assembly dissolved
-
ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ రద్దు!
నేరేడుచర్ల: రాష్ట్రంలో ఆరు నెలల్లో అసెంబ్లీ రద్దు కావడం ఖాయమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి జోస్యం చెప్పారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని పెంచికల్దిన్నె, కల్లూరు, దాసారం, యల్లారం, ముకుందాపురం, బురుగులతండా, సోమారం, చిల్లేపల్లి, బొడలదిన్నె, జగనతండా గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పూర్తిగా విఫలమైందని, సర్పంచ్లను ఇబ్బంది పెట్టే విధంగా ఈ కార్యక్రమం ఉందని పేర్కొన్నారు. గతంలో చేసిన పనుల బిల్లులు ఇప్పటి వరకూ రాకపోవడంతో సర్పంచ్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె ప్రగతి కార్యక్రమాలకు వెళ్లేందుకు భయపడుతున్నారని తెలిపారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, పింఛన్లు పూర్తి స్థాయిలో అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేల రైతు బంధు ఇస్తామన్నారు. భూమిలేని రైతు కూలీలకు, జాబ్కార్డులున్న ఉపాధి హామీ కూలీలకు ఉపాధి పనులు కల్పించడంతో పాటు ఏడాదికి ఒక్కొక్కరికి రూ.12వేల చొప్పున అందిస్తామని చెప్పా రు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా చూస్తామన్నారు. అలాగే రైతులకు పంట బీమాతో పాటు ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అభయాస్తం పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలిచ్చి, బకాయిలను చెల్లిస్తామని పేర్కొన్నారు. -
బిహార్ మంత్రివర్గం రాజీనామా
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ ఫగూ చౌహాన్ని కలిశారు. తన మంత్రివర్గ రాజీనామాను సమర్పించి, అసెంబ్లీని రద్దుచేయాలని సిఫారసు చేశారు. దీంతో బిహార్లో నితీశ్ నేతృత్వంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నితీశ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించి, ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. అంతకుముందు సీఎం అధికార నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జేడీయూ, బీజేపీ, హెచ్ఏఎం, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీల నాయకులు భేటీ అయ్యారు. కొత్త ఎన్నికైన ఎన్డీయే ఎమ్మెల్యేలంతా ఆదివారం మధ్యాహ్నం సమావేశమై నితీశ్ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. బిహార్లో జేడీయూ కన్నా బీజేపీ 31 స్థానాలు అధికంగా గెలుపొందినప్పటికీ, ప్రధాని, బీజేపీ అధిష్టానం నితీశ్ కుమార్నే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించడం విశేషం. ఉప ముఖ్యమంత్రిగా దళిత వర్గానికి చెందిన బీజేపీ నేత కామేశ్వర్ చౌపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనకు సంఘ్పరివార్తో అనుబంధం ఉంది. ఇలా ఉండగా, స్వతంత్ర ఎమ్మెల్యే చకాయ్ సుమిత్ సింగ్ ఎన్డీయేకి మద్దతు ప్రకటించారు. -
కోమటిరెడ్డి, సంపత్ల కేసులో అప్పీళ్లు మూసివేత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్కుమార్లను శాసనసభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు మూసివేసింది. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈ అప్పీళ్లపై విచారణ జరిపి ప్రయోజనం లేదన్న హైకోర్టు వీటిని మూసివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాము ఈ అప్పీళ్లను మూసివేసిన నేపథ్యంలో కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని కూడా మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో సింగిల్ జడ్జిని కోరింది. తమను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానం, తదానుగుణ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ కోమటిరెడ్డి, సంపత్లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి, బహిష్కరణ తీర్మానం, తదానుగుణ నోటిఫికేషన్ను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పు ప్రకారం తమ పేర్లను శాసనసభ్యుల జాబితాలో చేర్చలేదని, ఇది కోర్టు ధిక్కారమేనంటూ కోమటిరెడ్డి, సంపత్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్రావులకు కోర్టు ధిక్కారం కింద ఫాం 1 నోటీసులు జారీ చేసి, వారి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. దీంతో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, సింగిల్ జడ్జి తీర్పుతో పాటు ఇరువురు కార్యదర్శులకు కోర్టు ధిక్కారం జారీ చేసిన ఫాం 1 నోటీసుల అమలుపై కూడా స్టే విధించింది. తాజాగా ఈ అప్పీళ్లు సోమవారం విచారణకు రాగా, కోమటిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలను మూసివేయవచ్చని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆ మేర అప్పీళ్లను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చింది. -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దు ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే!
జమ్మూకశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పర్చే అవకాశాన్ని రాజకీయపార్టీలకు ఇవ్వకుండా అసెంబ్లీని రద్దుపరచడం ద్వారా గవర్నర్ సత్పాల్ మాలిక్ వాస్తవానికి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ సమయంలో ఏం కోరుకుంటోందో దాన్ని మాత్రమే గవర్నర్ పాటించినట్లుంది. గవర్నర్ తన చర్యను సమర్థించుకోవడమే కాకుండా, పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పంపిన ఉత్తరాన్ని ఫ్యాక్స్ మిషన్ పనిచేయనందున స్వీకరించలేకపోయినట్లు ప్రకటించడం ఆవేదన కలిగించే విషయం. జమ్మూ కశ్మీర్ అనేది సైనిక సమస్య కాదు, పాలనాపరమైన సమస్య కాదు. అదొక రాజకీయ సమస్య. పరస్పర చర్చలద్వారానే దాన్ని పరిష్కరించాలి. జమ్మూ కశ్మీర్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి రాజకీయ పార్టీలను అనుమతించకుండా ఆ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక చర్య కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనడంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి ఆసక్తి లేదని స్పష్టం చేస్తోంది. దానికంటే ఎన్నికల్లో జాతీయవాద మనోభావాలను వాడుకోవడం పట్లే దానికి ఆసక్తి ఉన్నట్లుంది. ఇది ఒక రాష్ట్రంలో లేక ఒక నిర్దిష్ట సామాజిక బృందం అనుభవిస్తున్న చారిత్రక వేదన పట్ల దేశంలోని ఇతర ప్రాంతాల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతూ సమస్యకు మరిం తగా నిప్పు రాజేస్తున్నట్లుగా ఉంది. జమ్మూకశ్మీర్లో రాజకీయ పార్టీలను చర్చలబల్ల వద్దకు తీసుకొచ్చి ప్రభుత్వ ఏర్పాటు కోసం సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేసివుండాలని మనలో చాలామంది భావన. జాతీయ ప్రయోజనాల రీత్యా జాతీయ పార్టీలని చెప్పుకుంటున్నవి ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించి ద్వితీయపాత్రకు మాత్రమే పరిమితం కావలసి ఉంది. కానీ బీజేపీ నేరుగా రాష్ట్రాన్ని పాలిం చడానికి రాజకీయ సంప్రదింపులు జరిపే ఉద్దేశంతోనే సత్పాల్ మాలిక్ని జమ్మూ కశ్మీర్కు గవర్నర్గా పంపించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన లక్ష్యం కశ్మీర్ రాజకీయ పార్టీలను హిందుత్వ రాజకీయ ప్రయోజనాల కోసం విభజించడమే. సాజిద్ లోనేని దాంట్లోభాగంగానే ప్రోత్సహించారు. ఆ రకంగా నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ వంటి స్థానిక రాజకీయ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టవచ్చని, లేదా తగ్గించవచ్చని భావించారు. తన ప్రజలపైనే యుద్ధం చేస్తూ, వ్యవస్థల విశ్వసనీయతనే విధ్వంసం చేయడానికి పూనుకున్న ప్రభుత్వాన్ని మనం ఎక్కడైనా చూశామా? హింసాత్మక ఘటనలు పెరిగాయి కాబట్టి కశ్మీరులో గత నాలుగేళ్లుగా పరిస్థితి దిగజారిపోలేదని, కశ్మీర్ సమస్య పరి ష్కారానికి కేంద్రం ఏరకమైన ఆసక్తీ చూపకపోవడమే అక్కడ అశాంతికి కారణమని మనందరికీ తెలుసు. కశ్మీర్ సమస్య పట్ల కఠిన పరిష్కారమే మార్గమని, అంటే సాయుధ బలగాలకు స్వేచ్ఛ ఇచ్చి వారెప్పుడు కోరుకుంటే అప్పుడు రాజకీయ ప్రక్రియను అనుమతించని విధంగా పరిష్కరించాలని ఆర్ఎస్ఎస్ మేధో బృందం చాలవరకు భావిస్తోంది. కశ్మీర్.. యుద్ధం ద్వారా గెలవాల్సిన ప్రాంతంగా సంఘ్ పరివార్ భావిస్తోంది. భారత్లో మన బానిసత్వానికి గుర్తుగా మిగిలిన ఇస్లామ్ చిహ్నాలను పూర్తిగా రద్దు చేయాలంటూ రాత్రింబవళ్లు మొత్తుకుంటున్న సంఘ్ భక్తపరివార్కి ఇలాంటి తరహా విజయం సంతృప్తినిస్తుం దని ఆర్ఎస్ఎస్ భావన. అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచిన తర్వాత ఉన్నట్లుండి గవర్నర్కు రాష్ట్రంలో ఇక సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదని స్ఫురించిందంటే కేంద్రం ఆజ్ఞలకు వెన్నెముక లేని గవర్నర్ పూర్తిగా లొంగిపోయినట్లే లెక్క. పైగా ఇతర ప్రతిపక్ష పార్టీలు పంపిన ఉత్తరాలను గవర్నర్ తిరస్కరించారు. వాస్తవానికి మునుపెన్నడూ లేనంత రాజకీయ ఐక్యతను ప్రదర్శించిన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఉమ్మడిగా వెళ్లి గవర్నర్ను కలవాలని నిర్ణయించాయి. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మరో ఆలోచన ఉన్నట్లుంది. కశ్మీర్ నుంచి ఈశాన్య భారత్ వరకు హిందుత్వ ప్రభుత్వాన్ని స్థాపించాలనే అమిత్షా, నరేంద్రమోదీల స్వప్న సాకారం చేయడానికి జమ్మూకశ్మీర్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం ఆశిం చింది. ప్రభుత్వాన్ని ఏర్పర్చే అవకాశాన్ని రాజకీయపార్టీలకు ఇవ్వకుండా అసెంబ్లీని రద్దుపరచడం ద్వారా మాలిక్ వాస్తవానికి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ సమయంలో ఏం కోరుకుంటోందో దాన్ని మాత్రమే గవర్నర్ పాటించినట్లుంది. గవర్నర్ తన చర్యను సమర్థించుకోవడమే కాకుండా, పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పంపిన ఉత్తరాన్ని ఫ్యాక్స్ మిషన్ పనిచేయనందున స్వీకరించలేకపోయినట్లు ప్రకటించడం ఆవేదన కలిగించే విషయం. పైగా ఆర్ఎస్ఎస్ నియమించిన రామ్ మాధవ్ సమస్యపట్ల ఏమాత్రం అవగాహన లేకుండానే మీడియా వద్దకు హుటాహుటిన పరుగెత్తుకెళ్లి, పాకిస్తాన్ ఆదేశాల ప్రకారమే ఆ మూడు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పర్చాలని కోరుకుంటున్నట్లుగా ఆరోపించి అభాసుపాలయ్యారు. రామ్మాధవ్ వ్యవహరించిన తీరు కశ్మీర్ సమస్య పట్ల బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధీ లేదన్న విషయాన్ని ప్రతిబింబిస్తోంది. సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాన్ని, కొద్ది నెలలక్రితం వరకు భాగస్వామిగా అధికారం చలాయించిన పార్టీని జాతి వ్యతిరేకమైనదిగా ఎలా ముద్రవేస్తారు? జమ్మూకశ్మీర్ వ్యవహా రాల్లో వేలుపెట్టేందుకు రామ్ మాధవ్ లాంటి వ్యక్తిని నియమించినప్పుడే కేంద్రప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకున్నాం. బీజేపీతో సమస్య ఏమిటంటే అది ప్రజాతీర్పుకు వెన్నుపోటు పొడిచింది. గుజరాత్ బుడగ పేలిపోయింది. అభివృద్ధి ఎజెండా గాల్లో కలిసింది. మన వ్యవస్థలు తమ స్వతంత్రప్రతిపత్తిని, బలాన్ని కోల్పోతున్నాయి. ప్రజలమీద యుద్ధం ప్రకటించి ప్రభుత్వమే వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అది జమ్మూ కశ్మీర్ను కోరుకుంటోంది కానీ కశ్మీర్ ప్రజలతో మాట్లాడాలని భావించదు. భారత్లోని సవర్ణులతో కశ్మీర్గురించి చర్చించాలని అనుకుంటోది తప్పితే కశ్మీర్ ప్రజలతో మాట్లాడాలని అనుకోవడం లేదు. ఇక ఆర్ఎస్ఎస్ జాతీయవాద నమూనా ప్రకారం, వారికి కశ్మీరీ ముస్లింలతో పని లేదు, అక్కడి ప్రజలతో పనిలేదు కానీ అఖండభారత్లో భాగంగా కశ్మీర్ భౌగోళిక ప్రాంతం మాత్రమే వారిక్కావాలి. ఒకవేళ వారు ప్రజల గురించి ఆలోచించినప్పటికీ జమ్మూలోని హిందువుల గురించే ఆలోచిస్తారు. ఇంతకంటే మించిన వంచన లేదు. ఇప్పుడు కశ్మీర్కి కావలసింది భారత్ నుంచి ఒక ప్రేమాస్పదమైన వెచ్చటి కౌగిలింత మాత్రమే. యువతకు ఉద్యోగం, అవకాశాలు అవసరం. రాజకీయ వాణిని వినాలి. రాజకీయ చర్చలపట్ల విశ్వాసం ప్రకటించినందుకే అక్కడ ఎంతోమంది సాహస జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్ సైనిక సమస్య, పాలనాపరమైన సమస్య కాదు. అదొక రాజకీయ సమస్య. చర్చలద్వారానే దాన్ని పరిష్కరించాలి. రాజ్యాంగాన్ని, చట్టపాలనను విశ్వసిస్తున్న రాజకీయ పార్టీల ప్రతిష్టను మసకబార్చి మీరు చేసేదేమీ ఉండదు. ద్వేషానికి, హింసకు వ్యతిరేకంగా పోరాడుతూ అనేకమంది నేతలను కోల్పోయిన కశ్మీర్ రాజకీయపార్టీలపై మరకలువేయడానికి ప్రయత్నిస్తే తర్వాత మీరు మాట్లాడేందుకు మనిషి కూడా మిగలడు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కశ్మీర్లో ఇలాంటి అంగుష్టమాత్రపు రాజకీయాల్లో మునగకూడదు. -విద్యాభూషణ్ రావత్, మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్టు -
పాక్ కనుసన్నల్లో కశ్మీర్ పార్టీలు
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్ అసెంబ్లీ రద్దయ్యాక గురువారం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. పాకిస్తాన్ ప్రోద్బలంతోనే బద్ధ శత్రువులైన పీడీపీ, ఎన్సీలు చేతులు కలిపేందుకు సిద్ధమయ్యాయన్న బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ వ్యాఖ్యలపై ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణల్ని రుజువుచేయాలని లేదంటే క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో రామ్ మాధవ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరిగే అవకాశాలున్నాయని వచ్చిన నివేదికల్ని బహిర్గతం చేయాలని గవర్నర్ సత్యపాల్ మాలిక్ను ఒమర్ కోరారు. కశ్మీర్ ప్రాంతీయ పార్టీలు పాక్ కనుసన్నల్లో పనిచేస్తున్నాయన్న బీజేపీ వ్యాఖ్యలపై రాష్ట్ర మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడు మాత్రం పీడీపీ, ఎన్సీల దేశభక్తి, విశ్వసనీయతను ఆ పార్టీ ప్రశ్నించలేదని అన్నారు. ‘ఒక పార్టీ జాతీయవాదం, దేశభక్తిని ఎలా నిర్ణయిస్తారు. కేంద్రంతో ఉంటే దేశభక్తులు.. లేకుంటే జాతి వ్యతిరేకులా?’ అని సూటిగా ప్రశ్నించారు. కలసి పోటీచేయగలరా?: రామ్ మాధవ్ బీజేపీ, ఎన్సీల మధ్య ట్వీటర్ వేదికగా మాటల యుద్ధం జరిగింది. పీడీపీ, ఎన్సీల స్నేహం నిజమైనదైతే వచ్చే ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు కలసి పోటీచేయాలని కశ్మీర్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జీ రామ్ మాధవ్ సవాలు విసిరారు. ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరావాలని కశ్మీర్ ప్రాంతీయ పార్టీలకు పాక్ నుంచి ఆదేశాలు అందాయన్నారు. పాక్ సూచనల మేరకు ఎన్సీ, పీడీపీలు స్థానిక సంస్థల ఎన్నికల్ని బహిష్కరించాయన్నారు. మాధవ్ ఆరోపణల్ని ఒమర్ అబ్దుల్లా తిప్పికొడుతూ ‘ ఐబీ, రా, సీబీఐ లాంటి సంస్థలు మీ నియంత్రణలోనే ఉన్నాయి. ధైర్యముంటే మీ ఆరోపణల్ని నిరూపించే సాక్ష్యాలు బయటపెట్టండి’ అని డిమాండ్ చేశారు. దీనికి మాధవ్ బదులిస్తూ ‘ మీ దేశభక్తిని శంకించడం లేదు. కానీ పీడీపీ, ఎన్సీల మధ్య హఠాత్తుగా పుట్టుకొచ్చిన ప్రేమ సందేహాలకు తావిస్తోంది. విదేశీ ఒత్తిడి లేదని లేదంటున్నారు కాబట్టి నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీచేసి మీ మధ్య స్నేహం నిజమైనదే అని నిరూపించండి’ అని అన్నారు. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు.. కేంద్రం ఒత్తిడితోనే అసెంబ్లీని రద్దుచేశారన్న ఆరోపణల్ని గవర్నర్ తోసిపుచ్చారు. ‘భారీ స్థాయిలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు నివేదికలొస్తున్నాయి. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. తెరచాటుగా చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సాకుతో బెదిరిస్తున్నారని మెహబూబా ఆరోపించారు. మరో వర్గం ఎమ్మెల్యేలకు గుర్తుతెలియని వారు భారీగా డబ్బు ఆశ చూపారు. ఈ బేరసారాలు 20 రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి’ అని మీడియాకు వివరించారు. మే లోపే ఎన్నికలు: సీఈసీ కశ్మీర్లో మే లోపు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్సభ ఎన్నికల కన్నా ముందే అక్కడ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అసెంబ్లీ రద్దయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు జరగాలి. కశ్మీర్ విషయంలో ఆ గడువు మే వరకు ఉంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొనే పోలింగ్ తేదీల్ని ఖరారుచేస్తామని రావత్ చెప్పారు. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోందని, తెలంగాణలోనూ ఇదే నియమాన్ని వర్తింపజేస్తున్నామని తెలిపారు. మెహబూబాకే మేలు! కశ్మీర్ రాజకీయ డ్రామాలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీదే విజయమా? కాంగ్రెస్, ఎన్సీ మద్దతుతో ఆమె ముఖ్యమంత్రి కాకుండా గవర్నర్ సత్యపాల్ మాలిక్ అడ్డుకోవడం తాత్కాలికమేనా? అంటే..అసెంబ్లీ రద్దు పరోక్షంగా బీజేపీకి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సజ్జన్ గని లోన్ని సీఎం చేసి కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకున్న బీజేపీ ప్రయత్నాలకు అసెంబ్లీ రద్దుతో గండిపడినట్లయింది. పీడీపీ, ఎన్సీ, కాంగ్రెస్లు తమకున్న ఎమ్మెల్యేల బలంతోనే ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నాయని, ఈ ఆలోచన ప్రతిపాదిత కూటమికి మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జూన్ 19న పీడీపీ–బీజేపీ సంకీర్ణం కుప్పకూలిన తరువాత పీడీపీ అస్తిత్వ సంక్షోభంలో కూరుకుపోయింది. పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జన్ గని బీజేపీతో చేతులు కలిపి సీఎం అవుతారనే ప్రచారంతో..కొందరు పీడీపీ సభ్యులు ఆయన గూట్లో చేరారు. బుధవారం మధ్యాహ్నం వరకు అత్యంత నిరాశాజనకంగా ఉన్న పీడీపీ శిబిరంలో ఒక్కసారిగా ఆశావహ వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీల మద్దతు తనకు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ గవర్నర్కు లేఖ రాయడం ద్వారా ముఫ్తీ.. సజ్జద్ ఫ్రంట్లోకి మరిన్ని వలసల్ని నిలువరించారు. గవర్నర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాలని మెహబూబా యోచిస్తున్నట్లు సమాచారం. -
పండుగ పూట రాజ్భవన్ ఖాళీ..
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్న గవర్నర్ సత్యపాల్ మాలిక్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. అసెంబ్లీ రద్దు నిర్ణయం సరైన సమయంలోనే జరిగిందని చెప్పుకొచ్చారు. గత కొద్ది నెలలుగా అసెంబ్లీని రద్దు చేయాలని కోరిన మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని సిద్ధాంత వైరుధ్యాలతో కూడిన పార్టీలతో కలిసి కోరుతున్నారని గవర్నర్ పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ తాను చేసిన ఫోన్ కాల్స్, ఫ్యాక్స్ సందేశాలకు గవర్నర్ బదులివ్వలేదన్న మెహబూబా ముఫ్తీ ఆరోపణలపై ఆయన స్పందించారు. ఈద్ రోజు రాజ్భవన్లో ఎవరూ లేరని, కనీసం తనకు ఆహారాన్ని అందించేందుకూ ఎవరూ అందుబాటులో లేరని, ఆమె ఈద్ ముందు రోజు తనను సంప్రదించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. తాను ఫ్యాక్స్ సందేశాన్ని అందుకున్నా తన నిర్ణయంలో మార్పు ఉండేది కాదని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులు, పేలవమైన సర్ధుబాట్లతో కూడిన ప్రభుత్వ ఏర్పాటును అనుమతించరాదని తాను గట్టిగా నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. కాగా 87 మంది సభ్యులున్న అసెంబ్లీలో తమ పార్టీ పీడీపీకి కాంగ్రెస్ నుంచి 12 మంది, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి 15 మంది ఎమ్మెల్యేల మద్దతుతో 56 మంది సభ్యులున్నారని, దీంతో తమ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సంఖ్యాబలం ఉందని గవర్నర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇక పీపుల్స్ కాన్ఫరెన్స్కు చెందిన సజద్ లోన్ సైతం ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్కు కోరారు. ఇద్దరు సభ్యులున్న పీపుల్స్ కాన్ఫరెన్స్కు బీజేపీ ఎమ్మెల్యేలు 25 మంది, ఇతర ఎమ్మెల్యేలు 18 మంది మద్దతు పలుకుతున్నారని సజద్ లోన్ తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. కాగా ముఫ్తీ సర్కార్కు బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ఈ ఏడాది జూన్ నుంచి జమ్ము కశ్మీర్ గవర్నర్ పాలనలో ఉన్న విషయం తెలిసిందే. గవర్నర్ అప్పట్లో అసెంబ్లీని రద్దు చేయకుండా సుప్త చేతనావస్ధలో ఉంచారు. -
గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం..
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లో రాజకీయ సంక్షోభం న్యాయపోరాటం దిశగా సాగుతోంది. జమ్ము కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కోరినందునే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. గవర్నర్ నిర్ణయాన్ని న్యాయస్ధానంలో సవాల్ చేస్తామన్నారు. జమ్ము కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చే భిన్న సిద్ధాంతాలతో కూడిన పార్టీల ఆధ్వర్యంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమని అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అధికారాన్ని దక్కించుకునేందుకే ఆయా పార్టీలు కలుస్తున్నాయని, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని అందించేందుకు కాదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు ఊపందుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గవర్నర్ నిర్ణయాన్ని పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. -
జమ్మూకశ్మీర్లో అనూహ్య పరిణామాలు
-
అసెంబ్లీ రద్దు.. గవర్నర్ అనూహ్య నిర్ణయం
శ్రీనగర్: కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న జమ్మూకశ్మీ ర్ రాజకీయాలు బుధవారం ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల మధ్య గవర్నర్ సత్యపాల్ మాలిక్ అసెంబ్లీని రద్దు చేశారు. అంతకుముందు.. కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించి, రాష్ట్రంలో బద్ధ శత్రువులైన పీడీపీ, నేషనల్ కాన్ఫెరెన్స్లు ఒక్కటై, కాంగ్రెస్తో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్, ఎన్సీతో కలసి ప్రభుత్వా న్ని ఏర్పాటు చేస్తానంటూ పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ గవర్నర్ మాలిక్కు లేఖ కూడా రాశారు. మరోవైపు, ఈ కూటమిని అడ్డుకునే లక్ష్యంతో.. బీజేపీ, 18 మంది ఇతరుల మద్దతుతో తాను కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలనని పీపుల్స్ కాన్ఫెరెన్స్ నేత సజ్జాద్ లోన్ ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో పీడీపీకి 28, కాంగ్రెస్కు 12, ఎన్సీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీకి 44 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ఈ కూటమికి 55 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా, అసెంబ్లీలో బీజేపీకి 25 మంది, పీపుల్స్ కాన్ఫెరెన్స్కు ఇద్దరు, సీపీఎంకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పీడీపీ– బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో జూన్ 19న రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉండేందుకు అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచారు. ‘ఇతరుల’ మద్దతుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫెరెన్స్ కూడా తమకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని గవర్నర్కు రాసిన లేఖలో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. మరోవైపు, ఇద్దరు ఎమ్మెల్యేల పీపుల్స్ కాన్ఫెరెన్స్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. తమకు 25 సభ్యుల బీజేపీతో పాటు 18కి పైగా ఇతర సభ్యుల మద్దతుందని ఆ పార్టీ నేత సజ్జాద్ లోన్ గవర్నర్కు తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయం సంచలనం సృష్టించింది. గవర్నర్ నిర్ణయం నిర్ణయం నేపథ్యంలో.. ఎన్నికల ప్రకటనకు ముందే రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని తక్షణమే అమలులోకి తెచ్చే అవకాశంపై యోచిస్తున్నట్లు ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. బేరసారాలకు అవకాశం ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు జరిగే అవకాశం ఉండటం, విరుద్ధ భావజాలాలున్న పార్టీలు స్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచలేవన్న నమ్మకంతోనే అసెంబ్లీని రద్దుచేయాల్సి వచ్చిందని రాజ్భవన్ నుంచి ప్రకటన వెలువడింది. మెజారిటీని నిరూపించుకునేందుకు ఒకటి కన్నా ఎక్కువ వర్గాలు ముందుకు రావడం ప్రభుత్వ నిలకడపై ప్రభావం చూపుతుందని మరొక కారణంగా పేర్కొంది. మరోవైపు, కాంగ్రెస్– పీడీపీ–ఎన్సీ కూటమి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని బీజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి కవీందర్ గుప్తా ఆరోపించారు. దుబాయిలో పాకిస్తాన్ ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో ఈ మూడు పార్టీల నేతలు కలిశారన్నారు. కలవరపడ్డ బీజేపీ: ముఫ్తీ కశ్మీర్లో మహాకూటమి ఏర్పాటు ఆలోచన బీజేపీని కలవరపాటుకు గురిచేసిందని పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. తన లేఖను స్వీకరించలేకపోయిన గవర్నర్ కార్యాలయంలోని ఫ్యాక్స్ మిషన్ అసెంబ్లీ రద్దు ఉత్తర్వుల్ని మాత్రం వెంటనే జారీచేసిందని ఎద్దేవా చేశారు. -
అసెంబ్లీ రద్దు అనుచితం
సరిగ్గా అయిదు నెలలక్రితం పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జమ్మూ– కశ్మీర్లో రాజకీయం వేడెక్కింది. చకచకా జరిగిన పరిణామాల పర్యవసానంగా హఠాత్తుగా బుధవారం అసెంబ్లీ రద్దయింది. ఎప్పుడూ పరస్పరం కత్తులు నూరుకునే ప్రాంతీయ పక్షాలు మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ, ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్లు కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయడం మొదలు పెట్టగానే బీజేపీ నాయకత్వం అప్రమత్తమైంది. ఫలితంగా పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ గని లోన్ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇప్పించాలంటూ వాట్సాప్ మాధ్యమం ద్వారా గవర్నర్ సత్యపాల్ మాలిక్కు లేఖ పంపారు. తాము లేఖ ఇవ్వబోతే గవర్నర్ కార్యాలయం స్పందించలేదని, దాన్ని ఫ్యాక్స్ చేయడానికి ప్రయత్నిస్తే అవాంతరాలు వచ్చాయని మెహబూబా చెబుతున్నారు. కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు రాష్ట్రాల్లో తమకనుకూలమైన పరిస్థితులు ఉంటే ఒకరకంగా, లేనట్టయితే మరో రకంగా వ్యవహరించడం మన దేశంలో రివాజుగా మారింది. ఈ సంస్కృతిని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయే అయినా ఇతర పక్షాలు కూడా అందుకు భిన్నంగా లేవు. ఇష్టానుసారం ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడం, బలహీనులకు అధికారం కట్టబెట్టడం ఆనవాయితీ అయింది. ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డాక ఈ ధోరణికి కాస్త అడ్డుకట్ట పడినా పూర్తిగా సమసిపోలేదు. ఇప్పుడు జమ్మూ–కశ్మీర్ గవర్నర్ చేసింది ఇటువంటిదే. 87మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసే పార్టీకి లేదా కూటమికి కనీసం 44మంది మద్దతు అవసరం. సభలో 28మంది సభ్యులున్న పీడీపీ, 12మంది సభ్యులున్న కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. 15మంది సభ్యులున్న నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) దీనికి బయటినుంచి మద్దతిస్తానని చెప్పింది. అంటే మొత్తంగా ఈ పార్టీలకు 56మంది ఎమ్మెల్యేలున్నట్టు లెక్క. అటు సజ్జాద్ తమకు 25మంది సభ్యులున్న బీజేపీతోపాటు మరో 18మంది ఎమ్మెల్యేల మద్దతున్నదని గవర్నర్కు పంపిన లేఖలో చెప్పారు. అంటే ఆ పక్షం తమకు 44మంది సభ్యుల బలం ఉందని చెప్పింది. ఇక్కడ న్యాయంగా గవర్నర్ విశ్వసించాల్సింది ఎవరిని? సజ్జాద్ పార్టీకి ఆయనతోపాటు మరో ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరికీ బీజేపీ మద్దతు ఉన్నట్టు అర్ధమవుతూనే ఉంది. కానీ మరో 18మంది ఎక్కణ్ణుంచి వచ్చినట్టు? సజ్జాద్ వారి పేర్లు ఇచ్చారా? ఆ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన మద్దతు లేఖలు గవర్నర్కి సమర్పించారా? ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడిన రెండు పక్షాల్లో ఎవరికీ సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పే సత్తా లేదన్న నిర్ణయానికి ఆయనెలా వచ్చినట్టు? వాస్తవానికి పీడీపీలో చీలిక తీసుకొచ్చి, తమ సన్నిహితుడు సజ్జాద్ గని లోన్కు అధికార పగ్గాలు కట్టబెట్టాలని బీజేపీ కొంతకాలంగా అనుకుంటోంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2020 డిసెంబర్తో ముగుస్తుంది. ప్రస్తుతానికి సజ్జాద్తో నెట్టుకొచ్చి, ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేయించి ఆర్నెల్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతోపాటు దానికి కూడా ఎన్నికలు జరిపించాలని బీజేపీ వ్యూహం రచించింది. ఈ విషయం మీడియాలో గుప్పుమన్నా పీడీపీలో మొదట్లో పెద్దగా కదలిక లేదు. తగినంత రాజకీయ అనుభవం లేకనో, తమ పార్టీనుంచి ఎవరూ బయటికి పోరన్న ధీమానో... మొత్తానికి మెహబూబా నిర్లిప్తంగా ఉండిపోయారు. కానీ మంగళవారం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎంపీ ముజఫర్ హుస్సేన్ బేగ్ చేసిన ప్రకటనతో ఆమె మేల్కొన్నారు. సజ్జాద్ తన కుమారుడితో సమానమని ఆయన చెప్పడంతో కొందరు ఎమ్మెల్యేలు జారుకునేలా ఉన్నారని మెహబూబాకు అర్ధమైంది. అందుకే బుధవారం ఆదరా బాదరాగా కాంగ్రెస్, ఎన్సీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ రాజకీయాల సంగతెలా ఉన్నా...జమ్మూ–కశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న సున్నితమైన ప్రాంతం. అక్కడ అటు వేర్పాటువాదం, ఇటు ఉగ్రవాదం దశాబ్దాలుగా సమస్యగా మారాయి. అందుకే అక్కడ అస్థిరత నెలకొన్నప్పుడు ప్రధాన రాజకీయ పక్షాలు, కేంద్ర ప్రభుత్వమూ ఆచి తూచి అడుగులేయాలి. తమకు అలవాటైన రాజకీయపుటెత్తులు అక్కడ ప్రయోగిస్తే పరిస్థితి వికటిస్తుంది. అది దేశ ప్రయో జనాలకు చేటు తెస్తుంది. తాజా పరిణామాలపై బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు విపరీత ధోరణులతో ఉన్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పక్షాలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ నడంలో కుట్ర దాగున్నదని అనడం అత్యంత దారుణం. ప్రజలెన్నుకున్న పార్టీలు తమ విభేదాలు మరిచి ఒకటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం ఏమంత అపరాధం? ఎలాంటి కుట్ర? వాస్తవానికి జమ్మూ–కశ్మీర్లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో గవర్నర్ పాలన కన్నా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఉండటం అత్యవసరం. రెండేళ్ల వ్యవధి ఉండగానే అసెంబ్లీ రద్దు చేయడం తప్పుడు సంకేతాలు పంపుతుంది. గవర్నర్ అన్ని ప్రత్యామ్నాయాలూ పరిశీలించి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా లేదని సంతృప్తి చెందాక ఆ నిర్ణయా నికొస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు. అందుకోసం అసెంబ్లీని సమావేశపరిచి అక్కడే బలా బలాలు తేలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేది. కానీ దానికి విరుద్ధంగా జమ్మూ–కశ్మీర్లో బూటకపు ప్రజాస్వామ్యం నడుస్తున్నదన్న వేర్పాటువాదుల ప్రచారానికి బలం చేకూర్చే విధంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే వ్యవహరించడం విడ్డూరం. అసెంబ్లీ రద్దు అంశాన్ని ఏ పార్టీ అయినా కోర్టులో సవాలు చేస్తే గవర్నర్ నిర్ణయం న్యాయ పరీక్షకు నిలబడుతుందా అన్నది సందేహమే. రాజకీయ పక్షాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్భవన్లలో కాదని పలుమార్లు న్యాయ స్థానాలు స్పష్టం చేశాయి. అయినా స్వీయ రాజకీయ ప్రయోజనాలకోసం ఎంతకైనా తెగించటం అధికారంలో ఉన్నవారికి అలవాటైపోయింది. ఇది విచారకరం. -
అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో సర్కారుకు ఊరట
-
‘కేబినెటే’ ఫైనల్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. అసెంబ్లీ రద్దుకు మంత్రి మండలి సిఫారసు చేసినప్పుడు రాజ్యాంగంలోని అధికరణ 174(2)(బీ) కింద.. రద్దు ఉత్తర్వులు జారీచేసే అధికారం గవర్నర్కు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. సభ రద్దు విషయంలో గవర్నర్.. సభను హాజరుపరిచి సభ్యుల అభిప్రాయాలను, ఆమోదాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 163(1) ప్రకారం కేబినెట్ సలహా మేరకు గవర్నర్ వ్యవహరిస్తారని, అయితే ఎప్పుడు విచక్షణాధికారాలను ఉపయోగించాలో అప్పుడే ఆయన ఆ అధికారులను ఉపయోగిస్తారని పేర్కొంది. ఈ ఆర్టికల్ ప్రకారం.. కేబినెట్ నిర్ణయాన్ని అమలుచేయడం మినహా.. గవర్నర్కు మరో ప్రత్యామ్నాయం లేదని వెల్లడించింది. అనవసర సందర్భాల్లో ఆయన తన విచక్షణాధికారాలను ఉపయోగించాల్సిన అవసరం లేదని తెలిపింది. కేబినెట్ సలహాలను పాటించాల్సిన అవసరం లేని సందర్భాల్లో మాత్రమే.. ఆయన తన విచక్షణాధికారాలను ఉపయోగిస్తారని స్పష్టం చేసింది. అందువల్ల.. అసెంబ్లీ రద్దు సమయంలో గవర్నర్ సభను హాజరుపరచాల్సిందేనన్న.. పిటిషనర్ల వాదన చెల్లుబాటు కాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్ల ధర్మాసనం శుక్రవారం ఈ తీర్పు వెలువరించింది. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని.. దీనివల్ల 20 లక్షల మంది యువత తమ ఓటు హక్కును కోల్పోతారంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన పోతుగంటి శశాంక్రెడ్డి, ఆర్.అభిలాష్రెడ్డిలు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ సైతం రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తూ పిల్ వేశారు. వీటిపై వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మధ్యాహ్నం పై తీర్పును వెలువరించింది. అసెంబ్లీ రద్దు రాజ్యాంగబద్ధమే! ‘తెలంగాణ అసెంబ్లీని మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ రద్దు చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆయన రాజ్యంగబద్ధంగానే ఇచ్చారు. అసెంబ్లీ రద్దు విషయంలో న్యాయస్థానాల జోక్యం ఎంత మాత్రం అవసరం లేదని భావిస్తున్నాం. అసెంబ్లీ రద్దు వెనుక దురుద్దేశాలు, అసాధారణ కారణాలుంటే తప్ప గవర్నర్ ఉత్తర్వుల్లో జోక్యం తగదని గతంలో ఈ హైకోర్టు ధర్మాసనమే తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో మేం పూర్తిగా ఏకీభవిస్తున్నాం’అని ధర్మాసనం తెలిపింది. శాసనపరమైన నిర్ణయాన్ని మార్చలేం ‘ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21 ప్రకారం ఓటర్ల జాబితా, ప్రచురణ నిరంతరం జరిగే ప్రక్రియ. ఓటరు అర్హత తేదీని చట్ట సభలు ప్రతీ ఏడాది జనవరి 1గా నిర్ణయించాయి. దీనిని ఒక్కో ఎన్నిక కోసం ఒక్కో రకంగా మార్చడానికి వీల్లేదు. మరో తేదీని నిర్ణయించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేదు. ఇదే సమయంలో అర్హత తేదీని ఆర్టికల్ 226 కింద కోర్టులు ఇచ్చే ఉత్తర్వుల ద్వారా కూడా మార్చడానికి వీల్లేదు. 2019 జనవరిలో కూడా ఎన్నికలు నిర్వహించవచ్చునని, తద్వారా ఆ ఏడాది జనవరి 1వ తేదీకి ఓటరుగా అర్హత ఉన్న వారికి జాబితాలో చోటు దక్కుతుందంటున్నారు. కానీ.. వాదన మమ్మల్ని సంతృప్తిపరచలేదు. అర్హత తేదీ నిర్ణయం శాసనపరమైన నిర్ణయం. దీనిని ఒక్కో ఎన్నిక కోసం ఒక్కో రకంగా మార్చడం వీలులేదు. ఓటర్ల జాబితా తయారీ, మార్పులు, చేర్పులు తదితర విషయాలు న్యాయస్థానాలకు సంబంధించిన వ్యవహారాలు కాదు. ఇదే విషయాన్ని ఇటీవలే ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టంగా చెప్పాం’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ నిర్ణయాలను గుర్తుచేస్తూ.. తమ ముందున్న వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు తెలిపింది. -
మూఢనమ్మకాల ఆధారంగా అసెంబ్లీ రద్దు...
సాక్షి, హైదరాబాద్: మంత్రి మండలి సిఫార్సు మేరకు అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అసెంబ్లీ రద్దును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ న్యాయవాది కొమిరెడ్డి రాంచందర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందు లో ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్రావును వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సీఎస్, గవర్నర్ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి, ప్రధాన ఎన్నికల అధికారి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. అసెంబ్లీ రద్దుకు గల కారణాలు కేసీఆర్ వెల్లడించలేదని, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా రద్దు జరిగిందని పిటిషనర్ పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి ప్రజా ప్రయోజనాల ఆధారంగా కాకుండా మూఢనమ్మకాలు, జ్యోతిష్యం, సంఖ్యా శాస్త్రాలపై ఉన్న నమ్మకాల ఆధారంగా అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ రద్దు సీఎం వ్యక్తిగత నిర్ణయం. ఈ నిర్ణయానికి ముందు ఆయన అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకోలేదు. మం త్రి మండలి ఉమ్మడి నిర్ణయం కూడా కాదు. కేసీఆర్ ఎప్పుడో నిర్ణయం తీసేసుకుని నిబంధనల ప్రకారం ఆమోదం కోసం ఏదో మొక్కుబడి మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. 6వ నంబర్పై ఉన్న నమ్మకం కొద్దీ మంత్రి మండలి సమావేశాన్ని సెప్టెం బర్ 6న నిర్వహించారు. 105 మందికి టికెట్లు ప్రకటించారు. శాసనసభ రద్దు విషయంలో గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించవచ్చు. పరిస్థితుల ను బట్టి రాష్ట్రపతి పాలనకు సైతం గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. లోక్సభ ఎన్నికలు 2019 మేలో జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ రద్దుపై పునరాలోచన చేయాలని గవర్నర్ మంత్రి మండలిని కోరి ఉండొ చ్చు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలపడం అప్రజాస్వామికం. అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం హడావుడిగా తయారు చేస్తోంది. అర్హులైన చాలా మందికి ఓటర్ల జాబితాలో స్థానం కల్పించలేదు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని అసెంబ్లీ రద్దును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించం డి’ అని కోర్టును పిటిషనర్ అభ్యర్థించారు. -
అసెంబ్లీ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
అసెంబ్లీ రద్దుపై పిటిషన్: హైకోర్టులో వాదనలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో సోమవారం ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డీకే అరుణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభను సమావేశపరచకుండా, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండానే అసెంబ్లీని రద్దు చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది నీరుప్రెడ్డి వాదించారు. శాసనసభను సమావేశపరచకుండా అసెంబ్లీని ఎలా రద్దు చేస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ముందస్తు రద్దును సవాల్ చేస్తూ భారీగా పిటిషన్స్ దాఖలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ చర్యను తప్పుపడుతూ దాదాపు 200 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి. కాగా తెలంగాణ ఓటర్ల జాబితా సవరణపై దాఖలైన పిటిషన్పై నేడు విచారణ కొనసాగింది. ఈ పిటిషన్పై ఈసీ కౌంటర్ దాఖలు చేయగా, దీనిపై వాదనలు వినిపించేందుకు తమకు గడువు ఇవ్వాలని పిటిషనర్ కోరగా విచారణను కోర్టు వాయిదా వేసింది. 10న విచారణ అసెంబ్లీ రద్దు పై కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కొమ్మి రెడ్డి రాములు సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీం ఆదేశాలతో హైకోర్టు లంచ్ మోషన్ పిటీషన్ గా స్వీకరించి బుధవారం విచారణను చేపట్టనుంది.70 లక్షల ఓట్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయని పిటిషనర్లు ఆరోపించారు. కాగా అసెంబ్లీ రద్దుపై దాఖలైన పిటిషన్లు అన్నింటిపై బుధవారం హైకోర్టు విచారిస్తుంది. -
ప్రశ్నించడమే ‘ముందస్తు’కు కారణమైతే ఎలా?
ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు ప్రశ్నించడం. అలా ప్రశ్నించడమే తప్పని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అంటున్నారు. అసెంబ్లీ రద్దును ప్రశ్నించినందుకే ప్రజలను, ప్రజాసంఘాలను ఆయన నిందిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెసే కారణమంటున్నారు. అసలు కారణం చెప్పడం లేదు. కేంద్రం, గవర్నర్, కేసీఆర్ కలిసి ముందస్తు ఎన్నికలకు తెర తీశారు. ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ పాత్ర అనుమానాస్పదంగానే ఉంది. రద్దుకు ముందు కేసీఆర్ బదిలీల ద్వారా నియమించుకున్న అధికారులు కూడా వారితో చేతులు కలిపితే తెలంగాణకు అపార నష్టం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికలు నవంబర్లో వస్తాయని అసెంబ్లీ రద్దు రోజే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన మాటలు నిజం కాకుండా ప్రజాస్వామిక వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం బలపడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. అభిప్రాయాలు మార్చుకో వడం తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు నైజం. పెద్ద నోట్ల రద్దు సమ యంలో, జీఎస్టీ విష యంలో ఆయన మాట మార్చారు. ప్రజలకు మేలు చేస్తాయని చెబుతున్న జమిలి ఎన్నికలపై కూడా ఆయన మాటపై నిలబడలేదు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలపై లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బీఎస్ చౌహాన్ రాసిన లేఖకు కేసీఆర్ జులై ఆరున జవాబిస్తూ జమిలి ఎన్నికలకు తాను అనుకూ లమని చెప్పారు. శాసనసభ, లోక్సభకు విడివిడిగా ఎన్నికల నిర్వహణ వల్ల నాలుగు నుంచి ఆరు నెలల కాలం అదనంగా వెచ్చించాల్సి వస్తోందని, జిల్లాల యంత్రాంగమంతా ఎన్నికల పనుల్లో మునిగి పోతుందని ముఖ్యమంత్రి తన లేఖలో చక్కగా వివ రించారు. జమిలి ఎన్నికలపై నిర్వహించిన సమావేశా నికి టీఆర్ఎస్ తరఫున హాజరైన ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ కూడా తర్వాత జమిలి ఎన్నికలతో లాభాలుంటాయని, విడివిడిగా నిర్వహిస్తే నష్టాలుం టాయని మాట్లాడారు. అయితే, జమిలి ఎన్నికలపై తాను వెలిబుచ్చిన అభిప్రాయానికి వ్యతిరేకంగా సరిగ్గా రెండు నెలలకు సెప్టెంబర్ ఆరున కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయించారు. విడివిడిగా ఎన్నికలు జరిపితే రాష్ట్రానికి, ప్రజలకు, పార్టీలకు, అభ్యర్థులకు నష్టమని తన లేఖలో చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు అదే పరిస్థితి తీసుకొచ్చారు. ముందస్తు ఎన్నికల కారణంగా రాబోయే మూడు నెలల కాలం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సరిపోతుంది. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్సభ ఎన్నికలకు ఆరు నెలల సమయం పడుతుంది. తర్వాత వచ్చే ఆరు నెలల కాలంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల హడా వుడి ఉంటుంది. ఈ లెక్కన సుమారు ఏడాది కాలం జాతీయ, రాష్ట్ర ఎన్నికలకే సరిపోతుంది. ఈ సంవ త్సర కాలంలో ప్రభుత్వాధికారులు ఇతర పనులన్నీ వదిలేసి, యుద్ధప్రాతిపదికన జరిగే ఎన్నికల విధు ల్లోనే నిమగ్నమైపోవాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి అమలులోకి వచ్చే ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అభివృద్ధి స్తంభించిపోతుంది. ప్రజా సంక్షే మంపై నిర్ణయాలు తీసుకోవడం కుదరదు. ప్రజా ధనం భారీగా ఖర్చవుతుంది. ఈ విషయాలన్నీ ఆప ద్ధర్మ సీఎంగా ఉన్న కేసీఆర్కు తెలుసని ఆయన లా కమిషన్కు రాసిన లేఖ చదివితే అర్థమవుతుంది. జమిలి ఎన్నికలు జనానికి మేలు చేస్తాయన్న తన అభిప్రాయం రెండు నెలలకే మార్చుకోవడానికి కారణాలేంటో కేసీఆరే చెప్పాలి. దాదాపు నాలుగైదు నెలలు ముందే వస్తున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా జరిగే నష్టాలకు తాను ఎందుకు ఆహ్వానం పలికా నన్న అంశంపై కేసీఆర్ వివరణ ఇచ్చి తీరాలి. జమిలి ఎన్నికలపై తన అభిప్రాయం ఎందుకు మారిందీ వివరించకుండా ముందస్తుకు తాను వెళ్లడానికి కారణం కాంగ్రెసేని కేసీఆర్ చెప్పడం ఆయన వక్ర రాజకీయ విధానానికి నిదర్శనం. తాను అసెంబ్లీని రద్దు చేయించబోతున్నాననే విషయంపై మీడియాకు లెక్కలేనన్ని లీకులు ఇచ్చారు. రద్దు ఎప్పుడు, ఎలా జరుగుతుందనే విషయంపై గంటలు, నిమిషాలవా రీగా మీడియాకు లోపాయికారిగా తెలిపి మరీ అసెం బ్లీని రద్దు చేశారు. ఈ పనికి ముందు ప్రగతి నివేదన పేరుతో తన బలప్రదర్శనకు ప్రయత్నించారు. ఇది విజయవంతం కాకున్నా తన కార్యక్రమంలో మాత్రం మార్పు లేకుండా శాసనసభను రద్దుచేయించారు. తన ప్రభుత్వాన్ని, అసెంబ్లీని రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి మాత్రం కారణం తాను కాదని, కాంగ్రెసేనని చెప్పడం కేసీఆర్కే చెల్లింది. కాంగ్రెస్ తాను ఏం చేసినా నిలదీస్తోందని, తన నిర్ణయాల వెనుక ఉండే నిజాల నీడల జాడలను వెతుకుతోందని, ఒక్క మాటలో చెప్పాలంటే అడుగ డుగునా తనను ప్రశ్నిస్తోందని కేసీఆర్ ఆక్రోశించారు. ఆయన మాటలే నిజమనుకున్నా, బాధ్యతగల ప్రతి పక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పే ముంది? నేడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నా, రేపటి ఎన్నికల తర్వాత ఆ స్థానంలోకి టీఆర్ఎస్ రావచ్చు. కాని, ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా దాని ప్రధానమైన పని ప్రశ్నించడమే. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చు కోవడానికే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాంగ్రెస్పై నింద లేస్తున్నారు. కేసీఆర్ స్వయంగా చెప్పిన విషయాలను బట్టి కేసీఆర్కు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చిన ఐదేళ్లలో తొలి ఆరు నెలల కాలం ఏమీ అర్థం కాని అయోమయస్థితిలో వృథాగా పోయింది. ముందస్తు రద్దు కారణంగా మరో పది నెలలు గడచిపోయాయి. ఈ లెక్కన ఐదు సంవత్సరాల్లో ఏడాదిన్నర కాలాన్ని ముఖ్యమంత్రి తన అసమర్ధత కారణంగా వృథా చేశారు. ఇప్పుడు లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఒకే సారి జరగని పరిస్థితిని సృష్టించడంతో భవిష్యత్తులో జరిగే ఎన్నికలు కూడా విడివిడిగా నిర్వహించక తప్పదు. జమిలి ఎన్నికలను పక్కన పెట్టి తాను విడిగా ఎన్నికలకు వెళ్లాలనుకునే పథకం వెనుక కుట్ర కోణం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార దుర్వి నియోగం చేసి, సానుకూల ఫలితాలు సాధించడం ఆయన ప్రధాన ఉద్దేశం. ఇందుకు అసెంబ్లీ రద్దు ప్రకటనకు ముందే తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను ప్రభావితం చేసిన రెండు పడకగదుల ఇళ్లు, మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాలు అనే ప్రధాన హామీలను నెరవేర్చక పోయినా, మళ్లీ ఎలాగైనా అధికారం దక్కించుకోవా లని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అధికారుల పనితీరును బట్టి కాకుండా తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు జరిగాయి. శాసనసభ రద్దుకు మంత్రివర్గ తీర్మాన లేఖను గవర్నర్కు ఇచ్చిన తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటు విషయంలో ఏం చేయాలనే అంశంపై గవర్నర్ కేంద్రాన్ని సంప్రదించలేదు. ఆప ద్ధర్మ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా కేసీఆర్కు బాధ్య తలు వెంటనే అప్పగించడం, సంబంధించిన ఉత్త ర్వులు మీడియాకు అందడం క్షణాల్లో జరిగిపో యాయి. ఎన్నికలు నవంబర్లో వస్తాయని అసెంబ్లీ రద్దు రోజే ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆయన మాటలు నిజం కాకుండా ప్రజాస్వామిక వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం బలపడేలా చర్యలు తీసుకోవా ల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. వ్యాసకర్త టీపీసీసీ ప్రధాన కార్యదర్శి -దాసోజు శ్రావణ్ -
ఇద్దరూ ముందుగానే అనుకున్నారా?
సాక్షి, హైదరాబాద్: సీఎం హోదాలో కేసీఆర్ అసెంబ్లీ రద్దు లేఖ ఇచ్చిన వెంటనే గవర్నర్ నరసింహన్ సంతకం పెట్టడమేంటని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డి.కె.సమరసింహారెడ్డి ప్రశ్నించారు. ఆర్టికల్ 356 ప్రకారం విచారణ చేయకుండా అసెంబ్లీ రద్దును ఎలా ఆమోదిస్తారని ఆయన అన్నారు. శనివారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం, గవర్నర్ల వ్యవహారం చూస్తుంటే ఇద్దరూ అనుకునే ముందస్తుగా రద్దు చేశారని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అసలు అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారో చెప్పలేకపోతున్నారని, అసెంబ్లీలో తగిన సంఖ్యాబలం ఉండి, రాష్ట్ర ఆదాయం 21.9 శాతం పెరిగితే రద్దు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు నిజాయితీగా జరగాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని, కేంద్రం ఈ విషయంలో వెంటనే చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్–టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయంటే కేసీఆర్లో భయం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీతో తాము పొత్తు పెట్టుకోవడాన్ని కేసీఆర్ తప్పుపడుతున్నారని, మరి టీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీ చేసినప్పుడు ఏమైందని వ్యాఖ్యానించారు. తాము చేస్తే శృంగారం.. వేరొకరు చేస్తే వ్యభిచారమనే రీతిలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని డి.కె. విమర్శించారు. -
నవంబర్లో శాసనసభ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ ఏడాది నవంబర్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నవంబర్లోనే ఎన్నికలు జరిపేలా ఓటర్ల జాబితా షెడ్యూల్ను సవరించింది. సాధారణ షెడ్యూల్ కంటే మూడు నెలల ముందుగానే ఈ ప్రక్రియను పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. 2019 సాధారణ ఎన్నికల కోసం గతంలో ప్రకటించిన షెడ్యూల్లో ఈ మేరకు మార్పులు చేసింది. అక్టోబరు 8న ఓటర్ల తుది జాబితాను ఖరారు చేయనుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్కుమార్ ఈ మేరకు శనివారం కొత్త షెడ్యూల్ జారీ చేశారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండేవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో పేరు ఉన్నవారికే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు. ఓటరు జాబితాలో పేరుతో పాటు గుర్తింపు కార్డు కూడా ఉండాలని పేర్కొన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఓటరు నమోదు ప్రక్రియ జరుగుతుందని రజత్కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. ఓటరు జాబితా రూపకల్పన షెడ్యూల్ పూర్తి కాగానే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ను ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత గరిష్టంగా 50 రోజులలోపు ఫలితాల ప్రకటనతో పాటు మొత్తం ప్రక్రియ పూర్తి చేయనుంది. ఓటరు జాబితా తాజా షెడ్యూల్ ప్రకారం చూస్తే డిసెంబర్ మొదటి వారంలోపే ఎన్నికల ఫలితాలు సైతం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓటర్ల జాబితా షెడ్యూల్లో మార్పులు చేసిన నేపథ్యంలో ఓటర్ల నమోదు విషయంలోనూ ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సెస్టెంబర్ 15, 16 తేదీల్లో గ్రామసభలు, స్థానిక సంస్థలో ఓటరు నమోదు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. 2018 జనవరి 1 ఆధారం... కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిర్వహిస్తుంది. జనవరి 1వ తేదీ ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తుంది. ప్రతి ఏటా జనవరి మొదటి వారంలో తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తుంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా షెడ్యూల్ ప్రక్రియలో మార్పులు జరిగాయి. పాత షెడ్యూల్ ప్రకారం 2019 జనవరి 1ని క్వాలిఫైయింగ్ తేదీగా నిర్ధారించగా, తాజా మార్పుల నేపథ్యంలో 2018 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండినవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించనున్నారు. సాధారణ ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసింది. తాజా మార్పుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో రూపొందించిన ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. -
ఇండెంట్లు వచ్చాక నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1, గ్రూప్–2 సహా ఆర్థిక శాఖ అనుమతిచ్చిన పలు పోస్టులకు సంబంధించి కొత్త జోన్ల ప్రకారం ఆయా శాఖల నుంచి ఇండెంట్లు వచ్చాకే నోటిఫికేషన్లు జారీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. కేంద్రం ఇటీవల రాష్ట్రంలో కొత్త జోన్లకు ఆమోదం తెలిపినందున వాటి ప్రకారం పోస్టులను పునర్విభజన చేయాల్సి ఉంటుందని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి, ఆయా శాఖలకు కమిషన్ లేఖలు రాసినట్లు సమాచారం. కొత్త జోన్ల ప్రకారం రోస్టర్ వివరాలిస్తే నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నట్లు సమాచారం. అసెంబ్లీ రద్దు అంశం నోటిఫికేషన్ల జారీకి అడ్డుకాదని, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే, వివిధ దశల్లో ఉన్న పోస్టుల భర్తీ యథావిధిగా కొనసాగుతుందని టీఎస్పీఎస్సీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా గ్రూప్–1 పోస్టులను రాష్ట్ర కేడర్ నుంచి మల్టీ జోన్కు మార్పు చేయడం, కొన్ని జోనల్ కేడర్లో పోస్టులను మార్పు చేసినందున కొత్త జోన్ల ప్రకారం వాటన్నింటినీ పునర్విభజన చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 140 వరకు ఉన్న గ్రూప్–1 పోస్టులు ఏ మల్టీ జోన్లో ఎన్ని పోస్టులు వస్తాయి.. వాటిని జనాభా ప్రాతిపదికన విభజించాలా.. మరేదైనా ఉందా.. అన్న విషయాన్ని ప్రభుత్వం, ఆయా శాఖలు తేల్చుకొని విభజించాల్సి ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. జోనల్ పోస్టులను కూడా కొత్త జోన్ల ప్రకారం ఎలా విభజించాలన్నది నిర్ణయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఆయా శాఖలు నిర్ణయించి కొత్త జోన్ల ప్రకారం రోస్టర్, పోస్టుల కేటాయింపుతో కూడిన ఇండెంట్లు ఇచ్చాకే నోటిఫికేషన్లు జారీ చేయొచ్చని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం, ఆయా శాఖలు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాయో.. ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని జిల్లా పోస్టులకు మాత్రం పెద్దగా ఇబ్బంది లేకపోయినా జిల్లాల వారీగా రోస్టర్ ఇస్తే వాటి భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
ముందస్తు కసరత్తు: ఢిల్లీకి రజత్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల నిర్వహణ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, అవసరాలపై 31 జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశమైంది. ఈవీఎంల పనితీరు, సిబ్బంది అవసరాలు, శాంతిభద్రతల సమస్యలపై సమీక్ష చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో మొదటిసారి వీవీపీఏటీ ప్రవేశపెడుతున్న క్రమంలో వాటిపై కలెక్టర్లకు అవగాహన కల్పించారు. ఢిల్లీకి రజత్ కుమార్ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ రద్దైన క్రమంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణపై రజత్ కుమార్తో సీఈసీ చర్చించనుంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం పిలుపు మేరకు రజత్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. -
డిసెంబర్లోనే ఎన్నికలు..?
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై శుక్రవారం జరిగే భేటీలో ఎన్నికల కమిషన్ (ఈసీ) చర్చించనుంది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఈసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో సత్వరమే ఎన్నికలు నిర్వహించాలా లేక మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరపాలా అనే అంశంపై ఈసీ కసరత్తు సాగించనుంది. ఈసీ ప్రతి మంగళవారం, శుక్రవారం సమావేశమయ్యే క్రమంలో తెలంగాణ అసెంబ్లీ రద్దు అనంతర పరిణామాలు,ఎన్నికల నిర్వహణపై నేటి సమావేశంలో చర్చకు రావచ్చని సీనియర్ అధికారి వెల్లడించారు. తుది నిర్ణయం తీసుకునే ముందు పండుగలు, పరీక్షలు, వాతావరణం వంటి పలు అంశాలను ఈసీ బేరీజు వేస్తుందని చెప్పారు. జూన్ 2019 వరకూ అసెంబ్లీకి గడువున్నాపార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు విముఖత చూపుతూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దుకు పూనుకున్నారు. అసెంబ్లీని రద్దు చేస్తూ గురువారం రాష్ట్ర కేబినెట్ చేసిన తీర్మానాన్ని సీఎం కేసీఆర్ గవర్నర్కు అందచేశారు. అసెంబ్లీ రద్దు తీర్మానానికి ఆమోదముద్ర వేసిన గవర్నర్ నరసింహన్ తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకూ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కేసీఆర్ను కోరిన విషయం తెలిసిందే. -
పొలిటికల్ గేమ్లో నిలిచేదెవరు ? గెలిచేదెవరు?
-
‘లిక్కర్ ఆదాయాన్ని కూడా ఆర్థిక ప్రగతేనన్న కేసీఆర్’
సాక్షి, న్యూఢిల్లీ : అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. పోయే కాలమొచ్చి కేసీఆర్ శాసన సభను రద్దు చేశారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన కేసీఆర్ ముందస్తు ఎన్నికల పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు. తొమ్మిది నెలల ముందుగా ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలన అబద్ధాలు, మోసాలతో నిండిపోయిందని అన్నారు. అధికారం నుంచి దిగిపోతున్నప్పుడు కూడా కేసీఆర్ అబద్ధాలు చెప్పడాన్ని ప్రజలు గమనించాలని అన్నారు. ఆర్థికంగా తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్తున్న కేసీఆర్ మాటలు వంద శాతం అబద్ధమని చెప్పారు. లిక్కర్ అమ్మాకాల్లో, రైతు ఆత్మహత్యల్లో, అప్పుల్లో తెలంగాణను కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలిపారని ధ్వజమెత్తారు. తెలంగాణ కంటే 6 రెట్లు అధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ మద్యం అమ్మకాల ద్వారా 19 వేల కోట్ల ఆదాయం పొందుతుంటే.. నాలుగు కోట్ల తెలంగాణ 20 వేల కోట్ల ఆదాయం పొందుతోందని తెలిపారు. లిక్కర్ దందాలను కూడా ఆర్థిక వృద్ధి అని చెప్తున్న కేసీఆర్ దిగజారుడు తనం సిగ్గుచేటని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిలో తెలంగాణ నెంబర్వన్ స్థానంలో నిలిచిందని అబద్ధాలు చెప్తున్న కేసీఆర్ ఎన్ని హామీలు నెరవేర్చాడో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన కేసీఆర్కు ఆ వర్గం వారు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గిరిజనుకుల 3 ఎకరాల భూమి, ఇంటింటికి ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ముస్లిం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు.. ఈ హామీలు ఎంతవరకు నెరవేర్చారని ఉత్తమ్ కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు. గాంధీ కుటుంబాన్ని తిట్టడం అనైతికం తెలంగాణ ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని తిట్టిన కేసీఆర్ బాగుపడడని ఉత్తమ్ అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై కేసీఆర్ చేస్తున్న అహకార పూరిత, అవమానకర వ్యాఖ్యలను యావత్ తెలంగాణ సమాజం ఖండిస్తోందని అన్నారు. బందిపోటు దొంగల ముఠాలాగా.. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని విమర్శించారు. రాబోయే ఎన్నికలు నలుగురు సభ్యులున్న కేసీఆర్ కుటుంబానికి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య పోరు అని వ్యాఖ్యానించారు. -
డీఎస్పై సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
-
అసెంబ్లీ రద్దు..105 స్థానాలకు అభ్యర్ధుల ప్రకటన..
-
సరైన కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేశారు
-
కేసీఆర్ ప్రెస్మీట్: ప్రధాన అంశాలు!
సాక్షి, హైదరాబాద్ : అనుకున్నట్టే అసెంబ్లీని రద్దు చేసి ఉత్కంఠ పెంచిన తెలంగాణ సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను గురువారం ప్రకటించారు. టీఆర్ఎస్ భవన్లో అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్ నిరాకరించామన్నారు. హుస్నాబాద్ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుడతామని చెప్పారు. వంద సీట్లు పక్కా టీఆర్ఎస్ వంద స్ధానాల్లో విజయం సాధిస్తుందని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 50 రోజుల్లో వంద సభలను ఏర్పాటు చేసి తమ ఆలోచనలను ప్రజల ముందుంచుతామన్నారు. టీఆర్ఎస్ భవన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. నవంబర్లోనే ఎన్నికలు ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరిగి డిసెంబర్ మొదటివారంలో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని అంచనా వేశారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే రాష్ర్టంలో ఎన్నికలు జరుగుతాయన్నారు. తెలంగాణ ప్రగతి రధ చక్రం ఆగకుండా కొనసాగాలంటే రాష్ర్టం మళ్లీ టీఆర్ఎస్కే అప్పగించాలని ప్రజలను కోరారు. తెలంగాణకు మేలు చేసే నిర్ణయాలనే తాము తీసుకుంటామనే విశ్వాసం ప్రజలకు ఉందన్నారు. బీజేపీకి దూరం రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లౌకిక పార్టీగా కొనసాగుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ ఉన్న సీట్లను కాపాడుకుంటే గొప్పని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నేతలు లేనిపోనివి ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీతో పొత్తు ఉండదని స్వయంగా బీజేపీ చీఫ్ అమిత్ షా చెప్పారని కేసీఆర్ గుర్తుచేశారు. మతతత్వ ఎంఐఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరించే పార్టీతో పొత్తు పెట్టుకోబోమని అమిత్ షానే అన్నారని చెప్పారు రాహుల్ ఓ బఫూన్ కాంగ్రెస్, బీజేపీలను తీవ్రంగా విమర్శించిన కేసీఆర్ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని దేశంలోనే అతిపెద్ద బఫూన్గా అభివర్ణించారు. పార్లమెంట్లో ప్రధాని మోదీని కౌగిలించుకోవడం, చట్టసభలోనే కన్నుగీటడం వంటి చేష్టలతో రాహుల్ నవ్వులపాలయ్యారన్నారు. ఏ ఒక్క రాష్ర్టంలో కాంగ్రెస్ 20 సీట్లను గెలుచుకునే స్థితిలో లేదన్నారు. -
‘ఇక మా గెలుపు ఎవరూ ఆపలేరు’
సాక్షి, హైదరాబాద్ : కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లో సగం మందికిపైగా డిపాజిట్ కూడా రాదని కాంగ్రెస్ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన చూస్తే ఇక కాంగ్రెస్ గెలుపు ఎవరూ ఆపలేరని అర్థమవుతుందన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. అభ్యర్థుల జాబితాతో సీఎం సెల్ఫ్గోల్ నెరవేర్చుకున్నారని విమర్శించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని అందుకు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితానే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా అభ్యర్థులను ఎంపిక చేస్తే 100 సీట్లు రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. గెలిచే అభ్యర్థుల కోసం పార్టీల్లో కొట్లాడుతానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కొడుకును సీఎం చేయడం కోసమే ముందస్తు : వీహెచ్ కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడం కోసమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు ఆరోపించారు. నిజామాబాద్లోని కల్లూరు గ్రామంలో ఆయన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి సోనియా గాంధీకి అప్పజెప్పడమే తన లక్ష్యమన్నారు. ‘కల్లూరు గ్రామం నుంచి మట్టిని తెచ్చి గాంధీ భవన్లో పెడతా. కేసీఆర్ను గద్దె దించి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే గ్రామంలో చల్లుతానని శపధం చేశారు. ఎన్నికల మేనిపెస్ట్ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. -
డి.శ్రీనివాస్పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు పిలుపునిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్పై కే చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్ ఇష్టపూర్వకంగానే పార్టీలో చేరారని తెలిపారు. మొదట పార్టీ అడ్వయిజర్గా నియమించి ఆయనను గౌరవించామని తెలిపారు. డీఎస్ కోరిక మేరకు రాజ్యసభకు కూడా పంపామని కేసీఆర్ వెల్లడించారు. అయితే, డీఎస్ కొడుకు అరవింద్ వేరే పార్టీలోకి వెళ్లడంతో టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతోందని నిజామాబాద్ నాయకులు ముక్త కంఠంతో తనకు ఫిర్యాదు చేశారని కేసీఆర్ తెలిపారు. కొడుకు వ్యవహారంపై డీఎస్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం బాగోలేదని అన్నారు. ఇష్టం మేరకు టీఆర్ఎస్లో చేరిన డీఎస్ను తగిన విధంగా గౌరవించుకున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. శ్రీనివాస్ టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. పార్టీలో ఉండాలనుకోవడం, వెళ్లాలనుకోవడం ఆయన సొంత విషయమనీ, ఎవరూ ఆయనను బలవంత పెట్టరని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
అసెంబ్లీకి బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఊహాగానాలకు తెరదించుతూ కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయడంతో పాటు 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో దాదాపు అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఖరారు చేసిన గులాబీ అధినేత.. పార్టీలోకి కొత్తగా చేరిన వారి కోసం కొన్ని మార్పులు చేశారు. ముందుగా ఊహించినట్లుగానే పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ను అసెంబ్లీకి పంపేందుకే నిర్ణయించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా సుమన్ను ప్రకటించారు. చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టికెట్ నిరాకరించి.. ఆ స్థానాన్ని సుమన్కు కట్టబెట్టారు. మాజీ ఎంపీ గడ్డం వివేక్ తిరిగి టీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో.. వివేక్ లోక్సభకు పంపించేందుకే బాల్క సుమన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దించారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్లోకి వచ్చిన వివేక్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో.. ఆయన స్థానంలో గత ఎన్నికల్లో విద్యార్థి నాయకుడైన సుమన్కు కేసీఆర్ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వివేక్పై సుమన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, అనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో వివేక్ మళ్లీ టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ను ఖరారు చేసినట్టు కథనాలు వచ్చాయి. ఈ సర్దుబాటులో భాగంగానే సుమన్ అసెంబ్లీకి పంపినట్టు వినిపిస్తోంది. ఇక, పెద్దపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మోహన్రెడ్డికి మరోసారి టికెట్ కన్ఫామ్ చేశారు. -
బీజేపీతో కలిసేది లేదు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రసక్తి లేదని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లౌకిక పార్టీగా కొనసాగుతుందన్నారు. తెలంగాణలో బీజేపీ ఉన్న సీట్లను కాపాడుకుంటే గొప్పని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నేతలు లేనిపోనివి ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీతో పొత్తు ఉండదని స్వయంగా బీజేపీ చీఫ్ అమిత్ షా చెప్పారని కేసీఆర్ గుర్తుచేశారు. మతతత్వ ఎంఐఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరించే పార్టీతో పొత్తు పెట్టుకోబోమని అమిత్ షానే అన్నారని చెప్పారు. రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి జేడీ(యూ) అభ్యర్థికి మద్దతివ్వడం నితీష్తో తనకున్న స్నేహమే కారణమని, స్వయంగా ఆయన తనకు ఫోన్ చేసి మద్దతు కోరినందునే సహకరించామని చెప్పారు. అది అంశాలవారీగా తీసుకున్న నిర్ణయమేనని రాజకీయంగా తమది సెక్యులర్ పార్టీని, అలాగే కొనసాగుతామని స్పష్టం చేశారు. -
బాబుమోహన్కు దక్కని అసెంబ్లీ టికెట్
సాక్షి, హైదారాబాద్ : కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ప్రముఖ హాస్యనటుడు, ఆందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్కు చేదు అనుభవం మిగిలింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాబుమోహన్కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ నిరాకరించారు. ఆయన స్థానంలో ప్రముఖ జర్నలిస్టు నాయకుడు చంటి క్రాంతికిరణ్కు అవకాశం కల్పించారు. దీంతో తెలంగాణ జర్నలిస్టు ఫోరం తరఫున ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జర్నలిస్టు నాయకుడికి అవకాశం దక్కినట్టు అయింది. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్న క్రాంతికుమార్ పలు టీవీ చానెళ్లలో పని చేశారు. ఇక, మరో విద్యార్థి నాయకుడు పిడమర్తి రవి సత్తుపల్లి నుంచి మరోసారి అవకాశం ఇచ్చారు. మంత్రులుగా ఉన్న వారందరికి వారి సొంత నియోజకవర్గాల్లో సీట్లు ప్రకటించారు. ప్రముఖుల అసెంబ్లీ స్థానాలు గజ్వేల్ - కేసీఆర్ సిరిసిల్ల-కేటీఆర్ సిద్దిపేట- హరీశ్రావు సూర్యాపేట - జి. జగదీశ్ రెడ్డి భూపాలపల్లి- మధుసుదనాచారి బాన్సువాడ- పోచారం శ్రీనివాసరెడ్డి -
వంద స్ధానాల్లో గెలుస్తాం : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ :టీఆర్ఎస్ వంద స్ధానాల్లో విజయం సాధిస్తుందని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 50 రోజుల్లో వంద సభలను ఏర్పాటు చేసి తమ ఆలోచనలను ప్రజల ముందుంచుతామన్నారు. టీఆర్ఎస్ భవన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పేదల గురించి ఆలోచించదని ఆరోపించారు. సమైక్య పాలనలో సంక్షేమం కుంటుపడటంతో తాము అణగారిన వర్గాలను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పుకొచ్చారు. సంపద పెంచడం..పేదలకు పంచడం తమ విధానమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని విపక్షాలకు సవాల్ విసిరారు. -
అసెంబ్లీ రద్దు : ఎందుకంత తొందర..!?
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయం హీటెక్కింది. గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ... తెలంగాణ తొట్టతొలి అసెంబ్లీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేడు రద్దు చేశారు. తొమ్మిది నెలలు ముందుగా అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా.. మరో సంచలన నిర్ణయాన్ని కూడా కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ రద్దు రోజే 105 అభ్యర్థుల జాబితాను వెల్లడించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా యూజర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. కొంతమంది అభినందనలు చెబుతుండగా.. మరికొంత మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని, ముందస్తు ఎన్నికలకు శుభాకాంక్షలంటూ కొందరు యూజర్లు తెలుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాల్లో రాజకీయం మాత్రమే ఉంటుందని, అదే టీఆర్ఎస్ పార్టీ తీసుకునే నిర్ణయాల్లో రాజకీయం, తెలంగాణ రెండూ ఉంటాయని, ఈసారి మా ఓటు టీఆర్ఎస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే రాజకీయంలో హీట్ తప్ప ఇంకేమీ మార్పు ఉండదని, మన పని మనం చేసుకుంటూ.. ఓటింగ్ రోజు మన అభిప్రాయం చెప్పడమే మన బాధ్యత అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. ప్రజాపాలన చేయలేక తప్పించుకున్న వ్యక్తికి మరోసారి పట్టం కట్టవద్దని, ఓడిపోవడానికి ఎందుకంత తొందర అంటూ కూడా అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ను విమర్శిస్తున్నారు. అభినవ నిజాం పాలన నేటితో అంతమైందని, తెలంగాణ ప్రజల్లో సంతోషం వెల్లువెత్తుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. నయా నిజాం విమోచన సెప్టెంబర్ 6వ తేదీ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే అసెంబ్లీని ఎలా రద్దు చేశారని, 2019లో మీకేం పని ప్రజలతో అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్తే బాగుంటుందని మరో యూజర్ కామెంట్ పెట్టాడు. మరోవైపు కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు అని, అందుకే నేడు అసెంబ్లీని రద్దు చేసి, అభ్యర్థుల జాబితాను ప్రకటించేశారని మరో యూజర్ కామెంట్ చేశాడు. ‘అన్నా మీది మాస్టర్ బ్రెయిన్, కాంగ్రెస్కు కొంచెం కూడా సమయం ఇవ్వడం లేదు’ అని మెచ్చుకుంటున్నారు. -
టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే
సాక్షి, నిజామాబాద్ : రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీకి ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని బీజేపీ నేత యెండల లక్ష్మీనారాయణ అన్నారు. అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో కేసీఆర్.. ప్రజలకు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ రద్దు నేపథ్యంలో తమ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగానే ఉందన్నారు. ఈ నెలలో(సెప్టెంబరు) బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పర్యటన ప్రారంభించి.. పాలమూరు నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెలిపారు. -
నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ర్ట అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ఏడాది నవంబర్లో ఎన్నికలు జరిగి డిసెంబర్ మొదటివారంలో ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని అంచనా వేశారు. మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే రాష్ర్టంలో ఎన్నికలు జరుగుతాయన్నారు. తెలంగాణ ప్రగతి రధ చక్రం ఆగకుండా కొనసాగాలంటే రాష్ర్టం మళ్లీ టీఆర్ఎస్కే అప్పగించాలని ప్రజలను కోరారు. తెలంగాణకు మేలు చేసే నిర్ణయాలనే తాము తీసుకుంటామనే విశ్వాసం ప్రజలకు ఉందన్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న హామీలన్నింటినీ నెరవేర్చామని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో పొందుపరచని పలు పధకాలను ప్రవేశపెట్టామన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను మేనిఫెస్టోలో లేకున్నా ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు. -
అసెంబ్లీ రద్దుపై గవర్నర్ ఆమోదం.. ఈసీకి అందజేత
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రద్దు తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాజ్భవన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ను ఈసీ, అసెంబ్లీ కార్యదర్శికి రాజ్భవన్ వర్గాలు పంపాయి. ఈ మేరకు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రెస్నోట్ రిలీజ్ చేశారు. ఆ వివరాలు.. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు గవర్నర్ను ఈ రోజు(06-09-2018) కలిసి తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా తీర్మానించిన ప్రతిని గవర్నర్కు సమర్పించారు. సీఎంతోపాటు ఆయన మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ ఆమోదించారు. కేసీఆర్తోపాటు ఆయన మంత్రివర్గాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగించాల్సిందిగా గవర్నర్ కోరారు. గవర్నర్ వినతికి కేసీఆర్ అంగీకరించారు అని రాజ్భవన్ తన ప్రకటనలో వెల్లడించింది. -
105 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను ప్రకటిస్తున్నామని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్ నిరాకరించామన్నారు. హుస్నాబాద్ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుడతామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందన్నారు. అనేక త్యాగాల, పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధిని ప్రధాని, పలు రాష్ర్టాల సీఎంలు ప్రశంసించారన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులపై విపక్షాలు ప్రజల్ని తప్పుదారి పట్టించాయని విమర్శించారు. స్వల్పకాలంలోనే తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు. దేశంలోనే నెంబర్ వన్గా తెలంగాణ దూసుకుపోతోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో కమీషన్లు దండుకున్నామని విపక్షాలు బురదచల్లుతూ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. అంతకుముందు క్యాబినెట్ సమావేశంలో అసెంబ్లీని రద్దు చేస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. కేబినెట్ తీర్మానాన్ని రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్కు సీఎం కేసీఆర్ అందించారు. కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదిస్తూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ను గవర్నర్ కోరారు. -
తన గొయ్యి తానే తవ్వుకున్నాడు : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : నియంతృత్వ, నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్... సరైన కారణం లేకుండా అసెంబ్లీని రద్దు చేశారని మండిపడ్డారు. గడువు ముగియకముందే అసెంబ్లీని రద్దు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర్ రావు తన గొయ్యి తానే తవ్వుకున్నారని వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉందని, తాము క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ రద్దు
-
అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రిమండలి సమావేశంలో ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. గురువారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో తన అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీలో అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మంత్రులంతా ఆమోదం తెలిపినట్టు సమాచారం. శాసనసభ రద్దు సిఫారసుకు సంబంధించిన తీర్మానంపై మంత్రుల సంతకాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ నరసింహన్ను కలిసి కేబినెట్ తీర్మానం కాపీని అందజేశారు. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్వహించే విలేకరుల సమావేశంలో కేబినెట్ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా వెలువరించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను కూడా ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. అంతకుముందు రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. శాసనసభను రద్దు చేయడానికి రంగం సిద్ధం చేసిన సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. ముందే సిద్ధం చేసుకున్న ఏకవాక్య తీర్మానాన్ని మంత్రుల ముందుంచారు. అసెంబ్లీ రద్దు అధికారాన్ని అంతకుముందే కేసీఆర్కు కట్టబెట్టిన మంత్రులు తీర్మానంపై వెంటనే సంతకాలు చేశారు. అరగంటలో కేబినెట్ భేటీ ముగిసింది. తీర్మానం కాపీని తీసుకుని మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రాజ్భవన్కు వెళ్లారు. కేబినెట్ తీర్మానం కాపీని గవర్నర్ నరసింహన్కు అందజేశారు. అసెంబ్లీ రద్దు గురించి ఆయనకు నివేదించారు. కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించారు. అసెంబ్లీని రద్దు చేస్తూ రాజ్భవన్ ప్రకటన ఇవ్వనుంది. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి, అసెంబ్లీ కార్యదర్శికి పంపనున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరపాలనే దానిపై ఈసీ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కేసీఆర్ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరారు. -
అప్డేట్స్: ఎమ్మెల్యే కాంపు కార్యాలయాలు ఖాళీ చేయండి!
సాక్షి, హైదరాబాద్: ముందుస్తు ఎన్నికల దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించింది. గురువారం మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకునున్నారు. అసెంబ్లీ రద్దుపై వ్యూహాలు అవలంభించాలన్న దానిపై ప్రతిపక్షాలు చర్చోపచర్చలు జరుపుతున్నాయి. బీజేపీ నేతలు గవర్నర్ను కలవాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. . ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరని కోదండరాం అన్నారు. తెలంగాణ శాసనసభ రద్దుకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ కోసం.. ఎమ్మెల్యేల కాంపు కార్యాలయాలు ఖాళీ చేయండి! రానున్న ఎన్నికల కోసం ప్రకటించిన 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని, వెంటనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ఖాళీ చేయాలని కేసీఆర్ అభ్యర్థులకు సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. చదవండి పూర్తి కథనం : ఎమ్మెల్యే అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం నిప్పులు చెరుగుతున్న ప్రతిపక్షం! సాయంత్రం 5. 30 గంటలు: అసెంబ్లీని రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన సీఎం కేసీఆర్పై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ తెలంగాణ బఫూన్ అని, ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. చేసిన తప్పులన్నీ కేసీఆర్ కాంగ్రెస్ మీద నెట్టుతున్నారని రేవంత్రెడ్డి తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదా కూడా రాదని కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని మరో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ హితవు పలికారు. కారణాలు చెప్పకుండానే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని తప్పుబట్టారు. ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏముందో కేసీఆర్ చెప్పాలని బీజేపీ నేత లక్ష్మణ్ నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అసెంబ్లీని రద్దు చేయడం సరికాదన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పును కేసీఆర్ వమ్ము చేశారని బీజేపీ నేత కిషన్రెడ్డి మండిపడ్డారు. కుటుంబపాలనకు తెరలేపిన కేసీఆర్.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. చదవండి: దిగిపోయేటప్పుడూ కేసీఆర్వి అబద్ధాలే... కేసీఆర్ పెద్ద బఫూన్... ‘ ఇక మా గెలుపు ఎవరూ ఆపలేరు’ సాయంత్రం 4.30 గంటలు : ఆపద్ధర్మ సీఎం కేసీఆర్పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలను కేసీఆర్ అన్నివిధాలుగా మోసంచేశారని మండిపడ్డారు. మద్యం అమ్మకాల్లో, రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉందని, తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేశానని కేసీఆర్ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. పోయేకాలం వచ్చి శాసనసభను కేసీఆర్ రద్దు చేశారని దుయ్యబట్టారు. స్థాయి మరచి, విజ్ఞత మరిచి ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాహుల్గాంధీపై వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. ప్రెస్మీట్లో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు. తెలంగాణ ప్రజలు వర్సెస్, కేసీఆర్ కుటుంబంగా ఈ ఎన్నికలు జరగనున్నాయని, కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు తరిమికొడతారని పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయం హీటెక్కింది. అసెంబ్లీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేడు రద్దు చేశారు. తొమ్మిది నెలలు ముందుగా అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా.. రద్దు చేసిన రోజే 105మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా ఏమంటోంది. అభినందనలు.. విమర్శలు ఎలా ఉన్నాయి. చదవండి: అసెంబ్లీ రద్దు : ఎందుకంత తొందర..!? ముగిసిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం.. 1 గంట 20 నిమిషాలపాటు విలేకరులతో మాట్లాడిన కేసీఆర్ మధ్యాహ్నం 3.30 గంటలు: కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాతో అనేక ఊహాగానాలకు తెరపడింది. పలు విషయాల్లో స్పష్టత వచ్చింది. సీనియర్ నేత వివేక్ తిరిగి టీఆర్ఎస్లోకి రావడంతో పెద్దపల్లి ఎంపీగా ఉన్న విద్యార్థి నేత బాల్క సుమన్ అసెంబ్లీకి షిఫ్ట్ అయ్యారు. బాల్క సుమన్ చెన్నూరు నుంచి పోటీ చేయనున్నారు. దీంతో పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి మళ్లీ వివేక్కు లైన్ క్లియర్ అయినట్టుంది. ఇక సినీ నటుడు బాబుమోహన్కు చేదు అనుభవం మిగిలింది. ఆయన స్థానంలో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జర్నలిస్టు క్రాంతికూమార్కు ఆందోల్ సీటు లభించింది. ఇక కేసీఆర్ కుమార్తె కవిత అసెంబ్లీకి మారుతారన్న ఊహాగానాలకు సైతం తెరపడింది. నిజామాబాద్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీటు ఇవ్వడంతో ఆమె అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం లేదని స్పష్టత వచ్చినట్టు అయింది. టీఆర్ఎస్ వంద స్ధానాల్లో విజయం సాధిస్తుంది.. 50 రోజుల్లో వంద సభలను ఏర్పాటు చేసి మా ఆలోచనలను ప్రజల ముందుంచుతాం.. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ధీమా.. పూర్తి కథనం కోసం చదవండి: వంద స్ధానాల్లో గెలుస్తాం : కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలు: ప్రెస్మీట్లో కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని వెలువరించారు. అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం సీఎం కేసీఆర్ మళ్లీ గజ్వెల్ నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు. చెన్నూరు, ఆందోల్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. వారికి ముందే సమాచారం ఇచ్చామని, వారికి తగినవిధంగా గౌరవించుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఇక 14స్థానాల్లో అభ్యర్థుల పేర్లు పెండింగ్లో ఉంచారు. చదవండి పూర్తి కథనం: 105 మంది అభ్యర్ధులను ప్రకటించిన కేసీఆర్ మధ్యాహ్నం 3 గంటలు : ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన కేసీఆర్ ప్రతిపక్షాలు కాకిగోల చేస్తున్నాయి.. ప్రతిపక్ష నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కోర్టు స్టేలు తీసుకొచ్చి అడ్డుకుంటున్నారు రాష్ట్రంలోఅసహన వైఖరి కనిపిస్తోంది రౌండ్ టేబుల్స్, వాళ్ల బొంద టేబుల్స్ అని పెడుతున్నారు ఒక్కటంటే ఆధారం లేకుండా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న ఈ సన్నాసులంతా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినవారే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి విద్యుత్ కొనుగోలు చేసి కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నాం తెలంగాణకు విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రానికి బిగ్గెస్ట్ పీడ కూడా ఆ పార్టీయే అనేక త్యాగాల ఫలితం తెలంగాణ అనేక త్యాగాలు, పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చింది: సీఎం కేసీఆర్ రాష్ట్రం బాధ్యతయుతంగా ముందుకుసాగాలనే ఆలోచనతోనే గత ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాం : సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో స్పష్టమైన మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్నారు: సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2.50 గంటలు: ప్రారంభమైన కేసీఆర్ మీడియా సమావేశం.. మధ్యాహ్నం 2: 35 : ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ బయలుదేరిన కేసీఆర్ మధ్యాహ్నం 1: 45 : అసెంబ్లీ రద్దుపై కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్కు కేసీఆర్ అందించారు. కేబినెట్ తీర్మానాన్ని గవర్నర్ ఆమోదించారు. దీంతో ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ప్రక్రియ పూర్తయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ను గవర్నర్ కోరారు. మధ్యాహ్నం 1.30: రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్కు సీఎం కేసీఆర్, మంత్రులు కలిశారు. అసెంబ్లీ రద్దు గురించి గవర్నర్కు నివేదించారు. మధ్యాహ్నం 1.06: ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలిలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రి మండలి నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 12.50: ఓటమి భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా లేరని చెప్పారు. మధ్యాహ్నం 12.35: కాసేపట్లో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో మంత్రులు ప్రగతి భవన్కు తరలివస్తున్నారు. కేబినెట్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మధ్యాహ్నం 12.00: తెలంగాణ అసెంబ్లీ రద్దు, ముందుస్తు ఎన్నికలపై చర్చ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, సీనియర్ నేత జైపాల్ రెడ్డి హాజరయ్యారు. ఉదయం 11.30: కేసీఆర్ వ్యవహార శైలికి నిరసనగా కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఉదయం 10.57: బీజేపీ నాయకులు గవర్నర్ నరసింహన్ అపాయింట్మెంట్ కోరారు. శాసనసభ రద్దైతే రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నాయకులు కోరనున్నారని సమాచారం. ఉదయం 10.50: స్పీకర్ మధుసూదనాచారితో అసెంబ్లీ కార్యదర్శి పత్ర్యేకంగా సమావేశమయ్యారు. అసెంబ్లీ రద్దైతే తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఉదయం 10.45: మంత్రులందరూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్లో ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు ప్రగతి భవన్కు చేరుకుంటున్నారు. అంతకుముందు సమాచారం... గురువారం ఉదయం హైదరాబాద్లో అందుబాటులో ఉండాలని మాత్రమే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మంత్రులకు సూచించారు. మంత్రివర్గ సమావేశం ఎప్పుడు ఉంటుంది? ఎజెండా ఏమిటన్న విషయాలు మాత్రం గోప్యంగానే ఉంచారని ఓ సీనియర్ మంత్రి బుధవారం రాత్రి ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. జీఏడీ అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రివర్గ సమావేశం ఉంటుంది. 1–30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్ను కలిసి కేబినెట్ తీర్మానం కాపీని అందజేస్తారు. అనంతరం గన్పార్క్ వద్దకు చేరుకుని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం రెండు గంటలకు కేసీఆర్ టీఆర్ఎస్ భవన్కు చేరుకుని మీడియా సమావేశంలో మాట్లాడతారు. శాసనసభ రద్దుకు సంబంధించి గురువారం సాయంత్రం ప్రకటన వెలువడగానే.. శుక్రవారం ఉదయం సిద్దిపేట జిల్లాకు బయలుదేరి వెళతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం తరువాత హుస్నాబాద్కు చేరుకుంటారు. బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. నేటి సాయంత్రం నుంచి ఆపధర్మ ప్రభుత్వం శాసనసభ రద్దుకు సంబంధించి గవర్నర్ నరసింహన్ సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేస్తారని, అదేసమయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని కేసీఆర్ను కోరతారని అధికార వర్గాలు వెల్లడించాయి. శాసనసభ రద్దయిన వెంటనే 119 మంది ఎమ్మెల్యేలు తమ సభ్యత్వం కోల్పోతారు. అయితే ముఖ్యమంత్రి, మంత్రివర్గ సహచరులు యధావిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వారి జీతభత్యాలు, అలవెన్సుల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే దాకా ఆపధర్మ మంత్రిమండలిగా కొనసాగాలని గవర్నర్ తన నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆపధర్మ ప్రభుత్వానికి అధికారాలు ఉండవు. -
జిల్లాకు..‘ముందస్తు’ ఫీవర్!
ప్రభుత్వం రద్దు దాదాపు ఖరారయినట్లేనన్న వార్తలు జిల్లాలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని, గురువారం ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పత్రికల్లో, మీడియాలో బుధవారం వచ్చిన వార్తలతో రాజకీయ పార్టీలూ అప్రమత్తమవుతున్నాయి. ఆయా పార్టీల శ్రేణుల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు గురువారం నియోజకవర్గాన్ని చుట్టారు. విరివిగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో రోజంతా బిజీగా గడిపారు. సాక్షిప్రతినిధి, నల్లగొండ : కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికలపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆదివారం టీఆర్ఎస్ కొంగరకలాన్లో నిర్వహించిన ప్రగతి నివేదన సభ ఒక విధంగా ఆ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించడమేనని భావించిన ఆయా పార్టీల నాయకులు నియోజకవర్గాల్లో తమ పరిస్థితి ఏమిటన్న అంశంపై బేరీజులు వేయడం మొదలు పెట్టారు. ఇక, బుధవారం నాటి వార్తలతో ఒక్కసారిగా అప్రమత్తమైన నాయకులు తమ అనుచరులను పిలిపించుకుని పరిస్థితిని అంచనా వేయడం మొదలు పెట్టారు. ప్రభుత్వ రద్దుకు ముహూర్తం కూడా ఖరారైందన్న ప్రచారంతో జిల్లాను ముందస్తు ఫీవర్ పట్టి ఊపుతోంది. ఎమ్మెల్యేలు బిజీబిజీ ముందస్తు సంకేతాలు ముందే అందుకున్నట్లు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం తమ తమ నియోజకవర్గాల్లో బిజీబిజీగా గడిపారు. ఇప్పటికే పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు, కచ్చితంగా మొదలు పెట్టాల్సిన పనులకు శంకుస్థాపనలు చేసుకునే పనిలో పడ్డారు. అధినాయకత్వం సూచన మేరకు వారు ఈ పనుల్లో మునిగిపోయారు. కట్టంగూర్లో పీఏసీఎస్ భవనం, ముత్యాలమ్మగూడెంలో జీపీ భవనాన్ని ఎమ్మెల్యే వీరేశం ప్రారంభించా రు. నకిరేకల్లో క్యాంప్ కార్యాలయాన్ని మంత్రి జగదీశ్రెడ్డితో ప్రారంభించుకున్నారు. నకిరేకల్ మండ లం పాలెం గ్రామపం చాయతీ శివారులోని అర్దవారిగూడెంలో రూ.34లక్షల తో బ్రిడ్జి నిర్మాణం, నోముల, వల్లభాపురం గ్రామాల లో రూ.7 లక్షల చొప్పున ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుసా ్థపన చేశా రు. చిట్యాల, కట్టంగూర్, కేతేపల్లిలో భారీగా కల్యాణలక్ష్మి, ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ పీఏపల్లిలో రూ.25లక్షలతో, భీమనపల్లిలో రూ.7.5లక్షలతో నిర్మించనున్న షెడ్యూల్ కులాల కమ్యూనిటీ భవనం, భీమనపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, గుడిపల్లి ప్రాథమిక, అజ్మాపురం ఉన్నత పాఠశాలలకు రూ.7.5 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణపనులకు శంకస్థాపన చేశారు. అలాగే చిల్కమర్రి, అజ్మాపురం, చిల్కమర్రి స్టేజీలలో రూ.8లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాలను, రూ.10లక్షలతో నిర్మించిన అంగన్వాడీ, గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభించారు. ఒక్కసారి ప్రభుత్వం రద్దయితే ఎమ్మెల్యేలంతా మాజీలు కావడం ఖాయమని, ఆ తర్వాత అధికార కార్యక్రమాలు ఏమీ చేపట్టలేమన్న భావనతోనే ఈ కార్యక్రమాలు పెట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ సమీకరణలతో కుస్తీ ఒకవేళ నిజంగానే ప్రభుత్వ రద్దయి, ముందస్తు ఖరారైతే డిసెంబరు వరకు ఎన్నికలు పూర్తవుతాయన్న అంచనాతో ఉన్న ఆయా పార్టీల నాయకులు సమీకరణలు మొదలు పెట్టారు. గత ఎన్నికల్లో తమ నియోజవకర్గంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? తమ పరిస్థితి ఏమిటీ? నాలుగేళ్ల కిందినాటి పరిస్థితులే ఇపుడూ ఉన్నాయా? తమకు కలిసొచ్చే అంశాలు ఏమిటి? ఎక్కడ ఇంకా సరిదిద్దుకోవాల్సి ఉంది? ఒక్కో పార్టీలో టికెట్ రేసులో ఎవరెవరకు ఉన్నారు? బెర్తు ఎవరికి ఖరారయ్యే అవకాశం ఉంది.. వంటి అంశాలను ముందేసుకుని కుస్తీ పట్లు పడుతున్నారు. అధికార పార్టీ అన్ని సీట్లు తమవేనని పదే పదే ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ సమీకరణలు జోరందుకున్నాయి. మె జారిటీ నియోజకవర్గాల్లో ద్విముఖ, బహుముఖ పోటీలు జరిగే అవకాశం ఉండడంతో నేతలు తమ బుర్రకు పదును పెడుతూ కుల, వర్గాల వారీగా ఓట్లను విశ్లేషించే పనిలో పడ్డారు. పార్టీ మార్పిళ్లపైనా చర్చ వాస్తవానికి ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం అధికార టీఆర్ఎస్లో సిట్టింగులు అందరికీ టికెట్లు ఖాయమన్న భరోసాతో ఉన్నారు. కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమకు టచ్లో ఉన్నారని టీఆర్ఎస్ నాయకత్వం చెబుతుండడంతో.. వారు నిజంగానే పార్టీ మారితే కచ్చితంగా మారిపోయే అంశాలపైనా చర్చ మొదలైంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ముందస్తుకు సిద్ధమవుతున్న తీరు జిల్లాలో రాజకీయ వేడిని పెంచింది. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం తన నివాసంలో ముఖ్య కార్యకర్తల స మావేశం నిర్వహించి ఎన్నికలకు సిద్ధం కావాల్సిందేనని పురమాయించారు. ఇక, టీఆర్ఎస్లో ఒకరికంటే ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తున్న స్థానాలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల ఆయా నేతలు ఎవరి అవకాశాలపై వారు ధీమాతో ఉండడమే కాకుండా, ఏ రకంగా తమకు టికెట్ వస్తుందో, ఎలా గెలుస్తామో లెక్కలు చెబుతున్నారు. మొత్తంగా ప్రభుత్వం రద్దు చేసుకుని ముందస్తు వైపు టీఆర్ఎస్ వేగంగా అడుగులు వేస్తోందన్న వార్తలు రేపే ఎమవుతుందోనన్న ఉత్కంఠను రేపుతున్నాయి. -
6న తెలంగాణ అసెంబ్లీ రద్దు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్ : రాష్ట్రంలో షెడ్యూల్కంటే ముందే శాసనసభ ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహం విజయవంతమైనట్లే. ఆదివారం హైదరాబాద్ శివార్లలోని కొంగరకలాన్లో టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభ విజయవంతం కావడం పార్టీ నాయకత్వానికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు సభకు తరలిరావడంతో ముందస్తు ఎన్నికలకు చర్యలు వేగవంతం చేయాలన్న నిర్ణయానికి అధికార పార్టీ వచ్చింది. ప్రగతి నివేదన సభలో 49 నిమిషాలపాటు ప్రసంగించిన సీఎం కేసీఆర్ పరోక్షంగా ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. శాసనసభను రద్దు చేసి ముందుగా ఎన్నికలకు వెళ్లే విషయంలో ఏ నిర్ణయం తీసుకోవడానికైనా మంత్రిమండలితోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కమిటీలు తనకు అధికారమిచ్చాయని, ఈ మేరకు వచ్చే కొద్ది రోజుల్లో రాజకీయపరమైన నిర్ణయాలు ఉంటాయని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో 6వ తేదీన మంత్రివర్గం మరోసారి సమావేశమై శాసనసభ రద్దుకు సిఫారసు చేస్తుందని ఓ సీనియర్ మంత్రి వెల్లడించారు. ‘ఎన్నికలకు వెళ్లడం దాదాపుగా ఖాయమైంది. మీరే చూస్తారు... నాలుగైదు రోజుల్లో అనూహ్య మార్పులు ఉంటాయి’అని కేబినెట్ సమావేశానంతరం ఆ మంత్రి సాక్షి ప్రతినిధికి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్కీ నంబర్ ఆరు కావడం వల్ల అదే రోజు శాసనసభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు కూడా వెల్లడించాయి. ఆ వెంటనే మంత్రివర్గం గవర్నర్ను కలసి శాసనసభ రద్దు తీర్మానాన్ని అందిస్తుందని పేర్కొన్నాయి. శాసనసభను రద్దు చేసినా కొత్త ప్రభుత్వం ఏర్పడేదాకా కేసీఆర్ నాయకత్వంలోని మంత్రిమండలి ఆపద్ధర్మ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని చెబుతున్నాయి. పథకాల వివరణకే ప్రాధాన్యత... కొంగరకలాన్ సభలో ముఖ్యమంత్రి ప్రసంగమంతా నాలుగేళ్ల మూడు నెలల కాలంలో చేపట్టిన తన ప్రభుత్వ పథకాలను వివరించడానికే పరిమితమైంది. భారీ సంఖ్యలో జన సమీకరణ చేసినా ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై విరుచుకుపడలేదు. మామూలుగా ప్రత్యర్థి పార్టీలపై ఒంటికాలిమీద లేచే అలవాటు ఉన్న కేసీఆర్ ఈ సభలో మాత్రం ఆ ఊసే లేకుండా మాట్లాడారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు. విద్యుత్ చార్జీల పెంపు, నేత కార్మికుల అవస్థలపై అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా బహిరంగ లేఖ రాసి తెలంగాణ కోసం నలుగురైదుగురితో కలసి ఉద్యమం మొదలుపెట్టి లక్ష్యాన్ని ఏ విధంగా సాధించిందీ మొదటి ఏడు నిమిషాలపాటు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా ఎన్నికలకు ముందే మంచినీరు ఇవ్వడంతోపాటు రైతుబంధు రెండో విడత ఆర్థిక సాయం నవంబర్లో ఇవ్వడానికి ఏర్పాటు చేశామని చెప్పడం ద్వారా డిసెంబర్లో ఎన్నికలు వచ్చే వీలుందని పరోక్షంగా తేల్చిచెప్పారు. నేడే నిర్ణయం తీసుకోవాలనుకున్నా... శాసనసభను రద్దు చేస్తూ ఆదివారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయంతీసుకోవాలని ముందుగానే భావించినా చివరి క్షణంలో దాన్ని వాయిదా వేసుకున్నారని సమాచారం. అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకుని ప్రగతి నివేదన సభలో అధికారికంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి అనుకున్నారని, కానీ కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా 6వ తేదీకి దాన్ని వాయిదా వేశారని అత్యున్నత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అందుకే కేబినెట్ సమావేశం కేవలం 15 నిమిషాలే జరిగిందని తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వం అమలు చేసిన విధానపరమైన నిర్ణయాలనే ఈ సమావేశంలో లాంఛనంగా ఆమోదించినట్లు ఆ తరువాత మంత్రులు ఈటల, హరీశ్, కడియం వెల్లడించిన విషయాల ద్వారా స్పష్టమైంది. దీనికితోడు ప్రభుత్వ ఉద్యోగులకు వేతన పవరణకు సంబంధించి మధ్యంతర భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు లాంటి ముఖ్యమైన నిర్ణయాలను కూడా ప్రభుత్వం ప్రకటించాల్సి ఉండటం కూడా ఆదివారం నాటి సమావేశంలో అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోకపోవడానికి కారణమని అంటున్నారు. ఈ రెండింటితోపాటు ముఖ్యమైన విధానపరమైన అంశాలను వచ్చే 2 లేదా మూడు రోజుల్లో ప్రకటించి 6న శాసనసభ రద్దుకు నిర్ణయం తీసుకుంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రేపటిలోగా ప్రతిపాదనలు పంపండి అన్ని శాఖలకు సీఎస్ సర్క్యులర్ మరోసారి కేబినెట్ భేటీ నేపథ్యంలోనే... ‘త్వరలోనే మంత్రివర్గ సమావేశం జరగనుంది. మీ శాఖల పరిధిలోని ప్రతిపాదనలను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలలోగా పంపించాలి’అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సర్క్యులర్ జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వారంలోపే మళ్లీ మంత్రివర్గ సమావేశం జరగనుండటం ఆసక్తికరంగా మారింది. -
నేదు తెలంగాణ మంత్రి వర్గం వేటీ
-
ఒంటి గంటకు మంత్రివర్గ భేటీ.. అత్యంత కీలక నిర్ణయాలు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతిభవన్లో జరగనుంది. అసెంబ్లీ రద్దు జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నాలుగేళ్ల మూడు నెలల పాలన విజయాలను రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రగతి నివేదన సభ’కు ముందు మంత్రివర్గ సమావేశం జరుగుతుండటంతో అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఓ వైపు అధికార పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం, మరోవైపు మంత్రివర్గ సమావేశం ఒకేరోజు జరుగుతున్న నేపథ్యంలో పరిపాలన పరంగా, రాజకీయంగా మొత్తం దృష్టి అటు వైపే పడింది. మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుపై నిర్ణయం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ మదిలో ఏముందనేది ఎవరికీ అంతుచిక్కడంలేదు. అయితే సమావేశంలో పరిపాలనపరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్), ఆసరా పెన్షన్ల మొత్తం పెంపు, మెగా డీఎస్సీతోపాటు భారీగా ఉద్యోగాల భర్తీకి అనుమతి వంటి నిర్ణయాలు జరగనున్నట్లు సమాచారం. ప్రతిపాదనలకు తుదిరూపు రాష్ట్రంలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే చర్చ నెల రోజులుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న అనధికారిక మంత్రివర్గ సమావేశం జరిగింది. అప్పటి నుంచి ఈ చర్చ ఇంకా పెరిగింది. అనంతరం అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశానికి అవసరమైన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆగస్టు 27న అన్ని శాఖలను ఆదేశించారు. అదేరోజు సాయంత్రం అన్ని వివరాలను పంపాలని సూచించారు. దీనికి అనుగుణంగా అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీలు జరుపుతూ అన్నింటినీ సమగ్రంగా పరిశీలించారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించే అంశాలపై తుది నిర్ణయానికి వచ్చారు. ఉద్యోగులకు మధ్యంతర భృతి.. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉద్యోగులకు మధ్యంతర భృతిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. తాజా పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలను సవరించే ప్రక్రియ ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరుగుతుంది. పీఆర్సీ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వాలు ఫిట్మెంట్ను ప్రకటిస్తాయి. అయితే పూర్తిస్థాయి నివేదిక వచ్చేలోపు ప్రభుత్వం ఐఆర్ ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. గత పీఆర్సీ గడువు ఈ ఏడాది జూన్తో ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మొదటి పీఆర్సీ కమిటీని ప్రభుత్వం ఈ ఏడాది మేలోనే ఏర్పాటు చేసింది. కమిటీ ప్రస్తుతం నివేదిక రూపకల్పనలో నిమగ్నమైంది. ఈ కమిటీ నివేదిక వచ్చేందుకు కొన్ని నెలలు పట్టే అవకాశం ఉండటంతో మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మెగా డీఎస్సీ.. నిరుద్యోగ భృతి ప్రకటన ఆసరా పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి ప్రకటనపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. ఉద్యోగ ప్రకటనలు, భర్తీ గురించి కూడా చర్చకు రావచ్చని భావిస్తున్నారు. ఆసరా పథకం కింద రాష్ట్రంలో 40 లక్షల మంది ప్రతి నెల పింఛన్లు పొందుతున్నారు. వికలాంగులకు నెలకు రూ.1,500.. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, బోదకాలు బాధితులకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో వికలాంగులకు పింఛన్ నెలకు రూ.2 వేలు, ఇతర వర్గాలకు రూ.1,500కు పెంచే అవకాశాలపై ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. భారీగా ప్రభుత్వ పోస్టులకు అనుమతించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ (టీఆర్టీ) ప్రకటించేలా ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిసింది. నిరుద్యోగ భృతి ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 8 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. అసెంబ్లీ సమావేశాలా?.. రద్దా? శాసనసభ నిర్వహణపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. బడ్జెట్ సందర్భంగా ఈ ఏడాది మార్చి 29న అసెంబ్లీ చివరిసారిగా సమావేశమైంది. నిబంధనల ప్రకారం ఆరు నెలలోపు కచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు జరగాలి. రికార్డుల ప్రకారం ఈనెల 27లోపు శాసనసభ సమావేశం జరగాలి. ఈ నేపథ్యంలో ఈ నెల మొదటి వారంలోనే రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశాలను మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలిసింది. ఒకవేళ అసెంబ్లీ రద్దుపై నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మరోలా ఉండనుంది. -
మరోసారి అసెంబ్లీ భేటీ తర్వాతనే ప్రభుత్వ రద్దు!
-
సెప్టెంబర్ 10లోపే తెలంగాణ ప్రభుత్వం రద్దు!?
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల రెండోవారంలో... అదీ పదో తేదీలోపే రాష్ట్ర ప్రభుత్వం రద్దయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఏడాది మార్చి తర్వాత ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ 10లోపు సభను రద్దు చేస్తేనే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ రెండో వారంలో ప్రభుత్వ రద్దు సిఫారసు ఉంటుందని తెలుస్తోంది. అంతకంటే ముందే ఓసారి అసెంబ్లీని సమావేశపరిచి ఈ విషయంలోనూ సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారని, ఖచ్చితంగా ముందస్తుకు వెళ్లాలనుకుంటే మాత్రం సెప్టెంబర్లో ఈ రెండు పరిణామాలు జరుగుతాయని రాజకీయ పరిశీలకులంటున్నారు. లోక్సభ ఎన్నికలతో కాకుండా ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. రాజ్యాంగ నిబంధనల అవరోధాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘం కోర్టులోకి...! రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలను కోరుకునే నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం కీలకం కానుంది. రాజ్యాంగ నిబంధనలు, కొన్ని సందర్భాల్లో వచ్చిన కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని ఈసీ ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తుకు వెళ్లాలనుకుంటే ఈసీ నుంచి ప్రతికూల నిర్ణయం రాకుండా ఏం చేయాలన్న దానిపై తీవ్ర కసరత్తే జరుగుతోంది. ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత కూడా ముందస్తు ఎన్నికలకు అనుమతి ఇవ్వకుండా సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే నష్టం కలుగుతుందనే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. దీంతో ప్రభుత్వాన్ని రద్దు చేస్తే మాత్రం ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలా ఈసీ కోర్టులోకి బంతిని నెట్టే వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. ఈ విషయంలో ముఖ్యంగా రెండు అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందని, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి అనుకుంటే ఏ నిర్ణయమైనా సెప్టెంబర్10లోపే ఉంటుందని టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎంపీలు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ విషయాల్లోనే కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఇతర రాజకీయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు. ఇవే అంశాలను ప్రధానితో జరిగిన భేటీలోనూ కేసీఆర్ ప్రస్తావించి ముందస్తుకు వెళ్లడం ద్వారా జరిగే రాజకీయ ప్రయోజనాలను వివరించినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు తప్పించుకునేదెలా..? వాస్తవానికి, 2014 సార్వత్రిక ఎన్నికలు ఆ ఏడాది ఏప్రిల్ 7 నుంచి మే 12 మధ్య తొమ్మిది దశల్లో జరిగాయి. రాష్ట్రం అధికారికంగా ఏర్పాటు కాకపోవడంతో ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్ 30న, ఆంధ్రప్రదేశ్లో మే7న ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఆ ఏడాది మార్చి5న ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే, ఆ ఎన్నికలలో తొలివిడత ఎన్నికలు జరిగిన నాటికి నెలరోజుల ముందు మాత్రమే షెడ్యూల్ విడుదల కాగా, కొన్ని సందర్భాల్లో 45–60 రోజుల ముందే వెలువడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎప్పుడైనా సార్వత్రిక షెడ్యూల్ విడుదల చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. ఈ లోపు ప్రభుత్వం రద్దయి 6 నెలలు పూర్తయ్యే పక్షంలో సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఖచ్చితంగా తెలంగాణ శాసనసభకు ఆలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే... ఫిబ్రవరి లేదా మార్చిలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చే ముందే తెలంగాణ ప్రభుత్వం రద్దయి 6 నెలలు దాటిపోయే పక్షంలో సార్వత్రిక ఎన్నికలతో కాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. షెడ్యూల్ ప్రకారం ఈ రాష్ట్రాలకు డిసెంబర్ 15లోపు ఎన్నికలు నిర్వహించాలి. తెలంగాణ ప్రభుత్వాన్ని సెప్టెంబర్ 10లోపు రద్దు చేస్తే ఎన్నికల నిర్వహణకు గాను ఈసీకి అవసరమైన 90–100 రోజుల గడువు కూడా లభించనుంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా సెప్టెంబర్ 10లోపు ప్రభుత్వ రద్దు సిఫారసును గవర్నర్కు కేసీఆర్ పంపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ భేటీ జరగాలా..? ఇక, రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం.. అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ఆరు నెలల గరిష్ట కాలపరిమితి మాత్రమే ఉంది. వాస్తవానికి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ ఏడాది మార్చి 13 నుంచి 29 వరకు జరిగాయి. అయితే, అసెంబ్లీని గవర్నర్ ప్రోరోగ్ చేసింది మాత్రం జూన్1న. అంటే మార్చి 29 నుంచి 6 నెలల్లోపు అసెంబ్లీ మరోసారి సమావేశం కావాలా? లేక జూన్ 1 నుంచి 6 నెలల్లోపా? అన్నది గందరగోళానికి గురిచేస్తోంది. దీనిపై నిపుణులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నా మార్చి 29ని పరిగణనలోకి తీసుకుంటే సెప్టెంబర్ 28 కల్లా అసెంబ్లీ మరోసారి భేటీ కావాల్సిందే. అదే ప్రోరోగ్ చేసిన జూన్1ని పరిగణనలోకి తీసుకుంటే నవంబర్ 30 కల్లా సమావేశం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వాన్ని సెప్టెంబర్ 10లోపు రద్దు చేయాలనుకుంటే ఆ లోపు మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఈ రెండింటికీ పరిష్కారం లభించనుంది. సెప్టెంబర్లో అసెంబ్లీ నిర్వహిస్తే మార్చి వరకు మళ్లీ ఇబ్బంది ఉండదు. ఈలోపు ఆ నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. అప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాల్సిన అవసరమూ ఉండదు. ఈ కోణంలోనే సెప్టెంబర్ తొలి వారంలో రెండు లేదా మూడు రోజులు సభ నిర్వహించి ప్రజలకు చెప్పాల్సిన విషయాలను అసెంబ్లీ వేదికగా వెల్లడించి ఆ తర్వాత రద్దు చేస్తే ఎలాంటి సమస్య ఉండదని నిపుణులు కేసీఆర్కు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోమారు అసెంబ్లీని సమావేశపర్చిన తర్వాతే ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని తెలుస్తోంది. ఈ 2 ప్రధాన అంశాలతో పాటు ఇతర రాజ్యాంగ అవరోధాలు లేకుండా ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలని, ఎన్నికల నిర్వహణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసీ పీఠముడి వేయకుండా మరింత లోతుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. దీంతో పాటు అవసరమైతే మరోమారు ఈసీ వర్గాలతోనూ చర్చలు జరిపే యోచనలో కేసీఆర్ ఉన్నారని, అన్ని విషయాల్లో స్పష్టత వచ్చిన తర్వాతే ప్రభుత్వ రద్దుకు నిర్ణయం తీసుకుంటారని, రద్దు చేయాలని నిర్ణయిస్తే మాత్రం సెప్టెంబర్ 10లోపే క్రతువు పూర్తి చేస్తారని సమాచారం. -
ఎన్నికలకు తొందరేంటి?
శ్రీనగర్ : తాజా రాజకీయ పరిస్థితులపై జమ్ము కశ్మీర్ గవర్నర్ నిర్వహించిన అఖిలపక్ష భేటీ అసంపూర్తిగా, అస్పష్టంగా ముగిసింది. శుక్రవారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఆధ్వర్యంలో అన్ని పక్షాల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాలని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు డిమాండ్ చేయగా, పీడీపీ మాత్రం ఎన్నికలకు తొందరేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒకానోక దశలో భేటీలో గందరగోళం చెలరేగగా, నేతలు అసంతృప్తితోనే బయటకు వచ్చినట్లు స్థానిక ఛానెళ్లు కథనాలను ప్రచురించాయి. కశ్మీర్ లోయలో పరిస్థితులను ఎలా సాధారణ స్థితికి తీసుకురావటం, రాజకీయ పరస్పర సహకారం ప్రధాన ఎజెండాలుగా భేటీలో గవర్నర్ వోహ్రా ప్రతిపాదన చేశారు. అయితే బలగాల మోహరింపు ద్వారానే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని ప్రధాని పార్టీలన్నీ గవర్నర్తో స్పష్టం చేశాయి. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేయటమే ఉత్తమమని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు గవర్నర్తో తేల్చి చెప్పాయి. ‘ఇప్పటికే అన్ని పార్టీలు తమకు మెజార్టీ లేదన్న విషయం చెప్పేశాయి. పైగా ఎలాంటి పొత్తులు ఉండబోవని తేల్చాయి. ఇలాంటి సమయంలో ఇంకా అసెంబ్లీని కొనసాగించటం సబబు కాదు. ఇది గందరగోళాన్ని, రాజకీయ అస్థిరతను సృష్టించే అవకాశం ఉంటుంది. రాజ్యాంగాన్ని అనుసరించి గవర్నర్ అసెంబ్లీని తక్షణమే రద్దు చేయాలి. వెంటనే ఎన్నికలు నిర్వహించాలి’ అని కాంగ్రెస్ జమ్ము చీఫ్ గులాం అహ్మద్ మీర్ కోరారు. మరోవైపు ఎన్సీ అధినేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే వాదనను వినిపించినట్లు సమాచారం. పీడీపీ, బీజేపీలు మాత్రం... అయితే పీడీపీ మాత్రం కాంగ్రెస్, ఎన్సీల డిమాండ్ను తోసిపుచ్చింది. పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అఖిలపక్ష భేటీకి హాజరుకాకపోవటంతో ఆమె తరపున ఆ పార్టీ కార్యదర్శి దిలావర్ మీర్ మీటింగ్కు హాజరయ్యారు. ‘ఇది సున్నితమైన అంశం. గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం ఉందనే అనుకుంటున్నాం. ఇలాంటి దశలో అసెంబ్లీని రద్దు చేయటం కన్నా కొనసాగించటమే మంచిది. ఆర్టికల్ 35-ఏ, ఆర్టికల్ 370 (ప్రత్యేక హోదా అంశం)లపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. మరోవైపు కథువా కేసు కూడా విచారణ దశలో ఉంది. ఇలాంటి స్థితిలో రాజకీయ గందరగోళం ఆయా అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పరిస్థితులు మెరుగుపడ్డప్పుడే ఎన్నికలు కూడా నిర్వహించటం మంచిదని ముఫ్తీ భావిస్తున్నారు’ అని సమావేశం అనంతరం మీర్ మీడియాకు వివరించారు. ఇక బీజేపీ మాత్రం ఈ వ్యవహారంపై మౌనంగా ఉంది. ‘అమర్నాథ్ యాత్రకు సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి తరుణంలో నేతలంతా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయాలి. ప్రశాంత వాతావరణంలో యాత్ర కొనసాగేలా చూడాలి. పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. ముందు ఆ ఎన్నికలు జరిగేలా చొరవ చూపాలి’ అని బీజేపీ నేత, మాజీ మంత్రి సత్ శర్మ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి సమావేశం అనంతరం బయటకు వచ్చిన నేతలు అసంతృప్తిగానే మీడియాతో మాట్లాడి వెళ్లిపోవటం గమనార్హం. -
అధ్యక్షా.. అనాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే
కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు అధ్యక్షా అని మైకు పట్టుకుని కౌన్సిల్లో ప్రజా సమస్యలపై గళం విప్పాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే. మునిసిపల్ ఎన్నికలు జరిగిన 43 రోజుల వరకు ఫలితాల విషయంలో నిరీక్షించిన కౌన్సిలర్లకు పదవీ స్వీకార ప్రమాణ విషయంలోనూ జాప్యం తప్పడం లేదు. వాస్తవానికి మంగళవారం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే న్యాయపరమైన ఇబ్బం దు లు తదితర కారణాల నేపథ్యంలో ఈ ఎన్నిక జూన్ ఒకటి, రెండు తేదీ ల్లోగాని గాని జరిగే అవకాశం లేదు. మున్సిపల్ కౌన్సిళ్లలో ఎక్స్అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు. అలాంటి కౌన్సిళ్లలో వీరి ఓటు ఒకో సందర్భంలో కీలకంగా మారుతుంది. అయితే గత శాసనసభ రద్దు కావడంతో ప్రస్తుతం మనకు ఎమ్మెల్యేలు లేరు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైతేనే మనకు కొత్త ఎమ్మెల్యేలు వస్తారు. ఆ తర్వాత వారి ప్రమాణ స్వీకారం తదితర కార్యక్రమాలు ఉం టాయి. అలాగే ఎంపీల పదవీ కాలం కూడా ఈ నెలాఖరుతో ముగియనుంది. దీంతో ఎలాంటి న్యాయపరమైన అభ్యంతరాల చట్రంలో మునిసిపల్ ైచె ర్మన్ , వైస్ చైర్మన్ ఎంపికల వ్యవహారం పడకుండా ఎన్నికల కమిషన్ జాగ్రత్తలు తీసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలోగాని కొత్త కౌన్సిలర్లు అధ్యక్షా అనడానికి వీలు లేకుండా పోయింది.