Auckland
-
నిశేష్ జోరుకు మోన్ఫిల్స్ బ్రేక్
ఆక్లాండ్: ఏఎస్బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి విజయ పరంపరకు బ్రేక్ పడింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 133వ ర్యాంకర్ నిశేష్ 6–7 (5/7), 4–6తో ప్రపంచ 52వ ర్యాంకర్, ఫ్రాన్స్ సీనియర్ స్టార్ ప్లేయర్ గేల్ మోన్ఫిల్స్ చేతిలో ఓడిపోయాడు. మోన్ఫిల్స్తో 1 గంట 46 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో 19 ఏళ్ల నిశేష్ మూడు ఏస్లు సంధించాడు. తొలి సెట్లో ఇద్దరూ తమ సర్వీస్లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్లో మోన్ఫిల్స్ పైచేయి సాధించాడు. రెండో సెట్ కూడా హోరాహోరీగా సాగింది. స్కోరు 4–4 వద్ద ఉన్నపుడు తొమ్మిదో గేమ్లో నిశేష్ సర్వీస్ను మోన్ఫిల్స్ బ్రేక్ చేసి 5–4తో ముందంజ వేశాడు. ఆ తర్వాత పదో గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకున్న మోన్ఫిల్స్ విజయాన్ని ఖరారు చేసుకొని కెరీర్లో 35వసారి ఏటీపీ టోర్నీలో ఫైనల్కు చేరుకున్నాడు.సెమీస్లో ఓడిన నిశేష్కు 35,480 డాలర్ల (రూ. 30 లక్షల 54 వేలు) ప్రైజ్మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్లో నిశేష్ 27 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 106వ ర్యాంక్కు చేరుకోనున్నాడు. ఈనెల 12న మొదలయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో పదిసార్లు చాంపియన్, సెర్బియా దిగ్గజం జొకోవిచ్తో నిశేష్ తలపడతాడు. -
యూకీ–ఒలివెట్టి జోడీ సంచలనం
ఆక్లాండ్: ఏఎస్బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ– 250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సంచలన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 3–6, 6–4, 12–10తో మూడో సీడ్ జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్పూల్ (బ్రిటన్) జంటను బోల్తా కొట్టించింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో 9–10తో యూకీ–ఒలివెట్టి ద్వయం ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే పట్టుదల కోల్పోకుండా ఆడిన యూకీ–ఒలివెట్టి జంట వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో యూకీ–ఒలివెట్టి నాలుగు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేశారు. నేడు జరిగే సెమీఫైనల్లో క్రిస్టియన్ హారిసన్–రాజీవ్ రామ్ (అమెరికా)లతో యూకీ–ఒలివెట్టి తలపడతారు. -
ఎదురులేని నిశేష్
ఆక్లాండ్: మరో మ్యాచ్... మరో సంచలనం... ఏఎస్బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల నిశేష్ 2–6, 6–2, 6–4తో ఎనిమిదో సీడ్, ప్రపంచ 41వ ర్యాంకర్ అలెక్స్ మికిల్సిన్ (అమెరికా)ను ఓడించాడు. 1 గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ప్రపంచ 133వ ర్యాంకర్ నిశేష్ నాలుగు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు.క్వాలిఫయర్గా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన నిశేష్ తొలి రౌండ్లో ప్రపంచ 85వ ర్యాంకర్ కమ్సానా (అర్జెంటీనా)పై, రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ 23వ ర్యాంకర్ అలెజాంద్రో టబిలో (చిలీ)పై సంచలన విజయాలు సాధించాడు. -
డిఫెండింగ్ చాంపియన్పై నిశేష్ సంచలన విజయం
ఏఎస్బీ క్లాసిక్ ఆక్లాండ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో తెలుగు సంతతి అమెరికన్ టీనేజర్ నిశేష్ బసవరెడ్డి సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల నిశేష్ 6–4, 5–7, 6–4తో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ 23వ ర్యాంకర్ అలెజాంద్రో టబిలో (చిలీ)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో నిశేష్ తొమ్మిది ఏస్లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. గత నెలలో ప్రొఫెషనల్గా మారిన నిశేష్ ఈ టోర్నీ తొలి రౌండ్లో 6–2, 6–2తో 85వ ర్యాంకర్ కమ్సానా (అర్జెంటీనా)పై గెలిచాడు. మరోవైపు అడిలైడ్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ వరేలా (మెక్సికో) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లో 6–3, 3–6, 11–13తో నాలుగో సీడ్ హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది. -
న్యూజిలాండ్ లో ఘనంగా జననేత జగనన్న జన్మదిన వేడుకలు
-
Australia to New Zealand: గాల్లో కుదిపేసిన విమానం
సిడ్నీ: ఆ్రస్టేలియా నుంచి చిలీకి వెళ్తున్న ఒక విమానం మార్గమధ్యంలో ఒక్కసారిగా కుదుపులకు లోనై ప్రయాణికులకు చుక్కలు చూపించింది. విమాన ప్రయాణికులు కుదుపులకు సీట్లలోంచి చెల్లాచెదురుగా పడి గాయాలపాలయ్యారు. విమానంలో తలెత్తిన ఒక సాంకేతికత సమస్య దీనికి అసలు కారణం. దాదాపు 50 మంది ప్రయాణికుల రక్తం కళ్లజూసిన ఈ ఎల్ఏ800 లాటన్ విమానం.. ఘటనకు ముందు సిడ్నీ నుంచి చిలీ దేశంలోని శాండిగో నగరానికి సోమవారం బయల్దేరింది. మార్గమధ్యంలో షెడ్యూల్ ప్రకారం ఆక్లాండ్లో దిగాలి. ఆ లోపే ఆకాశంలో కుదుపులకు లోనైందని ఎయిర్లైన్స్ వెల్లడించింది. విమానంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించేందుకు అక్లాండ్ ఎయిర్పోర్ట్ వద్ద 10 అత్యయిక వాహనాలను సిద్ధంగా ఉంచారు. విమానం ఎయిర్పోర్ట్లో దిగగానే గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు. అందరికీ మోస్తరు దెబ్బలే తగిలాయి. ఒక వ్యక్తికి మాత్రం తీవ్రమైన గాయాలయ్యాయని ఎయిర్లైన్స్ సంస్థ పేర్కొంది. -
New Zealand: ఆక్లాండ్లో కొత్త ఏడాది ప్రారంభం
ఆక్లాండ్: న్యూజిలాండ్లో కొత్త ఏడాదికి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆక్లాండ్(న్యూజిలాండ్ కాలమానం ప్రకారం) ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. 2024కి కివీస్ ప్రజలు గ్రాండ్ వెల్కం చెప్పారు. ఈ సందర్బంగా లైట్హౌస్ దగ్గర లేజర్ షో ఆకట్టుకుంది. బాణాసంచా పేలుళ్లలో న్యూఇయర్కు ఆక్లాండ్ ప్రజలు స్వాగతం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచాయి. #WATCH | New Zealand's Auckland welcomes the new year 2024 with fireworks (Source: Reuters) pic.twitter.com/faBWL0b7Eh — ANI (@ANI) December 31, 2023 ఇటు భారత్లోనూ మరికొన్ని గంటల్లో ప్రజలు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్బంగా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గిరిలో ఈ ఏడాదికి చివరి సూర్యాస్తమయం ఇదే అంటూ వీడియోను షేర్ చేశారు. #WATCH Last sunset of 2023; visuals from Jalpaiguri, West Bengal. pic.twitter.com/DrFDxjN8gj — ANI (@ANI) December 31, 2023 #WATCH Last sunset of 2023; visuals from Kolkata, West Bengal. pic.twitter.com/LXUF0YK9hk — ANI (@ANI) December 31, 2023 #WATCH Last sunset of 2023; visuals from Guwahati, Assam. pic.twitter.com/6d8CnrSkmx — ANI (@ANI) December 31, 2023 -
న్యూజిలాండ్లో కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
ఆక్లాండ్: 2023 ఫిఫా మహిళల ఫుట్ బాల ప్రపంచకప్ కు వేదికైన ఆక్లాండ్ లో టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా పోలీసు అధికారులతో సహా మరో ఆరుగురు గాయాల పాలయ్యారని తెలిపారు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్. ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ కు ఉండే క్రేజే వేరు. అందులోనూ ఫిఫా ప్రపంచ కప్ అంటే అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం నెలకొంటుంది. తాజాగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ అభిమానులు జంట ద్వీపదేశాల్లో వాలిపోతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేశారు నిర్వాహకులు. ఇదిలా ఉండగా ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ నార్వే మహిళల జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ కు కొద్ది గంటల ముందు ఆక్లాండ్ నగరంలో కాల్పులు బీభత్సాన్ని సృష్టించాయి. ఒక ఆగంతకుడు నిర్మాణంలో ఉన్న భవనంలోకి దూరి కాల్పులు ప్రారంభించాడు. పోలీసులు అప్రమత్తమై వెంటనే కౌంటర్ అటాక్ చేయగా అగంతకుడి తోపాటు పోలీసుల్లో ఒకరు కూడా మృతి చెందినట్లు, మరో ఆరుగురు గాయపడియట్లు తెలిపారు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్. న్యూజిలాండ్ ప్రధాని తెలిపిన వివరాల ప్రకారం కాల్పులు జరిగినప్పుడు పోలీసులతోపాటు పౌరులు చూపిన తెగువ అసాధారణమని, మృత్యువుకి ఎదురెళ్లి వారు చేసిన సాహసం కొనియాడదగినదని అన్నారు. ఈ సందర్బంగా ఇది ఉగ్రవాద చర్య కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ కప్ టోర్నమెంట్ నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తవని మ్యాచ్లు యధాతధంగా జరుగుతాయని తెలిపారు. ఇది కూడా చదవండి: బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు.. -
ఓరి దేవుడా! అది బస్సా!.. ఇంకేదైననా?
న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో అకాల భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. చెట్లు, ఇళ్లు కూలిపోవడమే గాక రహదారులన్నీ దిగ్బంధమయ్యాయి. దీంతో అక్కడ రోజువారీ జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ యంత్రాంగం ఈ పాటికే ముంపుకు గురైన ప్రాంతాలను సర్వే చేయడం, ఎంత మేర నష్టం వాటిల్లింది అనే దానిపై సమీక్షించడం వంటి పనులు ప్రారంభించింది. అలాగే మరోవైపు నగరాలను క్లీన్ చేయడం వంటి బాధ్యతలను చేపట్టింది కూడా. అంతేగాదు న్యూజిలాంగ్ చరిత్రలో దీన్ని అతి పెద్ద విపత్తుగా అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో అదర్నీ తెగ ఆకర్షించింది. ఈ వీడియోని డెబ్బీ బర్రోస్ అనే మహిళ షేర్ చేశారు. ఆమె ఆక్లాండ్ కౌన్సిల్లోని 21 స్థానిక బోర్డులలో ఒకటైన మౌంగాకీకీ టమాకీ స్థానిక బోర్డుకు డిప్యూటి చైర్మన్. ఆ వీడియోలో రహాదారిపై నడుమ లోతు వరద నీటితో నిండుగా ఉంది. అక్కడ ఉన్న ఒక కారు కేవలం దానిపై ఉండే రూఫ్ మాత్రమే కనిపిస్తోంది. అంత నిండుగా ఉన్న వరద నీళ్లల్లో ఒక పెద్ద బస్సు చాలా సునాయాసంగా వెళ్లిపోతుంది. అందులో ప్యాసింజర్లు నుంచోని కనిపిస్తున్నారు. అంతేగాదు నీళ్లు ఒకవైపు నుంచి లోపలకు వెళ్తుంటే మరోవైపు నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఏదో బోట్ మాదిరిగా వెళ్లిపోతుంది. డ్రైవర్ కూడా ఏదో ఖాళీ రోడ్డు మీద నడుపుతున్నంత ఈజీగా నడిపేశాడు. దీంతో సదరు డిప్యూటీ చైర్మన్ డెబ్బీ బర్రోస్ దీన్ని అస్సలు నమ్మలేకపోతున్నా!.. ఇది నిజమేనా? చాలా తమాషాగా అనిపిస్తోందన్నారు. వాస్తవానికి ఆ రహదారిని మూసేస్తుండగా ఒక బస్సు అదే సమయంలో రయ్యి మంటూ దూసుకుపోతుందని చెప్పుకొచ్చారు డెబ్బీ బర్రోస్. దీంతో నెటిజన్లు చాలా హాస్యస్పదంగా ఉంది, బహుశా ఆ డ్రైవర్ డ్రైవింగ్లో మంచి నైపుణ్యవంతుడు కాబోలు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. Historic flooding? No problem, at least for this New Zealand bus driver, who was seen in a viral video driving his bus through shoulder-deep floodwaters like it was NBD. The area around Auckland has experienced unprecedented flooding and rainfall in recent days. pic.twitter.com/a4OUrb5eUj — NowThis (@nowthisnews) February 3, 2023 (చదవండి: కత్తిమీద సాములా భయపెట్టిస్తున్నా.. కర్తవ్యంగా స్వీకరిస్తున్నా! రిషి సునాక్) -
తొలి వన్డేకు వర్షం ముప్పు.. వరుణుడి కోసమే సిరీస్ పెట్టినట్లుంది
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సిరీస్లో వరుణుడు శాంతించేలా కనిపించడం లేదు. తాజాగా నవంబర్ 25న(శుక్రవారం) ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు వరుణుడి ముప్పు పొంచి ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. గత కొన్ని రోజులుగా ఆక్లాండ్లో వర్షం కురుస్తున్నప్పటికి రెండు రోజులుగా చూసుకుంటే వాతావరణంలో కాస్త మార్పు కనపించింది. మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. మ్యాచ్ సమయానికి 20 శాతం మాత్రమే వర్షం పడే చాన్స్ ఉందని.. గాలిలో 62 శాతం తేమ ఉంటుందని.. గంటకు 32 కి.మీ వేగంతో గాలి వీచే అవకాశం ఉండగా.. గరిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీలు.. కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ముగిసిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో ఒక్క మ్యాచ్ మాత్రమే పూర్తి స్థాయిలో జరిగింది. వర్షంతో తొలి టి20 ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కాగా.. రెండో టి20లో మాత్రం టీమిండియా 65 పరుగుల తేడాతో విజయం అందుకుంది. ఇక మూడో టి20లో కివీస్ ఇన్నింగ్స్ అనంతరం వరుణుడు అడ్డు తగలడం.. డక్వర్త్ లూయిస్ పద్దతిలో మ్యాచ్ టై అయినట్లు ప్రకటించడంతో 1-0తో సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. అయితే టీమిండియా కివీస్ టూర్ఫై మాత్రం భారత అభిమానులు సంతృప్తిగా లేరు. అసలు టీమిండియా సిరీస్ ఆడడానికి వెళ్లినట్లుగా అనిపించడం లేదని వాపోయారు. టి20, వన్డే సిరీస్లు టీమిండియా, కివీస్లు ఆడేందుకు కాకుండా వరుణుడి కోసమే ఏర్పాటు చేసినట్లుగా అనిపిస్తుందని కామెంట్స్ చేశారు. ఇక టి20లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపట్టగా.. వన్డేలకు మాత్రం శిఖర్ ధావన్ తిరిగి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పటికే రోహిత్ గైర్హాజరీలో పలుసార్లు జట్టును నడపించిన ధావన్ ప్రతీసారి సక్సెస్ అవడమే గాక బ్యాట్స్మన్గానూ సత్తా చాటుతున్నాడు. ఇక కివీస్తో వన్డే సిరీస్ను కూడా నెగ్గి రానున్న వన్డే వరల్డ్కప్లో తన స్థానం మరింత సుస్థిరం చేసుకోవాలని ధావన్ చూస్తున్నాడు. Smiles, friendly banter & the trophy 🏆 unveil! #TeamIndia | #NZvIND pic.twitter.com/3R2zh0znZ3 — BCCI (@BCCI) November 24, 2022 చదవండి: చాలా ఊహించుకున్నా.. హార్ధిక్ రీ ఎంట్రీతో ఆశలన్నీ అడియాశలయ్యాయి..! -
న్యూజీలాండ్లో జరగనున్న 8 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
ఆక్లాండ్ (న్యూజీలాండ్): 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఆక్లాండ్ (న్యూజీలాండ్) కేంద్రంగా అంగరంగ వైభవంగా జరగనుంది. సెప్టెంబర్ 17-18, అక్టోబర్ 2, 2022 తేదీలలో నిర్వహించనున్న ఈ ప్రతిష్టాత్మకంగా కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ప్రముఖ గేయ రచయత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ రచయత ఓలేటి పార్వతీశం ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. అంతర్జాల వేదిక ద్వారా ప్రముఖ గేయ రచయత భువనచంద్ర, ప్రముఖ నటులు, రచయత తనికెళ్ళ భరణి, ప్రముఖ రచయత డేనియల్ నైజర్స్ (ఫ్రాన్స్ ) పాల్గొంటారు. ఆహూతుల సమక్షంలో ప్రారంభ వేదిక, ఒక పురస్కార వేదికా, రెండు ప్రసంగ వేదికలూ ప్రత్యక్షంగానూ, అంతర్జాలం కేంద్రంగా 14 ప్రసంగ వేదికలూ, ఒక పురస్కార వేదిక వెరసి... 36 గంటల తెలుగు సాహిత్య ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. వీటితో పాటు జీవన సాఫల్య పురస్కారాలను కొమరవోలు సరోజ (కెనడా), ఓలేటి పార్వతీశం (ఇండియా) కు ప్రదానం చేయనున్నారు. 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వాహుకులుగా వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సాస్), శ్రీలత మగతల (న్యూజీలాండ్), శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సాస్), రావు కొంచాడ (ఆస్ట్రేలియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), డా. వెంకట ప్రతాప్ (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్), వంశీ రామరాజు (ఇండియా), వెంకట్ తరిగోపుల (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు (టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లాండో, ఫ్లోరిడా) వ్యవహరించనున్నారని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. -
అక్కడ ముందుగానే న్యూ ఇయర్ 2022
ప్రపంచ దేశాలన్ని న్యూఇయర్కు స్వాగతం చెప్పడానికి సిద్ధమవుతున్నాయి. అయితే న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరం 2022 నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన మొదటి నగరంగా నిలిచింది. ఆక్లాడ్లోని ప్రజలు బాణాసంచా కాల్చుతూ.. శుక్రవారం నగరంలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తుండటంతో పలు దేశాలు కరోనా ఆంక్షలు విధించాయి. మరికొన్ని దేశాల్లో ఆంక్షల్లో మినహాయింపులు ఇచ్చాయి. అయితే డిసెంబర్ 31 అర్ధరాత్రి తర్వాత కొత్త ఏడాది 2022లోకి అడుగుపెడతామన్న విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరం ముందుగానే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నగరమంతా బాణాసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకుంటోంది. #WATCH | New Zealand's Auckland rings in #NewYear2022 with fireworks display (Video: Reuters) pic.twitter.com/UuorkGHPEg — ANI (@ANI) December 31, 2021 -
వైడ్ బాల్ విషయంలో వివాదం.. బౌలర్ ముఖంపై దాడి
ఆక్లాండ్: స్థానికంగా జరిగిన ఓ కమ్యూనిటీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్ల మధ్య వివాదం గొడవకు దారితీసింది. సబర్బ్స్ న్యులిన్, హౌవిక్ పకురంగా క్లబ్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్లో సబర్బ్స్ న్యులిన్ బౌలర్ అర్షద్ బషీర్(41)పై ప్రత్యర్ధి జట్టు ఆటగాడు దాడి చేయడంతో అతను కొన్ని నిమిషాల పాటు స్పృహ కోల్పోయాడు. వైడ్ బాల్ విషయంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వివాదం మొదలవ్వడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. వైడ్ బాల్ విషయంలో మోసం చేయొద్దని అనడంతో రెచ్చిపోయిన ప్రత్యర్ధి జట్టు ఆటగాడు.. గొంతు నులమడంతో పాటు తన ముఖంపై దాడి చేసి గాయపరిచాడని, చికిత్స అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడికి పాల్పడిన ఆటగాడిని నిషేదించాలని బాధితుడు డిమాండ్ చేశాడు. ఈ గొడవ జరగడం వల్ల తాను 300 డాలర్లు నష్టపోయినట్లు అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరోవైపు ఈ గొడవపై స్పందించిన ఆక్లాండ్ క్రికెట్ సంఘం.. దాడికి పాల్పడిన ఆటగాడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కాగా, బాధిత క్రికెటర్ పార్ట్ టైమ్ కింద ట్యాక్సీ డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. -
మాల్లో కరోనా రోగి : భారీ జరిమానా
అక్లాండ్ : భారత్ నుంచి ఇటీవల తిరిగివచ్చి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిన వ్యక్తి (32) సూపర్ మార్కెట్కు వెళ్లేందుకు అక్లాండ్లోని ఐసోలేషన్ కేంద్రం నుంచి అదృశ్యమైన ఘటన వెలుగుచూసింది. ఐసోలేషన్ కేంద్రం ఫెన్సింగ్ను దాటుకుని ఈ వ్యక్తి మంగళవారం ఉదయం అదృశ్యమయ్యాడని న్యూజిలాండ్ హెరాల్డ్ వెల్లడించింది. జులై 3న ఢిల్లీ నుంచి వచ్చిన ఈ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలిన అనంతరం క్వారంటైన్కు తరలించారు. కాగా ఈ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ఏ ఒక్కరితోనూ సన్నిహితంగా మెలగలేదని వెల్లడించినట్టు అధికారులు తెలిపారని ఆ కథనం పేర్కొంది. కోవిడ్-19 పాజిటివ్గా తేలిన వ్యక్తి ఐసోలేషన్ కేంద్రం నుంచి అదృశ్యమవడం తీవ్రమైన విషయమని ఆరోగ్య మంత్రి క్రిస్ హిప్కిన్స్ అన్నారు. అతడి చర్యలు స్వార్థపూరితమని, ఆ వ్యక్తిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కాగా సూపర్ మార్కెట్లో ఆ వ్యక్తి 20 నిమిషాలు గడిపాడని, 70 నిమిషాల తర్వాత అతడు స్వయంగా ఐసోలేషన్ కేంద్రానికి తిరిగి చేరుకున్నాడని హిప్కిన్స్ చెప్పారు. ఐసోలేషన్ కేంద్రం నుంచి వెళ్లినందుకు అతడికి ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ 2.8 లక్షల జరిమానా విధిస్తారని న్యూజిలాండ్ హెరాల్డ్ పేర్కొంది. కాగా కరోనా పాజిటివ్గా తేలిన వ్యక్తి తమ స్టోర్కు వచ్చాడని తెలియడంతో సూపర్మార్కెట్ సిబ్బంది స్వీయ నియంత్రణలోకి వెళ్లారు. వారందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. న్యూజిలాండ్లో ఇప్పటివరకూ 1187 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 23 యాక్టివ్ కేసులున్నాయి. వీరంతా ఐసోలేషన్ కేంద్రాల్లోనే ఉంటున్నారు.చదవండి : కరోనా చీకటిలో ధారవి -
కరోనా : ఇలా కూడా నిర్థారణ చేసుకోవచ్చు!
వెల్లింగ్టన్: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో కరోనా వైరస్ సోకని ప్రాంతం లేదు. కొంతమందిలో లక్షణాలు కనిపిస్తుంటే మరికొంత మందిలో ఎటువంటి లక్షణాలు లేకుండానే కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్థారణ అవుతుంది. చాలా మందికి తమకి కరోనా వైరస్ సోకిందేమో అనే అనుమానం కలుగుతోంది. కానీ ప్రస్తుతం వస్తున్న రద్దీ లేదా ఇతర కారణాల వల్ల కావొచ్చు, ఆసుపత్రులకు వెళ్లి ఎలా పరీక్షలు చేయించుకోవాలో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసం న్యూజీల్యాండ్లోని ఆక్ల్యాండ్కు చెందిన జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ సంధ్యా రామనాథన్ మంచి చిట్కాలు, కొన్ని సలహాల ఇచ్చారు. కరోనా సోకిందా లేదా నిర్థారణ కోసం ఉపయోగపడే పరికరాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను ఒక వీడియో ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బహుళ ప్రచారంలోకి వచ్చింది. మీకు కానీ, మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా కరోనా సోకినట్లు అనుమానంగా ఉంటే ఒక చిన్న పరికరంతో తెలుసుకోవచ్చని ఆమె వివరించారు. ఆ పరికరం పేరు పల్స్ ఆక్సీ మీటర్. ఈ మిషన్లో మన చూపుడు వేలును ఉంచితే మన శరీరంలో ఆక్సిజన్ సరఫరా ఎంత మేరకు ఉందో తెలియజేస్తుంది. చూపుడు వేలుకి ఆక్సీమీటర్ పెట్టిన తర్వాత మిషన్లో 95 నుంచి 100 మధ్యలో రీడింగ్ చూపిస్తే ఈ రక్తంలో ఆక్సీజన్ తగినంతగా ఉన్నట్టు లెక్క. అంతకంటే తక్కువ చూపిస్తే లేదా 93 కన్నా తక్కువ చూపించిన పక్షంలో వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుందని డాక్టర్ రామనాథన్ చెబుతున్నారు. ఎందుకంటే సాధారణంగా కరోనా వైరస్ బారిన పడితే మన శరీరంలో ఆక్సిజన్ సరఫరా రేటు తగ్గుతుంది. అందుకే పల్స్ ఆక్సీ మీటర్తో పరీక్షించినప్పుడు రేటింగ్ తక్కువ వస్తే వైద్యులను సంప్రదించాలి. (వైరస్ సోకకుండా పుతిన్కు భారీ టన్నెల్) మరో విధంగా కూడా మన కరోనా వైరస్ సోకిందనే విషయాన్ని నిర్థారణ చేసుకోవచ్చు. దీని కోసం మీకు కావల్సింది రెండు పెద్ద బెలూన్లు. వీటిలోకి గాలి ఊదటం ద్వారా మీరు ఎంతవరకు శ్వాసను ఎంత వరకు ఆపగలుగుతున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్ సోకితే మనం శ్వాసను ఎక్కువసేపు పట్టి ఉంచలేం. ఇకపోతే, కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవడం ఎంతో అవసరం. దాని కోసం ఎక్కువగా రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లను తీసుకోవాలి. ప్రతి రోజు తినే ఆహారంలో జింక్, విటమిన్ డి, విటమిన్ సి తప్పని సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్ ఫుడ్ను వీలైనంత వరకు తగ్గించాలి. బయటకు వెళ్లినపుడు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్లు ధరిస్తూ, తరచూ శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకుంటూ ఉంచుకోవాలి. (మనం కరోనా వైరస్ను తిప్పికొట్టగలం) ఇక కరోనా వైరస్ సోకిన వారు దాని నుంచి కోలుకోవాలంటే తరుచూ వేడి నీటితో పుక్కిళ్లించి ఉమ్ముతూ ఉండాలి. అదే విధంగా నాజిల్ స్స్ర్పేని ఉపయోగించాలి. కరోనా వైరస్ ఊపిరితిత్తుల గోడలో చివరి భాగన అతుక్కొని ఉంటుంది. దానిని బయటకు తీసుకురావడానికి శ్వాసకు సంబంధించిన వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల కరోనా వైరస్ సోకినా తొందరగా దాని నుంచి కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆ శ్వాస వ్యాయామాలు ఎలా చేయాలి అనేది డాక్టర్ సంధ్య రామ్నాథన్ వీడియోలో చూపించారు. పైన చెప్పినవన్నీ చేయడం ద్వారా కరోనావైరస్ సోకకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. (ఈ పరికరంతో కరోనా వైరస్.. మటాష్) -
36 ఏళ్లు... 11 సిరీస్లు...
భారత క్రికెట్ జట్టు టెస్టు చరిత్రలో విదేశాల్లో విజయం సాధించడమనేది మొదటి నుంచీ పెద్ద సవాల్గానే నిలిచింది. ప్రపంచ క్రికెట్లో దిగ్గజాలుగా గుర్తింపు పొందిన పలువురు ఆటగాళ్లు ఉన్న సమయంలో కూడా విదేశాల్లో సిరీస్ విజయాలు మనకు అంత సులభంగా దక్కలేదు. ఈ రకంగా విదేశాల్లో భారత ప్రదర్శనను బట్టి చూస్తే తొలి సిరీస్ విజయం ఎప్పుడైనా అపురూపమే. క్రికెట్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ మధురక్షణమే. 1968లో న్యూజిలాండ్ గడ్డపై భారత్ విదేశాల్లో తమ తొలి టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. 1932లో భారత జట్టు ఇంగ్లండ్లో తమ తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. దాంతో కలిపి వరుసగా జరిపిన 11 విదేశీ పర్యటనల్లోనూ 10 సార్లు జట్టుకు సిరీస్ ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల చేతుల్లో ఈ పరాజయాలు ఎదురుకాగా, స్వాతంత్య్రం తర్వాత పాకిస్తాన్తో ఆడిన ఒక్క సిరీస్ మాత్రం ‘డ్రా’గా ముగిసింది. గెలుపు మాత్రం ఒక్కసారి కూడా దక్కలేదు. ఇలాంటి నేపథ్యంతో న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత్కు అద్భుత విజయం దక్కింది. మన్సూర్ అలీఖాన్ పటౌడీ సారథ్యంలోని భారత్ 4 టెస్టుల సిరీస్ను 3–1తో కైవసం చేసుకోవడం విశేషం. మన హైదరాబాద్కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు సయ్యద్ ఆబిద్ అలీ, ఎంఎల్ జైసింహ ఈ సిరీస్ విజయంలో భాగంగా ఉన్నారు. ఈ నాలుగు టెస్టుల ఫలితాలను చూస్తే... తొలి టెస్టు (డ్యునెడిన్) భారత్ ఐదు వికెట్లతో విజయం డౌలింగ్ (143) సెంచరీతో తొలి ఇన్నింగ్స్లో కివీస్ 350 పరుగులు చేసింది. ఆబిద్ అలీకి 4 వికెట్లు దక్కాయి. అజిత్ వాడేకర్ (80), ఫరూఖ్ ఇంజినీర్ (63) బ్యాటింగ్తో భారత్ 359 పరుగులు చేసింది. ఎరాపల్లి ప్రసన్న 6 వికెట్లతో చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 208 పరుగులకే ఆలౌటైంది. 200 పరుగుల లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. విదేశీ గడ్డపై తొలి టెస్టు విజయం రుచి చూసింది. రెండో టెస్టు (క్రైస్ట్చర్చ్): న్యూజిలాండ్ ఆరు వికెట్లతో విజయం డౌలింగ్ (239) డబుల్ సెంచరీతో చెలరేగడంతో కివీస్ ముందుగా 502 పరుగులు చేసింది. బిషన్ సింగ్ బేడీకి 6 వికెట్లు దక్కాయి. భారత్ 288 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఫాలోఆన్ ఆడిన మన జట్టు రెండో ఇన్నింగ్స్లో 301 పరుగులు చేయగలిగింది. 88 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు నష్టపోయి కివీస్ ఛేదించింది. మూడో టెస్టు (వెల్లింగ్టన్): భారత్ ఎనిమిది వికెట్లతో విజయం ఎరాపల్లి ప్రసన్న 5 వికెట్లతో సత్తా చాటడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్లో 186 పరుగులకే కుప్పకూలింది. భారత్ 327 పరుగులు చేసి భారీ ఆధిక్యం అందుకుంది. అజిత్ వాడేకర్ (143) శతకం సాధించడం విశేషం. రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ మళ్లీ బ్యాటింగ్లో విఫలమై 199 పరుగులకే ఆలౌటైంది. బాపు నాదకర్ణి 6 వికెట్లు పడగొట్టడం విశేషం. 59 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 2 వికెట్లు కోల్పోయి సిరీస్లో ముందంజ వేసింది. నాలుగో టెస్టు (ఆక్లాండ్): భారత్ 272 పరుగులతో విజయం విదేశాల్లో భారత్ సిరీస్ విజయపు కలను నెరవేర్చిన మ్యాచ్ ఇది. భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులు మాత్రమే చేసినా... న్యూజిలాండ్ను 140 పరుగులకే పడగొట్టింది. మరోసారి ప్రసన్న 4 వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. భారత్ తమ రెండో ఇన్నింగ్స్ను 5 వికెట్లకు 261 వద్ద డిక్లేర్ చేసింది. రూసీ సుర్తీ 99 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. 374 పరుగుల అసాధారణ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ సొంతగడ్డపై చేతులెత్తేసింది. 101 పరుగులకే ఆలౌటై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రసన్న 4, బేడీ 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బతీశారు. భారత్ చరిత్రాత్మక సిరీస్ విజయంలో అజిత్ వాడేకర్ 328 పరుగులతో మన తరఫున టాప్ స్కోరర్గా నిలవగా...సుర్తీ, ఫరూఖ్ ఇంజినీర్ చెరో 321 పరుగులు సాధించారు. ఏకైక సెంచరీని వాడేకర్ నమోదు చేశాడు. బౌలింగ్లో 24 వికెట్లతో ఎరాపల్లి ప్రసన్న ఎవరికీ అందనంత ఎత్తులో నిలవగా... బిషన్ సింగ్ బేడీ 16, బాపు నాదకర్ణి 14 వికెట్లతో అండగా నిలిచారు. –సాక్షి క్రీడా విభాగం -
సిరీస్ గెలుచుకున్న కివీస్; భారత్కు తప్పని పరాభవం
-
సిరీస్ గెలుచుకున్న కివీస్; భారత్కు తప్పని పరాభవం
ఆక్లాండ్ : న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో కూడా టీమిండియా పరాజయం పాలై సిరీస్ను అతిథ్య జట్టుకు సమర్పించేసుకుంది. శనివారం ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్లో జరిగిన రెండో వన్డేలో 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయానికి 22 పరుగుల దూరంలో నిలిచి ఓటమిపాలయ్యింది. కాగా మూడు వన్డేల సిరీస్ను న్యూజిలాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో నిలవడంతో పాటు సిరీస్ను కైవసం చేసుకుంది. (అయ్యర్.. ఆ షాట్ అవసరమా!) భారత ఇన్నింగ్స్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మరోసారి తన బ్యాటింగ్తో జట్టును విజయానికి దగ్గరగా తీసుకువచ్చినా మిగిలిన ఆటగాళ్ల సహాకారం కరువైంది. చివర్లో నవదీప్ సైనీ తన మెరుపు బ్యాటింగ్తో గెలుపుపై ఆశలు చిగురించినా కైల్ జేమిసన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అవడంతో టీమిండియా పరాజయం ఖాయమైంది. ఇక చివర్లో ఒత్తిడిని జయించలేక 48.3 ఓవర్లలో 251 పరుగుల వద్ద టీమిండియా ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా 55, శ్రేయస్ అయ్యర్ 52, నవదీప్ సైనీ 45 పరుగులతో రాణించగా మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో బెన్నెట్, సౌదీ, జేమిసన్, కొలిన్ డి ఇంగ్రామ్లు తలా రెండు వికెట్లు తీశారు. అంతకుమందు తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్మెన్లలో గప్టిల్ 79, రాస్ టేలర్ 73, నికోల్స్ 45 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో చాహల్ 3వికెట్లు, శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీశారు. కాగా నామమాత్రంగా మారిన మూడో వన్డే ఫిబ్రవరి 11న మౌంట్ మాంగనూయిలో జరగనుంది. కనీసం చివరి మ్యాచ్లోనైనా నెగ్గి టీమిండియా క్లీన్స్వీప్కు గురవకుండా ఉంటుందమో వేచి చూడాలి. (కోహ్లి అంచనా తప్పింది..!) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'ఫైనల్లో బంగ్లాదేశ్ను కుమ్మేయండి'
ఆక్లాండ్ : అండర్ 19 ప్రపంచకప్లో ఈ ఆదివారం ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని పాచెఫ్స్ట్రూమ్ లో సేన్వెస్ పార్క్లో జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఐదోసారి కప్పును ఒడిసి పట్టాలని భారత కుర్రాళ్లు భావిస్తుంటే, మరోవైపు బంగ్లాదేశ్ మాత్రం ఈ అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు టీమిండియా సీనియర్ క్రికెటర్లు చటేశ్వర్ పుజార, అజింక్యా రహానే, విజయ్ శంకర్, వృద్దిమాన్ సాహాలు భారత కుర్రాళ్ల జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన వీడియో ఒకటి బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసింది. 'ముందుగా ఫైనల్ చేరినందుకు మీ అందరికి శుభాకాంక్షలు. ఈ ప్రపంచకప్లో ఇప్పటి వరకు ఓటమనేది ఎరుగకుండా జైత్రయాత్ర కొనసాగించారు. ఫైనల్లోనూ ఇదే తరహాలో ఆడి బంగ్లాదేశ్ను కుమ్మేయండి. ఈసారి కూడా కప్పు మనదే అవ్వాలి' అంటూ పేర్కొన్నారు. (ఇదే రోజు పాకిస్తాన్పై అద్భుతం..) కాగా సెమీఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను టీమిండియా కుర్రాళ్లు 10 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఏడవ సారి ఫైనల్కు చేరుకుంది. ప్రసుత్తం టీమిండియా సీనియర్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కివీస్తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఆడేందుకు చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలు ఇప్పటికే న్యూజిలాండ్కు చేరుకున్నారు. చటేశ్వర్ పుజారా 2006లో జరిగిన అండర్ 19 ప్రపంచకప్లో 349 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా ఎంపికయ్యాడు. అప్పటి ప్రపంచకప్ ఫైనల్ పాకిస్తాన్- ఇండియా మధ్య జరగ్గా, పాక్ 38 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. (బంగ్లాదేశ్ వచ్చేసింది ) -
బంగ్లాదేశ్ను కుమ్మేయండి
-
'ఐపీఎల్ ప్రదర్శనతోనే ధోని భవితవ్యం తేలనుంది'
ఆక్లాండ్ : సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లో మంచి ప్రదర్శన నమోదు చేయకపోతే అంతర్జాతీయ క్రికెట్ నుంచి స్వయంగా తప్పుకునే అవకాశాలు ఉన్నాయని టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో మాజీ కెప్టెన్ ధోనికి చోటు దక్కని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని భవితవ్యంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. కొందరూ ధోని రీ ఎంట్రీ పక్కా.. అంటే, మరికొందరూ జార్ఖండ్ డైనమైట్ ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసినట్లేనని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ ధోని భవితవ్యంపై రవిశాస్త్రి మరోమారు స్పందించాడు. న్యూజిలాండ్తో తొలి టీ20 విజయానంతరం రవిశాస్త్రి మాట్లాడుతూ.. ధోని భవితవ్యం ఐపీఎల్తో తేలనుందని పేర్కొన్నాడు. 'రానున్న ఐపీఎల్ ధోనికి ఎంత కీలకమో సెలెక్టర్లు, కెప్టెన్తో సహా ప్రతి ఒక్కరికి తెలుసు. ధోని తనకు ఏది అనిపిస్తే అదే చేస్తాడని, ఈ విధంగానే అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. కాగా ఐపీఎల్కు సంబంధించి ధోని ప్రాక్టీస్ మొదలు పెట్టాడో లేదో నాకైతే తెలియదు. కానీ ఐపీఎల్లో మాత్రం కచ్చితంగా ఆడుతాడు.ఐపీఎల్లో ఆడే ఆటతోనే అతని భవితవ్యం ముడిపడి ఉంది. ఒక వేళ ఐపీఎల్లో తన ఆటతో మెప్పించలేకపోతే ధోనినే నిర్మోహమాటంగా తప్పుకుంటాడని' రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.('ధోనికి ప్రత్యామ్నాయం అతడే') గతేడాది వన్డే వరల్డ్ కప్ సెమీస్ ఓటమి అనంతరం ధోని ఆటకు దూరమైన విషయం తెలిసిందే. కొన్నాళ్లు ఆర్మీతో గడిపినా.. అనంతరం తన భవితవ్యంపై స్పష్టతనివ్వకుండా మౌనంగానే ఉన్నాడు. పైగా జనవరి వరకు క్రికెట్ సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సూచించాడు. ఆటకు దూరమవడంతోనే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తొలిగించింది. అయితే ఇటీవల జార్ఖండ్ టీమ్తో కలిసి ధోని ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. ఈ వార్తలను జార్ఖండ్ టీమ్ పెద్దలు కూడా ధృవీకరించారు. ఐపీఎల్ కోసమే ధోని ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు తెలిపారు.(నేను సెలక్టర్ను కాదు కోచ్ను: రవిశాస్త్రి) -
తొలి టీ20లో అదరగొట్టిన భారత్
-
టీ20 చరిత్రలో ఇదే తొలిసారి..!
ఆక్లాండ్: టీమిండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో ఓ అరుదైన రికార్డు లిఖించబడింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు ధాటిగా బ్యాటింగ్ చేసి పరుగుల మోత మోగించారు. ఈ క్రమంలోనే ముగ్గురు న్యూజిలాండ్ ఆటగాళ్లు యాభైకి పైగా పరుగులు చేయగా, ఇద్దరు భారత ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. కివీస్ ఆటగాళ్లలో మున్రో( 59), విలియమ్సన్(51), రాస్ టేలర్(54 నాటౌట్)లు హాఫ్ సెంచరీలు సాధించగా, భారత్ నుంచి కేఎల్ రాహుల్(56), శ్రేయస్ అయ్యర్(58 నాటౌట్)లు అర్థ శతకాలు నమోదు చేశారు. కాగా, ఇలా ఒక అంతర్జాతీయ టీ20లో ఐదుగురు బ్యాట్స్మన్లు యాభైకి పరుగుల్ని సాధించడం ఇదే తొలిసారి. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేయగా, టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. (ఇక్కడ చదవండి: అయ్యర్ అదరహో.. ) టీమిండియానే టాప్.. అంతర్జాతీయ టీ20ల్లో రెండొందల పరుగులు, ఆపై టార్గెట్ను అత్యధిక సార్లు సాధించిన ఘనత కూడా టీమిండియాదే. ఇప్పటివరకూ ఇంటర్నేషనల్ టీ20ల్లో నాలుగుసార్లు 200 పరుగుల్ని ఛేదించింది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఆసీస్ రెండుసార్లు మాత్రమే ఆ ఫీట్ను సాధించింది. ఇక దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్లు తలోసారి మాత్రమే రెండొందలకుపైగా టార్గెట్ను ఛేదించిన జట్లు. 2009లో శ్రీలంకతో మొహాలీలో జరిగిన టీ20లో భారత్ 207 పరుగుల టార్గెట్ను ఛేదించగా, 2013లో ఆసీస్తో రాజ్కోట్లో జరిగిన మ్యాచ్ 202 పరుగుల టార్గెట్ను ఛేదించింది. గతేడాది చివర్లో హైదరాబాద్లో వెస్టిండీస్తో జరిగిన టీ20లో 208 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేధించింది. (ఇక్కడ చదవండి: రోహిత్.. నువ్వు సూపరో సూపర్!) -
అయ్యర్ అదరహో..
ఆక్లాండ్: న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో భారత్ అదరగొట్టింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 204 పరుగుల భారీ టార్గెట్ను ఇంకా ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించి శుభారంభం చేసింది. రోహిత్ శర్మ(7) విఫలమైనా కేఎల్ రాహుల్(56; 27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు), విరాట్ కోహ్లి(45; 32 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్(58 నాటౌట్; 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) లు రాణించడంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓవరాల్గా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లిలు ఆరంభంలో అదరగొడితే, శ్రేయస్ అయ్యర్ ఒత్తిడిని అధిగమిస్తూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. న్యూజిలాండ్ బౌలింగ్పై ఎదురుదాడికి దిగి శభాష్ అనిపించాడు. (ఇక్కడ చదవండి: రోహిత్.. నువ్వు సూపరో సూపర్!) భారీ లక్ష్య ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ(7) నిరాశపరిచాడు. సిక్స్ కొట్టి ఊపుమీద కనిపించినా సాంట్నార్ బౌలింగ్లో ఔటయ్యాడు. సాంట్నార్ వేసిన రెండో ఓవర్ నాల్గో బంతికి రాస్ టేలర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అదృష్టం కలిసొచ్చింది. బెన్నెట్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి కవర్లోకి ఆడాడు. దానికి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న కోహ్లి పరుగు కోసం రాగా, రాహుల్ తటపటాయించాడు. అయితే కోహ్లి తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందుకు సాగడంతో రాహుల్ క్రీజ్ను వదిలి రాకతప్పలేదు. ఆ సమయానికి రాహుల్ 27 పరుగుల వద్ద ఉండగా, అటు తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో అర్థ శతకం సాధించాడు. దాంతో భారత జట్టు 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. కాసేపటికి రాహుల్ ఔటైనప్పటికీ అయ్యర్ చక్కటి ఆట తీరుతో అలరించాడు. కోహ్లి హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చి పెవిలియన్ చేరినప్పటికీ అయ్యర్ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. కాసేపు శివం దూబే(13)కలిసి ఇన్నింగ్స్ రిపేర్ చేసిన అయ్యర్.. మనీష్ పాండే(14 నాటౌట్)తో కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19 ఓవర్ చివరి బంతికి సిక్స్ కొట్టి భారత్కు విజయం అందించాడు. దాంతో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఐదు టీ20ల సిరీస్లో రెండో టీ20 ఆదివారం జరుగనుంది. (ఇక్కడ చదవండి: రాహులా.. ఇదే కదా అదృష్టం!) ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఆది నుంచి పరుగుల మోత మోగించింది. ఓవర్కు కనీసం పది పరుగులు తగ్గకూడదనే లక్ష్యంతో బ్యాట్ ఝుళిపించింది. పవర్ ప్లే ముగిసేసరికి కివీస్ వికెట్ కోల్పోకుండా 68 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 81 పరుగులతో ఉంది. దూబే వేసిన ఎనిమిదో ఓవర్ ఐదో బంతికి గప్టిల్(30; 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్ కొట్టడానికి యత్నించగా స్క్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అద్భుమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో గప్టిల్ కథ ముగిసింది. ఆపై మున్రో (59; 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) ఔట్ కాగా, పరుగు వ్యవధిలో గ్రాండ్ హోమ్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. దాంతో కివీస్ 117 పరుగుల వద్ద మూడో వికెట్ను నష్టపోయింది. సాధారణంగా ఎక్కువగా స్ట్రైకింగ్ను రొటేట్ చేస్తూ సింగిల్స్, డబుల్స్కు ప్రాధాన్యత ఇచ్చే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్లో చెలరేగిపోయాడు. బౌండరీలే లక్ష్యంగా రెచ్చిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. విలియమ్సన్ పూనకం వచ్చినట్లు ఆడటంతో కివీస్ బోర్డు పరుగులు తీసింది. అతనికి రాస్ టేలర్ నుంచి కూడా చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ 61 పరుగులు జోడించి స్కోరు బోర్డును గాడిలో పెట్టారు. కాగా, విలియమ్సన్ దూకుడుగా ఆడే యత్నంలో నాల్గో వికెట్గా ఔటయ్యాడు. చహల్ బాగా ఆఫ్సైడ్కు వేసిన బంతిని వెంటాడి షాట్కు యత్నించాడు. అయితే ఎడ్జ్ తీసుకోవడంతో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి క్యాచ్ అందుకోవడంతో విలియమ్సన్ ఇన్నింగ్స్కు తెరపడింది. కాగా, టేలర్ కడవరకూ క్రీజ్లో ఉండటంతో న్యూజిలాండ్ రెండొందల మార్కును చేరింది. టేలర్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, చహల్, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాహులా.. ఇదే కదా అదృష్టం!
ఆక్లాండ్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ ఆదిలోనే వికెట్ను కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ(7) నిరాశపరిచాడు. సిక్స్ కొట్టి ఊపుమీద కనిపించినా సాంట్నార్ బౌలింగ్లో ఔటయ్యాడు. సాంట్నార్ వేసిన రెండో ఓవర్ నాల్గో బంతికి రాస్ టేలర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అదృష్టం కలిసొచ్చింది. బెన్నెట్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతిని కవర్స్లోకి ఆడాడు. దానికి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న కోహ్లి పరుగు కోసం రాగా, రాహుల్ తటపటాయించాడు. అయితే కోహ్లి తన నిర్ణయాన్ని మార్చుకోకుండా ముందుకు సాగడంతో రాహుల్ క్రీజ్ను వదిలి రాకతప్పలేదు. ఈ క్రమంలోనే రెండుసార్లు రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ముందుగా బౌలర్ బెన్నెట్ డైరెక్ట్ హిట్ కోసం యత్నించగా అది మిస్ అయ్యింది. అప్పటికి రాహుల్ పిచ్ సగం కూడా దాటలేదు. ఆపై మిడ్ వికెట్ ఫీల్డర్ మళ్లీ బంతిని వికెట్లపైకి వేయగా అది కూడా తగల్లేదు. దాంతో రాహుల్ బతికిపోయాడు. ఎలాగో రనౌట్ నుంచి తప్పించుకోవడంతో రాహుల్ ఊపిరి తీసుకున్నాడు. ఇక రాహులా.. ఇదే కదా అదృష్టం అనుకోవడం అభిమానుల వంతైంది. ఆ సమయానికి రాహుల్ 27 పరుగుల వద్ద ఉండగా, అటు తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో అర్థ శతకం సాధించాడు. కాగా, 56 వ్యక్తిగత పరుగుల వద్ద రాహుల్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. ఇష్ సోథీ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి సౌతీ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు.(ఇక్కడ చదవండి: విలియమ్సన్కు పూనకం..) -
విలియమ్సన్కు పూనకం..
ఆక్లాండ్: టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ 204 పరుగుల భారీ టార్గెట్ను నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ ఆది నుంచి పరుగుల మోత మోగించింది. ఓవర్కు కనీసం పది పరుగులు తగ్గకూడదనే లక్ష్యంతో బ్యాట్ ఝుళిపించింది. పవర్ ప్లే ముగిసేసరికి కివీస్ వికెట్ కోల్పోకుండా 68 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 81 పరుగులతో ఉంది. దూబే వేసిన ఎనిమిదో ఓవర్ ఐదో బంతికి గప్టిల్(30; 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) భారీ షాట్ కొట్టడానికి యత్నించగా స్క్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అద్భుమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో గప్టిల్ కథ ముగిసింది. ఆపై మున్రో (59; 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) ఔట్ కాగా, పరుగు వ్యవధిలో గ్రాండ్ హోమ్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. దాంతో కివీస్ 117 పరుగుల వద్ద మూడో వికెట్ను నష్టపోయింది. (ఇక్కడ చదవండి: రోహిత్.. నువ్వు సూపరో సూపర్!) విలియమ్సన్కు పూనకం.. సాధారణంగా ఎక్కువగా స్ట్రైకింగ్ను రొటేట్ చేస్తూ సింగిల్స్, డబుల్స్కు ప్రాధాన్యత ఇచ్చే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్లో చెలరేగిపోయాడు. బౌండరీలే లక్ష్యంగా రెచ్చిపోయాడు. కేవలం 26 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. విలియమ్సన్ పూనకం వచ్చినట్లు ఆడటంతో కివీస్ బోర్డు పరుగులు తీసింది. అతనికి రాస్ టేలర్ నుంచి కూడా చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ 61 పరుగులు జోడించి స్కోరు బోర్డును గాడిలో పెట్టారు. కాగా, విలియమ్సన్ దూకుడుగా ఆడే యత్నంలో నాల్గో వికెట్గా ఔటయ్యాడు. చహల్ బాగా ఆఫ్సైడ్కు వేసిన బంతిని వెంటాడి షాట్కు యత్నించాడు. అయితే ఎడ్జ్ తీసుకోవడంతో పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి క్యాచ్ అందుకోవడంతో విలియమ్సన్ ఇన్నింగ్స్కు తెరపడింది. కాగా, టేలర్ కడవరకూ క్రీజ్లో ఉండటంతో న్యూజిలాండ్ రెండొందల మార్కును చేరింది. టేలర్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 54 పరుగులు చేయడంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా, శార్దూల్ ఠాకూర్, శివం దూబే, చహల్, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు. (ఇక్కడ చదవండి: ‘పంత్ను అలా చూడాలనుకుంటున్నా’) -
పంత్, శాంసన్లను పక్కన పెట్టేశారు..
ఆక్లాండ్: దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో వరుసగా జరిగిన సిరీస్లను కైవసం చేసుకుని మంచి జోరు మీదున్న టీమిండియా.. కొత్త ఏడాది తొలి విదేశీ పర్యటనలో న్యూజిలాండ్తో తలపడుతోంది. దీనిలో భాగంగా ఈరోజు(శుక్రవారం) న్యూజిలాండ్తో తొలి టీ20ని ఆడనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా ఫీల్దింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి ప్రత్యర్థి జట్టును తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించాడు. భారత జట్టులో స్పెషలిస్టు కీపర్ని ఎవర్నీ తీసుకోలేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ కీపింగ్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించిన కేఎల్ రాహుల్నే కీపర్గా కొనసాగించేందుకు టీమిండియా మేనేజ్మెంట్ మొగ్గుచూపింది. ఈ టీ20 సిరీస్లో రిషభ్ పంత్, సంజూ శాంసన్లు ఉన్నప్పటికీ వారికి అవకాశం దక్కలేదు. అదనపు బ్యాట్స్మన్ కావాలనే ఉద్దేశంతో వీరిద్దర్నీ పక్కన పెట్టేశారు. దాంతో పంత్, శాంసన్లు రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యారు.(ఇక్కడ చదవండి: ప్రపంచకప్కు కౌంట్డౌన్..!) భారత క్రికెట్ జట్టు తమ టి20 చరిత్రలో ఎన్నడూ ఐదు మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. దాంతో ఈ సుదీర్ఘ సిరీస్లో భారత్ ఎలా రాణిస్తుందోననే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరొకవైపు పొట్టి ఫార్మాట్లో బలమైన జట్టుగా పేరున్న న్యూజిలాండ్తో ఆడతుండటంతో పాటు వారి గడ్డపై భారత్ ఎంత వరకూ ఆకట్టుకుంటుందో అనేది చూడాలి. ఈడెన్ పార్క్ మైదానం పూర్తిగా బ్యాటింగ్కు అనుకూలం. మరీ చిన్న బౌండరీలు కావడంతో పరుగుల వరద ఖాయంగా కనబడుతోంది. తుది జట్లు.. భారత్ విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, శివం దూబే, షమీ, బుమ్రా, శార్దూల్ , చహల్ న్యూజిలాండ్ విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, సీఫెర్ట్, రాస్ టేలర్, గ్రాండ్హోమ్, సాన్ట్నర్, సోధి, సౌతీ, బెన్నెట్, బ్లెయిర్ టిక్నెర్ -
కివీస్ చేరిన కోహ్లి బృందం
ఆక్లాండ్: మూడు ఫార్మాట్లలోనూ న్యూజిలాండ్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు భారత క్రికెట్ జట్టు కివీస్ గడ్డపై అడుగు పెట్టింది. ఆక్లాండ్ చేరుకున్నామంటూ కెప్టెన్ కోహ్లి సహచర ఆటగాళ్లు అయ్యర్, శార్దుల్లతో కలిసి ట్వీట్ చేశాడు. ఈ పర్యటనలో భారత్, కివీస్ మధ్య 5 టి20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరుగుతాయి. ఈ నెల 24న తొలి టి20 మ్యాచ్తో పోరు మొదలవుతుంది. గత ఏడాది న్యూజిలాండ్లో పర్యటించిన భారత్ వన్డే సిరీస్ను 4–1తో గెలుచుకొని టి20 సిరీస్ను 1–2తో కోల్పోయింది. -
బజార్లో బూతు వీడియోలు..
అక్లాండ్ : ఓ షాప్ ప్రమోషనల్ స్క్రీన్పై పోర్న్ వీడియోలు కనబడటంతో అక్కడున్నవారు షాక్కు గురయ్యారు. ఈ ఘటన న్యూజిలాండ్లోని అక్లాండ్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ అక్లాండ్లోని అసిక్స్ అనే స్పోర్ట్స్ స్టోర్ బయట ఉన్న ప్రమోషనల్ స్క్రీన్పై పోర్న్ వీడియోలు ప్లే కావడంతో అక్కడున్న ప్రజలు, ఇబ్బంది పడాల్సి వచ్చింది. కుటుంబసభ్యులతో, చిన్నపిల్లలతో కలిసి రోడ్డుపై వచ్చిన వారు ఆ దృశ్యాలను చూసి ఖంగుతిన్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొందరు మాత్రం ఆ దృశ్యాలను చూస్తూ అక్కడే ఉండిపోయారు. సాధారణంగా ఆ స్టోర్ను ఉదయం 10గంటలకు తెరుస్తారు. అయితే ఉదయం 8 గంటల నుంచి స్టోర్ తెరపై పోర్న్ వీడియోలు ప్లే అవుతూనే ఉన్నాయి. ఇలా దాదాపు రెండు గంటలపాటు జరిగింది. ఆ తర్వాత స్టోర్ నిర్వహకులు ఆ వీడియోలు ప్లే కాకుండా చూశారు. అయితే ఎవరో హ్యాకింగ్ చేయడం వల్లనే ఇలా జరిగిందని స్టోర్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అలాగే దీనిపై క్షమాపణ చెప్పారు. ఈ ఘటనపై తాము విచారణ జరుపుతున్నామని.. భవిష్యత్తులో మరోసారి ఇలా జరగనివ్వమని తెలిపారు. -
నేను ప్రాధేయపడ్డా.. సవాల్ చేశా: సచిన్
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ది ప్రత్యేక శకం. ప్రపంచ క్రికెట్లో ఓపెనర్గా తన మార్కు ఆటను చూపించి ప్రపంచ దిగ్గజ బౌలర్లకు సైతం వణుకుపుట్టించిన దిగ్గజ ఆటగాడు. తన సుదీర్ఘ వన్డే కెరీర్లో 463 మ్యాచ్లు ఆడి 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడంటే అందుకు ఓపెనర్గా సక్సెక్ కావడం ప్రధానం కారణం. 1989లో భారత క్రికెట్లోకి అడుగపెట్టిన సచిన్.. 1994లో ఆక్లాండ్లో జరిగిన మ్యాచ్ ద్వారా ఓపెనర్గా ఇన్నింగ్స్ ఆరంభించాడు సచిన్. తాను ఓపెనర్గా రావడానికి టీమిండియా మేనేజ్మెంట్ను ఎలా ఒప్పించాడనే విషయాన్ని సచిన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. తాను ఓపెనర్గా రావడానికి ఎంతగానో ప్రాధేయపడ్డానని, అదే సమయంలో మేనేజ్మెంట్తో వాదనకు దిగానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు లింక్డిన్లో ఒక వీడియోను షేర్ చేసిన సచిన్.. తాము సక్సెస్ అవుతామనుకునే ఫీల్డ్లో రిస్క్ చేయడానికి వెనుకంజ వేయొద్దని అభిమానులకు సూచించాడు. ‘ విఫలం అవుతామనే భయం ఎప్పటికీ వద్దు. నీవు సక్సెస్ అవుతాను అనుకుంటే కచ్చితంగా అందుకోసం రిస్క్ చేయి. రిస్క్ చేయపోతే ముందుకు వెళ్లడం కష్టం. అందుకు నేనొక ఉదాహరణ. నేను ఓపెనర్గా చేయడానికి భయపడలేదు. నాకిష్టమైన ఓపెనింగ్ విభాగంలో బ్యాటింగ్కు చేయడానికి టీమిండియా మేనేజ్మెంట్ను ఎంతో వేడుకున్నా. వారితో వాదించి మరీ ముందుకు వెళ్లా. 25 ఏళ్ల క్రితం నాటి ఆక్లాండ్లో జరిగిన మ్యాచ్లో నేను ఓపెనర్గా దిగుతానని పట్టుబట్టా. ఒకవేళ నేను ఓపెనర్గా సక్సెస్ కాలేకపోతే మళ్లీ ఎప్పుడూ మిమ్మల్ని అడగనని మరీ వారికి సవాల్ చేశా. అదే నా సక్సెస్కు కారణం. భయపడితే విజయాలు రావు. విఫలం అవుతాననే భయం వద్దు’ అని సచిన్ పేర్కొన్నాడు. -
సూపర్ ఓవర్ టెన్షన్.. ప్రాణాలు వదిలిన కోచ్
ఆక్లాండ్: వన్డే ప్రపంచకప్లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆల్రౌండర్ జేమ్స్ నీషమ్ అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడుతుండగా విషాదం చోటుచేసుకుంది. అతడి చిన్ననాటి కోచ్, ఆక్లాండ్ గ్రామర్ స్కూల్ మాజీ టీచర్ డేవిడ్ జేమ్స్ గొర్డాన్ మరణించాడు. మ్యాచ్ ఫలితాన్ని తేల్చే సూపర్ ఓవర్లో రెండో బంతిని నీషమ్ సిక్సర్ కొట్టిన సమయంలోనే జేమ్స్ గొర్డాన్ కన్నుమూసినట్టు ఆయన కుమార్తె లియోనీ వెల్లడించారని స్థానిక మీడియా తెలిపింది. ‘గొర్డాన్ తుదిశ్వాస విడిచారని సూపర్ ఓవర్ జరుగుతుండగా నర్స్ వచ్చి మాతో చెప్పారు. నీషమ్ సిక్సర్ బాదిన క్షణంలోనే ఆయన చనిపోయివుండొచ్చని అన్నారు. మా నాన్న హాస్యప్రియుడు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అందరితో ప్రేమగా ఉండేవార’ని లియోనీ గుర్తు చేసుకున్నారు. గొర్డాన్ మృతికి నీషమ్ ట్విటర్ ద్వారా సంతాపం తెలిపాడు. ‘డేవిడ్ జేమ్స్ గొర్డాన్.. నా హైస్కూల్ టీచర్, కోచ్, స్నేహితుడు. క్రికెట్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన దగ్గర మేమంతా ఆట నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఉత్కంఠభరితంగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో మా ఆటతీరును ఆయన గర్వించే ఉంటారు. మాకు ప్రతిదీ నేర్పినందుకు ధన్యవాదాలు. సంతాపం’ అంటూ నీషమ్ ట్వీట్ చేశాడు. నీషమ్ను తన తండ్రి ఎంతగానో అభిమానించేవారని లియోనీ పేర్కొన్నారు. ఆక్లాండ్ గ్రామర్ స్కూల్లో 25 ఏళ్లుపైగా టీచర్గా పనిచేసిన డేవిడ్ జేమ్స్ గొర్డాన్ ఎంతో మంది విద్యార్థులకు క్రికెట్, హాకీ నేర్పించారు. నీషమ్, ఫెర్గూసన్లతో పాటు చాలా మంది హైస్కూల్ విద్యార్థులకు కోచింగ్ ఇచ్చారు. (చదవండి: విశ్వవిజేతగా ఇంగ్లండ్) -
అట్టహాసంగా కొత్త సంవత్సర వేడుకలు
ఆక్లాండ్: న్యూజిలాండ్లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అంగరంగ వైభవంగా జరిగే కొత్త సంవత్సర వేడుకలను వీక్షించేందుకు ప్రపంచం నలు మూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలివచ్చారు. ఆక్లాండ్లో బాణాసంచా కాంతులు మిరుమిట్లు గొల్పాయి. రంగు రంగుల కాంతులను వెదజల్లుతూ బాణాసంచా కాల్పులు పర్యాటకులకు కనువిందు చేశాయి. సంగీత హోరు, ఆనందోత్సాహాల నడుమ 2019 సంవత్సరానికి స్వాగతం పలికారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుని ఆనందించారు. భారీగా తరలివచ్చిన పర్యాటకులతో రెస్టారెంట్లు, పబ్లు, బార్లు సందడిగా మారాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో టూరిస్టులు రెట్టించిన ఉత్సాహంతో వేడుకల్లో పాల్గొన్నారు. కొత్త సంవత్సరాల వేడుకలకు న్యూజిలాండ్ ప్రభుత్వం ఎప్పటిలానే భారీ ఏర్పాట్లు చేసింది. అత్యవసర సర్వీసులను, సహాయ సిబ్బందిని అందుబాటులో ఉంచింది. -
2018లో టేకాఫ్.. 2017లో లాండింగ్!
గతంలోకి ప్రయాణించడం సాధ్యమా? సినిమాల్లో సాధ్యమే. కానీ శామ్ స్వీనే అనే యు.ఎస్. జర్నలిస్టు నిజంగానే వెనక్కి ప్రయాణించాడు! ప్రయాణించిన ప్రూఫ్లను కూడా ట్విట్టర్లో పెట్టాడు! నిజమే. అతడు గతంలోకి ప్రయాణించాడు. ఎలా? ఎక్కడ దొరికింది అతడికి ఆ.. కాలయంత్రం?! కాలయంత్రం కాదది. హవాయి ఎయిర్ౖలñ న్స్ ఫ్లైట్. అందులో కూర్చొని అతడు 2018 నుంచి 2017లోకి జర్నీ చేశాడు. ఇది ఎలా జరిగిందో చూడండి. ఆక్లాండ్లో ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాడు శామ్. అతడు వెళ్లవలసింది ‘హొనొలులు’కు. రెండు ప్రాంతాల మధ్య దూరం ఏడు వేల కిలోమీటర్లు. ఆక్లాండ్లో టేకాఫ్ టైమ్ డిసెంబర్ 31 రాత్రి 11.55 గం. ఆ సమయానికి బయల్దేరితే తెల్లారి 9.45 కి ఫ్లైట్ హొనొలులు చేరుతుంది. అయితే ఫ్లైట్ 10 నిమిషాలు ఆలస్యమై, 12.05కి గాల్లోకి లేచింది. అంటే 2018లో బయల్దేరింది. అక్కడి నుంచి ప్రయాణించి ఉదయం 10.16 గంటలకు హొనొలులు చేరుకుంది. ఆ ప్రాంత కాలమానం ప్రకారం అప్పటికింకా అక్కడ 2017 డిసెంబర్ ముప్పై ఒకటే నడుస్తోంది. అలా శామ్ గతంలోకి ప్రయాణించాడు! న్యూజిలాండ్లోని ఆక్లాండ్ యు.ఎస్.లోని హొనొలులు కన్నా 23 గంటలు ముందుంటుంది. -
టాంజ్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు
ఆక్లాండ్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టాంజ) ఆధ్వర్యంలో ఆక్లాండ్ లో రాష్ట్ర పండుగైనా బోనాల ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పూజారి చంద్రు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. న్యూజిలాండ్ లో ఉండి కూడా బోనాల పండుగను జరుపుకోవడం తెలంగాణ ప్రజల సంస్కృతి, ఆచారాలు, భక్తికి నిదర్శనమని అన్నారు. అమ్మవారి అనుగ్రహం రాష్ట్ర ప్రజలకు ఎప్పటికి ఉండాలని ఆయన ఆశీర్వదించారు. మహిళలు చాలా భక్తిగా అమ్మవారికి చీరెలు, ఒడి బియ్యం, బోనాలు వివిధ నైవేద్యాలు సమర్పించారు. బాలికలు ఎంతో ఉత్సాహంగ బోనాలు ఎత్తి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పానుగంటి శ్రీనివాస్, పోతురాజు వేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టాంజ్ ఏర్పాటు చేసిన నోరూరించే తెలంగాణ వంటకాలు, అమ్మవారి నైవేద్యాలతో అందరూ తృప్తిగా భోజనాలు చేశారు. మైమరిపించే తెలంగాణ బోనాల వాతావరణాన్ని పిల్లపాపలతో కలిసి అందరూ ఎంజాయ్ చేశారు. చివరిగా మహిళలు పసుపు కుంకుమలు పంచుకుని కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో టాంజ్ కమిటీ సభ్యులతో పాటు ఆక్లాండ్ లోని తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రక్తదానం వెలకట్టలేనిది: టీఏఎన్జడ్
ఆక్లాండ్: తెలంగాణ అసోషియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ (TANZ) వారు ఆక్లాండ్లో ఈ రోజు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఏఎన్జెడ్ సభ్యులతో పాటు 150 మంది వరకు తెలంగాణ వాసులు పాల్గొన్నారు. టీఏఎన్జడ్ సభ్యులు మాట్లాడుతూ వెలకట్టలేని దానం రక్తదానం అన్నారు. ఒక్క మనిషి చేసిన రక్తదానం ముగ్గురి ప్రాణాల్ని కాపాడుతుందని పేర్కొన్నారు. ముందు ముందు నిర్వహించే రక్తదాన కార్యక్రమాల్లో తెలంగాణ వాసులు వీలైనంత మంది తమ సౌలభ్యం చూసుకొని తప్పకుండా పాల్గొనలన్నారు. ఇలాంటి సాంఘిక పరమైన సేవా కార్యక్రమాలను విజయవంతం చేస్తే టీఏఎన్జెడ్కి తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కల్యాణ్ కాసుగంటి, మీనరల్ సెక్రటరీ దయాకర్, వైస్ ప్రెసిడెంట్ రాంమోహన్, ఉమా సల్వాజి, దయానంద్, వెంకట నరసింహారావు, రామారావు, శ్రీనివాస్, జగన్ వడ్నాల రమాదేవి, సునీత, లక్ష్మీ, అరుణ జ్యోతి, విజేత ఇతర సభ్యులు పాల్గన్నారు. -
న్యూజిలాండ్కు పాకిన విద్వేషం
భారతీయుణ్ని దేశం నుంచి వెళ్లిపోవాలన్న స్థానికుడు ► అసభ్య పదజాలంతో దూషణ ► తరచూ ఇలాంటివి జరుగుతున్నాయని భారతీయుల ఆవేదన అక్లాండ్: అమెరికాలో భారతీయులపై జరుగుతున్న విద్వేషపూరిత ఘటనలు ఇప్పుడు న్యూజిలాండ్కు పాకాయి. అక్లాండ్లో ఓ సిక్కు జాతీయుడిపై స్థానికుడు గతవారం చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. అక్లాండ్లో ఉండే నరీందర్వీర్ సింగ్ పార్కింగ్లో నుంచి కారు తీస్తుండగా ఓ జంట కారులో వచ్చింది. వీరు వెళ్లిపోయేందుకు తను దారి ఇచ్చినప్పటికీ.. కారు నడుపుతున్న వ్యక్తి అసభ్య పదజాలంతో దూషిస్తూ దేశం విడిచి వెళ్లాలని బెదిరించాడని నరీందర్వీర్ వాపోయారు. ‘వారు వెళ్లేందుకు నేను పక్కకు తప్పుకున్నా. కారులోని మహిళ నావైపు వేలు చూపించింది. కారులోని వ్యక్తి నన్ను దూషిస్తూ.. అసభ్యంగా దూషించాడు. ఈ మొత్తాన్ని నేను వీడియో తీశాను. దీంతో అతడు మరింత రెచ్చిపోయి తిట్టాడు. మీ దేశానికి వెళ్లిపోండంటూ బెదిరించాడు. పంజాబీల గురించి చాలా అవమానంగా మాట్లాడాడు’ అని నరీందర్వీర్ తెలిపారు. ఇంతటితో అయిపోయింది కదా అని వెళ్లిపోతుంటే.. అదే జంట రోడ్డు పక్కన కారు ఆపుకుని మరీ మరోసారి తనపై మాటలతో దాడి చేశారని నిగ్గర్ (నల్లజాతీయులు) వెళ్లిపో అని బెదిరించాడని నరీందర్వీర్ వెల్లడించారు. మరోఘటనలోనూ..: న్యూజిలాండ్లో జరిగిన మరో ఘటనలోనూ విక్రమ్జిత్ సింగ్ అనే యువకుడిపైనా స్థానికుడొకరు అసభ్యంగా మాట్లాడారు. న్యూజిలాండ్లో ఎంత వేగంగా నడపాలో తెలియదా అని గద్దించిన స్థానికుడు.. మీ దేశానికి వెళ్లిపోండి అని బెదిరించాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక న్యూజిలాండ్లో ఇలాంటి ఘటనలు తరచు ఎదుర్కొనాల్సి వస్తోందని అక్కడి భారతీయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు ఒహయోలో విద్వేషపు వీడియో న్యూయార్క్: అమెరికాలో భారతీయులపై దాడులను మరువకముందే మరో విద్వేష వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. ‘భారత సంతతి ప్రజలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇక్కడ ఉండే మధ్య, ఎగువమధ్య తరగతి అమెరికన్లు ఏమైపోయారు? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది’ అంటూ స్టీవ్ పుషర్ (66) అనే ప్రోగ్రామర్ ఒహయో పార్క్లో రహస్యం గా చిత్రించిన వీడియోను సేవ్అమెరికన్ ఐటీజాబ్స్ అనే జాత్యహంకార వెబ్సైట్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో పార్క్లో వాలీబాల్ ఆడుతున్న భారత సంతతి వారిని చూపిస్తూ ‘గతేడాది వరకూ వాళ్లు క్రికెట్ ఆడేవాళ్లు. ఇప్పుడు క్రమంగా అమెరికన్ జీవనశైలికి అనుగుణంగా మారుతున్నారు’ అని ఆక్రోశం వెళ్లగక్కాడు. గతేడాది కంటే ఈ ఏడాది స్థానికులు కోల్పోయిన ఉద్యోగాల సంఖ్యను చూస్తే పిచ్చెక్కిపోతుందన్నాడు. గతంలో ఇక్కడ ఉద్యోగాలు, పనిచేసిన స్థానికుల గురించే బెంగం తా అని విద్వేషాన్ని వెళ్లగక్కాడు. భారత సంతతి మహిళలు వేసుకునే సంప్రదాయ దుస్తులు మతిపోగొడుతున్నాయన్నాడు. కాగా.. భారతీయులపై విద్వేష నేరాలకు సంబం ధించి వేగంగా న్యాయం జరిగేలా చూస్తామ ని భారత్కు అమెరికా హామీనిచ్చింది. -
16.23 గంటలు.. 14,535 కి.మీ.
అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానం ప్రారంభం వెల్లింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే నాన్స్టాప్ విమాన సర్వీసును ఖతార్ ఎయిర్వేస్ ఆదివారం ప్రారంభించింది. దోహా విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం గం.5.02 నిమిషాలకు (స్థానిక కాలమానం) బయలుదేరిన క్యూఆర్920 విమానం సోమవారం ఉదయం గం.7.25 నిమిషాలకు (స్థానిక కాలమానం) న్యూజిలాండ్లోని ఆక్లాండ్కు చేరుకుంది. 16 గంటల 23 నిమిషాల్లో 14,535 కి.మీ పయనించి, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానంగా రికార్డు నెలకొల్పింది. విమానంలో నలుగురు పైలట్లు, 15 మంది సిబ్బంది ఉన్నారు. ఆక్లాండ్లో విమానానికి ఘనస్వాగతం పలికారు. ఆకాశమార్గంలో కొలిచినపుడు ఎయిరిండియాకు చెందిన ఢిల్లీ–శాన్ ఫ్రాన్సిస్కో విమానాన్ని అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించేదిగా చెబుతారు. భూపరితలంపై దూరాన్ని కొలిస్తే మాత్రం ఖతార్ ఎయిర్వేస్ విమానమే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. -
ఆకట్టుకుంటున్న ఆక్లాండ్ లాంతరెన్ ఫెస్టివల్
చైనా కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన లాంతర్ల వెలుగులు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఆక్లాండ్ మునుపెన్నడూ లేని విధంగా 800 లాంతర్లతో దేదీప్యమానమైంది. ఉత్సవాలను చూసేందుకు వచ్చే జనంకోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను, ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశారు. లాంతరెన్ పండుగలో వివిధ ఆకృతుల్లో తయారుచేసిన 800 చైనీస్ హ్యాండ్ మేడ్ లాంతర్లు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. వారి నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. పండుగ సంబరాల్లో భాగంగా ఏర్పాటుచేసిన స్టేజ్ షోలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చైనా చిత్రకళలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. అన్ని వయసుల వారినీ ఆకర్షించేలా ఏర్పాటుచేసిన కార్యక్రమాలను సందర్శకులు ఉచితంగా తిలకించే సౌకర్యం కల్పించారు. ఉత్సవాల సందర్భంగా రుచికరమైన ఆసియా వంటకాలు నోరూరిస్తున్నాయి. చేతిపనులు, అల్లికలు, లాంతర్ల తయారీ ప్రదర్శనలు అభిమానుల మనసు దోస్తున్నాయి. చైనా సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా సంప్రదాయ నృత్యాలు, మార్షల్ ఆర్ట్స్, లైవ్ మ్యూజిక్ తో పాటు... అనేక అంతర్జాతీయ ప్రదర్శనలు వేడుకల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆదివారం ముగింపు వేడుకల్లో భాగంగా బాణసంచా ప్రదర్శన ప్రత్యేకతను సంతరించుకోనుంది. -
మతం.. మానవత్వం.. ఫర్నిచర్
ఆక్లాండ్ మతం కన్నా మానవత్వం మిన్న అని నిరూపించాడో ఓ సిక్కు యువకుడు. న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న బాలుడిని కాపాడేందుకు, మత నిబంధనను కూడా పక్కన బెట్టిన ఆ యువకుడి తీరు ప్రశంసలందుకుంది. అతడి చొరవను మెచ్చుకున్న స్థానిక టీవీ చానల్ ఒకటి.. ఓ ఫర్నిచర్ షాపు సహకారంతో.. అతడి అపార్టుమెంటులో కావల్సిన మొత్తం ఫర్నిచర్ అంతటినీ ఉచితంగా అందించింది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం.. 22 ఏళ్ల హర్మన్ సింగ్ తన అపార్ట్మెంట్లో ఏదో పని చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇంతలో రోడ్డు మీద కీచుమనే శబ్దంతో సడన్ బ్రేక్.. శబ్దం. మళ్లీ రయ్ మని దూసుకుపోయిన సౌండ్.. చిన్న పిల్లల అరుపులు, ఏడుపులు వినిపించాయి. అంతే ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా పరుగెత్తుకుంటూ అక్కడకు చేరుకున్నాడు. అక్కతో కలిసి స్కూలుకు వెళ్తూ రోడ్డు దాటుతున్న ఐదేళ్ల పిల్లాడిని ఓ కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. తలకు దెబ్బ తగలడంతో విపరీతమైన రక్తస్రావంతో బాలుడు ప్రమాదకర స్థితిలో పడి ఉన్నాడు. ముందు ఆ రక్తస్రావాన్ని ఆపాలి. ఎలా.. ఇంకేమీ ఆలోచించలేదు.. తన తలపై ఉన్న తలపాగా తీసి బాబుకు కట్టుకట్టాడు. దీంతో చుట్టుపక్కల వారు అవాక్కయ్యారు. ''నేను మతం గురించి గానీ, మరే విషయం గురించి గానీ ఏమీ ఆలోచించలేదు.. ఎలాగైనా కారుతున్న రక్తాన్ని ఆపాలి. అంతే.. అందుకే ఆలా చేశాను'' అన్నాడు హర్మన్ సింగ్. తనకు చాలా ఆనందంగా ఉందని, ఇపుడు నాన్న ఉంటే చాలా సంతోషించేవారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో సింగ్పై ప్రశంసల జల్లు కురిసింది. మానవత్వానికి పెద్దపీట వేసినందుకు చాలా మంది సిక్కులు కూడా అతణ్ని అభినందనల్లో ముంచెత్తారు. -
మృత్యువు అంచుల దాకా వెళ్ళి...
ఆక్ లాండ్: మృత్యువు అంచుల దాకా వెళ్ళిన ఒక మహిళను న్యూజిలాండ్ పోలీసులు అత్యంత సాహసోపేతంగా, చాకచక్యంగా రక్షించారు. ఆక్ లాండ్ లోని వైట మెటా హార్బర్ లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆక్ లాండ్ హార్బర్ లోకి సడన్ గా ఒక బియండబ్ల్యూ కారు వేగంగా దూసుకొచ్చింది. ఊహించని వేగంతో నీళ్లలో మునిగిపోతోంది. అంతే, కారు డ్రైవింగ్ చేస్తున్న మహిళ భయంతో అరవడం మొదలుపెట్టింది. దీన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్కు చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించే పనిలో పడ్డారు. నీళ్లలోకి దూకిన ఇద్దరు పోలీసులు కారు డోర్స్ ఓపెన్ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ సాధ్యంకాలేదు. ఒక పక్క కారుతో పాటు ఆ మహిళ మునిగిపోతోంది. ఇక కారు డోర్లు ఓపెన్ కావని తేలిపోయింది. అంతే పోలీసు మదిలో ఒక ఐడియా తళుక్కున మెరిసింది. పక్కనే ఉన్న రాయిని తీసుకుని విండ్ స్క్రీన్ గ్లాస్ను పగులగొట్టి మహిళను బయటికి లాగారు. దీనితో కథ సుఖాంతమైంది. -
ఆక్లాండ్ (ఈడెన్ పార్క్)
ప్రపంచకప్ మరో 13 రోజుల్లో న్యూజిలాండ్లో అతి పెద్ద స్టేడియం ఈడెన్ పార్క్. 1910 నుంచి ఆక్లాండ్ క్రికెట్కు సొంత స్టేడియంగా ఉంది. 1925 నుంచి ఇక్కడ రగ్బీని కూడా నిర్వహిస్తున్నారు. ఆక్లాండ్ నగరం మధ్యలో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. 1950లో ఎంపైర్ గేమ్స్కు, 1987లో ప్రారంభ రగ్బీ వరల్డ్ కప్, 2011లో రగ్బీ ప్రపంచకప్, 1992 ఐసీసీ ప్రపంచ కప్ మ్యాచ్లకు ఇది ఆతిథ్యమిచ్చింది. 1955-56లో ఇదే మైదానంలో విండీస్ను ఓడించిన కివీస్ టెస్టుల్లో తొలి విజయాన్ని అందుకుంది. అదే సమయంలో అత్యంత చెత్త రికార్డును కూడా న్యూజిలాండ్ మూటగట్టుకుంది. ఇంగ్లండ్తో జరిగిన ఓ టెస్టులో 26 పరుగులకే ఆలౌటైంది. అధిక తేమ, ఉప ఉష్టమండల పరిస్థితుల వల్ల ఇక్కడి పిచ్ స్లో అండ్ స్పిన్ బౌలర్లకు సహకరిస్తుంది. స్టేడియం సామర్థ్యం 50 వేలు. ఇక ఆక్లాండ్ విషయానికొస్తే అద్భుతమైన, సహజసిద్ధమైన ప్రకృతి సంపద అభిమానులను కట్టిపడేస్తుంది. సుందరమైన బీచ్లు, రకరకాల పార్క్లు, సహజ సిద్ధంగా ఏర్పడిన లోయలు, కొండలు, సెలయేర్లు, ఆహార పదార్థాలు, వైన్లు, షాపింగ్ కాంప్లెక్స్, నైట్లైఫ్ కల్చర్, అడ్వెంచర్స్ మతిపోగొడతాయి. ఈ స్టేడియంలో ఫిబ్రవరి 28న ఆసీస్, కివీస్; మార్చి 7న దక్షిణాఫ్రికా, పాక్; 14న భారత్, జింబాబ్వేల మ్యాచ్లు జరుగుతాయి. దీంతో పాటు మార్చి 24న సెమీస్-1 జరుగుతుంది. -
గె(ని)లుస్తారా!
ఇక బ్యాట్స్మెన్దే భారం భారత్ లక్ష్యం 407 ప్రస్తుతం 87/1 రెండో ఇన్నింగ్స్లో కివీస్ 105 ఆలౌట్ తొలి టెస్టులో ఒక్కసారిగా చెలరేగిన బౌలర్లు భారత్ను మ్యాచ్లో నిలబెట్టారు. అయితే కివీస్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే బాధ్యతను బ్యాట్స్మెన్కు వదిలేశారు. దీంతో రసవత్తరంగా సాగుతున్న టెస్టులో కుర్రాళ్లు గె(ని)లుస్తారా! అన్నది ఆసక్తికరంగా మారింది. ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనలో భారత బౌలర్లు తొలిసారి తమ పూర్తిస్థాయి ప్రతిభను ప్రదర్శించారు. ఇన్నింగ్స్ బ్రేక్లో ధోని ఏం చెప్పాడోగానీ అంచనాలకు మించి రాణించారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్లో కివీస్ బ్యాట్స్మెన్ను వణికించారు. 105 పరుగులకు ఆలౌట్ చేసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పి బ్యాట్స్మెన్పై భారం వేశారు. దీంతో ఈడెన్పార్క్లో జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. విజయ్ (13) విఫలమైనా.... శిఖర్ ధావన్ (70 బంతుల్లో 49 బ్యాటింగ్; 5 ఫోర్లు), పుజారా (61 బంతుల్లో 22 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్సర్) నిలకడగా ఆడుతున్నారు. అంతకుముందు 130/4 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 60 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కివీస్కు 301 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్ (120 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రవీంద్ర జడేజా (44 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 41.2 ఓవర్లలో 105 పరుగులకు కుప్పకూలింది. రాస్ టేలర్ (73 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్సర్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఊ 72 పరుగులకు 6 వికెట్లు షెడ్యూల్ కంటే మ్యాచ్ అరగంట ముందుగా ప్రారంభం కావడంతో పిచ్పై ఉండే తేమను కివీస్ బౌలర్లు పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నిస్తున్న రహానే (26), రోహిత్లను ఆరు బంతుల వ్యవధిలో అవుట్ చేశారు. సౌతీ బంతిని ఆడబోయి తొలి స్లిప్లో రహానే క్యాచ్ ఇవ్వగా, రోహిత్ ఓ పేలవమైన షాట్కు వెనుదిరిగాడు. వీరిద్దరి మధ్య ఐదో వికెట్కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధోని (10) ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే రెండో ఎండ్లో జడేజా మాత్రం మొండిగా పోరాడుతూ... జహీర్ (14)తో కలిసి ఫాలో ఆన్ మార్క్ను దాటించాడు. చివర్లో ఇషాంత్ (0), షమీ (2) వెంటవెంటనే అవుట్ కావడంతో భారత్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఓవరాల్గా భారత్ 72 పరుగులకు చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. వాగ్నేర్ 4, బౌల్ట్, సౌతీ చెరో మూడు వికెట్లు తీశారు. ఊ స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 503 ఆలౌట్ భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 0; విజయ్ (బి) వాగ్నేర్ 26; పుజారా (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 1; కోహ్లి (సి) ఫుల్టన్ (బి) సౌతీ 4; రోహిత్ (బి) బౌల్ట్ 72; రహానే (సి) టేలర్ (బి) సౌతీ 26; ధోని (సి) వాట్లింగ్ (బి) వాగ్నేర్ 10; జడేజా నాటౌట్ 30; జహీర్ (సి) వాట్లింగ్ (బి) వాగ్నేర్ 14; ఇషాంత్ (సి) బౌల్ట్ (బి) సౌతీ 0; షమీ (సి) ఫుల్టన్ (బి) వాగ్నేర్ 2; ఎక్స్ట్రాలు: 17; మొత్తం: (60 ఓవర్లలో ఆలౌట్) 202. వికెట్ల పతనం: 1-1; 2-3; 3-10; 4-51; 5-138; 6-138; 7-167; 8-188; 9-189; 10-202 బౌలింగ్: బౌల్ట్ 17-2-38-3; సౌతీ 19-6-38-3; అండర్సన్ 5-0-29-0; వాగ్నేర్ 11-0-64-4; సోధి 6-0-13-0; విలియమ్సన్ 2-0-9-0. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: ఫుల్టన్ (సి) జడేజా (బి) షమీ 5; రూథర్ఫోర్డ్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 0; విలియమ్సన్ (సి) జడేజా (బి) జహీర్ 3; టేలర్ (సి) రహానే (బి) జహీర్ 41; బి.మెకల్లమ్ రనౌట్ 1; అండర్సన్ (బి) షమీ 2; వాట్లింగ్ (బి) ఇషాంత్ 11; సౌతీ (సి) పుజారా (బి) జడేజా 14; సోధి (సి) రోహిత్ (బి) ఇషాంత్ 0; వాగ్నేర్ (సి) జడేజా (బి) ఇషాంత్ 14; బౌల్ట్ నాటౌట్ 7; ఎక్స్ట్రాలు: 7; మొత్తం: (41.2 ఓవర్లలో ఆలౌట్) 105. వికెట్ల పతనం: 1-1; 2-9; 3-11; 4-15; 5-25; 6-63; 7-78; 8-78; 9-80; 10-105 బౌలింగ్: షమీ 12-1-37-3; జహీర్ 9-2-23-2; ఇషాంత్ 10.2-3-28-3; జడేజా 9-4-10-1; రోహిత్ 1-0-3-0. భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 13; ధావన్ బ్యాటింగ్ 49; పుజారా బ్యాటింగ్ 22; ఎక్స్ట్రాలు: 3; మొత్తం: (25 ఓవర్లలో వికెట్ నష్టానికి) 87. వికెట్ల పతనం: 1-36; బౌలింగ్: బౌల్ట్ 6-0-28-0; సౌతీ 5-0-18-1; వాగ్నేర్ 6-2-11-0; అండర్సన్ 3-0-8-0; సోధి 4-1-17-0; విలియమ్సన్ 1-0-5-0. ఊ కుప్పకూలిన కివీస్ తన తొలి రెండు ఓవర్లలో రూథర్ఫోర్డ్ (0), ఫుల్టన్ (5)లను అవుట్ చేసిన షమీ కివీస్కు షాకిచ్చాడు. అయితే టేలర్ నిలకడగా ఆడేందుకు ప్రయత్నించినా... రెండో ఎండ్లో విలియమ్సన్ను జహీర్ కట్టడి చేశాడు. లంచ్కు ముందు జడేజా అద్భుతమైన త్రోకు మెకల్లమ్ రనౌట్ అయ్యాడు. లంచ్ తర్వాత షమీ... అండర్సన్ (2)ను వెనక్కిపంపాడు. దీంతో 25 పరుగులకే సగం జట్టు పెవిలియన్కు చేరడంతో టేలర్పై ఒత్తిడి పెరిగిపోయింది. చివర్లో సౌతీ (14), వాగ్నేర్ (14) కాపాడే ప్రయత్నం చేసినా భారత బౌలర్ల క్రమశిక్షణ ముందు తలవంచారు. -
ఇక ‘మిడిల్’దే భారం
తొలి టెస్టులో భారత్, న్యూజిలాండ్ ఒకే తరహాలో ఇన్నింగ్స్ను మొదలుపెట్టాయి. ఇరుజట్లూ టపటపా మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాయి. న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ మెకల్లమ్, విలియమ్సన్ సెంచరీలతో భారీ స్కోరు అందించారు. ప్రస్తుతం భారత్కు కావలసింది కూడా అదే తరహా ఆట. మిడిలార్డర్ మ్యాజిక్ చేస్తే తప్ప... కివీస్ చేతిలో పరాభవం తప్పదు. ఈ మ్యాచ్ ఎటు సాగుతుందనేది మూడోరోజు తేలుతుంది. ఆక్లాండ్: బౌలర్లు విఫలమైన చోట భారత టాప్ ఆర్డర్ కూడా నిరాశపర్చింది. ప్రత్యర్థి బౌలింగ్ను ఎదుర్కోలేక ఓ దశలో 10 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఫలితంగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ధోనిసేన ఎదురీదుతోంది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 39 ఓవర్లలో 4 వికెట్లకు 130 పరుగులు చేసింది. రోహిత్ (102 బంతుల్లో 67 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్సర్), రహానే (56 బంతుల్లో 23 బ్యాటింగ్; 2 ఫోర్లు) నిలకడగా ఆడుతున్నారు. ధావన్ (0), పుజారా (1), కోహ్లి (4), మురళీ విజయ్ (26) విఫలమయ్యారు. అంతకుముందు 329/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 121.4 ఓవర్లలో 503 పరుగులకు ఆలౌటైంది. మెకల్లమ్ (307 బంతుల్లో 224; 29 ఫోర్లు, 5 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అండర్సన్ (109 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. ఇషాంత్ 6 వికెట్లు తీశాడు. ప్రస్తుతం 373 పరుగులు వెనుకబడి ఉన్న ధోనిసేన ఫాలోఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 174 పరుగులు చేయాలి. సెషన్-1 ఓవర్లు: 24; పరుగులు: 144; వికెట్లు: 3 మెకల్లమ్ వీరవిహారం ఓవర్నైట్ బ్యాట్స్మెన్ మెకల్లమ్, అండర్సన్లు చెలరేగడంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. 88 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న అండర్సన్ రెండో రోజు ఎదుర్కొన్న 26 బంతుల్లో 21 పరుగులు రాబట్టాడు. మెకల్లమ్ కూడా ధాటిగా ఆడుతూ 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో అండర్సన్... ఇషాంత్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. వీరిద్దరు ఐదో వికెట్కు 133 పరుగులు జోడించారు. వాట్లింగ్ (1) నిరాశపర్చినా... సౌతీ (21 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సాయంతో మెకల్లమ్ విజృంభించాడు. సోధి (27 బంతుల్లో 23; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. మెకల్లమ్... జడేజా బౌలింగ్లో ఓ సిక్సర్, ఫోర్ కొట్టి కెరీర్లో రెండో ‘డబుల్’ సెంచరీ పూర్తి చేశాడు. ఇషాంత్ జోరు లంచ్ తర్వాత కివీస్ జోరుకు ఇషాంత్, జడేజా అడ్డుకట్ట వేశారు. చకచకా మూడు వికెట్లు తీసి కివీస్ ఇన్నింగ్స్ను ముగించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్కు కివీస్ పేసర్ బౌల్ట్ వరుసగా షాకిచ్చాడు. ఇన్నింగ్స్ రెండో బంతికి ధావన్, ఆరో బంతికి పుజారాను అవుట్ చేశాడు. విజయ్ వికెట్ను కాపాడుకునే ప్రయత్నం చేసినా... రెండో ఎండ్లో వచ్చిన కోహ్లిని సౌతీ దెబ్బతీశాడు. దీంతో భారత్ 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్, విజయ్ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఇన్నింగ్స్ను నడిపించే ప్రయత్నం చేశారు. సెషన్-2 ఓవర్లు: 7.4; పరుగులు: 30; వికెట్లు: 3 (కివీస్) ఓవర్లు: 18; పరుగులు: 45; వికెట్లు: 3 (భారత్) స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: ఫుల్టన్ ఎల్బీడబ్ల్యు (బి) జహీర్ 13; రూథర్ఫోర్డ్ (సి) రహానే (బి) ఇషాంత్ 6; విలియమ్సన్ (సి) ధోని (బి) జహీర్ 113; టేలర్ (సి) జడేజా (బి) ఇషాంత్ 3; బి.మెకల్లమ్ (సి) జడేజా (బి) ఇషాంత్ 224; అండర్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 77; వాట్లింగ్ (సి) ధావన్ (బి) ఇషాంత్ 1; సౌతీ (బి) షమీ 28; సోధి (సి) రోహిత్ (బి) ఇషాంత్ 23; వాగ్నేర్ (సి) కోహ్లి (బి) జడేజా 0; బౌల్ట్ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు: 14; మొత్తం: (121.4 ఓవర్లలో ఆలౌట్) 503. వికెట్లపతనం: 1-19; 2-23; 3-30; 4-251; 5-384; 6-398; 7-434; 8-490; 9-495; 10-503. బౌలింగ్: షమీ 28-6-95-1; జహీర్ 30-2-132-2; ఇషాంత్ 33.4-4-134-6; జడేజా 26-1-120-1; కోహ్లి 1-0-4-0; రోహిత్ 3-0-12-0. భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 0; విజయ్ (బి) వాగ్నేర్ 26; పుజారా (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 1; కోహ్లి (సి) ఫుల్టన్ (బి) సౌతీ 4; రోహిత్ బ్యాటింగ్ 67; రహానే బ్యాటింగ్ 23; ఎక్స్ట్రాలు: 9; మొత్తం: (39 ఓవర్లలో 4 వికెట్లకు) 130. వికెట్లపతనం: 1-1; 2-3; 3-10; 4-51 బౌలింగ్: బౌల్ట్ 10-1-20-2; సౌతీ 12-3-27-1; అండర్సన్ 2-0-9-0; వాగ్నేర్ 7-0-46-1; ఇష్ సోధి 6-0-13-0; విలియమ్సన్ 2-0-9-0. సెషన్-3 ఆదుకున్న రోహిత్ టీ విరామం తర్వాత విజయ్ విఫలమైనా రోహిత్ నిలకడగా ఆడాడు. రోహిత్ విజయ్ నాలుగో వికెట్కు 41 పరుగులు జోడించారు. రహానే ఆచితూచి ఆడగా... రోహిత్ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు సాధించాడు. ఈ సెషన్లో పరుగులు నెమ్మదిగా వచ్చినా... రోహిత్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. విలియమ్సన్ బౌలింగ్లో భారీ సిక్సర్ కొట్టి ఆత్మ విశ్వాసాన్ని కనబర్చాడు. రోహిత్, రహానే ఐదో వికెట్కు అజేయంగా 79 పరుగులు జోడించారు. ఓవర్లు: 21; పరుగులు: 85; వికెట్లు: 1 -
భారత్ 130/4
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలిటెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో 39 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. శిఖరదావన్, మురళీ విజయ్, పుజారా, కోహ్లీ అవుటయ్యారు. 67 పరుగలలో రోహిత్ శర్మ , 23 పరుగులతో రహానా క్రీజులోనే ఉన్నారు. ఇష్ సోది, కేన్ విలియమ్సన్ బౌలింగ్ చేస్తున్నారు. భారత్, న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య గురువారం తెల్లవారుజామున అక్లాండ్ లో ప్రారంభమైంది. మొదటగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 503 పరుగులు తీసింది. -
శతకాల మోత
తొలి టెస్టులో ఆరంభంలో చెలరేగిన భారత బౌలర్లు చివర్లో నిరాశపర్చారు. కీలక సమయంలో వికెట్లు తీయలేకపోవడం, ఫీల్డింగ్లో నాలుగు క్యాచ్లు జారవిడవడంతో తొలి రోజు భారత్ మూల్యం చెల్లించుకుంది. మరోవైపు బ్రెండన్ మెకల్లమ్, విలియమ్సన్ సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఆక్లాండ్: ‘కీలక సమయంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలి’ తొలి టెస్టుకు ముందు ధోని చేసిన ఈ వ్యాఖ్యలను భారత ఆటగాళ్లు మాత్రం ఆచరణలో పెట్టలేకపోయారు. తొలి సెషన్లో కట్టుదిట్టమైన బౌలింగ్తో చకచకా మూడు వికెట్లు తీసి మ్యాచ్పై పట్టు బిగించే అవకాశం వచ్చినా చేజేతులా జారవిడుచుకున్నారు. ఫలితంగా రెండు సెషన్ల పాటు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన న్యూజిలాండ్... గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లకు 329 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్రెండన్ మెకల్లమ్ (210 బంతుల్లో 143 బ్యాటింగ్; 18 ఫోర్లు, 2 సిక్సర్లు), విలియమ్సన్ (172 బంతుల్లో 113; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో దుమ్మురేపారు. మెకల్లమ్తో పాటు అండర్సన్ (78 బంతుల్లో 42 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్సర్) క్రీజులో ఉన్నాడు. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కివీస్ను మెలక్లమ్, విలియమ్సన్ నాలుగో వికెట్కు 221 పరుగులు జోడించి ఆదుకున్నారు. జహీర్, ఇషాంత్ చెరో రెండేసి వికెట్లు తీశారు. పేసర్ల విజృంభణ వాతావరణం మేఘావృతం కావడం, పిచ్పై తేమ ఉండటంతో భారత్ బౌలింగ్ ఎంచుకుంది. పేసర్లు ఆరంభంలో చెలరేగారు. 10వ ఓవర్లో బౌలింగ్కు దిగిన ఇషాంత్ ఐదో బంతికి రూథర్ఫోర్డ్ (30 బంతుల్లో 6; 1 ఫోర్)ను అవుట్ చేశాడు. ఫుల్టన్ (35 బంతుల్లో 13; 2 ఫోర్లు)కు జహీర్ షాక్ ఇచ్చాడు. విలియమ్సన్కు జత కలిసిన టేలర్ (15 బంతుల్లో 3) ఆరంభం నుంచే ఇబ్బంది పడ్డాడు. చివరకు ఇషాంత్ బౌలింగ్లో బంతిని డ్రైవ్ చేయబోయి షార్ట్ మిడాఫ్లో జడేజా చేతికి చిక్కాడు. దీంతో కివీస్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత మెకల్లమ్, విలియమ్సన్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యమివ్వడంతో లంచ్ వరకు ఆతిథ్య జట్టు పెద్దగా పరుగులు చేయలేకపోయింది. విలియమ్సన్ నిలకడ... ఎండ వల్ల వికెట్ పొడిగా మారడంతో లంచ్ తర్వాత భారత బౌలర్లు బంతిపై పట్టు కోల్పోయారు. దీన్ని ఆసరాగా చేసుకున్న విలియమ్సన్, మెకల్లమ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. 33, 38వ ఓవర్లలో రెండు భారీ సిక్సర్లతో రెచ్చిపోయిన విలియమ్సన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో ఎండ్లో మెకల్లమ్ వరుసగా బౌండరీలు బాదుతూ 43వ ఓవర్లో అర్ధ సెంచరీని సాధించాడు. 44వ ఓవర్లో జడేజా బౌలింగ్కు వచ్చినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. ఓవర్కు ఒకటి, రెండు బౌండరీలు రావడంతో కివీస్ స్కోరు బోర్డు వేగంగా కదిలింది. మెకల్లమ్, విలియమ్సన్ ఈ సెషన్లో 125 పరుగులు జోడించగా, భారత్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. మెకల్లమ్ జోరు... క్రీజులోకి ఆలస్యంగా వచ్చినా మెకల్లమ్ మాత్రం విలియమ్సన్ కంటే వేగంగా ఆడాడు. 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్లో సిక్సర్ సంధించి కెరీర్లో 8వ శతకాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత విలియమ్సన్ కూడా ఓ బౌండరీ, సింగిల్తో ఐదో సెంచరీని అందుకున్నాడు. 102 పరుగుల వద్ద మెకల్లమ్ ఇచ్చిన క్యాచ్ను ధావన్ జారవిడిచాడు. అయితే నిలకడగా ఆడుతున్న ఈ జోడిని జహీర్ విడగొట్టాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్కు నెలకొన్న 221 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన అండర్సన్ నిలకడగా ఆడాడు. మెకల్లమ్, అండర్సన్ ఐదో వికెట్కు అజేయంగా 78 పరుగులు జోడించి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: ఫుల్టన్ ఎల్బీడబ్ల్యు (బి) జహీర్ 13; రూథర్ఫోర్డ్ (సి) రహానే (బి) ఇషాంత్ 6; విలియమ్సన్ (సి) ధోని (బి) జహీర్ 113; టేలర్ (సి) జడేజా (బి) ఇషాంత్ 3; బి.మెకల్లమ్ బ్యాటింగ్ 143; అండర్సన్ బ్యాటింగ్ 42; ఎక్స్ట్రాలు: 9; మొత్తం: (90 ఓవర్లలో 4 వికెట్లకు) 329. వికెట్లపతనం: 1-19; 2-23; 3-30; 4-251 బౌలింగ్: షమీ 22-6-66-0; జహీర్ 23-2-98-2; ఇషాంత్ 21-4-62-2; జడేజా 20-1-81-0; కోహ్లి 1-0-4-0; రోహిత్ 3-0-12-0. సెషన్-1 ఓవర్లు: 24; పరుగులు: 54; వికెట్లు: 3 సెషన్-2 ఓవర్లు: 27; పరుగులు: 125; వికెట్లు: 0 సెషన్-3 ఓవర్లు: 39; పరుగులు: 150; వికెట్లు: 1 ఇషాంత్@150 భారత పేసర్ ఇషాంత్ శర్మ టెస్టుల్లో 150 వికెట్లు తీసిన మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 11వ భారత బౌలర్గా రికార్డులకెక్కాడు. తొలి టెస్టులో ఓపెనర్ రూథర్ఫోర్డ్ను అవుట్ చేయడం ద్వారా అతను ఈ ఘనత సాధించాడు. 3 విదేశీ గడ్డపై టెస్టుల్లో 200 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ జహీర్. కుంబ్లే (269), కపిల్ (215) ఈ జాబితాలో ముందున్నారు. 1 టెస్టుల్లో 9 ఏళ్ల తర్వాత కివీస్ తరఫున మూడో నంబర్లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్మన్ విలియమ్సన్. 1 వరుసగా ఆరు ఇన్నింగ్స్లో అర్ధసెంచరీలు, అంతకుపైగా స్కోరు సాధించిన తొలి బ్యాట్స్మన్ విలియమ్సన్. నా ప్రదర్శన సంతృప్తినిచ్చింది. 150 వికెట్ల క్లబ్లో చేరినందుకు సంతోషంగా ఉంది. ఇది నాకు గొప్ప ఘనత. నా శైలి, రిథమ్ గురించి ఇబ్బంది లేదు. రోజంతా జహీర్, నేను మంచి ప్రదేశాల్లో బంతులు వేయగలిగాం. అయితే మెకల్లమ్, విలియమ్సన్ మెరుగ్గా ఆడారు. ఇలాంటి వికెట్పై సహనంతో బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. - ఇషాంత్ (భారత పేసర్) టాస్ గెలిస్తే బాగుంటుందని భావించాం. కానీ అలా జరగలేదు. కొత్త బంతిని ఎదుర్కొవడం కాస్త ఇబ్బందే. లంచ్ తర్వాత బ్యాటింగ్ చేయడం సులువైంది. ప్రస్తుతం మేం ఆధిపత్యంలో ఉన్నాం. ఏదో ఓ దశలో భారత బౌలర్లు మ్యాచ్పై ప్రభావం చూపిస్తారు. మెకల్లమ్ బ్యాటింగ్ అద్భుతం. - విలియమ్సన్ (కివీస్ బ్యాట్స్మన్) -
చెలరేగిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు
-
చెలరేగిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు
ఆక్లాండ్ టెస్ట్లో న్యూజిలాండ్ అదరగొట్టింది. ఆరంభంలో ఇండియా బౌలర్లు చెలరేగినా... ఆ తర్వాత న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ చెలరేగారు. స్కిప్పర్ బ్రెండన్ మెక్కులమ్, కేన్ విలియమ్స్ లిద్దరు సెంచరీలు చేసి కివీస్ ఇన్నింగ్స్ను స్థిర పరచడమే కాకుండా భారీ స్కోరు దిశగా నడిపించారు. మెక్కులమ్ తన కెరీర్లో ఎనిమిదో సెంచరీ చేయగా, విలియమ్స్ ఐదో సెంచరీ చేశాడు. విలియమ్స్ ఔటయ్యాక వచ్చిన అండరన్సన్ కూడా స్థిరంగా ఆడటంతో న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 329 పరుగులు చేసింది. -
అవకాశాలను అందిపుచ్చుకోండి
ఆక్లాండ్: టెస్టు సిరీస్లో కీలక సమయంలో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని... తన సహచరులకు సూచించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టు సిరీస్లో రాణించడం ఇక్కడ దోహదపడుతుందన్నాడు. నేటి నుంచి న్యూజిలాండ్తో తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో ధోని బుధవారం మీడియాతో మాట్లాడాడు. ‘చివరి టెస్టు సిరీస్ను పరిగణనలోకి తీసుకుంటే ఒకే ఒక్క సెషన్ బాగా ఆడలేదు. సిరీస్ మొత్తంతో పోలిస్తే రెండున్నర గంటలు మంచి క్రికెట్ ఆడలేకపోయాం. దాని వల్లే సిరీస్ కోల్పోయాం. కీలక సమయంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. కాబట్టి ప్రస్తుతం దీనిపై పూర్తిగా దృష్టిపెట్టాం. ఈ ఫార్మాట్లో ఒకటి, రెండు గంటలు బాగా ఆడకపోయినా మ్యాచ్ మొత్తంపై దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆత్మ విశ్వాసంతో పూర్తి ఆధిపత్యం కనబర్చాలి. మంచి భాగస్వామ్యాలు జోడించాలి’ అని ధోని పేర్కొన్నాడు. వన్డే సిరీస్ను మర్చిపోయాం వన్డేల్లో ఎదురైన ఓటమిని మర్చిపోయేందుకు తమకు మంచి సమయమే లభించిందని చెప్పిన ధోని టెస్టు సిరీస్పై పూర్తిగా దృష్టిపెట్టామన్నాడు. పచ్చిక వికెట్లపై ఆడేందుకు తాము భయపడటం లేదన్నాడు. అయితే వికెట్ మీద ఎక్కువ పచ్చిక ఉండటం వల్ల తేమ కూడా అధికంగా ఉంటుందని అభిప్రాయపడిన కెప్టెన్ బ్యాటింగ్కు కాస్త ఇబ్బంది అని చెప్పాడు. వికెట్ పొడిగా, కఠినంగా ఉంటే మంచి స్ట్రోక్స్ ఆడొచ్చన్నాడు. జహీర్, ఇషాంత్ల గురించి మాట్లాడుతూ.... ‘జహీర్ వద్ద ఉన్న కొత్త ప్రణాళికలు మాకు ఉపయోగపడతాయి. యువ బౌలర్లను బాగా ప్రోత్సహిస్తాడు. ఉపఖండం బయట అతను మంచి బౌలర్. అనుభవం ఉన్న బౌలర్ జట్టులో ఉండటం చాలా మంచిది. ఇషాంత్ ఛేంజ్ బౌలర్గా కాకుండా కీలక సమయంలో వికెట్లు తీసేందుకు ఉపయోగిస్తున్నాం. 25, 30 ఓవర్ల తర్వాత బంతిని స్వింగ్ చేయలేం. కాబట్టి ఎక్స్ట్రా బౌన్స్తో బ్యాట్స్మెన్ను కట్టడి చేయాలి. ఇది చాలా కీలకమైంది. ఒకే తరహాలో, ఒకే ప్రాంతంలో లెంగ్త్కు కట్టుబడి బంతులు వేస్తూ బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెంచాలి’ అని కెప్టెన్ వివరించాడు. చతేశ్వర్ పుజారా నిలకడగా ఆడటం తమకు లాభిస్తుందన్నాడు. మిడిలార్డర్లో ఎక్కువసేపు క్రీజులో ఉండటాన్ని అతను ఆస్వాదిస్తాడన్నాడు. పుజారాను రెచ్చగొట్టడం అంత సులువుకాదని ధోని స్పష్టం చేశాడు. నలుగురు సీమర్లతో కివీస్... తొలి టెస్టులో తాము నలుగురు సీమర్లతో ఆడతామని కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడు. విండీస్తో ఆడిన టెస్టు జట్టును యథావిధిగా ఈ మ్యాచ్లో బరిలోకి దించుతున్నామన్నాడు. లెగ్ స్పిన్నర్ ఇష్ సోధి నుంచి భారత్కు కష్టాలు తప్పవన్నాడు. ‘పచ్చిక వికెట్పై నలుగురు సీమర్లతో ఆడటం ఉత్సాహన్నిస్తుంది. వికెట్ నుంచి సహకారం లేకపోయినా సోధి మంచి ప్రదర్శన కనబర్చాడు. తన సత్తాకు న్యాయం చేకూరుస్తాడని నా నమ్మకం’ అని మెకల్లమ్ వెల్లడించాడు. ప్రతిష్టాత్మక పౌర పురస్కారం ‘భారతరత్న’ అవార్డును స్వీకరించిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు మహీ... శుభాకాంక్షలు తెలిపాడు. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న మాస్టర్ ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హుడన్నాడు. ‘ఇది అద్భుతమైన వార్త. క్రీడాకారుడికి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. ఓ సాధారణ పౌరుడికి ఇంతకంటే గొప్ప పురస్కారం ఉండదు. మైదానం లోపల, బయటా సచిన్ ఒత్తిడిని జయించిన తీరు అమోఘం. కెరీర్ మొత్తం దీన్ని ఒకేలా కొనసాగించాడు. కాబట్టే అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచాడు’ అని ధోని వ్యాఖ్యానించాడు. -
ఐదు రోజుల పరీక్ష!
-
ఐదు రోజుల పరీక్ష!
గురువారం తెల్లవారుజామున గం. 3.30 నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్ష ప్రసారం న్యూజిలాండ్ గడ్డపై ఎన్నో అంచనాలతో అడుగు పెట్టిన భారత జట్టు ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చలేదు. ప్రాక్టీస్ మ్యాచ్లో కాస్త ప్రభావం చూపినట్లు కనిపించినా...భిన్నమైన పిచ్లు, బౌలర్లు ఎదురయ్యే అసలు టెస్ట్ మ్యాచ్తో దీనిని పోల్చలేం. మరో వైపు భారత్ బలహీనతపై గురి పెడుతూ పేస్తో విరుచుకు పడతామంటూ కివీస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ పరాభవంనుంచి కోలుకొని టీమిండియా రెండు టెస్టుల్లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి. ఆక్లాండ్: ‘భారత జట్టు చెప్పుకోదగ్గ స్కోరు చేసినా మా షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో వారు తడబడ్డారు. పుల్ లేదా హుక్ చేయడానికి ప్రయత్నించి అవుటయ్యారు. టెస్టుల్లో ఇలాంటివి ఇంకా చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ విషయంలో వారు పాఠాలు నేర్చుకున్నారేమో తెలీదు’...వాంగేరిలో తమతో వార్మప్ మ్యాచ్ అనంతరం కివీస్ ఎలెవన్ కెప్టెన్ ఆంటాన్ డేవ్సిక్ చేసిన ఈ ఒక్క వ్యాఖ్య టీమిండియా ప్రస్తుత పరిస్థితిని సూచిస్తోంది. మరి నిజంగా భారత జట్టు పరిస్థితి అలాగే ఉందా, లేక గత పర్యటనతో పోలిస్తే మన పరిస్థితి ఏమైనా మెరుగుపడిందా రానున్న ఐదు రోజుల్లో తేలిపోతుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారంనుంచి ఇక్కడి ఈడెన్ పార్క్లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఫామ్లో కివీస్... సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే ఒక పెద్ద జట్టు (వెస్టిండీస్)పై టెస్టు సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ ఆత్మ విశ్వాసంతో ఉంది. ఆ జట్టులో ఆటగాళ్లంతా ఫామ్లో ఉన్నారు. దాంతో ఒక్క మార్పు లేకుండా అదే జట్టును ఈ సిరీస్ కోసం కొనసాగించారు. టేలర్, విలియమ్సన్ల ఫామ్ సానుకూలాంశం. బౌలింగ్లో కివీస్ కూడా ముగ్గురు పేసర్లతో పాటు సోధి రూపంలో ఒక స్పిన్నర్తో బరిలోకి దిగవచ్చు. ఎడమ చేతి వాటం పేసర్ ట్రెంట్ బౌల్ట్ భారత్కు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది మార్పుల్లేకపోవచ్చు... వార్మప్ మ్యాచ్లో భారత టాప్ ఆర్డర్ ఆటగాళ్లు ముగ్గురు మరి కొంత సేపు బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపించింది. వైఫల్యంగా చెప్పకపోయినా విజయ్, ధావన్, పుజారా త్వరగానే పెవిలియన్ చేరారు. రోహిత్, రహానేలకు మాత్రం ప్రాక్టీస్ లభించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పేస్ బౌలింగ్ను మన జట్టు సమర్థంగా ఎదుర్కోవడంపై జట్టు విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయి. దక్షిణాఫ్రికా పర్యటనలో డర్బన్ టెస్టు ఆడిన టీమ్నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. భారత్ ముగ్గురు పేసర్లతో ఆడితే...స్పిన్నర్ అశ్విన్, జడేజాల మధ్య స్థానం కోసం పోటీ ఉంటుంది. ప్రస్తుతానికి ఫామ్ పరంగా మొగ్గు జడేజా వైపే ఉంది. జహీర్, షమీ ప్రధాన పేసర్లు కాగా, ఇషాంత్, ఉమేశ్లలో ఒకరికి చోటు దక్కవచ్చు. ప్రాక్టీస్ మ్యాచ్లో ఆకట్టుకున్నా పాండేకు అప్పుడే అవకాశం దక్కకపోవచ్చు. పిచ్, వాతావరణం టైగా ముగిసిన మూడో వన్డే జరిగిన ఈడెన్ పార్క్లోనే ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం కూడా రెడీమేడ్ ‘డ్రాప్ ఇన్’ పిచ్ను ఉపయోగిస్తున్నారు. దీనిపై చక్కటి బౌన్స్ ఉంటుంది. బ్యాటింగ్కు అనుకూలిస్తూ చివర్లో టర్న్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఎప్పుడూ ఆకాశం మేఘావృతంగానే కనిపిస్తుంది. కానీ భారీ వర్షానికి అవకాశం లేదు. ఐదు రోజులూ మ్యాచ్కు అడ్డంకి ఉండకపోవచ్చు. జూన్ 2011 వరుసగా 12 టెస్టుల పాటు భారత జట్టు విదేశాల్లో విజయం సాధించలేదు. ఆక్లాండ్లో నాలుగు టెస్టులు ఆడిన భారత్ 2 గెలిచి, 2 డ్రా చేసుకుంది. కివీస్ గడ్డపై భారత్కు దక్కిన 5 విజయాల్లో 2 ఇక్కడే రావడం విశేషం. జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), విజయ్, ధావన్, పుజారా, కోహ్లి, రహానే, రోహిత్ శర్మ, జడేజా, జహీర్, షమీ, ఇషాంత్/ఉమేశ్. న్యూజిలాండ్: బ్రెండన్ మెకల్లమ్, ఫుల్టన్, రూథర్ఫోర్డ్, విలియమ్సన్, టేలర్, అండర్సన్, వాట్లింగ్, సౌతీ, సోధి, వాగ్నర్, బౌల్ట్. భారత్పై ఒత్తిడి పెంచుతాం ‘భారత బ్యాట్స్మన్ అటాకింగ్ తరహా ఆట ఆడతారు. చక్కటి స్వింగ్, బౌన్స్తో వారి బ్యాటింగ్ టెక్నిక్ బలహీనతలు బయటపెడతాం. మా వ్యూహాలతో వారిని కట్టడి చేస్తాం. అయితే అలాంటి అత్యుత్తమ బ్యాట్స్మెన్తో పోటీ పడటం మాకు కూడా సవాలే. క్రమం తప్పకుండా బౌన్సర్లు వేసేందుకు ప్రయత్నిస్తాం. విండీస్తో సిరీస్లో స్వింగ్ నా బలం. ఇప్పుడు దానినే కొనసాగిస్తా’ - ట్రెంట్ బౌల్ట్, న్యూజిలాండ్ బౌలర్ -
గుప్టిల్కు మొండిచెయ్యి
ఆక్లాండ్: మూడో వన్డేలో సెంచరీతో చెలరేగిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్కు... టెస్టు జట్టులో మాత్రం చోటు దక్కలేదు. వచ్చే నెల 6 నుంచి భారత్తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్కు కివీస్ జట్టును ఆదివారం ప్రకటించారు. డిసెంబర్లో విండీస్తో ఆడిన జట్టునే యథావిధిగా కొనసాగించారు. కుటుంబ కారణాలతో సిరీస్ మధ్యలో రాస్ టేలర్ ఇంటికి వెళ్లే అవకాశం ఉండటంతో రైడర్ను కూడా ఎంపిక చేశారు. పీటర్ ఫుల్టన్, రూథర్ఫోర్డ్పై సెలక్టర్లు నమ్మకం పెట్టారు. భారత సంతతికి చెందిన స్పిన్నర్ సోధికి అవకాశం లభించింది. టెస్టు సిరీస్కు ముందు భారత్... కివీస్ ఎలెవన్తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఫుల్టన్, రూథర్ఫోర్డ్ ఈ మ్యాచ్లోనూ ఆడనున్నారు. టెస్టు జట్టు: మెకల్లమ్ (కెప్టెన్), అండర్సన్, బౌల్ట్, బ్రాస్వెల్, ఫుల్టన్, రూథర్ఫోర్డ్, సోధి, సౌతీ, టేలర్, వాగ్నేర్, వాట్లింగ్, విలియమ్సన్. -
హ్యాట్సాఫ్ ‘సర్జీ’
ఓడిపోయే మ్యాచ్ను కాపాడిన జడేజా భారత్, న్యూజిలాండ్ మూడో వన్డే టై రాణించిన అశ్విన్, ధోని కష్టమో... నిష్టూరమో... అన్ని వైపుల నుంచి వస్తున్న విమర్శలను ఎదుర్కొంటూ ధోని ఇన్నాళ్లూ జడేజా, అశ్విన్లను కొనసాగించాడు. ఇంతకాలానికి ఈ ఇద్దరూ కలిసి ధోని మాట దక్కించారు. భారత్ ఓడిపోవడం ఖాయమనుకున్న మ్యాచ్ను వీరోచితంగా పోరాడి ‘టై’ చేశారు. ముఖ్యంగా ‘సర్’ జడేజా సంచలన బ్యాటింగ్తో ఆఖరి బంతి వరకూ ఒత్తిడిని అధిగమించి... టెయిలెండర్ల సాయంతో భారత్ సిరీస్ను కోల్పోకుండా కాపాడాడు. ఆక్లాండ్: భారత ఆటగాళ్ల పోరాటపటిమతో న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆశలు సజీవంగా నిలిచాయి. తనలోని పూర్తి స్థాయి సామర్థ్యాన్ని బయటకు తీసిన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (45 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరిపోరాటంతో ఆకట్టుకోగా, అశ్విన్ (46 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్సర్) తన బ్యాటింగ్ ప్రతిభను చూపెట్టాడు. ఇక గెలుపు కష్టమే అనుకున్న మ్యాచ్ను ఈ ఇద్దరు తమదైన శైలిలో ఆడి ‘టై’ చేశారు. శనివారం న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డే టైగా ముగియడంతో... ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం ఆతిథ్య జట్టు 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక భారత్ మిగిలిన రెండు మ్యాచ్ల్లో గెలిచినా సిరీస్ దక్కదు. కాకపోతే చివరి రెండూ గెలిస్తే సిరీస్ను డ్రా చేసుకోవచ్చు. మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 314 పరుగులకు ఆలౌటైంది. గుప్టిల్ (129 బంతుల్లో 111; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), విలియమ్సన్ (74 బంతుల్లో 65; 4 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ధోని (60 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. అండర్సన్ 5, బిన్నెట్ 2 వికెట్లు తీశారు. మ్యాచ్ హైలైట్స్... 1.గుప్టిల్ సెంచరీ కివీస్ ఓపెనర్లలో రైడర్ (12 బంతుల్లో 20; 4 ఫోర్లు) విఫలమైనా గుప్టిల్ మాత్రం సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ నిలకడగా పరుగులు చేశాడు. విలియమ్సన్తో కలిసి రెండో వికెట్కు 153 పరుగులు జోడించాడు. మిడిలార్డర్లో రోంచీ (20 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా మిగతా వారు నిరాశపర్చినా... చివర్లో సౌతీ (23 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్సర్లు) దుమ్మురేపాడు. జట్టు స్కోరు 289/9 ఉన్న దశలో అతను ఇచ్చిన క్యాచ్ను భువీ మిస్ చేశాడు. తర్వాత సౌతీ రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టడంతో భారీ స్కోరు వచ్చింది. 2.ఓపెనర్ల శుభారంభం ఈ టూర్లో తొలిసారి భారత ఓపెనర్లు ఆకట్టుకున్నారు. తొలి వికెట్కు ధావన్, రోహిత్ కలిసి 64 పరుగులు జోడించారు. 3.ధోని పోరాటం భారత్ ఏడు పరుగుల వ్యవధిలో రోహిత్, కోహ్లి, రహానేల వికెట్లు కోల్పోయి... 79/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో రైనా, ధోని పోరాడి ఐదో వికెట్కు 67 పరుగులు జోడించారు. రైనా అవుటయ్యాక వచ్చిన అశ్విన్ నెమ్మదిగా ఆడితే.. ధోని మాత్రం వేగంగా ఆడాడు. భారీ సిక్సర్తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న ధోని అండర్సన్కే వికెట్ను సమర్పించుకున్నాడు. దీంతో అశ్విన్తో ఆరో వికెట్కు నెలకొన్న 38 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఫలితంగా 184 పరుగుల వద్ద భారత్ ఆరో వికెట్ను చేజార్చుకుంది. 4.టర్నింగ్ పాయింట్ ధోని అవుటైన తర్వాత అశ్విన్ విశ్వరూపం చూపాడు. విజయానికి 84 బంతుల్లో 129 పరుగులు కావాల్సిన దశలో జడేజాతో కలిసి పరుగుల వరద పారించాడు. ఓవర్కో బౌండరీ చొప్పున కొట్టాడు. సౌతీ బౌలింగ్లో భారీ సిక్సర్తో జడేజా గాడిలో పడితే... నాథన్ బౌలింగ్లో ఫోర్తో అశ్విన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు భారత్ విజయ లక్ష్యం 36 బంతుల్లో 54 పరుగులుగా మారింది. ఈ దశలో నాథన్ బౌలింగ్లో అశ్విన్ భారీ సిక్సర్ సంధించాడు. కానీ మరో మూడు బంతుల తర్వాత కొట్టిన అలాంటి షాట్ను బౌండరీ వద్ద గుప్టిల్ అద్భుతంగా అందుకోవడంతో మ్యాచ్ కివీస్ వైపు టర్న్ అయ్యింది. జడేజా, అశ్విన్ 55 బంతుల్లో 85 పరుగులు జోడించారు. 5.ఆఖరి ఓవర్లో ఉత్కంఠ జడేజా నిలబడినా... రెండో ఎండ్లో భువనేశ్వర్ (4), షమీ (2) వెంటనే అవుటయ్యారు. చివరి బ్యాట్స్మన్గా ఆరోన్ (2 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. విజయానికి కివీస్కు ఒక్క వికెట్ అవసరమైతే.. భారత్కు 6 బంతుల్లో 18 పరుగులు కావాలి. టాప్ ఆర్డర్ను దెబ్బతీసిన అండర్సన్ తొలి బంతి వేశాడు. జడేజా డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీకి తరలించాడు. రెండో బంతి వైడు. తర్వాతి బంతిని కట్ చేయబోయి విఫలమయ్యాడు. మూడో బంతిని థర్డ్మ్యాన్ వైపు నెట్టాడు. సింగిల్ తీసే అవకాశం ఉన్నా తీయలేదు. ఇక చివరి 3 బంతుల్లో 13 పరుగులు చేయాలి. మళ్లీ వైడు. దీంతో భారత లక్ష్యం 12 పరుగులకు వచ్చింది. నాలుగో బంతిని జడేజా సులువుగా ఫ్లిక్ చేశాడు. అంతే బౌండరీ రోప్ దాటింది. షార్ట్ లెంగ్త్ రూపంలో వచ్చిన ఐదో బంతిని గాల్లోకి లేపి సిక్సర్గా మలిచాడు. దీంతో 10 పరుగులు సమకూరాయి. ఇక చివరి బంతికి 2 పరుగులు కావాలి. జడేజా మిడాఫ్లోకి ఆడగా బంతి నేరుగా ఫీల్డర్ దగ్గరకు వెళ్లింది. సింగిల్ మాత్రమే వచ్చింది. మ్యాచ్ టైగా ముగిసింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గుప్టిల్ (సి) రహానే (బి) జడేజా 111; రైడర్ (బి) భువనేశ్వర్ 20; విలియమ్సన్ (బి) షమీ 65; అండర్సన్ (బి) అశ్విన్ 8; టేలర్ రనౌట్ 17; బి.మెకల్లమ్ (సి) అశ్విన్ (బి) ఆరోన్ 0; రోంచీ (సి) రహానే (బి) జడేజా 38; ఎన్.మెకల్లమ్ రనౌట్ 1; సౌతీ రనౌట్ 27; మెక్లీనగన్ (సి) జడేజా (బి) షమీ 3; బిన్నెట్ నాటౌట్ 3; ఎక్స్ట్రాలు: 21; మొత్తం: (50 ఓవర్లలో ఆలౌట్) 314. వికెట్లపతనం: 1-36; 2-189; 3-198; 4-224; 5-230; 6-270; 7-280; 8-280; 9-288; 10-314. బౌలింగ్: భువనేశ్వర్ 9-0-48-1; షమీ 10-0-84-2; ఆరోన్ 7-0-52-1; జడేజా 10-0-47-2; అశ్విన్ 10-0-47-1; రైనా 4-0-26-0. భారత్ ఇన్నింగ్స్: ధావన్ (సి) గుప్టిల్ (బి) అండర్సన్ 28; రోహిత్ (సి) బిన్నెట్ (బి) అండర్సన్ 39; కోహ్లి (సి) రోంచీ (బి) బిన్నెట్ 6; రహానే (సి) రోంచీ (బి) అండర్సన్ 3; రైనా (సి) రోంచీ (బి) సౌతీ 31; ధోని (సి) సౌతీ (బి) అండర్సన్ 50; అశ్విన్ (సి) గుప్టిల్ (బి) ఎన్.మెకల్లమ్ 65; జడేజా నాటౌట్ 66; భువనేశ్వర్ (సి) ఎన్.మెకల్లమ్ (బి) బిన్నెట్ 4; షమీ (సి) విలియమ్సన్ (బి) అండర్సన్ 2; ఆరోన్ నాటౌట్ 2; ఎక్స్ట్రాలు: 18; మొత్తం: (50 ఓవర్లలో 9 వికెట్లకు) 314. వికెట్లపతనం: 1-64; 2-72; 3-74; 4-79; 5-146; 6-184; 7-269; 8-275; 9-286. బౌలింగ్: సౌతీ 10-0-74-1; మెక్లీనగన్ 10-0-76-0; బిన్నెట్ 10-2-41-2; అండర్సన్ 10-1-63-5; విలియమ్సన్ 2-0-17-0; ఎన్.మెకల్లమ్ 8-0-39-1. -
భారత్కు చావో...రేవో
ఆక్లాండ్: వన్డే క్రికెట్లో ఐదు మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లు ఓడాక... భారత్ ఎప్పుడూ సిరీస్ గెలవలేదు. ప్రపంచ క్రికెట్లో రెండు జట్లు (2003లో పాక్పై దక్షిణాఫ్రికా; 2005లో జింబాబ్వేపై బంగ్లాదేశ్) మాత్రమే సాధించిన ఈ ఫీట్ను... న్యూజిలాండ్లో చావో... రేవో పరిస్థితిని ఎదుర్కొంటున్న ధోనిసేన అందుకుంటుందా? ఇక ఈ సిరీస్ గెలవాలంటే భారత్ అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా ఆడాలి. ఇక నుంచి ప్రతి మ్యాచ్లోనూ సర్వశక్తులూ ఒడ్డాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ల మధ్య కీలకమైన మూడో వన్డే నేడు ఆక్లాండ్లో జరగనుంది. సిరీస్కు ముందు ప్రయోగాలు చేయబోనని చెప్పిన ధోని కనీసం ఇప్పుడైనా రిజర్వ్ బెంచ్కు అవకాశం ఇస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లు శుభారంభం అందించడంపైనే భారత్ విజయం ఆధారపడి ఉంది. అయితే విదేశీ గడ్డపై గత నాలుగు మ్యాచ్ల్లో ధావన్, రోహిత్ ఘోరంగా విఫలమయ్యారు. చివరి రెండు మ్యాచ్ల్లో వీరిద్దరు కలిపి 67 పరుగులే చేశారు. ప్రాక్టీస్ సెషన్లో రైనా మోచేతికి గాయమైంది. దీంతో రాయుడుకు తుది జట్టులోకి చోటు ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లి, ధోనిలకు చివర్లో సహకారం అందించే బ్యాట్స్మెన్ లేకపోవడం లోటు. నాలుగో స్థానానికి ప్రమోట్ అవుతున్న రహానే భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రౌండర్గా జడేజా జట్టులోకి వచ్చినా బ్యాటింగ్లో మెరవలేకపోతున్నాడు. బౌలింగ్లో ఫర్వాలేదనిపిస్తున్నా లక్ష్య ఛేదనలో కీలక సమయంలో వికెట్ చేజార్చుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఐదు మ్యాచ్ల్లో అశ్విన్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. అతని స్థానంలో మిశ్రా, బిన్నిలలో ఒకరికి అవకాశం ఇస్తే బాగుంటుంది. కానీ ధోని అశ్విన్ను తీస్తాడా? స్లాగ్ ఓవర్లలో విఫలమవుతున్న ఇషాంత్పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అతని స్థానంలో ఆరోన్కు చాన్స్ ఇస్తారా? లేదా? చూడాలి. బౌన్సీ వికెట్ కావడం, మైదానం భిన్నమైన రీతిలో ఉండటం వల్ల పరుగులు నిరోధించడం కష్టమవుతుంది. స్ట్రయిట్ బౌండరీ కంటే స్క్వేర్ లెగ్ బౌండరీ దూరంగా ఉంది. మళ్లీ టాప్ ర్యాంక్లో భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ మళ్లీ నంబర్వన్కు చేరుకుంది. నాలుగో వన్డేలో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడటం ధోనిసేనకు కలిసొచ్చింది. ప్రస్తుతం భారత్ 117, ఆసీస్ 116 పాయింట్లతో వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
తొలి టి20లో కివీస్ విజయం
81 పరుగులతో ఓడిన వెస్టిండీస్ ఆక్లాండ్: టి20 ప్రపంచ చాంపియన్ వెస్టిండీస్కు... న్యూజిలాండ్తో రెండు టి20ల సిరీస్ తొలి మ్యాచ్లో చుక్కెదురైంది. ఈడెన్ పార్క్లో శనివారం జరిగిన ఈ మ్యాచ్లో ఆతిథ్య కివీస్ జట్టు 81 పరుగుల తేడాతో కరీబియన్ జట్టుపై గెలిచింది. తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (45 బంతుల్లో 60 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. కీపర్ లూక్ రాంచీ (25 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 108 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. చివరిదైన రెండో టి20 బుధవారం జరుగుతుంది. -
మానభంగం, కిడ్నాప్ కేసులో న్యూజిలాండ్ లో ఎన్నారైకి శిక్ష
కిడ్నాప్, మానభంగం కేసులో భారత సంతతికి చెందిన ప్రవీణ్ ఫియా హరి ప్రసాద్ కుమార్ న్యూజిలాండ్ కోర్టు జైలుశిక్ష విధించింది. 2008 లో ఇద్దరు మహిళను కిడ్నాప్ చేసి మానభంగం చేసినట్టు నమోదైన కేసులో పునః విచారణ చేపట్టిన అక్లాండ్ కోర్టు శిక్ష ఖారారు చేసింది. ఈ కేసులో తీర్పు వెల్లడించిన వెంటనే నిందితుడిని రిమాండ్ లోకి తీసుకున్నారు. వచ్చే డిసెంబర్ లో జైలుశిక్ష అమలు చేస్తారని స్థానిక మీడియా వెల్లడించింది. మానభంగం కేసులో బెయిల్ బయటకు వచ్చిన నిందితుడు తదుపరి విచారణకు గైర్హాజరు కావడమే కాకుండా.. ఎలక్ట్రానికి మానిటరింగ్ నుంచి తప్పించుకున్నట్టు తెలిసింది. ఇంటర్నెట్ లో ఓ మహిళతో మాట్లాడిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా నిందితుడిపై మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్టు నేర చరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు.