-
సూరజ్కు త్వరలో పటుత్వ పరీక్షలు
శివాజీనగర: లైంగిక దాడుల కేసులో గతంలో అన్న ప్రజ్వల్ రేవణ్ణకు పోలీసులు, వైద్యులు లైంగిక పటుత్వ పరీక్షలను నిర్వహించారు. ఇప్పుడు తమ్ముడు సూరజ్కు కూడా ఇవే పరీక్షలు చేయడానికి సీఐడీ ప్రత్యేక తనిఖీ బృందం సిద్దమైంది. యువకున్ని బెదిరించి అసహజ లైంగిక దాడి చేశారనే కేసులో ఈ నెల 23వ తేదీన సూరజ్ని హాసన్లో అరెస్టు చేయడం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా అతి త్వరలోనే అతనికి బౌరింగ్ ఆస్పత్రిలో పురుషత్వ పరీక్షలు చేయించే అవకాశముంది. అలాగే స్వలింగ కామం సహజమైందా అనేదానికి మరికొన్ని పరీక్షలు చేయవచ్చని పోలీసులు తెలిపారు. అన్న ప్రజ్వల్కు జరిపిన పరీక్షల కంటే కొంతవరకు భిన్నంగా ఉంటాయని తెలిసింది. సూరజ్ ప్రస్తుతం సీఐడీ కస్టడీలో ఉన్నాడు. మూడు కేసుల్లో ప్రజ్వల్కు మూడుసార్లు పరీక్షలు చేశారు. ఇదేం బాగాలేదని అతడు కోర్టులో ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు సూరజ్ ఆప్తుడు శివకుమార్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతన్ని అరెస్టు చేస్తే కేసులో మరిన్ని అంశాలు బయటకు వస్తాయంటున్నారు. -
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు అరెస్ట్
బెంగళూరు: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు జేడీ(ఎస్) ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణను లైంగిక వేధింపుల కేసులో హాసన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హాసన్ జిల్లాలోని హోలెనరసిపుర పోలీసు స్టేషన్లో జేడీఎస్ కార్యకర్త చేతన్.. సూరజ్ రేవణ్ణపై లౌంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు సూరజ్ రేవణ్ణను అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించడాన్ని ఆయన తిరస్కరించటంతో పోలీసులు సూరజ్ను బెంగళూరు తీసుకువచ్చారు. ఇవాళ ఆయనకు పొటెన్సీ పరీక్ష నిర్వహించనున్నారు.తనపై సూరజ్ రేవణ్ణ లైంగిక వేధింపలకు పాల్పడినట్లు జేడీఎస్ కార్యకర్త చేతన్, మరోవ్యక్తి హోలెనరసిపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘సూరజ్ ఫామ్ హైజ్లో జూన్ 16 తేదీన నాపై లైంగికంగా దాడి చేశాడు. బదులుగా నాకు రాజకీయంగా ఎదగటానికి సాయం చేస్తాననని బలవంతంగా లైంగిక దాడికి దిగాడు. ఈ ఘటన జరిగిన తర్వాత సూరజ్కు మెసెజ్ చేస్తే.. ‘ఏం కాదు. అంతా సర్దుకుంటుంది’అని రిప్లై ఇచ్చాడు’అని కార్యకర్త చేతన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఫిర్యాదుపై స్పందించిన సూరజ్, అతని స్నేహితుడు శివకుమార్ తమను బ్లాక్మెయిల్ చేయడానికే చేతన్, మరోవ్యక్తి అసత్య లైంగిక ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారని అన్నారు. చేతన్ అనే వ్యక్తి తమతో స్నేహంగా ఉంటూ ఉద్యోగం కావాలని కోరితే.. ఉద్యోగం కోసమనే తాను సూరజ్ను పరిచయం చేశానని శివకుమార్ తెలిపారు. -
బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
న్యూడిల్లీ: రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్కు ఇప్పటల్లో ఊరట లభించేలా కనిపించడం లేదు. బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని మెట్రోపాలిటన్ కోర్టు మరోసారి పొడిగించింది. జులై 6 వరకు కస్టడీ పొడిగిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బిభవ్ కుమార్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు.కాగా లోక్సభ ఎన్నికలకు ముందు మే 13న న్యూఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మే 16న కేసు నమోదు చేయగా.. మే 18న కుమార్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ కోర్టు అదే రోజు ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. ఆయన అరెస్టు కారణంగా ముందస్తు బెయిల్ పిటిషన్లో అర్థం లేదని కోర్టు పేర్కొంది. మే 24న అతడిని నాలుగు రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, మళ్లీ మూడు రోజుల పోలీసు కస్టడీకి పంపారు.తరువాత జూన్ 1న14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అనంతరం జూన్ 22న వరకు కస్టడీ పొడిగించగా.. తాజాగా కస్టడీ గడువు ముగియడంతో జులై 6 వరకు పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక జూన్ 13 న కుమార్ మరొక బెయిల్ పిటిషన్ వేయగా, దానిని కోర్టు కొట్టివేసింది. బిభవ్ కుమార్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. -
స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్పై దాడి కేసులో ప్రధాననిందితుడైన బిభవ్కుమార్కు కోర్టు 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు బిభవ్కుమార్ను రిమాండ్కు తరలించారు. ఇటీవల తమ పార్టీ అధినేత కేజ్రీవాల్ను కలిసేందుకు సీఎం నివాసానికి వెళ్లినపుడు తనపై దాడి జరిగిందని స్వాతిమలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కుమార్ తనను కింద పడేసి తన్నారని ఫిర్యాదులో తెలిపారు. ఢిల్లీలో లోక్సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ మలివాల్పై దాడి ఘటనపై రాజకీయ దుమారం పెద్దదవుతూనే ఉంది. -
కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్పై దాడి కేసులో అరవింద్ కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్ కుమార్ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సోమవారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన తనపై విభవ్ దాడికి పాల్పడ్డాడని స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.ఢిల్లీ సీఎం నివాసం నుంచే అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నేరుగా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్కు ఇంటరాగేషన్ కోసం తరలించారు. అంతకు ముందు సీఎం కేజ్రీవాల్ నివాసంలో సీన్ రీ కన్స్ట్రక్షన్ నిర్వహించారు పోలీసులు. అయితే.. ఈ కేసులో పూర్తిగా సహకరిస్తామని అధికారులకు తాము మెయిల్ పంపించామని, అయినా కూడా పోలీసుల నుంచి బదులేం లేదని విభవ్ లాయర్ మీడియాకు వెల్లడించారు. -
కేజ్రీవాల్ నివాసానికి స్వాతి మలీవాల్.. సీన్ రీ కన్స్ట్రక్షన్?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ రూంలో సీఎం కోసం ఆప్ ఎంపీ ఎదురుచూస్తుండగా.. బిభవ్ కుమార్ అక్కడికి వెళ్లి, ఆమెతో అమర్యాదగా ప్రవర్తించి, దాడి చేసినట్లు స్వాతి మలీవాల్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బిభవ్ కుమార్ను నిందితుడిగా చేర్చి దర్యాప్తు జరుపుతున్నారు.దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు మలీవాల్ను ఆమెపై దాడి జరిగిన సీఎం కేజ్రీవాల్ నివాసానికి శుక్రవారం సాయంత్రం తీసుకెళ్లారు. మే 13న జరిగిన క్రైం సీన్ను రీక్రియెట్ చేయడానికి సంఘటన స్థలానికి తీసుకెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.ఆప్ ఎంపీని కేజ్రీవాల్ ఇంటికి తీసుకెళ్లే ముందు అయిదుగురు ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి ఢిల్లీ పోలీసు బృందం సంఘటనా స్థలానికి వెళ్లింది. అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) అంజిత చెప్యాల నాయకత్వంలో నలుగురు సభ్యులు అక్కడికి చేరుకున్నారు. సీఎం ఇంటి నుంచి పలు ఆధారాలను సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేశారు. అనంతరం ఫోరెన్సిక్ బృందం కేజ్రీవాల్ నివాసం నుంచి తిరిగి వెళ్లిపోయింది.#WATCH | AAP MP Swati Maliwal arrives at Delhi CM Arvind Kejriwal's residence as police is expected to recreate what happened with her here on 13th May pic.twitter.com/bM7w8kygO3— ANI (@ANI) May 17, 2024 కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను సోమవారం ఆయన నివాసంలో కలిసేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారని స్వాతి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీన్ని ఆప్ కూడా ధ్రువీకరించి, బిభవ్పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.చదవండి: ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలుదాడి ఆరోపణల నేపథ్యంలో మలీవాల్కు నేడు ఢిల్లీలోని ఎయిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ముఖంపై అంతర్గత గాయాలు అయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు దాడికి ముందు కేజ్రీవాల్ నివాసంలో మలీవాల్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగింది. ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళ్లతానని వారితో అన్నది. అలాగే తనను తాకితే ఉద్యోగం పోతుందంటూ అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె బెదిరించినట్లు వీడియోలో కనిపిస్తోంది.Analysing the #SwatiMaliwal case through this video:If this video was recorded before the alleged assault, there's no way she could have been assaulted the way she has written in the FIR after this, in presence of so many security staff including a female staff. If this video… pic.twitter.com/RNnmzYkC04— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 17, 2024దీనిపై తాజాగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ప్రతిసారిలాగే.. ఈసారి కూడా ఈ రాజకీయ హిట్మ్యాన్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడని విమర్శించారు. అసలు విషయం లేకుండా పోస్టులు, వీడియోలను ప్రచారం చేయడం ద్వారా.. ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారని మండిపడ్డారు. ఒకరిని కొడుతున్న వీడియో ఎవరు తీస్తారు..? ఆ ఇంటి సీసీటీవీ దృశ్యాలను తనిఖీ చేస్తే.. నిజం వెలుగులోకి వస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ఆప్ అధినేత ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించలేదు. దీంతో కేజ్రీవాల్ మౌనంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.#WATCH | AAP MP Swati Maliwal leaves from Delhi CM Arvind Kejriwal's residence after recreation of May 13 incident by Police pic.twitter.com/8n3K6sAbZ5— ANI (@ANI) May 17, 2024 -
Banjara Hills: యువతిపై లైంగిక దాడి.. ఫుడ్ డెలివరీ బాయ్ అరెస్ట్
హైదరాబాద్: మాట్లాడే పని ఉందని చెప్పి హోటల్కు పిలిచి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఫుడ్ డెలివరీ బాయ్ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్లేపల్లికి చెందిన ఒబేదుల్లాఖాన్ (23) ఫుడ్ డెలివరీ బాయ్. ఎనిమిది నెలల క్రితం లక్డీకాపూల్లో ఓ సెమినార్కు హాజరైన ప్రైవేటు ఉద్యోగిని (22) ఫుడ్ ఆర్డర్ చేయడంతో ఒబేదుల్లా ఆమెకు అందజేశాడు. ఆమె డబ్బులను గూగుల్ పే చేయడంతో ఆ నంబర్ తీసుకున్న ఒబేదుల్లా ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. కేపీహెచ్బీ కాలనీలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉండే సదరు యువతి ఒబేదుల్లాకు సన్నిహితమైంది. ఇదే అదనుగా భావించినన ఒబేదుల్లా గురువారం రాత్రి మాట్లాడే పని ఉందని ఆమెను తన బైక్పై తీసుకుని బంజారాహిల్స్లోని ఓయో రూమ్కు వచ్చాడు. రాత్రి ఒంటి గంట తర్వాత ఆమె నిద్ర మత్తులో ఉండగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376, 354, 354 (ఏ), డి, 376, 66 (ఇ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. -
షాజహాన్ షేక్ ఇంట్లో సీబీఐ సోదాలు
కోల్కతా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో బహిష్కృత టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు శుక్రవారం సోదాలు జరిపారు. దాడికి సంబంధించిన ఆధారాల కోసం ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్ఖాలిలోని షాజహాన్ షేక్ నివాసం సమీప ప్రాంతాలను కూడా పరిశీలించారు. రేషన్ పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా జనవరి 5వ తేదీన షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలకు వెళ్లిన 14 మంది అధికారుల బృందంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సీబీకి చెందిన ఆరుగురు, సెంట్రల్ ఫోరెన్సిక్ నిపుణులు ఆరుగురు, ఈడీ అధికారులు ఇద్దరు గాయపడ్డారు. ఘటనతో సంబంధముందన్న ఆరోపణలపై టీఎంసీ నుంచి షాజహాన్ షేక్ సస్పెండయ్యాడు. హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో గురువారం షాజహాన్ షేక్ను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు, సందేశ్ఖాలిలోని అతడి నివాసం, కార్యాలయాలకు సీల్ వేశారు. -
పనిమనిషిపై అత్యాచారం కేసులో మురళీ ముకుంద్ అరెస్ట్
బంజారాహిల్స్: హైదరాబాద్లో పేరొందిన ఒక స్కూలుకు ఒకప్పుడు చైర్మన్గా పనిచేసిన ఒక విద్యాధికుడు అత్యంత హీనమైన చర్యకు పాల్పడ్డాడు. తన ఇంటిలో పనిచేసే యువతిని బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక స్కూలుకు మార్గదర్శకునిగా వ్యవహరించిన ఆ వ్యక్తి ఇటువంటి దుర్మార్గానికి పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12, మిథులానగర్లో నివాసముంటున్న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ తన ఇంట్లో పని చేసే యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచారు. బాధితురాలు ఈ నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దరిమిలా పోలీసులు మురళీ ముకుంద్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మురళీ ముకుంద్కు 14 రోజుల పాటు జ్యుడీషీయల్ రిమాండ్ను విధించారు.ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, పరారీలో ఉన్న కుమారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
లైంగిక దాడి కేసులో టీడీపీ కార్యకర్త అరెస్టు
చిత్తూరు: మహిళపై లైంగిక దాడి కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు కల్లూరు సీఐ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. సీఐ కథనం మేరకు.. సదుం మండలం బ్రాహ్మణవీధికి చెందిన ముస్లిం మహిళ (39) ఆదివారం సాయంత్రం సదుం నుంచి రొంపిచెర్లకు వచ్చి, తిరిగి రాత్రి 7 గంటల స మయంలో ఆటోలో పీలేరుకు బయలుదేరింది. పెద్దగొట్టిగల్లు పంచాయతీ బోనంవారిపల్లెకు చెందిన డ్రైవర్ గుర్రప్ప(45) (టీడీపీ కార్యకర్త) ఆటో లో మహిళ ఒక్కటే ఉందని, బండకిందపల్లె–బోనంవారిపల్లెకు మధ్యలో ఉన్న చెరువులోకి ఆటోను వేగంగా తీసుకుని వెళ్లి లైంగిక దాడి చేశాడు. ఈమేరకు ఆరోజు రాత్రే బాధితురాలు పోలీసులకు ఫిర్యా దు చేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం నిందితుడు గుర్రప్ప బండకిందపల్లె సమీపంలో ఉండగా పోలీసులు అరెస్టు చేసి, ఆటోను సీజ్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా, జడ్జి రిమాండ్కు అదేశించినట్లు సీఐ తెలిపారు. -
ప్రయాణికురాలిపై క్యాబ్ డ్రైవర్ దాడి
కృష్ణరాజపురం: బెంగళూరులో ఉబర్ డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు, ప్రయాణికురాలపై దాడి చేసిన ఘటన నగరంలోని బెళ్లండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోగనహళ్లిలో చోటు చేసుకుంది. బాధిత మహిళ తన కుమారున్ని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి క్యాబ్ బుక్ చేసుకుంది. అంతలోనే కుమారుడు మరో క్యాబ్ను బుక్ చేశాడు. ముందు వచ్చిన క్యాబ్లోకి ఎక్కారు, అయితే కుమారుడు ఇది మనం బుక్ చేసిన క్యాబ్ కాదని చెప్పాడు. క్యాబ్ డ్రైవర్ వారిని దించి ఆమెతో గొడవ పడ్డాడు. ఆమైపె చేయి చేసుకోవడంతో సమీపంలోని అపార్టుమెంట్ వాసులు వచ్చి కాపాడారు. ఇంతలో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
చౌదరి ఎక్కడ..?
ఒంగోలు టౌన్: గిరిజన యువకుడు మోటా నవీన్పై అత్యంత క్రూరంగా దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు మన్నెం రామాంజనేయులు చౌదరి ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు ఉండగా వారిలో ఆరుగురికి ఇప్పటికే పోలీసులు సంకెళ్లు వేశారు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దురాగతంలో కీలక పాత్ర పోషించిన రామాంజనేయులు చౌదరి మాత్రం తప్పించుకొని తిరుగుతున్నాడు. అతడి కోసం రెండు ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. హైదరాబాద్, గుంటూరు తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నా ఆచూకీ లభించక పోవడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గత నెల 19న నవీన్పై దాడి చేసిన తర్వాత చౌదరి నగరంలోని శివారు ప్రాంతంలో ఓ చర్చి వెనక ఉన్నట్లు సమాచారం. అవివాహితుడైన చౌదరి వెంట ఓ మహిళ, పదేళ్ల పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి చేసిన తర్వాత నవీన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తన మీద కేసు పెడితే చంపేస్తానని, తనకు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయని బెదిరించినట్లు స్థానికంగా చెప్పుకుంటున్నారు. గతేడాది కూడా నవీన్పై దాడి చేసి తల పగులగొట్టాడని బాధితుడు పోలీసులు, ఎస్టీ కమీషన్ సభ్యుడు వడితే శంకర్ నాయక్ ఎదుట చెప్పాడు. అప్పుడు కూడా చౌదరి రాజకీయ, సామాజిక అండ చూసి భయపడిన నవీన్ కేసు పెట్టలేదని తెలుస్తోంది. తాజాగా గత నెల దాడి జరిగినప్పుడు కూడా నవీన్ పోలీసులకు అసలు ఏం జరిగిందన్నది చెప్పక పోవడాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా చికిత్స పూర్తి కాకుండానే రిమ్స్ నుంచి వెళ్లిపోయాడు. ఇది మామూలు దాడిగానే పోలీసులు భావించారు. వీడియో బయట పడిన తర్వాత కానీ అసలు నిజం వెల్లడి కాలేదు. ఒంగోలు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడితో సన్నిహిత సంబంధాలు కలిగిన రామాంజనేయ చౌదరి అతడి సూచనలు, సలహాల మేరకే ఘటన జరిగిన నెల రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చేలా చేసినట్లు తెలుస్తోంది. సదరు నాయకుడి సంరక్షణలోనే తలదాచుకున్న రామాంజనేయులు చౌదరి.. పోలీసులకు చిక్కకుండా వారిని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడని నగరంలో ప్రచారం జరుగుతోంది. -
మత్తు మాత్రలు ఇచ్చి హిజ్రాపై లైంగిక దాడి
తమిళనాడు: మత్తుమాత్రులు మింగించి హిజ్రాపై లైంగిక దాడి చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పెరంబూరు ప్రాంతానికి చెందిన జన్నీ, బ్లసికా హిజ్రాలు. వీరిద్దరూ సోమవారం రాత్రి మధురవాయిల్ పూందమల్లి హైవే రోడ్లు జీసస్ కాల్స్ వద్ద నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఆటోలో వచ్చిన మద్యం మత్తులో వున్న ఇద్దరు బ్లసికాతో మాటలు కలిపారు. తర్వాత హఠాత్తుగా కత్తిని చూపెట్టి బ్లసికాను ఆటోలు బలవంతంగా తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇది చూసి జన్నీ వెంటనే మధురవాయిలు పోలీసులకు సమాచారం అందించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఇన్స్పెక్టర్ సుబ్రమని సెల్ఫోన్ నంబర్ ఆధారంగా సెట్టియార్ అగరం ప్రాంతంలో వున్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి మద్యం మత్తులో ఉన్న ఆవడికి చెందిన జగన్, రామాపురానికి చెందిన దినేష్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి బ్లసికాను విడిపించారు. ఆ సమయంలో మత్తు మధ్యలో యువకులు సబ్ ఇన్స్పెక్టర్ మహారాజాపై దాడి చేసి తప్పించుకుని పోవడానికి ప్రయతి్నంచారు. పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. బ్లసికాను చికిత్స కోసం కీల్పాక్కం ఆస్పత్రికి తరలించారు. -
నటిపై దాడి.. ఆ విషయమై గొడవ జరగడంతో!
ఎంతపెద్ద సెలబ్రిటీ అయినాసరే కొన్నిసార్లు కష్టాలు తప్పవు. తాజాగా ఓ సీనియర్ నటికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఓ విషయమై క్లారిటీ తెచ్చుకునేందుకు సొంతూరికి వెళ్లగా.. పలువురు ఈమెపై దాడి చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. దీంతో సదరు నటిని ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈమె.. అసలేం జరిగింది? ఎందుకు కొట్టారనే విషయాన్ని బయటపెట్టింది. (ఇదీ చదవండి: ప్రేమలో ప్రతిసారీ నేనే మోసపోయాను: యంగ్ హీరోయిన్) నటి అనుగౌడ.. కన్నడలో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కర్ణాటకలోని షిమోగా జిల్లాలోని హోస్ నగర్ ఈమె సొంతూరు. అయితే సాగర్ తాలుకాలోని కస్పాడిలో ఈమెకి భూమి ఉంది. అనుగౌడ తల్లిదండ్రులు అందులో వ్యవసాయం చేసేవారు. దీంతో బెంగళూరు నుంచి తరుచూ ఇక్కడి వచ్చి వెళ్తుండేది. మరోవైపు ఇదే భూమిపై వివాదం నడుస్తూ ఉండేది. ఈ ల్యాండ్ తమదంటూ అనుతో కొందరు గొడవపడేవారు. రీసెంట్ గా అను గౌడ.. కస్పాడి వెళ్లగా, ఈసారి గొడవ పడటం పక్కనబెట్టి ఏకంగా ఈమెపై దాడి చేశారు. స్థానికులైన నీలమ్మ, మోహన్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దీంతో సదరు నటి తలకు తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన ఈమెని ఆస్పత్రిలో చేర్పించారు. అనుగౌడ గతంలో సుదీప్ 'కెంపెగౌడ', విష్ణువర్ధన్ 'స్కూల్ మాస్టర్', శివరాజ్ కుమార్ 'సుగ్రీవ', పునీత్ రాజ్ కుమార్ 'బాయ్స్' సినిమాల్లో నటించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో షారుక్ ఖాన్కి యాక్సిడెంట్!) -
19 ఏళ్ల యువతి వాహనం కోసం ఎదురుచూస్తుండగా... బలవంతంగా లాక్కెళ్లి
అనకాపల్లి : మండలంలోని నరసింగబిల్లి వద్ద 19 ఏళ్ల యువతి లైంగిక దాడికి గురైంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగు చూసింది. మంగళవారం నిందితుడిని పట్టుకుని కోర్టుకు తరలించారు. అనకాపల్లి రూరల్ సీఐ ఎ.రవికుమార్ విలేకరులకు అందించిన వివరాలు. మండలంలోని నరసింగబిల్లి వద్ద తమ గ్రామానికి వెళ్లేందుకు 19 ఏళ్ల యువతి వాహనం కోసం ఎదురుచూస్తుండగా, సోమవరం గ్రామానికి చెందిన కరణం వెంకట నాగేంద్రబాబు(23) సోమవారం సాయంత్రం బైక్పై ఆమె వద్దకు వెళ్లి ఆగి మాట్లాడాడు. ఆమె తనతో రావడానికి నిరాకరించడంతో బలవంతంగా బైక్ ఎక్కించుకొని నరసింగబిల్లి రైల్వే గేటు వద్దకు బయల్దేరి, అక్కడి నుంచి పక్క మార్గంలో తీసుకెళ్లాడు. అక్కడ రైల్వే అండర్ పాసు వద్ద బైక్ నిలిపి ఆమెను లోపలికి బలవంతంగా లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ ఎ.ఆదినారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. మంగళవారం దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సోమవరంలో తన ఇంటి వద్దనున్న నిందితుడు నాగేంద్రబాబును అరెస్ట్ చేశారు. నిందితుడ్ని అనకాపల్లి కోర్టులో జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం హాజరు పరచినట్లు తెలిపారు. -
ఫీజు కోసం బతిమిలాడితే.. హోటల్కు తీసుకెళ్లి..
తమిళనాడు: నీలగిరి జిల్లాకు చెందిన విద్యార్థినిని (21)ని స్నేహితులు బంధించి మూడు రోజులు లైంగిక దాడి చేశారు. కోయంబత్తూరులోని ఓ కళాశాలలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థినికి శరవణం పట్టి ప్రాంతానికి చెందిన రవీంద్రన్ (24), జర్మన్ రాజేష్ (25)తో పరిచయం ఏర్పడింది. రవీంద్రన్ రెండేళ్లుగా కాలేజీకి వెళ్లకుండా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. జర్మన్ రాజేష్ కూలీ పనిచేస్తున్నాడు. విద్యార్థినికి కళాశాల ఫీజు చెల్లించాల్సిన అవసరం వచ్చింది. ఆమె రవీంద్రన్ వద్దకు వెళ్లి నగదు సాయం చేయాలని కోరింది. అతను రెండు రోజుల క్రితమే డబ్బులు సిద్ధం చేశానని, శరవణంపట్టిలోని రెస్టారెంట్ వద్దకు వచ్చి తీసుకెళ్లాలని చెప్పాడు. అక్కడికి వెళ్లిన ఆమెను రవీంద్రన్ హోటల్లోని గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలో జర్మన్ రాజేష్ ఉన్నాడు. ఇద్దరూ తలుపులు వేసి విద్యార్థినిని బెదిరించి లైంగిక దాడి చేశారు. అనంతరం గదిలో బంధించారు. 3 రోజులు లైంగిక దాడి చేశారు. ఈ విషయాలను ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించి పంపించారు. ఆమె శనివారం కోయంబత్తూరు ఈస్ట్ ఆల్ ఉమెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి రవీంద్రన్, జర్మన్ రాజేష్ను అరెస్టు చేశారు. -
ఇంజనీరింగ్ విద్యార్థిని బంధించి.. బలాత్కరించి.. చంపబోయాడు
ఏలూరు టౌన్:ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో ఇంజనీరింగ్ విద్యార్థినిని నిర్బంధించి.. ఆమె వంటిపై వేడి నూనె పోసి గాయపర్చి.. ఆపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఎస్పీ డీ.మేరీప్రశాంతి ఆదేశాలతో 24 గంటల్లోనే నిందితుణ్ణి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బాధితురాలికి సత్వర న్యాయం అందించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సోమవారం సాయంత్రం స్థానిక త్రీటౌన్ స్టేషన్లో ఏలూరు దిశ డీఎస్పీ కేవీ సత్యనారాయణ మీడియాతో ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 12 రోజులు నిర్బంధించి లైంగిక దాడి దుగ్గిరాల గ్రామానికి చెందిన బాధితురాలు కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. నిందితుడు సదర్ల అనుదీప్ అదే గ్రా మానికి చెందిన వ్యక్తి. ఇద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 5న అనుదీప్ కాకినాడ వెళ్లి బాధితురాలిని కలుసుకున్నాడు. ఇద్దరూ చెన్నై వెళ్లి వేలంగిణి మాత చర్చికి వెళ్లారు. నిందితుడు అనుదీప్ తాను వేసుకున్న క్రీస్తు మాలను ఈస్టర్ రోజున తీశాడు. కాగా, బాధితురాలిని 10వ తేదీ రాత్రి ఏలూరులోని దుగ్గిరాల జోసఫ్ నగర్లో గల నాన్నమ్మ ఇంటికి తీసుకువెళ్లాడు. అదేరోజు రాత్రి తన కోరిక తీర్చాలని బాధితురాలిపై ఒత్తిడి చేయగా ఆమె ఒప్పుకోలేదు. మరుసటి రోజు మరోసారి కోరిక తీర్చాలంటూ బలవంతం చేసేందుకు ప్రయత్నించగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన అనుదీప్ వేడిగా మరిగించిన నూనెను ఆమె వంటిపై పోయటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత 12 రోజుల పాటు ఆమెను ఇంట్లోనే బంధించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు చంపేందుకు ప్రయత్నించటంతో బాధితురాలు అతని నుంచి తప్పించుకుని అతని ఫోన్ లాక్కొని తండ్రికి ఫోన్ చేయగా.. వారు వచ్చి ఆమెను ఏలూరు ప్రభుత్వ బోధనాస్పత్రిలో చేర్పించారు. నిందితుడిపై హిస్టరీ షీట్ బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా అనుదీప్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని దిశ డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. సోమవారం నిందితుడు అనుదీప్ను ఏలూరు కొత్త బస్టాండ్ సమీ పంలో అరెస్ట్ చేశామని చెప్పారు. నేరం జరిగిన ప్రాంతంలో దర్యాప్తు చేయటంతో పాటు, ఆధారాలను సేకరించి ల్యాబ్కు పంపామని తెలిపారు. బాధితురాలికి సత్వర న్యాయం చేసే దిశగా త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఎస్పీ మేరీప్రశాంతి ఆదేశాల మేరకు నిందితుడు అనుదీప్ పై హిస్టరీ షీట్ తెరుస్తున్నట్టు చెప్పారు. మహిళలపై నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవని, మైనర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, లైంగిక దాడులకు పాల్ప డినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చిక్కుల్లో నటుడు దిలీప్.. హైకోర్టు షాక్
మలయాళ స్టార్ నటుడు దిలీప్కు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. తనకు వ్యతిరేకంగా దాఖలైన హత్య కుట్ర కేసును కొట్టేయాలంటూ దిలీప్ దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్ను మంగళవారం కొట్టేసింది. మలయాళ ప్రముఖ నటి లైంగిక వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్ తాజా అభ్యర్థనను హైకోర్టు జస్టిస్ జియాద్ రెహమాన్ తోసిపుచ్చారు. ఈ కేసులో విచారణ జరిపిన ఓ అధికారి ఫిర్యాదు మేరకు.. క్రైమ్ బ్రాంచ్ ఈ ఏడాది జనవరి 9వ తేదీన మరో కేసు నమోదు చేసింది. విచారణ అధికారులను హత్య చేయాలని దిలీప్ కుట్ర పన్నాడంటూ అందులో అభియోగం నమోదు చేశారు. హత్య చేయాలనే.. దిలీప్ గొంతుగా భావిస్తున్న ఆడియో క్లిప్ ఒకటి ఆ మధ్య ఓ టీవీ ఛానెల్లో టెలికాస్ట్ అయ్యింది. దానిని ఆయన సన్నిహితుడు బాలచంద్ర కుమార్ బయటపెట్టడం విశేషం. అందులో ఈ కేసులో విచారణ చేపట్టిన అధికారులకు హాని తలపెట్టాలన్న ఆలోచనతో దిలీప్ ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో క్రైమ్ బ్రాంచ్ హత్య కుట్ర నేరం మీద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. దిలీప్ మాజీ భార్య, నటి మంజు వారియర్ను సైతం క్రైమ్ బ్రాంచ్ వాయిస్ కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించింది. ఆ ఫోన్ సంభాషణల్లో దిలీప్తో పాటు దిలీప్ కుటుంబ సభ్యులకు చెందిన మరో ఇద్దరి గొంతులను మంజు గుర్తుపట్టింది. ఈ తరుణంలో ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. హత్య కుట్ర కేసు కొట్టేయాలంటూ దిలీప్ దాఖలు చేసిన అభ్యర్థనను కొట్టేసింది. మరోవైపు దిలీప్ బెయిల్ రద్దు చేయాలని, దిలీప్ బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కేరళ క్రైమ్ బ్రాంచ్, కేరళ పోలీసులు కోర్టును కోరుతున్నారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. 2017 కేరళ నటి దాడి కేసు 2017, ఫిబ్రవరి 17వ తేదీ రాత్రిపూట మలయాళంతో పాటు సౌత్లోని పలు భాషల్లో నటించిన ఓ హీరోయిన్ను బలవంతంగా ఎత్తుకెళ్లి, కారులోనే రెండు గంటలపాటు వేధింపులకు పాల్పడ్డారు కొందరు దుండగులు. ఆపై ఆ వేధింపుల పర్వాన్ని ఫోన్లలో రికార్డు చేసి.. బ్లాక్మెయిల్కు పాల్పడాలని చూశారు. ఈ కేసులో దిలీప్తో పాటు పది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆపై బెయిల్పై విడుదల చేశారు. -
కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసు : 5ఏళ్ల తర్వాత స్పందించిన హీరోయిన్
Actress Bhavana Menon Opens Up On Assalut Case After 5 Years: ప్రముఖ హీరోయిన్ భావనపై లైంగిక వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నమలయాళ సూపర్స్టార్ దిలీప్ కుమార్పై కేరళ పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 2017 ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్ భావనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్ కుమార్ బెయిల్పై విడుదలయ్యాడు. తాజాగా దిలీప్, అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు. తాజాగా ఈ ఘటనపై హీరోయిన్ భావన స్పందించింది. తనకు జరిగిన చేదు సంఘటనను గుర్తు చేసుకొని సోషల్ మీడియాలో సుధీర్ఘ పోస్టును షేర్ చేసింది. 'బాధితురాలి నుంచి ప్రాణాలతో బయటపడే వరకు ఈ ప్రయాణం అంత సులువైనది కాదు. గత ఐదేళ్లుగా నాపై జరిగిన దాడి, నా పేరు, నా గుర్తింపు అణచివేయబడ్డాయి. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానించడానికి, మౌనంగా ఉంచడానికి, ఒంటరిగా ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానా అలాంటి సమయంలో కూడా నా గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను చాలా మంది గొంతులు వింటున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ ప్రయత్నంలో నేను ఒంటరిని కాదని నాకు తెలుసు. న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్షపడేలా చూడాలని, మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను నా ప్రయాణం కొనసాగిస్తాను. నాకు మద్ధతుగా నిలిబడిన వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ భావోద్వేగంతో రాసుకొచ్చింది. కాగా హీరోయిన్ భావన తెలుగులో ఒంటరి, మహాత్మ, నిప్పు వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Bhavana Menon 🧚🏻♀️ (@bhavzmenon) -
2 వారాల్లో పెళ్లి కావాల్సిన యువతిపై లైంగిక దాడి.. ఫొటోలు తీసి పెళ్లికొడుకు వాట్సాప్కు
మహబూబ్నగర్ క్రైం: రెండు వారాల్లో పెళ్లి కాబోతున్న యువతిపై ఇద్దరు లైంగిక దాడి చేయడమేగాక.. ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి సదరు పెళ్లికొడుకుకి పంపారు. ఈ నెల 5న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం కోత్లాబాద్కి చెందిన ఓ అమ్మాయి(20) ప్రతిరోజూ మహబూబ్నగర్కు వచ్చి దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే మల్కాపూర్కి చెందిన రాజేందర్రెడ్డి అలియాస్ రాజు కొత్లాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చదవండి: (దిగొచ్చిన చికెన్ ధర.. లొట్టలేస్తున్న మాంసం ప్రియులు) ప్రస్తుతం ఆమె తల్లిగారి ఇంటి వద్ద ఉండటంతో రాజు కూడా ప్రతిరోజూ కొత్లాబాద్ నుంచి బైక్పై మహబూబ్నగర్కు వచ్చి పెయింటింగ్ పని చేసేవాడు. ఈ క్రమంలో దినసరి కూలీగా పని చేసే అమ్మాయిని రాజు చాలాసార్లు బైక్పై ఎక్కించుకుని రావడంతో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈనెల 5న ఆ అమ్మాయి పని కోసం జిల్లాకేంద్రంలోని టీడీగుట్ట గేటు దగ్గరకు వచ్చింది. ఆరోజు పని దొరకకపోవడంతో రాజు అతని స్నేహితుడు, ఆంజనేయులు కలిసి ఆమె వద్దకు వెళ్లారు. చదవండి: (ఆ ప్రేమికుల్ని బలవంతంగా బంధించి.. పూలు చల్లి, పెళ్లి చేసి.. యువతి శరీరంపై..) వేరే చోట పని ఇప్పిస్తామని చెప్పి బైక్పై ఎక్కించుకుని ఫతేపూర్ అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ ఆమెకు బలవంతంగా మద్యం తాగించి, లైంగిక దాడికి పాల్పడ్డారు. రాజు అత్యాచారం చేసేటప్పుడు ఆంజనేయులు ఫొటోలు, వీడియోలు తీశాడు. విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు. కాగా, ఈ నెల 18న ఆ అమ్మాయికి పెళ్లి జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లైంగిక దాడి ఫొటోలు, వీడియోలను సదరు పెళ్లికొడుకు వాట్సాప్కు పంపారు. చదవండి: (సెంట్రల్ జైలులో ఉంచినా.. నమ్మిన జెండా వీడలేదు.. సమర్థతను గుర్తించి) ఆ ఫొటోలను పెళ్లికొడుకు అమ్మాయి తల్లిదండ్రులకు చూపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై 2 రోజుల క్రితం అమ్మాయి, తల్లిదండ్రులు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసి శుక్రవారం రాజు, ఆంజనేయులును అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు వన్టౌన్ సీఐ రాజేశ్వర్గౌడ్ తెలిపారు. -
కరోనాపై గెలిచినా కామాంధులకు బలైన మహిళ
డిస్పూర్: మాయదారి కరోనా వైరస్ను జయించింది. కానీ కామాంధులకు బలయ్యింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు ఆమెను వెంబడించి తేయాకు తోటలో అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా ఆ ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దుండగుల బారి నుంచి ఆమె కుమార్తె తప్పించుకుంది. ఈ ఘటన అసోంలో హాట్ టాపిక్గా మారింది. చారడియో జిల్లాకు తల్లి (54)తో పాటు కూతురి (17)కి కూడా కరోనా సోకింది. సపేకాతి మోడల్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కరోనా నుంచి కోలుకోవడంతో మే 29వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. అయితే వారు అంబులెన్స్ పెట్టుకోలేని పేదవారు. దీంతో తేయాకు తోటల మీదుగా తల్లీకూతురు ఇంటికి వెళ్తుండగా చీకటి పడింది. 30 కిలోమీటర్ల దూరంలోని తమ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో బొర్హట్ టీ ఎస్టేట్ సమీపంలో ఇద్దరు దుండగులు వచ్చారు. తల్లికూతురిని వెంబడించారు. యుక్త వయసు ఉన్న కూతురు వారి నుంచి తప్పించుకుంది. కరోనా నుంచి కోలుకోవడంతో నీరసంగా ఉండడంతో ఆ తల్లి వారికి చిక్కింది. వారు ఆమెను తేయాకు తోటల సమీపంలో అత్యాచారానికి ఒడిగట్టారు. (చదవండి: ప్రేయసి ముందు అనుమానం గెలిచి.. స్నేహం ఓడింది) అయితే పరుగెత్తుకుంటూ వెళ్లిన కుమార్తె సమీప గ్రామస్తులకు విషయం తెలిపింది. దీంతో ఆ గ్రామస్తులు తల్లి కోసం గాలించారు అయితే దుండగులు అఘాయిత్యానికి పాల్పడడంతో ఆమె ఓ పొదల చాటున నిస్సహాయంగా పడింది. వెంటనే గ్రామస్తులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అంబులెన్స్ఏర్పాటు చేయకపోవడంతోనే ఆమెపై అఘాయిత్యం జరిగిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన వైద్యారోగ్య శాఖ మంత్రి కేశబ్ మహంత ‘నెగటివ్ వచ్చిన వారిని ఆస్పత్రి నుంచి ఇంటి వద్ద చేర్చేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం’ అని ప్రకటించారు. -
చట్టీ ఘటనను ఖండించిన వాసిరెడ్డి పద్మ
-
ఇద్దరు భార్యలపై శాడిస్టు భర్త హత్యాయత్నం.. సెల్ఫీ తీసి!
సాక్షి, తూర్పుగోదావరి : భార్యలపై అనుమానంతో శాడిస్టు భర్త వారిని అంతమొందించేందుకు అమానుషంగా ప్రవర్తించాడు. మొదటి భార్యను ముక్కు, చెవులు కోసి హతమార్చాలని ప్రయత్నించగా, రెండో భార్యపై ఏకంగా పెట్రోల్ పోసి నిప్పటించాడు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టిలో ఈ దారుణం వెలుగుచూసింది. చింతూరు ఎస్ఐ సురేష్ బాబు కథనం ప్రకారం.. చట్టిలో నివసముంటున్న కళ్యాణం వెంకన్నకు ఇద్దరు బార్యలు. వారిద్దరికిపై అనుమానం పెంచుకున్న అతను వారిని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈనెల 3న రెండో భార్యను గ్రామంలోని దేవతా విగ్రహం వద్దకు తీసుకువెళ్లి వేడి నూనెలో చేతిని ముంచి ప్రయాణం చేయించాడు. ఈ నెల 5న మొదటి భార్యను ఇంట్లోనే చిత్రహింసలకు గురిచేసి, ముక్కు, చెవులు కోసేందుకు యత్నించాడు. ఈ దాడి నుంచి తప్పించుకున్న మహిళ తన పుట్టింటికి పారిపోయింది. అదే రోజు రెండో భార్యను మండలంలోని నర్సింపురం సమీపంలోని ఆటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి పెట్రోల్ పోలీస నిప్పంటించడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆమె కూడా భద్రాయలంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త తనను చంపేస్తాడనే భయంతో ఆమె ఈ నెల 16న చింతూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా, మొదటి భార్యను వేధింపులకు గురి చేస్తున్న సమయంలో నిందితుడు స్వయంగా సెల్ఫీ వీడియో తీశాడు. అది కాస్తా బయటకు రావడంతో ఈ అమానుష ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రెండో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తుచేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చదవండి: చట్టీ ఘటనను ఖండించిన వాసిరెడ్డి పద్మ -
చట్టీ ఘటనను ఖండించిన వాసిరెడ్డి పద్మ
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి ఏజన్సీ చింతూరు మండలం చట్టి ఘటనను మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఖండించారు. మృగంలా ప్రవర్తించిన భర్త కళ్యాణం వెంకన్నను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆమె ఆదేశించారు. బాధిత మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఘటనపై జిల్లా ఎస్పీ నయీం హస్మీతో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. తన ఇద్దరు భార్యలు సుమతి, జయమ్మలపై భర్త కళ్యాణం వెంకన్న చేసిన పాశవిక దాడి అమానుషమన్నారు. ఇద్దరిని పెళ్లాడటం తప్పు అని.. అనుమానాలతో భార్యలపై మృగంలా ప్రవర్తించి అత్యంత క్రూరంగా చిత్రహింసలకు గురిచేయడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భార్యలను చిత్రహింసలు పెడుతూ మరో వ్యక్తితో సెల్లో వీడియో తీయించడం మరీ దారుణమన్నారు. ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులు ధైర్యంగా ముందుకువచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చదవండి: ఇద్దరు భార్యలపై శాడిస్టు భర్త హత్యాయత్నం.. సెల్ఫీ తీసి! చదవండి: చికెన్, మటన్ గొడవ..! నిండు ప్రాణం బలి వీర్రాజు, అచ్చెన్నలకు పదవీ గండం? -
వీడియో వైరల్: ప్రియుడిని కలిసేందుకు వెళ్తుండగా..
జయపురం(ఒడిశా): తాను ప్రేమించిన వ్యక్తిని కలిసేందుకు వెళ్లిన ఓ యువతిపై కొంతమంది దుండగులు దాడికి పాల్పడిన సంఘటన నవరంగపూర్ జిల్లాలోని రాయిఘర్ సమితిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు రెండున్నర నెలల క్రితం ఈ ఘటన జరగగా, దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ కావడంతో గుట్టురట్టయింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, బుధవారం అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో దినేష్ గోండ్, నరసింగ గోండ్, శిశుపాల్ గోండ్లు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.. (చదవండి: సీసీ కెమెరాలో దృశ్యాలు: ఆ ఘటన వెనుక కుట్ర) కుందై కోటపర గ్రామానికి చెందిన ఓ యువతి.. ఝుడుకు గ్రామ పంచాయతీలోని పూజారిపర గ్రామానికి చెందిన జగదీష్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే జూలై 16వ తేదీన ఆ యువతి తన ప్రేమికుడు జగదీష్ను కలిసేందుకు అతడి గ్రామానికి బయలుదేరింది. ఈ విషయం యువతికి వరసకు సోదరుడైన శిశుపాల్ గోండ్కు తెలిసింది. దీంతో అతడు తన స్నేహితులతో కలిసి, ఆ యువతిని వెంబండించాడు. సరిగ్గా అక్కడి అటవీ ప్రాంతంలో ఆ యువతి నడిచి వెళ్తుండగా.. శిశుపాల్ తన స్నేహితులతో కలిసి ఆమెను చుట్టుముట్టి చితకబాదారు. ఈ క్రమంలో ఆ యువతి ప్రాణ భయంతో పరుగులు తీసినా విడిచిపెట్టకుండా ఆ యువతిని చేతులు, కర్రలతో కొట్టారు. (చదవండి: రోడ్డు ప్రమాదంలో టిక్టాక్ స్టార్ మృతి) అనంతరం ఆ యువతిని గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో నిర్వహించిన రచ్చబండలో నిలబెట్టారు. యువతి ప్రేమించిన వ్యక్తి జగదీష్ను కూడా రచ్చబండకు పిలిపించి, నష్టపరిహారం కింద రూ.60 వేలు కట్టాలని పెద్దలు ఆదేశించారు. ఇరువర్గాలవి వేర్వేరు కులాలు కావడంతో విషయం బయటకుపోతే తమ పరువు పోతుందని భావించిన జగదీష్ కుటుంబ సభ్యులు పెద్దల తీర్పును అంగీకరించారు. అప్పట్లో జగదీష్ వద్ద ఉన్న రూ.20 వేలు నష్టపరిహారం కింద చెల్లించగా, మిగతా సొమ్ము తర్వాత ఇస్తానని చెప్పి, వలస పనుల నిమిత్తం జగదీష్ మహారాష్ట్రకు బయలుదేరాడు. అయితే అకస్మాత్తుగా ఆ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.