Deepak Hooda
-
Deepak Hooda: మన ఇంటికి స్వాగతం.. ప్రేయసితో క్రికెటర్ పెళ్లి(ఫొటోలు)
-
ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా స్టార్.. పోస్ట్ వైరల్
టీమిండియా క్రికెటర్ దీపక్ హుడా ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసిని పెళ్లాడినట్లు తెలిపాడు. సోమవారం(జూలై 15) తమ వివాహం జరిగిందని సోషల్ మీడియా వేదికగా తాజాగా వెల్లడించాడు.తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణఈ సందర్భంగా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను దీపక్ హుడా షేర్ చేశాడు. ‘‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. ఈ ప్రయాణంలోని ప్రతీ క్షణం, ప్రతీ కల, ప్రతీ సంభాషణ మనల్ని ఈరోజు ఇక్కడి దాకా తీసుకువచ్చాయి.మా కళ్లలోని భావాలు.. మేము చెప్పుకొనే ముచ్చట్లు కేవలం మా రెండు హృదయాలకు మాత్రమే అర్థమవుతాయి. నా చిన్నారి- పొన్నారి హిమాచలి అమ్మాయీ.. మన ఇంట్లోకి నీకు స్వాగతం పలుకుతున్నా’’ అంటూ దీపక్ హుడా తన శ్రీమతిని ఉద్దేశించి భావోద్వేగ క్యాప్షన్ కూడా జతచేశాడు.కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ.. అందరి ఆశీర్వాదాలతో తాము కొత్త జీవితం మొదలుపెట్టామని తెలిపాడు. తమ బంధం ఈరోజుతో శాశ్వతంగా ముడిపడిపోయిందని.. మనసంతా సంతోషంతో నిండిందని పేర్కొన్నాడు.శుభాకాంక్షల వెల్లువఈ నేపథ్యంలో కొత్త జంటకు క్రికెటర్లు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శిఖర్ ధావన్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చహల్, ఖలీల్ అహ్మద్ తదితర భారత క్రికెటర్లతో పాటు మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్), లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా.. దీపక్ హుడా దంపతులను విష్ చేశారు.అయితే, దీపక్ హుడా తన భార్య పేరును మాత్రం వెల్లడించలేదు. కాగా ఐపీఎల్-2024లో దీపక్ హుడా లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించాడు.అదే ఆఖరుహర్యానాకు చెందిన దీపక్ హుడా కుడిచేతి వాటం బ్యాటర్.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. ఐపీఎల్లో సత్తా చాటిన 29 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్.. 2022లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది న్యూజిలాండ్తో సిరీస్ సందర్భంగా దీపక్ హుడా టీమిండియాకు చివరిసారిగా ఆడాడు.ఇక ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 10 వన్డేలు, 21 టీ20లు ఆడిన దీపక్ హుడా.. ఆయా ఫార్మాట్లలో 153, 368 పరుగులు చేశాడు. అదే విధంగా.. 3, 6 వికెట్లు తీశాడు. చదవండి: పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్లో! View this post on Instagram A post shared by Deepak Hooda (@deepakhooda30) -
ఐర్లాండ్తో మ్యాచ్.. అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
టీ20 వరల్డ్కప్-2024లో తొలి మ్యాచ్కు టీమిండియా సన్నద్దమవుతోంది. జూన్ 5న న్యూయర్క్ వేదికగా ఐర్లాండ్తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఐరీష్ను చిత్తు చేసి మెగా ఈవెంట్ను ఘనంగా ఆరంభించాలని టీమిండియా భావిస్తోంది.ఈ మ్యాచ్కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ మరో 3 పరుగులు సాధిస్తే.. టీ20ల్లో ఐర్లాండ్పై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్గా రికార్డులెక్కుతాడు.ఇప్పటివరకు ఐర్లాండ్పై రోహిత్ శర్మ 3 మ్యాచ్లు ఆడి 149 పరుగులు చేశాడు. కాగా ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా ఆల్రౌండర్ దీపక్ హుడా పేరిట ఉంది. దీపక్ హుడా ఇప్పటివరకు ఐర్లాండ్పై 2 మ్యాచ్లు ఆడి 151 పరుగులు చేశాడు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ -
IPL 2024 KKR VS LSG: కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రమణ్దీప్ సింగ్
లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 14) జరుగుతున్న మ్యాచ్లో కేకేఆర్ ఆటగాడు రమణ్దీప్ సింగ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో దీపక్ హుడా (8) కొట్టిన షాట్ను రమణ్దీప్ డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ను అందుకున్నాడు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. Ramandeep Singh. 🦅pic.twitter.com/3mhPdFNAJc — Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2024 కాగా, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్కు దిగింది. ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించిన లక్నో 13 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. డికాక్ (10), కేఎల్ రాహుల్ (39), దీపక్ హుడా (8), స్టోయినిస్ (10) ఔట్ కాగా.. బదోని (27), పూరన్ (2) క్రీజ్లో ఉన్నారు. స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రసెల్ తలో వికెట్ పడగొట్టారు. ప్రస్తుత సీజన్లో లక్నో హ్యాట్రిక్ విజయాలు సాధించి (5 మ్యాచ్ల్లో 3 విజయాలు) పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్ల్లో 3 విజయాలతో కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం కేకేఆర్, లక్నో ఇటీవలే ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. కేకేఆర్ తమ చివరి మ్యాచ్లో సీఎస్కే చేతిలో ఓడగా.. లక్నో తాజాగా ఢిల్లీ చేతిలో పరాభవం ఎదుర్కొంది. హెడ్ టు హెడ్ ఫైట్ల విషయానికొస్తే.. ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 3 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో లక్నోనే విజయం వరించింది. -
దీపక్ హుడా సంచలన ఇన్నింగ్స్.. రికార్డులివే! మాక్స్వెల్తో పాటు..
Deepak Hooda 180- VHT 2023 semi-final: టీమిండియా బ్యాటర్ దీపక్ హుడా దేశవాళీ వన్డే టోర్నీలో దుమ్ములేపాడు. విజయ్ హజారే ట్రోఫీ-2023 సెమీ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కర్ణాటకతో గురువారం జరిగిన మ్యాచ్లో 128 బంతుల్లో 19 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 180 పరుగులు సాధించాడు. లక్ష్య ఛేదనలో రెండో బ్యాటర్గా తద్వారా లిస్ట్-ఏ క్రికెట్లో అరుదైన ఘనతలు సాధించాడు. భారత్ తరఫున లిస్ట్- ఏ క్రికెట్లో లక్ష్య ఛేదనలో పృథ్వీ షా(123 బంతుల్లో 185 పరుగులు- నాటౌట్) తర్వాత అత్యధిక స్కోరు సాధించిన రెండో బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అదే విధంగా.. విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్(220), రవికుమార్ సమర్థ్(192), పృథ్వీ షా(185) తర్వాత అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా దీపక్ హుడా చరిత్రకెక్కాడు. మాక్స్వెల్తో పాటు ఆ జాబితాలో అంతేగాక.. లిస్ట్-ఏ చరిత్రలో ఛేజింగ్లో నంబర్ 4లో వచ్చి అత్యధిక స్కోరు చేసిన నాలుగో క్రికెటర్గా దీపక్ హుడా నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెప్ మాక్స్వెల్(201*), అఫ్గనిస్తాన్ బ్యాటర్ సమీఉల్లా షెన్వారీ(192), బంగ్లాదేశ్కు చెందిన రకీబుల్ హసన్(190) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. హరియాణాతో ఫైనల్లో రాజస్తాన్ అమీతుమీ కాగా దీపక్ హుడా అద్భుత ఇన్నింగ్స్ కారణంగా విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో రాజస్తాన్ జట్టు ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. కర్ణాటకతో రెండో సెమీఫైనల్లో రాజస్తాన్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. కర్ణాటక నిర్దేశించిన 283 పరుగుల లక్ష్యాన్ని రాజస్తాన్ 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ దీపక్ హుడా (128 బంతుల్లో 180; 19 ఫోర్లు, 5 సిక్స్లు) భారీ సెంచరీతో రాజస్తాన్ను ఒంటిచేత్తో గెలిపించాడు. కరణ్ లాంబా (73 నాటౌట్; 7 ఫోర్లు)తో కలిసి దీపక్ నాలుగో వికెట్కు 255 పరుగులు జోడించడం విశేషం. అంతకుముందు కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు చేసింది. శనివారం జరిగే ఫైనల్లో హరియాణాతో రాజస్తాన్ తలపడుతుంది. 1⃣5⃣0⃣ up for Deepak Hooda 👏👏 He brings it up off just 108 balls. He's played some fabulous shots. 👌👌 Follow the match ▶️ https://t.co/Zvqm6l7cL2@IDFCFIRSTBank | #VijayHazareTrophy pic.twitter.com/8qJ53nLmA6 — BCCI Domestic (@BCCIdomestic) December 14, 2023 𝐑𝐚𝐣𝐚𝐬𝐭𝐡𝐚𝐧 𝐜𝐫𝐮𝐢𝐬𝐞 𝐢𝐧𝐭𝐨 𝐭𝐡𝐞 𝐟𝐢𝐧𝐚𝐥! 👏👏 A special partnership of 255 between Deepak Hooda (180) & Karan Lamba (73*) helps Rajasthan chase down 283 after being reduced to 23/3 👌 Scorecard ▶️ https://t.co/Zvqm6l7cL2@IDFCFIRSTBank | #VijayHazareTrophy pic.twitter.com/CQEIGoErM9 — BCCI Domestic (@BCCIdomestic) December 14, 2023 -
భారీ సెంచరీతో విధ్వంసం సృష్టించిన దీపక్ హుడా
కర్ణాటకతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2023 రెండో సెమీఫైనల్లో రాజస్థాన్ కెప్టెన్ దీపక్ హుడా భారీ సెంచరీతో (128 బంతుల్లో 180; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్స్కు చేరింది. డిసెంబర్ 16న జరిగే తుది సమరంలో రాజస్థాన్.. హర్యానాతో అమీతుమీ తేల్చుకుంటుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఆరు, ఏడు నంబర్ ఆటగాళ్లు అభినవ్ మనోహర్ (91), మనోజ్ భాండగే (63) రాణించడంతో కర్ణాటక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. కర్ణాటక ఇన్నింగ్స్లో ఓపెనర్లు సమర్థ్ (8), మయాంక్ అగర్వాల్ (13) విఫలం కాగా.. నికిన్ జోస్ (21), శ్రీజిత్ (37), మనీశ్ పాండే (28) ఓ మోస్తరు స్కోర్లు చేయగలిగారు. రాజస్థాన్ బౌలర్లలో అనికేత్ చౌదరీ, అజయ్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఖలీల్ అహ్మద్, అరాఫత్ ఖాన్, రాహుల్ చాహర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్.. ఒక్క పరుగుకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత వన్డౌన్ బ్యాటర్ మహిపాల్ లోమ్రార్ (14) కూడా తక్కువ స్కోర్కే ఔట్ కావడంతో రాజస్థాన్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ దశలో బరిలోకి దిగిన దీపక్ హుడా.. కరణ్ లాంబా (73 నాటౌట్) సహకారంతో రాజస్థాన్ను ఒంటిచేత్తో గెలిపించాడు. గెలుపు ఖాయం అనుకున్న దశలో హుడా డబుల్ సెంచరీ చేరువలో ఔటయ్యాడు. హుడా, కరణ్ చెలరేగడంతో రాజస్థాన్ 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కర్ణాటక బౌలర్లలో కౌశిక్, వైశాక్, భాండగే, కృష్ణప్ప గౌతమ్ తలో వికెట్ పడగొట్టారు. -
శతక్కొట్టిన దీపక్ హుడా.. చెలరేగిన చాహర్ బ్రదర్స్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. నిన్న (నవంబర్ 23) జరిగిన మ్యాచ్ల్లో మయాంక్ అగర్వాల్ (157), దేవ్దత్ పడిక్కల్ (71), యుజ్వేంద్ర చహల్ (6/26) వివిధ జట్లపై చెలరేగిపోయారు. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు, రాజస్థాన్ ప్లేయర్స్ దీపక్ హుడా (114, 1/5), దీపక్ చాహర్ (66 నాటౌట్), రాహుల్ చాహర్ (5/34) రాణించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. దీపక్ హుడా, మానవ్ సుథర్ (41), దీపక్ చాహర్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లలో నబమ్ అబో 4 వికెట్లు పడగొట్టగా.. యోర్జుమ్ సెరా 2, అక్షయ్ జైన్, తెచి డోరియా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 348 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అరుణాచల్ ప్రదేశ్.. రాహుల్ చాహర్, మానవ్ సుథర్ (10-2-36-2), ఖలీల్ అహ్మద్ (7.2-0-44-2), దీపక్ హుడా (2-0-5-1) ధాటికి 46.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌటైంది. అరుణాచల్ ప్రదేశ్ ఇన్నింగ్స్లో సచిన్ శర్మ (63), అప్రమేయ జైస్వాల్ (63) అర్ధసెంచరీలతో రాణించగా.. మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బోణీ.. జైపూర్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. మణిపూర్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన మణిపూర్ సరిగ్గా 50 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ (3/71), రక్షణ్ రెడ్డి (2/28), తనయ్ త్యాగరాజన్ (2/24) రాణించారు. అనంతరం హైదరాబాద్ కేవలం 29.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసి నెగ్గింది. హైదరాబాద్ కెపె్టన్ గౌవ్లత్ రాహుల్ సింగ్ (47 బంతుల్లో 70; 13 ఫోర్లు), చందన్ సహని (32 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్), రవితేజ (11 బంతుల్లో 23 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) దూకుడుగా ఆడారు. ఆంధ్ర పరాజయం.. మరోవైపు చండీగఢ్లో ఆంధ్ర జట్టు పరాజయంతో ఈ టోర్నీని ప్రారంభించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా హిమాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆంధ్ర జట్టు ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఆంధ్ర జట్టు 47.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ రెడ్డి (59 బంతుల్లో 47; 2 ఫోర్లు, 2 సిక్స్లు), మనీశ్ గోలమారు (60 బంతుల్లో 46; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ 43.3 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసి విజయం సాధించింది. అమిత్ (78 నాటౌట్; 11 ఫోర్లు), ఆకాశ్ వశిష్ట్ (53; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. -
మయాంక్ మెరుపు శతకం.. పడిక్కల్ ఊచకోత.. ఆరేసిన చహల్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ (కర్ణాటక) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జమ్మూ కశ్మీర్తో ఇవాళ (నవంబర్ 23) జరుగుతున్న మ్యాచ్లో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. 132 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్లో మయాంక్తో పాటు రవి కుమార్ సమర్థ్ కూడా సెంచరీతో కదం తొక్కాడు. సమర్థ్ 120 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్, సమర్థ్ సెంచరీలతో చెలరేగడం విశేషం. పడిక్కల్ ఊచకోత.. సమర్థ్ ఔటైన అనంతరం ఇన్నింగ్స్ 39వ ఓవర్లో బరిలోకి దిగిన దేవ్దత్ పడిక్కల్ జమ్మూ కశ్మీర్ బౌలర్లను ఊచకోత కోశాడు. పడిక్కల్ వచ్చిన బంతిని వచ్చినట్లు బాది 35 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పడిక్కల్కు జతగా మనీశ్ పాండే కూడా బ్యాట్ ఝులిపించాడు. మనీశ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జమ్మూ బౌలర్లలో రసిక్ సలామ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన దీపక్ హుడా.. ఆరేసిన చహల్ 2023 సీజన్ విజయ్ హజారే ట్రోఫీ ఇవాల్టి నుంచే మొదలైంది. ఈ రోజు వివిధ వేదికలపై మొత్తం 18 మ్యాచ్లు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఆటగాడు, రాజస్థాన్ కెప్టెన్ దీపక్ హుడా (114) సెంచరీతో మెరిశాడు. ఇదే మ్యాచ్లో దీపక్ చాహర్ (66 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్, హర్యానా బౌలర్ యుజ్వేంద్ర చహల్ 6 వికెట్లతో ఇరగదీశాడు. -
ఎక్కువగా వాళ్ల మీదే ఆధారపడ్డారు.. ఫలితం అనుభవించారు.. వచ్చే సీజన్లోనైనా..
IPL 2023- LSG: విదేశీ ఆటగాళ్ల మీద అతిగా ఆధారపడటం లక్నో సూపర్ జెయింట్స్ కొంపముంచిందని టీమిండియా మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్ అభిప్రాయడపడ్డాడు. అదే సమయంలో దీపక్ హుడా, కృనాల్ పాండ్యా వంటి దేశీ ప్లేయర్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోవడం ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్తో బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్లో మరోసారి ఈ విషయం నిరూపితమైందన్నాడు. ఆ ముగ్గురే అద్భుతంగా ఐపీఎల్-2023లో లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్లలో 8 గెలిచిన లక్నో టాప్-3లో నిలిచి ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా కృనాల్ పాండ్యా సారథ్య బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపించాడు. అయితే, లక్నో గెలిచిన చాలా మ్యాచ్లలో విదేశీ ఆటగాళ్లు కైలీ మేయర్స్, నికోలసన్ పూరన్, మార్కస్ స్టొయినిస్లే కీలక పాత్ర పోషించారు. హుడా దారుణంగా మార్కస్ స్టొయినిస్ మొత్తంగా సీజన్లో 15 మ్యాచ్లలో 408 పరుగులతో లక్నో టాప్ స్కోరర్గా నిలిచాడు. 13 మ్యాచ్లు ఆడి 379 పరుగులు సాధించిన కైలీ మేయర్స్ అతడి తర్వాతి స్థానంలో ఉండగా.. పూరన్ 15 మ్యాచ్లలో 358 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. ఇలా లక్నో టాప్ స్కోరర్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లే ఉండటం గమనార్హం. మరోవైపు.. తాత్కాలిక కెప్టెన్, ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా 188 పరుగులు చేయగా.. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన దీపక్ హుడా పూర్తిగా నిరాశపరిచాడు. 12 మ్యాచ్లలో అతడు చేసిన మొత్తం పరుగులు కేవలం 84. ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో మేయర్స్ 18 పరుగులకే పెవిలియన్ చేరగా.. కృనాల్ 8 రన్స్ మాత్రమే చేశాడు. పాపం స్టొయినిస్ ఒంటరి పోరాటం చేస్తున్న స్టొయినిస్(27 బంతుల్లో 40 పరుగులు)ను అనవసరంగా రనౌట్కు బలైపోయేలా చేసిన దీపక్ హుడా(15) తాను కూడా రనౌట్ అయి కొంపముంచాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగా లక్ష్య ఛేదనలో తడబడ్డ లక్నో 101 పరుగులకే చేతులెత్తేసింది. 81 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓడి మరోసారి భంగపడింది. కనీసం వచ్చే సీజన్లో అయినా ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం క్రిక్బజ్ షోలో భారత మాజీ బౌలర్ మురళీ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘లక్నో ఎక్కువగా విదేశీ ఆటగాళ్ల మీదే ఆధారపడింది. ఆ జట్టులో ఉన్న భారత ఆటగాళ్లలో ఒక్కరు కూడా అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు. ఎలిమినేటర్ మ్యాచ్లో స్టొయినిస్ ఒక్కడే కాసేపు పోరాడాడు. వచ్చే సీజన్లోనైనా లక్నో ఈ లోపాలు సరిదిద్దుకోవాలి. ఈ మ్యాచ్లో పూరన్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. స్టొయినిస్ ఆడతాడు అనుకుంటే చెత్తగా రనౌట్ కావాల్సి వచ్చింది’’ అని లక్నో బ్యాటర్ల తీరును విమర్శించాడు. చదవండి: ఆర్సీబీలో నెట్బౌలర్గా ఉన్నా... ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు! కానీ ఇప్పుడు.. తిలక్ వర్మను టీజ్ చేసిన సూర్యకుమార్.. వీడియో వైరల్ 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Plenty of smiles and celebrations after a resounding victory in a crunch game 😃 The Mumbai Indians stay alive and how in #TATAIPL 2023 😎#Eliminator | #LSGvMI | #Qualifier2 | @mipaltan pic.twitter.com/qYPQ1XU1BI — IndianPremierLeague (@IPL) May 25, 2023 -
#DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు!
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ కథ ఎలిమినేటర్లో ముగిసింది. వరుసగా రెండోసారి ఎలిమినేటర్ గండం దాటడంలో లక్నో విఫలమైంది. ముంబై ఇండియన్స్ విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో విఫలమైన లక్నో 101 పరుగులకే ఆలౌటై చేతులెత్తేసింది. ఫలితంగా భారీ ఓటమిని మూటగట్టుకొని ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. అయితే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల మధ్య సమన్వయ లోపం. ఒక ఇన్నింగ్స్లో మూడు రనౌట్లు అయ్యాయంటే వారి బ్యాటింగ్ ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే యాదృశ్చికంగా ఈ మూడు రనౌట్లకు ప్రధాన కారణం దీపక్ హుడా. మొదటి రెండు రనౌట్లకు తాను కారణమయ్యాడు.. చివరికి కర్మ ఫలితం అన్నట్లుగా తానే రనౌట్కు బలవ్వాల్సి వచ్చింది. 40 పరుగులతో నిలకడగా ఆడుతున్న మార్కస్ స్టోయినిస్ రనౌట్ కావడానికి ప్రధాన కారణం హుడానే. బంతిపై దృష్టి పెట్టి ఎదుట బ్యాటర్ ఎలా వస్తున్నాడో గమనించకపోగా అతన్నే గుద్దుకోవడంతో స్టోయినిస్ రనౌట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కృష్ణప్ప గౌతమ్ను తన తప్పిదంతో పాటు హుడా ముందుకు పరిగెత్తుకొచ్చి మళ్లీ వెనక్కి వెళ్లిపోవడంతో రనౌట్ అయ్యాడు. ఇక ముచ్చటగా మూడోసారి దీపక్ హుడా రనౌట్ అయ్యాడు. ఎవరి కర్మకు వారే బాధ్యులు అన్నట్లుగా లేని పరుగు కోసం ప్రయత్నించి అనవసరంగా రనౌట్ అయి భారీ నష్టం మిగిల్చాడు. తాను ఆడకపోగా ఇద్దరిని అనవసరంగా రనౌట్ చేసి హుడా పెద్ద తప్పు చేశాడు. ఈ చర్య దీపక్ హుడాను లక్నో జట్టుకు దూరం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. Run out ka Mahual!! Deepak Hooda involved in three run outs!!#LSGvMI #LSGvsMI #IPLFinals #Eliminator #CricketTwitter pic.twitter.com/SNp6Hxiv2A — cricketinsideout (@Cricketinout) May 24, 2023 చదవండి: #Akash Madhwal: దిగ్గజం సరసన.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా -
పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి దిశగా సాగుతుంది. అనవసర ఒత్తిడికి లోనయ్యి వికెట్లు చేజార్చుకుంటున్న లక్నో వరుసగా రెండో సీజన్లోనూ ఎలిమినేటర్లోనే ఇంటిబాట పట్టేలా ఉంది. ఇక స్టోయినిస్ రనౌట్ అయిన తీరు అయితే లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో గ్రీన్ వేసిన ఐదో బంతిని స్టోయినిస్ డీప్ మిడ్వికెట్ మీదుగా ఆడాడు. రిస్క్ అయినా రెండు పరుగులు తీసే అవకాశం ఉండడంతో ఇద్దరు వేగంగానే పరిగెత్తారు. సింగిల్ పూర్తి చేసి రెండో పరుగుకు వస్తున్న యత్నంలో అటు దీపక్ హుడా.. ఇటు స్టోయినిస్ ఇద్దరు బంతిపై దృష్టి పెట్టి తమకు తెలియకుండానే ఒక లైన్లో పరిగెత్తి ఎదురుపడ్డారు. దీంతో మిడిల్పిచ్లోకి రాగానే ఇద్దరు ఒకరినొకరు గుద్దుకున్నారు. అప్పటికే బంతిని అందుకున్న టిమ్ డేవిడ్ నేరుగా ఇషాన్ కిషన్కు త్రో వేయడం.. వికెట్లను గిరాటేయడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ స్టోయినిస్ బంతిపై దృష్టి పెట్టకుండా పరుగు తీసి ఉంటే రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునేవాడేమో. The collision sums up the game for LSG😵#MarcusStoinis #LSGvsMI #IPL2023 #Cricket pic.twitter.com/kMejyL51Jy — Wisden India (@WisdenIndia) May 24, 2023 When Cricketers turn into Actors 😂#LSGvMI #owned #fixing #runout #stoinis #MumbaiIndians #LucknowSuperGiants pic.twitter.com/wOmYcjNO9J — Sai Teja Kolagani (@SaitejaKolagani) May 24, 2023 చదవండి: ప్లేఆఫ్స్.. ముంబై ఇండియన్స్ పేరిట అరుదైన రికార్డు -
'ఆడడమే వ్యర్థమనుకుంటే బ్యాటింగ్లో ప్రమోషన్'
ఐపీఎల్ 16వ సీజన్లో లక్నో సూపర్జెయింట్స్ ఆల్రౌండర్ దీపక్ హుడా వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా మంగళవారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి ఐదు పరుగులు మాత్రమే చేసి బెహండార్ఫ్ బౌలింగ్లో కీపర్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 11 మ్యాచ్లాడిన హుడా 6.9 సగటుతో కేవలం 69 పరుగులు మాత్రమే చేశాడు. ఇలా ఫామ్లో లేని ఆటగాడు అసలు జట్టులో ఆడడమే వ్యర్థం. అలాంటిది కైల్ మేయర్స్ లాంటి స్టార్ ఓపెనర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఎంపిక చేసి అతని స్థానంలో దీపక్ హుడాకు ఓపెనర్గా ప్రమోషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్. అసలు కృనాల్ పాండ్యా ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నాడనేది అంతుచిక్కని ప్రశ్నలా మారింది. వాస్తవానికి కైల్ మేయర్స్ ఈ సీజన్లో మంచి బ్యాటింగ్ కనబరుస్తున్నాడు. 12 మ్యాచ్ల్లో 361 పరుగులు చేసిన మేయర్స్ ఖాతాలో నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి. మేయర్స్ జోరుతో డికాక్ తుదిజట్టులోకి రాలేకపోయాడు. అయితే కేఎల్ రాహుల్ గాయంతో దూరమవ్వడంతో డికాక్కు అవకాశం వచ్చింది. ఇద్దరు కలిసి లక్నోకు రెండు మ్యాచ్ల్లో మంచి శుభారంబాలు అందించారు.ప్లేఆఫ్ కు వెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో మేయర్స్ను పక్కనబెట్టడం ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అతనికి గాయం అనుకున్నా.. మరి కృనాల్ అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఎంపిక చేయడమేంటని వాపోయారు. ఈ నేపథ్యంలో పలు చెత్త రికార్డులు మూట గట్టుకున్నాడు. ఐపీఎల్లో 10 కంటే ఎక్కువ ఇన్నింగ్స్లు ఆడి అత్యంత చెత్త బ్యాటింగ్ యావరేజ్ మూటగట్టుకున్న ఆటగాడిగా హుడా నిలిచాడు. హుడా ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్ల్లో 6.90 సగటు నమోదు చేశాడు. హుడా తర్వాత నికోలస్ పూరన్ 2021లో 7.73, 2016లో మళ్లీ దీపక్ హుడా 10.29, 2021లో ఇయాన్ మోర్గాన్ 11.08 సగటు నమోదు చేశారు. ఇక ఐపీఎల్లో దీపక్ హుడా తను ఎదుర్కొన్న తొలి 10 బంతుల వ్యవధిలో ఓటవ్వడం ఇది ఏడోసారి.. ఈ క్రమంలో సాహాతో కలిసి తొలి స్థానంలో ఉన్నాడు. ఆండ్రీ రసెల్, రోహిత్ శర్మ, సునీల్ నరైన్లు ఆరేసి సార్లు ఔటయ్యారు. Two in two for Behrendorff 🔥 Deepak Hooda fails yet again!#LSGvMI #IPL2023 #LucknowSuperGiants pic.twitter.com/8bkggkEvTK — OneCricket (@OneCricketApp) May 16, 2023 Ireland basher Deepak hooda in IPL 2023 Inning - 11 Run - 69 Average - 6 🤢 Strike rate - 89 🤧 this fraud played ahead of Shreyas Iyer in T20 worldcup 😶 pic.twitter.com/JjZ8ONzaMD — , (@AltofLeg) May 16, 2023 చదవండి: గుజరాత్ గెలిచినా.. నెహ్రాలో కనిపించని సంతోషం -
అతడిని ఎందుకు బ్యాటింగ్కు పంపారో తెలియదు? లక్నో నిర్ణయంపై సెహ్వాగ్ ఫైర్!
ఐపీఎల్-2023లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో 56 పరుగుల తేడాతో లక్నో పరాజయం పాలైంది. 228 పరుగల భారీ లక్క్ష్య ఛేదనలో లక్నోకు ఓపెనర్లు డికాక్, కైల్ మైర్స్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. అయినప్పటికీ మిడిలార్డర్లో బ్యాటర్లు రాణించకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకే లక్నో పరిమితమైంది. ఇక లక్నో ఓటమిపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వాఖ్యలు చేశాడు. లక్నో తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగానే పరాజయం పాలైంది అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. దీపక్ హుడాకు బదులుగా మూడో స్థానంలో ఇన్-ఫామ్ బ్యాటర్ను పంపి ఉండాల్సిందని సెహ్వాగ్ తెలిపాడు. "10 ఓవర్లకు లక్నో కేవలం ఒక వికెట్ మాత్రమే నష్టపోయి 102 పరుగులతో పటిష్టంగా కన్పించారు. ఇటువంటి స్థితిలో ఉన్న లక్నో ఇంత భారీ తేడాతో ఓడిపోతుందని అస్సలు ఊహించలేదు. మొదటి వికెట్ తర్వాత ఫామ్లో ఉన్న బ్యాటర్ రావల్సింది. పూరన్, మార్కస్ స్టోయినిస్, కెప్టెన్ కృనాల్ పాండ్యా వచ్చినా బాగుండేది. అదే విధంగా వారి ఆఖరి మ్యాచ్లో చెన్నైపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ బదోని అయినా పంపాల్సింది. కానీ లక్నో మాత్రం వీరివ్వరూ కాకుండా దీపక్ హుడాను బ్యాటింగ్కు వచ్చాడు. అస్సలు హుడాను ఎందుకు పంపారో ఆర్ధం కావడం లేదు. అదే వాళ్ల కొంపముంచింది" అని క్రిక్బజ్తో సెహ్వాగ్ పేర్కొన్నాడు. చదవండి: WTC FInal 2023: రుత్రాజ్ గైక్వాడ్కు బంపరాఫర్.. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో! -
LSG Vs RCB: ఎందుకు వస్తున్నాడో తెలియదు..చెత్త బ్యాటింగ్! ఇంకా జట్టులో అవసరమా?తీసిపడేయండి
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ దీపక్ హుడా తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. లక్నోలోని ఎకానా స్టేడియంయ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో దీపక్ హుడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. లక్నో కేవలం 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో దీపక్ హుడా క్రీజులో వచ్చాడు. ఈ సమయంలో ఎంతో బాధ్యతయుతంగా ఆడిల్సిన అతడు.. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి స్టంపౌట్గా వెనుదిరిగాడు. ఈ సీజన్లో మాత్రం హుడా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన అతడు కేవలం 53 పరుగులు మాత్రమే చేశాడు. 17, 2, 7, 9, 2, 2, 2, 11, 1 ఇవి అతడు తన ఆఖరి తొమ్మిది ఇన్నింగ్స్లలో చేసిన పరుగులు. ఇక వరుసగా విఫలమవుతున్నప్పటికీ అతడికి అవకాశం ఇస్తున్న లక్నో మేనెజ్మెంట్పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంత చెత్త ప్రదర్శన చేస్తున్నప్పటికీ ఇంకా జట్టులో చోటు అవరసరమా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి కొంత మంది హుడా తప్ప ఇంకా ఎవరూ జట్టులో లేరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీ చేతిలో 18 పరుగుల తేడాతో లక్నో ఓటమి పాలైంది. చదవండి: #Kohli Vs Naveen-ul-Haq: పో నేనేం సారీ చెప్పను.. కోహ్లిపై నవీన్ సీరియస్!? మరీ ఇంత తలపొగరా? వీడియో వైరల్ -
ఐపీఎల్-2023లో చెత్తగా ఆడుతుంది వీరే.. వీరితో ఓ జట్టు తయారు చేస్తే ఇలా ..!
ఐపీఎల్-2023లో స్వదేశీ విదేశీ ఆటగాళ్లు అన్న తేడా లేకుండా భారీ అంచనాలు పెట్టుకున్న చాలామంది ఉసూరుమనిపించారు. వీరి చెత్త ప్రదర్శనతో ఫ్రాంచైజీలతో పాటు అభిమానులు సైతం విసిగివేసారిపోయారు. ఇప్పటివరకు (ఏప్రిల్ 30) జరిగిన 42 మ్యాచ్ల్లో ఏయే ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారో, వారందరిని కలిపి ఓ జట్టుగా తయారు చేస్తే ఇలా ఉంటుంది. ఓపెనర్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా (8 కోట్లు, 6 మ్యాచ్ల్లో 47 పరుగులు), ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (16 కోట్లు, 8 మ్యాచ్ల్లో 184 పరుగులు, ఒక్క హాఫ్సెంచరీ), వన్ డౌన్లో సన్రైజర్స్ మయాంక్ అగర్వాల్ (8.25 కోట్లు, 8 మ్యాచ్ల్లో 169 పరుగులు), నాలుగో స్థానంలో లక్నో దీపక్ హుడా (5.75 కోట్లు, 8 మ్యాచ్ల్లో 52 పరుగులు), ఐదులో రాజస్థాన్ రియాన్ పరాగ్ (3.80 కోట్లు, 5 మ్యాచ్ల్లో 54 పరుగులు), ఆరులో ఆర్సీబీ దినేశ్ కార్తీక్ (5.5 కోట్లు, 8 మ్యాచ్ల్లో 83), ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు, 7 మ్యాచ్ల్లో 60 పరుగులు, 3 వికట్లు), ఎనిమిదో ప్లేస్లో ఆర్సీబీ షాబాజ్ అహ్మద్ (2.4 కోట్లు, 8 మ్యాచ్ల్లో 42 పరుగులు, 0 వికెట్లు), 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ (8 కోట్లు, 3 మ్యాచ్ల్లో ఒక్క పరుగు, 2 వికెట్లు), 10లో కేకేఆర్ ఉమేశ్ యాదవ్ (2 కోట్లు, 8 మ్యాచ్ల్లో ఒక్క వికెట్, 19 పరుగులు), 11వ స్థానంలో కేకేఆర్ లోకి ఫెర్గూసన్ (10 కోట్లు, 3 మ్యాచ్ల్లో 12.52 ఎకానమీతో ఒక్క వికెట్). వీరు కాక ఇంకా ఎవరైనా చెత్త ప్రదర్శన (కనీసం ఒక్క మ్యాచ్లో కూడా రాణించని వారు) చేసిన ఆటగాళ్లు ఉంటే కామెంట్ చేయండి. -
ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్లో ఇంతే! తీసి పడేయండి..
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మిడిలార్డర్ బ్యాటర్ దీపక్ హుడా తన పేలవ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో మరోసారి హుడా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్లో 4 బంతులు ఎదుర్కొన్న దీపక్.. కేవలం 2 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడిన హుడా 6.50 సగటుతో కేవలం 39 పరుగులు మాత్రమే సాధించాడు. అతడి ఇన్నింగ్స్లలో 17 పరుగులు అత్యధిక స్కోర్గా ఉన్నాయి. గతేడాది సీజన్లో మాత్రం హుడా అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో మాత్రం తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇక దారుణ ప్రదర్శన కనబరుస్తున్న హుడా నెటిజన్లు మండిపడుతున్నారు. అదే విధంగా వరుసగా విఫలమవతున్నప్పటికీ హుడాకు.. లక్నో ఎందుకు ఛాన్స్లు ఇస్తుందో ఆర్ధం కావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది.. అతడు ఎందుకు వస్తున్నాడో తెలియదు, ప్రతీ మ్యాచ్లో ఒకటే ఆటతీరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్తాన్ రాయల్స్పై 10 పరుగుల తేడాతో లక్నో విజయం సాధిచింది. ఈ ఏడాది సీజన్లో లక్నోకు ఇది నాలుగో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో లక్నో 8 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. చదవండి: Sanju Samson: 'గెలవాల్సిన మ్యాచ్ను పోగొట్టుకున్నాం.. ఇదో గుణపాఠం' #KLRahul: 'డికాక్ను మిస్ అవుతున్నా.. ఏం చేయలేని పరిస్థితి!' -
Ind Vs SL: హుడా.. మరీ ఇంత అసభ్యంగా మాట్లాడతావా? ఇది ఊహించలేదు!
India vs Sri Lanka, 1st T20I- Deepak Hooda: స్వదేశంలో.. కొత్త సంవత్సరం శ్రీలంకతో మొదటి టీ20 మ్యాచ్... రాణిస్తారనుకున్న వాళ్లు పెవిలియన్కు క్యూ కట్టడం.. 11–15 ఓవర్ల మధ్య కేవలం 26 పరుగులే! అప్పటికే నాలుగు వికెట్లు చేజారాయి.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదుకుంటాడనుకుంటే.. 29 పరుగులు చేసిన ఈ ఆల్రౌండర్ను దిల్షాన్ మధుషంక పెవిలియన్కు పంపాడు. హుడా, అక్షర్ సూపర్ అప్పటికి టీమిండియా స్కోరు 94/5. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్పిన్ ఆల్రౌండర్లు దీపక్ హుడా, అక్షర్ పటేల్ కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. 23 బంతుల్లో హుడా 41 పరుగులతో, 20 బంతుల్లో 31 పరుగులతో అక్షర్ ఆఖరి వరకు అజేయంగా నిలిచారు. తద్వారా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి టీమిండియా 162 పరుగుల స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లంక ఆఖర్లో తడబడటంతో 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్ హుడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అవసరమైన సమయంలో జట్టును ఆదుకుని అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. That's that from the 1st T20I.#TeamIndia win by 2 runs and take a 1-0 lead in the series. Scorecard - https://t.co/uth38CaxaP #INDvSL @mastercardindia pic.twitter.com/BEU4ICTc3Y — BCCI (@BCCI) January 3, 2023 మరీ ఇంత నీచంగా మాట్లాడతావా? అయితే, అదే సమయంలో అంపైర్తో అనుచిత ప్రవర్తన కారణంగా దీపక్ హుడాపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నీ నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదని, అసభ్య పదజాలం వాడాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో ఇదే నేర్పించారా?’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. భారత ఇన్నింగ్స్లో 18వ ఓవర్లో కసున్ రజిత ఐదో బంతిని అవుట్సైడ్ దిశగా వేయగా.. తొలుత షాట్ ఆడాలనుకున్న హుడా.. దానిని వదిలేశాడు. ఈ బంతిని అంపైర్ వైడ్గా ప్రకటిస్తాడనుకున్నాడు. కానీ అలా జరుగలేదు. అప్పటికే లో స్కోరింగ్ (133-5)నేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న హుడా.. అంపైర్ను ఉద్దేశించి అసభ్య పదజాలం వాడాడు. అతడితో వాదనకు కూడా దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో హుడా ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు మాత్రం అంపైర్ ఇందుకు అర్హుడే అంటూ విపరీత వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్ మాలిక్.. త్వరలోనే అక్తర్ను కూడా! Pele: బరువెక్కిన హృదయంతో బోరున విలపిస్తూ.. అంతిమ వీడ్కోలు.. పీలే అంత్యక్రియలు పూర్తి Deepak Hooda abused the umpire for not giving wide 😂 he said 'BKL' . Man is turning furious in every way #INDvSL pic.twitter.com/COV1IArJ0f — Akshat (@AkshatOM10) January 3, 2023 -
విజయంతో మొదలు...
హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని టీమిండియా కొత్త ఏడాదిని విజయంతో మొదలు పెట్టింది. బ్యాటింగ్లో సాధారణ స్కోరుకే పరిమితమైనా చివరకు ఉత్కంఠను అధిగమించి దానిని కాపాడుకోగలిగింది. ఆఖరి బంతికి 4 పరుగులు చేయాల్సిన లంక సింగిల్ మాత్రమే తీయడంతో గెలుపు టీమిండియా పరమైంది. బ్యాటింగ్లో దీపక్ హుడా ఆదుకోగా, తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన శివమ్ మావి ఓవర్కు ఒక్కో వికెట్ చొప్పున నాలుగు వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ముంబై: శ్రీలంకతో టి20 సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచి 1–0తో ముందంజ వేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ హుడా (23 బంతుల్లో 41 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్లు), ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్లు), అక్షర్ పటేల్ (20 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం లంక 20 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షనక (27 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలవగా, శివమ్ మావి (4/22) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. రెండో టి20 రేపు పుణేలో జరుగుతుంది. కీలక భాగస్వామ్యం... రజిత వేసిన తొలి ఓవర్లో ఇషాన్ కిషన్ ఒక సిక్స్, 2 ఫోర్లు కొట్టగా, మొత్తం 17 పరుగులతో భారత్ ఇన్నింగ్స్ జోరుగా మొదలైంది. అయితే ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. లంక బౌలర్లు చక్కటి బంతులతో భారత్ను కట్టిపడేశారు. అరంగేట్ర మ్యాచ్లో శుబ్మన్ గిల్ (7) విఫలం కాగా, సూర్యకుమార్ (7), సంజు సామ్సన్ (5) విఫలమయ్యారు. పవర్ప్లేలో జట్టు 41 పరుగులకే పరిమితమైంది. మరోవైపు రజిత ఓవర్లోనే వరుస బంతుల్లో 6, 4 కొట్టిన కిషన్ మళ్లీ భారీ షాట్కు ప్రయత్నించి వెనుదిరిగాడు. 11–15 ఓవర్ల మధ్య 26 పరుగులే చేయగలిగిన భారత్ హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 29; 4 ఫోర్లు) వికెట్ కూడా చేజార్చుకుంది. అయితే చివర్లో హుడా దూకుడు టీమిండియాకు మెరుగైన స్కోరు అందించింది. తీక్షణ బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన హుడా... హసరంగ, రజిత ఓవర్లలో ఒక్కో సిక్స్ బాదాడు. మదుషంక ఓవర్లో అక్షర్ కూడా సిక్స్, ఫోర్తో తన వంతు సహకారం అందించాడు. హుడా, అక్షర్ ఆరో వికెట్కు అభేద్యంగా 35 బంతుల్లోనే 68 పరుగులు జోడించారు. షనక మినహా... తన తొలి మ్యాచ్ తొలి ఓవర్లోనే వికెట్తో మావి ఆకట్టుకున్నాడు. నిసాంక (1)ను బౌల్డ్ చేసిన అతను, తన తర్వాతి ఓవర్లో ధనంజయ (8)ను వెనక్కి పంపాడు. మొదటి 6 ఓవర్లలో లంక 32 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత నాలుగు పరుగుల వ్యవధిలో మరో 2 వికెట్లు కోల్పోయిన లంక సగం ఓవర్లు ముగిసేసరికి 66 పరుగులకే పరిమితమైంది. అయితే కెప్టెన్ షనక, హసరంగ దూకుడుతో జట్టు కొంత పోరాడగలిగింది. చహల్ ఓవర్లో హసరంగ వరుసగా రెండు సిక్సర్లు బాదగా, హర్షల్ ఓవర్లో షనక 6, 4 కొట్టాడు. అయితే 21 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో షనకను ఉమ్రాన్ అవుట్ చేయడంతో లంక గెలుపు ఆశలు కోల్పోయింది. మావి, గిల్ అరంగేట్రం తొలి టి20 ద్వారా భారత్ ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. అర్‡్షదీప్ అనారోగ్యం నుంచి కోలుకోకపోవడంతో పేసర్ శివమ్ మావి జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్తో శుబ్మన్ గిల్ కూడా అంతర్జాతీయ టి20ల్లో అడుగుపెట్టాడు. భారత్ తరఫున ఇప్పటికే 13 టెస్టులు, 15 వన్డేలు ఆడిన గిల్కు ఇదే తొలి టి20 మ్యాచ్. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) ధనంజయ (బి) హసరంగ 37; గిల్ (ఎల్బీ) (బి) తీక్షణ 7; సూర్యకుమార్ (సి) రాజపక్స (బి) కరుణరత్నే 7; సామ్సన్ (సి) మదుషంక (బి) ధనంజయ 5; హార్దిక్ (సి) మెండిస్ (బి) మదుషంక 29; హుడా (నాటౌట్) 41; అక్షర్ (నాటౌట్) 31; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–27, 2–38, 3–46, 4–77, 5–94. బౌలింగ్: రజిత 4–0–47–0, మదుషంక 4–0–35–1, తీక్షణ 4–0–29–1, కరుణరత్నే 3–0–22–1, ధనంజయ 1–0–6–1, హసరంగ 4–0–22–1. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (బి) మావి 1; మెండిస్ (సి) సామ్సన్ (బి) హర్షల్ 28; ధనంజయ (సి) సామ్సన్ (బి) మావి 8; అసలంక (సి) కిషన్ (బి) ఉమ్రాన్ 12; రాజపక్స (సి) హార్దిక్ (బి) హర్షల్ 10; షనక (సి) చహల్ (బి) ఉమ్రాన్ 45; హసరంగ (సి) హార్దిక్ (బి) మావి 21; కరుణరత్నే (నాటౌట్) 23; తీక్షణ (సి) సూర్యకుమార్ (బి) మావి 1; రజిత (రనౌట్) 5; మదుషంక (రనౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 160. వికెట్ల పతనం: 1–12, 2–24, 3–47, 4–51, 5–68, 6–108, 7–129, 8–132, 9–159, 10–160. బౌలింగ్: హార్దిక్ 3–0–12–0, శివమ్ మావి 4–0–22–4, ఉమ్రాన్ 4–0–27–2, చహల్ 2–0–26–0, హర్షల్ 4–0–41–2, అక్షర్ 3–0–31–0. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దీపక్ హుడా, అక్షర్ సూపర్ ఇన్నింగ్స్.. శ్రీలంక టార్గెట్ 163 పరుగులు
ముంబై వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా పర్వాలేదనిపించింది. దీపక్ హుడా(41), ఇషాన్ కిషన్(37), అక్షర్ పటేల్(31) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నస్టానికి 162 పరుగులు చేసింది. కాగా హుడా, అక్షర్ పటేల్ కలిసి 68 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక టీ20లో అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్(7) నిరాశపరిచాడు. అదే విధంగా విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యాదవ్(7) కూడా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 29 పరుగులతో రాణించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో మధుషంక, థీక్షణ, కరుణరత్నే, డిసిల్వా, హసరంగా తలా వికెట్ సాధించారు. చదవండి: IND vs SL: అతడు ఏం పాపం చేశాడు.. డ్రింక్స్ అందించడానికా సెలక్ట్ చేశారు? -
శతక్కొట్టిన దీపక్ హుడా.. 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో..!
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో టీమిండియా పరిమిత ఓవర్ల బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ (80 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్ సాయంతో 90 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. కేరళతో ఇవాళే (డిసెంబర్ 20) మొదలైన మ్యాచ్లో రాజస్తాన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న దీపక్ హుడా (187 బంతుల్లో 133; 14 ఫోర్లు, సిక్స్) సెంచరీతో విరుచుకుపడ్డాడు. గత కొంతకాలంగా టీమిండియా తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్లో చెలరేగిపోతున్న ఈ ఇద్దరూ.. రంజీల్లోనూ తమ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నారు. సూర్యకుమార్, దీపక్ హుడా రాణించడంతో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు తొలి రోజు పూర్తి ఆధిపత్యం కొనసాగించాయి. కేరళతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్.. హూడా సెంచరీతో, యశ్ కొఠారీ (58), సల్మాన్ ఖాన్ (62 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కేరళ బౌలర్లలో జలజ్ సక్సేనా 2 వికెట్లు పడగొట్టగా.. బాసిల్ థంపి, ఫజిల్ ఫనూస్, సిజోమోన్ జోసఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై తొలి ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 457 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్యకుమార్ (90) పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. యశస్వి జైస్వాల్ (162), కెప్టెన్ అజింక్య రహానే (139 నాటౌట్) సెంచరీలతో విజృంభించారు. హైదరాబాద్ బౌలర్లలో శశాంక్ 2 వికెట్లు పడగొట్టగా, కార్తీకేయ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్గా..
India tour of New Zealand, 2022 : న్యూజిలాండ్తో రెండో వన్డేలో భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా విస్మయం వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ అసలేం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదని.. ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదని విమర్శించాడు. తప్పుడు నిర్ణయాలతో జట్టును భ్రష్టు పట్టించవద్దని ఘాటు విమర్శలు చేశాడు. దీపక్ బౌలింగ్ ఆప్షన్ కాదు! కాగా కివీస్తో మొదటి వన్డేలో చోటు దక్కించుకున్న బ్యాటర్ సంజూ శాంసన్, బౌలర్ శార్దూల్ ఠాకూర్లను ఆదివారం నాటి రెండో మ్యాచ్లో పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజూ స్థానంలో దీపక్ హుడా, శార్దూల్ స్థానంలో దీపక్ చహర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ బ్రాడ్కాస్టర్ అమెజాన్ ప్రైమ్ వీడియో చర్చలో పాల్గొన్న ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగడం మనం చూశాం. దీపక్ హుడాను బౌలింగ్ ఆప్షన్గా తీసుకున్నారని నేనైతే అనుకోవడం లేదు. నిజానికి అతడు వరల్డ్కప్ టోర్నీలో వికెట్లు తీసి ఉండవచ్చు. అయితే, ఇప్పుడు జట్టులో వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు కదా! నిజానికి వాళ్లకు దీపక్ హుడా ఆరో బౌలింగ్ ఆప్షన్ కావొచ్చు. కానీ మరీ అంత గొప్ప ఆల్రౌండర్ ఏమీ కాదు. చహర్ బెటర్.. అయినా శార్దూల్ ఠాకూర్ గత మ్యాచ్లో బాగా ఆడలేదని కాదు.. అయితే తనకంటే దీపక్ చహర్ బెటర్. అయినా మొదటి మ్యాచ్లో చహర్ను కాదని ఠాకూర్ను ఆడించారు. కానీ.. ఆ మరుసటి మ్యాచ్కే ఠాకూర్ను తప్పించారు. ఇది సరికాదు’’ అని నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఇక సంజూ శాంసన్ గురించి స్పందిస్తూ.. ‘‘ఒకవేళ నేను సెలక్టర్గా ఉంటే.. సంజూను కాదని హుడానే ఆడించేవాడిని. హుడా కోసం సంజూను బలి చేయాలా? అయితే, ఆరో బౌలింగ్ ఆప్షన్గా మాత్రం కాదు’’ అంటూ హుడాకు మద్దతుగా నిలవడం గమనార్హం. అయితే, చర్చలో భాగంగా ఇందుకు స్పందించిన మరో మాజీ క్రికెటర్ మురళీ కార్తిక్.. ‘‘ఆశిష్ అన్నట్లు హుడాను బ్యాటర్గా ఎంపిక చేయడం వరకు ఒకే! బౌలింగ్ ఆప్షన్గా కూడా వాడుకోవడం మంచి విషయమే. హుడా తుది జట్టులోకి రావడం కోసం మరొకరిని పక్కన పెట్టడం సరికాదు. నిజానికి, సంజూ శాంసన్ గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన కనబరస్తున్నప్పటికీ అతడికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇప్పుడేమో ఇలా ఒక్క మ్యాచ్ తర్వాత మళ్లీ పక్కన పెట్టారు’’ అని సంజూకు అండగా నిలబడ్డాడు. అయితే, తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నీ ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని కార్తిక్ అభిప్రాయపడ్డాడు. కావాలనే చేశారు! అదేం కాదు.. మొదటి వన్డేలో ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సంజూ శాంసన్ 36 పరుగులతో రాణించాడు. అయితే, గత కొంతకాలంగా విఫలమవుతున్న మరో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మాత్రం మరోసారి తక్కువ స్కోరు(15)కే పెవిలియన్ చేరాడు. దీంతో సంజూను వివక్షపూరితంగానే పక్కన పెట్టారంటూ అతడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బీసీసీఐని ట్రోల్ చేశారు. ఇక ఈ మ్యాచ్ వర్షార్పణమైన తర్వాత కెప్టెన్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ఆరో బౌలర్ అవసరమైనందు వల్లే సంజూకు బదులు హుడాను తీసుకున్నామని తెలిపాడు. అదే విధంగా పిచ్ స్వింగ్కు అనుకూలంగా ఉంటుందని భావించి ఠాకూర్ను తప్పించి చహర్కు ఛాన్స్ ఇచ్చినట్లు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు.. సంజూ అభిమానులు మాత్రం స్పిన్ బౌలింగ్ చేయగల హుడాను తీసుకున్నప్పటికీ.. వికెట్ కీపర్గా పంత్ను కాదని శాంసన్కు అవకాశం ఇవ్వొచ్చు కదా అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన ఐపీఎల్ 2022 ఫైనల్.. ఎందుకంటే..? IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? -
NZ vs IND: న్యూజిలాండ్తో రెండో వన్డే.. పంత్కు నో ఛాన్స్! దీపక్ వైపే మొగ్గు
ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హామిల్టన్ వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే హామిల్టన్కు చేరుకున్న ధావన్ సేన నెట్ ప్రాక్టీస్లో నిమగ్నమైంది. ఇక తొలి వన్డేలో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించనప్పటికీ.. బౌలర్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. తొలి పవర్ ప్లేలో భారత బౌలర్లు పర్వాలేదనిపించినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. పంత్కు నో చాన్స్.. ఇక కీలకమైన రెండో వన్డేలో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న పంత్ స్థానంలో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో 23 బంతులు ఎదుర్కొన్న పంత్ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఒక వేళ పంత్ మ్యాచ్కు దూరమైతే ధావన్ డిప్యూటీగా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. అదే విధంగా తొలి వన్డేలో దారుణంగా విఫలమైన యుజువేంద్ర చాహల్ స్థానంలో చైనామాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇవ్వాలని జట్టు మేనేజేమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. కాగా తొలి వన్డేలో చాహల్ తన 10 ఓవర్ల కోటాలో వికెట్లు ఏమీ సాధించకుండా 67 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు దీపక్ చాహర్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. వర్షం ముప్పు భారత్-న్యూజిలాండ్ రెండో వన్డేకు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఆదివారం హామిల్టన్లో 91 శాతం వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది చదవండి: Jasprit Bumrah: టీమిండియాకు గుడ్ న్యూస్.. యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు! -
దీపక్ హుడా సరికొత్త చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా!
న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో 65 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 126 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో దీపక్ హుడా నాలుగు వికెట్లతో చెలరేగగా.. చాహల్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో విలియమ్సన్ఒక్కడే 61 పరుగులతో రాణించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 51 బంతులు ఎదర్కొన్న సూర్యకుమార్ 11 ఫోర్లు, 7 సిక్స్లతో 111 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అదే విధంగా న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. దీపక్ హుడా అరుదైన రికార్డు ఇక నాలుగు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన దీపక్ హుడా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన హుడా 4వికెట్లు పడగొట్టి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తద్వారా న్యూజిలాండ్పై టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. చదవండి: IND vs NZ: పాపం శ్రేయస్ అయ్యర్.. అసలు ఊహించి ఉండడు! వీడియో వైరల్ -
T20 WC: 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. గట్టి సవాల్! ఎట్టకేలకు టీమిండియా..
T20 World Cup 2022 India First Practice Match- Ind Vs WA XI: వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్తో ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా గెలుపొందింది. సూపర్ ఫామ్లో ఉన్న సూర్యకుమార్ అర్ధ శతకంతో రాణించగా.. పేసర్లు అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. దీంతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్ 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్-2022 సన్నాహకాల్లో భాగంగా టీమిండియా పెర్త్ వేదికగా ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సోమవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్తో తలపడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. లక్ష్య ఛేదనకు దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చహల్ చుక్కలు చూపించారు. ఈ క్రమంలో పవర్ ప్లే ముగిసే సరికి కేవలం 29 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో కూరుకుపోయిన జట్టును సామ్ ఫానింగ్ ఆదుకున్నాడు. 59 పరుగులు సాధించి టీమిండియాకు సవాల్ విసిరాడు. అయితే, మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో 145 పరుగులకు వెస్ట్రన్ ఆస్ట్రేలియా కథ ముగిసింది. వారెవ్వా.. అర్ష్దీప్ సింగ్ భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్కు మూడు(3/6), చహల్కు రెండు(2/15), భువనేశ్వర్ కుమార్కు రెండు(2/26) వికెట్లు, హర్షల్ పటేల్కు ఒక వికెట్ దక్కాయి. 3 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడంటూ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. మరోవైపు భువీ సైతం ఫామ్లోకి వచ్చాడని.. అసలైన పోరులో మరింత మెరుగ్గా రాణించాలని ఆకాంక్షిస్తున్నారు. వాళ్లిద్దరూ తుస్సుమన్నారు.. అయినా ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ(3)కు జోడీగా రిషభ్ పంత్(9) ఓపెనర్గా వచ్చాడు. వీరిద్దరు పూర్తిగా నిరాశపరచగా.. వన్డౌన్ బ్యాటర్ దీపక్ హుడా 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. సూర్య నాలుగో స్థానంలో వచ్చి 35 బంతుల్లోనే 52 పరుగులు సాధించాడు. హార్దిక్పాండ్యా 27, దినేశ్కార్తిక్ 19(నాటౌట్), అక్షర్ పటేల్ 10, హర్షల్ పటేల్ 5 పరుగులు చేశారు. కాగా అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్తో టీమిండియా ఐసీసీ ఈవెంట్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. టీమిండియా వర్సెస్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్ ప్రాక్టీస్ మ్యాచ్ భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చహల్. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్: డీ ఆర్సీ షార్ట్, ఆరోన్ హార్డీ, కామెరాన్ బాన్క్రాఫ్ట్(వికెట్ కీపర్), అష్టన్ టర్నర్(కెప్టెన్), సామ్ ఫానింగ్, హమీష్ మెకెంజీ, జై రిచర్డ్సన్, ఆండ్రూ టై, జాసన్ బెహ్రెన్డార్ఫ్, మాథ్యూ కెల్లీ, నిక్ హాబ్సన్. చదవండి: Ind Vs SA: టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు.. ఇతర జట్లకు అందనంత దూరంలో! ఇక అయ్యర్.. టీమిండియా బౌలర్ల విజృంభణ.. 37 పరుగులకే కుప్పకూలిన ప్రత్యర్ధి T20 WC 2022 Final: ఈసారి ఫైనల్లో వెస్టిండీస్తో పోటీపడేది ఆ జట్టే! ఇంకా.. That's that from the practice match against Western Australia.#TeamIndia win by 13 runs. Arshdeep Singh 3/6 (3 overs) Yuzvendra Chahal 2/15 Bhuvneshwar Kumar 2/26 pic.twitter.com/NmXCogTFIR — BCCI (@BCCI) October 10, 2022 -
T20 WC 2022: ఈ ముగ్గురిని ఎంపిక చేసి తప్పుచేశారా? వీళ్లకు బదులు..
T20 World Cup 2022- Indian Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు ఇప్పటికే జట్లను ప్రకటించాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం సెప్టెంబరు 12న 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. నలుగురిని స్టాండ్ బైగా ఎంపిక చేసింది. ఇక వరల్డ్కప్ కంటే ముందు రోహిత్ సేన స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడింది. అయితే, 2-1తో ట్రోఫీ కైవసం చేసుకున్నప్పటికీ బౌలింగ్ వైఫల్యం, ఫీల్డింగ్ తప్పిదాలు కలవరపెట్టే అంశాలుగా పరిణమించాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ ప్రధాన జట్టుకు ఎంపికైన కొంతమంది క్రికెటర్ల ఆట తీరు ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లను బీసీసీఐ ఎందుకు సెలక్ట్ చేసిందా? అని చాలా మంది పెదవి విరుస్తున్నారు. యజువేంద్ర చహల్ టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఆస్ట్రేలియాతో సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మూడు మ్యాచ్లలో తుది జట్టులో చోటు దక్కించుకున్న అతడు 9.12 ఎకానమీతో బౌలింగ్ చేసి.. రెండే రెండు వికెట్లు తీశాడు. ఇక ఆసియా కప్-2022 టీ20 టోర్నీలోనూ సూపర్-4లో శ్రీలంకతో మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టడం మినహా తన స్థాయికి తగ్గట్లు రాణించలేక నిరాశపరిచాడు యుజీ. ముఖ్యంగా స్లోగా బంతులు వేయడంలో విఫలమవుతున్నాడు. సమకాలీన లెగ్ స్పిన్నర్లు ఆస్ట్రేలియాకు చెందిన ఆడం జంపా, అఫ్గనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ మాదిరి రాణించలేకపోతున్నాడు. దీంతో.. అతడి స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయిని ప్రధాన జట్టుకు ఎంపిక చేసినా బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అనుభవం దృష్ట్యా యుజీకి ఓటు వేయడమే సబబు అంటున్నారు అతడి ఫ్యాన్స్. భువనేశ్వర్ కుమార్ టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరుగాంచిన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆస్ట్రేలియాతో సిరీస్లో తేలిపోయాడు. ఈ సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడిన ఈ స్పీడ్స్టర్ 91 పరుగులు సమర్పించుకున్నాడు. గతేడాది వరకు టీమిండియా టీ20 అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా కొనసాగిన ఈ స్వింగ్ సుల్తాన్.. గాయం కారణంగా కొన్నిరోజులు జట్టుకు దూరమయ్యాడు. అయితే, తిరిగి జట్టులోకి వచ్చినా అవకాశాల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా డెత్ఓవర్లలో ఒత్తిడిని అధిగమించలేక విఫలమవుతున్నాడు. ఆసియా కప్-2022 టీ20 టోర్నీ, ఆసీస్తో సిరీస్లో డెత్ ఓవర్లలో అతడి వైఫల్యం కనబడింది. నకుల్ బాల్స్, కట్టర్లు వేయడంలో దిట్ట అయిన భువీ ప్రస్తుతం ఫామ్లేమితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ వెటరన్ పేసర్కు బదులు స్టాండ్ బైగా ఉన్నా దీపక్ చహర్ను ఎంపిక చేసినా బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీపక్ హుడా వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్న దీపక్ హుడా.. ఆసీస్తో సిరీస్కు సైతం ఎంపికయ్యాడు. అయితే, ఒక్క మ్యాచ్లోనూ తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఇక వెన్ను నొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్కు అతడు దూరమయ్యాడు. దీంతో.. ప్రపంచకప్ స్టాండ్ బై ప్లేయర్లలో ఒకడిగా ఉన్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్తో దీపక్ స్థానాన్ని భర్తీ చేశారు. నిజానికి దీపక్ టాపార్డర్లో మెరుగ్గా రాణించగలడు. అవసరమైనపుడు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఒకవేళ గాయం నుంచి కోలుకుని ప్రపంచకప్ ఆరంభ సమయానికి అతడు అందుబాటులో ఉన్నా.. అతడు బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్తో పాటు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా.. ఈ ఐదుగురు కచ్చితంగా తుది జట్టులో ఉంటారు. కాబట్టి టాపార్డర్లో దీపక్ హుడాతో పనిలేదు. ఇక బౌలింగ్ కారణంగా ఆల్రౌండర్ల జాబితాలో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయనుకున్నా.. అక్షర్ పటేల్ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అదీ అసాధ్యంగానే కనిపిస్తుంది. అందుకే హుడాను ప్రపంచకప్నకు సెలక్ట్ చేసి కూడా పెద్దగా ఉపయోగం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బ్యాకప్ బ్యాటర్ కావాలనుకుంటే లెఫ్ట్ హ్యాండర్ ఇషాన్ కిషన్ లేదంటే విలక్షణమైన బ్యాటర్గా పేరొందిన సంజూ శాంసన్ను ఎంపిక చేసినా బాగుండేదంటున్నారు విశ్లేషకులు. జట్టులో మార్పునకు సమయం ఉన్న తరుణంలో ఇప్పటికైనా మార్పులుచేర్పులు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. చదవండి: Sandeep Lamichhane: స్టార్ క్రికెటర్ కోసం ఇంటర్పోల్ను ఆశ్రయించిన పోలీసులు -
T20 World Cup 2022: భారత్కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు భారత్కు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. భారత స్టార్ ఆల్ రౌండర్ దీపక్ హుడా గాయం కారణంగా స్వదేశంలో జరిగే దక్షిణాఫ్రికాతో సిరీస్తో పాటు టీ20 ప్రపంచకప్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. హుడా ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ఎంపికైనప్పటికీ.. వెన్ను నొప్పి కారణంగా కేవలం బెంచ్కే పరిమితమయ్యాడు. ఈ విషయాన్నిబీసీసీఐ ట్విటర్లో ఆదివారం వెల్లడించింది. "ఆస్ట్రేలియాతో మూడో టీ20 తుది జట్టు ఎంపికకు దీపక్ హుడా అందుబాటులో లేడు. అతడు వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు" అని బీసీసీఐ ట్విటర్లో పేర్కొంది. కాగా గత కొంత కాలంగా హుడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో అదరగొట్టిన హుడా భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్కు ఎంపిక జట్టులో హుడా సభ్యుడిగా ఉన్నాడు. చదవండి: IND Vs AUS: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. రెండో భారత కెప్టెన్గా -
T20 WC: నేనైతే వాళ్లిద్దరిని సెలక్ట్ చేసేవాడిని! నువ్వొక మాజీ కెప్టెన్.. కానీ ఏం లాభం?
T20 World Cup 2022- India Squad: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన జట్టుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ పెదవి విరిచాడు. శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీలను వరల్డ్కప్ జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. తానైతే దీపక్ హుడా స్థానంలో అయ్యర్కు.. హర్షల్ పటేల్ స్థానంలో షమీకి చోటు ఇస్తానని పేర్కొన్నాడు. కొన్ని మార్పులు మినహా అంతా వాళ్లే! కాగా యువ పేసర్ ఆవేశ్ ఖాన్పై వేటు వేయడం సహా.. గాయంతో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దూరమైన నేపథ్యంలో ఆసియా కప్-2022 ఈవెంట్ ఆడిన జట్టునే ప్రపంచకప్నకు సెలక్ట్ చేసింది బీసీసీఐ. గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ సహా అక్షర్ పటేల్ కొత్తగా జట్టులోకి వచ్చారు. ప్రధాన జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదు! ఇక షమీ, శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయి, దీపక్ చహర్ స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా స్పందించిన అజారుద్దీన్.. శ్రేయస్ అయ్యర్, షమీని ప్రధాన జట్టుకు ఎంపిక చేయకపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశాడు. వాళ్లిద్దరి అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. అయితే, చాలా మంది నెటిజన్లు అజారుద్దీన్తో ఏకీభవించడం లేదు. నువ్వొక మాజీ కెప్టెన్వి.. కానీ! గత టీ20 ప్రపంచకప్ టోర్నీలో షమీ ఆట తీరును.. ఆస్ట్రేలియా పిచ్లపై శ్రేయస్ అయ్యర్ విఫలమైన విషయాన్ని గుర్తు చేస్తూ అజారుద్దీన్ను ట్రోల్ చేస్తున్నారు. ‘‘నువ్వొక మాజీ కెప్టెన్వి.. కానీ నీకు ఈ విషయాలు తెలియవు. గతేడాది టీ20 వరల్డ్కప్లో షమీ ఎకానమీ ఎంతో తెలియదు. అతడు ఎన్ని వికెట్లు పడగొట్టాడో తెలియదు. ఇక శ్రేయస్ అయ్యర్ షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో విఫలమవుతున్నాడనీ తెలియదు. అసలే ఈ ఐసీసీ టోర్నీ జరిగేది ఆస్ట్రేలియాలో! కనీసం ఈ విషయమైనా నీకు గుర్తున్నట్లు లేదు! ఇది టీ20 ఫార్మాట్ సర్. దీపక్ హుడా ఆల్రౌండర్. అవసరమైనపుడు బౌలింగ్ కూడా చేయగలడు. అయినా.. ‘కెప్టెన్’ నువ్వు ఏ ప్రాతిపదికన ఈ కామెంట్ చేశావు’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. షమీ అప్పుడు నిరాశపరిచినా.. ఐపీఎల్-2022లో.. కాగా టీ20 ప్రపంచకప్-2021లో షమీ కేవలం ఆరు వికెట్లు తీసిన విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్-2022లో మాత్రం గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తంగా 16 మ్యాచ్లు ఆడిన షమీ 20 వికెట్లతో రాణించి తమ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ.. పొట్టి ఫార్మాట్కు షమీ సూట్ కాడన్న అభిప్రాయాల నేపథ్యంలో అతడిని స్టాండ్ బైగా ఎంపిక చేయడం గమనార్హం. ఇక దీపక్ హుడా బ్యాటర్గా రాణించడంతో పాటు స్పిన్ బౌలింగ్ చేయగలడు కూడా! చదవండి: నువ్వేమి చేశావు నేరం.. శాంసన్ను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్ విచారం క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్ Surprised at the omission of Shreyas Iyer and Md. Shami from the main squad. https://t.co/GOKUzRyMot — Mohammed Azharuddin (@azharflicks) September 12, 2022 Shreyas Iyer instead of Deepak Hooda and Md. Shami in the place of Harshal Patel would be my choice. — Mohammed Azharuddin (@azharflicks) September 12, 2022 Then please teach Iyer how to play short ball becase in Australian bouncy pitches, he cant survive — Ankit Singh (@ankittfit) September 12, 2022 You are just outdated and shami had never been a good T20 bowler. Deepak hooda can bowl pls be aware what is T20 format — Arunkumar06 (@Arunkumar064) September 12, 2022 This man captained India... I don't even know how to react! — Gagan Chawla (@toecrushrzzz) September 12, 2022 -
పాక్తో మ్యాచ్.. మూడు మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా..!
India Playing 11: ఆసియా కప్ సూపర్-4 దశలో భాగంగా రేపు (సెప్టెంబర్ 4) భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లు ఇదివరకే గ్రూప్ దశలో ఓసారి ఎదురెదురు పడగా.. ఆ మ్యాచ్లో టీమిండియా పాక్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన నాటి మ్యాచ్లో హార్ధిక్ ఆల్రౌండర్ ప్రదర్శనతో ( (18 బంతుల్లో 32 నాటౌట్; 3 వికెట్లు) చెలరేగడంతో భారత్ అపురూప విజయం సాధించింది. హాంగ్ కాంగ్పై గెలుపుతో గ్రూప్-ఏ నుంచి సూపర్-4 రెండో బెర్తును ఖరారు చేసుకున్న పాక్.. ఈ దశలో ఎలాగైనా భారత్ను మట్టికరించి గ్రూప్ స్టేజ్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు టోర్నీలో ఇదివరకే పాక్ను దెబ్బకొట్టిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా సైతం ఉరకలేస్తుంది. ఇక పాక్తో మ్యాచ్కు టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. హాంగ్ కాంగ్పై ఆడిన రిషబ్ పంత్, గాయం కారణంగా టోర్నీని నుంచి వైదొలిగిన జడేజా, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేని ఆవేశ్ ఖాన్ స్థానాల్లో హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్లు జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ తప్పనిసరిగా మూడో స్పెషలిస్ట్ పేసర్ అవసరం అనుకుంటే ఆవేశ్ ఖాన్కు మరో అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చు. దుబాయ్ పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశాలు ఉండటం, జట్టులో ఆవేశ్ ఖాన్కు ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతన్నే మరోసారి రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు వికెట్కీపర్గా డీకేనా.. లేక పంతా అన్న డిస్కషన్ కూడా టీమిండియా యాజమాన్యాన్ని సందిగ్ధంలో పడేసింది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్కే మొగ్గు చూపే అవకాశం ఉండటంతో ఫినిషర్ పాత్రలో కార్తీక్నే కొనసాగించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఓపెనర్లు కెప్టెన్ రోహిత్, కేఎల్ రాహుల్ స్థానాలకు ఎటువంటి ఢోకా లేదు. ఆతర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి, సూర్యకుమార్, రిషబ్ పంత్/ దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్/ అశ్విన్, చహల్, అర్షదీప్ బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా, సూపర్-4 దశకు భారత్, పాక్తో పాటు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చేరుకున్న విషయం తెలిసిందే. భారత్ తుది జట్టు(అంచనా).. రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్/ దినేశ్ కార్తీక్, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్/ అశ్విన్, చహల్, అర్షదీప్ చదవండి: కోహ్లి ఎప్పటికీ రోహిత్ లేదంటే సూర్యకుమార్ కాలేడు: పాక్ మాజీ కెప్టెన్ -
పాకిస్తాన్తో తొలి మ్యాచ్.. దీపక్ హుడాకు నో ఛాన్స్! అశ్విన్కు కూడా!
Wasim Jaffer Picks India XI for Pakistan clash: ఆసియాకప్-2022లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్తో ఆదివారం తలపడనున్న సంగతి తెలిసిందే. దాయాదుల పోరు కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ను భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఎంచుకున్నాడు. తన ప్రకటించిన జట్టులో ఓపెనర్లగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ను జాఫర్ ఎంపిక చేశాడు. ఆవే విధంగా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మూడో స్థానంలో అవకాశమిచ్చాడు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాకు అతడు చోటిచ్చాడు. ఇక ఆరో స్థానం కోసం దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ మద్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు జాఫర్ పేర్కొన్నాడు. ఒక వేళ పంత్ తుది జట్టులో ఉన్నట్లైతే ఖచ్చితంగా ఐదో స్ధానంలో బ్యాటింగ్ వస్తాడని జాఫర్ తెలిపాడు. ఇక తన ఎంచుకున్న జట్టులో ఫుల్టైమ్ ఆల్రౌండర్గా రవీంద్ర జడేజాకు స్ధానం కల్పించాడు. ఇక బౌలర్ల కోటాలో భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయి, చహల్, అర్ష్దీప్ సింగ్కు జాఫర్ చోటు ఇచ్చాడు. కాగా ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న దీపక్ హుడాను జాఫర్ ఎంపిక చేయకపోవడం గమనార్హం. మరోవైపు వెటరన్ స్పిన్నర్ అశ్విన్కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. పాక్తో మ్యాచ్కు జాఫర్ ఎంచుకున్న ప్లేయింగ్ ఎలెవన్ రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్య, రిషభ్ పంత్/ దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా,యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్కుమార్, అర్ష్దీప్ సింగ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });చదవండి: Asia Cup 2022: మనసులో మాటను బయటపెట్టిన పాక్ ఆల్రౌండర్ -
దీపక్ హుడా ఉంటే టీమిండియా గెలిచినట్టే..
-
దీపక్ హుడా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!
టీమిండియా ఆల్రౌండర్ దీపక్ హుడా ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్లో సత్తాచాటి జట్టులో స్థానాన్ని సుస్ధిరం చేసుకున్న హుడా.. ఆడిన ప్రతీ మ్యాచ్లోనూ అదరగొడుతున్నాడు. తాజాగా జింబాబ్వేతో రెండో వన్డేలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో హుడా 25 పరుగులతో పాటు ఒక వికెట్ పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్తో దీపక్ హుడా ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. క్రికెటర్గా అరంగేట్రం చేసిన తర్వాత హుడా ఆడిన 16 మ్యాచ్ల్లోనూ భారత్ విజయం సాధించింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆటగాడిగా హుడా నిలిచాడు. హుడా ఇప్పటి వరకు 9 టీ20లు, 7వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిద్యం వహించాడు. సాట్విక్ నడిగోటియా రికార్డు బద్దలు కొట్టిన హుడా కాగా గతంలో ఈ రికార్డు రొమేనియా ఆటగాడు సాట్విక్ నడిగోటియా పేరిట ఉండేది. నడిగోటియా అరంగేట్రం చేసిన అనంతరం రొమేనియా 15 మ్యాచ్ల్లో విజయం నమోదు చేసింది. తాజా మ్యాచ్తో నడిగోటియా ప్రపంచ రికార్డును హుడా బద్దలు కొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: IND vs ZIM: వన్డేల్లో గిల్ అరుదైన ఫీట్.. మూడో భారత ఆటగాడిగా! -
ప్రపంచ రికార్డుకు చేరువగా.. భారత్ తరపున తొలి ఆటగాడిగా
టీమిండియా యంగ్ ఆల్రౌండర్ దీపక్ హుడా ముందు ప్రపంచ రికార్డు ఎదురుచూస్తోంది. జింబాబ్వేతో వన్డే సిరీస్లో తొలి మ్యాచ్లో గెలిస్తే ఒక రికార్డు.. సిరీస్ గెలిస్తే ఇంకో రికార్డు.. ఇలా అతని పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది. టీమిండియాలో మరెవరికి సాధ్యం కాని యునివర్సల్ రికార్డు దీపక్ హుడా పేరిట లిఖించుకునే అవకాశం ఉంది. మరి ఆ యునివర్సల్ రికార్డు కథాకమీషు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గతేడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున అద్బుత ప్రదర్శన చేశాడు. అనంతరం బరోడా తరపున దేశవాలీ క్రికెట్లో దుమ్మురేపి ఈ ఏడాది ఫిబ్రవరిలో టీమిండియా జట్టుకు ఎంపికయ్యాడు. ఇక దీపక్ హుడా ఇప్పటి వరకూ 14 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 9 టీ20లు, 5 వన్డేలు ఉండగా.. అన్ని మ్యాచ్ల్లోనూ టీమిండియాదే విజయం కావడం విశేషం. దీంతో దీపక్ హుడా జట్టులో ఉంటే గెలుపు ఖాయమనే ప్రచారం మొదలైంది. మిడిలార్డర్లో బ్యాటింగ్ వస్తూ విధ్వంసకర హిట్టింగ్తో టీమిండియాకు స్లాగ్ ఓవర్లలో భారీ స్కోర్లు అందించడమే గాక.. బౌలింగ్లోనూ ఆఫ్ స్పిన్నర్గా తన సేవలందిస్తున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం వరుసగా 14 మ్యాచ్ల్లో విజయాల్ని చూసిన భారత ఆటగాడు ఎవరూ లేరు. ఈ విషయంలో మాత్రం దీపక్ హుడా చరిత్ర సృష్టించాడు. అయితే.. ఓవరాల్గా మాత్రం ఈ రికార్డ్లో రొమానియాకి చెందిన సాత్విక్ నదిగొట్ల 15 మ్యాచ్లతో టాప్లో ఉన్నాడు. సాత్విక్, దీపక్ హుడా తర్వాత దక్షిణాఫ్రికాకి చెందిన డేవిడ్ మిల్లర్ (13 మ్యాచ్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక శంతను వశిష్ట్ (రొమేనియా)-13 విజయాలు, కొల్లిస్ కింగ్ (వెస్టిండీస్)-12 విజయాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఒకవేళ జింబాబ్వేతో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధిస్తే దీపక్ హుడా వరుస 15 విజయాలతో రొమేనియా ఆటగాడు సాత్విక్ నదిగొట్టతో సంయుక్తంగా తొలిస్థానం పంచుకోనున్నాడు. ఒకవేళ రెండో వన్డేలోనూ టీమిండియా విజయం సాధించి సిరీస్ గెలిస్తే.. దీపక్ హుడా 16 వరుస విజయాలతో టాప్ స్థానాన్ని ఆక్రమించే అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది. ఒకవేళ జింబాబ్వేపై సిరీస్ క్లీన్ స్వీప్ చేయడం.. ఆ మూడు మ్యాచ్ల్లోనూ దీపక్ హుడా ఆడితే మాత్రం అతని విజయాల పరంపరకు బ్రేక్ పడనట్లే. మరి ఇది ఎక్కడ ఆగుతుందో వేచి చూడాలి. చదవండి: Kabaddi Game: కబడ్డీ నింపిన విషాదం.. వారం రోజులు మృత్యువుతో పోరాడి ఎఫ్టీపీ ప్రకటించిన ఐసీసీ.. నాలుగేళ్లలో 777 అంతర్జాతీయ మ్యాచ్లు! -
స్పిన్నర్ల మాయాజాలం.. ఆఖరి టీ20లోనూ టీమిండియాదే విజయం
ఫ్లొరిడా: ఆఖరి టి20లోనూ భారతే విజయం సాధించింది. ఐదో మ్యాచ్లో టీమిండియా 88 పరుగుల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది. కరీబియన్ గడ్డపై ఒక మ్యాచ్ అయినా నెగ్గిన విండీస్కు అమెరికాలో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ పరాజయం ఎదురైంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్లు), దీపక్ హుడా (25 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడారు. తర్వాత వెస్టిండీస్ 15.4 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. బిష్ణోయ్ (4/16), కుల్దీప్ (3/12), అక్షర్ పటేల్ (3/15)ల స్పిన్ ఉచ్చులో పడిన కరీబియన్ను హెట్మైర్ (35 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్స్ చేతులెత్తేయడంతో వెస్టిండీస్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేదు. భారత్ 4–1తో పొట్టి సిరీస్ను కైవసం చేసుకుంది. -
వెస్టిండీస్తో నాలుగో టీ20.. అవేష్ ఖాన్ అవుట్! బిష్ణోయ్కు ఛాన్స్!
వెస్టిండీస్తో మరో పోరుకు టీమిండియా సిద్దమైంది. ఫ్లోరిడా వేదికగా శనివారం జరగనున్న నాలుగో టీ20లో విండీస్తో భారత్ తలపడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో 2–1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్లో విజయం సాధించి మరో సిరీస్ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. విండీస్తో జరిగిన రెండో టీ20లో ఓటమి చెందిన భారత్.. మూడో టీ20లో విజయం సాధించి అద్భుతమైన పునరాగమనం చేసింది. టీమిండియా ప్రస్తుతం బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన ఓపెనర్ సూర్య కుమార్ యాదవ్.. మూడో టీ20లో మాత్రం దుమ్మురేపాడు. ఈ మ్యాచ్లో సూర్య 44 బంతుల్లో 77 పరుగులుచేసి మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు.మిడిలార్డర్లో రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అఖరిలో దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపిస్తున్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ ఫామ్ మాత్రం భారత్ను కలవరపెడుతోంది. ఇక మూడో టీ20లో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో అతడు నాలుగో టీ20కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఒక వేళ రోహిత్ దూరమైతే అతడి స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి రానున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్కు కూడా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ జడ్డూ దూరమైతే అతడి స్థానంలో దీపక్ హుడానే కొనసాగించడం ఖాయం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నారు. గత రెండు మ్యాచ్ల్లో విఫలమైన అవేష్ఖాన్ను ఈ మ్యాచ్కు పక్కన పెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక విండీస్ గత మ్యాచ్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. విండీస్ ఈ మ్యాచ్లో భారత్కు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే విండీస్ గత మ్యాచ్లో బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణించింది. బౌలింగ్లో మాత్రం పూరన్ సేన విఫలమైంది. కాగా ఓపెనర్లు కైల్ మైర్స్, బ్రాండన్ కింగ్ ఫామ్లో ఉండటం ఆ జట్టుకు సానుకూలాంశం. మిడాలర్డర్లో పూరన్, పావెల్ కూడా పర్వాలేదనిపిస్తున్నారు. ఇక బౌలింగ్లో మెక్కాయ్, హోసన్ మరోసారి చెలరేగితే భారత్కు కష్టాలు తప్పవు. చదవండి: Asia Cup 2022: 'కోహ్లికి బ్యాకప్ ఎవరన్నది సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి' -
'కోహ్లికి బ్యాకప్ ఎవరన్నది సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి'
వెస్టిండీస్తో జరుగుతోన్న టీ20 సిరీస్కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కావడంతో అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తున్న శ్రేయస్ అయ్యర్( 0 ,10,24) ఆడిన మూడు మ్యాచ్ల్లో అయ్యర్ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో అయ్యర్ స్థానంలో దీపక్ హుడాకు అవకాశం ఇవ్వాలని మాజీలు క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఐర్లాండ్ సిరీస్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన దీపక్ హుడా అదరగొట్టాడు. ఈ సిరీస్లో అతడు అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సబా కరీమ్ కీలక వాఖ్యలు చేశాడు. ఆసియాకప్లో టీమిండియా బ్యాకప్ నంబర్ త్రీ బ్యాటర్గా శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడాలో ఎవరు ఉండాలనేది సెలక్టర్లు నిర్ణయించడానికి ఇదే సరైన సమయమని కరీం అభిప్రాయపడ్డాడు. ఇండియా న్యూస్ స్పోర్ట్స్తో కరీం మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లి జట్టులో ఉంటే అతడే సహజంగా నంబర్ 3లో బ్యాటింగ్కు వస్తాడు. ఒక వేళ కోహ్లి అందుబాటులో లేకపోతే అతడికి బ్యాకప్ బ్యాటర్గా ఎవరు ఉండాలో సెలెక్టర్లు నిర్ణయించే సమయం ఆసన్నమైంది. సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్ కొనసాగించాలని అనుకుంటే అతడికి ప్రతీ మ్యాచ్లోనూ అవకాశాలు ఇవ్వాలి. అతడు తన ఫామ్ను తిరిగి పొందుతాడని ఆశిస్తున్నాను. అయితే జట్టు మేనేజేమెంట్ ప్రయోగాలు చేయాలని భావిస్తే దీపక్ హుడాకు కూడా ఛాన్స్ ఇవ్వడానికి ఇదే సరైన సమయం. హుడా బ్యాట్తో బాల్తోనూ అద్భుతంగా రాణించగలడు. అది జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. అయితే అతడిని నాలుగో స్థానానికి భారత్ సిద్దం చేస్తున్నట్లు ఉంది. ఎందుకంటే ఒకట్రెండు ఓవర్లలో ఓపెనర్ల వికెట్లను భారత్ కోల్పోతే ఇన్నింగ్స్ చక్కదిద్దే సత్తా హుడాకి ఉంది" అని పేర్కొన్నాడు. చదవండి: India Probable XI: ఓపెనర్గా ఇషాన్ కిషన్.. అవేష్ ఖాన్కు నో ఛాన్స్! -
IND vs WI: విండీస్తో మూడో టీ20.. శ్రేయస్ అవుట్! హుడాకు ఛాన్స్!
వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా జోరుకు వెస్టిండీస్ కళ్లెం వేసింది. సెయింట్స్ కిట్స్ వేదికగా సోమవారం వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఇక మంగళవారం జరగనున్న మూడో టీ20లో విజయం సాధించి విండీస్పై ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. కాగా విండీస్-భారత్ మధ్య మూడో టీ20 సెయింట్స్ కిట్స్ వేదికగానే జరగనుంది. ఈ మ్యాచ్ కూడా 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మూడో టీ20 రాత్రి 9:30 గంటలకు మొదలు కానుంది. ఇక రెండో టీ20లో భారత బౌలర్లు రాణించినప్పటికీ.. బ్యాటర్లు మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. గత రెండు మ్యాచ్లలో విఫలమైన నిరాశపరిచిన శ్రేయస్ అయ్యర్(0 ,10)ను ఈ మ్యాచ్కు పక్కన పెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా ఈ మ్యాచ్లో రోహిత్ జోడిగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో పంత్ను పంపే ఆలోచనలో జట్టు మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు మ్యాచ్ల్లో ఓపెనర్గా వచ్చిన సూర్య స్థాయికి తగ్గట్లు రాణించలేదు. దీంతో అతడిని ఎప్పటిలాగే నాలుగో స్థానంలోనే బ్యాటింగ్కు పంపాలని కోచ్, కెప్టెన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు భారత్ ఈ మ్యాచ్లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒక వేళ ముగ్గురు స్పిన్నర్లను భారత్ ఆడించాలని భావిస్తే అవేశ్ ఖాన్ స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి రానున్నాడు. భారత తుది జట్టు(అంచనా) రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్ష్దీప్ సింగ్ చదవండి: Ind Vs WI T20 Series: ఓపెనర్గా డీకే! ఐదో స్థానంలో రోహిత్ ఎందుకు రాకూడదు? రూల్ అంటే రూలే మరి! -
అతడిని ఎందుకు సెలక్ట్ చేయలేదు! అయినా ద్రవిడ్తో నాకేంటి పని?
India Vs West Indies T20 Series 2022: వెస్టిండీస్తో వన్డే సిరీస్లో అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. వరుసగా రెండు అర్ధ శతకాలు సాధించడం(54, 63)తో పాటు.. మూడో వన్డేలో 44 పరుగులతో రాణించాడు. అయితే, విండీస్తో తొలి టీ20 మ్యాచ్లో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. టీ20 ఫార్మాట్లో తనకు పోటీగా మారుతున్న దీపక్ హుడా, సంజూ శాంసన్ను కాదని యాజమాన్యం తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. పాపం హుడా! ఇదిలా ఉంటే దీపక్ హుడా ఐర్లాండ్తో టీ20 సిరీస్లో రాణించడంతో పాటు విండీస్తో వన్డే సిరీస్లో తన ఆల్రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. మొదటి వన్డేలో 27 పరుగులు చేసిన అతడు.. రెండో మ్యాచ్లో 33 పరుగులు చేయడంతో పాటుగా.. ఒక వికెట్ తీశాడు. ఇక మూడో వన్డేలో అతడికి ఆడే అవకాశం రాలేదు. టీ20 మొదటి మ్యాచ్లోనూ యాజమాన్యం ఛాన్స్ ఇవ్వలేదు. ఆల్రౌండర్లు ఉండాలి కదా! ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ హుడాను ఈ మ్యాచ్లో ఆడించాల్సిందని అభిప్రాయపడ్డాడు. పొట్టి ఫార్మాట్లో ఆల్రౌండర్ల అవసరం ఎక్కువగా ఉంటుందన్న అతడు.. హుడాకు తుది జట్టులో స్థానం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. ఈ మేరకు శ్రీకాంత్ ఫ్యాన్కోడ్తో మాట్లాడాడు. ‘‘హుడా ఎక్కడ? ఇటీవలి టీ20 మ్యాచ్లతో పాటు వన్డేల్లోనూ అతడు రాణించాడు. తప్పకుండా జట్టులో ఉండాల్సిన వ్యక్తి. టీ20 క్రికెట్లో ఆల్రౌండర్ల అవసరం ఎక్కువగా ఉంటుంది కదా! బ్యాటింగ్ ఆల్రౌండర్లు.. అయినా బౌలింగ్ ఆల్రౌండర్లు ఎవరైనా పర్లేదు! మొత్తానికి సదరు ఆటగాళ్లు జట్టులో ఉండాలి’’ అని పేర్కొన్నాడు. అయితే, ఎక్స్పర్ట్ ప్యానెల్లో సభ్యుడైన టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా మాత్రం ఎవరైతే బాగా ఆడుతున్నారో వారికే ద్రవిడ్ భాయ్ ప్రాధాన్యం ఇస్తాడంటూ శ్రీకాంత్తో విభేదించాడు. ఇందుకు ఘాటుగా స్పందించిన చిక్కా.. ‘‘ఇక్కడ రాహుల్ ద్రవిడ్ ఆలోచనల గురించి అవసరం లేదు. నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. అది కూడా ఇప్పుడే చెప్పు’’ అని అడిగాడు. పరోక్షంగా టీమిండియా హెడ్కోచ్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఇక చిక్కా ప్రశ్నకు బదులుగా.. ‘‘అవును.. ఈ మ్యాచ్లో హుడా ఉండాల్సింది. కచ్చితంగా అతడిని తీసుకోవాల్సింది’’ అని ఓజా పేర్కొన్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ సేన 68 పరుగుల తేడాతో గెలుపొందింది. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా తొలి టీ20: ►వేదిక: బ్రియన్ లారా స్టేడియం, టరౌబా, ట్రినిడాడ్ ►టాస్: వెస్టిండీస్- బౌలింగ్ ►ఇండియా స్కోరు: 190/6 (20) ►వెస్టిండీస్ స్కోరు: 122/8 (20) ►విజేత: ఇండియా... 68 పరగుల తేడాతో గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: దినేశ్ కార్తిక్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు) చదవండి: Ind Vs WI T20 Series: మొన్న పంత్.. నిన్న సూర్య.. కేవలం అతడి కోసమే ఈ మార్పులు! అయినా.. Well played to @BCCI 🇮🇳 on 5 match series opener victory in the @goldmedalindia T20I Cup, powered by Kent Water Purifiers #WIvIND pic.twitter.com/eA7Wzfril1 — Windies Cricket (@windiescricket) July 29, 2022 -
'అతడిని సరిగ్గా ఉపయోగించుకోండి.. మరో ఏడేళ్ల పాటు భారత్కు'
టీమిండియా ఆటగాడు దీపక్ హుడా గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. తనకు లభించిన తక్కువ అవకాశాల్లో అదరిపోయే ఆటతీరుతో అందరనీ అకట్టుకున్నాడు. ముఖ్యంగా ఐర్లాండ్ పర్యటనలో హుడా అత్యత్తుమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్లో సెంచరీతో చెలరేగిన హుడా.. 151 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా ప్రస్తుతం దీపక్ విండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టులో భాగంగా ఉన్నాడు. ఆదివారం విండీస్తో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయంలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో హుడా తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో దీపక్ హుడాపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రానున్న రోజుల్లో భారత జట్టుకు స్టార్ ఆల్రౌండర్గా హుడా నిలుస్తాడని పఠాన్ కొనియాడాడు. "రెండేళ్ల క్రితం భారత జట్టులోకి వస్తానని హుడా అసలు ఊహించి ఉండడు. జట్టులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే హుడా అదరగొడుతున్నాడు. అతడు జట్టులోకి రావడానికి చేసిన ప్రయత్నంలోనే సగం విజయం సాధించాడు. అతడికి ఇప్పుడు కేవలం 27 ఏళ్ల మాత్రమే. భారత్ అతడిని సరిగ్గా ఉపయోగించుకుంటే మరో ఆరు ఏడేళ్ల పాటు తన సేవలు అందించగలడు. అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ప్రతిఫలం ఆశించి పనిచేస్తే ఎప్పుడూ నీవు రాణించలేవని గతంలో అతడితో చెప్పాను. జట్టు పరిస్థితులను బట్టి తన బ్యాటింగ్ స్ట్టైల్ను మార్చుకుంటాడు. ఎప్పుడూ నెమ్మదిగా ఆడాలో, ఎప్పుడు వేగంగా ఆడాలో అతడికి బాగా తెలుసు అని అని పఠాన్ పేర్కొన్నాడు. చదవండి: Virat Kohli - Robin Uthappa: జట్టులో కోహ్లి స్థానం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు! వీళ్లంతా అప్పుడేం చేశారు? -
Ind Vs WI: మీ అత్యుత్తమ స్పిన్నర్ ఎవరో తెలియదా? అతడి విషయంలో ఎందుకిలా?
India Vs West Indies 2nd ODI: వెస్టిండీస్తో రెండో వన్డేలో స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ విషయంలో కెప్టెన్ శిఖర్ ధావన్ తీసుకున్న నిర్ణయం పట్ల టీమిండియా మాజీ బౌలర్ మురళీ కార్తిక్ విస్మయం వ్యక్తం చేశాడు. మ్యాచ్ 17వ ఓవర్ వరకు అతడి చేతికి బంతిని ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. దీపక్ హుడాతో బౌలింగ్ చేయడంలో తనకేమీ అభ్యంతరం లేదని, అయితే.. చహల్ ఉండగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడే నిమిత్తం టీమిండియా విండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి వన్డే గెలిచిన ధావన్ సేన.. ఆదివారం(జూలై 24) నాటి రెండో మ్యాచ్లోనూ విజయం సాధించింది. సిరీస్ను సొంతం చేసుకుంది. అయితే, ఈ రెండింటిలోనూ చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా టీమిండియా వరుసగా 3 పరుగులు, 2 వికెట్ల తేడాతో గెలుపొందడం గమనార్హం. ఇక రెండో వన్డేలో విండీస్ ఓపెనర్ షాయి హోప్ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన విషయం తెలిసిందే. 135 బంతులు ఎదుర్కొన్న అతడు 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. ఎట్టకేలకు 49వ ఓవర్ ఐదో బంతికి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మరో బ్యాటర్, ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం 77 బంతుల్లో 74 పరుగులతో రాణించాడు. వీరిద్దరి విజృంభణతో నిర్ణీత 50 ఓవర్లలో ఆతిథ్య వెస్టిండీస్ 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. నాకైతే అర్థం కాలేదు! ఈ నేపథ్యంలో మురళీ కార్తిక్ మాట్లాడుతూ.. సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ను రంగంలోకి దింపడానికి టీమిండియా యాజమాన్యం ఎందుకంత ఆలస్యం చేసిందో తనకు అర్థం కాలేదన్నాడు. ఈ మేరకు... ‘‘దీపక్ హుడా బౌలింగ్ చేయడం పట్ల నాకెలాంటి అభ్యంతరం లేదు. అయితే, మీ జట్టులో ఉన్న అత్యుత్తమ స్పిన్నర్ ఎవరో మీకు తెలిసి ఉండాలి కదా? అయినా చహల్ను 17వ ఓవర్ వరకు ఎందుకు తీసుకురాలేదు’’ అని మురళీ కార్తిక్ ప్రశ్నించాడు. వికెట్లు పడగొట్టే సత్తా ఉన్న చహల్ చేతికి త్వరగా బంతిని ఇవ్వకపోవడం సరికాదని ఈ మాజీ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయకపోవడంతో విండీస్ టీ20 మాదిరి చెలరేగిందని, సరైన వ్యూహాలు అమలు చేస్తే తక్కువ స్కోరుకు ఆతిథ్య జట్టును కట్టడి చేసే అవకాశం ఉండేదని ఫ్యాన్ కోడ్తో పేర్కొన్నాడు. కాగా వెస్టిండీస్తో రెండో వన్డేలో బ్యాటింగ్ ఆల్రౌండర్, ఆఫ్ స్పిన్నర్ దీపక్ హుడా.. 9 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 42 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కైలీ మేయర్స్ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక లెగ్ స్పిన్నర్ చహల్ 9 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మొదటి వన్డేలో అర్ధ శతకంతో మెరిసిన బ్రాండన్ కింగ్ను ఈ మ్యాచ్లో డకౌట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో భారత్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. India pull off a thriller in the final over to win by 2 wickets. #WIvIND #MenInMaroon pic.twitter.com/0xnSYNMyzC — Windies Cricket (@windiescricket) July 24, 2022 ఇండియా వర్సెస్ వెస్టిండీస్ రెండో వన్డే వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టాస్: విండీస్- బ్యాటింగ్ వెస్టిండీస్ స్కోరు: 311/6 (50 ఓవర్లు) సెంచరీతో చెలరేగిన షై హోప్(115 పరుగులు) భారత్ స్కోరు: 312/8 (49.4 ఓవర్లు) విజేత: భారత్.. 2 వికెట్ల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అక్షర్ పటేల్ (64 పరుగులు, ఒక్క వికెట్) అర్ధ సెంచరీలతో రాణించిన శ్రేయస్ అయ్యర్(63), అక్షర్ పటేల్(64), సంజూ శాంసన్(54) చదవండి: IND vs WI: ధోని 17 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన అక్షర్ పటేల్.. తొలి భారత ఆటగాడిగా! Ind Vs WI 1st ODI: 3 పరుగుల తేడాతో విజయం.. ధావన్ సేనకు భారీ షాక్! ఆలస్యంగా వెలుగులోకి.. -
T20 WC 2022: అసలు తమ అత్యుత్తమ జట్టు ఏదో భారత్కు తెలుసా? ఏమిటో!
India Vs England 3rd T20: మరో మూడు నెలల్లో టీ20 ప్రపంచకప్-2022 ఆరంభం కానున్న నేపథ్యంలో టీమిండియా కూర్పుపై ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆష్లే గిల్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు తమ అత్యుత్తమ తుది జట్టు ఏదో టీమిండియా మేనేజ్మెంట్కు తెలుసా లేదా అని ప్రశ్నించాడు. తరచుగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడం తీవ్ర ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఇటీవలి కాలంలో భారత జట్టు కూర్పులో తరచుగా మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో అదరగొట్టిన ఆటగాళ్లను తదుపరి మ్యాచ్లలో పక్కనపెట్టేశారు. దీపక్ హుడా స్థానంలో విరాట్ కోహ్లి జట్టులోకి వచ్చాడు. నాలుగు మార్పులతో.. ఇక రెండో మ్యాచ్లో విజయంతో సిరీస్ కైవసమైన తరుణంలో మూడో మ్యాచ్కు ముందు ప్రయోగాలు చేశారు. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్లను తుది జట్టులోకి తీసుకున్నారు. అదే విధంగా బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పులు చేశారు. పంత్ను మరోసారి ఓపెనర్గా పంపారు. దినేశ్ కార్తిక్ను ఆరో స్థానంలో బ్యాటింగ్కు దించారు. ఈ నేపథ్యంలో ఆష్లే ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అసలు టీమిండియాకు ఆ విషయం తెలుసా? ఈ మేరకు.. ‘‘నిజంగా ఇండియాకు ప్రస్తుతం తమ అత్యుత్తమ తుదిజట్టు ఏదో తెలుసా? డీకే బాగా ఆడగలడు. అయితే, తన కంటే మెరుగ్గా ఆడగల చాలా మంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవచ్చు. ఇక దీపక్ హుడా టాపార్డర్లో విధ్వంసకర బ్యాటర్. రిషభ్ పంత్ డౌన్ ఆర్డర్లో మెరుగ్గా రాణించగలడు. కానీ పంత్ను ఓసారి టాప్, ఓసారి మిడిలార్డర్లో ఆడిస్తున్నారు. అదే విధంగా డీకే స్థానం విషయంలోనూ స్పష్టత లేదు. ఒకవేళ కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వస్తే.. ఈ స్థానాల్లో మరోసారి మార్పులు చోటుచేసుకోవడం ఖాయం. కాబట్టి పంత్ను మిడిలార్డర్లో ఫిట్ చేసి.. వరల్డ్కప్ టోర్నీకి సన్నద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. తరచుగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుల చేయడం సరికాదు’’ అని ఆష్లే అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో మూడో టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ తప్ప మరెవరూ రాణించకపోవడంతో 17 పరుగుల తేడాతో భారత్కు ఓటమి తప్పలేదు. అయితే, 2-1 తేడాతో సిరీస్ను మాత్రం టీమిండియా దక్కించుకుంది. చదవండి: Surya Kumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్ యాదవ్! మాక్సీ రికార్డు బద్దలు.. మరెన్నో! T20 World Cup 2022: ఈసారి టీమిండియాను ఓడించడం పాకిస్తాన్కు అంత ఈజీ కాదు: అక్తర్ -
'ఇంగ్లండ్తో రెండో టీ20.. దీపక్ హుడా స్థానంలో కోహ్లి రానున్నాడు'
ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను విజయంతో ఆరంభించిన టీమిండియా మరో పోరుకు సిద్దమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా శనివారం జరగనున్న రెండో టీ20లో ఇంగ్లండ్తో భారత తలపడనుంది. అయితే తొలి టీ20కు విశ్రాంతి తీసుకున్న భారత సీనియర్ ఆటగాళ్లు రెండో టీ20కు అందు బాటులోకి రానున్నారు. దీంతో భారత తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో భారత తుది జట్టుపై టీమిండియా మాజీ ఆటగాడు పార్థివ్ పటేల్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. "అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజాను తుది జట్టులోకి తీసుకు రావాలి. అదే విధంగా అర్ష్దీప్ సింగ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా రానున్నాడు. ఇక విరాట్ కోహ్లి.. దీపక్ హుడా స్థానంలో జట్టులోకి వస్తాడని నేను భావిస్తున్నాను. మరో వైపు శ్రేయాస్ అయ్యర్కు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కకపోవచ్చు. దినేష్ కార్తీక్ స్ధానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది" అని పార్థివ్ పటేల్ క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. భారత తుది జట్టు (అంచనా) రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ చదవండి: '37 ఏళ్ల వయస్సులో అదరగొడుతున్నాడు.. అతడిని జట్టులోకి తీసుకోండి' -
Ind Vs Eng: హార్దిక్ అద్భుతం! ఆ తప్పులు పునరావృతం కానివ్వం: రోహిత్
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్లో వైవిధ్యం చూపిస్తూ ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన విధానాన్ని కొనియాడాడు. భవిష్యత్తులోనూ హార్దిక్ ఇలాగే మెరుగ్గా రాణించాలని ఆకాంక్షించాడు. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా రోహిత్ సేన గురువారం బట్లర్ బృందంతో మొదటి టీ20 మ్యాచ్లో తలపడింది. సౌతాంప్టన్ వేదికగా సాగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీపక్ హుడా(33 పరుగులు), సూర్యకుమార్ యాదవ్(39 పరుగులు)కు తోడు హార్దిక్ పాండ్యా అర్ధ శతకం(51 పరుగులు) రాణించాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. India finish the Powerplay 66/2. Scorecard & Videos: https://t.co/r1PBlLhqeP 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/d5ELr4VHCE — England Cricket (@englandcricket) July 7, 2022 ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఆరంభం నుంచే అటాకింగ్ బౌలింగ్తో బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ ఒకటి, అర్ష్దీప్ సింగ్ రెండు, హర్షల్ పటేల్ ఒకటి, యజువేంద్ర చహల్ రెండు వికెట్లు పడగొట్టాడు. CJ with an important wicket! Scorecard & Videos: https://t.co/r1PBlLhqeP 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/yDVJL9pa8o — England Cricket (@englandcricket) July 7, 2022 దీంతో 19.3 ఓవర్లలో 148 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. వెరసి 50 పరుగుల తేడాతో విజయం టీమిండియా సొంతమైంది. తద్వారా మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో రోహిత్ సేన 1-0తో ముందంజలో నిలిచింది. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. Hold the pose. Scorecard & Videos: https://t.co/r1PBlLhqeP 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/HzRgXbIYQ8 — England Cricket (@englandcricket) July 7, 2022 ఈ విజయంపై స్పందించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. ‘‘మొదటి బంతి నుంచే గొప్ప ప్రదర్శన కనబరిచాం. బ్యాటర్లు పట్టుదలగా ఆడారు. నిజానికి పిచ్ బాగుంది. మేము మంచి షాట్లు ఆడాము. హార్దిక్ పాండ్యా బౌలింగ్ నన్ను కట్టిపడేసింది. అద్భుతంగా రాణించాడు. భవిష్యత్తులో తను మరింతగా రాణించాలి. బౌలింగ్లో వైవిధ్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగాలి. తను బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని పేర్కొన్నాడు. అయితే, తాము క్యాచ్లు వదిలేయడం నిరాశ కలిగించిందని, రానున్న మ్యాచ్లలో ఈ తప్పిదం పునరావృతం కాకుండా చూసుకుంటామని రోహిత్ తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా బాగా చేస్తామని పేర్కొన్నాడు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ తొలి టీ20 మ్యాచ్: టాస్: ఇండియా- బ్యాటింగ్ ఇండియా స్కోరు: 198/8 (20) ఇంగ్లండ్ స్కోరు: 148 (19.3) విజేత: ఇండియా(50 పరుగుల తేడాతో విజయం) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హార్దిక్ పాండ్యా(51 పరుగులు, 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు) చదవండి: Virat Kohli: ఇదే చివరి అవకాశం.. రిపీట్ అయితే ప్రపంచకప్ జట్టు నుంచి కోహ్లి అవుట్! -
Ind Vs WI: ధావన్కు బంపరాఫర్.. వన్డే జట్టు కెప్టెన్గా ఎంపిక.. బీసీసీఐ ప్రకటన
India Tour of West Indies, 2022: వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. ఈ మేరకు విండీస్తో మూడు మ్యాచ్ల సిరీస్లో తలపడబోయే జట్టు వివరాలు వెల్లడించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. ఇక వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ను సెలక్టర్లు ఈ సిరీస్కు కెప్టెన్గా ఎంపిక చేశారు. రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్గా అవకాశం దక్కింది. అదే విధంగా ఐర్లాండ్తో టీ20 సిరీస్లో అదరగొట్టిన దీపక్ హుడా విండీస్తో వన్డేలకు ఎంపికయ్యాడు. సంజూ శాంసన్ సైతం మరోసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్కు కూడా అవకాశం దక్కింది. ఇక జూలై 22న మొదటి వన్డేతో టీమిండియా- వెస్టిండీస్ మధ్య సిరీస్ ఆరంభం కానుంది. కాగా గతంలో శ్రీలంకతో సిరీస్ నేపథ్యంలో శిఖర్ ధావన్ టీమిండియా కెప్టెన్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. కాగా వెస్టిండీస్తో వన్డే సిరీస్ నేపథ్యంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా తదితరులకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా షెడ్యూల్ ఇలా! వన్డే సిరీస్ ►జూలై 22- మొదటి వన్డే ►జూలై 24- రెండో వన్డే ►జూలై 27- మూడో వన్డే టీ20 సిరీస్ ►మొదటి టీ20- జూలై 29 ►రెండో టీ20- ఆగష్టు 1 ►మూడో టీ20- ఆగష్టు 2 ►నాలుగో టీ20- ఆగష్టు 6 ►ఐదో టీ20- ఆగష్టు 7 చదవండి: Jasprit Bumrah: అందుకే ఓడిపోయాం.. అయితే, కెప్టెన్సీ చేయడం నచ్చింది! భవిష్యత్తులో.. ICC Mens Test Rankings: దుమ్ములేపిన పంత్.. ఏకంగా! దిగజారిన కోహ్లి ర్యాంకు.. ఇక బెయిర్స్టో.. 🚨 NEWS 🚨: The All-India Senior Selection Committee has picked the squad for the three-match ODI series against the West Indies to be played at the Queen's Park Oval, Port of Spain, Trinidad.#TeamIndia | #WIvIND — BCCI (@BCCI) July 6, 2022 -
కెప్టెన్గా డీకే.. హుడా అర్ధ శతకం.. భారత్ ఘన విజయం
Derbyshire vs Indians, 1st T20 Warm-up Match: ఇంగ్లండ్తో సిరీస్ నేపథ్యంలో భారత్ డెర్బిషైర్ కౌంటీ జట్టుతో తొలి టీ20 వార్మప్ మ్యాచ్ ఆడింది. డెర్బీలోని కౌంటీ గ్రౌండ్ వేదికగా శుక్రవారం(జూలై 1) ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో భారత్ ఏకంగా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ వార్మప్ మ్యాచ్లో వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ భారత జట్టును ముందుండి నడిపించాడు. టాస్ గెలిచి.. డెర్బిషైర్తో మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో డెర్బిషైర్ జట్టు 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. హుడా అద్భుత ఇన్నింగ్స్! ఇక లక్ష్య ఛేదనకు దిగిన కార్తిక్ సేనకు ఓపెనర్ సంజూ శాంసన్(38 పరుగులు) శుభారంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(3 పరుగులు) పూర్తిగా విఫలమయ్యాడు. ఇక వన్డౌన్లో బ్యాటింగ్కు దిగిన దీపక్ హుడా మరోసారి సత్తా చాటాడు. 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేశాడు. హుడా అర్ధ శతకానికి సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ (36 పరుగలు నాటౌట్) తోడు కావడంతో భారత జట్టు 16.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ డీకే 7 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా జూలై 7 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ వార్మప్ మ్యాచ్లో విజయం సంగతి ఇలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదో టెస్టులో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా తమ అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపారు. ఆఖరి టెస్టు తొలి రోజు ఆట ముగిసిన తర్వాత పదకొండున్నర గంటల(భారత కాలమానం ప్రకారం) సమయంలో టీ20 తొలి వార్మప్ మ్యాచ్ ఆరంభమైంది. ఈ నేపథ్యంలో అటు టెస్టులో భారత్ మెరుగైన స్థితిలో ఉండటం.. మరోవైపు వార్మప్ మ్యాచ్లో విజయంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చదవండి: IND Vs ENG Test Day 1: పంత్ పరాక్రమం.. మెరుగైన స్థితిలో టీమిండియా India Vs England-Rishabh Pant: అద్భుతమైన షాట్లు.. నువ్వో సూపర్స్టార్: పంత్పై ప్రశంసల జల్లు 𝙁𝙖𝙡𝙘𝙤𝙣𝙨 𝙫 𝙄𝙣𝙙𝙞𝙖 🇮🇳@BCCI, Its been a pleasure.#ThisIsDerbyshire#Falcons #India #DERvIND pic.twitter.com/tIxSZuxRNr — Derbyshire CCC (@DerbyshireCCC) July 1, 2022 𝙒𝙄𝘾𝙆𝙀𝙏 ☝ Aitchison gets Hooda (59), caught by Hughes. IND: 134-3; Karthik joins Yadav (30*), 17 to win. Watch LIVE ⤵️ — Derbyshire CCC (@DerbyshireCCC) July 1, 2022 -
కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన చిన్ననాటి స్నేహితులు
India Vs Ireland 2nd T20: ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో విజయం ద్వారా 2-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. కాగా ఈ మ్యాచ్ సందర్భంగా దీపక్ హుడా, సంజూ శాంసన్ సరికొత్త రికార్డు నమోదు చేశారు. టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు. డబ్లిన్ వేదికగా సాగిన రెండో టీ20తో చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇచ్చిన సంజూ శాంసన్ ఇషాన్ కిషన్కు జోడీగా బరిలోకి దిగాడు. ఈ క్రమంలో 42 బంతుల్లో 77(9 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు సాధించాడు. ఇక మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ విఫలం(3) కాగా... వన్డౌన్లో వచ్చిన దీపక్ హుడా సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి 87 బంతుల్లో 176 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తద్వారా కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ జోడీ రికార్డును బద్దలు కొట్టారు. దీంతో దీపక్ హుడా, సంజూ శాంసన్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా వీరిద్దరు చిన్ననాటి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున అత్యధిక స్కోరు భాగస్వామ్యం ►దీపక్ హుడా- సంజూ శాంసన్(2022): ఐర్లాండ్పై 176 పరుగులు- డబ్లిన్లో.. ►కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ(2017): శ్రీలంకపై 165 పరుగులు- ఇండోర్లో. ►శిఖర్ ధావన్- రోహిత్ శర్మ(2018): ఐర్లాండ్పై 160 పరుగులు- డబ్లిన్లో.. ►శిఖర్ ధావన్- రోహిత్ శర్మ(2017): న్యూజిలాండ్పై 158 పరుగులు- ఢిల్లీలో.. ►కేఎల్ రాహుల్- రోహిత్ శర్మ(2021): అఫ్గనిస్తాన్ మీద140 పరుగులు- అబుదాబిలో.. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ రెండో టీ20: టాస్: ఇండియా- బ్యాటింగ్ ఇండియా స్కోరు: 225/7 (20) ఐర్లాండ్ స్కోరు: 221/5 (20) విజేత: నాలుగు పరుగుల తేడాతో ఇండియా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: దీపక్ హుడా(57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు) చదవండి: Hardik Pandya- Umran Malik: అద్భుతమైన షాట్లు.. అందుకే ఆఖర్లో ఉమ్రాన్ చేతికి బంతి.. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లదే! #TeamIndia beat Ireland by 4 runs & clinched the series 2-0 🏆 #IREvIND pic.twitter.com/l21YKzk8dX — Doordarshan Sports (@ddsportschannel) June 28, 2022 -
ఉత్కంఠపోరులో టీమిండియా విజయం.. సిరీస్ క్లీన్స్వీప్
డబ్లిన్: ఐర్లాండ్తో జరిగిన రెండు టి20 మ్యాచ్ల సిరీస్లో భారత్ సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో భారత్ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్ను ఓడించి 2–0తో సిరీస్ సొంతం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా (57 బంతుల్లో 104; 9 ఫోర్లు, 6 సిక్స్లు) సెంచరీతో చెలరేగగా, సంజు సామ్సన్ (42 బంతుల్లో 77; 9 ఫోర్లు, 4 సిక్స్లు) సత్తా చాటాడు. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఆండీ బల్బర్నీ (37 బంతుల్లో 60; 3 ఫోర్లు, 7 సిక్స్లు), పాల్ స్టిర్లింగ్ (18 బంతుల్లో 40; 5 ఫోర్లు, 3 సిక్స్లు), హ్యారీ టెక్టర్ (28 బంతుల్లో 39; 5 ఫోర్లు), డాక్రెల్ (16 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. రికార్డు భాగస్వామ్యం... 87 బంతుల్లో 176 పరుగులు... భారత జట్టు తరఫున టి20ల్లో అత్యధిక పరుగుల కొత్త రికార్డు భాగస్వామ్యమిది! హుడా, సామ్సన్ కలిసి జోడించిన ఈ పరుగులే భారత్ భారీ స్కోరుకు కారణమయ్యాయి. ఇషాన్ కిషన్ (3) వెనుదిరిగిన తర్వాత జత కలిసిన వీరిద్దరు ఐర్లాండ్ బౌలర్లపై చెలరేగడంతో పవర్ప్లే ముగిసేసరికే స్కోరు 54 పరుగులకు చేరింది. డెలానీ ఓవర్లో వరుస బంతుల్లో సామ్సన్ 4, 6 కొట్టగా, మెక్బ్రైన్ ఓవర్లో హుడా రెండు సిక్సర్లు బాది 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆల్ఫర్ట్ ఓవర్లోనూ హుడా 2 ఫోర్లు, సిక్స్ కొట్టగా... 31 బంతుల్లో సామ్సన్ తన కెరీర్లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాతా హుడా, సామ్సన్ జోరు కొనసాగింది. డెలానీ ఓవర్లో సామ్సన్ మళ్లీ వరుస బంతుల్లో రెండు సిక్సర్లతో దూకుడును ప్రదర్శించాడు. ఎట్టకేలకు సామ్సన్ను బౌల్డ్ చేసి ఎడైర్ ఈ భారీ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. లిటిల్ ఓవర్లో పాయింట్ దిశగా సింగిల్ తీసి హుడా 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో చివరి 3 ఓవర్లలో భారత్ 5 వికెట్లు కోల్పోయి 24 పరుగులే చేయగలిగింది. ఆరంభం అదిరినా... భారీ ఛేదనను ఐర్లాండ్ దూకుడుగా ఆరంభించింది. భువీ వేసిన తొలి ఓవర్లో స్టిర్లింగ్ వరుసగా 6, 4, 4, 4 బాదగా, 5 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 65. అయితే తర్వాతి ఓవర్లో స్టిర్లింగ్ను బిష్ణోయ్ బౌల్డ్ చేయగా, డెలానీ (0) రనౌటయ్యాడు. మరో ఎండ్లో సిక్సర్లతో చెలరేగిన బల్బర్నీ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. జోరు మీదున్న బల్బర్నీని హర్షల్ అవుట్ చేయడంతో ఐర్లాండ్ వేగానికి బ్రేకులు పడ్డాయి. చివర్లో డాక్రెల్ పోరాడినా లాభం లేకపోయింది. చదవండి: దీపక్ హుడా సెంచరీ.. టీమిండియా తరపున నాలుగో ఆటగాడిగా What a thriller we've witnessed 😮#TeamIndia win the 2nd #IREvIND by 4 runs and seal the 2-match series 2️⃣-0️⃣ 👏👏 Scorecard ▶️ https://t.co/6Ix0a6evrR pic.twitter.com/6GaXOAaieQ — BCCI (@BCCI) June 28, 2022 -
దీపక్ హుడా సెంచరీ.. టీమిండియా తరపున నాలుగో ఆటగాడిగా
ఐర్లాండ్తో రెండో టి20లో టీమిండియా ఆల్రౌండర్ దీపక్ హుడా సెంచరీతో చెలరేగాడు. తొలి టి20లో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన దీపక్ హుడా రెండో టి20లో ఏకంగా శతకంతో చెలరేగాడు. 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. దీపక్ హుడాకు ఓపెనర్ సంజూ శాంసన్(42 బంతుల్లో 77, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సహకరించాడు. కాగా దీపక్ హుడాకు టి20ల్లో ఇదే తొలి సెంచరీ. ఇక టీమిండియా తరపున టి20ల్లో సెంచరీ బాదిన నాలుగో భారత ఆటగాడిగా దీపక్ హుడా నిలిచాడు. ఇంతకముందు టి20ల్లో రోహిత్ శర్మ(4 సెంచరీలు), కేఎల్ రాహుల్(2 సెంచరీలు), సురేశ్ రైనా.. తాజాగా దీపక్ హుడా వీరి సరసన చేరాడు. ఇక ఐర్లాండ్తో మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. -
అతడి ఎంపిక సరైంది.. భారత్కు ఇప్పుడు అలాంటి ఆటగాడు అవసరం!
India Vs Ireland T20I Series: ఐర్లాండ్తో టీ20 సిరీస్కు భారత జట్టులో దీపక్ హుడాను ఎంపిక చేయడం మంచి నిర్ణయమని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. లోయర్ ఆర్డర్లో భారత్కు ఇప్పుడు హుడా వంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్-2022లో అద్భుతంగా ఆకట్టుకున్న అతడు.. టీమిండియా తరఫున ఏ మేరకు రాణిస్తాడో చూడాలని ఉందన్నాడు. అద్భుతంగా రాణించినా! కాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు దీపక్ హుడా. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో మ్యాచ్లో ఆడాడు. ఇక ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ 14 ఇన్నింగ్స్లో కలిపి 451 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ శతకాలు ఉన్నాయి. మిడిలార్డర్లో కీలకంగా వ్యవహరించి లక్నో ప్లే ఆఫ్స్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో హుడాకు జాతీయ జట్టులో చోటు దక్కుతుందని భావించినా మొండిచేయి ఎదురైంది. అయితే, కీలక ఆటగాళ్లు లేకుండా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని టీమ్లో అతడు స్థానం సంపాదించుకున్నాడు. భారత్కు ఇలాంటి ఆటగాడి అవసరం ఉంది! ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐర్లాండ్తో సిరీస్లో హుడా రాణిస్తాడనే అనుకుంటున్నా. ఐపీఎల్లో దీపక్ హుడా తన అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. నిజానికి లోయర్ ఆర్డర్లో వచ్చి ఆకట్టుకునే ప్రదర్శన చేయడం కష్టం. అయితే, హుడా ఐపీఎల్లో ఈ కఠినతరమైన పనిని ఎంతో సులువుగా చేశాడు. టీమిండియాకు ఇప్పుడు ఇలాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంది. ఐపీఎల్లోనే కాదు భారత్ తరఫున కూడా అతడు అత్యుత్తమంగా రాణిస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 26, 28 తేదీల్లో భారత్- ఐర్లాండ్ మధ్య రెండు టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి. చదవండి: ఒకప్పుడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్.. ఇప్పుడు పాకిస్తాన్లో సెకండ్ హ్యాండ్ దుస్తులు అమ్ముతూ! డబ్బు మీద ఆశలేదు కానీ! India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు! -
IPL 2022: లక్నో సూపర్ ‘సిక్సర్’
పుణే: ఐపీఎల్లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ దూసుకుపోతోంది. బ్యాటింగ్లో అద్భుతాలు చేయకపోయినా... ఈసారి బౌలర్ల చక్కటి ప్రదర్శనతో ఆ జట్టు ఖాతాలో ఆరో విజయం చేరింది. స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమ్ కాపాడుకోగలిగింది. శుక్రవారం జరిగిన పోరులో లక్నో 20 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (37 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్లు), దీపక్ హుడా (28 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్లు) రాణించారు. కగిసో రబడకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. జానీ బెయిర్స్టో (28 బంతుల్లో 32; 5 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన కృనాల్ పాండ్యా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. కీలక భాగస్వామ్యం... సీజన్లో అద్భుత ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్ (6) అరుదైన వైఫల్యంతో లక్నో ఆట మొదలైంది. అయితే డికాక్, హుడా రెండో వికెట్కు 85 పరుగులు (59 బంతుల్లో) జోడించి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. రబడ ఓవర్లో డికాక్ వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాదగా, పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 39 పరుగులకు చేరింది. ఈ భాగస్వామ్యం భారీ స్కోరుకు బాటలు వేస్తున్న తరుణంలో సందీప్ శర్మ దెబ్బ తీశాడు. అతని బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి డికాక్ అవుటయ్యాడు. బౌలర్ అప్పీల్పై అంపైర్ స్పందించకపోయినా డికాక్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ మైదానం వీడాడు. ఇక్కడే లక్నో బ్యాటింగ్ తడబడింది. 13 పరుగుల వ్యవధిలో జట్టు మరో 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. హుడా, కృనాల్ (7), బదోని (4), స్టొయినిస్ (1) పెవిలియన్ చేరారు. చివర్లో ఆరు బంతుల వ్యవధిలో 4 సిక్సర్లు కొట్టిన సూపర్ జెయింట్స్ 150 పరుగుల స్కోరు దాటగలిగింది. వీటిలో రబడ ఓవర్లో వరుస బంతుల్లో చమీరా బాదిన రెండు సిక్స్లు ఉన్నాయి. సమష్టి వైఫల్యం... మొహసిన్ ఓవర్లో 6, 4 తో ఛేదనను కెప్టెన్ మయాంక్ (17 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా మొదలు పెట్టాడు. అయితే చమీరా ఓవర్లోనూ సిక్స్ బాదిన అతను అదే ఓవర్లో వెనుదిరిగాడు. అనంతరం తక్కువ వ్యవధిలో శిఖర్ ధావన్ (5), రాజపక్స (9) వికెట్లను పంజాబ్ కోల్పోయింది. బెయిర్స్టోతో పాటు భారీ హిట్టర్ లివింగ్స్టోన్ (18) క్రీజ్లో ఉన్నంత వరకు కింగ్స్ గెలుపు విషయంలో ఎలాంటి ఢోకా కనిపించలేదు. రవి బిష్ణోయ్ ఓవర్లో రెండు వరుస సిక్స్లు కొట్టిన లివింగ్స్టోన్ జోరు ప్రదర్శించాడు కూడా. అయితే మొహసిన్ బౌలింగ్లో కీపర్ మీదుగా భిన్నమైన షాట్ ఆడేందుకు ప్రయత్నించి అతను అవుటయ్యాడు. ఆ వెంటనే జితేశ్ శర్మ (2), గెలిపించే అవకాశం ఉన్న బెయిర్స్టో కూడా వెనుదిరగడంతో పంజాబ్ గెలుపు ఆశలకు కళ్లెం పడింది. చివర్లో రిషి ధావన్ (22 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ప్రయత్నం సరిపోలేదు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) జితేశ్ (బి) సందీప్ శర్మ 46; రాహుల్ (సి) జితేశ్ (బి) రబడ 6; హుడా (రనౌట్) 34; కృనాల్ (సి) శిఖర్ (బి) రబడ 7; స్టొయినిస్ (సి అండ్ బి) చహర్ 1; బదోని (సి) లివింగ్స్టోన్ (బి) రబడ 4; హోల్డర్ (సి) సందీప్ (బి) చహర్ 11; చమీరా (సి) చహర్ (బి) రబడ 17; మొహసిన్ (నాటౌట్) 13; అవేశ్ ఖాన్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–13, 2–98, 3–104, 4–105, 5–109, 6–111, 7–126, 8–144. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–23–0, సందీప్ శర్మ 4–0–18–1, రబడ 4–0–38–4, రిషి ధావన్ 2–0–13–0, లివింగ్స్టోన్ 2–0–23–0, రాహుల్ చహర్ 4–0–30–2. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: మయాంక్ (సి) రాహుల్ (బి) చమీరా 25; శిఖర్ ధావన్ (బి) బిష్ణోయ్ 5; బెయిర్స్టో (సి) కృనాల్ (బి) చమీరా 32; రాజపక్స (సి) రాహుల్ (బి) కృనాల్ 9; లివింగ్స్టోన్ (సి) డికాక్ (బి) మొహసిన్ 18; జితేశ్ (ఎల్బీ) (బి) కృనాల్ 2; రిషి ధావన్ (నాటౌట్) 21; రబడ (సి) బదోని (బి) మొహసిన్ 2; చహర్ (సి) బదోని (బి) మొహసిన్ 4; అర్‡్షదీప్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–35, 2–46, 3–58, 4–88, 5–92, 6–103, 7–112, 8–117. బౌలింగ్: మొహసిన్ 4–1–24–3, చమీరా 4–0–17–2, హోల్డర్ 1–0–8–0, అవేశ్ ఖాన్ 3–0–26–0, రవి బిష్ణోయ్ 4–0–41–1, కృనాల్ పాండ్యా 4–1–11–2. ఐపీఎల్లో నేడు గుజరాత్ టైటాన్స్ X బెంగళూరు వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి రాజస్తాన్ రాయల్స్ X ముంబై ఇండియన్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. That's that from Match 42.@LucknowIPL win by 20 runs and add two more points to their tally. Scorecard - https://t.co/H9HyjJPgvV #PBKSvLSG #TATAIPL pic.twitter.com/dfSJXzHcfG — IndianPremierLeague (@IPL) April 29, 2022 -
'ఒకప్పుడు కొట్టుకునే స్థాయికి '.. కట్చేస్తే
కృనాల్ పాండ్యా.. దీపక్ హుడా... ఈ ఇద్దరి పేర్లు వినగానే టక్కున గుర్తుచ్చేది 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో జరిగిన గొడవ. దాదాపు కొట్టుకునే స్థాయికి వెళ్లిన ఈ ఇద్దరిలో ఎవరు తగ్గలేదు. అప్పటి బరోడా జట్టుకు కలిసి ఆడుతున్న సమయంలో కృనాల్ తనపై దౌర్జన్యం చేశాడని దీపక్ హుడా ఆరోపించాడు. అటు కృనాల్ కూడా ఏమాత్రం తగ్గలేదు. అతని మిస్బిహేవియర్ నాకు నచ్చలేదని.. అందుకే తిట్టానంటూ వివరణ ఇచ్చాడు. ఈ ఉదంతం తర్వాత దీపక్ హుడా బరోడాకు గుడ్బై చెప్పి రాజస్తాన్ జట్టులోకి వెళ్లిపోయాడు. అప్పటినుంచి కృనాల్, దీపక్ హుడాలు ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. Courtesy: IPL Twitter తాజాగా ఐపీఎల్ ఈ ఇద్దరిని మరోసారి ఎదురుపడేలా చేసింది. గత ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ మెగావేలంలో దీపక్ హుడా, కృనాల్లను లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. అంత గొడవ జరిగిన తర్వాత ఈ ఇద్దరు ఎలా ఉంటారోనని అభిమానుల్లోనూ ఆసక్తి కలిగింది. అయితే చేదు జ్ఞాపకాలను మరిచిపోయి ఇద్దరు ఒకరినొకరు అభినందించుకోవడంతో గొడవకు ఎండ్కార్డ్ పడినట్లయింది. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో కృనాల్ వికెట్ తీసిన సందర్భంలో దీపక్ హుడా అతని వద్దకు వచ్చి అభినందిస్తూ హత్తుకున్నాడు. మ్యాచ్ అనంతరం దీపక్ హుడా దైనిక్ జాగరణ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో కృనాల్తో పంచుకున్న సంతోషాన్ని వివరించాడు . ''కృనాల్ పాండ్యా నాకు సోదరుడులాండి వాడు. అన్నదమ్ముళ్లు అంటేనే సరదాగా కొట్టుకుంటారు. ఆట అన్నప్పుడు గొడవలు సాధారణం. అప్పుడు తప్పు అనిపించింది.. అందుకే కృనాల్పై విరుచుకుపడ్డా. అవన్నీ మరిచిపోయాం. ఇప్పుడు ఇద్దరం ఒకే జట్టుకు ఆడుతున్నాం. మా ఏకైక లక్ష్యం లక్నో సూపర్ జెయింట్స్ను విజేతగా నిలపడమే.'' అని చెప్పుకొచ్చాడు. ఇది విన్న అభిమానులు..''శత్రుత్వం ఎప్పటికి శాశ్వతం కాదని మరోసారి నిరూపించారు'' అని కామెంట్ చేశారు. చదవండి: మ్యాచ్ గెలిచిన సంతోషం ముద్దుతో ఉక్కిరిబిక్కిరి; ట్విస్ట్ ఏంటంటే IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్కు భారీ షాక్.. విధ్వంసకర ఆటగాడు దూరం! -
మెగావేలంలో టాప్ లేపిన భారత కుర్రాళ్లు
IPL 2022 Auction: ఐపీఎల్ మెగావేలం 2022లో ఊహించనట్లుగానే టీమిండియా యువ ఆటగాళ్లు సత్తా చాటారు. అంచనాలకు మించి ఈ ఆటగాళ్లు మంచి ధరను సొంతం చేసుకున్నారు. నితీష్ రాణా, హర్షల్ పటేల్, ఆల్రౌండర్ దీపక్ హుడా, దేవదూత్ పడిక్కల్ ఈ జాబితాలో ఉన్నారు. హర్షల్ పటేల్: గత సీజన్లో అంచనాలకు మించి రాణించిన హర్షల్ పటేల్కు జాక్పాట్ తగిలింది. 32 వికెట్లతో పర్పుల్క్యాప్ అందుకున్న హర్షల్ను మరోసారి ఆర్సీబీ దక్కించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరతో బరిలోకి దిగిన హర్షల్ను రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ మరోసారి దక్కించుకుంది. నవంబర్ 2021లో న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్ ద్వారా టీమిండియా తరపున హర్షల్ పటేల్ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే రెండు వికెట్లు తీసిన హర్షల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. దేవదూత్ పడిక్కల్: టీమిండియా అన్క్యాప్డ్ ప్లేయర్ దేవదూత్ పడిక్కల్ దశ తిరిగింది. ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో ఆర్సీబీ తరపున దేవదూత్ పడిక్కల్ దుమ్మురేపాడు. ఐపీఎల్ 2020 సీజన్లో 473 పరుగులతో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్న పడిక్కల్.. మరుసటి ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ అదే జోరు చూపెట్టాడు. 411 పరుగులు చేసిన పడిక్కల్ సీజన్లో వేగవంతమైన సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 51 బంతుల్లోనే సెంచరీ మార్క్ సాధించి ఔరా అనిపించాడు.తాజాగా ఐపీఎల్ మెగావేలంలో ఆర్సీబీ అతని కోసం పోటీపడినప్పటికి చివరికి రాజస్తాన్ రాయల్స్ రూ. 7.75 కోట్లకు దక్కించుకుంది. నితీష్ రాణా: గత సీజన్లో కేకేఆర్ తరపున నితీష్ రాణా మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతనిపై నమ్మకముంచిన కేకేఆర్ నితీష్ రాణాను రూ. 8 కోట్లతో దక్కించుకుంది. కాగా గత సీజన్లో కేకేఆర్ తరపున 17 మ్యాచ్ల్లో 383 పరుగులు చేసిన నితీష్ ఖాతాలో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా 2015లో తొలిసారి ఐపీఎల్లో అరంగేట్రం చేసిన నితీష్ రానా ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడని నితీష్.. ఆ తర్వాతి సీజన్లో 4 మ్యాచ్ల్లో 104 పరుగులు చేశాడు. 2017 సీజన్లో 13 మ్యాచ్ల్లో 333 పరుగులతో ఆకట్టుకున్న నితీష్ను ముంబై రిలీజ్ చేయగా.. 2018 వేలంలో అతన్ని కేకేఆర్ దక్కించుకుంది. అప్పటినుంచి నితీష్ రాణా కేకేఆర్ రెగ్యులర్ ప్లేయర్గా మారిపోయాడు. దీపక్హుడా: టీమిండియా ఆల్రౌండర్ దీపక్ హుడాను రూ. 5.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన దీపక్ హుడాది మంచి ధరే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఐపీఎల్లో 80 మ్యాచ్లాడిన దీపక్ హుడా 785 పరుగులు చేశాడు. -
'కోహ్లి నుంచి తొలి క్యాప్ అందుకోవాలనేది నా చిన్ననాటి కల'
వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో దీపక్ హుడా భారత జట్టు తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన అరంగేట్రంపై దీపక్ హుడా స్పందించాడు. విరాట్ కోహ్లి లేదా ఎంస్ ధోని చేతుల మీదగా తొలి వన్డే క్యాప్ను పొందాలనేది తన కల అని హుడా వెల్లడించాడు. 'నేను వెస్టిండీస్తో తొలి వన్డేలో భారత్ తరుపున అరంగేట్రం చేశాను, అది నాకు అద్భుతమైన అనుభూతి. నా శక్తికి మించి జట్టు కోసం పనిచేస్తాను. మ్యాచ్కు ముందు ఇదే విషయం నేను సూర్యకుమార్ యాదవ్కి చెప్పాను. భారత తరుపున ఆడాలి అనేది ప్రతీ ఒక్క ఆటగాడి కల. నేను జట్టులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఎంఎస్ ధోనీ లేదా విరాట్ కోహ్లీ నుంచి క్యాప్ అందుకోవాలనేది నా చిన్ననాటి కల. ఈ మ్యాచ్లో కోహ్లి నుంచి క్యాప్ అందుకోవడం మధుర అనుభూతిని కలిగించింది. నా కల ఇప్పుడు నేరవేరింది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఈ అద్భుతమైన ప్రయాణంలో నన్ను వెనుకుండి నడిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని దీపక్ హుడా ట్వీట్ చేశారు. ఇక వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో అజేయంగా 26 పరుగులు చేశాడు. అదే విధంగా రెండో వన్డేలో కూడా 29 పరుగులతో హుడా రాణించాడు. చదవండి: IND vs WI: "అతడు అద్భుతమైన బౌలర్.. ఇప్పటి వరకు ఇలాంటి బౌలింగ్ స్పెల్ చూడలేదు" -
వన్డేల్లో దీపక్ హుడా అరంగేట్రం .. కారులో మ్యాచ్ చూసిన..!
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్లో దీపక్ హుడా భారత్ తరుపున వన్డేల్లో అరంగట్రేం చేశాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్కు దిగిన దీపక్ హుడా 32 బంతుల్లో 26 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో రెండు బౌండరీలు ఉన్నాయి. కాగా తొలి వన్డేలో హుడాకి బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే డెబ్యూ మ్యాచ్లో హుడా ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో దీపక్ హుడాపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. హుడా అత్యత్తుమ ఆటగాడని అతడు కొనియాడాడు. అదే విధంగా తొలిసారిగా టీమిండియా క్యాప్ అందుకున్నందుకు దీపక్ హుడాను పఠాన్ అభినందించాడు. ఇక హుడా బ్యాటింగ్కు వచ్చిన సమయంలో ట్రాఫిక్లో ఇర్ఫాన్ చిక్కుకుపోయినప్పటికీ.. అతడి బ్యాటింగ్ను మాత్రం పఠాన్ మిస్ కాలేదు. కారులో కూర్చోని హుడా ఇన్నింగ్స్ను పఠాన్ వీక్షించాడు. దీనికి సంబంధించిన ఫోటోను ఇర్ఫాన్ ట్విటర్లో షేర్ చేశాడు. కాగా ఇర్ఫాన్ పఠాన్, దీపక్ హుడా ఇద్దరూ కూడా బరోడాకు చెందిన ఆటగాళ్లే కావడం విశేషం. ఇక భారత్-విండీస్ జట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరగనుంది. చదవండి:15 పరుగులు.. 4 వికెట్లు.. బ్యాటర్లకు చుక్కలు! -
కృనాల్ పాండ్యా ట్విటర్ అకౌంట్ హ్యాక్.. మద్యం మత్తులో తనే అలా..!
Krunal Pandyas Twitter Account Hacked: టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. అతని అకౌంట్ నుంచి చిత్ర విచిత్ర ట్వీట్లు రావడంతో ఈ విషయం స్పష్టమైంది. బిట్ కాయిన్ కోసం తన అకౌంట్ను అమ్మేస్తానంటూ, ఓ అమ్మాయి అంటే తనకి ఇష్టమంటూ కృనాల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్లు వచ్చాయి. దీంతో తన అకౌంట్ హ్యాక్ అయ్యిందన్న విషయాన్ని గ్రహించిన కృనాల్.. సదరు ట్వీట్లతో తనకెటువంటి సంబంధం లేదంటూ మరో ఖాతా ద్వారా వెల్లడించాడు. అయితే, ఈ విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్తో ముడి పెడుతున్న నెటిజన్లు.. కృనాల్ను ఓ ఆటాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. గతేడాది ఓ టోర్నీ సందర్భంగా తనని అందరి ముందు బూతులు తిట్టి, అవమానించాడంటూ నాటి బరోడా కెప్టెన్గా ఉన్న కృనాల్పై ఆ జట్టు వైస్ కెప్టెన్గా ఉన్న దీపక్ హూడా స్థానిక క్రికెట్ అసోసియేషన్కి ఫిర్యాదు చేశాడు. అయితే ఈ విషయంపై విచారణ జరిపిన బరోడా క్రికెట్ అసోసియేషన్.. అనూహ్యంగా దీపక్ హుడాపై నిషేధం వేటు వేసింది. దీంతో బరోడా నుంచి రాజస్థాన్కు వలస వెళ్లిన హూడా.. అనంతరం జరిగిన దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటి, తాజాగా విండీస్ టూర్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. సరిగ్గా దీపక్ హూడాకు టీమిండియా నుంచి పిలుపు వచ్చిన రోజే, కృనాల్ ట్విటర్ అకౌంట్ నుంచి వింత వింత ట్వీట్లు రావడంతో ఈ విషయాన్ని గతంలో హూడాతో ఉన్న విభేదాలకు లింక్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. హూడా టీమిండియాకు ఎంపిక కావడంతో కృనాల్ మతి భ్రమించి, తనే స్వయంగా ఇలా చేసుకుంటాడని కొందరు, మద్యం మత్తులో కృనాల్ ఈ ట్వీట్లు చేసుంటాడని మరికొందరు అంటున్నారు. కృనాల్ అకౌంట్ ఒకే ఫోన్ నుంచి రెండు సార్లు లాగిన్ అయ్యిందని, అకౌంట్ హ్యాక్ అయితే ఇలా చేయడం కుదరదని నిపుణులు తేల్చడంతో మనోడే హూడా టీమిండియాకు ఎంపిక కావడం జీర్ణించుకోలేక, మద్యం మత్తులో ఇలా చేసి ఉంటాడని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే, గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా టీమిండియాలోకి ఆరంగ్రేటం చేసిన కృనాల్.. మొదటి వన్డేలోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా.. అనంతరం శ్రీలంకతో జరిగిన సిరీస్లో విఫలం కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. చదవండి: వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంతో తెలుసా? -
జట్టు మొత్తం స్కోరు 200.. ఒక్కడే 109 బాదాడు
జైపూర్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా కర్ణాటక, రాజస్తాన్ మధ్య జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ పోరులో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లు ఆడకుండానే 41.4 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. ఇక్కడ విశేషమేమిటంటే జట్టు మొత్తం కలిపి 199 పరుగులు చేస్తే అందులో కెప్టెన్ అయిన దీపక్ హుడా ఒక్కడే 109 పరుగులు బాదాడు. దీన్ని బట్టే రాజస్తాన్ బ్యాటింగ్ వైఫల్యం ఏంటనేది స్పష్టంగా తెలుస్తోంది. దీపక్ హుడా తర్వాత సమర్పిత్ జోషి 33 పరుగులు చేశాడు. మిగతావారిలో ఏడుగురు బ్యాట్స్మన్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కర్ణాటక బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 4, కృష్ణప్ప గౌతమ్ 2 వికెట్లు తీశారు. ఇక కర్ణాటక విజయలక్ష్యం 201 పరుగులు కాగా ప్రస్తుతం 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. -
పంజాబ్ ఆటగాడిపై మ్యాచ్ ఫిక్సింగ్ అనుమానం.. బీసీసీఐ సీరియస్
Deepak Hooda In Match Fixing Scanner: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్లో భాగంగా నిన్న(సెప్టెంబర్ 21) పంజాబ్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ 2 పరగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు కొద్ది గంటల ముందు పంజాబ్ కింగ్స్ ఆటగాడు దీపక్ హూడా తన ఇన్స్టా ఖాతాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో హూడా తన ఇన్స్టాలో ఓ పోస్ట్ చేశాడు. అందులో అతను పంజాబ్ కింగ్స్ తుది జట్టులో ఆడుతున్నట్లు స్పష్టం చేశాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏదైనా జట్టు తుది వివరాలు టాస్ వేసే సమయంలో కెప్టెన్ రిఫరీకి అందిస్తాడు. జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లైనా సరే తుది జట్టు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ టాస్కు ముందు బహిర్గతం చేయకూడదు. ఈ నేపథ్యంలో ఈ పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ తుది జట్టు వివరాలను బయటపెట్టడంపై బీసీసీఐ సీరియస్గా ఉంది. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అనుమానాస్పద ప్రవర్తన కారణంగా అతన్ని యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) నిఘా పరిధిలోకి తీసుకువచ్చింది. జట్టు, పిచ్ సంబంధిత వివరాలను బహిర్గతం చేయడం బీసీసీఐ నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, అన్నీ తెలిసి కూడా దీపక్ హూడా తుది జట్టు వివరాలను సోషల్ మీడియాలో వెల్లడించడం నేరమని ఏసీయూ పేర్కొంది. రంజీ జట్టు కెప్టెన్గా, గతంలో పలు ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా ఎంతో అనుభవమున్న హూడా ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచిందని, ఈ పోస్ట్ను అతను అనుకోకుండా పెట్టాడా లేదా బుకీలకు ఏదైనా హింట్ ఇద్దామని చేశాడా అన్న కోణంలో ఆరా తీస్తున్నామని ఏసీయూ పేర్కొంది. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్లో పంజాబ్ జట్టు ఆఖరి ఓవర్లో 4 పరుగులు చేయాల్సి దశలో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఆఖర్లో బ్యాటింగ్కు వచ్చిన దీపక్ హూడా డకౌట్గా వెనుదిరిగాడు. చదవండి: క్రికెట్ రూల్స్లో కీలక మార్పు చేసిన ఎంసీసీ -
ఓడిపోయినా సెలబ్రేట్ చేసుకున్నారు.. అదేంటో
ముంబై: అదేంటి మ్యాచ్ ఓడిపోతే బాధతో ఉంటారు కానీ సెలబ్రేట్ చేసుకుంటారా అన్న అనుమానం వస్తుంది కదూ.. వాస్తవానికి ఇక్కడ సెలబ్రేషన్ అనే మాట నిజమే.. అయితే అవి బర్త్డే వేడుకలు మాత్రమే. గత ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు పంజాబ్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విషయం పక్కనపెడితే.. సోమవారం (ఏప్రిల్ 19) పంజాబ్ కింగ్స్ ఆలరౌండర్ దీపక్ హుడా పుట్టినరోజు. ఈ సందర్భంగా పంజాబ్ కింగ్స్ యాజమాన్యం అతని బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించింది. కేఎల్ రాహుల్ సహా ఇతర ఆటగాళ్లు దీపక్ హుడాకు విషెస్ తెలిపి అతని చేత కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోనూ ట్విటర్లో షేర్ చేశారు. అయితే వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు వినూత్నంగా స్పందించారు. ఓడిపోయినా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు... అదేంటి ఓడిపోయినంత మాత్రానా బర్త్డే వేడుకలు నిర్వహించకూడదా.. అంటూ కామెంట్లు చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (36 బంతుల్లో 69; 7 ఫోర్లు, 4 సిక్స్లు), కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 61; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీలు సాధించారు. ఆఖర్లో దీపక్ హుడా (13 బంతుల్లో 22 నాటౌట్ 2 సిక్సర్లు), షారుఖ్ (5 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ మరో 10 బంతులు మిగిలుండగానే 18.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి గెలిచింది. పృథ్వీ షా (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్లు)తో కలిసి తొలి వికెట్కు 59 పరుగులు జోడించిన ధావన్, రెండో వికెట్కు స్మిత్ (9)తో 48 పరుగులు జతచేశాడు. సెంచరీకి చేరువైన దశలో రిచర్డ్సన్ బౌలింగ్లో ధావన్ అవుటయ్యాడు. అనంతరం స్టొయినిస్ (13 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), లలిత్ యాదవ్ (6 బంతుల్లో 12 నాటౌట్; 2 ఫోర్లు) వేగంగా ఆడటంతో మరో 10 బంతులు మిగిలుండగానే ఢిల్లీ లక్ష్యాన్ని అధిగమించింది. అయితే పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో ఓటమిని నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. చదవండి: భార్యలతో అదరగొట్టిన పాండ్యా బ్రదర్స్.. వీడియో వైరల్ అసలు మీ స్ట్రాటెజీ ఏంటి: అలా ఐతే షమీతో ఓపెనింగ్ చేయించండి! Birthdays always seem incomplete without a 🎂, don't they? 😉#SaddaPunjab #IPL2021 #PunjabKings @HoodaOnFire @shankrajgopal pic.twitter.com/YC8A678kFY — Punjab Kings (@PunjabKingsIPL) April 19, 2021 -
కెప్టెన్తో గొడవ.. టీమ్ నుంచి వెళ్లిపోయిన ఆల్రౌండర్
ఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభానికి ముందే బరోడా టీమ్కు ఊహించని షాక్ తగిలింది. ఆదివారం నుంచి టోర్నీ ప్రారంభం అవుతుండగా జట్టు సీనియర్ ఆల్రౌండర్ దీపక్ హుడా..కెప్టెన్ కృనాల్ పాండ్యాతో గొడవ కారణంగా క్యాంప్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. బరోడా టీమ్కి కృనాల్ పాండ్యా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఈ టీమ్కి కెప్టెన్గా పనిచేసిన దీపక్ హుడా ప్రస్తుతం వైస్ కెప్టెన్ హోదాలో ఉన్నాడు.కాగా క్యాంప్ నుంచి వెళ్లిన అనంతరం తాను టీమ్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాన్ని దీపక్ హుడా ఈ మెయిల్ ద్వారా బరోడా క్రికెట్ అసోసియేషన్కు వివరించాడు. (చదవండి: బుమ్రా చేసిన పనికి షాక్ తిన్న అంపైర్) 'ఇటీవల జరిగిన టీమ్ సమావేశాల్లో పదే పదే నన్ను టార్గెట్ చేస్తూ కృనాల్ పాండ్యా దూషిస్తున్నాడు. తాను ఒక సీనియర్ ఆటగాడినేనని.. భారత్ జట్టుతో పాటు ఐపీఎల్లోనూ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాను. గతంలో ఇదే బరోడా జట్టకు కెప్టెన్గా పనిచేసిన నేను ఇప్పుడు వైస్ కెప్టెన్ హోదాలో ఏదైనా సలహా ఇచ్చినా కృనాల్ దానిని స్వీకరించడం లేదు. పైగా జట్టు సహచరుల ముందే నన్ను దూషించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. గతంలో ఎన్నో జట్లకు ఆడాను.. ఒక ఆటగాడిగా చాలా మంది కెప్టెన్సీలో పనిచేశాను.. కానీ కృనాల్ పాండ్యా తరహా వేధింపులు ఎక్కడా ఎదుర్కోలేదు. కేవలం కృనాల్ బ్యాడ్ బిహేవియర్ కారణంగానే టీమ్ క్యాంప్ నుంచి బయటికి వెళ్లిపోయానంటూ ' దీపక్ హుడా ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే వీరిద్దరి గొడవపై ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా బరోడా టీమ్ మేనేజర్ని బరోడా క్రికెట్ అసోసియేషన్ కోరింది. కృనాల్ పాండ్యా టీమిండియాకి ఆడాడు. 2018లో భారత్ తరఫున టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆల్రౌండర్ ఇప్పటి వరకూ 18 టీ20 మ్యాచ్లు ఆడాడు. మరోవైపు దీపక్ హుడా భారత్ జట్టులోకి 2017-18లో భారత టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కించుకోలేకపోయాడు. ఇక ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున కృనాల్ పాండ్యా ఆడుతుండగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్కి ఐపీఎల్ 2020 సీజన్లో దీపక్ హుడా ఆడాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయో- సెక్యూర్ వాతావరణంలో ఈ ట్రోఫీని బీసీసీఐ నిర్వహించనుంది. ముస్తాక్ అలీ ట్రోపీలో 38 జట్లు క్వారంటైన్లో ఉండి బయో బబుల్లోకి వచ్చాయి. కృనాల్తో గొడవ కారణంగా క్యాంప్ నుంచి వెళ్లిపోయిన దీపక్ హుడా మళ్లీ జట్టులోకి రావాలంటే.. 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి కానుంది.(చదవండి: ఒకవేళ అక్కడ సచిన్ ఉంటే పరిస్థితి ఏంటి?) -
కింగ్స్ పంజాబ్ కథ ముగిసె..
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో కింగ్స్ పంజాబ్ కథ ముగిసింది. తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ పరాజయం చెందడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తద్వారా ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔటైన రెండో జట్టుగా పంజాబ్ నిలిచింది. సీఎస్కేతో మ్యాచ్ లో పంజాబ్ ముందుగా బ్యాటింగ్ చేసి 153 పరుగుల స్కోరునే చేసింది. ఆ లక్ష్యాన్ని ధోని సేన 18.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. పంజాబ్ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమి పాలుకావడంతో సీజన్ను భారంగా ముగించింది. టార్గెట్ను ఛేదించే క్రమంలో డుప్లెసిస్(48; 34 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్లు), రుతురాజ్ గైక్వాడ్(62 నాటౌట్;49 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్),,అంబటి రాయుడు(30 నాటౌట్; 30 బంతుల్లో 2 ఫోర్లులు రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. పంజాబ్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో సన్రైజర్స్, రాజస్తాన్,కేకేఆర్లు బరిలో నిలిచాయి. మంగళవారం ముంబై ఇండియన్స్-సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగనున్న మ్యాచ్ తర్వాత ప్లేఆఫ్స్ బెర్తులు ఖరారు కానున్నాయి. ఈ రోజు రాజస్తాన్ వర్సెస్ కేకేఆర్ జట్లలో విజయం సాధించిన జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. కానీ లీగ్ దశలో చివరి రోజు వరకూ వేచి చూడక తప్పదు. సీఎస్కేతో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ 154 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టాస్ గెలిచిన సీఎస్కే తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్కు దిగింది. పంజాబ్ ఇన్నింగ్స్ను కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్కు 48 పరుగులు జత చేసిన తర్వాత అగర్వాల్(26; 15 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. ఎన్గిడి బౌలింగ్లో అగర్వాల్ బౌల్డ్ అయ్యాడు. కాసేపటికి రాహుల్(29; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా పెవిలియన్ చేరాడు. ఎన్గిడి బౌలింగ్లోనే రాహుల్ క్లీన్బౌల్డ్గా నిష్క్రమించాడు. ఇక క్రిస్ గేల్(12), పూరన్(2), మన్దీప్ సింగ్(14), నీషమ్(2)లు నిరాశపరచడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. కానీ దీపక్ హుడా(62 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) బ్యాట్ ఝుళిపించడంతో కింగ్స్ పంజాబ్ తేరుకుంది. సీఎస్కే బౌలర్లలో ఎన్గిడి మూడు వికెట్లు సాధించగా, తాహీర్, శార్దూల్ ఠాకూర్, జడేజాలు తలో వికెట్ సాధించారు. సీఎస్కే ఆరు విజయాలతో టోర్నీ నుంచి ముగించింది. ఇది సీఎస్కేకు వరుసగా మూడో విజయం కావడం విశేషం. -
అదరగొట్టిన దీపక్ హుడా
అబుదాబి: చెన్నై సూపర్కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ 154 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. టాస్ గెలిచిన సీఎస్కే తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్కు దిగింది. పంజాబ్ ఇన్నింగ్స్ను కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్లు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్కు 48 పరుగులు జత చేసిన తర్వాత అగర్వాల్(26; 15 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. ఎన్గిడి బౌలింగ్లో అగర్వాల్ బౌల్డ్ అయ్యాడు. కాసేపటికి రాహుల్(29; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా పెవిలియన్ చేరాడు. ఎన్గిడి బౌలింగ్లోనే రాహుల్ క్లీన్బౌల్డ్గా నిష్క్రమించాడు. ఇక క్రిస్ గేల్(12), పూరన్(2), మన్దీప్ సింగ్(14), నీషమ్(2)లు నిరాశపరచడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. కానీ దీపక్ హుడా(62 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) బ్యాట్ ఝుళిపించడంతో కింగ్స్ పంజాబ్ తేరుకుంది. సీఎస్కే బౌలర్లలో ఎన్గిడి మూడు వికెట్లు సాధించగా, తాహీర్, శార్దూల్ ఠాకూర్, జడేజాలు తలో వికెట్ సాధించారు. దీపక్ హుడా మెరుపులు.. పంజాబ్ టాపార్డర్ నుంచి పెద్దగా మెరుపులు లేని సమయంలో హుడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్లో నిలదొక్కుకోవడమే కాకుండా షాట్ల ఎంపికలో నియంత్రణ పాటించాడు. ఏ గ్యాప్ల్లోకి ఆడితే పరుగులు సాధించవచ్చో చూసుకుంటూ షాట్లు ఆడాడు. పంజాబ్ శిబిరంలో ఆందోళన నెలకొన్న సమయంలో హుడా తన ఇన్నింగ్స్తో మెరిపించాడు. ఈ క్రమంలోనే 26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఐపీఎల్లో హుడాకు రెండో హాఫ్ సెంచరీ. కాగా, ఈ మ్యాచ్లో సాధించిన 62 పరుగులే అతని అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. ఇది పోరాడే స్కోరు కాబట్టి కింగ్స్ పంజాబ్ బౌలర్లు ఎంతవరకూ రాణిస్తారో చూడాలి. -
అర్జున అవార్డుకు ఇషాంత్ నామినేట్
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. అతడితో పాటు ఆర్చర్ అతాను దాస్, హాకీ క్రీడాకారిణి దీపికా ఠాకూర్, క్రికెటర్ దీపక్ హుడా, టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరన్ సహా 29 మంది అథెట్ల పేర్లను ఈ పురస్కారానికి నామినేట్ చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా 31 ఏళ్ల ఇషాంత్ శర్మ 97 టెస్టులు, 80 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు తీశాడు. (ఖేల్ రత్న అవార్డుకు రోహిత్ శర్మ నామినేట్) ఇక రియో ఒలంపిక్స్లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్, వరల్డ్ చాంఫియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను పేర్లను కూడా ఈ అవార్డుకు పరిశీలించగా చివరి నిమిషంలో పక్కకు పెట్టినట్లు సమాచారం. రియో ఒలంపిక్స్లో కాంస్యంతో మెరిసిన సాక్షి 2016లో క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్రత్న పొందగా.. మీరాబాయి 2018లో ఈ అవార్డు అందుకున్నారు. ఈ కారణంతో వారి పేర్లను క్రీడా మంత్రి కిరణ్ రిజిజు పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాభినందనలు టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ పేరును క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్గాంధీ ఖేల్ రత్న అవార్డుకు క్రీడా మంత్రిత్వశాఖ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. హిట్మ్యాన్తో పాటు రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ సంచలనం మనిక బాత్రా, రియో పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు పేర్లను ప్రతిష్టాత్మక పురస్కారానికి సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రోహిత్ శర్మ, వినేశ్ ఫొగట్, మనిక బాత్రా, మరియప్పన్ తంగవేలుకు శుభాభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయం ట్వీట్ చేసింది. -
భారత్ శుభారంభం
కొలంబో: ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. పూల్ ‘ఎ’లో భాగంగా అఫ్గానిస్తాన్తో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్లో జయంత్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 281 పరుగులు చేసింది. దీపక్ హుడా (103 బంతుల్లో 105; 12 ఫోర్లు, సిక్స్) సెంచరీ చేయగా... జయంత్ యాదవ్ (31; 3 ఫోర్లు), అతీత్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, సిక్స్) రాణించారు. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. కరీమ్ జనత్ (58; 5 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీ చేసినా మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. భారత బౌలర్లలో మయాంక్ మార్కండే, జయంత్ యాదవ్ మూడేసి వికెట్లు తీయగా... అంకిత్ రాజ్పుత్కు రెండు వికెట్లు లభించాయి. ఇదే పూల్లోని మరో మ్యాచ్లో శ్రీలంక 109 పరుగుల తేడాతో ఒమన్పై గెలిచింది. శనివారం జరిగే మ్యాచ్ల్లో అఫ్గానిస్తాన్తో శ్రీలంక; ఒమన్తో భారత్ తలపడతాయి. -
పొట్టి క్రికెట్లో కొత్త ముఖాలు...
కోహ్లికి విశ్రాంతి నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యం వహించనున్న టి20 సిరీస్కు మూడు కొత్త ముఖాలకు చోటు దక్కింది. కేరళ ఫాస్ట్ బౌలర్, యార్కర్ల స్పెషలిస్ట్ బాసిల్ థంపి, తమిళనాడు ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ 18 ఏళ్ల వాషింగ్టన్ సుందర్తో పాటు హరియాణాలో జన్మించి రంజీల్లో బరోడాకు ఆడుతున్న దీపక్ హుడా లంకతో సిరీస్కు ఎంపికయ్యారు. గతేడాది చివరి టి20 ఆడిన జయదేవ్ ఉనాద్కట్కు మరోసారి పిలుపురాగా... హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ చోటు నిలబెట్టుకున్నాడు. తొలి టి20 డిసెంబర్ 20న కటక్లో జరగనుంది. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, ధోని, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా, సిరాజ్, బాసిల్ థంపి, జయదేవ్ ఉనాద్కట్. దక్షిణాఫ్రికా సిరీస్కు వెళ్లిన గత జట్లతో పోలిస్తే ఇది సమతూకమైన జట్టు. ఫామ్ ఆధారంగానే ఆటగాళ్ల ఎంపిక జరిగింది. ఏడాదిన్నరగా రంజీలు, వన్డేలు, టి20ల్లో బుమ్రా అద్భుతంగా రాణించాడు. అతడిది ఏకగ్రీవ ఎంపిక. అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్లపై పేస్ విభాగంలో అతడు వైవిధ్యాన్ని తీసుకొస్తాడు. కుల్దీప్ మంచి బౌలరే. అశ్విన్, జడేజా ఉండటంతో అవకాశం దక్కలేదు. సుదీర్ఘ పర్యటన కారణంగా పార్థివ్ను రెండో కీపర్గా తీసుకున్నాం. టి20 జట్టు విషయానికొస్తే... శ్రేయస్ అయ్యర్, థంపి రంజీలతో పాటు దక్షిణాఫ్రికాలో భారత ‘ఎ’ పర్యటన, ఐపీఎల్లో మంచి ప్రదర్శన కనబర్చారు. థంపి పొట్టి క్రికెట్కు మరింత మెరుగైన ఆటగాడు. – ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలక్టర్ -
హుడా... దడదడ!
చివరి బంతికి రాజస్థాన్ గెలుపు 3 వికెట్లతో ఓడిన ఢిల్లీ డుమిని, తాహిర్ శ్రమ వృథా న్యూఢిల్లీ: రాజస్తాన్ లక్ష్యం 185 పరుగులు... అజింక్య రహానే (39 బంతుల్లో 47; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), దీపక్ హుడా (25 బంతుల్లో 54; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్తో ఓ దశలో 18 ఓవర్లలో 166/5... ఇక గెలవాలంటే 12 బంతుల్లో 19 పరుగులు చేయాలి. ఓ ఎండ్లో ఫాల్క్నర్ (11 బంతుల్లో 17; 2 ఫోర్లు)... మరో ఎండ్లో హుడా...ఇక రాజస్తాన్ గెలుపు ఖాయమే అనుకుంటున్న దశలో... తాహిర్ 19వ ఓవర్ తొలి బంతి వేశాడు... హుడా బలంగా గాల్లోకి లేపాడు..లాంగాన్లో మ్యాథ్యూస్ చూడచక్కని క్యాచ్ అందుకున్నాడు. రాజస్తాన్ శిబిరంలో కాస్త ఆందోళన.. అయినా ఏదో ఓ మూలన ఫాల్క్నర్ ఉన్నాడన్నా భరోసా.. తర్వాతి రెండు బంతుల్లో ఓ దాన్ని సిక్సర్గా మలిచిన మోరిస్ (6 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) మరో సింగిల్ తీసి ఫాల్క్నర్కు స్ట్రయికింగ్ ఇచ్చాడు. కానీ ఐదో బంతికి ఫాల్క్నర్ క్లీన్బౌల్డ్. అంతే ఒక్కసారిగా మ్యాచ్ ఢిల్లీ వైపు మొగ్గింది. ఇక చివరి 6 బంతుల్లో 12 పరుగులు చేయాలి. మోరిస్తో పాటు సౌతీ (4 బంతుల్లో 7 నాటౌట్; 1 ఫోర్) క్రీజులో ఉన్నాడు. మ్యాథ్యూస్ ఐదు బంతులకు 9 పరుగులు ఇచ్చాడు. ఇక విజయసమీకరణం.. ఒక బంతి... మూడు పరుగులు... డుమిని ఫీల్డింగ్ను సెట్ చేశాడు... మ్యాథ్యూస్ ఫుల్ లెంగ్త్ వేశాడు... సౌతీ కవర్స్లోకి బలంగా బాదాడు. బంతి బౌండరీ దాటింది. రాజస్తాన్ విజయాల సంఖ్య రెట్టింపైంది.. కానీ ఢిల్లీ సుడి మాత్రం మారలేదు. ఐపీఎల్-8లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో స్టీవెన్ స్మిత్ సేన 3 వికెట్ల తేడాతో డుమిని బృందంపై గెలిచింది. టాస్ గెలిచి రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.... బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఆరంభంలో రాజస్తాన్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (21 బంతుల్లో 37; 6 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయాస్ అయ్యర్ (30 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) నిలకడగా ఆడుతూ తొలి వికెట్కు 45 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్ డుమిని (38 బంతుల్లో 44 నాటౌట్; 3 సిక్సర్లు) వేగంగా ఆడుతూ మూడు కీలక భాగస్వామ్యాలు జోడించాడు. అయ్యర్తో కలిసి రెండో వికెట్కు 48; యువరాజ్ (17 బంతుల్లో 27; 2 సిక్సర్లు)తో కలిసి మూడో వికెట్కు 45; మ్యాథ్యూస్ (14 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి నాలుగో వికెట్కు అజేయంగా 46 పరుగులు జోడించాడు. తర్వాత రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసి నెగ్గింది. శామ్సన్ (11), స్మిత్ (10), నాయర్ (20), బిన్నీ (1) విఫలం కావడంతో రాజస్తాన్ 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో దీపక్ హుడా కీలక ఇన్నింగ్స్తో చెలరేగాడు. ఢిల్లీ బౌలర్లను దడదడలాడిస్తూ రహానేతో కలిసి ఐదో వికెట్కు 52; ఫాల్క్నర్తో కలిసి ఆరో వికెట్కు 36 పరుగులు జోడించాడు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ త్రయం అవుటైనా.. చివర్లో మోరిస్, సౌతీ మెరుగ్గా ఆడి విజయాన్ని ఖాయం చేశారు. హుడాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్డెవిల్స్ ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (సి అండ్ బి) తాంబే 37; శ్రేయాస్ అయ్యర్ (సి) సౌతీ (బి) మోరిస్ 40; డుమిని నాటౌట్ 44; యువరాజ్ (సి) నాయర్ (బి) మోరిస్ 27; మ్యాథ్యూస్ నాటౌట్ 27; ఎక్స్ట్రాలు 9; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1-45; 2-93; 3-138. బౌలింగ్: సౌతీ 4-0-36-0; మోరిస్ 4-0-35-2; ధావల్ 1-0-18-0; తాంబే 3-0-18-1; హూడా 4-0-20-0; ఫాల్క్నర్ 4-0-55-0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (బి) తాహిర్ 47; శామ్సన్ (సి) యువరాజ్ (బి) మ్యాథ్యూస్ 11; స్మిత్ (సి) మయాంక్ (బి) మిశ్రా 10; కరుణ్ నాయర్(స్టం) జాదవ్ (బి) మిశ్రా 20; బిన్నీ ఎల్బీడబ్ల్యూ (బి) తాహిర్ 1; దీపక్ హుడా (సి) మ్యాథ్యూస్ (బి) తాహిర్ 54; ఫాల్క్నర్ (బి) తాహిర్ 17; మోరిస్ నాటౌట్ 13; సౌతీ నాటౌట్ 7; ఎక్స్ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1-37; 2-50; 3-74; 4-78; 5-130; 6-166; 7-173. బౌలింగ్: ఉనాద్కట్ 3-0-30-0; కోల్టర్ 4-0-42-0; మ్యాథ్యూస్ 4-0-42-1; మిశ్రా 4-0-32-2; తాహిర్ 4-0-28-4; యువరాజ్ 1-0-11-0.