calls
-
పాక్ నుంచి బెదిరింపు కాల్స్
బనశంకరి: బెంగళూరు నగరంలో విద్యార్థుల తల్లిదండ్రులకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. బుధవారం ప్రైవేటు కంపెనీ ఉద్యోగినికి ప్లస్ 92 కోడ్తో 3165788678 నంబరుతో వాట్సాప్ కాల్ వచ్చింది. గుర్తుతెలియని దుండగులు మాట్లాడుతూ మేము ఢిల్లీ సీబీఐ అధికారులమని చెప్పారు, మీ కుమారున్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్చేశాం, అతన్ని వదిలిపెట్టాలంటే వేలాది రూపాయలు నగదును మాకు పంపాలని సూచించారు. తమ కాల్ని కట్చేయరాదని పదేపదే హెచ్చరించారు. తక్షణం మహిళ ఫోన్ కట్చేసి కుమారునికి కాల్ చేసింది. తాను స్కూల్లో ఉన్నట్లు కొడుకు చెప్పడంతో ఆమె స్థిమితపడింది. కాల్ గురించి వివేక్నగర పోలీస్స్టేషన్లో పిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.పెద్దసంఖ్యలో ఫోన్లునగరంలో గత రెండువారాల్లో ఇలాంటి వాట్సాప్ కాల్స్ అనేకమంది తల్లిదండ్రులకు వచ్చాయి. మీ పిల్లల్ని అరెస్ట్ చేశామని, డబ్బు పంపాలని బెదిరిస్తారు. ఇంట్లోనే పిల్లలు ఆడుకుంటున్నప్పటికీ ఇలా తప్పుడు కాల్స్ చేసి బెదిరించే ముఠాలు ఎక్కువయ్యాయి. ప్లస్ 92, లేదా అపరిచిత వాట్సాప్ కాల్స్ను తల్లిదండ్రులు స్వీకరించరాదు. -
ఎన్నికల వేళ ట్విస్ట్.. పుతిన్కు ట్రంప్ సీక్రెట్ కాల్స్?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గత అధ్యక్ష ఎన్నికల ఓటమిచెంది పదవి నుంచి దిగిపోయిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పలు ప్రైవేట్ ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారని వచ్చిన ఆరోపణలను బుధవారం క్రెమ్లిన్ ఖండించింది. ఇటీవల బాబ్ వుడ్వార్డ్ తాను రాసిన ‘వార్’ అనే పుస్తకంలో ట్రంప్,పుతిన్ రహస్య ఫోన్ కాల్స్ విషయాలను ప్రస్తావించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్, పుతిన్ ఫోన్ సంభాషణ తీవ్ర సంచలనంగా మారింది. అయితే.. తాజాగా ఈ ఆరోపణలపై రష్యా స్పందించింది. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలో ఉన్నప్పుడు కోవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉందని క్రెమ్లిన్ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.#BREAKING : Kremlin denies calls between Trump and Putin The Russian Presidential spokesman, Dmitry Peskov, has denied information alleging that former US President Donald Trump had spoken on the phone with Russian President Vladimir Putin seven times after the former left… pic.twitter.com/8rbppPeRgD— upuknews (@upuknews1) October 9, 2024 అయితే ఆ సమయంలో తాము కోవిడ్ -19 పరీక్ష పరికరాలను అమెరికాకు పంపినట్లు ధృవీకరించారు. కానీ, ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇరు నేతలు చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని పుస్తకంలోని వాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాబ్ వుడ్వార్డ్ తన పుస్తకంలో చేసిన ఆరోపణలను ‘నిజం కాదు’ అని కొట్టిపారేశారు.బాబ్ వుడ్వార్డ్ తాను రాసిన ‘వార్’ అనే పుస్తకం వారం రోజులల్లో మార్కెట్లోకి విడుదల కానుంది. అయితే అంతకంటే ముందే కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. 2024 ప్రారంభంలో ట్రంప్ తన ఫ్లోరిడా రిసార్ట్ మార్-ఎ-లాగోలో ఉన్నప్పుడు పుతిన్తో.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రైవేట్ కాల్ను ఏర్పాటు చేశారు. ఇరు నేతల మధ్య ఇలాంటి ఫోన్ సంభాషణ కేవలం ఒక్కసారి మాత్రమే జరగలేదని ఆ పుస్తకంలో బాబ్ వుడ్వార్డ్ ప్రస్తావించటం చర్చనీయాంశంగా మారింది.చదవండి: హెజ్బొల్లా చితికి పోయింది: అమెరికా -
ఎయిర్టెల్ సంచలన ఫీచర్.. కస్టమర్లకు ఇక నో టెన్షన్!
స్పామ్, అవాంఛిత కాల్స్, మెసేజ్ల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. ఇవి మొబైల్ యూజర్లను విసిగించడమే కాకుండా వారిని మోసాలకు సైతం గురిచేస్తున్నాయి. ఈ ముప్పును అరికట్టడానికి భారతీ ఎయిర్టెల్ సంచలన ఫీచర్ను తీసుకొచ్చింది. “దేశంలో మొట్టమొదటి ఏఐ శక్తియుత, నెట్వర్క్ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్”ను ఆవిష్కరించింది. తమ కస్టమర్ల కోసం ఇన్హౌస్ టూల్గా ఎయిర్టెల్ దీన్ని అభివృద్ధి చేసింది. ఇది అనుమానిత స్పామ్ కాల్స్, మెసేజ్లపై కస్టమర్లకు రియల్-టైమ్ అలర్ట్స్ను అందిస్తుంది. తద్వారా అటువంటి అవాంఛిత కాల్స్, ఎస్ఎంఎస్లు చాలా వరకు కట్టడయ్యే అవకాశం ఉంటుందని కంపెనీ చెబుతోంది.“స్పామ్ కస్టమర్లకు పెనుముప్పుగా మారింది. మేము గత పన్నెండు నెలలుగా దీనిని సమగ్రంగా పరిష్కరించడం కోసం కృషి చేశాం. దేశ మొట్టమొదటి ఏఐ-ఆధారిత స్పామ్-రహిత నెట్వర్క్ను ప్రారంభించడం ద్వారా ఈ రోజు ఒక మైలురాయిని సూచిస్తుంది“ అని ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ గోపాల్ విట్టల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఉచితంగా..ఈ ఫీచర్ను తమ కస్టమర్లకు ఎయిర్టెల్ ఉచితంగా అందించనుంది. వినియోగదారులందరికీ ఆటోమేటిక్గా యాక్టివేట్ చేస్తారు. అంటే దీని కోసం సర్వీస్ రిక్వెస్ట్ పెట్టాల్సిన పని గానీ, దానిని యాక్సెస్ చేయడానికి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం గానీ లేదు.ఇదీ చదవండి: జియో సూపర్హిట్ ప్లాన్..ఈ సిస్టమ్ డ్యూయల్-లేయర్డ్ “AI షీల్డ్”ను ఉపయోగించడం ద్వారా పని చేస్తుందని ఎయిర్టెల్ వివరించింది. ఇది నెట్వర్క్ అలాగే ఐటీ సిస్టమ్ స్థాయిలు రెండింటిలోనూ ప్రతి కాల్ను, ఎస్ఎంఎస్ని ఫిల్టర్ చేస్తుంది. ఇది సందేశాలను గుర్తిస్తుండగా ప్రతిరోజూ 150 కోట్ల మేసేజ్లను, 250 కోట్ల కాల్స్ను ప్రాసెస్ చేసి 30 లక్షల స్పామ్ ఎస్ఎంఎస్లు, 10 కోట్ల స్పామ్ కాల్స్ గుర్తించగలదని విట్టల్ వెల్లడించారు. -
మొబైల్ అలర్ట్లతో ప్రాణాలు కాపాడేలా..
ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మరణాలరేటు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మొబైల్ వినియోగదారులకు కాల్స్, టెక్ట్స్ రూపంలో అలర్టులు అందించాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయించింది. సెల్ బ్రాడ్కాస్టింగ్ సొల్యూషన్స్(సీబీఎస్) ద్వారా టెలి కమ్యునికేషన్ విభాగం సాయంతో ఈ సేవల ప్రారంభించాలని యోచిస్తోంది. ఈమేరకు సంబంధిత శాఖలతో చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.దేశవ్యాప్తంగా భూకంపాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడం, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్(సీఏపీ)తో స్థానిక ప్రజలకు మెసేజ్లు, కాల్స్ రూపంలో సలహాలు, సూచనలు అందించనున్నారు. దానివల్ల ప్రమాదం జరగడానికి ముందుగానే ప్రజలను అప్రమత్తం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ప్రజలకు ముందుగానే సమాచారం అందిస్తే అందుకు తగ్గట్టుగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. దాంతో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: ఉచితాలు.. శాపాలు!ఐఎండీ, సీడబ్ల్యూసీ, ఎన్సీఎస్ వంటి కేంద్ర సంస్థల సహాయంతో ప్రభుత్వం ఈ అలర్టులు పంపే అవకాశం ఉందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ సదుపాయం వల్ల అటవీ ప్రాంతాలు, సరైన మౌలిక సదుపాయాలు లేని ప్రదేశాల్లో నివసిస్తున్న వారికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా, గతేడాది పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరిలోని మొబైల్ వినియోగదారుల ద్వారా టెలి కమ్యునికేషన్ విభాగం ఈ అలర్టు సర్వీసును పరీక్షించింది. -
వాట్సాప్ నుంచి వేరే యాప్లకు మెసేజ్లు, కాల్స్..
సోషల్ మీడియాలో మేసేజ్లు పంపడానికి, కాల్స్ చేయడానికి విస్తృతంగా వినియోగిస్తున్న యాప్ వాట్సాప్. ఇలాంటివి ఇంకా పలు మెసేజింగ్ యాప్లు ఉన్నాయి. ఒక యాప్ నుంచి మరో యాప్కి మెసేజ్లు, కాల్స్ చేసే వెసులుబాటు ఉంటే ఎంత బాగుంటుంది.. దీనికి సంబంధించే వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా కీలక ప్రకటన చేసింది.యూరోపియన్ యూనియన్ డిజిటల్ మార్కెట్ల చట్టం (DMA)కి అనుగుణంగా తమ ప్రసిద్ధ మెసేజింగ్ ప్లాట్ఫారమ్లైన వాట్సాప్, మెసెంజర్లను 2027 నాటికి థర్డ్-పార్టీ మెసేజింగ్ సేవలతో ఇంటర్ఆపరేబిలిటీకి సపోర్ట్ చేసేలా అభివృద్ధి చేయనున్నట్లు మెటా ప్రకటించింది. దీని ప్రకారం యాజర్లు నేరుగా వాట్సాప్, మెసెంజర్ యాప్ల నుంచి ఇతర నాన్-మెటా మెసేజింగ్ యాప్లకు నేరుగా మెసేజ్లు, కాల్స్ చేయవచ్చు, అందుకోవచ్చు.మెటా ఈ కొత్త ఫీచర్ను అభివృద్ధి చేస్తున్న క్రమంలో యూజర్ల గోప్యత, భద్రత ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకుంది. థర్డ్-పార్టీ చాట్లు ఇప్పటికే ఉన్న వాట్సాప్, మెసెంజర్ కమ్యూనికేషన్ల లాగే ఎన్క్రిప్షన్, వినియోగదారు గోప్యతను నిర్వహించేలా చూసే సాంకేతిక పరిష్కారంపై కంపెనీ పని చేస్తోంది. థర్డ్-పార్టీ చాట్ల గురించి వినియోగదారులకు తెలియజేసే కొత్త నోటిఫికేషన్లను మెటా ప్రవేశపెట్టింది. వాట్సాప్ లేదా మెసెంజర్కి వేరే యాప్ అనుసంధానమైన ప్రతిసారీ యూజర్లకు నోటిఫికేషన్ వస్తుంది.కాల్స్ మాత్రం కాస్త ఆలస్యంథర్డ్ పార్టీ యాప్లతో అనుసంధానమయ్యే విషయంలో వాట్సాప్, మెసెంజర్ యూజర్లకు సౌలభ్యం ఉంటుంది. ఇందులో భాగంగా అన్ని యాప్ల మెసేజ్లు ఒకే ఇన్బాక్స్లో కనిపించే లేదా విడివిడి ఇన్బాక్స్లలో కనిపించే ఆప్షన్లను ప్రవేశపెట్టే యోచనలో మెటా ఉంది. థర్డ్ పార్టీ యాప్లతో రియాక్షన్స్, డైరెక్ట్ రిప్లైస్, టైపింగ్ ఇండికేటర్స్, రీడ్ రిసీపియంట్స్ వంటి మెరుగైన మెసేజింగ్ ఫీచర్లతో పాటు గ్రూప్ చాట్ సౌలభ్యాన్ని కూడా 2025 నాటికి అందుబాటులోకి తెచ్చే పనిలో మెటా ఉంది. అయితే థర్డ్ పార్టీ యాప్లతో వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్ మాత్రం 2027 నాటికి అందుబాటులోకి రావచ్చు. -
ఇలా మోసం చేస్తున్నారు.. ఆర్బీఐ హెచ్చరిక!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్న అసాంఘిక శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆర్బీఐ హెచ్చరించింది. సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగులుగా నటిస్తూ నకిలీ లెటర్ హెడ్స్, ఈమెయిల్ అడ్రెస్లను ఉపయోగించి లాటరీలు.. ఫండ్ ట్రాన్స్ఫర్, విదేశీ రెమిటెన్సులు, ప్రభుత్వ పథకాల పేరిట కొందరు మోసగిస్తున్నారని పేర్కొంది.కరెన్సీ ప్రాసెసింగ్ ఫీజులు, ట్రాన్స్ఫర్/రెమిటెన్స్/ప్రొసీజర్ చార్జీలంటూ వసూలు చేస్తున్నారని వివరించింది. ఆర్బీఐ/ప్రభుత్వ అధికారుల్లాగా నటిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులు, స్కీములతో నిధులు పొందేందుకు సెక్యూరిటీ డిపాజిట్లు కట్టాల్సి ఉంటుందని చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను మోసగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. సాధారణంగా వీరు ఐవీఆర్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ ద్వారా బాధితులను సంప్రదిస్తున్నారు.ఆర్బీఐ అధికారులుగా పరిచయం చేసుకునే సదరు మోసగాళ్లు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసేస్తామని బెదిరిస్తూ, నిర్దిష్ట వ్యక్తిగత వివరాలు ఇచ్చేలా బాధితులను బలవంతపెడుతున్నారు. ఈ నేపథ్యంలో అపరిచితులకు అకౌంట్ లాగిన్ వివరాలు, ఓటీపీ లేదా కేవైసీ పత్రాలు మొదలైనవి ఇవ్వరాదని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. -
సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్లు, కాల్స్ నిలిపివేత!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. చాలా కంపెనీలు మోసపూరిత మెసేజ్లు, కాల్స్ చేస్తూ టెలికాం వినియోగదారులను టార్గెట్ చేస్తున్నాయి. ఈ వ్యావహారంపై అవగాహనలేనివారు స్కామర్ల చేతికిచిక్కి ఆర్థికంగా, మనసికంగా బలవుతున్నారు. ఈ మోసాలను కట్టడి చేసేందుకు టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మెసేజ్ సేవల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, మోసపూరిత విధానాల నుంచి వినియోగదారులను రక్షించడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని టెల్కోలను ఆదేశించింది. సరైన గుర్తింపులేని సర్వీస్ ప్రొవైడర్ల ప్రసారాలను నిలిపేస్తామని ప్రకటించింది.ఇదీ చదవండి: వాహనాలకు న‘కీ’లీ.. బీమా రెజెక్ట్!అయాచిత స్పామ్ కాల్స్, మెసేజ్ల కట్టడికి ట్రాయ్ గత కొద్ది కాలంగా కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మెసేజ్లు, కాల్స్ చేస్తున్నవారి సమాచారం తెలియని యూఆర్ఎల్లు, ఓటీటీ లింక్లను లేదా కాల్ బ్యాక్ నంబర్లను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిలిపేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది. ఆయా విభాగాల్లోని సర్వీస్ ప్రొవైడర్లు ప్రసారాలు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సమాచారం పంపినవారి నుంచి మెసేజ్ గ్రహీతల వరకు అన్నింటినీ ట్రేస్ (గుర్తించడానికి) చేయడానికి నవంబర్ నుంచి తగిన చర్యలు తీసుకోవాలని ట్రాయ్ నిర్దేశించింది. పారదర్శకతలేని టెలిమార్కెటర్ చైన్ నుంచి వచ్చే సందేశాల ప్రసారం నిలిపివేతకు కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. -
స్పామ్ కాల్స్ టెలీమార్కెటర్లను బ్లాక్లిస్ట్ చేయండి
న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్ చేసే టెలీమార్కెటర్లపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కఠిన చర్యలు ప్రకటించింది. అన్రిజిస్టర్డ్ టెలీ మార్కెటింగ్ సంస్థలు వ్యాపారపరమైన స్పామ్ కాల్స్ చేస్తున్నట్లుగా తేలినట్లయితే వాటి టెలికం వనరులన్నింటినీ డిస్కనెక్ట్ చేయాలని, రెండేళ్ల పాటు వాటిని బ్లాక్లిస్ట్లో ఉంచాలని టెల్కోలను ఆదేశించింది. బ్లాక్లిస్ట్లో ఉంచినప్పుడు ఆయా సంస్థలకు కొత్తగా టెలికం వనరులను కేటాయించరాదని పేర్కొంది.ఎస్ఐపీ, పీఆర్ఐ వంటి టెలికం వనరులను ఉపయోగిస్తున్న అన్రిజిస్టర్డ్ టెలీమార్కెటర్లు ఈ ఆదేశాలు వచ్చిన నెల రోజుల్లోగా డీఎల్టీ ప్లాట్ఫాంనకు మారాలని తెలిపింది. ఈ ఆదేశాలను తక్షణం పాటించాలని, ఈ విషయంలో తీసుకున్న చర్యలపై ప్రతి పదిహేను రోజులకు ఓసారి (ప్రతి నెలా ఒకటి, పదహారో తారీఖుల్లో) అప్డేట్ ఇవ్వాలని టెల్కోలకు ట్రాయ్ సూచించింది. ఈ ‘నిర్ణయాత్మక చర్య‘తో స్పామ్ కాల్స్ బెడద గణనీయంగా తగ్గగలదని, వినియోగదారులకు ఉపశమనం కలగగలదని అభిప్రాయపడింది. -
అవాంఛిత కాల్స్ నిబంధనలపై అభిప్రాయాలకు గడువు పెంపు
న్యూఢిల్లీ: అవాంఛిత మార్కెటింగ్ కాల్స్, మెసేజీల కట్టడి కోసం రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలపై సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు గడువును కేంద్రం ఆగస్టు 8 వరకు పెంచింది. వివిధ ఫెడరేషన్లు, అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాల నుంచి అభ్యర్ధనలు వచ్చిన మీదట ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే వచ్చిన సలహాలు, అభిప్రాయాలను పరిశీలిస్తున్నట్లు వివరించింది. వాస్తవానికి ఈ డెడ్లైన్ జూలై 21తో ముగిసింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా అన్రిజిస్టర్డ్ మార్కెటర్లు ప్రైవేట్ నంబర్ల నుంచి చేసే ప్రమోషనల్ కాల్స్, మెసేజీలను కట్టడి చేయడం ఈ మార్గదర్శకాల లక్ష్యం. టెల్కోలు, నియంత్రణ సంస్థలు తదితర వర్గాలతో సంప్రదింపుల మేరకు వీటిని రూపొందించారు. -
దారుణాలకు ఏఐ దన్ను!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్లో ఓ డాక్టర్కు ఉదయం నుంచి మీరు లోన్ కట్టాలంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కాల్స్ వచ్చాయి. తరువాత వాయిస్ కాల్స్ చేసి విసిగించారు. చేసిన ప్రతీసారీ కొత్త నెంబరుతో వేధించడంతో ఏం చేయాలో పాలుపోక ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారు. మీ మిత్రుడు లోన్ తీసుకున్నాడంటూ మరో పోలీసు అధికారికి పదే పదే ఫోన్లు చేసి విసిగించారు. ఇది కేవలం పోలీసులు, వైద్యులకే కాదు.. రాజకీయ నాయకులు, అధికారులు మొదలుకుని విలేకరులను కూడా వదలకుండా వేధిస్తున్నారు.⇒ ఇంతకాలం కాల్సెంటర్ల ద్వారా వేధించిన లోన్యాప్ యాజమాన్యాలు ఇప్పుడు రూటు మార్చాయి. తమ బాకీని ఎలాగైనా వసూలు చేసుకునేందుకు సరికొత్త పంథాను ఎంచుకున్నాయి. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను సరికొత్త ఆయుధంగా వాడుతున్నాయి. ముందుగా లోన్ తీసుకునే వ్యక్తి నుంచి కాంటాక్ట్స్ యాక్సెస్ చేయాలా? అని అడుగుతారు. యాక్సెస్ పరి్మషన్ ఇవ్వకపోతే లోన్ రాదు. అవసరాల్లో ఉంటారు కాబట్టి అంతా కాంటాక్ట్ యాక్సెస్ పర్మిషన్ ఇస్తారు. ఇదే అదనుగా కాల్స్ చేసి విసిగించడంతోపాటు ఆటోమేటిక్ కాల్స్తో వేధింపులకు దిగుతున్నారు.ఉదయం, సాయంత్రం ఏఐ కాల్స్!⇒ ఒక వ్యక్తి ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్న వందలు, వేల కాంటాక్ట్స్కి ఒకేసారి ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా గ్రూప్ కాల్ వెళ్తుంది. సార్ మీ లోన్ పెండింగ్లో ఉంది. వెంటనే ఈ నెంబరుకు కాల్బ్యాక్ చేయండి అంటూ రికార్డెడ్ వాయిస్ వస్తుంది. ఉదయం, సాయంత్రం, లంచ్ సమయాల్లో ఏఐ కాల్స్ వస్తాయి. ప్రతీ పది నిమిషాలకు ఒకసారి కాల్స్ చేసి విసుగు తెíప్పిస్తాయి.కొత్త తలనొప్పులు..⇒ సాధారణంగా ఎవరైనా పోలీసు, వైద్యుడు, ప్రభుత్వాధికారి, రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లను సేవ్ చేసుకుంటారు. అయితే సదరు వ్యక్తి పొరపాటున అప్పు తీసుకుని కట్టకపోతే.. అప్పుడు ఈ కాంటాక్ట్స్లో ఉన్న వారంతా బాధితులుగా మారుతున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుంటే అప్పు వసూలు చేయవచ్చన్నది వారి వ్యూహం. ప్రజాజీవితంతో ముడిపడి పనిచేసే వీరు రోజంతా ఏదో పనిలో తలమునకలై ఉంటారు. పైగా నెంబర్లు మార్చి మార్చి చేయడంతో ఎత్తక తప్పనిసరి పరిస్థితి. తీరా ఎత్తితే.. అప్పు కట్టాలి అంటూ వేధింపులు, తిట్లు, దూషణలతో విసిగిస్తున్నారు. మొత్తానికి అకారణంగా వీరంతా వేధింపులకు గురవుతున్నారు. లోన్ యాప్ వేధింపుల నుంచి బయటపడండిలా..⇒ ఎంచుకున్న లోన్యాప్ రివ్యూలు ఆన్లైన్లో చదవాకే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ⇒ యాప్లో అనవసరమైన కాంటాక్ట్ ఎనేబుల్ పరి్మషన్స్ ఇవ్వరాదు. ⇒పదేపదే కాల్స్ వస్తే బ్లాక్ చేయాలి లేదా ట్రూకాలర్లో వాటిని స్పామ్ నంబర్లుగా రిపోర్టు చేయాలి. ⇒అయినా వేధింపులు ఆగకపోతే.. డయల్ 100కి కాల్ చేసి చెప్పాలి లేదా సమీపంలోని పోలీసుస్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయాలి లేదా 1930కి కాల్చేసి ఫిర్యాదు చేయవచ్చు. ⇒ httpr://cybercrime.gov.in ఈ లింక్లోనూ ఫిర్యాదు చేయవచ్చు. -
కొత్త ఫీచర్!! అచ్చం మనుషులతో మాట్లాడినట్టుగానే..
టెక్నాలజీ విస్తృతమైన నేటి రోజుల్లో ఆప్యాయంగా పలకరించేవారు కరువయ్యారు. అందరూ స్మార్ట్ఫోన్లకు హత్తుకుపోయి అన్నింటినీ వాటిలోనే వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే Character.AI అనే సంస్థ చాట్బాట్కు కాల్ చేసే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. క్యారెక్టర్స్ అని పిలిచే ఈ ఏఐ చాట్బాట్లను అచ్చం మనుషలతో మాట్లాడినట్టుగానే ఉండేలా ప్రోగ్రామ్ చేయవచ్చు.ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఫోన్ కాల్స్ చేసి నిజమైన టెలిఫోనిక్ సంభాషణల అనుభూతిని పొందవచ్చు. ఇంగ్లిష్, స్పానిష్, జపనీస్, చైనీస్ వంటి భాషలను ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుందని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ తెలిపింది. గత నెలలో ఆర్క్ సెర్చ్ కూడా ఇలాంటి ఫీచర్నే విడుదల చేసింది.క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ యూజర్లందరికీ ఉచితంగా లభిస్తుందని ఏఐ సంస్థ తన బ్లాగ్ పోస్ట్ లో ప్రకటించింది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో వెబ్లో కూడా ఈ ఫీచర్ను ప్రవేశపెట్టనున్నట్లు Character.AI పేర్కొంది. గత మార్చిలో కంపెనీ క్యారెక్టర్ వాయిస్ ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇది వన్-వే కమ్యూనికేషన్. అంటే యూజర్లు ఏఐకి మెసేజ్ చేస్తే వాయిస్ రూపంలో స్పందన వస్తుంది. టెక్ట్స్ టు స్పీచ్ (టీటీఎస్) ఏఐ మోడల్ సామర్థ్యాలను ఉపయోగించి దీన్ని రూపొందించారు.ఇప్పుడు క్యారెక్టర్ కాల్స్తో యూజర్లు టూ-వే వెర్బల్ కమ్యూనికేషన్ చేయొచ్చు. దీని ద్వారా యూజర్లు ఏఐ క్యారెక్టర్ తో చాటింగ్ చేసే హ్యాండ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు. కాల్ స్క్రీన్ ఇంటర్ఫేజ్ కనిపిస్తుంది. స్క్రీన్ లో మ్యూట్ బటన్, ఎండ్ కాల్ ఆప్షన్ ఉంటాయి. వేగవంతమైన ప్రతిస్పందనలను జనరేట్ చేయడానికి క్యారెక్టర్ కాల్స్ ఫీచర్ తక్కువ లేటెన్సీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంతేకాదు యూజర్లు వివిధ వాయిస్లు, పిచ్లు, యాసలు ఎంచుకోవచ్చు. -
రాజాసింగ్కు బెదిరింపు కాల్స్
అబిడ్స్(హైదరాబాద్): గోషామహల్ ఎమ్మె ల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. బుధవారం ఉదయం 9:19 గంటల నుంచి క్రమం తప్పకుండా తన ఫోన్కు గుర్తు తెలియనివ్యక్తులు బెదిరింపు కాల్స్ చేస్తూనే ఉన్నారని రాజాసింగ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. చేసిన ప్రతిసారి ఒక్కో నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయని చెప్పారు.కొన్నిసార్లు వాయిస్ మెసేజ్ కూడా చేసి బెదిరిస్తున్నారన్నారు. వచ్చిన కాల్స్లో పాలస్తీనాకు చెందిన ఒక తీవ్రవాది ఫొటో, నంబరు స్పష్టంగా కనిపించిందని రాజాసింగ్ వెల్లడించారు. బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి తనను ఇంకో నంబరు ఉందా? అని అడిగాడని, దానికి సమాధానంగా గూగుల్లో అన్వేషించి సీఎం రేవంత్రెడ్డి నంబర్ను ఇచ్చానని తన వీడియోలో పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ చాలాసార్లు వచ్చాయని, పోలీసు ఉన్నతాధికారులు, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదన్నారు. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్ వస్తే అది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారన్నది కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారని ఆ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నందున సీఎం రేవంత్రెడ్డి నంబర్ను ఇచ్చానని, ఒకవేళ ఆ వ్యక్తులు ఆ నంబరకు బెదిరింపు కాల్స్ చేస్తే ప్రభుత్వం, పోలీసులు విచారణ జరిపిస్తారేమో అనే భావంతోనే సీఎం నంబర్ ఇచ్చానంటూ రాజాసింగ్ వెల్లడించారు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మళ్లీ బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపుతామని బెదిరిస్తూ పదేపదే కాల్స్ చేస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. పలు నంబర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయని.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవని ఆయన మండిపడ్డారు.తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ను రాజాసింగ్ తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఈ కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఎక్స్లో పేర్కొన్నారు.మరోవైపు, బెదిరింపు కాల్స్ చేసిన వారికి రాజాసింగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనకు ఎన్ని నంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారు. ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చాని తెలిపారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడంలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చాను. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ ముందుకు సాగుతుందా? లేదా?’’ అంటూ ప్రశ్నించారు.ఇవాళ నాకు కంటిన్యూయస్గా బెదిరింపు కాల్స్ వచ్చాయి. పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. నా ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారన్నారు.కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడు.. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని సీఎం నంబర్ ఇచ్చాను. ఒక ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్ వస్తే ఎలాగూ పట్టించుకోలేదు. అందుకే ముఖ్యమంత్రి నంబర్ కు బెదిరింపు కాల్ వస్తే అయినా చర్యలు తీసుకుంటారా? లేదా?. విచారణ సాగుతుందా? లేదా? అనేది చూద్దాం.. నాకు ఈ కాల్స్ రావడం ఎప్పుడు బంద్ అవుతాయో చూద్దాం’’ అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. Once again, I'm receiving death threats from multiple numbers today. This isn't the first time I've been targeted with such threats. Despite previous complaints, it seems no action will be taken.Nonetheless, as a responsible citizen, I feel obligated to inform the police… pic.twitter.com/exIFElcrUx— Raja Singh (Modi Ka Parivar) (@TigerRajaSingh) May 29, 2024 -
స్పామ్ కాల్స్తో ఒళ్లు మండిపోతోందా? ఇలా చేయండి!
పొద్దున లేచింది మొదలు రాత్రి వరకూ స్పామ్ కాల్స్ బెడద ఇంతా అంతాకాదు. ఏ పనిలో ఉన్నా,ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా.. ఏదో పెద్ద పని ఉన్నట్టు మనల్ని డిస్ట్రబ్ చేస్తాయి. తీరా అది స్పామ్ అని తెలిసాక మన కొచ్చే కోపం అంతా కాదు. సెలెన్స్ అన్ నోన్ కాలర్స్, స్పామ్ కాల్ అలర్ట్.. ఇలా ఎన్ని అప్షన్స్ ఉన్నా.. ఎన్ని నంబర్లను బ్లాక్ చేసినామళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి..దాదాపు సెల్ఫోన్ ఉన్నప్రతి వారికి ఇది అనుభవమే. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్లో ఒక వీడియో తెగ షేర్ అవుతోంది. How do you deal with unwanted telephone calls? pic.twitter.com/emVHvdv02N — Science girl (@gunsnrosesgirl3) March 31, 2024 సైన్స్గర్ల్ అనే ట్విటర్ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. ఈవీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇప్పటికే ఇది 14 మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకుంది. మరి మీరు కూడా ఓ లుక్కేసుకోండి! -
ఫిర్యాదు చేస్తే అంతు చూస్తాం
‘మార్గదర్శి చిట్ఫండ్స్పైనే ఫిర్యాదు చేస్తారా ... మీ సంగతి తేలుస్తాం’ ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితులు.. అని సంఘం పెట్టేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది’ ‘మీ ష్యూరిటీ పత్రాలు మా దగ్గర ఉన్నాయి.. మీ ఆస్తులు వేలం వేయిస్తాం..’ ఇవీ రాజగురివింద రామోజీరావు ఆర్థిక అక్రమాల పుట్ట.. మార్గదర్శి చిట్ఫండ్స్ నుంచి చందాదారులకు కొన్ని నెలలుగా వస్తున్న బెదిరింపులు. నేరుగా చందాదారుల ఇళ్లకే వచ్చి బెదిరిస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. మరికొందరికి రామోజీ ముఠా ఫోన్లు చేసి వేధిస్తోంది. కొందరిని తమ చిట్ఫండ్ కార్యాలయాలకు పిలిపించుకుని మరీ బెదిరిస్తోంది. మార్గదర్శి చిట్ఫండ్స్ అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు బెంబేలెత్తుతున్నారు. దశాబ్దాల తరబడి ఆయన, ఆయన కోడలు శైలజ వేధింపులు భరించిన చందాదారులు ప్రస్తుతం ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తుండటంతో రామోజీ ముఠా బెదిరింపుల పర్వానికి బరితెగించింది. దీంతో చందాదారుల భద్రతే లక్ష్యంగా ఫిర్యాదులు చేసేందుకు సీఐడీ ప్రత్యేక వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెచ్చింది. తాజాగా కొందరు చందాదారులు ‘మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘాన్ని’ ఏర్పాటు చేసి రిజిస్టర్ చేయించడంతో ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ధైర్యంగా బాధితుల ముందడుగు.. మార్గదర్శి చిట్ఫండ్స్ కేసును విచారిస్తున్న సీఐడీ.. బాధితులు ఫిర్యాదు చేసేందుకు 94931 74065తో వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ నంబరుకు ఇప్పటికే వేల సంఖ్యలో చందాదారులు ఫిర్యాదులు చేశారు. తమ అనుమతి లేకుండా చిట్టీలు పాడటం, చిట్ పాడుకున్న నగదు ఇవ్వకుండా రశీదు డిపాజిట్లుగా జమ చేయడం, ష్యూరిటీలు ఇచ్చినా తిరస్కరించి వేధించడం, తమ సంతకాలు ఫోర్జరీ చేయడం వంటి అక్రమాలపై బాధితులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నారు. వీటిని సీఐడీ ప్రత్యేక విభాగం నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. వేధింపులకు పాల్పడ్డ పలువురు మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లు, ఇతర సిబ్బందిని సీఐడీ విచారిస్తుండటంతో రామోజీ బెంబేలెత్తుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ కార్యాచరణతో చందాదారులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. విజయవాడ కేంద్రంగా మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. బాధితులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రత్యేకంగా 99481 14455 ఫోన్ నంబర్ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో కేవలం మూడు రోజుల్లోనే వందల సంఖ్యలో బాధితులు ఈ సంఘాన్ని సంప్రదించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందరి ఫిర్యాదులను నమోదు చేస్తూ అటు సీఐడీ ద్వారా, ఇటు న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు ఆ సంఘం సన్నద్ధమవుతోంది. బాధితులపై మార్గదర్శి వేధింపుల పర్వం మార్గదర్శి చిట్ఫండ్స్ ఆర్థిక అక్రమాల పుట్ట బద్దలు కావడంతో రామోజీరావు హడలిపోతున్నారు. సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడం, ఏకంగా తన ఇంటికే వచ్చి మరీ విచారించడంతో ఆయన బెంబేలెత్తుతున్నారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు బాధితులు కూడా దూకుడు పెంచడంతో ఏక్షణం ఏం జరుగుతుందోనని రామోజీ బేజారెత్తుతున్నారు. దీంతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు తన ముఠాలను ఆయన రంగంలోకి దించారు. సీఐడీ అధికారులు, బాధితుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారికి ఫోన్లు చేసి రామోజీ ముఠా వేధిస్తోంది. సీఐడీకి ఫిర్యాదు చేసిన చందాదారులను మొదట లక్ష్యంగా చేసుకుంది. సీఐడీ దర్యాప్తునకు సహకరించవద్దని వారిని బెదిరిస్తోంది. ఏకంగా మార్గదర్శి చిట్ఫండ్స్ ఎండీ శైలజ కిరణ్ ఆఫీసు నుంచే చందాదారులకు ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుండటం గమనార్హం. రామోజీ కోడలు శైలజ కిరణ్ పీఏ శశికళ, మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లు స్వయంగా ఫోన్లు చేసి మరీ బెదిరిస్తుండటం ఆ సంస్థ దిగజారుడుతనానికి నిదర్శనం. మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఫోన్ నంబరుకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. ‘అసలు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు.. మీ వెనుక ఎవరు ఉన్నారు.. ఎవరున్నాసరే మిమ్మల్ని కాపాడలేరు.. మీ సంగతి చూస్తాం.. అంతు తేలుస్తాం’ అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. – సాక్షి, అమరావతి న్యాయపోరాటానికి బాధితులు సిద్ధం.. మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది కాల్మనీ రాకెట్ గూండాల మాదిరిగా చందాదారుల ఇళ్లపై పడుతున్నారు. వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరిస్తున్నారు. ప్రధానంగా ప్రైవేటు వ్యక్తులకే తెలియకుండా తాము ఘోస్ట్ చందాదారులుగా నమోదు చేసిన వారి ఇళ్లకు వెళ్లి దౌర్జన్యం చేస్తున్నారు. అసలు మార్గదర్శి చిట్ఫండ్స్లో తాము చందాదారులుగా చేరిన విషయమే తమకు తెలియదనివారు ఎంతగా చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ‘సీఐడీ అధికారులు అడిగితే మీరే చందాదారులుగా చేరారని చెప్పండి.. మీకు ఇబ్బందిరాకుండా చూస్తాం.. అంతేగానీ తెలియదని చెబితే మాత్రం మీరు మాకు భారీగా బకాయిలు ఉన్నారని కోర్టులో కేసులు వేస్తాం’ అని హడలెత్తిస్తున్నారు. దాంతో తమకు తెలియకుండానే తమ పేరుతో మార్గదర్శి చిట్ఫండ్స్ సాగిస్తున్న ఆర్థిక అవకతవకలపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక చందాదారుల కోసం ష్యూరిటీ సంతకాలు చేసిన వారి ఇళ్లకు మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బంది వెళ్లి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ‘మీరు ఇచ్చిన ఖాళీ చెక్కులు మా వద్ద ఉన్నాయి.. వాటిపై భారీ మొత్తం రాసి బ్యాంకులో జమ చేసి బౌన్స్ అయ్యేలా చేస్తాం. తరువాత కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తాం’ అని కొందరిని బెదిరించడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరికొందరు చందాదారుల ఇళ్లకు వెళ్లి ‘మీరు భారీగా బకాయి పడ్డారు...అందుకు ప్రతిగా మీ ఇళ్లు, ఆస్తులు వేలం వేయిస్తాం’ అని వేధింపులకు దిగారు. చందాదారుల తరపున మార్గదర్శి చిట్ఫండ్స్ సిబ్బందే ఫోర్జరీ సంతకాలు చేసేసి.. తిరిగి చందాదారులపైనే ఫోర్జరీ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ పరిణామాలతో మార్గదర్శి చిట్ఫండ్స్ చందాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మార్గదర్శి చిట్ఫండ్స్ బాధితుల సంఘం ద్వారా అటు సీఐడీని ఆశ్రయించడంతోపాటు మరోవైపు న్యాయపోరాటం చేసేందుకు ఉద్యుక్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తప్పని అవాంఛిత కాల్స్ బెడద - సర్వేలో బయటపడ్డ విషయాలు
డు నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) లిస్ట్లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా చాలా మంది మొబైల్ ఫోన్ యూజర్లకు అవాంఛిత కాల్స్ బెడద తప్పడం లేదు. ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇతరత్రా ఉత్పత్తుల గురించి తమకు స్పామ్ కాల్స్ వస్తూనే ఉన్నాయంటూ లోకల్సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది తెలిపారు. సర్వేలో అడిగిన ఏడు ప్రశ్నలకు 378 జిల్లాల నుంచి 60,000 పైచిలుకు సమాధానాలు వచ్చినట్లు లోకల్సర్కిల్స్ తెలిపింది. గతేడాది నవంబర్ 15 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 16 మధ్య కాలంలో దీన్ని నిర్వహించారు. అవాంఛిత కాల్స్ సంఖ్య గురించి అడిగిన ప్రశ్నకు రోజుకు తమకు 1–2 కాల్స్ వస్తూనే ఉంటాయని 90 శాతం మంది, 10కి పైగా కాల్స్ వస్తుంటాయని 3 శాతం మంది పేర్కొన్నారు. ఒక బడా లిస్టెడ్ నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి అత్యధికంగా కాల్స్ ఉంటున్నాయని 40 శాతం మంది వెల్లడించారు. ఆ తర్వాత స్థానంలో ఒక పేరొందిన లిస్టెడ్ ప్రైవేట్ రంగ బ్యాంకు ఉంది. అవాంఛిత కాల్స్ను కట్టడి చేసేందుకు టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గత కొన్నేళ్లుగా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి పెద్దగా మెరుగుపడినట్లు కనిపించడం లేదని లోకల్సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపాడియా చెప్పారు. -
20 ఉత్తుత్తి బెదిరింపు కాల్స్.. నాలుగేళ్లు నిజమైన జైలు?
అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన ఒక యువకుడు ఒకేరోజు నాలుగు నేరాలకు పాల్పడి, దోషిగా నిలిచాడు. అమెరికా, కెనడాలలో 20కిపైగా బెదిరింపు కాల్స్ చేశాడు. బాంబు దాడులు, కాల్పులు, ఇతర బెదిరింపులకు పాల్పడి, ప్రభుత్వ అత్యవసర విభాగాలలో గాభరా పుట్టించాడు. అస్టన్ గార్సియా(21) అనే యువకుడు టకోమాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. రెండు దోపిడీలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన బెదిరింపులలో గార్సియా తన నేరాన్ని అంగీకరించినట్లు యుఎస్ అటార్నీ టెస్సా ఎం. గోర్మాన్ ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. గార్సియాపై తొలుత 10 నేరాలు మోపారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ గార్సియా 2022, 2023లో బెదిరింపు కాల్స్ చేసే సమయంలో తన గుర్తింపును దాచేందుకు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించాడని చెప్పారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ డిస్కార్డ్లో ప్రసారం చేస్తూ, అందరినీ వినాలని కూడా గార్సియా కోరేవాడన్నారు. గార్సియా తాను టార్గెట్ చేసుకున్న ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. డబ్బు, క్రెడిట్ కార్డుల సమాచారం లేదా అసభ్యకరమైన చిత్రాలను పంపించకపోతే ప్రభుత్వ అత్యవసర సిబ్బందిని వారి ఇళ్లకు పంపిస్తానని బెదిరించేవాడు. గార్సియా.. ఓహియోలోని క్లీవ్ల్యాండ్లోని ఫాక్స్ న్యూస్ స్టేషన్కు ఫోన్ చేసి, లాస్ ఏంజెల్స్కు వెళ్లే విమానాలలో బాంబు ఉన్నదంటూ వదంతులు వ్యాప్తి చేశాడు. అలాగే బిట్కాయిన్ రూపంలో భారీ మొత్తాన్ని అందించకపోతే లాస్ ఏంజిల్స్లోని విమానాశ్రయంలో బాంబు పెడతానని బెదిరించాడు. 2017లో గార్సియా ఇటువంటి బెదిరింపు కాల్ప్ చేసి, తప్పుదారి పట్టించిన నేపధ్యంలో కాన్సాస్లో ఒక పోలీసు అధికారి ఒక వ్యక్తిని కాల్చి చంపారు. కాగా బ్రెమెర్టన్కు చెందిన గార్సియాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు సూచించారు. గార్సియాకు ఏప్రిల్లో శిక్ష ఖరారు కానుంది. అమెరికాలోని వాషింగ్టన్, కాలిఫోర్నియా, జార్జియా, ఇల్లినాయిస్, కెంటుకీ, మిచిగాన్, మిన్నెసోటా, న్యూజెర్సీ, ఒహియో, పెన్సిల్వేనియా, కొలరాడో, కెనడాలోని అల్బెర్టాలో గల అత్యవసర ఏజెన్సీలకు గార్సియా బెదిరింపు కాల్ చేశాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గార్సియాను వాషింగ్టన్లోని సీటాక్లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్లో ఉంచి విచారిస్తున్నారు. -
స్పామ్ కాల్స్ కు చెక్ పెట్టడానికి కొత్త యాప్..
-
మీకు అలాంటి కాల్స్ వస్తున్నాయా? యూజర్లకు ట్రాయ్ హెచ్చరికలు
న్యూఢిల్లీ: మోసపూరిత కాల్స్పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) హెచ్చరించింది. ‘కొన్ని కంపెనీలు/ఏజెన్సీలు/వ్యక్తులు ట్రాయ్ నుండి కాల్ చేస్తున్నామని, అలాగే సందేశాలు పంపుతూ ప్రజలను/కస్టమర్లను మోసగిస్తున్నట్టు ట్రాయ్ దృష్టికి వచ్చింది. ట్రాయ్ నుండి కాల్ చేస్తున్నట్టు తప్పుగా చెప్పుకునే కాలర్లు నంబర్లను డిస్కనెక్ట్ చేస్తామని బెదిరిస్తారు. ఆధార్ నంబర్లను సిమ్ కార్డ్స్ పొందేందుకు ఉపయోగించారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అట్టి సిమ్లను ఉపయోగిస్తున్నారని కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. మొబైల్ నంబర్ డిస్కనెక్ట్ కాకుండా ఉండాలంటే స్కైప్ వీడియో కాల్ చేయాల్సిందిగా కస్టమర్కు వారు సూచిస్తున్నారు. ట్రాయ్ ఏ వ్యక్తిగత టెలికం కస్టమర్ల మొబైల్ నంబర్ను బ్లాక్ చేయడం లేదా డిస్కనెక్ట్ చేయదు. ట్రాయ్ నుండి వచ్చినట్లు చెప్పుకునే అటువంటి కాల్ లేదా సందేశాన్ని మోసపూరితంగా పరిగణించాలి. అలాంటి కాల్స్ చట్టవిరుద్ధం’ అని ట్రాయ్ స్పష్టం చేసింది. -
బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి: ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని బీజేఎల్పీనేత, గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ తెలిపారు. ఈ ఫోన్లు 15 డిజిట్ నంబర్ నుంచి వస్తున్నాయని, తనను చంపుతామని, నరుకుతామని భయపెట్టిస్తున్నారని బుధవారం మీడియాతో వెల్లడించారు. తనకు ఫోన్ చేసి తన గురించి, తాను ఎక్కడెక్కడికి వెళుతోంది ప్రతీ కదలిక గురించి తెలియజేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ వస్తుండటంతో, తమ ఇద్దరినీ కలిపి చంపుతామని హెచ్చరించినట్లు రాజాసింగ్ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 1.59 గంటలకు +61 9664800063233 నుంచి తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిపారు. దీనిపై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు రాజాసింగ్ వెల్లడించారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్పై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు చదవండి: మజ్లిస్ పార్టీలో ‘చార్మినార్ అసెంబ్లీ సీటు’ చిచ్చు -
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్పై ఇజ్రాయెల్ ఆగ్రహం
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికే 19 రోజులు దాటింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య ఏడువేలు దాటింది. ప్రపంచమంతా ఈ యుద్ధాన్ని గమనిస్తోంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ)లో కూడా ఈ యుద్ధంపై చర్చలు జరుగుతున్నాయి. వీటినడుమ ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై హమాస్ సాగిస్తున్న దారుణాలపై ఆంటోనియో గుటెర్రెస్ ఉపేక్ష వహిస్తున్నట్టు కనిపిస్తున్నారని, అందుకే ఆయన ఐక్యరాజ్యసమితికి నాయకత్వం వహించడానికి తగినవారు కాదని ఎర్డాన్ ఆరోపించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇజ్రాయెల్, యూదు ప్రజలపై దురాగతాలకు తెగబడుతున్న వారిపై సానుభూతి తెలిపేవారితో తాను మాట్లాడటంలో అర్థం లేదని అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, హమాస్ ఎటువంటి కారణం లేకుండా దాడులు చేసి ఉండదని తెలుసుకోవడం కూడా ముఖ్యమేనని అన్నారు. పాలస్తీనా ప్రజలు 56 ఏళ్లుగా దురాక్రమణలను ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ హమాస్ దాడులను సమర్థించలేమని కూడా ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: భారత్ నుంచి గాజాకు 38 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలు! -
'మణిపూర్ సమస్యకు సర్జికల్ స్ట్రైక్ ఒక్కటే మార్గం..'
ఇంఫాల్: మణిపూర్లో వలసదారుల సమస్యను పరిష్కరించాలంటే 'సర్జికల్ స్ట్రైక్ట్' చేయాల్సిందేనని నేషనల్ పీపుల్ పార్టీ నాయకుడు ఎమ్ రామేశ్వర్ సింగ్ వివాదాస్పదంగా మాట్లాడారు. అక్రమంగా వలసదారులు, ఉగ్రవాదులను అణిచివేయడానికి కఠిన చర్యలు చేపట్టాలని ఈ మేరకు స్పందించారు. ప్రస్తుతం ఎన్పీపీ బీజేపీతో కలిసి మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పరించింది. 'మణిపూర్కు కొంతమంది కుకీ ఉగ్రవాదులు సరిహద్దు దాటి వస్తున్నారని హోం మంత్రి చెబుతున్నారు. నేను ఎప్పటినుంచే చెబుతున్నా..ఈ అల్లర్లు బయటి నుంచి ప్రేరణకు గురువుతున్నాయని.. ఈ విషయంలో జాతీయ భద్రత కూడా రాజీపడుతోంది. దేశాన్ని రక్షించుకోవాలి ఒక్క మణిపూర్నే కాదు. ఒక్కసారి సర్జికల్ స్ట్రైక్ చేస్తే సమస్య పరిష్కారం అవుతోంది.' అని ఆయన అన్నారు. 'కుకీ ప్రజలు క్యాంపుల్లో ఉన్నారు. వారి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని కొన్ని ఏజెన్సీలు చెబుతున్నాయి. మరి ఇదే వాస్తవం అయితే.. ఇప్పుడు ఫైరింగ్ ఎక్కడి నుంచి వస్తోంది. వారికి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.' అని రామేశ్వర్ సింగ్ అన్నారు. మయన్మార్ నుంచి వలస వచ్చిన కుకీ ప్రజల బయోమెట్రిక్లను మణిపూర్ ప్రభుత్వం గత నెలలోనే తీసుకుంది. దాదాపు 700 మంది అక్రమ వలసదారులు రాష్ట్రంలోకి చొరబడ్డారని పుకార్ల రావడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మణిపూర్లో మే3 న అల్లర్లు ప్రారంభమయ్యాయి. కుకీ, మైతీ వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఇదీ చదవండి: నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టు.. -
పాకిస్థాన్ నుంచి కాల్స్.. వాట్సాప్ యూజర్లకు ఇండియన్ ఆర్మీ హెచ్చరిక!
భారతదేశంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్స్తో సహా చాలా మంది విద్యార్థులకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ నుంచి కాల్స్, వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన నివేదికల ప్రకారం.. కొన్ని నంబర్ల నుంచి విద్యార్థులకు వస్తున్న కాల్స్, మెసేజ్లలో వారిని సోషల్ మీడియా గ్రూపులలో చేరాలని, సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలని కోరుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్నకు చెందిన గ్యాడ్జెట్స్ నౌ కథనం పేర్కొంది. ఇలా కాల్స్ చేస్తున్నవారు తమను పాఠశాల ఉపాధ్యాయులుగా చెప్పుకొంటూ కొత్త క్లాస్ గ్రూప్లలో చేరాలని విద్యార్థులను కోరుతున్నారు. ఈ నెపంలో వారికి ఓటీపీలను పంపుతున్నారు. తాము ఉపాధ్యాయులేనని నమ్మించేందుకు విద్యార్థులకు తెలిసిన వారి పేర్లు చెబుతున్నారు. ఈ అనుమానాస్పద కాల్స్, మెసేజ్లు వాట్సాప్ ద్వారానే వస్తున్నాయి. ఇలాంటి రెండు అనుమానాస్పద నంబర్లను అధికారులు గుర్తించారు. అవి 8617321715, 9622262167. ఈ కాల్స్ గురించి విద్యార్థులు, సిబ్బందిని ఆర్మీ పబ్లిక్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు హెచ్చరించారు. ఇదీ చదవండి ➤ వాషింగ్టన్ పోస్ట్ సీటీవోగా వినీత్ ఖోస్లా విద్యార్థులు గ్రూపుల్లో చేరిన తర్వాత వారి నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. విద్యార్థుల తండ్రి ఉద్యోగం, ఉపాధ్యాయుల పేర్లు, వారికి సంబంధించిన సమాచారం అడుగుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు దీని గురించి ఉపాధ్యాయులు, విద్యార్థులను చైతన్యపరచాలని ఆర్మీ స్కూళ్ల అధికారులు కోరుతున్నారు. ఆ రెండు నంబర్ల నుంచే కాకుండా ఇతర నంబర్ల నుంచి కూడా కాల్స్, మెసేజ్లు రావచ్చని, అనుమానాస్పద కాల్స్ పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
కామ్రేడ్స్ పేరుతో బెదిరించి రూ.2 కోట్లు డిమాండ్
కైకలూరు: ఓ ఆక్వా రైతును నెల రోజులుగా కామ్రేడ్స్ పేరుతో సెల్ ఫోన్ల ద్వారా బెదిరించి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న డ్రైవర్ల గ్యాంగ్ను ఏలూరు జిల్లా కైకలూరు టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. టౌన్ స్టేషన్లో సీఐ ఆకుల రఘు, ఎస్ఐ జ్యోతిబసు వివరాలు వెల్లడించారు. కైకలూరుకు చెందిన ఐబీకేవీ ప్రసాదరాజు (వజ్రం రాజు) ప్రముఖ ఆక్వా రైతు. నెల రోజులుగా రెండు నంబర్ల నుంచి ‘కామ్రేడ్స్ మాట్లాడుతున్నాం.. మాకు రూ.2 కోట్లు ఇవ్వకపోతే నీతో పాటు నీ కొడుకును చంపేస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు. పదే పదే ఫోన్లు రావడంతో ప్రసాదరాజు ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన సీఐ ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితులను కనిపెట్టారు. మండవల్లి మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తోకల ఏసేబు (36), చిన్నం బారంబాసు (51), హైదరాబాదు, ఏజీ కాలనీ, ఎర్రగడ్డకు చెందిన శీలం హేమంత్కుమార్ (33), హైదరాబాదు, హిమాయత్నగర్కు చెందిన దారా మాణిక్యరావు (44)గా వారిని గుర్తించారు. వీరిలో ఏసేబు, మాణిక్యరావు కైకలూరులో ప్రసాదరాజు దగ్గర గతంలో కారు డ్రైవర్లుగా పనిచేశారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో మాణిక్యరావు హైదరాబాదులోని తన స్నేహితుడు, కారు డ్రైవర్ హేమంత్కుమార్తో రెండు సిమ్ కార్డులు కొనుగోలు చేయించాడు. హైదరాబాదు శివారు రింగురోడ్డు నుంచి ఫోన్లు చేసి ప్రసాదరాజును డబ్బు కోసం బెదిరించారు. నిందితుల్లో ఏసేబు, బారంబాసు, హేమంత్కుమార్ అరెస్టు చేశారు. మాణిక్యరావును పట్టుకోవాల్సి ఉంది. -
బెదిరింపు కాల్స్ రావడంతో అజ్ఞాతంలోకి
కుత్బుల్లాపూర్/బచ్చన్నపేట/అల్వాల్: బెదిరింపు కాల్స్ వచ్చింనందునే తాను అజ్ఞాతంలోకి వెళ్లానని రియల్టర్ ముక్కెర తిరుపతిరెడ్డి తెలిపారు. భూమి వ్యవహారంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తనను కిడ్నాప్ చేసి చంపాలని యత్నించారని, ఎనిమిది సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. ఆరురోజుల క్రితం అదృశ్యమైన ఆయన.. నాటకీయ పరిణామాల మధ్య పేట్బ షీరాబాద్ సమీపంలోని మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో మంగళవారం ప్రత్యక్షమయ్యారు. తనకు ఎదురైన సమస్యలను మేడ్చల్ డీసీపీ సందీప్ గోనె, పేట్బషీ రాబాద్ ఏసీపీ రామలింగరాజులకు వివరించారు. అనంతరం డీసీపీ కార్యాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే ఒత్తిడితో తనకు సాయంచేయడానికి ముందుకురాలేదని చెప్పారు. కేసు రిజిస్టర్ చేయకుండా అల్వాల్ ఎస్హెచ్ఓ గంగాధర్ సమయం వృథా చేశారని ఆరోపించారు. అందుకే అజ్ఞాతంలోకి వెళ్లానని, అయినా మైనంపల్లి అనుచరులు తనను చంపాలని నార్కట్పల్లి వరకు వెంబడించారని, వారి కంటపడకుండా ఆటోలో తప్పించుకున్నానని చెప్పారు. ఆపై విజయవాడ వెళ్లి స్నేహితుల సహాయంతో కొద్దిరోజులు అక్కడున్నానని, ఆపై వైజాగ్ వెళ్లి తలదాచుకున్నానని వివరించారు. హైకోర్టు అడ్వొకేట్ సలహామేరకు డీసీపీ కార్యాలయానికి వచ్చానన్నారు. మైనంపల్లి హను మంతరావుతో తన కుటుంబానికి ప్రాణ హాని ఉందన్నారు. తన భూమిని లాక్కునేందుకు మైనంపల్లి ప్రయత్నిస్తున్నారని, సదరు భూమి తనది కాదని నిరూపిస్తే ఆయనకే గిఫ్ట్గా ఇస్తానని చెప్పారు. అంతా ఫేక్.. తిరుపతిరెడ్డి చెప్పిందంతా ఫేక్ అని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. ‘ఎమ్మెల్యే మైనంపల్లి కాల్ చేశారు, కిడ్నాప్నకు యత్నించారు’ అంటూ తిరుపతిరెడ్డి చేసిన ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతిరెడ్డి సీడీఆర్లో ఎటువంటి కాల్స్ లేవని గుర్తించారు. ల్యాండ్ కేసులో తిరుపతిరెడ్డిపైనే ఓ మహిళ ఫిర్యాదు చేసిందని, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. అయితే... కిడ్నాప్ పేరుతో స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించిన తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులు, మద్దతుదారులపై కేసుల నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని అల్వాల్ సీఐ ఉపేందర్ వెల్లడించారు. -
స్పాం కాల్స్తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్
వాట్సాప్ యూజర్లకు మరో తీపికబురు అందించారు.మార్క్ జుకర్బర్గ్ . ఇటీవలి కాలంలో పలు అప్డేట్స్, కొత్త ఫీచర్లతో వాట్సాప్ యూజర్లను ఆకట్టుకుంటున్న సంస్థ తాజాగా వాట్సాప్లో సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అనే కొత్త గోప్యతా ఫీచర్ను ప్రకటించింది. ఇటీవలి తెలియని నంబర్ల నుండి వచ్చిన కాల్స్పై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేటుగాళ్లకు చెక్ చెప్పేలా ఈ కొత్త ఫీచర్ను తీసుకొచ్చారు. (సుందర్ పిచాయ్: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?) మెటా ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటన ప్రకారం వినియోగదారులకు ఇన్కమింగ్ కాల్లపై ఎక్కువ నియంత్రణ ఇవ్వడం, స్పామ్, స్కామ్స్ బారిన పడకుండా సెక్యూరిటీ అందించడమే ఈ ఫీచర్ లక్ష్యం . సైలెన్స్ అన్నోన్ కాలర్స్తో, వాట్సాప్ యూజర్లు గుర్తు తెలియని వ్యక్తులనుంచి అవాంఛిత కాల్లను ఆటోమేటిక్గా స్క్రీన్ అవుట్ చేయవచ్చని వాట్సాప్ పేర్కొంది. దీంతో మోసాలు బాగా తగ్గుతాయని వెల్లడించింది. (50 ఏళ్ల అనుబంధం: నందన్ నీలేకని కీలక నిర్ణయం) WhatsApp announced silence unknown callers feature and privacy checkup! The ability to mute calls from unknown contacts and a privacy checkup feature are now available to everyone!https://t.co/bdbAXkVGOU pic.twitter.com/NtdTB8B9Aa — WABetaInfo (@WABetaInfo) June 20, 2023 ఎలా పని చేస్తుంది సెటింగ్స్లోని ప్రైవసీ ఆప్షన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో అన్నోన్ నంబర్లనుంచి వచ్చే కాల్స్ ఫోన్లో రింగ్ అవ్వవు. కానీ కాల్ లిస్ట్లో కనిపిస్తాయి. ఫలితంగా ఏదైనా ముఖ్యమైన కాల్స్ విషయంలో వినియోగ దారులు తర్వాత రివ్యూ చేసుకోవచ్చన్నమాట. దీనికి ముందు ప్రైవసీ చెకప్ అనే ఫీచర్ను వాట్సాప్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఇబ్బంది పెట్టే కాల్స్కు చెక్.. టెలికాం సంస్థలకు ట్రాయ్ కీలక ఆదేశాలు!
అవాంఛిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి యూజర్లకు ఉపశమనం కలిగేలా టెలికాం సంస్థలకు టెలికాం నియంత్రణాధికార సంస్థ (ట్రాయ్) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఫోన్ కాల్స్, మెసేజ్లు యూజర్లకు పంపాలంటే వారి అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం 2 నెలల్లోపు ఓ యూనిఫైడ్ డిజిటల్ వేదికను అభివృద్ధి చేయాలని సూచించింది. ముందుగా అడ్వైర్టెజ్మెంట్ మొబైల్ ఫోన్ కాల్స్ అందుకోవడానికి సబ్స్క్రైబర్లు తమ సంసిద్ధతను తెలియజేయాల్సి ఉంటుంది. సంస్థలు కస్టమర్లను సంప్రదించి వారి అంగీకారం మేరకు వాణిజ్య ప్రకటనలు పంపడం ఆరంభిస్తాయంటూ ఓ ప్రకటనలో ట్రాయ్ వివరించింది. ప్రస్తుతం సంస్థలు ప్రమోషనల్ కాల్స్,మెసేజెస్ పంపుతున్నామని, అందుకు వినియోగదారుల అనుమతి కోరేలా ఎలాంటి వ్యవస్థ లేదు. అందుకే 2 నెలల్లో యూనిఫైడ్ డిజిటల్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికాం సంస్థలకు స్పష్టం చేసింది. సమ్మతి కోరుతూ పంపే సందేశాలు ‘127’తో మొదలయ్యేలా కామన్ షార్ట్ కోడ్ను వినియోగించాలని ఆయా సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. చదవండి👉 సూపర్, మైండ్ బ్లోయింగ్.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న టిమ్ కుక్! -
చిర్రెత్తిస్తున్న స్పామ్ కాల్స్
సాక్షి, అమరావతి: అర్జంట్ పనిలో ఉన్నపుడు అదేపనిగా ఫోన్ మోగుతూ ఉంటుంది. అంత పనిలోనూ ఫోన్ ఎత్తితే.. తక్కువ వడ్డీతో లోన్ ఇస్తామనో, తక్కువ రేటుకే ఇంటి స్థలం అంటూనో.. అవతలి నుంచి గొంతు వినిపిస్తుంది. ఆ మాట వినగానే ఫోన్ వినియోగదారుడికి చిర్రెత్తుకొస్తుంది. ఈ స్పామ్ కాల్ సమస్య ప్రపంచ వ్యాప్తంగా చాలా వేధిస్తోంది. యూజర్లను కాల్స్తో పాటు మెసేజ్లు, ఈ–మెయిళ్లతో కూడా చికాకు పెడుతున్నారు. మన దేశంలో ఎక్కువ మందికి రోజులో మూడు అంతకంటే ఎక్కువ స్పామ్ కాల్స్ వస్తున్నట్టు లోకల్ సర్వే నివేదిక చెబుతోంది. ఇలాంటి కాల్స్ను 40 శాతం మంది బ్లాక్/డిస్కనెక్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. కేవలం 2 శాతం మంది మాత్రమే స్పామ్ కాల్స్లో మాట్లాడుతున్నట్టు వివరించింది. ఈ స్పామ్ కాలర్లను నియంత్రించడానికి భారత ప్రభుత్వం పదేపదే కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూనే ఉంది. 2007లో డునాట్డిస్టర్బ్ (డీఎన్డీ) సదుపాయా న్ని తీసుకొచ్చింది. స్పామ్ కాల్స్ను అరికట్టడానికి టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్స్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ (టీసీసీసీపీఆర్) ఫ్రేమ్వర్క్ను 2010లో ట్రాయ్ ప్రవేశపెట్టింది. వీటిని యాక్టివేషన్ చేసుకున్నప్పటికీ 95 శాతం మంది తిరిగి స్పామ్కాల్స్ను ఎదుర్కొన్నట్టు సర్వే గుర్తించింది. స్పామ్బాట్లో రెండో స్థానం.. లండన్కు చెందిన స్పామ్, సైబర్ బెదిరింపులను ట్రాక్ చేసే సంస్థ ‘స్పామ్హాస్ ప్రాజెక్ట్’ నివేదిక ప్రకారం చైనా తర్వాత భారత దేశంలోనే అత్యధికంగా స్పామ్బాట్లను వినియోగిస్తున్నా రు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో స్పామ్ కాల్స్, మెసేజ్లను పంపేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన కంప్యూటర్ ప్రోగ్రామ్ స్పామ్బాట్ను వినియోగిస్తారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు భారత్లో దాదాపు 9.39 లక్షల స్పామ్బాట్లు చురుగ్గా ఉన్నట్టు అంచనా. వీటిని ప్రధానంగా ఫిషింగ్, క్లిక్–ఫ్రాడ్, డీడీఓఎస్ కోసం ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. రష్యాలో అధికంగా స్పామ్ ఈ–మెయిళ్లు స్పామ్, ఫిషింగ్ తాజా నివేదిక ప్రకారం 2022లో రష్యా (29.8 శాతం), చైనా (14శాతం), అమెరికా (10.7 శాతం) స్పామ్ ఈ–మెయిళ్లలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా స్పెయిన్లో 8.8 శాతం, తర్వాత రష్యాలో 7.3 శాతం హానికరమైన ఈ–మెయిళ్లను బ్లాక్ చేశారు. భార త్లో స్పామ్ మెయిళ్ల వాటా 1.8 శాతంగా ఉంటే.. బ్లాక్ చేసిన ఈ–మెయిళ్లు 1.6 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య.. స్పామ్కాల్ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ప్రబలంగా మారింది. అర్జెంటీనాలో ఫోన్ కాల్స్లో అత్యధికంగా 52 శాతం స్పామ్కాల్స్ నమోదవుతున్నట్టు గుర్తి ంచారు. భారత్లో ఆ వాటా 12.7 శాతంగా ఉంది. ఇక ఐర్లాండ్, హంగేరీ, థాయ్లాండ్ దేశాలు స్పామ్ కాల్ ముప్పు చాలా తక్కువగా ఉంది. ఈ దేశాల్లో 10 శాతం లోపే స్పామ్ కాల్స్ నమోదవుతున్నాయి. -
అవాంఛిత కాల్స్పై టెల్కోలతో ట్రాయ్ భేటీ
న్యూఢిల్లీ: అవాంఛిత కాల్స్, మెసేజీలను కట్టడి చేసే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం ’వ్యాపారపరమైన అవాంఛిత కమ్యూనికేషన్ (యూసీసీ) డిటెక్ట్’ విధానాన్ని అభివృద్ధి చేయడం, అమలు చేయడానికి సంబంధించి మార్చి 27న టెల్కోలతో సమావేశం కానుంది. (ఇదీ చదవండి: హిండెన్బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి?) డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ (డీఎల్టీ) ప్లాట్ఫాంపై అవాంఛిత సందేశాలను టెల్కోలు గుర్తించడం, వాటిని పంపే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం, కృత్రిమ మేథ ఆధారిత యాంటీ–ఫిషింగ్ సిస్టమ్ను వినియోగించడం తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు. సాంకేతిక సొల్యూషన్స్, నియంత్రణ, ఆదేశాలు, నిశిత పర్యవేక్షణ వంటి బహుముఖ వ్యూహాలతో అవాంఛిత కాల్స్, మెసేజీల సమస్యను పరిష్కరించే దిశగా టెల్కోలతో సమావేశం ఉండనున్నట్లు ట్రాయ్ పేర్కొంది. (మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం) -
డీజీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ
సాక్షి, హైదరాబాద్: డీజీపీ అంజనీకుమార్కి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. పలు ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు పాకిస్తాన్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ ద్వారా పాకిస్థాన్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి తన ఆచూకీ, కుటుంబ వివరాలు చెబుతూ... హైదరాబాద్లో ఉన్న యాక్టివ్ స్లీపర్ సెల్ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. ప్లస్ 923105017464 నెంబర్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. చదవండి: 11 గంటలు .. 14 ప్రశ్నలు.. కవిత సమాధానాలు పూర్తిగా వీడియో రికార్డింగ్ -
పెద్ద తలనొప్పిగా మారిన స్పామ్ కాల్స్
-
ఢిల్లీలో రేపు అత్యవసర కరోనా సమీక్ష సమావేశం
న్యూఢిల్లీ: పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం కరోనా పరిస్థితిపై గట్టి నిఘా ఉంచాలని, ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైతే తగిన చర్యలు తీసుకునేలా సంసిద్ధం కావాలని అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య శాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, యూఎస్లలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త వేరియంట్లను ట్రాక్ చేసేలా తగిన చర్యలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష భూషణ్ రాష్ట్రాలకు కేంద్ర పాలితన ప్రాంతాలకు కరోనా విషయమై అప్రమత్తంగా ఉండాలంటూ లేఖ రాశారు. ఆ లేఖలో దేశంలో కరోనాకి సంబంధించిన కొత్త వేరియంట్ని గుర్తించగలిగేలా అవసరమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టడం ద్వారా సులభంగా బయటపడేలా మార్గం సుగమం అవుతుందని చెప్పారు. (చదవండి: మొబైల్ ఫోన్ కోసం కన్నతల్లినే దారుణంగా కొట్టిన కసాయి కొడుకు) -
ఇబ్బంది పెట్టే కాల్స్, సందేశాలకు చెక్!
న్యూఢిల్లీ: ఇబ్బంది పెట్టే కాల్స్, ఎస్ఎంఎస్లను గుర్తించేందుకు పలు టెక్నాలజీపై పనిచేస్తున్నట్టు టెలికం రంగ నియంత్రణ సంస్థ ‘ట్రాయ్’ ప్రకటించింది. ఆర్థిక మోసాల నివారణకు ఇతర నియంత్రణ సంస్థలతో కలసి సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపింది. ‘‘అనుచిత వాణిజ్య సంప్రదింపులు లేదా ఇబ్బంది పెట్టే సంప్రదింపులు అన్నవి ప్రజలను ఎక్కువగా అసౌకర్యానికి గురిచేస్తున్నాయి. వారి గోప్యతకు భంగం కలిగిస్తున్నాయి. నమోదు కాని టెలీ మార్కెటర్ల (యూటీఎం)కు వ్యతిరేకంగా అధిక ఫిర్యాదులు వస్తున్నాయి. పలు అనుచిత సందేశాలు కూడా పెరిగాయి. వీటితో పాటు ఇబ్బంది పెట్టే కాల్స్ను కూడా ఒకే రీతిలో చూడడమే కాకుండా, పరిష్కారం కనుగొనాల్సి ఉంది’’అని ట్రాయ్ పేర్కొంది. అనుమతి లేని వాణిజ్య సంప్రదింపులకు చెక్ పెట్టేందుకు పలు భాగస్వామ్య సంస్థలో కలసి చర్యలు తీసుకోనున్నట్టు ట్రాయ్ తెలిపింది. -
వీహెచ్పీ నేత బాలస్వామికి బెదిరింపు కాల్స్.. ఈస్ట్జోన్ డీసీపీకి ఫిర్యాదు
సుల్తాన్బజార్: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) నేత బాలస్వామికి ఆదివారం బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన ఈస్ట్జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాలస్వామి మా ట్లాడుతూ బజరంగ్దళ్ నిరసన కార్యక్రమాలను నిలిపి వేయాలని విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ అయిన తనకు ఆదివారం అర్ధరాత్రి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్లకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడంతో పాటు డీసీపీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడాన్ని వారు సవాలు చేస్తున్నారన్నారు. రకరకాల పేర్లతో ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బజరంగ్దళ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాలను వెంటనే రద్దుచేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చ రించినట్లు బాలస్వామి వెల్లడించారు. వీహెచ్పీ విడుదల చేసిన ప్రెస్నోట్ను కొందరు మార్పిడి చేసి వైరల్ చేశారన్నారు. అందులో వివాదాస్పద వ్యాఖ్యలు జోడించారని ఆరోపించారు. తమ ఫిర్యాదుపై డీసీపీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. -
తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. బాధితులకు తెలియకుండా వారితోనే కాల్ డైవర్షన్ యాక్టివేట్ చేయిస్తున్నారు. ఆపై వారి వాట్సాప్ను తమ అధీనంలోకి తీసుకుని డబ్బు కోరుతూ పలువురికి సందేశాలు పంపుతున్నారు. నగరానికి చెందిన ఓలా గ్రాడ్యుయేట్ బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏసీపీ కేవీఎం ప్రసాద్ కథనం ప్రకారం వివరాలు.. నగరానికి చెందిన బాధితురాలికి మంగళవారం 96––––––44 నుంచి ఫోన్ వచ్చింది. జియో సర్వీస్ సెక్షన్ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తి సర్వీస్లో ఇబ్బందిపై కాల్ సెంటర్కు ఫిర్యాదు చేశారా? అని అడిగాడు. తాను అలాంటి ఫిర్యాదులేమీ చేయలేదని బాధితురాలు చెప్పింది. తమ రికార్డుల్లో ఫిర్యాదు నమోదై ఉందని చెప్పిన కేటుగాడు అది క్లోజ్ కావాలంటే తాను చెప్పినట్లు చేయాలన్నాడు. ]401] తర్వాత 709–––––57 నంబర్ జోడించి రింగ్ చేయాలని చెప్పాడు. అతడి మాటలు నిజమే అని నమ్మిన ఆమె అలానే చేశారు. దీంతో నేరుగా ప్రమేయం లేకుండా తెలియకుండానే ఆమె ఫోన్లో కాల్ డైవర్షన్ యాక్టివేట్ అయింది. ఆమెకు రావాల్సిన కాల్స్ అన్నీ కేటుగాడు సూచించిన 709–––––57 నంబర్కు వెళ్తున్నాయి. అంతటితో ఆగని అతగాడు ఆమె వాట్సాప్ను తన అధీనంలోకి తీసుకోవాలని భావించాడు. దీనికోసం తన ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఈ యాప్ యాక్టివేట్ కావాలంటే అందులో వినియోగదారుడి ఫోన్ నంబర్ పొందుపరచాలి. ఆపై దానికి ఎస్సెమ్మెస్ లేదా కాల్ రూపంలో వచ్చే ఆరు అంకెల యాక్టివేషన్ కోడ్ పొందుపరచాలి. చదవండి: రి‘కార్డ్’ స్థాయిలో క్రెడిట్!.. జాగ్రత్తగా ఉండకపోతే జేబుకు చిల్లే కేటుగాడు తన ఫోన్లోని వాట్సాప్లో బాధితురాలి నంబర్ పొందుపరిచి, కాల్ రూపంలో యాక్టివేషన్ కోడ్ వచ్చే ఆప్షన్ ఎంచుకున్నాడు. దీంతో బాధితురాలి ఫోన్కు రావాల్సిన ఈ కాల్ డైవర్షన్ కారణంగా కేటుగాడు పొందుపరిచిన 709–––––57 నంబర్కు వచ్చింది. దీని ద్వారా ఆ యాప్ యాక్టివేట్ చేసుకోవడంతో బాధితురాలి వాట్సాప్ అతడి అధీనంలోకి వెళ్లిపోయింది. ఆపై అసలు కథ మొదలెట్టిన సైబర్ నేరగాడు ఆమె వాట్సాప్ కాంటాక్ట్స్ లిస్ట్లో ఉన్న అందరికీ సందేశాలు పంపాడు. అత్యవసరంగా రూ.10 వేలు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా బదిలీ చేయాలని వాటిలో సూచించాడు. ఆ మొత్తాన్ని 709–––––57 నంబర్కు పంపాలని కోరాడు. వారి ద్వారా విషయం తెలుసుకున్న బాధితురాలు బుధవారం సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేరగాళ్లు వాడిన ఫోన్ నెంబర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫోన్ కాల్స్ నమ్మవద్దు అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నమ్మవద్దు. సరిచూసుకోకుండా ఆ ఫోన్లు చేసిన వాళ్లు చెప్పినట్లు చేస్తే ఆర్థికంగా నష్టపోవడంతో పాటు వ్యక్తిగత డేటాను కోల్పోవాల్సి వస్తుంది. ]401]తో ఏ నంబర్ కలిపి డయల్ చేస్తామో ఆ నంబర్కు కాల్ డైవర్షన్ యాక్టివేట్ అయిపోతుంది. దీన్ని గమనించిన వాళ్లు డీ యాక్టివేట్ చేసుకోవాలంటే ఫోన్లోని కాల్ సెట్టింగ్స్లోకి వెళ్లాలి. ఈ–బైక్స్ తయారీ సంస్థ అథర్ ఎనర్జీ లిమిటెడ్ పేరుతో నగరవాసికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు డీలర్షిప్ అంటూ ఎర వేశారు. అతడు సరి చూసుకోకుండా నమ్మేయడంతో రూ.12 లక్షలు కాజేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అపరిచితులు చేసే ఫోన్ కాల్స్ వలలో పడకుండా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ -
మనమంతా ఏకమవుదాం..విపక్ష నేతలకు మమతా బెనర్జీ పిలుపు..!!
-
సొంత దేశంలోనే వెల్లువెత్తుతున్న వ్యతిరేకత... సందిగ్ధ స్థితిలో పుతిన్!
A video of the pilot’s message: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న భీకరమైన పోరు నేటికి 19వ రోజుకు చేరుకుంది. ఒకవైపు ఉక్రెయిన్ లొంగిపోమని రష్యా చెబుతున్న తలవంచేదే లేదంటూ యుద్ధం చేస్తోంది. దీంతో రష్యా వైమానిక క్షిపణి దాడులతో బాంబుల వర్షం కురిపించి ఉక్రెయిన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ విధ్వంస సృష్టిస్తోంది. ప్రపంచ దేశాలు సైతం హెచ్చరికలు, ఆంక్షలు జారీ చేసిన తనదైన యుద్ధ వ్యూహంతో చెలరేగిపోతుంది. రష్యా సృష్టించి విధ్వంసకర పోరులో వేలాదిమంది ఉక్రెయిన్ పౌరులను పొట్టన పెట్టుకుంది. మహిళలు, పిల్లలు, ఆస్పత్రుల పై దాడులు జరిపి రాక్షస విధ్వంసానికి బీజం వేసింది. దీంతో రష్యా దేశంలోని ప్రజలే ఆ దేశ అధ్యక్షుడి వ్యవహార తీరుపై ఆగ్రహం చెందడమే కాక నిరసనలు చేశారు. అయినప్పటికీ పుతిన్ తన పంథా మార్చుకోకపోగ సరికొత్త వ్యూహాలతో ఉక్రెయిన్ని దురాక్రమణ చేసేందుకు పావులను కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో రష్యాలోని ఒక పైలెట్ ఉక్రెయిన్పై యుద్ధం నేరమని, దీనిని ఆపేందుకు వివేకవంతమైన పౌరులు ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా పిలుపునిచ్చాడు. ఈ మేరకు అతను విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు తెలివైన పౌరులు తనతో ఏకీభవించడమే కాక ఆపేందుకు తమవంతుగా కృషిచేస్తారని భావిస్తున్నా అని అన్నాడు. అంతేకాదు ప్రయాణికులకు కూడా చప్పట్లతో తమ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఉక్రేనియన్ దౌత్యవేత్త ఒలెగ్జాండర్ షెర్బా మాట్లాడుతూ.. "పైలట్ రష్యాకు చెందిన ఫ్లాగ్ ఎయిర్లైన్ ఏరోఫ్లాట్ అనుబంధ సంస్థ అయిన పోబెడా కోసం పనిచేస్తున్న పైలట్ సాయర్ . అతను టర్కీలోని అంటాల్యకి చేరుకుంటున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశాడు." అని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. A Russian pilot tells passengers that he believes “the war in Ukraine is a crime,” adding “I think each sensible citizens will agree with me and will do everything to make it stop.” Rare to see public opposition to the war given the consequences such a statement will have pic.twitter.com/55h18mWI9U — Pjotr Sauer (@PjotrSauer) March 11, 2022 (చదవండి: మాటలు జాగ్రత్త! తేడా వస్తే అంతే.. ఇలా వచ్చి అలా తలపై కోడిగుడ్డుతో...) -
విద్యార్థులను తీసుకొచ్చే పనిలో ఉన్నాం: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు, ప్రవాసు లను రాష్ట్రానికి తీసుకురావ డానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు మొత్తం 150 కాల్స్ వచ్చాయని, అందులో ఉక్రెయిన్ నుంచి 10–12 కాల్స్ ఉన్నాయన్నారు. ఫోన్ చేసిన వారి వివరాలు నమోదు చేసుకుని, విదేశీ వ్యవహారా లశాఖ, ఉక్రెయిన్లోని భారత ఎంబసీకి అందజేస్తు న్నామని తెలిపారు. విద్యార్థులు, ఇతర ప్రవాసు లను ఉక్రెయిన్ నుంచి సరిహద్దులకు, అక్కడి నుంచి విమానాల ద్వారా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోందన్నారు. విమానాల సమాచారంసహా పూర్తి వివరాలను అక్కడి తెలంగాణ విద్యార్థులకు అందజేస్తున్నామన్నారు. ఇప్ప టికే ఆయా అంశాలపై ఉక్రెయిన్లోని భారత ఎంబసీ ఫస్ట్ సెక్రటరీతో మాట్లాడామని వివరిం చారు. తెలంగాణ విద్యార్థుల్లో ఎక్కువ మంది చదువుతున్న జఫరోజియా వర్సిటీకి సంబం ధించిన భారత ప్రతినిధితోనూ మాట్లాడామన్నారు. -
కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
Ukraine president Volodymyr Zelenskiy: ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాల వేర్పాటువాద నాయకులు శనివారం యుద్ధానికి సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని తూర్పు ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉక్రెనియన్ దళాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. అయితే ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అనూహ్యంగా ఆ ప్రాంతంలో తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. ఈ మేరకు త్రైపాక్షిక బృంద సమావేశంలో రష్యా, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో-ఆపరేషన్ ఇన్ యూరప్ (ఓఎస్ఈ)లతో పాటు ఉక్రెయిన్ కూడా శాంతిచర్చలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. తాము ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు మొగ్గు చూపుతామని అన్నారు. ప్రస్తుతం తాము త్రైపాక్షిక సమావేశానికి మద్దతు ఇవ్వడమే కాక ఘర్షణ లేని పాలనను తక్షణమే అమలు చేస్తామని జెలెన్స్కీ ట్విట్టర్లో పేర్కొన్నారు. (చదవండి: ఉక్రెయిన్ వీడి భారత్కు రండి.. ఎంబసీ కీలక ప్రకటన) -
ఒక్క అంకె తప్పుగా ఇవ్వడంతో ఆ మహిళకు 4,500 మిస్డ్ కాల్స్!
మన ఫోన్కి అదే పనిగా కాల్స్ వస్తేనే చాలా చికాకుగా ఉంటుంది. అలాంటిది అదే పనిగా మిస్డ్ కాల్స్ వస్తే అబ్బా ఏంటిది అని విసుగ్గా అనిపిస్తుంది. కానీ యూకేకి చెందిన ఒక మహిళకి ఏకంగా 4500 మిస్డ్ కాల్స్ వచ్చాయంటా తెలుసా!. (చదవండి: ఏకంగా పామునే హెయిర్ బ్యాండ్గా చుట్టుకుంది!! వైరల్ వీడియో) అసలు విషయంలోకెళ్లితే....యూకేలోని ఉత్తర ఐర్లాండ్లోని బాంగోర్కు చెందిన హెలెన్ ఫోన్ మొత్తం మిస్డ్ కాల్స్తో నిండిపోయింది. అయితే ఆమె బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ని హెల్ప్ లైన్ నెంబర్ అని తప్పగా భావించడంతో ఆమెకు తెగ కాల్స్ వచ్చాయి. ఈ మేరకు ఆమె బిజినెస్ కాంటాక్ట్ నెంబర్కి డిపార్ట్మెంట్ ఫర్ ది ఎకానమీ డెలివరీ చేసిన స్పెండ్ లోకల్ స్కీమ్ ఫోన్ నెంబర్కి ఒక అంకె తేడా ఉండటంతో వారు తప్పుగా హెలెన్ బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ని ఇచ్చారు. దీంతో ఆ లోకల్ స్కీమ్కి చెందిన కస్టమర్లంతా తమ కార్డు బ్యాలెన్స్ చెక్ చేయండి అంటూ హెలెన్స్కి రకరకాలు కాల్స్ చేశారు. అయితే వారిలో కొంతమంది వృద్ధుల ఉంటే వారికి తనవంతుగా సాయం చేసింది. మరికొందరికి అసలు విషయాన్ని వివరించింది కూడా. ఏది ఏమైనా ఎన్ని కాల్స్ రిసీవ్ చేసుకోగలరు ఎవరైనా. చివరికి ఆమె ఇక మిగతా ఏ కాల్ని రిసీవ్ చేసుకోవడం మానేసింది. దీంతో ఆమె ఫోన్ మొత్తం మిస్డ్ కాల్స్తో నిండిపోయింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఫర్ ది ఎకానమీ సదరు మహిళకు క్షమాపణలు చెప్పింది కూడా. (చదవండి: అవిభక్త కవలలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు!!) -
వాట్సాప్ కొత్త ఫీచర్లు, ఫేస్ రికగ్నైజేషన్తో లాక్ వేయొచ్చు..!
వాట్సాప్ రెండు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా వాట్సాప్ అప్డేట్ చేసిన ఈ ఫీచర్లు బాగున్నాయని, యూజర్ల భద్రత పరంగా ఇప్పటి వరకు విడుదలైన ఫీచర్ల కంటే కొత్తగా అప్డేట్ చేసిన ఫీచర్ల ఉపయోగం ఎంతో ఉందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ ఫ్లాష్ కాల్స్, మెసేజ్ లెవల్ రిపోర్టింగ్ ఫీచర్లను విడుదల చేసింది. యూజర్ల సెక్యూరిటీ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తో ఫ్లాష్ కాల్స్ ఫీచర్ను విడుదల చేసింది. వాట్సాప్ ఇన్ స్టాల్ సమయంలో జరిగే ప్రాసెస్లో ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ తప్పని సరి చేసింది. అంతేకాదు కాంటాక్ట్లను బ్లాక్ చేయడం, ఎవరితో ఏం షేర్ చేయాలనే దానిని కంట్రోల్ చేయడం, అవసరమైన వాట్సాప్ మెసేజ్లను సీక్రెట్గా స్టోర్ చేయడం, టచ్ ఐడి లేదా ఫేస్ ఐడితో యాప్ను లాక్ చేయడం వంటి సెక్యూరిటీ సౌకర్యాలు కొత్తగా తెచ్చిన ఫీచర్లలలో ఉన్నాయని వాట్సాప్ తన బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. అంతే కాదు ఈ ఫ్లాష్ కాల్ ఫీచర్ లో యూజర్లు కొత్త ఫోన్లో వాట్సాప్ను ఇన్స్టాల్ చేసే సమయంలో ఎస్ఎంస్ వెరిఫికేషన్, ఆటోమేటెడ్ కాల్ ద్వారా ఫోన్ నంబర్ను యాక్సెప్ట్ చేసే ఆప్షన్ కోసం ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. మరో మెసేజ్ లెవల్ రిపోర్టింగ్ ఫీచర్ యూజర్ల ప్రొఫైల్ ఫోటో, చివరిగా చూసిన యూజర్లు ఎవరు, చూసిన వారిలో అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా? ఉంటే వారిని నియంత్రించవచ్చు. అవసరం అనుకుంటే బ్లాక్ చేయొచ్చు. అంతేకాదు సెక్యూరిటీ దృష్ట్యా రెండు సార్లు వెరిఫికేషన్ కూడా చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. మొత్తం వాట్సాప్ చాట్కోసం ప్రైవసీ సెట్టింగ్ను తెచ్చింది. -
ఇకపై అలాంటి ఫోన్ కాల్స్ చేస్తే, భారీ జరిమానా: ట్రాయ్
సాక్షి, న్యూఢిల్లీ: అవాంఛనీయ కాల్స్, సందేశాలను నియంత్రించేందుకు కేంద్ర సర్కారు నిబంధనలను కఠినతరం చేసింది. రూ.10,000 వరకు జరిమానా విధింపుతోపాటు, టెలీమార్కెట్లకు కనెక్షన్ల తొలగింపు కూడా ఇందులో భాగంగా ఉండనుంది. మళ్లి మళ్లీ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదని ట్రాయ్ హెచ్చరించింది. 50 ఉల్లంఘనల తరువాత టెలిమార్కెటర్లు చేసే ప్రతీకాల్, లేదా ఎస్ఎంఎస్కు రూ. 10వేల దాకా పెనాల్టీ ఆ తరువాత కూడా ఉల్లంఘన కొనసాగితే, సంబంధిత ఐడీ, అడ్రస్ ప్రూఫ్లను రెండేళ్లపాటు బ్లాక్ చేయనుంది. ‘‘టెలికం చందాదారులు ప్రమోషనల్ ఎస్ఎంఎస్లు రాకుండా ఉండేందుకు ‘ఎస్ఎంఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 1909’కు పంపించాలి. దీంతో లావాదేవీల సమాచారం మినహా అన్ని రకాల ప్రమోషనల్ ఎస్ఎంఎస్లు రాకుండా బ్లాక్ చేయడం జరుగుతుంది’’అని టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) తన నోటీస్లో పేర్కొంది. కేంద్ర స్థాయిలో టెలికం శాఖ ఒక డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ను (డీఐయూ) ఏర్పాటు చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే, లైసెన్స్డ్ సర్వీస్ ప్రాంతంలోని క్షేత్రస్థాయి యూనిట్లలో టెలికం అనలైసిస్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ (టీఏఎఫ్సీవోపీ)ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నాయి. జరిమానాలు.. ట్రాయ్ విడుదల చేసిన నోటీస్ ప్రకారం.. రిజిస్టర్డ్ టెలీ మార్కెటర్ నుంచి అవాంఛనీయ వాణిజ్య సమాచారం వినియోగదారులకు వెళితే పలు రకాల పెనాల్టీలను విధించనున్నారు. తొలుత రూ.1,000 జరిమానాతో సరిపెట్టి.. ఆ తర్వాత నిబంధన ఉల్లంఘనకు రూ.5,000 చొప్పున జరిమానా విధించడంతోపాటు.. కనెక్షన్ రద్దు చేయడానికి సంబంధించి హెచ్చరిక జారీ అవుతుంది. మూడో ఉల్లంఘనను గుర్తిస్తే రూ.10,000 జరిమానాతోపాటు కనెక్షన్ను కూడా రద్దు చేయనున్నారు. ఇక నమోదు చేసుకోని టెలీమార్కెటర్ నుంచి అవాంఛనీయ కాల్ లేదా సందేశం వస్తే.. సంబంధిత టెలికం కనెక్షన్ను గుర్తిస్తారు. రోజుకు 20 కాల్స్, 20ఎస్ఎంఎస్ల పరిమితి అమల్లోకి వస్తుంది. గుర్తింపు ధ్రువీకరణ పూర్తయ్యే వరకూ డేటా వినియోగానికి అవకాశం ఉండదు. సిమ్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ గైడ్లైన్స్ 2018 కింద అమలు చేయాల్సి ఉంటుందని ట్రాయ్ పేర్కొంది. -
‘మీ భార్యకు ఎలా ఉంది ఉద్దవ్జీ?’ ప్రధాని ఆరా
ముంబై: కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖుల ఆరోగ్య వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీస్తున్నారు. వారి ఆరోగ్యం, అందుతున్న వైద్యం, యోగక్షేమాలు తదితర అంశాలపై సంబంధీకులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కరోనా బారినపడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే ఆరోగ్యం గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. మార్చి 23వ తేదీన ఆమె కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తీవ్రమైన దగ్గు ఉండడంతో ఆమె ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఆమె ఆరోగ్య విషయాలు ఆరా తీశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు. ఆమె దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. దీంతో పాటు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ ఆరోగ్య పరిస్థితిని ప్రధాని మోదీ తెలుసుకున్నారు. దేవెగౌడ, ఆయన భార్య చెన్నమ్మకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు కుటుంబసభ్యులతో కలిసి హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నట్లు మోదీ బుధవారం ట్వీట్ చేశారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. వారి ఆరోగ్యంపై కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రత్యేక దృష్టి పెట్టారు. వారికి చికిత్స అందిస్తున్న వైద్యులతో సంప్రదింపులు చేస్తున్నట్లు యడియూరప్ప తెలిపారు. చదవండి: అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి సతీమణి -
చంపేస్తాం! బాలీవుడ్ భామకు బెదిరింపు కాల్స్..
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బ్యూటీ భామ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ప్రస్తుతం భాయిజాన్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం వచ్చే రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఓ వైపు చేతినిండా సినిమాలతోపాటు మరోవైపు ఫోటో షూట్లతో అభిమానులను ఊర్రూతలుగిస్తోంది దిశా. ఆమె ఏ డ్రెస్ ధరించిన తన అందాలతో కుర్రకారులను మత్తెక్కిస్తుంటుంది. ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో తరుచూగా పోస్టు చేస్తుంటుంది. అలా లైఫ్ను హ్యపీగా లీడ్ చేస్తున్నఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రమాదంలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. చదవండి: నాలుగు నెలల్లో సలార్ పూర్తి దిశాపటానీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. హీరోయిన్కు ఫోన్ చేసి తనను చంపేస్తామని భయపెడుతున్నట్లు సమాచారం. అంతేగాక పోలీస్ స్టేషన్లకు కూడా కాల్స్ చేసి మీ అమ్మాయి(దిశా పటానీ) ఇంకా ఎవరూ రక్షించలేరని బెదిరిస్తున్నారట. ఈ కాల్స్ పాకిస్తాన్ నుంచి వస్తున్నట్లు, కాల్ చేసిన వ్యక్తి దిశాను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ వల్ల దిశా ప్రాణానికి ప్రమాదం ఉన్నట్లు సమాచారం. అయితే బెదిరింపు కాల్స్పై పోలీసులు దృష్టి పెట్టినట్లు, దీని వెనుక ఉన్న సూత్రధారిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు కూడా తెలుస్తోంది. చదవండి: మహేశ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనా.. వీడియో వైరల్ -
వాట్సాప్ యూకర్లకు షాకింగ్ న్యూస్
-
వాట్సాప్లో భద్రత ఉత్తదే!
సాక్షి, అమరావతి: వాట్సాప్ వాడకం అత్యంత భద్రమైనదని, ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ వల్ల వినియోగదారుల డేటాను తస్కరించడం కానీ కాల్స్ను ట్యాప్ చేయడం కానీ సాధ్యం కాదనే మాటల్లో వాస్తవం లేదని వెల్లడైంది. తమ మెసేజింగ్ యాప్ వైరస్ బారిన పడినట్లు వాట్సాప్ యాజమాన్యం అంగీకరించింది. ప్రస్తుతం లోపాలను సవరించామని, అయితే వాట్సాప్ వినియోగదారులు వెంటనే తమ యాప్ను అప్డేట్ చేసుకోవాలని కోరింది. నిఘా పరికరాలుగా ఫోన్ కెమెరాలు మిస్డ్ వాయిస్ కాల్స్ ద్వారా ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలోకి వైరస్ చొరబడేలా ఓ స్పైవేర్ను ఇజ్రాయెల్కు చెందిన సంస్థ అభివృద్ధి చేసింది. వాట్సాప్ వినియోగదారుడు వాయిస్ కాల్ను లిఫ్ట్ చేయకపోయినా కూడా వైరస్ ఫోన్ లోపలికి ప్రవేశించేలా ఈ మాల్వేర్ను రూపొందించారు. ఒకసారి ఈ వైరస్ మొబైల్లోకి ప్రవేశిస్తే స్పైవేర్ స్మార్ట్ఫోన్ను హ్యాక్ చేయడంతోపాటు ఫోన్ కెమెరాలను నియంత్రించి నిఘా పరికరాలుగా మార్చేసి వాయిస్, వీడియో కాల్ను ట్యాప్ చేసే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్వో గ్రూప్ అనే అడ్వాన్స్డ్ సైబర్ యాక్టర్ దీన్ని రూపొందించింది. లోపాలను సవరించినట్లు ప్రకటన ఇజ్రాయిల్ ప్రభుత్వం మానవ హక్కుల సంఘాలు, జర్నలిస్టులు, న్యాయవాదులు లాంటి వారిపై నిఘా పెట్టాలనుకున్నప్పుడు ఎన్ఎస్వో సంస్థ ఇలాంటి పోగ్రాంలను సిద్ధం చేస్తుంది. ఇలా రూపొందించిన స్పైవేర్ను ఎంపిక చేసిన తమ వినియోగదారుల ఫోన్లలో ప్రవేశపెట్టినట్లు వాట్సప్ సంస్థే అంగీకరించింది. వాట్సప్ వాయిస్ కాలింగ్ ద్వారా వచ్చే మిస్డ్ కాల్స్తో ఈ మాల్వేర్ ఫోన్లోకి చొరబడినట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. మే మొదటి వారంలోనే ఈ మాల్వేర్ను గుర్తించామని, వాయిస్ కాలింగ్కు అదనపు భద్రతా ఫీచర్లు సిద్ధం చేస్తుండగా తమ సిబ్బంది ఈ లోపాన్ని గుర్తించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ లోపాన్ని గుర్తించి సరిచేసినట్లు ప్రకటించింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్ వాట్సప్ అప్డేట్ చేసుకోవాలని సూచన తమ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 150 కోట్ల మంది వాట్సప్ వాడకందారులు యాప్ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని యాజమాన్యం కోరింది. ఈ మాల్వేర్ వల్ల ఎంతమంది వినియోగదారులకు నష్టం జరిగిందన్న విషయంపై వాట్సప్ స్పందించలేదు. 2014లో వాట్సప్ను ఫేస్బుక్ టేకోవర్ చేసినప్పటి నుంచి డేటా భద్రతపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. డేటా దుర్వినియోగంపై ఫేస్బుక్ తరచూ ఆరోపణలు ఎదుర్కొంటుండటమే దీనికి ప్రధాన కారణం. -
సిమ్ లేకుండా కాల్స్ చేసుకోవచ్చు!
న్యూఢిల్లీ : వాట్సాప్, మెసెంజర్ బాటలో.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా వినూత్న అవకాశాన్ని తన కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ దేశీయ తొలి టెలిఫోనీ సర్వీసును ఆవిష్కరించింది. ఈ సర్వీసులతో తాను అందించే మొబైల్ యాప్ ద్వారా భారత్లో ఉన్న ఏ టెలిఫోన్ నెంబర్కైనా డయల్ చేసుకునేలా అవకాశం కల్పిస్తుంది. దీని కోసం ‘వింగ్స్’ అనే మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇక బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు కంపెనీ మొబైల్ యాప్ ‘వింగ్స్’ను వాడుతూ.. దేశంలో ఉన్న ఏ ఫోన్ నెంబర్కైనా కాల్స్ చేసుకోవచ్చు. ‘ప్రస్తుతమున్న పోటీకర వాతావరణంలో, బీఎస్ఎన్ఎల్ మార్కెట్ షేరును పెంచుకోవడం మెచ్చుకోదగినదే. సిమ్ లేకుండా కాల్స్ చేసుకునేలా యూజర్లకు వీలుకల్పిస్తూ.. ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీసులు తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు’ అని ఈ సర్వీసులను లాంచ్ చేసిన అనంతరం టెలికాం మంత్రి మనోజ్ సిన్హా అన్నారు. ఈ సర్వీసులను వాడుతూ.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వై-ఫై లేదా మరే ఇతర సర్వీసు ప్రొవైడర్ ద్వారానైనా ఇతర నెట్వర్క్కు కాల్స్ చేసుకోవచ్చు. వాలిడ్ టెలికాం లైసెన్స్ కలిగి ఉన్న టెలికాం కంపెనీలు వై-ఫై కనెక్షన్ను వాడుతూ యాప్ ఆధారిత కాలింగ్ సర్వీసు అందించవచ్చని గతంలోనే టెలికాం కమిషన్ అనుమతి ఇచ్చింది. మామూలు కాల్స్కు ఏ మాదిరి ఛార్జీలు అమలవుతున్నాయో అవే ఛార్జీలను టెలికాం ఆపరేటర్లు విధించాలని కూడా ఆదేశించింది . ఈ వారం ప్రారంభంలో ఈ సర్వీసుల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతాయి. జూలై 25 నుంచి ఈ సర్వీసులు యాక్టివేట్ అవుతాయి. మరోవైపు బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు అందించే డేటా ప్రయోజనాలను కూడా సమీక్షిస్తోంది. తాజాగా రూ.444 ప్యాక్ను బీఎస్ఎన్ఎల్ అప్గ్రేడ్ చేసింది. దీని కింద అంతకముందు రోజుకు 4 జీబీ డేటా లభిస్తే, ప్రస్తుతం రోజుకు 6 జీబీ డేటా అందివ్వనున్నట్టు తెలిపింది. రోజుకు 6 జీబీ డేటా మాత్రమే కాక, అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాల్స్ను కూడా 60రోజుల పాటు అందించనుంది. -
హ్యాకర్ల కొత్త ఎత్తుగడలు.. స్టార్టప్సే లక్ష్యం..
♦ డేటా లీక్ అయ్యిందంటూ హెచ్చరికలు ♦ అటుపై సాయమందిస్తామంటూ హామీ ♦ చివరకు సేవల పేరుతో ఆదాయం ముంబై: మోసపూరిత ఈ–మెయిల్స్/కాల్స్.. బ్యాంక్ అకౌంట్ల వివరాలు తెలుసుకోవడం.. క్రెడిట్ కార్డుల సమాచారం కొట్టేయడం.. ఇలా వివిధ మార్గాల్లో హ్యాకర్లు డబ్బు సంపాదిస్తున్నారు. ఇప్పుడు వీరు స్టార్టప్స్పై పడుతున్నారు. వీటిని భయపెట్టి ఆదాయం పొందాలని చూస్తున్నారు. అదెలాగంటే.. దేశీ క్రెడిట్ స్కోర్ మేనేజ్మెంట్ కంపెనీ ‘క్రెడిట్సేవ’ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీని సర్వర్లో నిక్షిప్తమై ఉన్న దాదాపు 40,000 మంది రుణగ్రహీతల వివరాలు లీక్ అయ్యాయని ఒక యూరోపియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ దీన్ని హెచ్చరించింది. జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు సాయమందిస్తామని హామీ కూడా ఇచ్చింది. అలర్ట్ అయిన క్రెడిట్సేవ సంస్థ వ్యవస్థలో ఎక్కడ లోపాలున్నాయో, పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. కానీ లీక్కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. దీంతో డేటా భద్రంగానే ఉందని, ఎవరి చేతుల్లోకి వెళ్లలేదని ఊపిరి పీల్చుకుంది. అయితే లండన్కు చెందిన ఒక బ్లాగర్ కూడా డేటా లీక్ జరిగిందని కథనం వడ్డించేసింది. కానీ క్రెడిట్సేవ సీఈవో సత్య విష్ణుభొట్ల మాత్రం డేటా లీక్ అవ్వలేదని, భద్రంగానే ఉందని స్పష్టం చేశారు. సమస్య సృష్టించేదీ...సొల్యూషన్ ఇచ్చేదీ వారే... ఇక్కడ మరొక కొత్త సమస్య ఉత్పన్నమౌతోంది. కొందరు నిష్ణాతులైన సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఇండియన్ కంపెనీలను భయపెడుతున్నారు. వీరు ఎలాంటి వారంటే వ్యాపారం కోసం సిస్టమ్ హ్యాక్ చేయడానికి కూడా వెనకాడరు. అంటే వారే సమస్యను సృష్టించి, దానికి సొల్యూషన్ను అందిస్తారు. స్టార్టప్స్ ఈ ఉదాహరణను ఒక హెచ్చరిక లాగా తీసుకోవాలని స్థానిక సెక్యూరిటీ సంస్థ ఒకటి హెచ్చరించింది. ఫిన్టెక్ విభాగంలో బిజినెస్కు సంబంధించి సెక్యూరిటీ అనేది ముఖ్యమైన అంశమని తెలిపింది. స్టార్టప్స్ ఎప్పుడూ వ్యాపార విస్తరణతో పాటు సైబర్ దాడులు, డేటా భద్రత వంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది. స్టార్టప్ను నడిపించడం కష్టమైన పనే. మీ సిస్టమ్లో లోపాలున్నాయని, సమస్య పరిష్కారానికి మా సేవలు ఉపయోగపడతాయని కొందరు సెక్యూరిటీ కన్సల్టెంట్స్ మీ వద్దకు వస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో స్టార్టప్ నిర్వహణ మరింత కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీరి సేవలు తీసుకోవడానికి మనం నిరాకరిస్తే.. డేటా లీక్ అయ్యిందంటూ వీరు మీడియాకు తెలియజేస్తారు. మా పోర్ట్ఫోలియోలోని ఒక కంపెనీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మీ వరకు కూడా ఈ సమస్య రావొచ్చు. తస్మాత్ జాగ్రత్త. – స్టీవెన్ టంగ్ , బూట్క్యాంప్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్, క్రెడిట్సేవ ఇన్వెస్టర్ -
జార్ఖండ్లో పెట్టుబడులు పెట్టండి-రతన్ టాటా
జార్ఖండ్ లోపెట్టుబడులు పెట్టాల్సిందిగా తోటి పారిశ్రామిక వేత్తలకు టాటా గ్రూపు అధినేత పిలుపునిచ్చారు. జంషెడ్ పూర్ లోని వ్యాపార ప్రారంభ రోజుల గుర్తుచేసుకున్న టాటా గ్రూప్ మూలపురుషుడు రతన్ టాటా జార్ఖండ్ రాష్ట్రంలో అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ పొటెన్షియాలిటీని అందిపుచ్చుకోవాలని దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్లకు విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ 'సమ్మిట్ 2017 లో ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రతన్ టాటా వద్ద మాట్లాడుతూ దేశంలో వ్యాపారానికి గొప్ప అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో న్యూ ఇండియాగాఅవతరించబోతోందన్నారు. అయితే కేవలం పారిశ్రామికంగా అభివృద్ది చెందిన ప్రాంతాలపైనే దృష్టిపెడితే సరిపోదని, ఈ ప్రగతిని మరింత విస్తరించాల్సినఅవసరం ఉందన్నారు. ఖనిజ సంపదలతో అలరారుతున్న సహజ సౌందర్యంతో విలసిల్లే ప్రదేశం జార్ఖండ్ లో పెట్టుబడులపై దృష్టిపెట్టాలని టాటా చెప్పారు. జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించిందనీ ఆ దిశగా పురోగమిస్తూ ఇతర రాష్ట్రాలకు దీటుగా నిలుస్తోందని చెప్పారు. ఈ క్రమంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడం చాలా లాభదాయకన్నారు. కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటూ తన సమకాలీన దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను కోరారు. కాగా భారతదేశంలో అతిపెద్ద ప్రైవేటు కార్పొరేట్ గ్రూప్ టాటా గ్రూప్ . ప్రపంచంలోని బాగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలలో ఒకటిగా గుర్తించబడిన టాటా స్టీల్ ప్రస్తానం జంషెడ్ పూర్ లో మొదలైన సంగతి తెలిసిందే. -
బీఎస్ఎన్ఎల్ న్యూ ఇయర్ ఆఫర్ అదుర్స్!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ ఎల్ మరో సరికొత్త ఆఫర్ తో నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. శనివారం వెల్లడించిన ఈ మంత్లీ ప్లాన్ తో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో ఎఫెక్ట్ తో దాదాపు అన్ని టెలికం కంపెనీలో ఫ్రీ కాలింగ్ వార్ లోకి ఎంటర్ కావడంతో ఈ కోవలోకి బీఎస్ఎన్ఎల్ కూడా చేరిపోయింది. అన్ లిమిడెట్ కాలింగ్ అంటూ ఓ సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు రూ.144 లకే అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ శ్రీ వాస్తవ తెలిపారు. రూ.144 ల మంత్లీ ప్లాన్ లో (లోకల్ అండ్ ఎస్టీడీ) ఏ నెట్ వర్క్ కైనా ఉచిత కాలింగ్ సౌకర్యంతోపాటు 300 ఎంబీ డాటాను ఫ్రీగా అందిస్తోంది. ఈ ప్లాన్ ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. మరోవైపు దేశ్యాప్తంగా 4400 వైఫై హాట్ స్పాట్లను లాంచ్ చేసింది చెన్నైలోని మహాబలిపురం కూడా త్వరలో లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. హాట్ స్పాట్ ల విస్తరణే తమ తదుపరి లక్ష్యమన్నారు. మరుసటి సంవత్సరం నాటికి సుమారు 40 వేల హాట్ స్పాట్ లను నెలకొల్పనున్నట్టు అనపమ్ శ్రీవాప్తవ్ చెప్పారు. -
ట్రేడింగ్ టిప్స్తో జాగ్రత్త: సెబీ హెచ్చరిక
న్యూఢిల్లీ: షేర్లకు సంబంధించి అవాంఛిత ఎస్ఎంఎస్లు, కాల్స్ ఆధారంగా ట్రేడింగ్ చేసి నష్టపోవద్దని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ... ప్రజలకు సూచించింది. తమ వద్ద నమోదైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్, రీసెర్చ్అనలిస్ట్ల సలహాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటూ... ఆయా సంస్థల, వ్యక్తుల వివరాలు తమ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. తమ వద్ద నమోదు కాని సంస్థలు.. ఇన్వెస్టర్లనుతప్పుదోవ పట్టించేలా ఎస్ఎంఎస్లు, కాల్స్ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ... ఇలాంటి 15 సంస్థలపై చర్యలు తీసుకున్నామని సెబీ తెలిపింది. మనీవరల్డ్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ, గ్లోబల్ మౌంట్ మనీరీసెర్చ్ అండ్ అడ్వైజరీ, ఆరంజ్ రిచ్ ఫైనాన్షియల్స్, గోక్యాపిటల్, క్యాపిటల్వయా గ్లోబల్ రీసెర్చ్లు తమ వద్ద నమోదు కాకుండానే ఇన్వెస్ట్మెంట్ సలహాలిచ్చాయని సెబీ పేర్కొంది -
మరోసారి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
కోలకత్తా: వివాదాస్పద బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ తర్వాత దేశంలో జనాభా నియంత్రణకు మాస్ స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టాలని మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సహాయమంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపు నివ్వడం కలకలం రేపింది. తన పార్లమెంటరీ నియోజకవర్గం నవాడా జరిగిన ఒక కార్యక్రమంలో సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జనాభా ను నియంత్రించడానికి స్టెరిలైజేషన్ కు పిలుపునిచ్చారు. నోట్ బందీ తర్వాత నస్ బందీ కార్యక్రమం చేపట్టాలన్నారు. దేశంలో స్టెరిలైజేషన్ కోసం చట్టాలను చేయాల్సిన అవసరం ఉందని గిరిరాజ్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ ,మలేషియా లో ఇలాంటి జనాభా నియంత్రణ చట్టాలు ఉన్నాయన్నారు. కనుక ఇలాంటి చట్టాలు భారతదేశంలో కూడా ఉంటే తప్పేమీ లేదని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను బీజీపీ కొట్టివేసింది. ఇది ఆయన వ్యక్తి గత అభిప్రాయమనీ, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం ఏదీ లేదని రాహుల్ సిన్హా వివరణ ఇచ్చారు. దేశంలో జనాభా పెరుగుతోంది , ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ అలాంటి ఎజెండా ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే జనాభా నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు, ప్రకటనలు రావాలన్నారు. దీనికి రాజకీయ పార్టీలు సహా ఇతర స్వచ్చంద సంస్థలు అందరూ కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో (1975-1977) ప్రజలు పడ్డ ఇబ్బందును రాహుల్ సింగ్ గుర్తు చేశారు. ఆ సమయంలో నిర్బంధ స్టెరిలైజేషన్ తో ప్రజలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. కాగా గిరిరాజ్ సింగ్ పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశం లో జనాభా నియంత్రణ ఒక సామూహిక స్టెరిలైజేషన్ పిలుపునిచ్చారు. ఇంతకుముందు మరో బీజేపీ సంజయ్ పాశ్వాన్ మాస్ స్టెరిలైజేషన్ చేయాలని వ్యాఖ్యానించారు. విమర్శలకు, వివాదాలకు ఎప్పుడూ తెరతీసే గిరిరాజ్ సింగ్ జనాభా విధానంలో మార్పులు చేయాలని, ముస్లిం కుటుంబాలకు ఇద్దరకుమించిన పిల్లలుండకూదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
డయల్ 100కు 2351 కాల్స్
వివరాలు తెలిపిన రూరల్ ఎస్పీ కె. నారాయణ్నాయక్ పట్నంబజారు: గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో డయల్ 100కు మంచి స్పందన లభిస్తోందని రూరల్ ఎస్పీ కె. నారాయణ్నాయక్ చెప్పారు. ప్రజలు వారి సమస్యలపై ఫోన్ చేసిన తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవటంలో అధికారులు, సిబ్బంది పనితీరును అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గత సెప్టెంబరు నెలలో 2351 కాల్స్ వచ్చాయన్నారు. వాటిలో మనుషులపై దాడులకు సంబంధించి 451, స్త్రీలను ఇబ్బందులు, వేధింపులకు గురి చేసిన ఫోన్ కాల్స్ 221, రోడ్డు ప్రమదాలకు చెందినవి 901, ఆత్మహత్యకు చెందినవి 42, చోరీలకు సంబంధించి 29, ప్రజాశాంతికి భంగం ఇతర ఘర్షణలు, తగదాలు, గొడవలు, చిన్నపాటి వివాదాలకు చెందినవి 707 ఫోన్కాల్స్ వచ్చాయన్నారు. మొత్తం వచ్చిన2351 కాల్స్లో 48 కాల్స్ౖపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఆయా సబ్డివిజన్ల పరిధిలోని డీఎస్పీలతో పాటు, ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేయిస్తున్నామని తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే అధికారులు, సిబ్బందిని ఘటనా స్థలానికి పంపటంతో పాటు అక్కడి స్థితిగతులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. చిన్నపాటి కేసులను స్టేషన్ ఎస్హెచ్వోల ద్వారా అప్పటికప్పుడే పరిష్కరిచంటంతో పాటు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని వివరించారు. డయల్ 100కు తప్పుడు సమాచారం ఇచ్చినా, ఆకతాయి ఫోన్కాల్స్ చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. -
సన్నద్ధత లేకే కాల్ డ్రాప్స్
న్యూఢిల్లీ: తమ నెట్వర్క్ నుంచి వెళ్లే కాల్స్కు తగినన్ని ఇంటర్ కనెక్ట్ పాయింట్లు కల్పించడం లేదంటూ జియో చేస్తున్న ఆరోపణలకు ఎయిర్టెల్ మంగళవారం గట్టిగా సమాధానమిచ్చింది. తప్పంతా జియోవైపే ఉందని ఆరోపణలను తిప్పికొట్టింది. నెట్వర్క్ కనెక్టివిటీ, కాల్స్ డ్రాప్స్ అంశాలు జియో పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవడం, తగిన మేర పరీక్షలు నిర్వహించకపోవడం, కార్యకలాపాల ప్రారంభానికి ముందే భారీగా కస్టమర్లను చేర్చుకోవడం వల్ల ఏర్పడినవేనని ఎయిర్టెల్ పేర్కొంది. ఈ మేరకు జియోకు ఓ లేఖ రాసింది. -
భారత్లోనూ విమానాల్లో వైఫై..
♦ కాల్స్కూ అవకాశం.. వచ్చే నెల నుంచి ప్రారంభం ♦ తుది ఆమోదమే తరువాయి న్యూఢిల్లీ : విమానాల్లో సెల్ఫోన్ సేవలకు లైన్ క్లియర్ అవనుంది. రానున్న పది రోజుల్లో ఈ దిశగా సానుకూల నిర్ణయం వెలువడనుందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు. విమానాల్లో వైఫై అనుమతించే అంశంపై పౌర విమానయాన, టెలికం, హోం శాఖలు దృష్టి సారించాయని ఆయన చెప్పారు. ఇందుకు కేబినెట్ అనుమతి అవసరం పడకపోవచ్చన్నారు. డేటా వినియోగానికి అనుమతించినప్పుడు కాల్స్ చేసుకునేందుకు కూడా అనుమతించవచ్చన్నారు. విమానాల్లో వైఫై సేవల ప్రతిపాదన కేంద్రం ముందు ఎప్పటి నుంచో ఉంది. భద్రతాపరమైన అంశాల దృష్ట్యా ఇంతవరకు ఓ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో డేటా, కాల్స్ను భద్రతా సంస్థలు పర్యవేక్షించడం వంటి అంశాలపై చర్చ జరిగిందని చౌబే వెల్లడించారు. అవసరమైతే భద్రతా సంస్థలు డేటా, కాల్స్ వివరాలు పొందవచ్చని, ట్రాక్ కూడా చేయవచ్చని చెప్పారు. అదనపు ఆదాయం.. ప్రస్తుతం దేశీయంగా అన్ని విమానాల్లో వైఫై సర్వీసులకు అనుమతి లేదు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎయిర్లైన్స్ సంస్థలు తమ ప్రయాణికులకు ఈ సేవలు అందిస్తున్నాయి. భారత గగనతలంలోకి ప్రవేశించగానే ఆ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇవి తొలుత కొంత సమయం పాటు ఉచితంగా వైఫై అందిస్తూ... ఆ పై వినియోగానికి చార్జీ వసూలు చేస్తున్నాయి. కాగా, దేశీయంగానూ వైఫై సేవలకు అనుమతి లభిస్తే... ఇక్కడి ఎయిర్లైన్ సంస్థలకు అదనపు ఆదాయం సమకూరనుంది. -
బీఎస్ఎన్ఎల్ ఉచిత కాల్స్..
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ ల్యాండ్లైన్ ఫోన్ల నుంచి సోమవారం (ఆగస్ట్ 15) కూడా అన్ని రకాల మొబైల్, ల్యాండ్లైన్ నంబర్లకు ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అనంతరం ఈ అవకాశం ప్రతీ ఆదివారం కూడా అందుబాటులో ఉంటుందని టెలికం శాఖ మంత్రి మనోజ్సిన్హా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల్లోపు ఏ నెట్వర్క్కు అయినా ల్యాండ్లైన్ ద్వారా ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశాన్ని బీఎస్ఎన్ఎల్ కల్పిస్తున్న విషయం తెలిసిందే. కొత్త ల్యాండ్లైన్ కస్టమర్లకు మొదటి ఆరు నెలల పాటు నెలవారీ అద్దె రూ.49 మాత్రమే వసూలు చేస్తున్నామని, అనంతరం రూ.99 నుంచి అందుబాటులో ఉన్న ఇతర ప్లాన్లలో ఒకదానికి మారవచ్చని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. -
బుజ్జి ధోనీ.. పేర్లుపెట్టి పిలిచేస్తోంది!
భారత క్రికెట్ వీరుడు మహేంద్రసింగ్ ధోనీ క్రికెట్ లో బిజిబిజీగా ఉన్నా.. ఆయన భార్య సాక్షి సింగ్ మాత్రం.. తమ ముద్దుల కూతురు, చిట్టి పొట్టి అందాల చిన్నారి జివాతో పూర్తి సమయాన్ని గడుపుతూ మాతృత్వాన్ని ఆస్వాదిస్తుందన్న విషయం తెలిసిందే. . అదే నేపథ్యంలో అభిమానులకోసం సాక్షీ... జివా ఫోటోలను ఎన్నోసార్లు షేర్ చేశారు. ఇప్పుడు తాజాగా థోనీ... తన ముద్దుల కూతురు జివాతో ఆటపాటల్లో మునిగిపోయిన అద్భుత క్షణాల వీడియోను సాక్షీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జివా మాటల మూటలతో కూడిన వీడియో ఇప్పుడు అందర్నీ కట్టి పడేస్తోంది. అమ్మలాలన, నాన్నపానలో అత్యంత గారాలను ఒలకబోస్తూ... చిలకపలుకులు పలుకుతున్న జివా వీడియో సోషల్ మీడియాలో ఆకర్షణగా మారింది. భారత క్రికెట్ ఆటగాడు మహేంద్రసింగ్ థోనీ..అభిమానులకోసం తమ చిట్టితల్లి చిత్రాలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసే సాక్షీ థోనీ.. ఇటీవల చిన్నారి జివా తండ్రితో ఆడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. లిటిల్ గాల్.. జివా.. వచ్చీ రాని మాటలతో నాన్న.. అమ్మలను.. తనదైన రీతిలో పేరుపెట్టి పిలుస్తుంటే... ఆ దంపతులు మురిసిపోవడం వీడియోలో అభిమానులను అత్యంత ఆకర్షిస్తోంది. పిల్లలు పక్కన ఉంటే ప్రపంచాన్ని మర్చిపోవచ్చన్న విషయం జివా వీడియోను చూస్తే అర్థమౌతుంది. చిన్నారుల కళ్ళలో చూస్తూ, వారికి వచ్చీరాని మాటలను వింటూ ఎంతకాలమైనా గడిపేయచ్చనిపిస్తుంది. దేశానికి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లుగా .. ఎంత సెలబ్రిటీలయినా చిన్నారుల విషయానికి వస్తే అంతేమరి... -
బుజ్జి ధోనీ.. పేర్లుపెట్టి పిలిచేస్తోంది!
-
రేపిస్టుల కాళ్లు, చేతులు నరికేయండి: ఠాక్రే
అహ్మద్ నగర్: మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై 'షరియా' (ఇస్లామిక్) వంటి కఠినచట్టాలను అమలు చేయాలని ఎంఎన్ఎస్ ఛీఫ్ రాజ్ ఠాక్రే అన్నారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో ఓ బాలికపై గ్యాంగ్ రేప్, హత్య జరగడం నిజంగా ఆందోళనకరమన్నారు. మైనర్లు, మహిళలపై నేరాలకు పాల్పడేవారిని కాళ్లు, చేతులు నరికేయడమే సరైన పద్ధతంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా కోపర్ది గ్రామంలో జూలై 13న జరిగిన దారుణ ఘటనపై ఎంఎన్ఎస్ ఛీఫ్ రాజ్ ఠాక్రే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాఛారం చేసి, ఆపై హత్యచేయడం రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయనడానికి నిదర్శనమన్నారు. అందుకే ఇటువంటి తీవ్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ ఘటనతో గత కాంగ్రెస్ ప్రభుత్వంకంటే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధ్వాన్న స్థితికి చేరినట్లు నిరూపించుకుందన్నారు. జిల్లా కేంద్రానికి సుమారు 76 కిలోమీటర్ల దూరంలోని కంర్ణత్ తాలూకా కోపర్ది గ్రామం సందర్శించిన రాజ్ ఠాక్రే.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలంటే ప్రస్తుత చట్టాలను అత్యవసరంగా మార్చాలని, తీవ్ర నేరాలకు పాల్పడేవారిని, సంఘవ్యతిరేక శక్తులను సమూలంగా నిర్మూలించేందుకు 'షరియా' వంటి కఠిన చట్టాలను అమల్లోకి తేవాలని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహా అహ్మద్ నగర్ గార్డియన్ మినిస్టర్ రామ్ షిండే సైతం ఆదివారం కోపర్దిలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. నేరస్థులను ఎట్టిపరిస్థితిలో వదిలి పెట్టేది లేదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నేరస్థులకు కఠినంగా శిక్షపడేట్లు చూస్తామని బాధితకుటుంబానికి భరోసా ఇచ్చారు. -
మాట్లాడే మహిళా రోబో!
శాస్త్ర సాంకేతిక రంగంలో ముందున్న చైనా పరిశోధకులు తాజా ప్రయత్నంలో భాగంగా మాట్లాడే రోబోను సృష్టించారు. రోబోలు నడవటం, పనులు చేయడం వంటివి ఎన్నో ఇంతకు ముందే చూశాం. అయితే వీటికి భిన్నంగా మాట్లాడే మరమనిషిని కనిపెట్టి మరోసారి విజయవంతమయ్యారు. అచ్చం అమ్మాయిలా ఉండే ముఖ కవళికలతోపాటు మాటలకు అనుగుణంగా కదిలే నోరు, పెదాలతో చైనా పరిశోధకులు వినూత్న సృష్టికి శ్రీకారం చుట్టారు. మరమనిషిలా కాక, సహజత్వం ఉట్టిపడేలా జియా జియా ఇప్పుడు చైనా వాసులనే కాక అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణ మహిళ రూపంలో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. పెదాల కదలికలు, కళ్ళు తిప్పడంతో సహా అచ్చంగా మనిషిని పోలి ఉండటం జియా జియా ప్రత్యేకత అంటున్నారు చైనా యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు. ఈ కొత్త రోబో క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా తన సేవలు అందిస్తుందని చెప్తున్నారు. ముందుగా ఫీడ్ చేస్తేనో, కీ ఇస్తేనో మాట్లాడటం కాక, ఇతరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తల ఊపడం, దగ్గరగా వచ్చిన వారిని స్పర్శించడం వంటి కొత్త విషయాలను ఈ వినూత్న రోబోలో పొందుపరిచారు. మూడు సంవత్సరాలపాటు కష్టపడి పరిశోధకులు జియా జియా కదలికలను తీర్చి దిద్దారు. రోబో సృష్టికర్త చెన్ జియోపింగ్ పలకరిస్తే చాలు.. చక్కగా సమాధానం ఇస్తున్న రోబోను చూసి మీడియా ప్రతినిధులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఫోటోలతో ముంచెత్తారు. ఇదెంతో అద్భుతమంటూ అభినందనలు కురిపించారు. టెక్నాలజీని మరింత అభివృద్ధి పరచి, జియా జియా మాట్లాడటంతోపాటు, నవ్వడం, ఏడ్వటం కూడ చేసేట్లుగా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారని స్టేట్ మీడియా వివరించింది. పరిశోధకులు కూడ వారి సాంకేతిక పరిమితులను అధిగమించి మాట్లాడే మహిళా రోబోలో మరిన్ని హావభావాలను కూడ పలికించేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు. -
డిన్నర్ సమయంలో ఒకే..!
స్మార్ట్ ఫోన్ల ఒరవడి పెరిగిన తర్వాత ప్రతి విషయం జనాన్ని భయపెడుతున్నాయి. ఫోన్ ఎక్కువగా మాట్లాడితే క్యాన్సర్లు వస్తాయని, బుద్ధిమాంద్యం సంక్రమిస్తుందంటూ కొందరు వైద్య పరమైన సమస్యలను వెల్లడిస్తుంటే... మరి కొందరు ఫోన్ మాట్లాడేందుకు, టెక్ట్స్ సంభాషణలకు కొన్ని సమయాలు మాత్రమే అనుకూలం అని చెప్తుంటారు. అయితే ఫోన్ సంభాషణలకు, టెక్స్ ఛాటింగ్ కు రాత్రి భోజన సమయం మంచిదేనంటున్నారు తాజా అధ్యయనకారులు. రాత్రి భోజన సమయంలో ఫోన్ మాట్లాడ్డం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని పరిశోధకులు చెప్తున్నారు. బంధువులు, చుట్టాలనుంచి కాల్స్ వచ్చినా, సామాజిక మాధ్యమాల్లో ఛాటింగ్ చేసినా ఎటువంటి సమస్యలు ఉండవని చెప్తున్నారు. ముఖ్యంగా భోజనం చేస్తుండగా ఫోన్ వాడకం మంచిది కాదనే విషయంపై పరిశోధనలు నిర్వహించిన మిచిగన్ యూనివర్శిటీ పరిశోధక విద్యార్థి మోసర్.. భోజనం చేస్తూ కాండీక్రష్ వంటి గేమ్స్ ఆడటం, ఫేస్ బుక్ లో వచ్చిన వీడియోలు చూడటం వంటివి భిన్నమైనా... ఛాటింగ్, కాల్స్ వంటివి సమస్యలు తెస్తాయన్నది బూటకం అని తేల్చి చెప్పారు. ప్రపంచంలో ఇంగ్లీషు మాట్లాడే దేశాల్లోని సుమారు 8 నుంచి 88 ఏళ్ళ మధ్య వయసున్న 1,163 మంది పై పరిశోధనలు నిర్వహించారు. భోజన సమయంలో మొబైల్ వాడేవారి ఆలోచనలపై సర్వే నిర్వహించారు. వారు పనిచేసే రంగాన్నిబట్టి వారి ఆలోచనా విధానం ఆధారపడి ఉండటాన్ని గమనించారు. సామాజిక మాధ్యమాలను వినియోగించడంలో ఎక్కువ సమయం పట్టొచ్చని, భోజన సమయంలో మెసేజింగ్, ఫోన్ కాల్స్ చేయడంవల్ల పెద్దగా నష్టం ఉండదని తేల్చి చెప్పారు. చిన్నపిల్లలు ఎక్కువగా వారి మిత్రులతో సంభాషిస్తుంటారని, అదీ పగటి సమయంలోనే ఎక్కువగా ఉంటుందని సర్వేల్లో గమనించిన అధ్యయనకారులు... ముఖ్యంగా రాత్రి భోజన సమయంలో మధ్య వయస్కులే ఎక్కువగా ఫోన్ వినియోగిస్తున్నట్లు గమనించారు. దీంతో వారికి పెద్దగా నష్టం కలగదని తెలుసుకున్నారు. సాధారణంగా భోజన సమయంలో వార్తా పత్రికలు, పుస్తకాలు చదవడం, టీవీలు చూడటం పై ఎన్నో ఏళ్ళక్రితమే పరిశోధనలు జరిగాయని, ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల ట్రెండ్ కొత్త సవాలుగా మారిందని సహ పరిశోధకురాలు, ప్రొఫెసర్ సరితా ఛోయెనెబెక్ తెలిపారు. ఫోన్ వాడే సమయంలో అర్జెంట్ కాల్స్ ను, మెయిల్స్ ను కూడ పట్టించుకుంటారో లేదో చెప్పలేమన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ అభివృద్ధి పరిచేవారు మాత్రం పరికరాల్లో మరింత విజిబులిటీ పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. -
మీ స్కైప్ కాల్స్ రికార్డ్ అవుతున్నాయా?
కొత్త కొత్త మాల్వేర్లను (మాల్వేర్ అంటే హానికరమైన సాఫ్ట్వేర్) ఉపయోగించి ఖాతాల్లో డబ్బు తస్కరించే హ్యాకర్లనే ఇప్పుటి దాకా చూస్తున్నాం. ఇప్పుడు వారి దృష్టి ఆన్లైన్ సంభాషణలపై పడింది. ఆన్లైన్ లోనే అన్ని రకాల సంభాషణలు జరుపుతున్న నేటి తరుణంలో రహస్య సమాచారాన్ని చోరీ చేసేందుకు హ్యాకర్లు సిద్ధమౌతున్నారు. తాజాగా స్కైప్ లో జరిగే సంభాషణలను రికార్డు చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ఆమెరికా వంటి దేశాల్లో కొత్త మాల్వేర్ ను ఉపయోగించి సైబర్ దాడులకు పాల్పడినట్లు వివరిస్తున్నారు. ఏ దేశంలో నివసిస్తున్న వారితోనైనా మన ముందున్నట్లే మాట్లాడేందుకు స్కైప్ను ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తున్నాం. ఇష్టమొచ్చినట్లు అదీ ఇదీ అని లేకుండా ప్రతి విషయాన్నీ స్కైప్ కాల్స్లో షేర్ చేసేసుకుంటున్నాం. ఆఫీస్ మీటింగ్లు, రహస్య సంభాషణలు అన్నీ స్కై ప్ లో జరిగిపోతున్నాయి. అయితే అత్యంత ప్రాచుర్యం పొందిన స్కైప్లో మాట్లాడేప్పుడు ఏవైనా రహస్య సంభాషణలు ఉంటే కాస్త జాగ్రత్త పడాల్సిందేనంటున్నారు సైబర్ నిపుణులు. స్కైప్ లో జరిగే రహస్య సమాచారాన్ని T9000 మాల్వేర్ను ఉపయోగించి తస్కరించేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీడియో సంభాషణలను రికార్డు చేసేందుకు, స్క్రీన్ షాట్లు తీసేందుకు ఈ శక్తివంతమైన T9000 మాల్వేర్ ను వినియోగిస్తున్నట్లు సైబర్ రక్షణాధికారులు చెప్తున్నారు. ఈ మాల్వేర్ ఇప్పుడు ఎటువంటి యాంటీ వైరస్ కు దొరక్కుండా పనిచేస్తున్నట్లు చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ కు చెందిన వీడియో ఛాటింగ్ ప్రోగ్రామ్ స్కైప్ ను ప్రతిరోజూ సుమారు 4.9 మిలియన్ల మంది వాడుతున్నట్లు గతేడాది జరిపిన సర్వేలు చెప్తున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్ లకు పోటీగా స్కైప్ ను వినియోగదారులు వాడటం కనిపెట్టిన హ్యాకర్లు... ఇప్పుడు రహస్య వీడియో సంభాషణల తస్కరణపై దృష్టి పెట్టారు. కొత్తగా వచ్చిన ఈ T9000 మాల్వేర్ మార్కెట్లోని ఎన్నో రకాల సాఫ్ట్ వేర్ లను తప్పుదోవ పట్టించగలదని పాలో ఆల్టో నెట్ వర్కింగ్ సంస్థ చెప్తోంది. ఈ వైరస్.. సిస్టమ్ లో పనిచేసే సుమారు 24 రకాల సెక్యూరిటీ విభాగాలను దాటి వ్యాపించగలదని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. మనం వాడే కంప్యూటర్, లేదా మొబైల్ యాండ్రాయిడ్ పరికరాల్లోని వేటిలోనైనా ప్రవేశించి అందులోని సమాచారాన్ని చోరీ చేయగల శక్తి ఈ వైరస్ కు ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ మాల్వేర్ ను ఇప్పటికే అమెరికాలోని పలు సైబర్ దాడుల్లో వినియోగించినట్లు సంస్థ తెలుపుతోంది. స్కైప్ వినియోగించేందుకు explorer.exe పేరుతో వచ్చే ఫైల్స్ ను నమ్మొద్దని సంస్థ హెచ్చరిస్తోంది. దీన్ని వీడియో ఫైల్స్ ను తస్కరించేందుకు హ్యాకర్లు వాడుతున్నట్లు పాలో ఆల్టో నెట్వర్కింగ్ సంస్థ చెబుతోంది. -
షారుక్ ఖాన్ పాకిస్తాన్ ఏజెంట్!
లక్నో: విశ్వహిందూ పరిషత్ నేత, బీజేపీ మహిళా నాయకురాలు సాద్వీ ప్రాచీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ దేశం నుంచి వెళ్లిపోవచ్చంటూ ఆమె విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజ్వరిల్లుతున్న మత ఘర్షణలను షారూక్ ఖండించిన నేపథ్యంలో సాద్వీ ప్రాచీ ...షారుక్పై మండిపడ్డారు. ఆయనో పాకిస్తాన్ ఏజెంట్ అంటూ స్వాధ్వీ నిన్న ఇక్కడ ఆవేశంతో ఊగిపోయారు. అక్కడితో ఈ ఫైర్ బ్రాండ్ ఆగ్రహం చల్లారలేదు. కావాలంటే షారూక్ ఖాన్ పాక్ వెళ్ళిపోవచ్చంటూ ధ్వజమెత్తారు. అనుచిత వ్యాఖ్యానాలు చేస్తున్న షారూక్ ఖాన్ను కఠినంగా శిక్షించాలన్నారు. దీంతో పాటుగా పద్మశ్రీ సహా, వివిధ ప్రతిష్ఠాత్మక అవార్డులను వెనక్కి ఇస్తున్న వారిపై కఠినంగా శిక్షించాలని సాద్వీ ప్రాచీ డిమాండ్ చేశారు. 50వ పుట్టిన రోజు జరుపుకున్న షారూక్ ఖాన్పై విఎస్పీ నేత విమర్శలపై బాలీవుడ్లో దుమారం రేగింది. అయితే గతంలో కూడా కూడా షారూక్ పై స్వాధ్వీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. బాద్ షా సినిమాలు చూడ్డానికి వీల్లేదంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. షారుక్ సినిమాల వల్ల యువత పెడతోవ పడుతోందన్నారు. కాగా సృజన, మతాలపై అసహనం దేశానికి హానికరమని షారుక్ ఖాన్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. సోమవారం తన 50వ పుట్టినరోజు సందర్భంగా కింగ్ఖాన్.. ప్రస్తుతం దేశంలో తీవ్ర అసహనం నెలకొందన్నారు. సినీరంగానికి చెందిన వారు, శాస్త్రవేత్తలు, రచయితలు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని సమర్థించారు. వెనక్కి ఇవ్వడానికి తనకు జాతీయ ఫిల్మ్ అవార్డు ఏమీ లేనప్పటికీ, అలా చేసిన సినీ ప్రముఖులు దివాకర్ బెనర్జీ, ఆనంద్ పట్వర్ధన్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానన్నారు. సృజన పట్ల, మతం పట్ల అసహనం ప్రదర్శిస్తున్నామంటే దేశం వేసిన ప్రతి ముందడుగు మనం వెనక్కి లాగుతున్నట్లేనన్నారు. దీంతో షారుక్ వ్యాఖ్యలను సాద్వీ ప్రాచీ తీవ్రంగా ఖండించారు. -
మంత్రుల పేషీలకు ఫోన్ కట్
రూ.కోటి వరకు బకాయిలు మూడు రోజులుగా మూగబోయిన ఫోన్లు బెంగళూరు: తమ తమ ప్రాంతాల్లోని సమస్యలను చెప్పుకునే వారు, అధికారులు, ఆయా నియోజకవర్గాల్లోని నేతలు, ఇక పైరవీలు చేసే చోటామోటా నాయకులు వీరందరి ఎడతెరిపి లేని ఫోన్కాల్స్తో ఎప్పుడూ మారుమోగి పోయే మంత్రుల పేషీలు స్తబ్దుగా మారిపోయాయి. గత మూడు రోజులుగా విధానసౌధలోని మంత్రుల కార్యాలయాల్లో ఉన్న ల్యాండ్ఫోన్లేవీ పనిచేయడం లేదు. దీంతో తమ సమస్యలను నేరుగా మంత్రివర్యుల దృష్టికి తీసుకొద్దామని భావించే సామాన్యులకు ‘ఈ నంబర్ తాత్కాలికంగా పనిచేయడం లేదు’ అనే సమాధానం వినిపిస్తోంది. మంత్రుల పేషీల్లో ఫోన్లు పనిచేయక పోవడానికి బీబీఎంపీ ఎన్నికలో లేదంటే తాంత్రిక పరమైన లోపమో కారణం కాదండోయ్! మంత్రుల కార్యాలయాల్లోని ఫోన్ బిల్లులు కట్టకపోవడమే ఇందుకు కారణం. విధానసౌధలో ఉన్న మంత్రుల పేషీల్లోని ల్యాండ్ ఫోన్లకు సంబంధించిన బిల్లులు రూ.కోటి రూపాయలు దాటేశాయి. అయినా కూడా సంబంధిత అధికారులు ఈ బిల్లులను చెల్లించకపోవడంతో బీఎస్ఎన్ఎల్ సంస్థ మంత్రుల పేషీల ఫోన్ కనెక్షన్లను తాత్కాలికంగా తొలగించింది. దీంతో గత మూడురోజులుగా మంత్రుల పేషీల్లోని ఫోన్లన్నీ మూగబోయాయి. మంత్రుల కార్యాలయాల్లోని ఫోన్ బిల్లులే చెల్లించకపోతే ఇక సామాన్యుల సమస్యల పరిష్కారంలో ఎంతమాత్రం ఆసక్తి చూపుతారో అర్థమవుతోందని సామాన్యులు వాపోతున్నారు. -
ఫోన్లతో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీ
-
విజయమ్మతో భేటీ అయిన ఏపిఎన్జీఓలు
-
స్పెక్ట్రమ్ ధర పెంచితే టారిఫ్లూ పెరుగుతాయ్
న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రమ్ ధర భారీగా ఉంటే తాము కాల్స్, ఎస్ఎంఎస్, ఇతర చార్జీలు 50 శాతం దాకా పెంచాల్సి వస్తుందని టెలికం కంపెనీలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే వేలంలో స్పెక్ట్రమ్ బేస్ ధరను తగ్గించాలని కోరాయి. స్పెక్ట్రమ్ ధర మరీ అధికంగా ఉంటే.. టారిఫ్లు భారీగా పెరుగుతాయని, స్పెక్ట్రమ్ కూడా అమ్ముడు కాకపోవడం వల్ల ప్రభుత్వానికీ ఆదాయం వచ్చే అవకాశాలు ఉండబోవని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్కి తెలిపాయి. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, లూప్ మొబైల్ సంస్థల లెసైన్సు గడువు 2014తో ముగిసిపోనుండటంతో.. రీఫార్మింగ్ కింద వాటి స్పెక్ట్రమ్ను ప్రభుత్వం వేలం వేయనుంది. ఇందుకోసం బేస్ ధరను 2008 నాటి రేటుతో పోలిస్తే 11 రెట్లు అధికంగా నిర్ణయించాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే టెల్కోలు ఆందోళన వ్యక్తం చేశాయి. మొబైల్ కాల్ చార్జీలు గత రెండేళ్లలో 100 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం నిమిషానికి 90 పైసల నుంచి రూ. 1.20 దాకా చార్జీలు ఉన్నాయి. ట్రాయ్ సిఫార్సులు ఆమోదించిన పక్షంలో టారిఫ్లు మరో 26 పైసల దాకా పెరగొచ్చని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు ఎయిర్టెల్ తెలిపింది. మరోవైపు, రీఫార్మింగ్ వల్ల నెట్వర్క్లో మార్పులు చేర్పుల కోసం పరిశ్రమ రూ. 55,000 కోట్లు, నిర్వహణ వ్యయాల కింద ఏటా మరో రూ. 11,800 కోట్ల మేర వెచ్చించాల్సి వస్తుందని లూప్ మొబైల్ పేర్కొంది. గతంలో ఉన్న బేస్ ధరనే కొనసాగిస్తే మంచిదని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అభిప్రాయపడింది. రూ. 30,000 కోట్ల బకాయిలు.. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ సహా టెలికం కంపెనీలు మొత్తం రూ. 30,158 కోట్ల మేర స్పెక్ట్రం చార్జీలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో వన్ టైమ్ ఫీజు, యూసేజ్ చార్జీలు కూడా ఉన్నాయి. దీంతో ఆపరేటర్లకు డిమాండ్ నోటీసులు పంపినట్లు కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయమంత్రి మిలింద్ దేవరా తెలిపారు. బీఎస్ఎన్ఎల్ అత్యధికంగా రూ. 6,980 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ. 6,075 కోట్లు, వొడాఫోన్ రూ. 4,477 కోట్లు, ఐడియా రూ. 2,206 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 2,004 కోట్లు, టాటా టెలీసర్వీసెస్రూ. 1,400 కోట్లు చెల్లించాల్సి ఉంది. -
స్పెక్ట్రమ్ ధర పెంచితే టారిఫ్లూ పెరుగుతాయ్
న్యూఢిల్లీ: టెలికం స్పెక్ట్రమ్ ధర భారీగా ఉంటే తాము కాల్స్, ఎస్ఎంఎస్, ఇతర చార్జీలు 50 శాతం దాకా పెంచాల్సి వస్తుందని టెలికం కంపెనీలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో త్వరలో నిర్వహించే వేలంలో స్పెక్ట్రమ్ బేస్ ధరను తగ్గించాలని కోరాయి. స్పెక్ట్రమ్ ధర మరీ అధికంగా ఉంటే.. టారిఫ్లు భారీగా పెరుగుతాయని, స్పెక్ట్రమ్ కూడా అమ్ముడు కాకపోవడం వల్ల ప్రభుత్వానికీ ఆదాయం వచ్చే అవకాశాలు ఉండబోవని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్కి తెలిపాయి. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, లూప్ మొబైల్ సంస్థల లెసైన్సు గడువు 2014తో ముగిసిపోనుండటంతో.. రీఫార్మింగ్ కింద వాటి స్పెక్ట్రమ్ను ప్రభుత్వం వేలం వేయనుంది. ఇందుకోసం బేస్ ధరను 2008 నాటి రేటుతో పోలిస్తే 11 రెట్లు అధికంగా నిర్ణయించాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే టెల్కోలు ఆందోళన వ్యక్తం చేశాయి. మొబైల్ కాల్ చార్జీలు గత రెండేళ్లలో 100 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం నిమిషానికి 90 పైసల నుంచి రూ. 1.20 దాకా చార్జీలు ఉన్నాయి. ట్రాయ్ సిఫార్సులు ఆమోదించిన పక్షంలో టారిఫ్లు మరో 26 పైసల దాకా పెరగొచ్చని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు ఎయిర్టెల్ తెలిపింది. మరోవైపు, రీఫార్మింగ్ వల్ల నెట్వర్క్లో మార్పులు చేర్పుల కోసం పరిశ్రమ రూ. 55,000 కోట్లు, నిర్వహణ వ్యయాల కింద ఏటా మరో రూ. 11,800 కోట్ల మేర వెచ్చించాల్సి వస్తుందని లూప్ మొబైల్ పేర్కొంది. గతంలో ఉన్న బేస్ ధరనే కొనసాగిస్తే మంచిదని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ అభిప్రాయపడింది. రూ. 30,000 కోట్ల బకాయిలు.. బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ సహా టెలికం కంపెనీలు మొత్తం రూ. 30,158 కోట్ల మేర స్పెక్ట్రం చార్జీలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో వన్ టైమ్ ఫీజు, యూసేజ్ చార్జీలు కూడా ఉన్నాయి. దీంతో ఆపరేటర్లకు డిమాండ్ నోటీసులు పంపినట్లు కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ సహాయమంత్రి మిలింద్ దేవరా తెలిపారు. బీఎస్ఎన్ఎల్ అత్యధికంగా రూ. 6,980 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ. 6,075 కోట్లు, వొడాఫోన్ రూ. 4,477 కోట్లు, ఐడియా రూ. 2,206 కోట్లు, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 2,004 కోట్లు, టాటా టెలీసర్వీసెస్రూ. 1,400 కోట్లు చెల్లించాల్సి ఉంది. -
తిరుపతిలో మెడికల్ JAC ఆందోళన
-
నేడు సీమాంద్ర బంద్కు జేఏసీ పిలుపు