్ కూడా పాల్గొనాలి. కానీ ఆమె విధుల్లోనే సాగు తున్నారు. అయితే ప్రభుత్వమే అకున్ సబర్వాల్ ఎప్పుడో విజ్ఞప్తి చేసిన సెలవులను వ్యూహాత్మకంగా ఇప్పుడు మంజూరు చేసి, రాష్ట్రం దాటించిందనే ఆరోపణలు వస్తున్నాయి. -
‘అకున్ సబర్వాల్ను తప్పించేందుకు యత్నాలు’
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విచారణ నుంచి తప్పిస్తోందని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. తక్షణమే ఆయన సెలవులు రద్దుచేసి కేసు పూర్తి అయ్యే వరకు విచారణ అధికారిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితులైన కొందరు సినీ ప్రముఖులను ఈ కేసు నుంచి తప్పించడానికే అకున్ను సెలవుపై పంపిస్తున్నారని తెలిపారు. విచారణ జరిగే సందర్భంలోనే ఆయన సెలవుపై వెళ్లడం ఒత్తిళ్లకు నిదర్శనమని అన్నారు. కాగా అకున్సబర్వాల్ 10 రోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉందని అకున్ తెలిపారు. -
ఆ పాఠశాలల పేర్లు వెల్లడించలేదు
► ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ బంజారాహిల్స్: ఇటీవల తాము నిర్వహించిన తనిఖీల్లో కొన్ని పాఠశాలల విద్యార్థులు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు వెల్లడైందని, అయితే తాము ఏ స్కూల్ పేరును కూడా ప్రస్తావించలేదని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ విద్యాశ్రమం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ ముఠా నుంచి సేకరించిన సమాచారం మేరకు విచారణ చేపట్టగా 1,000 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలిసిందన్నారు. అయితే పాఠశాలల పేర్లు బయటకు వెల్లడించలేదన్నారు. ఆయా స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిల్లల కదలికలపై దృష్టిసారించాలని చెప్పామన్నారు. విద్యార్థుల భవిష్యత్ పాడవకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఇంట్లో సరైన వాతావరణం లేకపోవడంతోనే పిల్లలు డ్రగ్స్ వైపు వెళ్తున్నారన్నారు. డ్రగ్స్ తీసుకుంటున్న విద్యార్థులు హైదరాబాద్లోని పాఠశాలల్లోనే ఎక్కువగా ఉన్నట్లు తమ తనిఖీల్లో తేలిందన్నారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ ఎస్.గోపాలకృష్ణన్, ప్రిన్సిపాల్ సి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
'జనశక్తి డెన్గా టీయూఎఫ్ కార్యాలయం'
హైదరాబాద్: టీయూఎఫ్ కార్యాలయం సీజ్ పై డీఐజీ అకున్ సబర్వాల్ స్పందించారు. మాచవరం పీఎస్ పరిధిలో భీంభరత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హైదరాబాద్లోని టీయూఎఫ్ కార్యాలయం నుంచి ఆయుధాలు అందుతున్నట్లు భీం భరత్ ఇచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. జనశక్తి డెన్గా టీయూఎఫ్ కార్యాలయాన్ని వాడుతున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. కూర రాజన్న, అమర్, విమలక్క కేంద్ర కమిటీ సభ్యులుగా మూడు కొత్త దళాల రిక్రూట్మెంట్ కూడా జరుగుతున్నట్టు తేలిందని అకున్ సబర్వాల్ వెల్లడించారు. తదుపరి విచారణ జరిపి మరిన్ని కేసులు నమోదు చేస్తామన్నారు. కూర రాజన్న, అమర్, విమలక్క పాత్రలపైనా విచారణ సాగుతోందని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. -
బాధ్యతాయుతంగా పనిచేయండి
– పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలుండొద్దు – డీఐజీ అకున్సబర్వాల్ మహబూబ్నగర్ క్రైం : పుష్కరాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పోలీసుశాఖ పాత్ర కీలకంగా ఉంటుందని, శాంతిభద్రతలకు, పార్కింగ్, ట్రాఫిక్సమస్య రాకుండా సమయస్ఫూర్తిగా పనిచేయాలని హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకూన్ సబర్వాల్ ఆదేశించారు. పుష్కర బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించటానికి సోమవారం ఉదయం డీఐజీ జిల్లా పోలీసు కార్యాలయంలో శాఖ అధికారులతో ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సమయానుకూల నిర్ణయాలు తీసుకోవటం, అమలు చేయటంలో విజ్ఞత కనపర్చాలన్నారు. పోలీసు బందోబస్తుపైనే పుష్కరాల నిర్వహణ ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని అందరు గుర్తుంచుకొని ప్రతిక్షణం జాగ్రత్తతో మసలుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని పుష్కరఘాట్ల వద్ద బందోబస్తు నిర్వాహణ ప్రణాళికను కంప్యూటర్ చిత్రపటాల ద్వారా వీక్షించిన డీఐజీ సంతృప్తిని వ్యక్తపరిచారు. బందోబస్తు నిర్వాహణతో పాటు, గత అనుభవాలు, ప్రాంత చరిత్రను బట్టి తీసుకుంటున్న జాగ్రత్తలను ఈ సందర్భంగా ఎస్పీ రెమా రాజేశ్వరి వివరించారు. సిబ్బందికి విధి నిర్వాహణలో తీసుకోవలసిన జాగ్రత్తలు, యాత్రికులకు సూచనలందిస్తూ ముద్రించిన పుస్తకాలు, కరపత్రాలు, తయారుచేస్తున్నామని ఆమె తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ డివి.శ్రీనివాస్రావు, ఏఎస్పీ కల్మేశ్వర్ సింగేనవర్, ఇంటెలిజెన్స్ డీఎస్పీ లావణ్య, డీఎస్పీలు చెన్నయ్య, బాలకోటి, కృష్ణమూర్తి, శ్రీనివాస్రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
కల్లుకు అండగా ‘కల్తీ’నేత!
కల్తీకల్లు మాఫియాతో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమ్మక్కు ఎక్సైజ్ దాడులను తనకు అనుకూలంగా మలచుకున్న పాలమూరు నేత మహబూబ్నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బేరాలు ‘అల్ఫ్రజోలం’ కల్లు విక్రయాలు సాగేలా చూస్తానంటూ రూ.3 కోట్లు వసూలు అదే సమయంలో దాడులపై సర్కారు వెనకడుగు.. తన ఘనతేనని ప్రచారం సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించిన సీఎం.. చర్యలకు సిద్ధం త్వరలో మళ్లీ కల్తీకల్లుపై దాడులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘కల్తీకల్లు’పై ఆబ్కారీ శాఖ జరిపిన దాడులతో తలెత్తిన పరిణామాలను అధికార పార్టీ మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యే ఒకరు తనకు అనుకూలంగా మలచుకున్నారు. అల్ఫ్రజోలంతో నకిలీ కల్లు తయారుచేసే మాఫియాకు అండగా నిలిచారు. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని కల్లు మాఫియాతో రూ.3 కోట్లకు బేరం కుదుర్చుకొని రంగంలోకి దిగారు. డీఅడిక్షన్ కేంద్రాల ఏర్పాటు వంటి జాగ్రత్తలు తీసుకోకుండా ‘మందు కల్లు’ను ఒక్కసారిగా నిలిపేయడంతో మరణాలు సంభవిస్తున్నాయంటూ సర్కారుపై ఒత్తిడి తెచ్చారు. మొత్తంగా ‘కల్తీకల్లు’పై దాడులను తాత్కాలికంగా నిలిపేసేందుకు కారణమయ్యారు. రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు మళ్లీ కల్తీకల్లు ఏరులై పారేలా కల్లు మాఫియాకు అండగా నిలిచారు. ఈ ఎమ్మెల్యే ‘కల్తీ’ వ్యవహారాన్ని ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు వెల్లడించారని సమాచారం. దీనిపై సీఎం ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం సేకరించి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారంపై సీరియస్ అయిన సీఎం కేసీఆర్.. తదుపరి చర్యలకు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ‘కల్తీకి అడ్డా.. వలసల జిల్లాగా పేరుపడిన పాలమూరు దశాబ్దాలుగా కల్తీకల్లుకు అడ్డాగా మారింది. వర్షాభావ పరిస్థితులు, సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉండడం, ఇతర భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఈ జిల్లాలో తాటి, ఈతచెట్లు తక్కువ. కల్వకుర్తి ప్రాంతంలో మినహా జిల్లాలో గుంపుగా తాటిచెట్లు కనిపించే గ్రామాలు కూడా లేవు. మహబూబ్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో తాటిచెట్లు 300కు మించవు. ఈ పరిస్థితుల్లో కల్తీకల్లు మాఫియా విజృంభించింది. జిల్లాలోని పేద కల్లు సహకార సంఘ సభ్యులను మచ్చిక చేసుకుని, వారికి నెలకు కొంత మొత్తాన్ని చెల్లిస్తూ కల్తీకల్లు విక్రయాలు జరిపింది. హైదరాబాద్లోని చిక్కడపల్లి వాసి ఒకరు ఐదేళ్ల క్రితం వరకు మహబూబ్నగర్ జిల్లాకు ‘కల్లు కింగ్’గా వ్యవహరించాడు. ఆయన 2009లో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి కేసీఆర్పైనే ఇండిపెండెంట్గా పోటీ చేయడం గమనార్హం. ఆ ఎన్నికల తరువాత ఆయన ప్రభావం తగ్గిపోయింది. అయితే 2014 ఎన్నికల తరువాత ఈ జిల్లా నుంచే గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు తన ప్రతాపం చూపడం ప్రారంభించారు. ప్రభుత్వంలో తనకున్న పరిచయాలు, శాసనమండలిలోని పెద్దల అండతో పాలమూరులో ‘కల్తీకల్లు’పై ఆధిపత్యానికి పావులు కదిపారు. గద్వాల ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని మరో నేత కల్లు దందా సాగిస్తుండడంతో... అక్కడ కూడా అధికార పార్టీ నాయకుడిని రంగంలోకి దింపారు. తన అనుయాయుడికి జిల్లాలో ముఖ్యమైన పదవిని కట్టబెట్టడంతో పాటు అక్కడ కల్తీకల్లుపై పట్టున్న ఓ ఇద్దరిని తన అదుపాజ్ఞల్లోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కల్తీ కల్లుపై సర్కారు చేపట్టిన సమరం ఆ ఎమ్మెల్యేకు మంచి అవకాశంగా మారింది. పాలమూరు జిల్లాతో పాటు నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ‘కల్తీ’ మందు అమ్మే వ్యాపారులంతా ఈ ఎమ్మెల్యేతో మంతనాలు జరిపారు. అల్ఫ్రజోలాన్ని ఒక్కసారిగా నిలిపేస్తే మరణాలు సంభవిస్తున్నాయనే నెపంతో... కొన్నేళ్ల పాటు యధాతథంగా కొనసాగించేలా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే రూ.3 కోట్లు చేతులు మారాయని సమాచారం. ఇదే సమయంలో ప్రభుత్వం కల్తీకల్లుపై వెనక్కి తగ్గింది. దీంతో ఆ ఎమ్మెల్యేకు అటు సొమ్ముతో పాటు కల్తీ మాఫియాకు పెద్దదిక్కుగా పేరొచ్చింది. ఎక్సైజ్ ఈడీ తిరిగి రాగానే..! డ్రగ్స్ కంట్రోల్ డెరైక్టర్గా ఉన్న అకున్ సబర్వాల్కు ఎక్సైజ్ ఈడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన డ్రగ్స్ కంట్రోల్కు సంబంధించి శిక్షణ కోసం విదేశాలకు వెళ్లారు. ఆయన తిరిగి రాగానే క ల్తీకల్లుపై దాడులను తిరిగి కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈలోపు జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులు, మండలాలు, మున్సిపాలిటీల్లోని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎక్సైజ్, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి కూడా. ఇక కల్తీకల్లు అడ్డాలతో పాటు ‘అల్ఫ్రజోలం’ను సరఫరా చేసే ఫార్మా కంపెనీలు, హైదరాబాద్ శివార్లలోని పరిశ్రమలపైనా దాడులు చేయనున్నట్లు సమాచారం. -
కల్లుకు అండగా ‘కల్తీ’నేత!
కల్తీకల్లు మాఫియాతో అధికార పార్టీ ఎమ్మెల్యే కుమ్మక్కు ఎక్సైజ్ దాడులను తనకు అనుకూలంగా మలచుకున్న పాలమూరు నేత మహబూబ్నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బేరాలు ‘అల్ఫ్రజోలం’ కల్లు విక్రయాలు సాగేలా చూస్తానంటూ రూ.3 కోట్లు వసూలు అదే సమయంలో దాడులపై సర్కారు వెనకడుగు.. తన ఘనతేనని ప్రచారం సీఎం దృష్టికి తీసుకువెళ్లిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించిన సీఎం.. చర్యలకు సిద్ధం త్వరలో మళ్లీ కల్తీకల్లుపై దాడులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘కల్తీకల్లు’పై ఆబ్కారీ శాఖ జరిపిన దాడులతో తలెత్తిన పరిణామాలను అధికార పార్టీ మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యే ఒకరు తనకు అనుకూలంగా మలచుకున్నారు. అల్ఫ్రజోలంతో నకిలీ కల్లు తయారుచేసే మాఫియాకు అండగా నిలిచారు. రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని కల్లు మాఫియాతో రూ.3 కోట్లకు బేరం కుదుర్చుకొని రంగంలోకి దిగారు. డీఅడిక్షన్ కేంద్రాల ఏర్పాటు వంటి జాగ్రత్తలు తీసుకోకుండా ‘మందు కల్లు’ను ఒక్కసారిగా నిలిపేయడంతో మరణాలు సంభవిస్తున్నాయంటూ సర్కారుపై ఒత్తిడి తెచ్చారు. మొత్తంగా ‘కల్తీకల్లు’పై దాడులను తాత్కాలికంగా నిలిపేసేందుకు కారణమయ్యారు. రాష్ట్రంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు మళ్లీ కల్తీకల్లు ఏరులై పారేలా కల్లు మాఫియాకు అండగా నిలిచారు. ఈ ఎమ్మెల్యే ‘కల్తీ’ వ్యవహారాన్ని ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్ అకున్ సబర్వాల్ స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు వెల్లడించారని సమాచారం. దీనిపై సీఎం ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం సేకరించి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ వ్యవహారంపై సీరియస్ అయిన సీఎం కేసీఆర్.. తదుపరి చర్యలకు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ‘కల్తీకి అడ్డా.. వలసల జిల్లాగా పేరుపడిన పాలమూరు దశాబ్దాలుగా కల్తీకల్లుకు అడ్డాగా మారింది. వర్షాభావ పరిస్థితులు, సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తులో ఉండడం, ఇతర భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఈ జిల్లాలో తాటి, ఈతచెట్లు తక్కువ. కల్వకుర్తి ప్రాంతంలో మినహా జిల్లాలో గుంపుగా తాటిచెట్లు కనిపించే గ్రామాలు కూడా లేవు. మహబూబ్నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో తాటిచెట్లు 300కు మించవు. ఈ పరిస్థితుల్లో కల్తీకల్లు మాఫియా విజృంభించింది. జిల్లాలోని పేద కల్లు సహకార సంఘ సభ్యులను మచ్చిక చేసుకుని, వారికి నెలకు కొంత మొత్తాన్ని చెల్లిస్తూ కల్తీకల్లు విక్రయాలు జరిపింది. హైదరాబాద్లోని చిక్కడపల్లి వాసి ఒకరు ఐదేళ్ల క్రితం వరకు మహబూబ్నగర్ జిల్లాకు ‘కల్లు కింగ్’గా వ్యవహరించాడు. ఆయన 2009లో మహబూబ్నగర్ లోక్సభ స్థానం నుంచి కేసీఆర్పైనే ఇండిపెండెంట్గా పోటీ చేయడం గమనార్హం. ఆ ఎన్నికల తరువాత ఆయన ప్రభావం తగ్గిపోయింది. అయితే 2014 ఎన్నికల తరువాత ఈ జిల్లా నుంచే గెలిచిన అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు తన ప్రతాపం చూపడం ప్రారంభించారు. ప్రభుత్వంలో తనకున్న పరిచయాలు, శాసనమండలిలోని పెద్దల అండతో పాలమూరులో ‘కల్తీకల్లు’పై ఆధిపత్యానికి పావులు కదిపారు. గద్వాల ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని మరో నేత కల్లు దందా సాగిస్తుండడంతో... అక్కడ కూడా అధికార పార్టీ నాయకుడిని రంగంలోకి దింపారు. తన అనుయాయుడికి జిల్లాలో ముఖ్యమైన పదవిని కట్టబెట్టడంతో పాటు అక్కడ కల్తీకల్లుపై పట్టున్న ఓ ఇద్దరిని తన అదుపాజ్ఞల్లోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కల్తీ కల్లుపై సర్కారు చేపట్టిన సమరం ఆ ఎమ్మెల్యేకు మంచి అవకాశంగా మారింది. పాలమూరు జిల్లాతో పాటు నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో ‘కల్తీ’ మందు అమ్మే వ్యాపారులంతా ఈ ఎమ్మెల్యేతో మంతనాలు జరిపారు. అల్ఫ్రజోలాన్ని ఒక్కసారిగా నిలిపేస్తే మరణాలు సంభవిస్తున్నాయనే నెపంతో... కొన్నేళ్ల పాటు యధాతథంగా కొనసాగించేలా చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే రూ.3 కోట్లు చేతులు మారాయని సమాచారం. ఇదే సమయంలో ప్రభుత్వం కల్తీకల్లుపై వెనక్కి తగ్గింది. దీంతో ఆ ఎమ్మెల్యేకు అటు సొమ్ముతో పాటు కల్తీ మాఫియాకు పెద్దదిక్కుగా పేరొచ్చింది. ఎక్సైజ్ ఈడీ తిరిగి రాగానే..! డ్రగ్స్ కంట్రోల్ డెరైక్టర్గా ఉన్న అకున్ సబర్వాల్కు ఎక్సైజ్ ఈడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన డ్రగ్స్ కంట్రోల్కు సంబంధించి శిక్షణ కోసం విదేశాలకు వెళ్లారు. ఆయన తిరిగి రాగానే క ల్తీకల్లుపై దాడులను తిరిగి కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈలోపు జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులు, మండలాలు, మున్సిపాలిటీల్లోని ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో డీఅడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎక్సైజ్, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి కూడా. ఇక కల్తీకల్లు అడ్డాలతో పాటు ‘అల్ఫ్రజోలం’ను సరఫరా చేసే ఫార్మా కంపెనీలు, హైదరాబాద్ శివార్లలోని పరిశ్రమలపైనా దాడులు చేయనున్నట్లు సమాచారం. -
కార్పొరేట్ ఆస్పత్రులపై డ్రగ్ కంట్రోల్ పంజా
హైదరాబాద్: హైదరాబాద్లోని 11 కార్పొరేట్ ఆస్పత్రుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 6 ఆస్పత్రుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు అధికారులు గుర్తించారు. వీటిపై చట్ట పరమైన చర్యలకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. రెండు ఆసుపత్రుల్లో సరైన లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాప్లను సీజ్ చేశారు. చాలా ఆస్పత్రుల్లో అధిక ధరలకు మందులు అమ్ముతున్నట్టు అధికారులు నిర్ధారించారు . రికార్డుల మెయింటెనెన్స్ లోనూ అవకతవకలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.