Biometric system
-
సామాన్యుడు విసిరిన సవాళ్లు!
సాక్షి, సిటీబ్యూరో: సామాన్యులు సైతం ఒక్కోసారి పెద్దపెద్ద వ్యవస్థల్ని కదిలిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ‘హైటెక్ నేరాలకు’ పాల్పడుతూ సవాళ్లు విసురుతున్నారు. వీరిస్తున్న షాక్లతో యంత్రాంగాల దిమ్మ తిరిగిపోయి నష్ట నివారణ చర్యలు అన్వేషిస్తున్నాయి. 2010లో వెలుగులోకి వచ్చిన పాస్పోర్ట్ కార్యాలయం వెబ్సైట్ హ్యాకింగ్ నుంచి తాజాగా బయటపడిన ‘క్లోన్డ్ వేలిముద్రల’ వ్యవహారం వరకు ఈ కోవకు చెందినవే. ఆయా నిందితులు ఈ నేరాలకు పాల్పడింది కేవలం తమ అవసరాల కోసమే కావడం గమనార్హం. స్లాట్స్ కోసం ఆర్పీఓ వెబ్సైట్... ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటకు చెందిన గోరంట్ల లతాధర్రావు పీజీడీసీఏ పూర్తి చేసి అక్కడే లలిత ఫ్యాన్సీ అండ్ కూల్ డ్రింక్స్ దుకాణం నిర్వహించేవాడు. ఇతడికి 2010లో ఆకాష్ ట్రావెల్స్ నిర్వాహకుడు షేక్ సుభానీతో పరిచయమైంది. లతాధర్కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో తన వద్దకు వచ్చే పాస్పోర్ట్ అప్లికేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కోసం సుభానీ ఇతని సాయం తీసుకునే వాడు. తత్కాల్ స్కీమ్ కింద పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు దళారులను ఆశ్రయించడం ప్రారంభించి ఆన్లైన్ స్లాట్ ఇప్పిస్తే భారీ మొత్తాలను చెల్లించడానికి ముందు రావడం మొదలుపెట్టారు. దీంతో పాస్పోర్ట్ వెబ్సైట్ను హ్యాక్ చేసి స్లాట్స్ బ్లాక్ చేయాలన్న ఆలోచన లతాధర్, సుభానీలకు వచ్చింది. తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించి లతాధర్ ఈ పని చేశాడు. రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయం వెబ్సైట్లోనికి ఎంటర్ అయ్యే లతాధర్ దాని నుంచి నేరుగా సర్వర్కు కనెక్ట్ అయ్యే వాడు. ప్రతి రోజూ స్లాట్స్ విడుదల చేసే సమయంలో ఇతరులు వాటిలోకి లాగాన్ కాకుండా చేసే వాడు. తమను ఆశ్రయించిన వారి అప్లికేషన్స్ అప్లోడ్ చేసిన తరవాతే స్లాట్స్ను ఫ్రీ చేసే వాడు. ఈ వ్యవహారం అదే ఏడాది జూన్లో వెలుగులోకి రావడంతో టాస్్కఫోర్స్ పోలీసులు లతాధర్ సహా ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఆన్లైన్ స్లాట్స్ కేటాయింపునకు ఉపయోగపడే పాస్పోర్ట్ వెబ్సైట్కు చెందిన సోర్స్ కోడ్ను హ్యాక్ చేయడం ద్వారా ఇతరులకు స్లాట్స్ దొరక్కుండా బ్లాక్ చేస్తున్నట్లు లతాధర్ ఒప్పుకున్నాడు. టార్గెట్, నగదు కోసం నకిలీ వేలిముద్రలు... కేవలం టార్గెట్కు తగ్గట్టు సిమ్కార్డులు విక్రయించడానికి పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన ధనలక్ష్మీ కమ్యూనికేషన్స్ నిర్వాహకుడు పాత సంతోష్కుమార్ ఏకంగా నకిలీ వేలిముద్రల్నే సృష్టించేశాడు. ఈ తరహా ఉదంతం వెలుగులోకి రావడం అదే ప్రథమం. రిజిస్ట్రేషన్ న్స్ శాఖ వెబ్సైట్లోని డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకుని రెచ్చిపోయాడు. వాటిలో ఉండే వ్యక్తి పేరు, ఆధార్ నెంబర్, వేలిముద్రల్ని తనకు అనుకూలంగా వాడుకున్నాడు. రబ్బర్స్టాంపులు తయారు చేసే యంత్రంతో వేలిముద్రల్నే సృష్టించేశాడు. రబ్బర్తో వీటిని రూపొందిస్తే ఈ–కేవైసీ యంత్రం రీడ్ చేయట్లేదనే ఉద్దేశంతో పాలిమర్ అనే కెమికల్ను వాడి వేలిముద్రలు తయారు చేశాడు. ఈ వివరాలతో ఈ–కేవైసీ యంత్రాన్నీ ఏమార్చి వేల సిమ్కార్డులు యాక్టివేట్ చేశాడు. ఇతడిని ఎస్సార్నగర్ పోలీసులు పట్టుకున్న తర్వాత వచ్చి విచారించిన ఆధార్ సహా ఇతర విభాగాలకు చెందిన అధికారులు నివ్వెరపోయారు. తాజాగా తెలంగాణ, ఏపీలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ముఠాగా మారి, ఇదే పంథాలో వేలిముద్రలు క్లోనింగ్ చేసి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) దురిజిస్ట్రేషన్ నియోగం చేసి వివిధ బ్యాంకులకు రూ.10 లక్షల మేర టోకరా వేశారు. ‘ముప్పు’ను ఊహించకపోవడమే... ఇలాంటి పెను ఉదంతాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ‘భవిష్యత్తును’ సరిగ్గా అంచనా వేయలేకపోవడమే కారణమని నిపుణులు చెప్తున్నారు. ఏదైనా ఓ విధానం, వెబ్సైట్ తదితరాలు రూపొందించేప్పుడు అనేక కోణాలను పరిశీలించాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే పెద్ద వ్యవస్థలకు చెందిన వారు సైతం కేవలం అప్పటి అవసరాలను, ఎదురవుతున్న సమస్యల్నే దృష్టిలో పెట్టుకుంటున్నారని, భవిష్యత్తులో ఎదురయ్యే వాటిని పట్టించుకోవట్లేదని వివరిస్తున్నారు. ఈ కారణంగానే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత మాత్రమే నష్టనివారణ, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం సమీప భవిష్యత్తులో ఎన్ని రకాలైన సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది, టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందవచ్చు తదితరాలను అంచనా వేసి చర్యలు తీసుకుంటారని, ఆ దృక్పథం ఇక్కడ లోపించిందని, దీంతోనే ఏదైనా జరిగిన తర్వాతే అవసరమైన చర్యలు తెరపైకి వస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. -
హోంగార్డులు.. ఎన్ని పాట్లు!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో పని చేస్తున్న హోంగార్డులకు సెప్టెంబర్ నెల గౌరవ వేతనం ఆదివారానికీ అందలేదు. ప్రతి నెలా ఒకటి–రెండు తారీఖుల్లో వచ్చే జీతం కొన్ని నెలలుగా ఆలస్యం అవుతోంది. ఈసారి 8వ తేదీ వచ్చినా ఇప్పటికీ అందకపోవడంతో ఈ చిరుద్యోగులు బ్యాంక్ ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా తమ సిబిల్ స్కోరు దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నారు. రాజధానిలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పోలీసుల సంఖ్యకు సమానంగా హోంగార్డులు ఉన్నారు. పోలీసుస్టేషన్ల వారీగా హోంగార్డ్స్ జీతాల చెల్లింపునకు సంబంధించి బిల్లులు ప్రతి నెలా హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయానికి చేరుతాయి. ఈ బిల్లుల తయారీ మొత్తం ఇప్పటికీ మాన్యువల్గానే జరుగుతోంది. ఆ మధ్యన కొన్నాళ్ళు బయోమెట్రిక్ వ్యవస్థ ప్రవేశపెట్టినా.. అనివార్య కారణాలతో తొలగించారు. హోంగార్డులు పని చేసే ఠాణాలు, కార్యాలయాల్లో ఉండే అటెండెన్స్ రిజిస్టర్లలో సంతకాలతోనే ప్రస్తుతం వీరి హాజరు గణిస్తున్నారు. ప్రతి నెలా 20వ తేదీ నుంచి మరుసటి నెల్లో 19వ తేదీ వరకు పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు దీనికి సంబంధించి హాజరుపట్టీ తయారు చేస్తుంటారు. పోలీసు స్టేషన్లు, ప్రత్యేక విభాగాలు, ఇతర కార్యాలయాల నుంచి నుంచి హెడ్–క్వార్టర్స్ లేదా అడ్మిన్ అధికారులకు వెళ్లే ఈ హాజరు ఫైల్ అక్కడ అప్రూవ్ అయ్యాక మాత్రమే హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయానికి చేరుతుంది. అక్కడ నుంచి సంబంధిత కమిషనర్ ఆఫీస్కు వచ్చిన తర్వాతే జీతాలు లెక్కించి బ్యాంకు ద్వారా హోంగార్డుల ఖాతాలో పడాల్సి ఉంది. గతంలో ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు నెలగా పరిగణించే వాళ్ళు. మాన్యువల్గా జరుగుతున్న పనుల కారణంగా కొన్నేళ్ళ క్రితం వరకు జీతాల చెల్లింపు ఆలస్యమై ప్రతినెలా 15వ తేదీ తరవాతే హోంగార్డులకు అందేవి. అయితే దీనిపై దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు నెల లెక్కింపును 20 నుంచి 19వ తేదీ వరకు మార్చారు. అయినప్పటికీ గడిచిన కొన్ని నెలలుగా కాస్త ఆలస్యంగానే జీతాలు వస్తున్నాయని హోంగార్డ్స్ వాపోతున్నారు. ఈ విభాగంలో గడిచిన కొన్నేళ్ళలో అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. వీటికి చెక్ చెప్పడంతో పాటు హోంగార్డులకూ ప్రతి నెలా ఒకటి–రెండు తేదీల్లో జీతాలు ఇచ్చేందుకు అవసరమైన ఆధునిక టెక్నాలజీ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టట్లేదు. గతంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలన్నీ హోంగార్డుల ‘హాజరు’ ఆధారంగా జరిగినవే. హోంగార్డుల హాజరును నమోదు చేయడానికి పోలీసుస్టేషన్ల వారీగా మరోసారి బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేసి, లోపాలకు అధిగమిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కుంభకోణాలకు ఆస్కారం లేకుండా పోవడంతో పాటు జీతాల బిల్లుల తయారీ పేపర్తో పని లేకుండా వేగంగా జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ సర్వర్ కమాండెంట్ కార్యాలయంలో ఉంచితే... హాజ రు అక్కడే నమోదు అవుతుంది. ఫలితంగా కచ్చితత్వం ఉండటంతో పాటు జీతా ల బిల్లులు సైతం ఆలస్యం కావు. కేవలం పర్మిషన్లు, ఆన్డ్యూటీల్లో ఉన్న హోంగార్డుల వివరాలను మాత్రం ఈ కార్యాలయానికి మాన్యువల్గా, నేరుగా పంపితే సరిపోతుంది. ఉన్నతాధికారులు ఈ కోణంపై దృష్టి పెడుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఆలస్యానికి కారణాలు ఏవైనా ఇబ్బందులు పడుతున్నది మాత్రం పోలీసుశాఖలో ‘బడుగు జీవులు’ అయిన హోంగార్డులే. తమకు గృహరుణాలు, ఇతర లోన్లు ఉన్నాయని, వీటి ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలోనే కట్ అ వుతాయని చెప్తున్నారు. జీతాల ఆలస్యం కారణంగా ఇది సాధ్యంకాక తమ సిబిల్ స్కోర్లు కూడా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు కలగజేసుకుని తమ బాధలు తీర్చాలని హోంగార్డులు వేడుకోంటున్నారు. -
ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానంలో ఉద్యోగులందరి హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని కేంద్రం శుక్రవారం అన్ని శాఖలను కోరింది. తమ పరిధిలోని ఉద్యోగులు బయోమెట్రిక్లో హాజరు నమోదు చేయనప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖలు అలసత్వంతో వ్యవహరిస్తున్నాయని తేలడంతో సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు తమ ఉద్యోగుల హాజరును తప్పనిసరిగా నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని అందులో కోరింది. ఉద్యోగుల సమయపాలనపైనా శ్రద్ధ పెట్టాలని సూచించింది. ఉద్యోగులు తరచూ ఆలస్యంగా విధులకు హాజరు కావడం, ముందుగానే వెళ్లిపోవడం వంటి వాటిని ప్రోత్సహించరాదని, నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. -
ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త! ఇంటి వద్ద నుంచే స్మార్ట్ఫోన్ ద్వారా
ఆధార్ కార్డ్ దారులకు ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్లో టచ్లెస్ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రజలు ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా ఆధార్ కార్డ్ కోసం బయోమెట్రిక్ (ముఖ ఛాయాచిత్రం, ఐరిస్ స్కాన్, వేలిముద్రలు) వేయొచ్చు. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ బాంబే)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఓయూలో భాగంగా ‘ఆధార్ సంస్థ - ఐఐటీ బాంబే’ సంయుక్తంగా ఫోన్ ద్వారా కేవైసీ వివరాలతో ఫింగర్ప్రింట్స్ తీసుకునేలా ‘మొబైల్ క్యాప్చర్ సిస్టమ్’ టెక్నాలజీపై రీసెర్చ్ చేయనున్నారు. మొబైల్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగంలోకి వస్తే టచ్లెస్ బయోమెట్రిక్ క్యాప్చర్ సిస్టమ్ సాయంతో ఇంటి వద్ద నుంచే ఆధార్ బేస్డ్ ఫింగర్ ప్రింట్ అథంటికేషన్ను (వేలిముద్రలు) అప్డేట్ చేయొచ్చు. నిజమైన ఆధార్ లబ్ధి దారుల్ని గుర్తించేలా ఫేస్ రికగ్నైజేషన్కు సమానంగా ఫింగర్ ప్రింట్ పద్దతి పనిచేస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఆధార్ వ్యవస్థ మరింత మెరుగు పడనుంది. సిగ్నల్/ఇమేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్/డీప్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ కలయికతో పనిచేసే ఈ వ్యవస్థ ఆధార్ సంబంధిత సేవల్ని మొబైల్ ద్వారా అందించడలో మరింత సులభతరం చేస్తుంది. రోజుకు 70 మిలియన్ల మంది అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, రిలేషన్షిప్ స్టేటస్, ఐరిస్, వేలిముద్ర, ఫోటో వంటి వివరాలను అప్డేట్ చేసుకునే (Aadhaar authentications) వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆధార్లో మార్పులు చేసుకునేందుకు గాను యూఐడీఏఐకి రోజుకు 70-80 మిలియన్ల మంది అప్లయ్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 2022 చివరి నాటికి వారి సంఖ్య 88.29 బిలియన్లను దాటింది. సగటున రోజుకు 70 మిలియన్ల మంది ఆధార్లో మార్పులు చేసుకుంటున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. చదవండి👉 ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే! -
హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతిగృహాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకు ప్రయోగాత్మక పద్ధతిలో బయోమెట్రిక్ హాజరు ప్రక్రియను అమ లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షే మ శాఖల పరిధిలో 1,345 సంక్షేమ వసతిగృహాలున్నాయి. వీటి పరిధిలో 2.25 లక్షలమంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరును మాన్యువల్ పద్ధతిలో రికార్డు చేస్తున్నా రు. అయితే విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపు తూ బిల్లులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకుగాను ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తీసుకువస్తోంది. వారంలోగా క్షేత్రస్థాయి అవసరాలపై అంచనా హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు అమలు కోసం బయోమెట్రిక్ మెషీన్లు అవసరం. వీటిని ఆధార్ నంబర్ ఆధారంగా వేలిముద్రలు తీసుకునేలా తయారు చేశారు. ప్రతి హాస్టల్లో మెషీన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మెషీన్లను పరిశీలించి పనితీరును అంచనా వేయాలని, అవసరమైనచోట కొత్తవి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సర్వీసులు(టీఎస్టీఎస్) విభాగానికి ఇవ్వాలని నిర్ణయించి లేఖ రాసినట్లు తెలిసింది. -
ఏపీ: ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తితో 2020 మే నుంచి బయోమెట్రిక్ హాజరు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా తగ్గడంతో మళ్లీ బయోమెట్రిక్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్గా లింబాద్రి చదవండి: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి.. సీఎం కేసీఆర్ -
ఆధార్కు లాక్ వేద్దాం!
సాక్షి,గుంటూరు : ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి.. ప్రభుత్వ పథకాలైనా.. ప్రైవేటు పనులైనా ఆ కార్డు లేకుంటే పని జరగదు. ఈ క్రమంలో అదే స్థాయిలో సమాచార చోరీ, వ్యక్తిగత వివరాల భద్రతకు అవరోధంగా మారింది. సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్న తరుణంలో డిజిటల్ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చోరీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోప్యతకు రక్షణ కల్పిస్తూ చోరీకి చెక్ పెట్టేందుకు కేంద్రం ‘ఎం–ఆధార్ యాప్’ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఎం ఆధార్’ యాప్ను విడుదల చేసింది. ఈ యాప్తో ఆధార్ కార్డులోని డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని తెలిపింది. ఎవరైనా సరే తమ ఆధార్ బయోమెట్రిక్ లాక్(వేలిముద్రను) వినియోగించి అవసరమైనప్పుడు కార్డులోని డేటా సేవలను పొందే వీలు కల్పించింది. వినియోగదారుడు ప్రమేయం లేకుండా ఆధార్ వినియోగాన్ని నిలిపివేయడమే దీని ప్రధాన ఉద్దేశం. సెల్ఫోన్ ఎప్పుడు వినియోగదారుడి వెంటనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు. అన్నింటా ఆధారే.. రేషన్ దుకాణం మొదలు బ్యాంకు ఖాతా, ఫోన్ సిమ్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, నగదు బదిలీ, దుకాణం లైసెన్స్ ఇలా ఏది కావాలన్నా ఆధార్ వివరాలు తప్పనిసరి. ఆయా సందర్భాల్లో సమర్పించే నకళ్ల ద్వారా ఆధార్ సమాచారం గోప్యత ప్రశ్నార్థకం అవుతోందనే అనుమానాలు ఉన్నాయి. అయితే సమాచార చోరీకి అడ్డుకట్ట వేసేందుకు ‘ఎం ఆధార్ యాప్’ ఉపయోగపడనుంది. స్మార్ట్ ఫోనణ్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుని బయోమెట్రిక్ రూటర్ ద్వారా మనమే వివరాలను ఆన్లైన్లో అందించి ఎలాంటి సేవలైనా పొందవచ్చు. ఏదైనా ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకునే సమయంలో ఫోన్ యాప్లో ఎం ఆధార్ను ఎటాచ్ చేసుకుంటే జిరాక్స్ కాపీలతో పని ఉండదు. ఈ యాప్ ద్వారా ఏదైనా దరఖాస్తును నేరుగా చేసుకునే అవకాశం ఉంటుంది. నూతన విధానం అందుబాటులోకి రావడంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే వారికి మరింత సులువైంది. డౌన్లోడ్ విధానం ఇలా... ఆధార్ అనుసంధానమైన ఫోన్ నంబర్తో ఎం ఆధార్ యూప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ సంఖ్య నమోదు చేసి యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత కేవైసీ(నో యువర్ కస్టమర్) వివరాలను నమోదు చేస్తే జనరల్ క్యూ ఆర్ కోడ్ వస్తుంది. దీని ద్వారా బమోమెట్రిక్ నమోదువుతుంది. యాప్లో బయోమెట్రిక్ లాక్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత అవసరమైనప్పుడు లాక్ ఓపెన్ చేసి ఆధార్ వివరాలతో ఆన్లైన్లో ఎలాంటి జిరాక్స్ పత్రాలు ఇవ్వకుండానే లావాదేవీలను నిర్వహించుకునే అవకాశం ఉంది. మిగిలిన సమయాల్లో బయోమెట్రిక్ను లాక్ చేయవచ్చు. దీని ద్వారా సైబర్ నేరగాళ్ల బారి నుంచి ఆధార్ వివరాలను కాపాడుకోవచ్చు. బయోమెట్రిక్ లాక్ చేయడం వల్ల ఆధార్ యాక్సెస్ ఉన్న పలు బహుళజాతి కంపెనీలు, సైబర్ నేరగాళ్లకు ఆధార్ డేటా కనిపించదు. -
‘అవంతి’ని అప్రోచ్ అయ్యారు!
సాక్షి, హైదరాబాద్: కళాశాలల్లో హాజరు లెక్కింపునకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అమలులోకి తీసుకువచ్చిన బయోమెట్రిక్ వ్యవస్థనే ఏమారుస్తూ వేలిముద్రల్ని క్లోనింగ్ చేసిన గ్యాంగ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీరు సంప్రదించిన కాలేజీల్లో వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్)కు చెందిన అవంతి ఇంజనీరింగ్ కాలేజీ, ఆయన సోదరుడు ముత్తంశెట్టి కృష్ణారావుకు చెందిన నోవా ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నాయి. వీటితో పాటు కోదాడలోని గేట్, కిట్స్ సంస్థలతోనూ వీరు సంప్రదింపులు జరిపారని గుర్తించారు. అయితే వివేకానంద కాలేజీలా మిగిలిన వాటికి నకిలీ వేలిముద్రలు తయారు చేసి ఇచ్చారా? అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వేలిముద్రల క్లోనింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అవంతి కాలేజీతో పాటు మిగిలిన వాటికి నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు. జేఎన్టీయూ నిబంధనల కఠినతరంతో... ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన బొమ్మ రామకృష్ణ పీహెచ్డీ చేస్తూ అక్కడి స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేసేవాడు. కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన పి.శ్రీరామ్ ప్రసాద్ 2014–17 మధ్య బాటసింగారంలోని నోవా ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పని చేశాడు. అప్పట్లో రామకృష్ణ సైతం కొన్నాళ్ల పాటు ఇదే కాలేజీలో పని చేయడంతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రతి 15 మంది విద్యార్థులకో అధ్యాపకుడు ఉండాలి. అయితే అనేక కాలేజీలు దీన్ని పాటించలేకపోతున్నాయి. బోగస్ అ«ధ్యాపకులు, విద్యార్థుల ఘటనల నేపథ్యంలో జేఎన్టీయూ బయోమెట్రిక్ హాజరు విధానం అవలంభిస్తోంది. క్లోనింగ్ చేశారిలా... రామకృష్ణ సూచనతో శ్రీరామ్ ఓ ప్లాస్టిక్ కోటింగున్న కాగితంపై గ్లూ గన్తో ప్రొఫెసర్ల వేలిముద్ర సేకరిస్తా డు. దీని ఆధారంగా రామకృష్ణ ఒక్కో బోగస్ అధ్యాపకుడికి సంబంధించి నాలుగు సెట్ల క్లోన్డ్ వేలిముద్రల్ని తయారు చేసేవాడు. ఆయా కళాశాలల యాజమాన్యా లు ప్రతి రోజూ ఈ వేలిముద్రల అచ్చుల్ని బయోమెట్రిక్ మిషన్లో వేలు పెట్టాల్సిన చోట పెట్టేవి. ఇలా ఆ వ్యక్తి హాజరైనట్లు సర్వర్లో నమోదయ్యేలా చేసేవారు. కాలేజీలతో ఒప్పందాలు చేసుకుని... జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజీల్లో ఉన్న బయోమెట్రిక్ మిషన్ జేఎన్టీయూలో ఉన్న సర్వర్తో కనెక్ట్ అయి ఉంటుంది. దీంతో కాలేజీ యాజమాన్యాలు సిబ్బంది, విద్యార్థుల హాజరును ‘మేనేజ్’ చేయలేకపోయాయి. దీన్ని గుర్తించిన రామకృష్ణ వేలిముద్రలు క్లోనింగ్ చేసే విధానం తెలుసుకుని శ్రీరామ్ప్రసాద్తో జట్టుకట్టాడు. హైదరాబాద్లోని కాలేజీలతో ఒప్పందాలు చేసుకునే శ్రీరామ్ అవసరమైన ఫింగర్ప్రింట్స్ ఆర్డర్ను రామకృష్ణకు పంపించడం చేసేవాడు. ఎంటెక్ పూర్తి చేసి వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న వారిని యాజమాన్యాలు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఎన్రోల్ చేసేవారు. వీరు కాలేజీకి వచ్చినప్పుడు శ్రీరామ్ వారి వేలిముద్రలు బయోమెట్రిక్ మిషన్లో లోడ్ చేసేవాడు. రీయింబర్స్మెంట్ ‘సృష్టించారా’? ఈ గ్యాంగ్ను ఇటీవల హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో రామకృష్ణ, శ్రీరామ్తో పాటు బాటసింగారంలో ఉన్న వివేకానంద కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ పోరెడ్డి సుదర్శన్రెడ్డిని అరెస్టు చేశారు. సైదాబాద్ ఠాణాలో నమోదైన ఈ కేసును దర్యాప్తు నిమిత్తం సీసీఎస్కు బదిలీ చేశారు. సుదర్శన్ తమ సంస్థలో పని చేస్తున్నట్లు 29 మంది వేలిముద్రల్ని వీరితో తయారు చేయించాడు. ఈ గ్యాంగ్ విచారణలోనే అవంతి, నోవా, గేట్, కిట్స్ కాలేజీలను అప్రోచ్ అయినట్లు తేలింది. కేవలం సంప్రదించారా.. లేక వారికీ ఏవైనా అక్రమాలకు సహకరించారా.. అన్నదానిపై దృష్టి పెట్టారు. ఆయా కాలేజీలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ గ్యాంగ్ ‘నకిలీ విద్యార్థుల్నీ’తయారు చేసిందనే అనుమానాలున్నాయి. ఇతర వర్సిటీలకు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో చదువు తున్న విద్యార్థులతోనూ కళాశాల యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకున్నాయని, వీరి వేలిముద్రల ఆధారంగా ఫీజు రీ–యింబర్స్మెంట్ పొందారనే ఆరోపణలపైనా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. -
మొరాయిస్తున్న బయోమెట్రిక్
నల్లబెల్లి (వరంగల్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత పెంచడంతోపాటు విద్యార్థులకు నేరుగా పథకాలు అందించేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ను ప్రారంభించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలలకు బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేశారు. కానీ, ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం, అధికారులు అప్డేట్ కాకపోవడం, నెట్వర్క్ సమస్య తలెత్తడంతో బయోమెట్రిక్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. బయోమెట్రిక్ విధానం పక్కాగా అమలైతే తప్పనిసరిగా ప్రతిరోజు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ బడుల్లో కొంతైనా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. విద్యార్థులకు ఆంగ్ల బోధనతోపాటు మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పుస్తకాలు, హెల్త్ కిట్లను ఉచితంగా అందిస్తోంది. అయితే ఇవ్వన్ని విద్యార్థులకు చేరుతున్నాయా లేక దుర్వినియోగం అవుతున్నాయా అనే వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గత నెలలో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు యంత్రాల నిర్వహణపై రిసోర్స్ పర్సన్ల ద్వారా శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రం చొప్పున పాఠశాలలకు అందించారు. ఈ నెల 1వ తేదీ నుంచి అమలు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా క్షేత్రస్థాయిలో నిర్వహణలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. నెట్వర్క్ సరిగా ఉండకపోవడం, యంత్రాలు వినియోగించడంలో అవగాహన లోపం వంటి కారణాలతోపాటు ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల వివరాలు తొలగిస్తూ కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయకపోవడం తదితర సమస్యలతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరకుండా పోతోందని తెలుస్తోంది. ఒకే పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు వేలిముద్ర వేస్తే, మరికొందరు ఉపాధ్యాయులు వేయలేని పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రాలకు దూరంగా ఉన్న పాఠశాలల్లో నెట్వర్క్ సమస్యతో ఇబ్బందులు తలెత్తడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వేయలేని పరిస్థితి ఉందని పలువురు ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇటీవల మండలానికి ఒకరు చొప్పున 15 మంది టెక్నీషియన్లను నియమించారు. కానీ, వారు విధుల్లో చేరకపోవడంతో బయోమెట్రిక్ యంత్రాలను మరమ్మతు చేసేవారు కరువయ్యారు. సమస్యను అధిగమించేందుకు చర్యలు.. బయోమెట్రిక్ యంత్రంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సరైన వివరాలు నమోదు చేయాలి. యంత్రాల్లో తలెత్తే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నిపుణుల సాయం అందేలా చూడాలి. తద్వారా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ జవాబుదారీతనంగా వ్యవహరిస్తారు. మధ్యాహ్న భోజన నిర్వహణలో సత్ఫలితాలు సాధించవచ్చు. జవాబుదారీతనం పెరుగుతుంది.. బయోమెట్రిక్ యంత్రాలు ఉపయోగించడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యబోధన మెరుగుపడుతుంది. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. మా పాఠశాలకు అధికారులు మూడు యంత్రలు ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఐడీలు ఇవ్వలేదు. త్వరలోనే ఇస్తామని అధికారులు చెప్పారు. ఇచ్చిన వెంటనే బయోమెట్రిక్ యంత్రాలను ఉపయోగిస్తాం. – రామస్వామి, హెచ్ఎం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నల్లబెల్లి సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు చర్యలు జిల్లాలోని 699 ప్రభుత్వ పాఠశాలలకు 756 బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఉపాధ్యాయులు పనిచేసే సమయంపై పారదర్శకతతో పాటు మధ్యాహ్న భోజన నిర్వహణలో సత్ఫలితాలు పొందేందుకు ప్రభుత్వ పాఠశాలకు వీటిని పంపిణీ చేశాం. బయోమెట్రిక్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే సరిచేసేందుకు ప్రభుత్వం విజన్టెక్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. నెట్వర్క్ లేని పాఠశాలలను గుర్తించి సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – కె.నారాయణరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి, వరంగల్ రూరల్ -
వేలికి ‘నకిలి’ ముద్ర!
శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి వేలిముద్రలు.. ప్రపంచంలో ఏ ఇద్దరివీ సరిపోలవు.. కానీ ఓ టెలికం సంస్థ డిస్ట్రిబ్యూటర్ వద్ద మాత్రం మీ వేలిముద్రలు ఉంటాయి. మీ ఆధార్ నంబరు, పేరు, చిరునామా అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడూ ఈ–కేవైసీ యంత్రంలో మీ వేలిముద్ర పడుతూ మీ పేరిట సిమ్కార్డులు జారీ అయిపోతుంటాయి. చదువును మధ్యలోనే ఆపేసిన సంతోష్కుమార్ అనే యువకుడు.. ఇంటర్నెట్ సాయంతో నకిలీ వేలిముద్రల తయారీని నేర్చుకుని, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని ఓ లోపాన్ని ఆసరాగా తీసుకుని వేలాది మందికి చెందిన నకిలీ వేలిముద్రలను తయారుచేశాడు. ఆ వేలిముద్రలను ఆధార్ డేటాబేస్ నుంచి కేవైసీ అప్రూవల్ పొందడానికి వినియోగించి.. వేల సంఖ్యలో కొత్త సిమ్కార్డులను యాక్టివేషన్ చేశాడు. దీనిపై ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)’ సహా కేంద్ర నిఘా అధికారులు ఉలిక్కిపడ్డారు. దీనివెనుక ఉగ్రవాదులు, మావోయిస్టుల కోణం ఉందేమోనని సందేహించారు. కానీ లోతుగా పరిశీలించాక.. కేవలం సిమ్కార్డుల ‘టార్గెట్’పూర్తి చేసుకోవడానికి సంతోష్ ఈ పనిచేసినట్టు తెలుసుకుని నివ్వెరపోయారు. సంతోష్ అనుసరించిన విధానం ఏ ఉగ్రవాదుల చేతుల్లోనో, మావోయిస్టుల చేతుల్లోనో పడితే.. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారేదని ఆందో ళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై హైదరాబాద్ లోని ‘ఆధార్’కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు గత బుధవారం కేసు నమోదు చేసిన ఎస్సార్నగర్ పోలీసులు సంతోష్కుమార్ను అరెస్టు చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించారు. తన వివరాలు గోప్యంగా ఉంచాల్సిందిగా కోరిన ఢిల్లీలో పనిచేసే యూఐడీఏఐ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’కి పూర్తి వివరాలు వెల్లడించారు. సిమ్కార్డుల టార్గెట్ పూర్తి కోసం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన పాత సంతోష్కుమార్ బీఎస్సీ చదువు మధ్యలోనే మానేశాడు. ధర్మారం బస్టాండ్ సమీపంలో ధనలక్ష్మి కమ్యూనికేషన్స్ పేరుతో దుకాణం ఏర్పాటు చేసి వొడాఫోన్ ప్రీ–పెయిడ్ కనెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నాడు. రూ.51 టాక్టైమ్తో ఉచితంగా ఇచ్చే ఈ సిమ్కార్డులను నెలకు కనీసం 600 విక్రయిస్తే.. ఒక్కో కనెక్షన్కు రూ.15 చొప్పున కమీషన్ ఇస్తామన్నది కంపెనీ పెట్టిన టార్గెట్. ఈ టార్గెట్ పూర్తికాకపోతే కమీషన్ చాలా తక్కువగా వస్తుంది. దాంతో సంతోష్ కొన్నాళ్ల పాటు కాలేజీలు, పాఠశాలల వద్ద స్టాల్ ఏర్పాటు చేసి.. తానే రూ.5 ఎదురిస్తూ సిమ్కార్డులు విక్రయించాడు. మొత్తంగా టార్గెట్ పూర్తి చేసి కమీషన్ పొందేవాడు. ఉచితంగా రూ.50కిపైగా టాక్టైమ్ వస్తుండటంతో విద్యార్థులు తరచూ సిమ్కార్డులు తీసుకుంటుండేవారు. కానీ ఒక్కొక్కరి పేరిట గరిష్టంగా తొమ్మిది సిమ్కార్డులు మాత్రమే తీసుకునేలా.. కచ్చితంగా ఆధార్, ఈ–కేవైసీ యంత్రంలో వేలిముద్ర నమోదు తర్వాతే సిమ్ యాక్టివేషన్ జరిగేలా కొంతకాలం కింద నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీనివల్ల సిమ్ విక్రయాల టార్గెట్ పూర్తిగాక కమీషన్ రావడం ఆగిపోయింది. దీంతో సంతోష్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. వివరాలన్నీ ఒకే చోట దొరకడంతో.. ఎవరో ఒకరి పేరు మీద సిమ్కార్డులు యాక్టివేట్ చేయడం ద్వారా టార్గెట్ పూర్తి చేసుకోవాలని సంతోష్ భావించాడు. సాధారణంగా ఓ సిమ్కార్డు యాక్టివేట్ కావాలంటే.. వినియోగదారు పూర్తి పేరు, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయడంతోపాటు ఈ–కేవైసీ తనిఖీ పరికరంలో ఆ వ్యక్తి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ఎక్కడ దొరుకుతాయనే దానిపై అధ్యయనం చేసిన సంతోష్.. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో ఈ మూడు వివరాలను డాక్యుమెంట్లో పొందుపరుస్తారని గుర్తించాడు. అంతేకాదు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ లో డాక్యుమెంట్ నంబర్, పలు వివరాలు నమోదు చేస్తే.. రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలుసుకున్నాడు. సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కేటాయించే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ నంబర్ల సిరీస్ను పరిశీలించాడు. వాటి తరహాలో కొన్ని నంబర్లను వెబ్సైట్లో నమోదు చేస్తూ వెళ్లగా.. ఓ డాక్యుమెంట్ డౌన్లోడ్ అయింది. దాంతో ఆ సిరీస్లో తర్వాతి నంబర్లను నమోదు చేస్తూ.. వరుసగా డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేశాడు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది స్థిరాస్తుల యజమానుల ఆధార్, పేరు, చిరునామా, వేలిముద్రలు వంటి పూర్తి వివరాలను సమకూర్చుకున్నాడు. ఇంటర్నెట్లో ‘వేలిముద్రల’తయారీ నేర్చుకుని.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల చివరి పేజీలో ఆ స్థిరాస్తిని విక్రయించిన, కొనుగోలు చేసిన వారి వేలిముద్రలు ఉంటాయి. ఇలా పేపర్ మీద ఉన్న వేలిముద్రలను.. తిరిగి ఎక్కడైనా వేయగలిగేలా ఎలా తయారు చేయాలన్న దానిపై ఇంటర్నెట్లో వెతికాడు. యూట్యూబ్లో వీడియోలు చూసి.. రబ్బర్ స్టాంపుల తయారీ యంత్రాన్ని వినియోగించి వేలిముద్రలు తయారు చేసే విధానం నేర్చుకున్నాడు. కాగితంపై ముద్రించి ఉన్న లోగోలు, డిజైన్లను స్టాంపుగా మార్చడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది. లోగోనుగానీ, డిజైన్నుగానీ కాంతి కిరణాలతో స్కాన్ చేసే ఆ యంత్రం.. అదే లోగో/డిజైన్ను రబ్బరుపై ఏర్పరుస్తుంది. అలాంటి ఓ యంత్రాన్ని కొనుక్కొచ్చి తన ధనలక్ష్మి కమ్యూనికేషన్స్ దుకాణంలో ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యంత్రంలో లోగోను, డిజైన్ను పెట్టాల్సిన చోట.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలోని వేలిముద్రల కాగితాన్ని పెట్టాడు. దాంతో ఆ యంత్రం వేలిముద్రను స్కాన్ చేసి.. రబ్బరుపై అదే ఆకృతిని ఏర్పాటు చేసింది. అయితే సంతోష్ ఈ–కేవైసీ యంత్రంలో ముద్ర వేయడానికి వీలుగా రబ్బరుకు బదులుగా.. ప్రత్యేకమైన మెత్తటి ప్లాస్టిక్ పాలిమర్ను వినియోగించాడు. ఈ–కేవైసీ యంత్రంపై ఈ పాలిమర్ ముద్రను పెట్టినప్పుడు.. నేరుగా వేలిముద్ర వేసిన తరహాలో పనిచేసింది. ఇలా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సహాయంతో పెద్ద సంఖ్యలో నకిలీ వేలిముద్రలను తయారు చేసిన సంతోష్.. ఈ–కేవైసీ యంత్రంలో సదరు ఆధార్ వివరాలు, ఇతర వివరాలు నమోదు చేసి, వేలిముద్రను పెట్టి.. సిమ్కార్డులను యాక్టివేషన్ చేశాడు. తర్వాత ఆ సిమ్కార్డులను ధ్వంసం చేసేసినా.. కొత్త కనెక్షన్ల టార్గెట్ మాత్రం పూర్తయి, సిమ్ విక్రయాల కమీషన్ అందింది. ఉలిక్కిపడిన యూఐడీఏఐ సంతోష్ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ నుంచి ఒక్కోసారి ఒక్కో ప్రాంతానికి చెందిన డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసి, నకిలీ వేలిముద్రలు తయారు చేసి.. సిమ్కార్డులను యాక్టివేట్ చేశాడు. ఇలా దాదాపు నెల రోజుల్లో ఆరు వేల సిమ్కార్డులు యాక్టివేట్ చేశాడు. అయితే ఒకే ఈ–కేవైసీ యంత్రం నుంచి భారీగా సిమ్కార్డుల కోసం ఆధార్ అప్రూవల్స్ పొందిన విషయాన్ని గుర్తించిన యూఐడీఏఐ విజిలెన్స్ విభాగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు, మావోయిస్టులతోపాటు అసాంఘిక శక్తులకు అక్కడి నుంచి సిమ్కార్డులు చేరుతున్నాయని సందేహించి.. కేంద్ర నిఘా వర్గాల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన నిఘా అధికారులు, 18 ప్రభుత్వ విభాగాల అధికారులు.. సంతోష్కుమార్ను విచారించారు. సిమ్కార్డుల యాక్టివేషన్ టార్గెట్ పూర్తి చేసుకోవడం కోసం సంతోష్ చేసిన పని.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రల సేకరణ, రబ్బరు స్టాంపుల యంత్రంతో నకిలీ వేలిముద్రల తయారీ, ఇందుకోసం ఇంటర్నెట్ను వినియోగించుకున్న తీరు వంటివి తెలుసుకుని అవాక్కయ్యారు. జాతీయ స్థాయిలో ‘అలర్ట్’! వేలిముద్రల ఆధారంగా పనిచేసే బయోమెట్రిక్ విధానాన్ని భద్రమైన మార్గంగా పరిగణిస్తూ మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దానిని వినియోగిస్తున్నాయి. మన దేశంలోనైతే ‘ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య)’కు కూడా వేలిముద్రనే ప్రధాన ఆధారంగా ఉంది. ఈ నేపథ్యంలో సంతోష్ చెప్పిన వివరాలను విన్న అధికారులు అప్రమత్తమయ్యారు. నకిలీ వేలిముద్రల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశముందని.. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు తస్కరించడం వంటి ఆర్థిక నేరాల నుంచి ఓ వ్యక్తి ప్రమేయం లేకుండా అతడిని నేరాల్లో ఇరికించడం వంటి క్రిమినల్ నేరాలకూ దారితీస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఢిల్లీలో ప్రతి మూడు నెలలకోసారి ‘మల్టీ ఏజెన్సీస్ కమిటీ’పేరుతో పిలిచే మ్యాక్ సమావేశం జరుగుతుంది. అందులో నిఘా నుంచి పరిపాలన వరకు అన్ని విభాగాల అధికారులు పాల్గొని వివిధ అంశాల్ని చర్చిస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సంతోష్ వ్యవహారం నేపథ్యంలో.. వారం రోజుల్లో మ్యాక్ సమావేశం ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ నిర్ణయించింది. అందులో ఈ కేసును చర్చించి.. దేశవ్యాప్తంగా ఇలాంటి లోపాలు గుర్తించాలని, ఆయా రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ల శాఖలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని యూఐడీఏఐ కోరనుంది. ఆయా లోపాలను పరిష్కరించేలా సూచనలు చేయనుంది. -
విద్యార్థుల హాజరుకు ఇక బయోమెట్రిక్
సాక్షి, హైదరాబాద్ : బయోమెట్రిక్ పద్ధతిలో విద్యా ర్థుల హాజరు నమోదుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) సంస్థ రూపొందించిన ‘అబాస్’ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంను ఇందుకు ఉపయోగించ నున్నారు. ఆధార్ అనుసంధానం ద్వారా బయో మెట్రిక్ పద్ధతిలో విద్యార్థుల హాజరును నమోదు చేసేందుకు పాఠశాలల్లో ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని పదివేల పాఠ శాలల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు విద్యా శాఖ సన్నాహాలు చేస్తోంది. 4 సెకండ్ల వ్యవధిలో ఓ విద్యార్థి హాజరును ఈ సాఫ్ట్వేర్ నమోదు చేయనుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జిల్లా విద్యాధికారి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు తమ కంప్యూటర్లు/లాప్టాప్ తెరల మీద విద్యార్థుల హాజరుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు తెలుసుకోవడానికి దీని ద్వారా వీలు కలగ నుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతంపై విశ్లేషణలు జరపడంతో పాటు మధ్యాహ్న భోజనం పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడనుంది. -
ముద్ర పడదు.. రేషన్ రాదు!
సాక్షి, నెట్వర్క్ : రాష్ట్రంలో రేషన్ సరుకులకు ‘వేలిముద్రల’ తలనొప్పి వచ్చి పడింది. అక్రమాల నియంత్రణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఈ–పాస్ బయోమెట్రిక్ విధానం సమస్యల్లో పడింది. పలు చోట్ల సిగ్నళ్లు పనిచేయకపోవడం, సిగ్నల్ ఉన్నా ఈ–పాస్ సర్వర్లు మొరాయిస్తుండటంతో రేషన్ సరుకుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఇక వృద్ధులు, మరికొందరి వేలిముద్రలను బయోమెట్రిక్ పరికరాలు సక్రమంగా గుర్తించకపోతుండటంతో డీలర్లు వారికి సరుకులు ఇవ్వడం లేదు. రెవెన్యూ అధికారులు రాసి ఇస్తే సరుకులు ఇస్తామంటున్నారు. దాంతో సరుకులు రాక, అధికారుల చుట్టూ తిరగలేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఊళ్లను, కుటుంబాలను వదిలి పని కోసం వలస వెళ్లిన వారికి ఈ–పాస్తో సమస్యలు ఎదురవుతున్నాయి. స్వయంగా వచ్చి వేలిముద్ర వేయాల్సి రావడంతో ఆ కుటుంబాలు సరుకులు తీసుకోలేకపోతున్నాయి. ఈ–పాస్ విధానం అమలు, లబ్ధిదారుల సమస్యలపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. బియ్యం తీసుకోలేక.. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది పాత జిల్లాల్లో 78,85,980 రేషన్కార్డులు ఉన్నాయి. వాటికి పంపిణీ కోసం ఫిబ్రవరి నెలకు సంబంధించిన బియ్యం కోటా విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలకూ చేరింది. కానీ చాలా మంది లబ్ధిదారులు బియ్యం తీసుకోలేకపోతున్నారు. రేషన్ అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ–పాస్’సమస్యలే దీనికి కారణం. ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ–పాస్ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చినా.. క్షేత్రస్థాయిలో సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ–పాస్ యంత్రాలకు సిగ్నళ్లు అందకపోవడం, సర్వర్లు మొరాయిస్తుండడానికి తోడు వృద్ధుల వేలిముద్రలు సరిగా పడకపోవడంతో సరుకుల పంపిణీ ఇబ్బందికరంగా మారుతోంది. అందులోనూ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకే సరుకులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని లబ్ధిదారులు వ్యతిరేకిస్తున్నారు. ఇక వేలిముద్రలు పడని వారికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) నుంచి లేఖ తీసుకుని బియ్యం ఇస్తున్నారు. దీంతో వేలిముద్రలు పడని వృద్ధులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అక్రమాలు తగ్గినా.. పెరిగిన ఇబ్బందులు.. రేషన్ అక్రమాల నియంత్రణ కోసం ప్రవేశపెట్టిన ఈ–పాస్ విధానంతో చాలా చోట్ల రేషన్ షాపులలో బియ్యం మిగులుతున్నాయి. అందుబాటులో లేక బియ్యం తీసుకోని లబ్ధిదారులు, బోగస్ కార్డులు, రేషన్ బియ్యం వినియోగించనివారుంటే.. ఆ మేర బియ్యం మిగిలిపోతోంది. ఇలా మిగిలిన మేర మరుసటి నెల కోటాకు తగ్గించి సరఫరా చేస్తారు. తద్వారా రేషన్ సరఫరాలో అక్రమాలు తగ్గాయి. కానీ ఈ–పాస్ సమస్యల కారణంగా కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కో కార్డుకు 20 నిమిషాలు! రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని ఓ రేషన్ షాపు వద్ద ‘సాక్షి’పరిశీలన జరిపింది. అక్కడ రేషన్ బియ్యం తీసుకునేందుకు యాభై మంది వరకు క్యూలో ఉన్నారు. అయితే ఒక్కొక్కరు రేషన్ తీసుకోవడానికి ఇరవై నిమిషాల వరకు పట్టడం గమనార్హం. ఈ–పాస్ యంత్రాల ద్వారా వేలి ముద్రలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. సిగ్నల్ రాకపోవడం, సర్వర్ డౌన్ చూపిస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో లబ్ధిదారులు రేషన్ బియ్యం కోసం గంటల తరబడి నిలబడడం, రోజుల తరబడి వేచి ఉండడం తప్పడం లేదు. ఇక పాత ఖమ్మం జిల్లాలో ఈ–పాస్ యంత్రాల సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు.. ఎక్కడ ఏ కంపెనీ సిగ్నల్ అధికంగా ఉంటే ఆ సిమ్లను అందించారు. అయితే సిగ్నల్ సరిగానే ఉన్నా.. ఈ–పాస్ సర్వర్ మొరాయిస్తుండడంతో ఫలితం ఉండడం లేదు. పాత మెదక్ జిల్లాలోనైతే సిగ్నల్ లేకపోవడం, వేలిముద్రలను గుర్తించకపోవడం వంటి సమస్యలతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘వలసల’ వెతలు వలసలకు మారుపేరైన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా మంది పేదలు.. బయోమెట్రిక్ విధానం కారణంగా ఈ నెల రేషన్ సరుకులు తీసుకోలేకపోయారు. ఇక్కడి నుంచి పనికోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే కూలీలు.. బంధువులకు, తెలిసినవారికి తమ రేషన్కార్డులను ఇచ్చి, సరుకులు తీసుకుని పెట్టాలని చెబుతారు. రెండు, మూడు నెలలకోసారి స్వగ్రామాలకు వచ్చి బియ్యం తీసుకెళ్తారు. నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల తదితర ప్రాంతాలన్నిటా ఇదే పరిస్థితి ఉంది. మహబూబ్నగర్, వనపర్తి జిల్లాలకు చెందిన చాలా మంది గిరిజనులు ముంబైకి వలస వెళ్లారు. ఇక్కడి నుంచి నేరుగా ముంబైకి బస్సు సౌకర్యం ఉండటంతో.. స్థానికంగా ఉండే బంధువులు రేషన్ బియ్యం తీసుకుని, ఆ బస్సుల్లో ముంబైకి పంపేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నెలనెలా ఇంత దూరం రాలేక చాలా మంది సబ్సిడీ బియ్యాన్ని తీసుకోలేకపోతున్నారు. కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోని వలస కూలీలదీ ఇదే పరిస్థితి. ఇంకా చాలా దుకాణాలకు చేరని ఈ–పాస్ బయోమెట్రిక్తో రేషన్ సరుకులు అందించేందుకు తీసుకొచ్చిన ఈ–పాస్ యంత్రాలు ఇంకా చాలా దుకాణాలకు చేరలేదు. డీలర్లకు వాటిని ఎలా వినియోగించాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నెల మొదటి వారం గడిచిపోయినా ఇంకా చాలా దుకాణాల్లో ఈ–పాస్ మిషన్లు అమర్చే పని కొనసాగుతోంది. ఇక డీలర్లకు యంత్రాల నిర్వహణపై పూర్తి అవగాహన లేకపోవడం, చాలా దుకాణాల వద్ద సిగ్నళ్లు సరిగా లేకపోవడం ఇబ్బందిగా మారింది. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15 వరకే సరుకులు పంపిణీ చేయాలని సర్కారు చెబుతున్నా.. ఈ నెలలో 25వ తేదీ వరకూ కొనసాగేలా కనిపిస్తోంది. సర్వర్ పనిచేయక సమస్యలు గతంలో రోజుకు కనీసం వంద కార్డులపై బియ్యం పంపిణీ చేశాం. ఇప్పుడు ఈ–పాస్ విధానం వల్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. సర్వర్ సరిగా పనిచేయక పోవడంతో ఒక్కో కార్డుకు బియ్యం పంపిణీ చేయడానికి 20 నిమిషాలు పడుతోంది.. – మల్లెపూల శారద, రేషన్ డీలర్, ఆసిఫాబాద్ రెండు రోజులుగా తిరుగుతున్నా.. నల్లగొండ జిల్లా చండూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో చొప్పరివారిగూడెం గ్రామం ఉంది. ఈ గ్రామస్తులు రేషన్ బియ్యం పొందాలంటే చండూరు పట్టణంలోని ఒకటో నంబర్ రేషన్ షాపు వద్దకు రావాలి. ఆ గ్రామానికి చెందిన చొప్పరి పెద్దులు రెండు రోజులుగా రేషన్ షాపు వద్దకు వచ్చి, తిరిగి ఖాళీగానే ఇంటికి వెళ్లిపోతున్నాడు. ఎందుకంటే వేలిముద్రలు పడక ఆయనకు బియ్యం ఇవ్వడం లేదు. -చొప్పరి పెద్దులు, చొప్పరివారిగూడెం, చండూరు, నల్లగొండ రేషన్పై గతంలో ఇచ్చిన సరుకులు బియ్యం, పంచదార, కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు, గోధుమలు, కిరోసిన్, చింతపండు ప్రస్తుతం సరఫరా అవుతున్నవి బియ్యం, కిరోసిన్ (అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు మాత్రం కిలో పంచదార సరఫరా జరుగుతోంది) -
అందరూ నిశానీదారులే!
అక్షర తూణీరం మనిషిని సృష్టించినవాడు దేవుడే అయితే, ఆయన నిజంగా గొప్పవాడు. మనిషిలో ఏ చిన్న పార్ట్నీ డూప్లికేట్ చేసే అవకాశం లేకుండా డిజైన్ చేశాడు. వేళ్ల కొసల్లో శంఖుచక్రాలు అమర్చాడు. దాన్నొక శాస్త్రంగా చేసుకుని బతకడానికి కొందరికి అవకాశం కల్పించాడు. ప్రస్తుతం దేశం వేలిముద్రల మీద నడు స్తోంది. ఒక ప్పుడు నిరక్షరా శ్యుణ్ని వేలి ముద్రగాడు, నిశాని పద్దు అని పిలిచేవారు. ఇప్పుడు వేలిముద్ర లేకుండా తెల్లారదు, పొద్దుగూకదు. ఎన్ని కోట్ల మంది జనం ఉన్నా, ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్సూ ఒక్కలాగా ఉండవని అందరికీ తెలుసు. ఈ సత్యాన్ని మనిషి ఎన్నడో కనిపెట్టాడు. చేవ్రాలుని ఎవరైనా ఫోర్జరీ చెయ్యచ్చుగాని వేలిముద్రని చేయడం బ్రహ్మతరం కూడా కాదు. అందుకని ముఖ్యమైన పత్రాల మీద సంతకందార్లయినా, వేలిముద్రలు వేసి తీరాల్సిందే. క్రయవిక్రయ దస్తావేజుల మీద, పాస్పోర్ట్ వ్యవహారంలో వేళ్లకు సిరా రాసుకోక తప్పదు. పూర్వం ప్రొ నోటు మీద మగవారైతే ఎడమ చేతి బొటనవేలుని, ఆడవారైతే కుడిచేతి బొట నవేలుని తిప్పి తీరాల్సిందే. ఇప్పుడు అదే ఆచారం అందర్నీ శాసిస్తోంది. వేలి ముద్రకున్న నిజాయితీ సంతకానికి లేకుండా పోయింది. పనిచేసేచోట్లలో బయోమెట్రిక్ విధానం వచ్చి చాలా కాలమైంది. సొంత వేలైతే తప్ప వేళలు అతిక్రమించే పప్పు లుడకవ్. అసలెందుకు, సమస్త క్రిమినల్ వ్యవహారాల్ని పట్టిచ్చేది ఫింగర్ ప్రింట్సే. అదొక పెద్ద శాస్త్రం. ఆధార్ కార్డ్కి మూలాధారం వేలిముద్రే. సెల్ఫోన్ని, ఐపాడ్ని, టాబ్లెట్ని వేలిముద్రతోనే లాక్ మరియు అన్లాక్ చేసుకుంటారు. లాక ర్స్కి కూడా ఇలాంటి ‘నిశాని తాళం’ సదుపాయం ఉంది. అసలీ బయోమె ట్రిక్ విధానంతో దొంగ ఓట్లని నిరోధిం చవచ్చు. వేళ్లన్నీ గొప్పవేగానీ బొటనవేలు మరింత గొప్పది. పురుషసూక్తంలో బొట నవేలు ఒక కొలమానంగా ప్రస్తావనకు వస్తుంది. ‘అంగుష్టమాత్రం’ అనే వాడుక అక్కడనించే వచ్చింది. రాజగురువు ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ని కుడిచేతి బొటనవేలుని గురుదక్షిణగా కోరి స్వీక రించాడు. శిష్యుణ్ని ఆ విధంగా అశక్తుణ్ని చేసి పుణ్యం కట్టుకున్నాడు. ఇది వేరే కథ. ఇప్పుడీ నగదు రహిత లావాదేవీలు వచ్చాక, చేవ్రాలు మరీ అపురూపమై పోయింది. ఇక్కడో విషయం చెప్పాలి. పెద్ద వాళ్లంతా పదే పదే న.ర. లావా దేవీలంటున్నారు. న.ర. ఆర్థిక లావా దేవీలు అనకపోతే కొంచెం అపార్థం ధ్వనిస్తోంది. ఆ విషయం అలా ఉంచితే, ప్రస్తుతం బ్యాంకి చెక్కుల మీద కూడా వేలిముద్ర ప్రవేశపెడితే బెటరనిపి స్తోంది. కార్డ్ స్వైపింగ్ వచ్చాక చీటికీ మాటికీ సంతకాలు పెట్టే పని తగ్గింది. దాంతో సంతకం టాలీ కాలేదని చెక్కులు తిరిగి రావడం, దాంతో అపార్థాలు ఎక్కు వైనాయి. అదే నిశాని అయితే పేచీపూచీ ఉండదు. మనిషిని సృష్టించినవాడు దేవుడే అయితే, ఆయన నిజంగా గొప్పవాడు. మనిషిలో ఏ చిన్న పార్ట్నీ డూప్లికేట్ చేసే అవకాశం లేకుండా డిజైన్ చేశాడు. వేళ్ల కొసల్లో శంఖుచక్రాలు అమర్చాడు. దాన్నొక శాస్త్రంగా చేసుకుని బతకడానికి కొందరికి అవకాశం కల్పించాడు. వేలి కొసలే కలవనప్పుడు రెండు మెదళ్లు ఎలా కలుస్తాయ్? అందుకే ట్రంప్ బ్రెయి న్లా మరో బ్రెయిన్ ఉండదు. ఇది వేలి ముద్రంత నిజం. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలైంది
సైన్స్ కాంగ్రెస్లో ఏపీ సీఎం బాబు తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలో నాలుగో పారిశ్రామిక విప్లవం ఇప్ప టికే మొదలైందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. మొదట్రెండు పారిశ్రామిక విప్లవాలు నెమ్మదిగా నడిస్తే మూడోది వేగంగా, నాలుగోది కచ్చిత త్వంతో నడుస్తోందని అభిప్రాయపడ్డారు. తిరుపతిలో మంగళ వారం జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్లో చంద్రబాబు మాట్లాడారు. శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్స హించడంలో ఏపీ ముందుందన్నారు. టెక్నాలజీతోనే భవిష్యత్ అన్నారు. ప్రధాని ప్రారంభించిన మేకిన్ ఇండియాను స్ఫూర్తిగా తీసుకుని మేకిన్ ఏపీ చేప ట్టామన్నారు. ‘ఫైబర్ గ్రిడ్’ ద్వారా ప్రస్తుత మున్న విద్యుత్ స్తంభాలనే ఫైబర్ కేబుల్స్ కోసం వినియో గించుకుంటూ రూ.4,367 కోట్లు ఆదా చేసినట్టు తెలిపారు. భవిష్యత్లో అమెరికా,చైనా తర్వాత భారతే ఉంటుంద న్నారు. మున్ముందు వేలిముద్ర ద్వారా నగదు రహిత చెల్లింపులకు బయోమెట్రిక్ వ్యవస్థ రానుందన్నారు. మహనీయుడు మోదీ... చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని పదే పదే కీర్తించారు. స్వాతంత్య్రానంతరం ఆర్థిక సం స్కరణల తర్వాత అద్భుత ప్రయోగాలు చేస్తున్న మహనీయుడు మోదీ అంటూ ఆకా శానికెత్తేశారు. ధైర్యవంతుడు, ధీశాలి సమా జానికి పట్టిన అవినీతి రుగ్మతను పారదోలేం దుకు నడుం కట్టిన పెద్ద రాజకీయ సంస్కర్తగా మోదీని అభివర్ణించారు. -
పాఠశాలలను బలోపేతం చేయాలి
నాగర్కర్నూల్ విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నాగర్కర్నూల్, తెలకపల్లి ఎంఈఓలు జయశ్రీ, రాజశేఖర్రావు ఉపాధ్యాయులను కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రిసోర్స్ కేంద్రంలో జిల్లా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేసి అన్ని వసతులను వినియోగించుకుని పాఠశాలలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. సీపీఎస్ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డి.గోవర్దన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామస్వామి, కృష్ణయ్య, కురుమూర్తి, వెంకటస్వామి, లక్ష్మణ్నాయక్, సీతారాం, రాజు, చంద్రయ్య, చెన్నయ్య పాల్గొన్నారు. -
బయోమెట్రిక్ ఒట్టిమాటే!
* రెండున్నరేళ్లుగా ఊదరగొడుతున్న ప్రభుత్వం * జిల్లాలో ఏ ఒక్క పాఠశాలలోనూ అమలుకు నోచుకోని వైనం * ప్రైౖ వేటు, కార్పొరేట్ పాఠశాలల్లో అమలులో ఉన్న విధానం గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు పకడ్బందీగా నిర్వహించేందుకు బయోమెట్రిక్ హాజరు నమోదు పేరుతో ఊదరగొడుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం అమలుచేయడం లేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండున్నరేళ్ల వ్యవధిలో దీనిపై పదే, పదే ప్రకటనలు చేస్తూ వచ్చిన పాలకులు కనీసం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడంలోనూ విఫలమయ్యారు. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3,586 ఉన్నాయి. వాటిలో 3,33,990 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రై వేటు పాఠశాలలకు దీటుగా మెరుగైన ఫలితాలను సాధించే లక్ష్యంతో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో బయో మెట్రిక్ హాజరు నమోదు వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బయోమెట్రిక్ హాజరు నమోదును తొలుత ఉపాధ్యాయులకు వర్తింప జేసి తదుపరి దశల్లో విద్యార్థులకు ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదంతా బాగానే ఉన్నా గత రెండేళ్లుగా బయో మెట్రిక్ హాజరు నమోదుకు సంబంధించి జిల్లాలోని ఏ ఒక్క పాఠశాలలోనూ కనీసం ప్రయోగాత్మకంగానైనా ప్రవేశపెట్టలేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇందుకు సంబంధించిన పరికరాలను సమకూర్చడంలోనూ విద్యాశాఖ దృష్టి సారించకపోవడం గమనార్హం. పాఠశాల విద్యారంగాన్ని ఆధునికీకరణ బాట పట్టించి పాఠశాలలకు సాంకేతిక సొబగులు అద్దుతామని పదే, పదే చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. డిజిటల్ తరగతులు, స్మార్ట్ క్లాసులు అంటూ పదేపదే వల్లిస్తున్న ప్రభుత్వ పెద్ధలు వాటి కంటే ముందు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదుపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రైౖ వేటు, కార్పొరేట్ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు నమోదు.. జిల్లాలోని కొన్ని ప్రై వేటు, కార్పొరేట్ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు నమోదు ఇప్పటికే అమలవుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు వేళకు పాఠశాలకు వస్తున్నదీ లేనిదీ పర్యవేక్షించేందుకు బయో మెట్రిక్ వ్యవస్ధ ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ దీనిని ప్రవేశపెట్టడం ద్వారా ఉపాధ్యాయుల్లో బాధ్యత, పాఠశాలకు సక్రమంగా వెళ్లాలనే స్పృహను విద్యార్థుల్లో రేకెత్తించవచ్చు. -
‘బయో’పెట్టినా మాయే..
* వైద్యశాలల్లో నామమాత్రంగా భయోమెట్రిక్ హాజరు * కచ్చితమైన సమయానికి వచ్చి వేలిముద్ర * తర్వాత ఉడాయింపు.. తిరిగి వచ్చి మళ్లీ ముద్ర వైద్యరంగంలో మెరుగైన సేవలందించడం కోసం ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వెరసి సకాలంలో వైద్యసేవలు అందక రోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం తప్పుదోవ పట్టిస్తూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నరసరావుపేట టౌన్: ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహించే వైద్యాధికార సిబ్బంది విధి నిర్వహణ సమయంలో ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉండటం లేదన్న కారణంతో ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైద్యులు, సిబ్బంది ప్రతి రోజు విధులకు హాజరయ్యే సమయం, విధులు ముగించుకొని తిరిగి వెళ్లే సమయంలో బయోమెట్రిక్ మిషన్లో వేలి ముద్రల ద్వారా నమోదును పొందుపరచాల్సి ఉంటుంది. దీన్ని బట్టే వేతనాలు అందుతుంటాయి. కానీ స్థానిక వైద్యశాఖ అధికారులు, సిబ్బంది ఉదయం ఆసుపత్రికి వచ్చి బయోమెట్రిక్ నమోదు వేసి బయటికి వెళ్లి తిరిగి సాయంత్రం విధులు ముగిసే సమయంలో వచ్చి బయోమెట్రిక్ నమోదు చేసుకుంటున్నారని తెలుస్తోంది. అధికారులు,సిబ్బంది విధినిర్వహణ సమయంలో బయట వెళ్లి ప్రైవేటుగా తమ కార్యకలాపాలను కొనసాగిçస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు రాత్రి సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు రోగుల నుంచి వస్తున్నాయి. దీంతో ఆసుపత్రికి వచ్చ పేదలు ప్రభుత్వాసుపత్రిలో రాత్రి పూట సిబ్బంది లేకపోవడంతో ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. రాత్రు పూట ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడితే అనేక అక్రమాలు బయట పడతాయాని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. రాత్రి సమయంలో వైద్యం అందని ద్రాక్షే.. డివిజన్ కేంద్రమైన నరసరావుపేట పట్టణానికి సమీపంలో హైవే మార్గాలు ఉండటంతో రోడ్డు ప్రమాదాలతో పాటు రైల్వే ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. దీంతోపాటు డివిజన్లో పలు ఫ్యాక్షన్ గ్రామాలు ఉండటం మూలంగా నిత్యం అనేక అల్లర్లు చోటు చేసుకుంటుంటాయి. ఆయా సంఘటనలలో గాయపడి అర్థరాత్రిళ్లు చికి త్స కోసం ఏరియా వైద్యశాలను ఆశ్రయిస్తే అక్కడ వైద్యులు ఉండరు. ఉన్న సిబ్బంది నామమాత్రపు సేవలు అందించడంతో మెరుగైన వైద్యసేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా సంతమాగులూరు వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన వ్యక్తిని 108లో ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేక పోవడంతో బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది గుంటూరు వైద్యశాలకు క్షతగాత్రుణ్ణి తరలించారు. ఇటువంటి సంఘటనలు ఏరియా వైద్యశాలలో అనేకం జరుగుతున్నాయి. విచారించి చర్యలు తీసుకుంటాం.. విధి నిర్వహణ సమయంలో వైద్యశాలలో అధికారులు, సిబ్బంది అందుబాటులో లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై సమగ్రంగా విచారించిన అనంతరం చర్యలకు సిఫారసు చేస్తాం. టి. మోహన్ శేషుప్రసాద్, సూపరిండెంట్ -
రేషన్ నుంచి వేలివేత!
ఉండి/మొగల్తూరు/నల్లజర్ల బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చి కార్డుల సంఖ్యను కుదించిన సర్కారు తాజాగా కొత్త ఎత్తుగడ వేసింది. పేద, మధ్య తరగతి ప్రజల పొట్టకొట్టేందుకు మరో పన్నా గం పన్నింది. రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు ఉంటే అంతమంది తమ రెండు చేతుల 10 వేలి ముద్రలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నంబర్ నమోదు చేయించుకోవాలనే మెలిక పెట్టింది. దీనికి బెస్ట్ ఆఫ్ టెన్ ఫింగర్స్ డిటెక్షన్ (బీఎఫ్డీ) అనే పేరు పెట్టింది. దీంతో లబ్ధిదారుల పది వేళ్లలో ఏ వేలిముద్ర మంచిదో తేల్చే పనిలో పౌర సరఫరాల శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. రేషన్ డీలర్ల ద్వారా లబ్ధిదారులందరి వేలిముద్రలను బయోమెట్రిక్ యంత్రంలో నమోదు చేయిస్తున్నారు. కార్డులో పేరు నమోదైన కుటుంబ సభ్యులంతా డీలర్ వద్దకు వెళ్లి తమ 10 వేలి ముద్రలను ఇవ్వాలనే నిబంధన విధించడంతో వారు చౌక ధరల దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఏరివేత నంబర్–2 నిన్నమొన్నటి వరకూ సర్వేలు, జన్మభూమి కమిటీ సిఫార్సులు, వరుసగా మూడు నెలలపాటు రేషన్ సరుకులు తీసుకోకపోతే రద్దు చేయడం వంటి పద్ధతుల్లో కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగించింది. తాజాగా, రేషన్ కార్డుల్లో నమోదైన కుటుంబ సభ్యుల్ని ఏరివేత/కుదింపు కోసం లబ్ధిదారులందరి నుంచి పది వేలి ముద్రల సేకరణ (బీఎఫ్డీ)కు శ్రీకారం చుట్టింది. స్థానికంగా నివాసం ఉండని కుటుంబ సభ్యులను గుర్తించి వారికి రేషన్ బియ్యం నిలుపుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం రేషన్ డీలర్లకు బయోమెట్రిక్ యంత్రాలను అందించి వేలిముద్రల్ని సేకరించే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే 15 వేల మందికి రేషన్ నిలుపుదల జిల్లాలో 11.70 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. వాటిలో సుమారు 95 వేల కార్డుదారులు నిత్యావసర సరుకులు తీసుకోవడం లేదు. ఇదిలావుంటే.. జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల మందికి వేలిముద్రలు పడటం లేదనే కారణంగా రేషన్ సరుకుల సరఫరా నిలిపివేశారు. వారిలో వృద్ధులు, నిరుపేదలే అధికంగా ఉన్నారు. వారికి రేషన్ పునరుద్ధరించకపోగా.. ప్రస్తుతం ఉన్న కార్డుల్లోనూ లబ్ధిదారుల ఏరివేతకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుబాటులో లేనివారి సంగతేంటో! బీఎఫ్డీ పేరిట చేపట్టిన కార్యక్రమానికి అందుబాటులో ఉన్న లబ్ధిదారులు వెళ్లి తమ రెండు చేతుల 10 వేలి ముద్రలు ఇస్తున్నారు. స్థానికంగా అందుబాటులో లేనివారికి ఇది ఆశనిపాతంగా పరిణమించింది. జీవనోపాధి కోసం పొట్ట చేతపట్టుకుని పొరుగూళ్లకు వెళ్లిన వ్యక్తులు ప్రతి రెండు కుటుంబాల్లో ఒక్కరైనా ఉండటం సహజం. ఇప్పటికిప్పుడు వారంతా వచ్చి 10 వేలిముద్రల్ని ఇవ్వడం కష్టసాధ్యం. అలాంటి వారందరికీ రేషన్ సరుకులు ఎగ్గొట్టే అవకాశం ఉందని పౌర సరఫరాల వర్గాలు చెబుతున్నాయి. పనులు మానుకుని డీలర్ల చుట్టూ.. గతంలో వేలిముద్ర లేదా సంతకం చేస్తే రేషన్ సరుకులు అందించేవారు. గత ఏడాది డిసెంబర్ నుంచి బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టి కార్డులో నమోదైన వారిలో ఎవరో ఒకరి వేలిముద్ర లేదా ఐరిస్ గుర్తింపు ఇస్తే సరుకులు అందిస్తున్నారు. ఉద్యోగ రీత్యా, వలస కూలీలుగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు బయోమెట్రిక్లో విధిగా 10 వేలి ముద్రలు నమోదు చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ముద్రల సేకరణ విషయమై రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురువుతున్నారు. ఈపోస్ యంత్రాలు పనిచేయకపోవడంతో పనులు మానుకుని వచ్చిన వారు రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి. ఈ సందర్భంలో కార్డుదారులు, డీలర్ల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. రేపటి వరకే గడువు! వేలిముద్రల సేకరణకు ఈనెల 15వ తేదీ వరకే గడువు విధించారు. 14వ తేదీ ఆదివారం, 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో సెలవు రోజులు. మరో వారం రోజులు గడువు పొడిగించినా వేలిముద్రల నమోదు కార్యక్రమం 80 శాతమైనా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఉదాహరణకు నల్లజర్ల మండలంలో 25,850 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 64వేల మంది లబ్ధిదారులుగా నమోదయ్యారు. రెండు నెలలుగా వేలి ముద్రల నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 68 శాతం మాత్రమే పూర్తయ్యింది. ఆదేశాలు రాలేదు వేలిముద్రల నమోదు గడువు ఈనెల 15వ తేదీతో ముగుస్తోంది. అందరూ తప్పక వేలిముద్రలు వేయాలి. వేలిముద్రలు పడనివారి జాబితాను ప్రత్యేకంగా తయారు చేయాలని ఆదేశాలందాయి. వేలిముద్రలు వేయనివారు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి విషయంలో ఏం చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదు. – ఎం.మోహనరావు, సీఎస్డీటీ, ఉండి వేలిముద్రల నమోదు తప్పనిసరి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రేషన్ కార్డులో పేరు నమోదైన లబ్ధిదారులంతా తమ రెండు చేతుల 10 వేళ్లను రేషన్ డీలర్ వద్ద స్కాన్ చేయించాలి. అందుబాటులో ఉన్న ప్రతివారూ వేలిముద్రలు వేయాల్సిందే. వేలిముద్రలు ఇవ్వని వారికి మరో అవకాశం ఉంటుంది. సులువుగా రేషన్ తీసుకునేందుకే ఈ కార్యక్రమం. – డి.శివశంకరరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి -
యూనివర్సిటీల్లో బయోమెట్రిక్ విధానం
వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నత విద్యామండలి టెక్నికల్ కార్యదర్శి ఆదేశం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఈయేడాది నుంచే రాయలసీమ యూనివర్సిటీ, అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఉన్నత విద్యామండలి టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సునీతాధావారా ఆదేశించారు. సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్లో రాయలసీమ యూనివర్సిటీ వీసీ నరసింహులు, ఇతర అధికారులతో మాట్లాడారు. ఫీజురీయింబర్స్మెంట్ వివరాలను ఆధార్తో అనుసంధానం చేసి ఎలాంటి అక్రమాలకు చోటులేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
నేటి ఐసెట్కు సర్వం సిద్ధం
► మహబూబ్నగర్, వనపర్తిలో కేంద్రాల ఏర్పాటు ► హాజరుకానున్న 2,500మంది అభ్యర్థులు పాలమూరు యూనివర్సిటీ : ఐసెట్ ఎంట్రెన్స్కు పీయూ అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో గురువారం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఎంవీఎస్ , ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల, బాలుర జూనియర్ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దానితో పాటు వనపర్తిలో ఉమెన్స్ కళాశాలలో సెంటర్ వేశారు. జిల్లాలో మొత్తం 2,500మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్షను రాయబోతున్నారు. పరీక్ష ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు కొనసాగుతుంది. బయోమెట్రిక్ విధానం ఉండటం వల్ల గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు నిమిషం అలస్యం అయిన పరీక్ష కేంద్రంలోపలికి అనుమతి లేదు. ప్రతి అభ్యర్థి ఐడి కోసం ఆధార్ కార్డు కానీ ఇతర పత్రాలు ఏదైన ఒకటి ఉండాలి. సెల్ఫోన్, గడియారం, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి వెంట తీసుకురావద్దు. ప్రతి అభ్యర్థికి సంబంధించిన హాల్టికెట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా సెంటర్స్లలో పరీక్ష నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీయూ కంట్రోలర్ మధుసూధన్రెడ్డి చెప్పారు. ప్రతి కేంద్రంలో ఇద్దరు అధికారులు ఉండి పరీక్షలను పర్యవేక్షించనున్నారు. -
ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్
-
బయోమెట్రిక్తో ఆందోళన
► దుర్గగుడి సిబ్బంది వేతనాల్లో కోత ► నెలంతా వచ్చినా 8 రోజులు గైర్హాజరైనట్లు నమోదు ఇంద్రకీలాద్రి : దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానంతో సిబ్బందికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఏప్రిల్లో 8 నుంచి పది రోజులకు పైగా విధులకు హాజరు కానట్లు బయోమెట్రిక్లో నమోదు కావడంతో మిషన్ల పనితీరుపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ ఒకటి నుంచి దుర్గగుడి సిబ్బందికి బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. అయితే రోజూ విధులకు హాజరైనా కొంత మందికి 20 రోజులు మాత్రమే పని చేసినట్లు నమోదు కావడంతో ఆలయ అధికారులు, సిబ్బంది గొల్లుమంటున్నారు. ఏఈవో స్థాయి అధికారులతో పాటు సూపరింటెండెంట్లు, దిగవ స్థాయి సిబ్బంది సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా గుడిపై ఏ ఇద్దరు సిబ్బంది కలిసినా బయోమెట్రిక్పైనే చర్చ జరుగుతోంది. బయోమెట్రిక్ విధానంవల్ల నష్టపోయే సిబ్బంది పరిస్థితిని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయో మెట్రిక్ హాజరుతో పాటు ప్రత్యేకంగా ఒకరికి హాజరు నమోదుపై పర్యవేక్షణ అప్పగించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిక్కులు ఎన్నో... బయో మెట్రిక్తో చిక్కులు అన్నీ, ఇన్నీ కావని ఆలయ సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. ఈ యంత్రాలు ఏర్పాటు చేసి నెల కాక ముందే హాజరు కోసం తిప్పలు పడుతున్నామని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో మూడు చోట్ల బయో మెట్రిక్ యంత్రా లు ఏర్పాటు చేశారు. ఆలయంలో రెండు షిఫ్టులలో 306 మంది శాశ్వత సిబ్బంది, 60 మంది ఎన్ఎంఆర్లు, మరో 35 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్టున్నారు. బొటన వేలు, చూపుడువేలి ముద్రతో పాటు ఐరిస్ద్వారా హాజరు తీసుకునేలా బయోమెట్రిక్ పరికరాలలో సాప్ట్వేర్ను పొందుపరిచారు. ఉదయం 10కి వచ్చి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహిస్తారు. మరికొన్ని విభాగాల్లో ఉదయం, మధ్యాహ్నం వచ్చి రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహిస్తుంటారు. అయితే (అదనపు విధులు) ఓటీ చేస్తున్న వారిని ఏ విధంగా నమోదు చేస్తారనే దానిపై సృష్టత లే కపోవడంతో చిన్న స్థాయి సిబ్బంది తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతామంటున్నారు. -
జూనియర్ కళాశాలల్లో ఇక సీసీ కెమెరాలు
ఇంటర్ బోర్డు ఆర్జేడీమల్హల్రావు రామాయంపేట: వచ్చే విద్యా సంవత్సరంలోగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలతోపాటు బయో మెట్రిక్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డురీజినల్ జూయింట్ డెరైక్టర్ (ఆర్జేడీ) మల్హల్రావు పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేటప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ప్రభుత్వ కళాశాలలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. సక్రమంగా విధులు నిర్వర్తించని లెక్చరర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు విధిగా ప్రార్థనా సమయానికి కళాశాలకు రావాలని ఆదేశించారు. ఇంటర్ ఫలితాల మెరుగునకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. లెక్చరర్ల కొరతను అధిగమించడానికిగాను పార్ట్టైం ఉద్యోగులను నియమిస్తున్నట్టు ఆర్జేడీ తెలిపారు. -
పద్మావతి వర్సిటీలో బయోమెట్రిక్ విధానం
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానాన్ని వీసీ రత్నకుమారి గురువారం ప్రారంభించారు. ర్యాగింగ్ కారణంగా నాగార్జున విశ్వవిద్యాలయంలో రుషితేశ్వరి ఆత్మహత్యతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మహిళా వర్సిటీ అధికారులు ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేయడమేగాక విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ఐడెంటిటీ కార్డులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు వసతి గృహంలోకి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు వేలిముద్రల ద్వారా హాజరు నమోదు చేసుకోవాలన్నారు. సర్వర్ రిమోట్ ద్వారా దీన్ని అనుసంధానం చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మి, వార్డెన్ పి.వాణి పాల్గొన్నారు. -
జూనియర్ కాలేజీల్లో బయోమెట్రిక్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఇంటర్బోర్డు సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు తెలిసింది. తొలిదశలో ఇంటర్ విద్యార్థులకు జూనియర్ కళాశాల్లో ఈ విధానాన్ని అమలు చేసి.. త ర్వాత అవసరం అనుకుంటే స్కూల్ టీచర్లు, జూనియర్ లెక్చరర్లకూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని బోర్డు సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. -
కరుణలేని నిబంధన... చేయి కోల్పోయిన వృద్ధురాలి వేదన
కర్నూలు (ఆత్మకూరు రూరల్) : సాంకేతిక అభివృద్ధి మనిషిని సౌకర్యవంతంగా ఉంచేందుకు ఉపయోగపడాలి కానీ వారిని మరింత కష్టాల పాలు చేయడానికి కాదు. అక్రమాల నిరోధానికంటూ ప్రవేశ పెట్టిన ఆధార్ ఎందరి ఆధారాలనో పోగొట్టిందో అందరికి తెలిసిందే. అలాంటి కోవలోనిదే పౌరసరఫరాలలో అక్రమాలను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పద్ధతి. లబ్దిదారుల వేలి ముద్రలను స్కానింగ్ చేసి భధ్రపరచి వారు స్వయంగా వేలి ముద్రలు వేసిన తరువాత సరిచూసే ఈ పద్ధతి ఓ వృద్దురాలిని కడుపు కాలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన దూదేకుల హుసేనమ్మ భర్త ఇటీవలే మృతిచెందాడు. ఒంటరిగా ఉంటున్న ఆమెకు ఉన్న కష్టాలు చాలవన్నట్లు చేతి వేళ్ళకు అయిన చిన్నపాటి గాయం పెరిగి పెద్దదై గాంగ్రిన్గా మారి చేతిని కుళ్ళ జేసింది. దీంతో సంవత్సరం క్రిందట అనివార్యంగా ఆమె ఎడమ చేతిని వైద్యులు ముంజేతి వరకు తొలగించారు. దీంతో ఆమె రేషన్ కార్డుకు రావాల్సిన వెచ్చాలను తీసుకోవడానికి రేషన్ షాపుకు వెళ్తే.. తన ఎడమ చేతి బొటన వ్రేలి ముద్ర వేయలేని కారణంగా డీలరు ఆమెకు రేషన్ ఇవ్వడానికి నిరాకరించాడు. భర్తను కోల్పోయి , మోచేతి వరకు చేతిని కోల్పోయిన హుసేనమ్మకు న్యాయంగా రావాల్సిన రేషన్ వేలి ముద్ర వేయలేని కారణంగా ఏడాదిగా ఇవ్వకపోవడం ప్రభుత్వ సాంకేతికత డొల్లతనాన్ని సూచిస్తోంది. తనకు రేషన్ ఇప్పించండంటూ ఆమె ఆత్మకూరు తహశీల్దార్ రాజశేఖరబాబుకు గురువారం మొరపెట్టుకుంది. -
అన్ని వసతి గృహాల్లో పూర్తి స్థాయి బయోమెట్రిక్ విధానం
అమలు చేయాలని అధికారులకు ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ ఎం.వి.రెడ్డి ఆదేశాలు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ఎస్సీహాస్టళ్లలో పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ విధానాన్ని అమలుకు చర్యలు తీసుకోవాలని ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ ఎం.వి.రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎస్సీ హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానం అమలుపై సహాయ సాంఘికసంక్షేమ అధికారుల సమావేశంలో ఎం.వి.రెడ్డి సమీక్షించారు. సోమవారం మాసబ్ట్యాంక్లోని సంక్షేమభవన్లో జరిగిన సమీక్షాసమావేశంలో బయోమెట్రిక్ అమలుచేసే క్రమంలో ఎదురవుతున్న నెట్వర్క్ సమస్యలు, ఇతరత్రా అంశాలను గురించి ఆయా జిల్లాల అధికారులు ప్రస్తావించారు. ఈ విధానానికి ల్యాండ్లైన్ ఫోన్కు అనుసంధానంచేయాలని కొందరు సూచించారు. మూడో తరగతి చదువుతున్న చిన్న పిల్లల వేలిముద్రలు నమోదు కావడం లేదని, ఇట్లాంటి సమస్యలున్న చోట ప్రత్యామ్నాయంగా అటెండెన్స్ నమోదుకు అనుమతినివ్వాలని కోరారు. ఆయా సమస్యలను అధిగమించి వీలైనంత తొందరలో అన్ని హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకుచర్యలు తీసుకోవాలని ఎం.వి.రెడ్డి ఆదేశించారు. అదే విధంగా పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఎస్సీ హాస్టళ్లలోని విదార్థులు 93.15 శాతం ఉత్తీర్ణతను సాధించడం పట్ల హాస్టల్ సంక్షేమ అధికారులు, సహాయ,జిల్లా సాంఘికసంక్షేమ అధికారులను ఎం.వి.రెడ్డి అభినందించారు. చక్కని ఫలితాలు అందిస్తున్న దృష్ట్యా మూడో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే తమ పిల్లలను తల్లితండ్రులు తమకు దగ్గరలోని ఎస్సీ హాస్టళ్లలో చేర్పించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. -
రేషనుకూ అదే ముద్ర
లబ్ధిదారులకు రేషన్ కష్టాలు వేలిముద్ర వేసినోళ్లకే సరకులు వచ్చే నెల నుంచి ఈ-పాస్ విధానం అమలు రేషను విడిపించుకోవాలంటే కొత్త చిక్కొచ్చిపడింది. ఇప్పటికే రకరకాల సాకులతో రేషను కార్డులకు కోత విధించిన సర్కారు తాజగా మరో నిబంధన అమలులోకి తేనుంది. రేషనుడీలరు సరకులివ్వాలంటే కార్డుహోల్డరు వేలిముద్ర వేయాల్సిందే. వేలిముద్ర ఏమాత్రం తేడా వచ్చిన రేషనుకు ఎసరే. ఏప్రిల్ నుంచి రాష్ర్ట ప్రభుత్వం ఈ నియమాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. అధికారవర్గాలు దీనిని ధ్రువీకరించాయి. బయోమెట్రిక్ విధానం కింద పించనుకు అగచాట్లు పడుతున్న నేపథ్యంలో రేషనుకూ అదేతరహా విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. కాకుంటే ఇది ఈ-పాస్ విధానమని అధికారులు సమర్దించుకుంటున్నారు. మహారాణిపేట: బయోమెట్రిక్తో పింఛనుదార్లను అష్టకష్టాలు పెడుతున్న ప్రభుత్వం ఆ బాధను రేషన్ దుకాణాలకూ వర్తింపజేయనుంది. ఈ-పాస్ విధానాన్ని అమలు చేసి ఇకమీదట వేలిముద్రలు వేసిన వారికే రేషన్ ఇవ్వనున్నారు. వచ్చే నెల నుంచి దీనిని అమలుచేయనున్నారు. దీని ప్రకారం నేరుగా కార్డుదారుడే రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి. అదీ డివైస్ ఎలక్ట్రానిక్ మిషన్పై వేలిముద్రలు పడితేనే. లేదంటే ఆ కార్డుకు రేషన్ నిలిపివేస్తారు. గతంలో ఒకరి కార్డు ఇంకొకరు తీసుకువెళ్లినా రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు అది కుదరదు. కచ్చితత్వం కోసం ప్రవేశపెడుతున్న ఈ పద్ధతి చాలామందికి ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. ఈ పాస్ విధానం అమలైతే గామాల్లో ఒంటరిగా ఉన్న ముసలివారు పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వారు పెన్షన్ల కోసం నానా యాతన పడుతున్నారు. జియోట్యాపింగ్ మిషన్లపై ముసలివారి వేలిముద్రలు పడకపోవడం, వారు వేసే సమయానికి సిగ్నల్ పనిచేయకపోవడం తదితర సమస్యలతో అర్హులైన వారికి పింఛన్లు నిలిపివేస్తున్నారు. ఇప్పుడు రేషన్ దుకాణాల్లో కూడా కష్టాలు మొదలు కానున్నాయి. జిల్లాలో 2012 చౌకధరల దుకాణాలుండగా మొదటి విడతగా జిల్లాకు 686 ఈ పాస్ మిషన్లు, డీ వైస్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం టెర్రాస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 31 మిషన్లు పౌరసరఫరాల అధికారి కార్యాలయానికి చేరాయి. మొదటి విడతలో నగర పరిధిలోని భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలు, పెందుర్తి, రూరల్ పరిధిలోని యలమంచిలి మున్సిపాలిటీ, అ న్ని మండలాల్లో ఈ పద్ధతిని అమలు చేయనున్నారు. డీలర్లకు ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు పౌరసరఫరాాల అధికారులు శిక్షణ నిర్వహిస్తారు. జిల్లా లో 10 లక్షల 76 వేల119 రేషన్ కార్డులున్నాయి. ఇందులో నగర పరిధిలో 3 లక్షల 38 వేల729 కార్డులు కాగా, రూరల్లో 7 లక్షల 37 వేల 390 కార్డులు ఉన్నాయి. -
ఇక పాఠశాలల్లో బయోమెట్రిక్ సిస్టమ్
విద్యార్థుల ఆధార్తో అనుసంధానం మొదటి విడతలో ఐదు జిల్లాల ఎంపిక అందులో ఒకటి చిత్తూరు చిత్తూరు: అన్ని ప్రభుత్వ,ప్రయివేటు పాఠశాలలు,కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సర్వర్లతో వీటిని అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా పాఠశాలలకు చెందిన మొత్తం సమాచారం అందుబాటులోకి రానుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి బయోమెట్రిక్ పరికరాలను అమరుస్తారు. 200 మంది లోపు విద్యార్థులకు ఒకటి చొప్పున ఈ పరికరాలను అమర్చనున్నారు. ఇందుకోసం మొదటి విడతలో చిత్తూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరుతోపాటు మొత్తం ఐదు జిల్లాలను ఎంపిక చేశారు. ఈ జిల్లాల్లో తొలుత బయోమెట్రిక్ విధానానికి ఆధార్ అనుసంధానం పూర్తిచేసి దీన్ని అమలుచేయనున్నారు. తరువాత మిగిలిన జిల్లాల్లోనూ బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తారు. ఈ విధానంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, పాఠశాలలకు మంజూరవుతున్న నిధులు, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ, చదువు మానేసిన సమాచారంతోపాటు సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ వివరాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మార్గం సుగమం కానుంది. రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన ఆధార్కార్డు నంబర్ సేకరణ ప్రక్రియ చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. విద్యాశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 5,98,676 మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత చదువులకు సంబంధించి విద్యార్థులను కలిపితే 10లక్షలకు పైగా విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 97 శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఆధార్ అనుసంధానం పూర్తిచేసి బయోమెట్రిక్ అమలు చేయనున్నారు. -
సంక్షేమ హాస్టళ్లలో ‘బయోమెట్రిక్’
ఫిబ్రవరి 1 నుంచి అమలు దళిత సంక్షేమశాఖ డీడీ కృష్ణవేణి ఏఎస్డబ్ల్యూఓలు, హెచ్డబ్ల్యూఓలతో సమీక్ష నక్కలగుట్ట : జిల్లాలోని 99 దళిత సంక్షేమశాఖ హాస్టళ్ల లో ఫిబ్రవరి ఒకటి నుంచి బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్లు జిల్లా దళిత సంక్షేమ శాఖ ఇన్చార్జ్ డిప్యూటీ డెరైక్టర్ కొమ్మెర్ల కృష్ణవేణి తెలిపారు. హన్మకొండ కలెక్టరేట్లోని దళిత సంక్షేమశాఖ డీడీ కార్యాలయంలో బుధవారం ఏఎస్డబ్ల్యూఓలు, హెచ్డబ్ల్యూఓలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దళిత సంక్షేమ హాస్టళ్లలో ఆధార్ కార్డులు లేని విద్యార్థుల వివరాలు సేకరించాలని సూచించారు. వారిని ఆధార్కార్డులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేర కు విద్యార్థులు హాస్టళ్లలో చదువుకునే చోట లైటింగ్ ఏర్పా టు చేయూలని, హాస్టళ్లలోని మరుగుదొడ్లను యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయించాలన్నారు. విద్యార్థులకు నెలకు రెండు చొప్పున టారుులెట్ సబ్బులను అందుబాటులో ఉంచాలన్నారు. మరుగుదొడ్ల మరమ్మతులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సంప్రదించాలని జిల్లాలోని అన్ని హాస్టళ్లలో మౌలిక సదుపాయూల కల్పనకు హాస్టల్ వెల్పేర్ ఆఫీసర్ల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలని ఏఎస్డబ్ల్యూఓలకు సూచించారు. ప్రధానంగా హాస్టళ్లలో తాగు నీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. మండల సర్వసభ్య సమావేశాలకు ఏఎస్డబ్ల్యూఓలు హాజరై హాస్టళ్లలోని సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావాలన్నారు. కాగా, జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కష్టాల్లో ఉన్నారని, అన్ని విధాలుగా ఆదుకోవాలని కొమ్మెర్ల కృష్ణవేణిని హెచ్డబ్ల్యూఓల సంఘం జిల్లా అధ్యక్షుడు, మహబూబాబాద్ ఇన్చార్జ్ ఏబీసీడబ్ల్యూఓ సురేందర్ కోరారు. సమావేశంలో ఎస్సీ సంక్షేమశాఖ డీడీ కార్యాలయ సూపరింటెం డెంట్లు సత్యనారాయణ, వరలక్ష్మి, హన్మకొండ ఏఎస్డబ్ల్యూఓ రమాదేవి, హెచ్డబ్ల్యూఓల సం ఘం జిల్లా ప్రధానకార్యదర్శి రవీందర్రెడ్డి, హెచ్డబ్ల్యూఓలు భవానీ ప్రసాద్, రాంరెడ్డి, చంద్రశేఖర్, సుదర్శన్రావు పాల్గొన్నారు. -
పింఛన్లకు బయోమెట్రిక్ విధానం
డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ సర్వేశ్వర్రెడ్డి తాండూరు: బయోమెట్రిక్ విధానం ద్వారా ఆసరా పథకం కింద పింఛన్ల పంపిణీ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోందని డీఆర్డీఏ ప్రాజెక్టు డెరైక్టర్ వి.సర్వేశ్వర్రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన తాండూరు మున్సిపాలిటీని సందర్శించారు. చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ గోపయ్యలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బోగస్ పింఛన్లను తొలగించి, అర్హులైన పేదలకు లబ్ధి చేకూర్చడం కోసమే బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే రెండు,మూడు నెలల్లో ఈ విధానం అమల్లోకి వచ్చే ఆస్కారం ఉందన్నారు.మున్సిపాలిటీల పరిధిలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా పింఛన్ల డబ్బులను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదన్నారు. 95శాతం మందికి ఖాతాలు ఉంటే ఆన్లైన్లో జమ చేసే విధానం అమలు చేయాలని సర్కారు ఆలోచన చేస్తున్నట్టు వివరించారు. పింఛన్ల పంపిణీపై అన్ని స్థాయిల్లో విచారణతో పాటు సోషల్ ఆడిట్ కూడా ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. 10వరకు పింఛన్లు.. వచ్చే నెల నుంచి మండలాలు, మున్సిపాలిటీల్లో 5-10వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని పీడీ తెలిపారు. అర్హత ఉన్నా ఆ దారు కార్డులో వయసు తక్కువ ఉన్న వారు మెడికల్బోర్డు ద్వారా వయసు ధ్రువీకరణ పత్రం తీసుకొని దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు వస్తుందన్నారు. స్థానిక అధికారులకు వయసు ధ్రువీకరణ చేసే అధికారం లేదన్నారు. గత ఏడాది చివరిలో కొన్ని నెలల పింఛన్ డబ్బులు యాక్సెస్ బ్యాంకు నుంచి డ్రా చేసినప్పటికీ లబ్ధిదారులకు పంపిణీ చేయని వ్యవహారంపై విచారణ జరుగుతోందన్నారు. లబ్ధిదారుల ఎంపికపై సందిగ్ధం నెలకొన్నందున అభయహస్తం పింఛన్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందన్నారు. జిల్లాలో రూ.31.34కోట్ల పింఛన్లు జిల్లాలో జనవరి నెలకు సంబంధించి 2,50,977 మందికి రూ.31.34కోట్ల పింఛన్లు మంజూరు అయ్యాయని పీడీ చెప్పారు. స్వ యం ఉపాధి కోసం నిరుద్యోగ యువతకు కంప్యూటర్స్, అకౌంటింగ్, బ్యూటీ పార్లర్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి వికారాబాద్, చిలుకూరులో శిక్షణకేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వచ్చే నెలలో తాండూరులో జాబ్మేళా నిర్వహిస్తామన్నారు. బ్యాంకు లింకే జీ కింద జిల్లాలో మహిళా పొదుపు సంఘాలకు రూ.248కోట్ల రుణ లక్ష్యానికి గాను రూ.201 కోట్ల రుణాల లింకేజీ జరిగిందని వివరించారు. బంట్వారం, బషీరాబాద్ మండలాల్లో రుణాల రికవరీ తక్కువగా ఉందన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్చైర్మన్ సాజిద్అలీ పాల్గొన్నారు. -
ఆత్మక్షోభ !
సాక్షి, చిత్తూరు: సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం కనమనపల్లెకు చెందిన ఎం.మునెప్ప (76) సెంటు భూమిలేని నిరుపేద. చిన్న పూరి గుడిసే నివాసం. కొడుకు మద్యానికి బానిసై ఎటో వెళ్లిపోయాడు. మతిస్థిమితంలేని మనవరాలు రోజా (15)కు ఆయన ఆధారం. దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి హయాం నుంచి ఇస్తున్న పింఛనే వారికి ఆధారం. నాలుగు నెలలుగా మునెప్పకు పింఛన్ నిలిపి వేశారు. ఒకపూట తిండికి నోచుకోని మునెప్ప వేదనతో డిసెంబర్ 26 న ప్రాణాలు వదిలాడు. గ్రామస్తులు చందాలువేసి దహన సంస్కారాలు పూర్తిచేశారు. అదే గ్రామానికి చెందిన నాగమ్మ (80) నిరుపేద. కొడుకు రెండు చేతులు లేని వికలాంగుడు. మనవరాలి వద్ద ఉంటోంది. మూడునెలలుగా పింఛన్ ఆగిపోయింది. బతుకు భారంగా మా రింది. అధికారులకు, స్థానిక నేతలకు మొరపెట్టుకున్నా ఎవరి మనసూ కరగలేదు. మనవరాలికి భారం కాకూడదనుకున్న నాగమ్మ వేదనతో ఈ ఏడాది జనవరి 3న ప్రాణాలు వదిలింది. విజయపురం మండలం కేవీ పురం గ్రామానికి చెందిన రామానాయుడు, రామచంద్రాపురం మండలం కు ప్పంబాదూరుకు చెందిన నరసింహా రెడ్డి, నెమల్లగుంటపల్లెకు చెందిన రామక్క, పీవీపురానికి చెందిన ముత్యాలమ్మ, కొత్తకుప్పం ఎస్టీ కాలనీకి చెం దిన వికలాంగుడు దేసయ్య సహా ఏడుగురికి పింఛన్ల కోసం వగర్చి ప్రాణాలు కోల్పోయారు. బయోమెట్రిక్ విధానం పుణ్యమాని క్యూల్లో రోజుల తరబడి నిల్చోలేక అనారోగ్యానికి గురై మరో నలుగురు మృత్యువాత పడ్డారు. మొత్తంగా ఒక్క నెలలోనే జిల్లాలో 11 మంది ప్రాణాలు వదిలారు. సీఎం చం ద్రబాబు సొంత జిల్లాలో అర్హులైన పేద ల పింఛన్లు వేల సంఖ్యలో తొలగించడంతో ఆసరా కోల్పోయిన వారు మనోవేదనతో ప్రాణాలు వదులుతున్నారు. దివంగత సీఎం వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు 3,96,444 మందికి పింఛన్లు ఇచ్చేవారు. ప్రతి నెలా 1వ తేదీ డబ్బు ఇంటి వద్దే అం దించే వారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పరిస్థితి తారుమారైంది. రాజకీయ కక్షతో ప్రభుత్వం అర్హుల పింఛన్లు తొలగించింది. దీంతో జిల్లాలో 34,190 పింఛన్లు కోల్పోయారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆధారం కోల్పోయారు. ఆకలితో కొందరు, ఆవేదనతో కొందరు, ఆసరా కోల్పోయి ఇంకొం దరు ప్రాణాలు వదులుతున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోని మునెప్ప ఆకలిచావు, నాగమ్మ మరణం పాలకులకు చెంపపెట్టులాంటిదే. -
వచ్చే నెల నుంచి పోస్టల్ ద్వారా పింఛన్లు
* బయోమెట్రిక్ విధానంలో పారదర్శకంగా పంపిణీ * పోస్టల్ అధికారుల వర్క్షాపులో కలెక్టర్ విజయవాడ : సామాజిక భద్రత పింఛన్లను బయోమెట్రిక్ విధానంలో పారదర్శకంగా పంపిణీ చేయాల్సిన గురుతర బాధ్యత పోస్టల్ సిబ్బందిపై ఉందని కలెక్టర్ ఎం. రఘునందన్ రావు చెప్పారు. సబ్-కలెక్టర్ కార్యాలయంలో నేరుగా నగదు బదిలీ పథకం(డి.బి.టి.)పై పోస్టల్ అధికారులకు సోమవారం నిర్వహించిన వర్క్షాపులో ఆయన మాట్లాడారు. వచ్చే నెల నుంచి పోస్టల్ శాఖ ద్వారా పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉందన్నారు. పోస్టల్ సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందని చెప్పారు. గ్రామాల్లో పింఛన్ల పంపిణీలో ఇబ్బందులను ముందుగానే అధ్యయనం చేసి వాటిని సరిదిద్దుకోవాలన్నారు. పింఛన్లు ఏ రోజున , ఏ సమయానికి అందిస్తామో నోటీసు బోర్డుల్లో ఉంచాలని పోస్టల్ అధికారులకు సూచించారు. ఇందుకు గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఒకరిని నియమిస్తామని చెప్పారు. పోస్టు మాస్టర్ జనరల్ కె.సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రంలో 11 జిల్లాల్లో 426 మండలాల్లో 8,681 గ్రామపంచాయతీల పరిధిలో 7,781 పోస్టాఫీసుల ద్వారా పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. విజయవాడ పోస్టల్ సేవల సంచాలకులు కె. సోమసుందరం మాట్లాడుతూ జిల్లాలో 973 గ్రామ పంచాయతీల పరిధిలో 6,28,281 మంది పేదలకు ఎన్ఆర్ఈజీఎస్ రోజువారీ వేతనాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాలో 3లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డ్వామా పీడీ పి. మధులత, డీఆర్డీఏ ఏపీడీ జ్యోతి, పోస్టల్ శాఖ సహాయ సంచాలకులు సయ్యద్ అన్సార్ పాల్గొన్నారు. -
కూలీలకు నిలిచిన వేతనాలు
మంచిర్యాల రూరల్ : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. కోత లేకుండా చెల్లించేందుకు యాక్సిస్ బ్యాంక్ ద్వారా సీఎస్పీ వ్యవస్థను ఈ ఏడాది జనవరిలో ప్రవేశపెట్టగా వీరు గ్రామాల్లోనే ప్రతీనెల వేతనాలు చెల్లించేలా కూలీల వేలిముద్రలు, ఐరిస్లు సేకరించారు. ఈజీఎస్ నుంచి యాక్సిస్ బ్యాంక్కు కూలీల వేతనాల డబ్బులు జమచేసినా నెలల తరబడి బ్యాంక్ అధికారులు గానీ, సీఎస్పీలు గానీ చెల్లించకుండా తాత్సారం చేస్తూ వచ్చారు. కుంటి సాకులతో జాప్యం.. బయోమెట్రిక్ విధానం ద్వారా చేపట్టే చెల్లింపుల్లో వేలిముద్రలు సరిగా లేవని, ఆధార్తో అనుసంధానం కాలేదని ఇలా రకరకాల కారణాలతో చెల్లింపుల్లో జాప్యం చేస్తూ వచ్చారు. 14 రోజులకోసారి చేపట్టాల్సిన చెల్లింపులు నెలల తరబడి పెండింగ్లో ఉండడంతో డ్వామా పీడీ గణేశ్జాదవ్ గ్రామీణాభివృద్ధి శాఖకు వేతనాల చెల్లింపులో యాక్సిస్ బ్యాంక్ విఫలమైనట్లు లేఖ రాశారు. కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పనులు నిలిచిపోతున్నాయని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన లేఖ రాయడంతో గత నెలలో యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఈజీఎస్ చెల్లింపులను ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటికే యాక్సిస్ బ్యాంక్కు జమచేసిన కూలీల వేతనాలను బ్యాంక్ వారు తిరిగి గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. నగదు చెల్లింపులను నేరుగా చెల్లించే వీలు లేకపోవడంతో, కూలీల ఖాతాల్లోకి వారి వేతనాలను ఆన్లైన్ ద్వారా జమ చేయాలని కూలీల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు సేకరిస్తున్నారు. అయితే చాలా మంది కూలీలకు బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతో, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన పథకం ద్వారా జీరో బ్యాలెన్స్ ఖాతాలను కూలీలతో తెరిపిస్తున్నారు. కూలీల ఖాతాలు తెరిచి, వాటిని ఆన్లైన్ ద్వారా నమోదు పూర్తి చేస్తేనే కూలీలకు వేతనాలు అందే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో పదిహేను రోజుల సమయం పట్టనుండడంతో ఈ నెలలోనైనా వేతనాలు అందుతాయో లేదోనని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బయోమెట్రిక్ చెల్లింపులు లేనట్లే.. ఉపాధిహామీ కూలీలకు చెల్లించే వేతనాల్లో ఎలాంటి అవినీతి ఉండొద్దని, ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలోని 18 మండలాల్లో యాక్సిస్ బ్యాంక్, 34 మండలాల్లో పోస్టాఫీసు ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. వీరు గ్రామాల్లోని కూలీలకు వేతనాలు చెల్లించేందుకు సీఎస్పీలను నియమించి బయోమెట్రిక్ ద్వారా వేతనాలు కూలీలకు నేరుగా వేతనాలను అందించేవారు. పోస్టాఫీస్ ద్వారా 34 మండలాల్లో అందిస్తున్న వేతనాల్లో ఇబ్బందులు లేకున్నా, యాక్సిస్ బ్యాంక్ నుంచి ప్రతీ నెలా కూలీలకు వేతనాలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. ప్రతీరోజు చెల్లింపుల వివరాలను డ్వామా అధికారులకు అందించకపోవడంతో, ఎంత మంది కూలీలకు వేతనాలు అందాయో? ఎన్ని పెండింగులో ఉన్నాయనే విషయంలో అధికారులకు స్పష్టత లేకుండా పోయింది. నిత్యం ఈజీఎస్ కార్యాలయాలకు కూలీలు చేరుకుని ధర్నా చేయడం, ఆందోళనతో సిబ్బందిని నిర్భందించడం లాంటి ఆందోళనలు చేపట్టారు. 18 మండలాల్లో యాక్సిస్ బ్యాంక్తో ఉన్న ఒప్పందాన్ని డ్వామా అధికారులు రద్దు చేసుకున్నారు. దీంతో 2.26 లక్షల మంది కూలీలు రూ. 4.34 కోట్ల రూపాయల వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. కూలీల వేతనాలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమచేసేందుకు, కూలీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల నంబర్లను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు కూలీలను ఇబ్బందులకు గురిచేసిన బయోమెట్రిక్ ద్వారా కూలీల చెల్లింపులు నిలిచిపోవడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఇక వచ్చి పోదామంటే కుదరదు
ఠాణాల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం ఆర్డర్లీ వ్యవస్థకు చెక్ పాదర్శకంగా విధి నిర్వహణ పోలీసు సిబ్బంది పనివేళల్లో పారదర్శకతను పెంచేందుకు ఠాణాలలో త్వరలో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకు వచ్చేందుకు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి భావిస్తున్నారు. పోలీసు స్టేషన్లో సిబ్బంది ఎవరు విధుల్లో ఉన్నారు.. ఎంత మంది ఉన్నారు.. ఎంత సేపు బయటికి పోయారు, ఏ సమయానికి వచ్చారు.. అనేది గుర్తించేందుకు ఈ కొత్త పద్ధతిని అమలు చేయనున్నారు. సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చుతుండడంతో శాంతి భద్రతల అదుపు, నేరాల నివారణ, బాధితులకు సత్వర పరిష్కారంపై మరింత దృష్టి కేంద్రీకరించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగమే ఈ బయోమెట్రిక్ విధానం. సిబ్బంది తమ విధుల్లో పారదర్శకంగా ఉండేవిధంగా ప్రతి ఠాణాలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో స్టేషన్లో ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకు 50 నుంచి 90 మందికి పైగా ఉంటారు. వీరంతా సమయానికి డ్యూటీకి వస్తున్నారా, విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా.. అనే విషయం తెలుసుకోవడం కష్టంగా మారింది. పలుకుబడి, అధికారుల అండ గల సిబ్బంది విధులకు ఆలస్యంగా రావడం, బాధితులకు అందుబాటులో ఉండకపోవడం, ఫలితంగా బాధితులు స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టడం జరుగుతోంది. కొంతమంది సిబ్బంది అధికారుల స్వంత పనులపై వెళ్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అధికారుల పిల్లల్ని స్కూల్కు తీసుకుపోవడం, కూరగాయాలు తీసుకురావడం తదితర పనులకు అనధికారికంగా సిబ్బందిని వాడుకుంటున్నారనే విమర్శ కూడా ఉంది. ఇలాంటి విమర్శలకు సైతం బయోమెట్రిక్ విధానం స్వస్తి చెప్పనుంది. ఇదీ ప్రస్తుత పద్ధతి.. స్టేషన్లో ఉన్న సిబ్బందిని రెండు షిప్టులుగా విభజిస్తారు. 24 గంటలు ఒక షిప్టులో విధులు నిర్వహించిన సిబ్బంది మరుసటి రోజు 24 గంటలు విశ్రాంతి తీసుకుంటారు. ఒక షిప్టులో డ్యూటీ పూర్తి చేసుకున్నవారు, షిప్టులో డ్యూటీకి చేరే సమయంలో స్టేషన్లో ఎస్హెచ్ఓ రూల్కాల్ నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలకు రూల్కాల్ ఉంటుంది. అంటే ఈ రోజు 10 గంటలకు విధుల్లో చేరిన సిబ్బంది రేపు ఉదయం 10 గంటలకు దిగిపోతారు. వీరు దిగిపోయే సమయంలో కొత్తవారు విధుల్లో చేరుతారు. రూల్ కాల్లో అందరూ ఉన్నారా లేరా.. అనేది స్టేషన్ హౌస్ ఆఫీసర్ పరిశీలిస్తారు. అనంతరం స్టేషన్లో ఉన్న హాజరు పట్టికలో సిబ్బంది డ్యూటీకి హాజరైనట్టు సంతకాలు చేస్తారు. కొంత మంది విషయంలో.. రూల్ కాల్కు హాజరవుతారు, అక్కడి రిజిస్టర్లో సంతకం పెడతారు. ఈ రెండు పనులు కేవలం పది నిముషాల్లో పూర్తి చేసుకుని కొందరు మాయమవుతారు. తిరిగి మరుసటి రోజు డ్యూటీ దిగిపోయే సమయంలో వచ్చి యథావిధిగా రూల్ కాల్కు హాజరవడం పరిపాటిగా మారింది. ఇలాంటి వారికి అధికారుల అండదండలు ఉండడం, వారి సొంత పనులకు ఉపయోగించుకోవడం ఇందుకు కారణం. ఇక నుంచి పారదర్శకం బయోమెట్రిక్ యంత్రంను అమర్చడం ద్వారా డ్యూటీలో చేరే సిబ్బంది తమ వేలిముద్రలను మిషన్కు పెట్టాలి. తద్వారా హాజరుతో పాటు సమయం కూడా కంప్యూటర్లో నమోదవుతుంది. విధి నిర్వహణలో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా మిషన్పై వేలి ముద్ర పెట్టి పోవాలి. దీని ద్వారా సిబ్బంది ఎన్ని గంటలు స్టేషన్లో ఉన్నారు, ఎన్ని గంటలు బయట ఉన్నారు, అతని రాకపోకలు, కదలికలు బయోమెట్రిక్ విధానం ద్వారా సమయంతో పాటు తెలిసిపోతుంది. దీంతో డ్యూటీలో నిర్లక్ష్యం వహించడానికి వీలుండదు. దీని ద్వారా ప్రజలకు పోలీసు సేవలు మరింత దగ్గరవుతాయన్నది అధికారుల ఉద్దేశం. -
నిఘా..
వసతి గృహాల్లో బయోమెట్రిక్.. సీసీ కెమెరాలు.. ఉట్నూర్ : గిరిజన సంక్షేమ శాఖ అధీనంలోని ఆశ్రమ వసతిగృహాలు, గిరిజన పాఠశాలల్లో అక్రమాల తంతుకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా చూపుతూ అవకతవకలకు పాల్పడుతున్న వార్డెన్ల ఆటలకు ఇక బ్రేక్ పడనుంది. ప్రభుత్వ తాజా ని ర్ణయంతో ఇకపై వార్డెన్లు చుట్టపుచూపుగా హాస్టళ్లకు వెళ్ల డం కూడా కుదరదు. నిత్యం స్థానికంగానే ఉంటూ హా స్టళ్లను పర్యవేక్షించక తప్పదు. ఆశ్రమ వసతిగృహాలు, గిరిజన పాఠశాలల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వసతిగృహంలో విద్యార్థుల హాజరు శా తాన్ని నమోదు చేయడానికి బయోమెట్రిక్ యంత్రాలు, వార్డెన్ల పనితీరు, విద్యార్థులకు అందుతున్న మెనూ పర్యవేక్షించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేస్తూ గత మంగళవారం సర్క్యులర్ ఇచ్చింది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఈ విధానం సత్ఫలితాలివ్వడంతో మన దగ్గరా అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. పారదర్శకతకు పెద్దపీట.. జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ అధీనంలో 123 ఆశ్రమ పాఠశాలలు, నాలుగు గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 39,924 వరకు గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ వసతి గృహాల నిర్వహణలో పూర్తిగా పారదర్శకత తేవడానికి.. వసతి గృహాల పూర్తి సమాచారం ఆన్లైన్లో పొందుపరిచేలా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. విద్యార్థి పేరు మొదలుకుని.. వసతి గృహంలో ఉన్న మౌలిక వసతుల వరకు సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు కానుంది. దీనిద్వారా విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలు, సిబ్బంది, వార్డెన్ల పనితీరు, విద్యార్థులపై పర్యవేక్షణ తదితర వాటిలో స్పష్టత రానుంది. చాలా వసతి గృహాల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని అధికంగా చూపిస్తూ పలువురు వార్డెన్లు నిధులు దండుకుంటున్నారనేది ప్రభుత్వం గుర్తించింది. అమల్లోకి బయోమెట్రిక్ విధానం.. వసతి గృహాల్లో అక్రమాలకు చెక్ పెడుతూ విద్యార్థుల హాజరు శాతాన్ని బయోమెట్రిక్ పద్ధతి ద్వారా ఉదయం, సాయంత్రం నమోదు చేస్తారు. దీనికితోడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో విద్యార్థుల హాజరు, వారికి అందుతున్న మెనూ నేరుగా పర్యవేక్షించే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులకు పోషకాహారం అందనుంది. తద్వారా విద్యార్థుల హాజరు శాతం, మెనూ పరిశీలన ఆధారంగా నిధుల విడుదల ఉంటుంది. వసతి గృహాల్లో విధులు నిర్వహించే వార్డెన్లలో చాలా మంది నాలుగు రోజులకు, వారానికోసారి చుట్టపు చూపుగా హాస్టళ్లకు వచ్చి వెళ్తున్నారనేది ఆరోపణ. అంతేగాకుండా సిబ్బంది సమయానికి వెళ్లడం లేదనేది బహిరంగ రహస్యం. ఫలితంగా హాస్టళ్లలో విద్యార్థులు తింటున్నారా..? లేదా..? రోజుకు ఎన్ని పూటలు తిండి పెడుతున్నారు..? తిండి నాణ్యతగా ఉంటుందా..? వీటిపై అధికారులకు స్పష్టత లేదు. ఈ విధానానికి స్వస్తి పాలకాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు. -
బయోమెట్రిక్ పర్యవేక్షణ!
సాక్షి, మంచిర్యాల : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల హాజరు వివరాలు బయోమెట్రిక్ విధానంలో నమోదు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. పాఠశాలల స్థాయిలో వివరాలు సేకరించి వాటిని ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ప్రాథమికంగా స్కూల్ కాంప్లెక్స్లు కేంద్రంగా ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టే యోచనలో ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో 2700 ప్రాథమిక పాఠశాలలు, 703 ప్రాథమికోన్నత పాఠశాలలు, 468 హైస్కూళ్లలో కలిపి దాదాపు 11,700 ఉపాధ్యాయుల పనిచేస్తున్నారు. ఇంతమంది హాజరును రోజూ పర్యవేక్షించడం విద్యాశాఖ అధికారుల వల్ల కావడం లేదు. ఇదే పరిస్థితి మిగతా జిల్లాలోనూ ఉంది. దీంతో ఉపాధ్యాయుల పర్యవేక్షణకు బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించుకోవాలని, ఆ ప్రక్రియ మొదటి దశలో ఆదిలాబాద్ జిల్లానూ భాగస్వామ్యం చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విధానంలో భాగంగా ఆయా పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు అమరుస్తారు. ఆ స్కూల్కు చెందిన మొత్తం ఉపాధ్యాయులు, ఆ రోజు హాజరైన వారు, సెలవు పెట్టిన వారి వివరాలను అందులో నమోదు చేస్తారు. ఈ వివరాలు జిల్లా విద్యాధికారి కార్యాలయం ద్వారా డెరైక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు చేరేలా కార్యాచరణ ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు స్కూల్ విజిట్ రిపోర్ట్లోనూ హాజరు పర్యవేక్షణకు ప్రత్యేక కాలం ఒకదానిని పొందుపర్చుతారు. ఇప్పటివరకు స్కూల్లోని మౌలిక సదుపాయాలు తదితర అంశాలనే స్కూల్ విజిట్లో పర్యవేక్షించే అంశానికి తోడుగా ఉపాధ్యాయుల హాజరు, సెలవులను నమోదు చేయనున్నారు. దీంతోపాటు తరచూ సెలవు పెట్టే ఉపాధ్యాయులు, విధులకు సక్రమంగా వచ్చే టీచర్ల వివరాలను క్రోడికరించే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. భిన్నాభిప్రాయాలు.. బడికి వెళ్లకుండా హాజరు వేయించుకునే వారి గుట్టురట్టు చేసే దిశగా ఉన్న ఈ కార్యాచరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమపై నమ్మకం లేకనే ఈ విధానం ప్రవేశపెడుతున్నారా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యవస్థను బాగుపరిచే ఏ విధానానికి అయినా ఉపాధ్యాయులంతా మద్దతు ఇవ్వాల్సిందేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వెరసి ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే సర్కారు స్కూళ్లలో ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. -
బయోమెట్రిక్తోనే పింఛన్లు: కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో నవంబర్ 1వ తేదీ నుంచి కొత్త పింఛన్ విధానాన్ని అమలు చేస్తామని, అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ బయోమెట్రిక్ విధానం ద్వారా పింఛన్లు అందజేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. పింఛన్లలో అక్రమాలకు చెక్పెట్టేందుకే బయోమెట్రిక్ విధానాన్ని అనురించాలని నిర్ణయించామని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 100 రోజుల పాలనపై రూపొందించిన నివేదికను శనివారం ఆయన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. అనంతరం వంద రోజుల పాలనపై పుస్తకావిష్కరణ చేసి, ప్రసంగించారు. ప్రతి గ్రామంలో రోడ్లు, మంచినీరు, మురుగునీటి కాలువల నిర్మాణం తమ ప్రాధాన్యత అని మంత్రి చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్రంలో కోటి ఆరు లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నట్లు తేలిందని.. ఇప్పటివరకు 96 లక్షల కుటుంబాల వివరాలను కంప్యూటర్ ద్వారా క్రోడీకరించామని వెల్లడించారు. మన ఊరు- మన ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజలతోనే ప్రభుత్వం ప్రణాళిక రూపొందించే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 2015 ఆగస్టు కల్లా ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న వాటర్గ్రిడ్ను క్లోరిన్ ప్రభావిత నల్గొండ జిల్లా నుంచే ప్రారంభిస్తామని కేటీఆర్ తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఏటా రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసి, ఐదేళ్లలో చెరువులన్నిటినీ బాగుచేస్తామన్నారు. అలాగే ఉపాధి హామీ కింద 300 గోదాములను నిర్మిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ సమగ్ర గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టు (టీఆర్ఐజీపీ) కింద ప్రపంచ బ్యాంకు సహాయంతో రూ. 640 కోట్లు వెచ్చించి గ్రామీణ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచే కార్యక్రమం చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఐదేళ్లలో గ్రామ పంచాయతీలన్నింటినీ ఈ-పంచాయతీలుగా మార్చుతామన్నారు. ఉపాధి హామీలో అక్రమాలు, సమస్యల పరిష్కారానికి హెల్ప్లైన్ను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు. హెల్ప్లైన్ నంబర్ 18002002001గా తెలిపారు. -
అక్రమాలకు చెక్ !
సత్తెనపల్లి : వసతి గృహాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనికోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. ఇందులోభాగంగా వసతి గృహాల సంక్షేమాధికారులకు బయోమెట్రిక్ యంత్రాలు, ల్యాప్టాప్లు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థుల వేలిముద్రలు, ఆధార్ నంబర్లు సేకరిస్తున్నారు. ఇదీ సంగతి.. వసతి గృహాల్లో విద్యార్థులు తక్కువగా ఉంటున్నప్పటికీ ఎక్కువమంది ఉన్నట్లు చూపిస్తూ పలువురు సంక్షేమాధికారులు ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నారు. ఈ దందాలో కొందరు అధికారులకూ భాగస్వామ్యం ఉంటోంది. వసతి గృహాల్లో ఏసీబీ అధికారులు, జిల్లా అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమాల గుట్టు రట్టరుున సంగతి తెలిసిందే. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులోభాగంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ విధానం అమల్లోకి తీసుకొస్తోంది. ఇదీ జరిగేది... * వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల హాజరును ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయూల్లో బయోమెట్రిక్ యంత్రాల్లో నమోదు చేస్తారు. ఈ వివరాలు ఇంటర్నెట్ ద్వారా రాజధానిలోని సీజీజీకి వెళతారుు. దీంతో ఏ రోజు ఎంతమంది విద్యార్థులు వసతి గృహాల్లో ఉన్నారో తెలిసిపోతుంది. * విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపేందుకు తప్పుడు వేలిముద్రలు వేసే అవకాశం ఉన్నందున ఆధార్ నంబర్లను అనుసంధానం చేస్తారు. బయోమోట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకుకు వసతి గృహాల సంక్షేమాధికారులకు ల్యాప్టాప్లు, ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం సమకూరుస్తారు. * జిల్లాలోని 94 ఎస్సీ సంక్షేమ వసతి గృహాల సంక్షేమాధికారులకు ల్యాప్టాప్లు, బయోమెట్రిక్ యంత్రాలను అందజేశారు. ల్యాప్ టాప్ల్లో నిక్షిప్తం చేసిన ప్రత్యేక సాప్ట్వేర్ ఆధారంగా విద్యార్థి పేరు, తల్లిదండ్రుల వివరాలతోపాటు, ఏ పాఠశాలల్లో చదువుతున్నారనే వివరాలను పొందుపరుస్తున్నారు. ఇప్పటికే వసతి గృహాల్లోని విద్యార్థుల ఆధార్ నంబర్లను సేకరించారు. వేలిముద్రలు సేకరించాల్సి ఉంది. బయోమెట్రిక్ విధానం అమలుపై సంక్షేమ అధికారులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.. బయోమెట్రిక్ విధానం అమలుతో వసతి గృహాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయూల్లోనే వేలిముద్రల సేకరణ ఉంటుంది. అనంతరం వేలిముద్రలు వేయాలన్నా యంత్రం తీసుకోదు. ఈ సమాచారం ఆధారంగానే వసతి గృహాలకు సరుకులు, నగదు అందుతారుు. ఈ విధానంపై సంక్షేమ అధికారులకు త్వరలోనే శిక్షణ ఇస్తాం. - ఆర్.అన్నపూర్ణ, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి -
పెద్దోళ్ల ‘చౌక’ దందా
చౌకగా దొరికే రేషన్ బియ్యాన్ని వండుకుని ఆకలి తీర్చుకుంటూంటారు నిరుపేద వర్గాల వారు. అది వారి నిత్యావసరం కూడా. అలాంటి వారి కడుపు కొట్టాలనే ఆలోచన ఎంతటి కఠిన హృదయం ఉన్న వారికి కూడా కలగదు. కానీ.. కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం అంతకంటే మించిపోయారు. రేషన్బియ్యం, కిరోసిన్ను బొక్కి, జేబులు నింపుకోవాలనేది వారి దురాలోచన. అంతటితో ఆగ కుండా రేషన్ డీలర్లతో ‘చీకటి ఒప్పందాలు’ కూడా చేసేసుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థనే తమ దుకాణంలా మార్చుకుని, పేదల బతుకులను అపహాస్యం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో విజయవంతమైన బయోమెట్రిక్ విధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేసి ప్రజా పంపిణీలో అవకతవకలకు చెక్ పెట్టాలని సీఎం చంద్రబాబు గొప్పగా చెబుతారు. అయితే ఆయన పార్టీకే చెందిన, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు మాత్రం చౌకధరల దుకాణాలపై పడి పైసలేరుకునే చీకటి ఒప్పందాలతో ప్రజాపంపిణీని అవినీతిమయం చేస్తున్నారు. చౌకధరల దుకాణాల ద్వారా జరిగే ప్రజాపంపిణీలో అవినీతికి ఆస్కారం ఒకింత ఎక్కువగానే ఉంటుంది. ఇందుకు పూర్తిగా రేషన్షాపు డీలర్లనే తప్పు పట్టలేం. కార్డుదారులు కూడా బాధ్యులే. అటువంటి వ్యవస్థ ఆసరాగా చేసుకుని కొందరు ప్రజాప్రతినిధులు తమకున్న ‘అధికార బలం’తో నెలవారీ మామూళ్లకు బరి తెగిస్తున్నారు. చౌకధరల దుకాణాల నిర్వాహకులు కూడా ఎంతో కొంత సర్దుబాటు చేసుకుంటే చాలనే ముందుచూపుతో వారి ఆదేశాలకు జీ హుజూర్ అంటున్నారు. జిల్లా కేంద్రం కాకినాడ సిటీ, దాంతో కలిసి ఉండే కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఈ రహస్య ఒప్పందాలు ఖరారై, వసూళ్ల పర్వానికి తెర లేచింది. కాకినాడ నగరంలో 117, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 111 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి నిర్వాహకులు, నియోజకవర్గాల్లో ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య మూడు దఫాలు జరిగిన చర్చలు కొలిక్కి రావడంతో వసూళ్ల పర్వం ప్రారంభమైంది. ఇందులో రెండు రకాల ఒప్పందాలు జరిగాయి. నెలకు ఒక నియోజకవర్గం నుంచి నగదు రూపంలో కొంత, మిగులు బియ్యం అమ్మకాలుగా కొంత. ఉదాహరణకు కాకినాడ నగరంలోని దుకాణాల నుంచి నెలకు రూ.1.20 లక్షలు, 23 క్వింటాళ్ల బియ్యం, కాకినాడ రూరల్లో రూ.90 వేలు, 22 క్వింటాళ్ల బియ్యం ముట్టజెప్పాలనేది వీరి మధ్య కుదిరిన ఒప్పందం. ఇది ఈ నెల నుంచి ప్రారంభం కావాలనే అంగీకారం కుదిరిందని విశ్వసనీయ సమాచారం. ఈ ఒప్పందం ప్రతి నెలా పక్కాగా అమలు జరిపేందుకు ఒక్కో దుకాణం నిర్వాహకుడు రూ.1000 నుంచి రూ.1300 వంతున భరించేలా నిర్ణయించారని తెలియవచ్చింది. ఈ రెండు ఒప్పందాలు కాకుండా మరో కీలకమైన ఒప్పందం మరింత విస్మయాన్ని కలిగిస్తోంది. కొందరు డీలర్లు కార్డుదారుల నుంచి కిలో బియ్యం రూ.13, కిరోసిన్ రూ.24కు కొనుగోలు చేయడం పరిపాటి. బహిరంగ మార్కెట్లో బియ్యం రూ.16, కిరోసిన్ రూ.30 వంతున అమ్ముకుంటూ ‘నాలుగు పైసలు’ వెనకేసుకుంటున్నారు. ఆ సొమ్ము నుంచే అన్ని స్థాయిల వారికి ముట్టజెప్పుకొనే పరిస్థితి. నెలాఖరున ఒకటి, రెండు క్వింటాళ్ల బియ్యం, 10 లీటర్ల కిరోసిన్ మిగులుతున్నట్టు చూపుతూ, సంచుల అమ్మకాలు సహా మిగిలిన సర్దుబాట్లతో డీలర్లు గట్టెక్కుతున్నారు. ఇక ముందు వాటిని కూడా అధికారులకు చూపించాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు ఎదురైతే తాము చూసుకుంటామని ప్రజాప్రతినిధులు భరోసా ఇచ్చారని తెలిసింది. ఇక్కడ మరో తిరకాసు కూడా ఉంది. మిగులు బియ్యం, కిరోసిన్ కూడా తాము సూచించే తమ వారికి మాత్రమే, అది కూడా వారు చెప్పే ధరకే విక్రయించాలనే షరతు అమలుచేస్తున్నారు. ఇందుకు సమ్మతించకుంటే మిగులు బియ్యం మార్కెట్లో విక్రయించే చర్యలపై ఉక్కుపాదం మోపుతామనే హెచ్చరికలతో నిర్వాహకులు దిగివచ్చి ఒప్పందాన్ని ఖాయం చేసుకున్నారని చెబుతున్నారు. ఇప్పటి వరకు మార్కెట్లో పీడీఎస్ బియ్యం కిలో రూ.16, కిరోసిన్ లీటరు రూ.30 వరకు అమ్ముకుంటున్నట్టుగానే అనుమతించాలన్న నిర్వాహకుల ప్రతిపాదనను ప్రజాప్రతినిధులు తిరస్కరించారని సమాచారం. నిర్వహణ నుంచి తప్పుకోమంటే తప్పుకుంటాం, ఆ ప్రతిపాదన కష్టసాధ్యమని చేతులెత్తేయగా కాకినాడకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త రంగంలోకి దిగి ఉభయుల మధ్య సమన్వయం సాధించారని సమాచారం. చివరకు కిలో బియ్యం రూ.14, కిరోసిన్ లీటరు రూ.25 వంతున ప్రజాప్రతినిధులు నిర్ణయించిన వారికే విక్రయించాలనే ఒప్పందానికి వచ్చారు. ఈ రకంగా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు బరితెగింపు ఆనోటా, ఈనోటా బయటకు పొక్కడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. -
బాలారిష్టాలు దాటని బయోమెట్రిక్
కాకినాడ/కాకినాడ సిటీ :జిల్లాలోని కొన్ని చౌకడిపోల్లో ఆర్భాటంగా ప్రారంభించిన బయో మెట్రిక్ విధానం ఆచరణలో విఫలమవుతోంది. తరచూ మొరాయిస్తున్న పరికరాలతో కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే తొలిసారిగా 2012 అక్టోబర్ 20న రాజస్థాన్లోని డూడూ గ్రామం నుంచి అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఆన్ లైన్లో ప్రారంభించిన కాకినాడ గొడారిగుంటలోని 87వ నంబరు రేషన్ డిపోలోని బయోమెట్రిక్ పరికరమూ ఇప్పుడు పనిచేయడం లేదు. ఆధార్తో అనుసంధానం ద్వారా బోగస్ కార్డులను నియంత్రించే లక్ష్యంతో బయోమెట్రిక్ విధానానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే తరచూ బయోమెట్రిక్ పరికరాలు మొరాయించడం, సర్వర్ పనిచేయకపోవడం, నెట్వర్క్ సహకరించకపోవడ ంతో ప్రతి నెలా కార్డుదారులు పడరాని పాట్లు పడుతున్నారు. కార్డుదారు వేలిముద్రకు బయోమెట్రిక్ పరికరం గ్రీన్సిగ్నల్ ఇస్తే తప్ప సరుకులు పొందే అవకాశం లేకపోవడంతో అది పని చేసేదాకా పడిగాపులు పడాల్సి వస్తోంది. డీలర్లు ఒక్కోసారి గంటకు ముగ్గురు లేక నలుగురికి మించి సరుకులు ఇవ్వలేకపోతున్నారు. వృద్ధుల వేళ్ళు ముడతలుపడి అరిగిపోవడంతో ఒక్కోసారి బయోమెట్రిక్ పరికరం వారి వేలి ముద్రలను తిరస్కరించడం వల్ల కూడా ఇబ్బందులు తప్పడం లేదు. కాకినాడలో జిల్లాలో కాకినాడలోలోని ఆరు దుకాణాల్లో ఈ విధానాన్ని తొలుత ప్రారంభించి ఆ తరువాత దశల వారీగా వంద చౌకడిపోలకు విస్తరించారు. అధికారుల లెక్కల ప్రకారమే ప్రస్తుతం పాతికకు పైగా రేషన్ డిపోల్లో బయోమెట్రిక్ పరికరాలు మూలనపడ్డాయి. కార్డుదారులైతే సగానికి పైగా డిపోల్లో ఆ పరికరాలు సరిగా పనిచేయడం లేదంటున్నారు. వీటి నిర్వహణ చూసే సంస్థ నుంచి గానీ, అధికారుల నుంచి గానీ స్పందన ఉండడంలేదని డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. బయోమెట్రిక్ అమలులో ఉన్న డిపోల్లో నేరుగా సరుకులు పంపిణీ చేసే అవకాశం లేదు. దీంతో ఓ డిపోలోని పరికరం పాడైతే సమీపంలోని మరో డిపో నుంచి ఆ పరికరాన్ని తెచ్చి పంపిణీ చేయాల్సి వస్తోంది. దీంతో రెండు దుకాణాల పరిధిలోని కార్డుదారులు పడిగాపులు తప్పడంలేదు. ప్రధాని ప్రారంభించిన 87వ నెంబర్ రేషన్షాపులోని పరికరం కాలిపోవడంతో సమీపంలోని మరో షాపు నుంచి పరికరాన్ని తెచ్చి రెండు షాపులకు కలిపి సరుకులు పంపిణీ చేశారు. కార్డుదారుల ఒత్తిడితో కొద్దిరోజుల క్రితమే తాత్కాలికంగా మరో పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఈ పద్ధతికి శ్రీకారం చుట్టిన రోజున కాకినాడలో ప్రారంభించిన ఆరు షాపుల్లో మూడింట్లో ఆ పరికరాలు పనిచేయడం లేదు. పాత పద్ధతిలోనే ఇవ్వండి.. బయోమెట్రిక్ పరికరాలను సమకూర్చిన కంపెనీ గతంలో నెలకు రెండుసార్లు వచ్చి సర్వీసింగ్ చేసేదని, ప్రస్తుతం కాంట్రాక్టు కాలపరిమితి ముగియడంతో ఎవరూ పట్టించుకోవడం లేదని డీలర్లు అంటున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ప్రయోజనంలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విధానంలో ఎదురైన బాలారిష్టాలను అధిగమించకుండా దశలవారీగా జిల్లాలోని 2,560 చౌకడిపోల్లో అమలు చేయబోతే.. పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. నాణ్యమైన పరికరాలను ఏర్పాటు చేసేవరకూ పాతపద్ధతిలోనే సరుకులు ఇవ్వాలని కార్డుదారులు డిమాండ్ చేస్తున్నారు. 15 రోజుల్లో కొత్తవి సమకూరుస్తాం : డీఎస్ఓ కొన్ని చౌకడిపోల్లో బయోమెట్రిక్ పరికరాలు పాడైన విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటి స్థానంలో కొత్తవాటి కోసం ప్రతిపాదనలు పంపామని డీఎస్ఓ రవికిరణ్ చెప్పారు. 15 రోజుల్లో కొత్తవి అమరుస్తామన్నారు. గంటలకొద్దీ నిలబడాల్సి వస్తోంది గతంలో వెళ్ళిన వెంటనే సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు గంటల కొద్దీ ఉండాల్సి వస్తోంది. లేకపోతే ఒకటికి రెండుసార్లు డిపో చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ పద్ధతిని మార్చి ఇదివరకటి లాగే సరుకులు ఇవ్వాలి. - యేసారపు మహాలక్ష్మమ్మ, కార్డుదారు, గొడారిగుంట, కాకినాడ మొరాయిస్తున్న మెషీన్లు చౌకడిపోలకు అందజేసిన బయోమెట్రిక్ మెషీన్లు తరచు మొరాయిస్తున్నాయి. కార్డుదారులకు సకాలంలో సరుకులు అందజేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలి - కె.వీరభద్రరావు, డీలర్, 72వ నంబరు చౌకడిపో, కాకినాడ -
ఆగస్టు 10 నుంచి ఆన్లైన్లో రూ. 300 టికెట్లు
తిరుమల: శ్రీవారి దర్శనానికి రూ.300 టికెట్లను ఆగస్టు 10వ తేదీ నుంచి ఆన్లైన్, ఈ దర్శన్ కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానం (భక్తుని ఫొటో, వేలిముద్ర సేకరణ)లో మంజూరు చేయించాలని టీటీడీ నిర్ణయించింది. జే ఈవో కేఎస్.శ్రీనివాసరాజు నేతృత్వంలో మంగళవారం జరిగిన సమావేశంలో రూ.300 టికెట్లలో మార్పులపైనే ప్రధానంగా చర్చ సాగింది. రోజుకు 18 వేల టికెట్లలో 14 రోజుల ముందు 10 వేలు, ఏడు రోజుల ముందు ఐదు వేలు, ఒక రోజు ముందు మూడు వేల టికెట్ల చొప్పున ఆన్లైన్లో కేటాయించాలని నిర్ణయించారు. అది అమలు చేసిన నాటి నుంచి తిరుమలలో కరెంట్ బుకింగ్లో ఇవ్వకూడదని నిర్ణయించారు. కాగా, తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. సాయంత్రం 6 గంటల సమయానికి సర్వదర్శనం కోసం 19 కంపార్ట్మెంట్లలో నిండి ఉన్న భక్తులకు 15 గంటలు, కాలిబాట భక్తులకు 5 గంటల తర్వాత, రూ.300 టికెట్లు పొందిన భక్తులకు గంటన్నర సమయంలోపు శ్రీవారి దర్శనం లభించనుంది. గదులు, లాకర్లు సులభంగానే లభించాయి. -
పింఛను పాట్లు
కొవ్వూరు/పెరవలి/నరసాపురం (రాయపేట), న్యూస్లైన్: పింఛన్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానం వృద్ధులతోపాటు వికలాంగులు, వితంతువుల పాలిట శాపంగా మారింది. వృద్ధుల్లో కొందరి వేళ్లపై ముద్రలు అరిగిపోవడంతో రెండు నెలలుగా వారికి పింఛన్లు అందటం లేదు. బయోమెట్రిక్ మెషిన్పై వేలిముద్ర వేస్తే తప్ప పింఛను ఇచ్చే అవకాశం లేదని వెనక్కి పంపించేస్తున్నారు. ఈ కారణంగా జిల్లాలో సుమారు 15వేల మంది వృద్ధులు అవస్థలు పడుతున్నారు. ప్రతి గ్రామంలోను కనీసం 10 మంది వృద్ధులకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. ఒక్క కొవ్వూరు నియోజకవర్గంలోనే 830 మంది వేలిముద్రలు బయోమెట్రిక్ మెషిన్పై పడకపోవడం వల్ల పింఛన్లు అందుకోలేకపోతున్నారు. వరుసగా మూడు నెలలపాటు పింఛను తీసుకోకపోతే రద్దు చేసే పరిస్థితి ఉండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. వికలాంగుల్లోనూ కొందరికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. నేటికీ పూర్తికాని వేలిముద్రల సేకరణ పింఛన్ల పంపిణీలో బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చి మూడు నెలలు కావస్తోంది. నేటికీ లబ్ధిదారుల వేలిముద్రల సేకరణ పూర్తికాలేదు. దీనివల్ల ఈ నెలలో కొవ్వూరు మండలంలో 322 మందికి, చాగల్లు మండలంలో 205 మందికి, తాళ్లపూడి మండలంలో 203 మందికి, కొవ్వూరు మునిసిపాలిటీలో సుమారు 100 మందికి పింఛన్లు అందలేదు. గత నెలలో నియోజకవర్గంలో సుమారు 3,700 మందికి పింఛన్లు అందలేదు. బయోమెట్రిక్ మెషిన్లో వేలిముద్రలు సక్రమంగా నమోదు కాలేదని కొందరికి.. సొమ్ములు విడుదల కాకపోవడంతో మరికొందరికి పింఛను సొమ్ము ఇవ్వలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగేది. అనంతరం ఫినో సంస్థ ద్వారా పింఛన్లు బట్వాడా చేసేవారు. అనంతరం ఆరునెలలపాటు పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఇచ్చారు. రెండు నెలల క్రితం బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఇక్కడ నుంచే ఫించను లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో ఈ నెల పింఛన్ల పంపిణీ ప్రక్రియను ముగించనున్నారు. ఈ ఏడాది వరుసగా రెండుసార్లు పంపిణీ విధానాలు మార్చడంతో లబ్ధిదారులకు కొత్త కష్టాలు మొదలయ్యూరుు. నాలుగు నెలలుగా ఇవ్వట్లేదు ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పింఛను నాకెంతో ఆసరాగా ఉండేది. నాలుగు నెలలుగా పింఛను డబ్బు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాను. వేలిముద్రలు పడకపోవడంతో రోజూ మునిసిపల్ కార్యాలయూనికి వెళ్లి గంటల తరబడి వేచివుంటున్నాను. అరుునా ప్రయోజనం లేదు. ఈ విధానాన్ని మార్చి పాత పద్ధతిలోనే పింఛను ఇప్పించాలి.- బందెల పవన్శేఖర్, కొవ్వూరు ఇంకు ముద్ర తీసుకోవాలి బయోమెట్రిక్లో వేలిముద్రలు పడటం లేదని మూడు నెలలుగా పింఛను ఇవ్వటం లేదయ్యా. గతంలో ఇంకు ముద్ర నొక్కించుకుని పింఛను ఇచ్చేవారు. ఈమధ్య కాలంలోనే ఫించన్ కోసం తిప్పలు పెడుతున్నారు. డబ్బు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాను. వచ్చే రెండొందలు మందు బిళ్లల ఖర్చుకు ఉపయోగపడేది. - మజ్జి అన్నపూర్ణ, నరసాపురం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా బయోమెట్రిక్ విధానం వల్ల 3 నెలలుగా పింఛను రావడం లేదు. వేలిముద్రలు పడలేదని పింఛను సొమ్ము ఇవ్వడం లేదు. నలుగురు పిల్లలతో సంసారాన్ని నెట్టుకొస్తున్న నాకు వితంతు పింఛను ఎంతో ఆసరాగా ఉండేది. చిన్న పిల్లలు కావడంతో కార్యాలయాల చుట్టూ తిరగడానికి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నాను. అధికారులు పాత పద్ధతిలోనే పింఛను ఇచ్చే ఏర్పాటు చేయాలి. - కవల భారతి, కొవ్వూరు -
అయ్యా.. పింఛన్..!
ఆదిలాబాద్, న్యూస్లైన్ : మూడు నెలల నుంచి పింఛన్ రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అరిగోస పడుతున్నారు. పింఛన్ కోసం ఎండలో కాళ్లకు బొబ్బలు పెట్టంగా.. వందలాది రూపాయలు రవాణా చార్జీలు భరిస్తూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా అధికారులు కనికరించడం లేదు. మా కష్టం పగవాడికి కూడా రావొద్దని పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ విధానం.. గతంలో గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, పట్టణాల్లో మున్సిపల్ అధికారులు పింఛన్ డబ్బులు పంపిణీ చేసేవారు. నెల మొదటి వారంలోనే ఆయా కార్యాలయాల వద్ద వారి పేర్లకు అనుగుణంగా సంతకాలు, వేలి ముద్రలు తీసుకొని పింఛన్ ఇచ్చేవారు. ఆ తర్వాత డీఆర్డీఏ నుంచి సీఎంఎస్వోలు కొన్ని రోజులపాటు పంపిణీ చేశారు. మృతిచెందినవారు, ఊరు వదిలి వెళ్లిపోయినవారు, పలువురు అనర్హులు పింఛన్లు పొందుతున్నారని సర్కారు దృష్టికి రావడంతో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం యాక్సెస్ బ్యాంక్, ఫినో కంపెనీ ఆధ్వర్యంలో జిల్లాలోని 18 మండలాలు, పోస్టల్ ద్వారా 34 మండలాలు, ఏడు మున్సిపాలిటీల్లో ఐసీఐసీఐ బ్యాంక్, మణిపాల్ ఆధ్వర్యంలో బయోమెట్రి క్ విధానంలో పింఛన్ పంపిణీ విధానానికి తెర లేపారు. కష్టాలు మొదలు.. బయోమెట్రిక్ విధానంతో పింఛన్దారుల కష్టాలు మొదలయ్యాయి. ప్రధానంగా పలువురికి ఆధార్కార్డు లేకపోవడం, ఆధార్ కార్డు ఉన్నా అనుసంధానం కాకపోవడం, బయోమెట్రిక్ విధానంలో వృద్ధుల వేలి ముద్రులు నమోదు కాకపోవడం కారణంగా బ్యాంక్ ఖాతాలు తెరవలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే బ్యాంక్ కరస్పాండెంట్లు ప్రతినెల పింఛన్ వివరాలు ఎంపీడీవోకు అందజేయాలి. ఎంపీడీవోలు డీఆర్డీఏ కార్యాలయానికి సదరు వివరాలు పంపిస్తారు. ఈ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడంతో పింఛన్లు అందుతున్నాయా లేదా అన్న వివరాలు కూడా తెలియలేదు. దీంతో నెలనెల పింఛన్ అందకపోవడంతో లబ్ధిదారులకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. వృద్ధుల వేళ్లు అరిగిపోవడం, బయోమెట్రిక్ విధానంలో వేలి ముద్రలు చూపించకపోవడంతో వారి పింఛన్ను ఇవ్వడం లేదు. గాడిలోపడని ఐరీస్ ఆధార్ ద్వారా సేకరించిన ఐరీష్ (కంటిపాపలు) విధానంలో నమోదు చేసుకొని పింఛన్ పంపిణీ చేస్తామని అధికారులు చెప్పినా ఆ ప్రక్రియ ఇంకా గాడిలో పడటం లేదు. పెలైట్ ప్రాజెక్టు కింద బోథ్, ఆదిలాబాద్, లక్ష్మణచాంద, నేరడిగొండ, కుంటాల, ఇచ్చోడ మండలాల్లోని పది గ్రామాల్లో ఐరీష్ విధానాన్ని చేపట్టారు. అక్కడ విజయవంతమైతే మిగతా మండలాల్లోనూ అమలు చేస్తామని అధికారులు అంటున్నారు. మరోపక్క బ్యాంక్ కరస్పాండెంట్లకు ఇచ్చిన మిషన్లు గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ లేక పనిచేయకపోవడం, బ్యాటరీ బ్యాకప్ రాకపోవడం, కరస్పాండెంట్లకు ఈ ఆపరేటింగ్ విధానంపై అవగాహన లేకపోవడంతో సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని సుమారు సగం మంది పింఛన్దారులకు పింఛన్లు అందని పరిస్థితి నెలకొంది. ఇచ్చేది అరకొరే.. జిల్లాలో 2,62,004 మంది లబ్ధిదారులు వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. అందులో వృద్ధాప్య 1,35,750, చేనేత 537, వికలాంగులు 26,964, వితంతువులు 79,921, కల్లుగీత కార్మికులు 283, అభయహస్తం కింద 18,549 మంది ప్రతినెల పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా రూ.200, వికలాంగులు, అభయహస్తం పింఛన్దారులకు ప్రతి నెల రూ. 500 పింఛన్ కింద అందజేస్తారు. ఈ లెక్కన ప్రతినెల రూ.7.75 కోట్లు పింఛన్ల రూపంలో డీఆర్డీఏ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొదట చేపట్టిన 34 మండలాల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా 1,50,179 మందికి రూ.4.35 కోట్లు పింఛన్ నగదు అందజేస్తున్నారు. అయితే మొదట చేపట్టిన ఈ ప్రక్రియలోనూ ఇప్పటికీ పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ విధానం అమలుకు నోచుకోలేదు. 18 మండలాల్లో చేపట్టిన బయోమెట్రిక్ విధానంలో ఇంకా బాలారిష్టాలు దాటలేదు. ఈ పరిస్థితుల్లో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడ ం లేదు. నెలనెలా పింఛన్లు తీసుకోకపోతే మూడో నెల తర్వాత డబ్బులు వెనక్కి వెళ్లిపోతాయి. ఆ నెలకు సంబంధించిన పింఛన్ మాత్రమే వస్తుంది. పింఛన్దారులు తపాలా కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ యంత్రంలో వేలి ముద్ర వేసే పింఛన్ వస్తుంది. విధానం గాడిలో పడకపోవడంతో కష్టాలెప్పుడు దూరమవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. -
బయోమెట్రిక్ బాధలు
కేసముద్రం, న్యూస్లైన్ : ఉపాధి కూలీలు, పింఛన్దారుల పాలిట బయోమెట్రిక్ విధానం శాపంగా మారింది. వేలిముద్రలు సరిగా పడకపోవడంతో అధికారుల చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. ‘నీ వేలిముద్రలు సరిగాలేవు... మళ్లీ బయోమెట్రిక్ కేంద్రంలో ఫొటోదిగి, వేలిముద్రలను నమోదుచేసుకుని రండి... ఆ తర్వాత యంత్రం ఓకే చేస్తే డబ్బులు ఇస్తాం. లేకపోతే మేం ఏంచేయలేం.’ అని సమాధానం చెప్పడం పోస్టుమాస్టర్లకు పరిపాటిగా మా రింది. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఫొటోలు ఎక్కడ దిగాలో... వేలిముద్రలు ఎట్లా సరిచేసుకోవాలో తెలియక డ బ్బుల కోసం ఉపాధి కూలీలు, పింఛన్ కోసం వృద్ధులు నానాపాట్లు పడుతున్నారు. ఒకవేళ తెలిసినా... వేలిముద్రలు, ఫొటోలు తీసుకునే ఫీల్డ్ఆఫీసర్ ఆచూకీ దొరక్క వారు మండల కా ర్యాలయం వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయూల్సి వస్తోంది. మండల పరిధిలోని గ్రా మాల్లో పర్యటించడమే ఫీల్డ్ ఆఫీసర్ విధి. ఈ క్రమంలో సదరు అధికారి ఏ గ్రామంలో ఉంటే లబ్ధిదారులు అక్కడికి తిరగాల్సిన పరిస్థితి ఎ దురవుతోంది. ఈ సమస్య ప్రతీ నెల తలెత్తుతుండడంతో పింఛన్లపైనే ఆధారపడుతున్న వారు రోడ్డునపడాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో 50 వేల మంది... కేసముద్రం మండలంలో 8,168 మంది పింఛన్దారులు, 18 వేల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ఇందులో బయోమెట్రిక్ యంత్రం వేలిముద్రలు తీసుకోకపోవడంతో తిరస్కరణ కు గురైన వారు 800 మంది నుంచి 1,000 మంది వరకు ఉన్నట్లు అధికారులే చెబుతున్నా రు. ఇందులో ఎక్కువ మంది రెండు, మూడు దఫాలుగా ఫీల్డ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి ఫొటోలు, వేలిముద్రలు నమోదుచేసుకున్న వారే. అరుు నా... వారి సమస్య పరిష్కారం కాలేదు. ఇలా జిల్లావ్యాప్తంగా 51 మండలాల్లో సుమారు 50 వేల మంది లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా. అందరికీ తిప్పలే... జిల్లావ్యాప్తంగా పింఛన్దారులు 3,97,459 మంది ఉండగా... వారి అకౌంట్లలో ప్రతి నెలకు రూ.12,03,27,400 జమ అవుతున్నారుు. అదేవిధంగా జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలు 5,61, 843 మంది ఉన్నారు. ఉపాధి కూలీలకు ఇదివరకు అకౌంట్బుక్ ద్వారా... వృద్ధ, వితంతు తది తర పింఛన్దారులకు స్మార్ట్కార్డు ద్వారా పం చాయతీ కార్యదర్శుల సమక్షంలో డబ్బులు అందేవి. ఈ విధానంలో అవకతవకలు వెలుగుచూడడంతో... మళ్లీ అలాంటి పొరపాటు జరగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం 2013 సెప్టెం బర్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ... బయోమెట్రిక్ యంత్రాలు సరిగ్గా వేలిముద్రలు తీసుకోకపోవడం అటు లబ్ధిదారులు.. ఇటు పోస్టుమాస్టర్లు, ఫీల్డ్ ఆఫీసర్లను అయోమయూనికి గురిచేస్తోంది. ప్రతి గ్రామం తిరుగుతున్నాం... బయోమెట్రిక్ విధానంలో మొదటగా ఆధార్ కార్డులున్న పింఛన్దారులు, కూలీలకు సంబంధించి ఫొటోలు, వేలిముద్రలను పీఓటీ యంత్రంలో ఎన్రోల్మెంట్ చేశాం. ఆధార్ కార్డులు లేనివారికి వేలిముద్రల ఆధారంగా పోస్టుమాస్టర్లు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఆ విధానం తొలగించడంతో మేమే వేలిముద్రలు, ఫొటోలను తీసుకుంటూ వారికి సంబంధించిన డాటాను పీఓటీ మిషన్లోకి డౌన్లోడ్ చేస్తున్నాం. ఒక్కోసారి వేళ ్లకు తేమ ఉండడం.. వేలి చర్మం పొట్టు లేవడం వంటి కారణాలతో ఆ యంత్రం ఫెయిల్డ్ ఆప్షన్ చూపుతోంది. దీనివల్ల వారికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో మేమే ప్రతి గ్రామం తిరుగుతూ.... ఎవరికి డబ్బులు రావడం లేదో వారి వేలిముద్రలు, ఫొటోలను సేకరిస్తున్నాం. - దిలీప్, టీసీఎస్ మండల ఫీల్డ్ ఆఫీసర్ రెండుసార్ల గిట్లనే తిరిగిన.. పోస్టాఫీసులో పింఛన్కని పోతే నా చేతియేళ్లు మంచిగపడట్లేదని పోస్టయిన చెప్పిండు. గిదేందనడిగితే వేలిముద్రలు మంచిగపడట్లే.. మళ్లపోయి ఫొటోదిగి, వేలి ముద్రలు ఏపించుకునిరా... అప్పడే డబ్బులిత్తనన్నడు. ఇప్పటికి ఇట్టా జరగబట్టి రెండోసారి. ఇప్పుడు కూడా పింఛన్రాలే. వచ్చే నెలదాక ఆగాలంటాండ్రు. - ఎస్కే.జానీమియా, కేసముద్రం విలేజ్ తలనొప్పిగా మారింది... పింఛన్ కోసం వచ్చినోళ్లను మీరు ఫొటోలు దిగిరండని చె ప్తే... ఇన్ని రోజులు ఎట్టా ఇచ్చినవ్.. ఇప్పుడు ఎందుకు ఇవ్వవ్ అని గొడవ చేస్తాండ్రు, ఆధార్కార్డులు ఉన్నవారికే ఇప్పుడు ఇస్తానం. లేనివాళ్లను ఫీల్డ్ ఆఫీసర్ వద్దకు పంపిస్తానం. అరుునా.. కొంతమంది వేలిముద్రలు ఫెయిల్డ్ అని వస్తానయ్. ఇది మాకు తలనొప్పిగా మారింది. - మొయినొద్దీన్, బ్రాంచ్ పోస్టుమాస్టర్, కేసముద్రం విలేజి -
‘బంగారు తల్లీ’ ?
బాలిక వివరాలు నమోదు చేసి పాఠశాలకు వెళ్లే వరకు పర్యవేక్షించాలి. పాఠశాలల్లో హెచ్ఎంలు, కళాశాలల్లో చేరిన తర్వాత ప్రిన్సిపాళ్లు వారి వివరాలు నమోదు చేయాలి. బంగారు తల్లి పథకాన్ని ఆధార్కు అనుసంధానం చేశారు. ఆధార్ ద్వారానే కుటుంబాలను గుర్తిస్తారు. బాలికల పేరిట ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో నేరుగా వారి ఖాతాలకే నగదు చెల్లిస్తారు. వీటికి బయోమెట్రిక్ విధానం కూడా పరిగణనలోకి తీసుకుని పంపిణీ మొదలుపెడతారు. ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు ఆధార్ నంబర్లు చాలా మందికి లేవు. అదేవిధంగా కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకే ఈ పథకం వర్తిస్తుందనే నిబంధన విధించారు. ఇలా ప్రభుత్వ నిబంధనలు, సిబ్బంది నిర్లక్ష్యం ఈ పథకం అమలుకు శాపంగా మారాయి. జిల్లాలో బంగారు తల్లి పథకం క్షేత్రస్థాయి అమలు తీరును ‘న్యూస్లైన్’ బృందం బుధవారం పరిశీలించింది. ఇప్పటి వరకు పథకంలో 7,867 మంది తల్లులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 5,493 మందికి మొదటి విడత నగదు అందించారు. 5 వేల మందికి మాత్రమే ఇప్పటి వరకు బంగారు తల్లి బాండ్లు ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 1597 మంది తల్లులకు ఆధార్ లేదు. దీంతో వారికి మొదటి విడత నగదు మంజూరు కాలేదు. బంగారు తల్లి పథకంలో గత సంవత్సరం మే 1 అనంతరం జన్మించిన ఆడపిల్లలకు రూ. 2,500లను ఖాతాలో జమ చేస్తారు. బాలిక మొదటి పుట్టిన రోజు రూ.1000 చెల్లిస్తారు. బాలికలకు రెండో సంవత్సరం వచ్చే సరికి మరో రూ. 1000లను చెల్లిస్తారు. మూడో సంవత్సరం అంగన్వాడీ కేంద్రంలో చేర్పిస్తే రూ.1500 జమ చేస్తారు. ఇలా 4,5 సంవత్సరాలకు ఒక్కో ఏటా రూ. 1500లు చొప్పున చెల్లిస్తారు. బాలిక మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ఏడాదికి రూ.2 వేల చొప్పున చెల్లిస్తారు. బాలిక 6,7,8, తరగతులు చదివే వరకూ ఏడాదికి రూ. 2,500 జమచేస్తారు. 9,10 తరగతుల చదివే సమయంలో ఏడాదికి రూ. 3 వేలు చొప్పున చెల్లిస్తారు. బాలిక పదహారో ఏట ఇంటర్ రెండు సంవత్సరాలకు ఏడాదికి రూ. 3500ల చొప్పున జమ చేస్తారు. డిగ్రీలో చేరిన అనంతరం వరుసగా మూడు సంవత్సరాలు రూ. 4 వేలు జమ చేస్తారు. డిగ్రీ పూర్తై తర్వాత మహిళ పేరిట రూ. 1 లక్ష జమ చేస్తారు. -
డీసీసీబీలో బయోమెట్రిక్ విధానం
బోట్క్లబ్ (కాకినాడ), న్యూస్లైన్ : జిల్లాలో ఉన్న 46 బ్రాంచిల్లోనూ బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా తెలిపారు. స్థానిక డీసీసీబీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో ఉన్న డీసీసీబీ బ్రాంచిల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమల్లోకి రానున్నట్టు చెప్పారు. దీని వల్ల సిబ్బంది ఎప్పుడెప్పుడు విధులకు హాజరవుతున్నారు తెలుసుకునే వీలుంటుందన్నారు. ఆలస్యం గా వస్తే వారి జీతాల్లో కోత పడుతుందన్నారు. ప్రతి బ్రాంచిలో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాకినాడలో ఉంటూ బ్రాంచిల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. జిల్లాలో కొత్తగా ఐదు డీసీసీబీ బ్రాంచిలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. కాకినాడ నగరంలో భానుగుడి, గాంధీనగర్, కరప, గొల్లప్రోలు, ఏజెన్సీలో మరో బ్రాంచి ఏర్పా టు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే సఖినేటిపల్లి, అంబాజీపేట, రాజమండ్రి, కొత్తపల్లి, రంపచోడవరంలో కొత్త బ్రాంచి లుప్రారంభించామన్నారు. సిబ్బందికి ఏకరూప దుస్తులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సీఈవో స్థాయి నుంచి బాంకులో పనిచేసే మెసెంజర్ వరకూ ఈ దుస్తులు అందజేస్తామన్నారు. వారి స్థాయిని బట్టి ఈ ఏక రూప దుస్తులు ఇవ్వనున్నట్టు చెప్పారు. సహకార రుణాలు వసూళ్లపై దృష్టి సారించామన్నారు. సిబ్బంది కేవలం బ్యాంకులకే పరిమితం కాకుండా ఇకపై రుణాలు వసూలు చేసే విధంగా షెడ్యూల్ తయారు చేయనున్నట్టు వివరించారు. -
‘ఈ-పాస్’తో బినామీలకు చెక్..!
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్లైన్: ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు ఇకపై పారదర్శకం గా జరగనున్నాయి.బినామీలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ-పాస్ బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టిం ది. ఈ మేరకు పట్టణంలోని ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాల లో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె.అచ్యుతానంద గుప్త గురువారం లాంఛనంగా ఈ విధానాన్ని ప్రారంభించా రు. దీని ద్వారా అనర్హులు, కళాశాలలకు రాని వారిని గు ర్తించడం సులువవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ను సకాలం లో అందించాలన్న ఉద్దేశంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఇంటర్మీడియెట్, పైస్థాయి విద్యలు అం దిస్తున్న విద్యా సంస్థలు ఈ మిషన్లను కచ్చితంగా కొనాలని సూచించారు. త్వరితగతిన విద్యార్థుల వివరాలను నమోదు చేసి, ఈ బార్కోడ్ స్లిప్లను జతచేసి.. సాంఘి క సంక్షేమ శాఖ కార్యాలయానికి హార్డ్ కాపీలను అందజేయాలని కోరారు. ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి. లక్ష్మీపతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల డేటా, ఈ-పాస్ బయోమెట్రిక్తో అనుసంధానం చేసి, బార్కోడ్ స్లిప్పులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డెరైక్టర్ ఎస్.శ్రీనివాసరావు, కరస్పాం డెంట్ ఎస్పీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పనితీరు ఇలా.. జిల్లాలో మొత్తం 310 కళాశాలలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన 80 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి రూ.100 కోట్ల వరకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చెల్లిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో విద్యార్థులు తాము చదువుకుంటున్న కళాశాలలో ఆన్లైన్ ద్వారా స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ వారిని అర్హులుగా భావించి ఆన్లైన్లోనే ఫార్వర్డ్ చేస్తారు. దానికి ఓ నంబర్ను కేటాయిస్తారు. ఈ నంబర్ను ఈ-పాస్ బయోమెట్రిక్ మెషీన్లో ఎంటర్ చేసిన వెంటనే విద్యార్థుల వివరాలు వస్తాయి. మెషీన్పై విద్యార్థి ఫింగర్ను స్కాన్ చెయ్యాలి. ఆ మెషిన్పై డిజిటల్పాడ్స్క్రీన్పైన సంబందిత ప్రిన్సిపాల్, విద్యార్ది సంతకం చేయాలి. వెంటనే ఆధార్తో లింక్అయి..బార్కోడ్ షీట్తో విద్యార్థుల వివరాలు వస్తాయి..అన్నీ సక్రమంగా ఉంటే..సక్సెస్ రిపోర్ట్ వస్తుంది. ఒక వేళ తప్పుడు సమాచారం ఇస్తే..ఫెయిల్యూర్ రిపోర్ట్ వస్తుంది. -
భయో మెట్రిక్!
విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్: ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టనున్న బయోమెట్రిక్ విధానం అధికారులు, కళాశాలల యజమానుల్లో పలు అనుమానాలు, విద్యార్థుల్లో భయాందోళన రేపుతోంది. ఉపకార వేతనాలు, ఫీజు రీరుుంబర్స్మెంట్ పొందేందుకు అర్హులైన విద్యార్థులను గుర్తించడానికి ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టనున్న బయోమెట్రిక్ విధానం వల్ల ఎవరికి ఉపయోగమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏటికేడా ది నిబంధనలను మార్చేసి విద్యార్థులను, అధికారుల ను గందరగోళంలోకి నెడుతున్న ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఈ విధానంతో అందరికీ తలనొప్పులు తప్పవన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత ఏడాది వరకు ఎఫ్ఎల్ఓలు నేరుగా కళాశాలలకు వెళ్లి విద్యార్థులను పరిశీలించి ఉపకార వేతనాలు పొందడానికి అర్హులను గుర్తించేవారు. అయితే ఈ విధానం వల్ల జాప్యం జరుగుతోందన్న భావనతో ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో స్పష్టత లేకపోవడంతో అధికారులతో పాటు కళాశాలల యాజమాన్యాల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ఉపకార వేతనాలు అందుతాయో లేదోనన్న భయాందోళనను విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డు నంబరును ఆధారంగా చేసుకుని ఆన్లైన్లో ఉపకార వేతనాలు చెల్లించేలా ఈ విధానాన్ని ప్రారంభించనున్నారు. దీనిద్వారా లబ్ధిపొందాలంటే ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆధార్ పొం ది ఉండాలి. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించిన తరువాతే ఉపకార వేతనం మంజూరు చేస్తారు. పాఠశాలలో బయోమెట్రిక్ విధానం ద్వారా విద్యార్థుల వేలి ముద్రలను పరిశీలించి, ఆ వివరాలను సంక్షేమ శాఖల అధికారులకు అందజేస్తారు. అధికారులు కూడా ఆ వివరాలను ఆన్లైన్లోనే పరిశీలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో కళాశాలల ప్రిన్సిపాళ్లు బాధ్యత వహించాలని, అలాగే ఆధార్ లేని విద్యార్థులను గుర్తించే బాధ్యత కూడా ప్రిన్సిపాళ్లదేనని స్పష్టం చేశారు. దీంతో పాటు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు పుట్టిన తేదీ, ఎస్ఎస్సీ ఐడీ నంబరు, ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ నంబర్ను ‘ఈ పాస్’ వెబ్ైసైట్లో పొందుపరచాలి. ఈ ప్రక్రియలో కచ్చితమైన సమాచారం పొందుపరిచే విధంగా ప్రిన్సిపాళ్లు జాగ్రత్తలు వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎక్కడ పొరపాటు జరిగినా ఆ విద్యార్థికి ఉపకార వేతనం నిలిచిపోతుంది. దీనికి తోడు చాలా మందికి ఆధార్ కార్డులు అందలేదు. మిషన్లు ఎలా కొనాలి...? బయోమెట్రిక్ విధానంతో తమ జేబుకు చిల్లు పడుతుందని కళాశాలల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బయోమెట్రిక్ మిషన్ ఒకటి రూ.28 వేలని, అంత మొత్తాన్ని వెచ్చించి మిషన్లను ఎలా కొనుగోలు చేయగలమని చిన్న కళాశాలల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలలో ఉన్న విద్యార్థుల ఆధారంగా ఈ మిషన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 296 కళాశాలలున్నాయి. ఈ విధానం వల్ల విద్యార్థుల కంటే బయోమెట్రిక్ కంపెనీలకే లబ్ధి చేకూరుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. -
పింఛన్కు బయోమెట్రిక్ కష్టాలు
ఆసిఫాబాద్, న్యూస్లైన్ : పింఛన్ డబ్బులు పొందడానికి వృద్ధులు, వికలాంగులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో గ్రామ పంచాయతీల్లో పింఛన్ పంపిణీ చేయగా.. ఈ నెల నుంచి పోస్టాఫీసు ద్వారా బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. దీంతో పింఛన్దారుల వేలిముద్రలు, ఆధార్ నంబరు, ఇతర వివరాలు బయోమెట్రిక్ యంత్రంలో నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మండలంలో 4,600 మంది పింఛన్దారులు ఉండగా.. వీరిలో 300మంది వికలాంగులు ఉన్నారు. అందరికీ కలిపి నెలనెలా రూ.10 లక్షలు పింఛన్గా అందజేస్తున్నారు. ఆసిఫాబాద్లో 1,700 మంది వృద్ధులు, వికలాంగులు ఉన్నారు. ఆసిఫాబాద్ పోస్టాఫీసులో ఈ నెల మూడున ప్రారంభమైన బయోమెట్రిక్ విధానంలో ఆన్లైన్ ద్వారా లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. రోజుకు 30 నుంచి 40 మందికి మాత్రమే పింఛన్ పంపిణీ చేస్తున్నారు. ఇలా చేస్తే నెల రోజులైనా పని పూర్తయ్యేలా లేదు. దీంతో నాలుగు రోజులుగా వృద్ధులు, మానసిక వికలాంగులు అవస్థలు పడుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో నిరీక్షిస్తున్నారు. మానసిక వికలాంగుల వేలిముద్రలు బయోమెట్రిక్ యంత్రంలో నమో దు కాకపోవడంతో వారికి డబ్బులు ఇవ్వడం లేదు. కేవలం పింఛన్పైనే ఆధారపడే తమకు కొత్త కొత్త పద్ధతులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలి పారు. రూ.200 పింఛన్ కోసం నాలుగు రోజలుగా తిరుగుతున్నామని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయ మై ఎంపీడీవో కృష్ణమూర్తిని సంప్రదించ గా బయోమెట్రిక్ విధానంలో పింఛన్దారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోందని, వచ్చే నెల సకాలంలో పింఛన్ పంపిణీ అవుతుందని పేర్కొన్నారు. నాలుగు రోజులుగా తిరుగుతున్న నా కుమారుడు సంతోష్ మా నసిక వికలాంగుడు. పింఛన్ కోసం నాలుగు రోజులుగా పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతు న్న. వేలిముద్రలు నమోదవుతలేవని పింఛన్ ఇవ్వడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించి అలసిపోతున్నం. - దండనాయకులు కిషన్రావు, ఆసిఫాబాద్ పేరు వస్తలేదు బయోమెట్రిక్ యంత్రంలో నా పేరు వస్తలేదు. మూడు రోజలుగా పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతున్న. రూ.500 పిం ఛన్ కోసం మూడు రోజలు గా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. - దుర్గం పెంటు, వికలాంగుడు, గ్రామం : జన్కాపూర్, మం : ఆసిఫాబాద్ ఫింగర్ ప్రింట్ వస్తలేదు నా కుమారుడు లతీఫ్ మానసిక వికలాంగుడు. మూడు రోజలుగా పింఛన్ కోసం పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతున్నం. బయోమెట్రిక్ యంత్రంలో ఫింగర్ ప్రింట్ వస్తలేదు. అధికారులు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి. - లతీఫ్, సుల్తానా -
కాలేజీల్లో బయోమెట్రిక్ వ్యవస్థ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రభుత్వ కళాశాలలు, పాలిటెక్నిక్లలో బోధన, బోధనేతర సిబ్బంది హాజరును పర్యవేక్షించడానికి డిసెంబరులోగా బయోమెట్రిక్ వ్యవస్థను ప్రవేశ పెట్టనున్నట్లు ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్వీ. దేశ్పాండే వెల్లడించారు. నగరంలోని ఓ హోటల్లో మంగళవారం ఆయన తన శాఖ వంద రోజుల సాధనల సంక్షిప్త నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశ్వ విద్యాలయాల్లో కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా వైస్ ఛాన్సలర్లను కోరామని తెలిపారు. తన శాఖ పరిధిలోని 17 విశ్వ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలు, పాఠ్యాంశాలు వేర్వేరుగా ఉన్నాయని, ఇకమీదట ఏక రూప విధానాన్ని తీసుకు వస్తామని చెప్పారు. దీనిపై వైస్ చాన్సలర్లతో కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. వాణిజ్య శాస్త్రానికి డిమాండ్ అధికంగా ఉండడంతో ఈసారి అదనంగా 36 తరగతుల ప్రారంభానికి అనుమతినిచ్చామని వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలల్లో 2,800 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిలో 900 పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయని ఆయన చెప్పారు. పర్యాటకంపై విజన్ గ్రూపు రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహా ఇవ్వడానికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ టీవీ. మోహన్ దాస్ పాయ్ అధ్యక్షతన నిపుణులతో కూడిన విజన్ గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్లు దేశ్పాండే తెలిపారు. పర్యాటక శాఖను కూడా నిర్వహిస్తున్న ఆయన వంద రోజుల సంక్షిప్త నివేదికను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ దీనికి సంబంధించి ప్రభుత్వ నోటిఫికేషన్ ఒకటి, రెండు రోజుల్లో విడుదలవుతుందన్నారు. పర్యాటకులకు, ప్రధానంగా మహిళలకు రక్షణ కల్పించడానికి గ్రీన్ పోలీసింగ్ దృక్పథాన్ని ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటకులతో ఈ పోలీసులు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారని చెప్పారు. కాగా 11 దేశాల నుంచి బెంగళూరుకు వచ్చే పర్యాటకుల కోసం ఇటీవల తాము ప్రకటించిన ‘దిగిన వెంటనే వీసా’ పథకం ద్వారా విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు. పర్యాటక సేవలను ఒకే గొడుగు కింద అందించే ఉద్దేశంతో ప్రపంచ సాంస్కృతిక కేంద్రాలైన హంపి, పట్టదకల్లుల్లో టూరిజం ప్లాజాలను నిర్మించాలనే యోచన ఉందని తెలిపారు. గత మే, జూన్లలో రాష్ట్రాన్ని కోటీ 76 లక్షలా 72 వేలా 602 మంది స్వదేశీ, 66,400 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారని ఆయన వెల్లడించారు.