dgp office
-
‘ఈ పోలీసుల టార్చర్కి చావాలనిపిస్తోంది’
నిజామాబాద్, సాక్షి: భీమ్గల్ పట్టణ పోలీసుల తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సీఐ, ఎస్సైలు తమను వేధిస్తున్నారంటూ పలువురు వాపోతున్నారు. వరుస ఫిర్యాదులతో విషయం డీజీపీ కార్యాలయం, మానవ హక్కుల సంఘం దాకా చేరుకుంది. ఎస్సై మహేష్ ,సీఐ నవీన్ లు వేధిస్తున్నారంటూ బాధితులు కొందరు రొడ్డెక్కుతున్నారు. చెంగల్(Chengal)కు చెందిన నిఖిష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. వాళ్ల వేధింపులు తాళలేకపోతున్నానని, ఆత్మహత్య చేసుకుంటానని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడతను. ఇక.. విరిగిన కాళ్లతో సత్య గంగయ్య అనే వ్యక్తి పీఎస్(Police Station) దగ్గర నిరసనకు దిగాడు. తనను చావు దెబ్బలు కొట్టారని, అందుకు ఎస్సై, సీఐలే కారణమని ఆరోపించాడతను. భీమ్గల్(Bheemgal) పోలీసుల వ్యవహారం డీజీపీ ఆఫీస్తో పాటు హెచ్ఆర్సీ కూడా చేరుకుంది. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగినట్లు సమాచారం. -
నల్గొండ ఇంటలిజెన్స్ ఎస్పీ కవితపై వేటు
నల్గొండ, సాక్షి: జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. ఆమెను డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అక్రమాలు, వసూళ్ల ఆరోపణల మీద ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సొంత సిబ్బందిని సైతం వదలకుండా ఆమె భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఆమె అవినీతి(Corruption)పై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఆ అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగ్ల కోసం లంచం వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం చేయించినట్లు లేఖలో తెలిపారు. దీని ఆధారంగా అధికారులు విచారణ చేపట్టగా.. గంజి కవిత బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారిగా గంజి కవిత(Ganji Kavitha) ఏడేళ్లు పని చేశారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్, గుట్కా మాఫియాల నుంచి భారీగా ఆమె వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సొంత సిబ్బందిని ఆమె వదల్లేదని తేలింది. ఎస్సైతో పాటు నలుగురు కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిచిపించినట్లు సమాచారం. దీంతో ఆమె షాడో టీంపైనా విచారణ కొనసాగుతోంది. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. -
నా భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత
సాక్షి అమరావతి: తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డి భార్య కళ్యాణి హెచ్చరించారు. ఆమె శనివారం తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు తన భర్తని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయని, ఇంతవరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడంలేదని ఆమె చెప్పారు. శనివారం ఉదయం టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.. ప్రభుత్వం తన భర్తకి హాని తలపెట్టే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఆయన్ని అంతమొందించాలని పోలీసులు కుట్ర చేస్తున్నారని అనుమానంగా ఉందని చెప్పారు.ఆయన్ని పోలీసులు మీడియా ముందు హాజరు పర్చకపోతే డీజీపీ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఐ–టీడీపీ, విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు పినపాల ఉదయ భూషణ్, చంద్ర కిరణ్లతో రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి, దాని ద్వారా షర్మిల, నర్రెడ్డి సునీత, వైఎస్ విజయమ్మలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలిపారు. దీనిపై రవీందర్రెడ్డి కడప ఎస్పీకి అప్పట్లోనే ఫిర్యాదు చేయగా, ఎస్పీ వారిని అరెస్టు చేసి మీడియాకు అసలు విషయాలు వివరించారని తెలిపారు.తన భర్త నిర్దోషి అని నాటి ఎస్పీ ప్రకటనతోనే స్పష్టమైందన్నారు. తన భర్త ఎవరి మీద పోస్టులు పెట్టలేదని, అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్లు షర్మిల మాట్లాడటం సరికాదని అన్నారు. పులివెందుల వాసి అయినంత మాత్రాన వైఎస్ భారతి మేడానికి పీఏ అవుతారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీపై కక్ష ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి గానీ, తన భర్తని పావుగా వాడుకోవడం సరికాదన్నారు. టీడీపీ నేతలకూ ఆడపిల్లలు, వారికి కూడా భర్తలు ఉన్నారు కదా? వారికి ఏమైనా జరిగితే తట్టుకుంటారా అని నిలదీశారు. తాను కూడా ఒక మహిళనే అన్న విషయం గుర్తించాలంటూ కళ్యాణి కన్నీటి పర్యంతమయ్యారు.నా తమ్ముడి ఆచూకీ తెలపాలి: వర్రా మల్లికార్జున్ రెడ్డి రవీందర్ రెడ్డిని పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు మీడియా ద్వారా చూసి కుటుంబ సభ్యులందరం తల్లడిల్లిపోతున్నామని ఆయన సోదరుడు వర్రా మల్లికార్జునరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తన సోదరుడిని కోర్టులో లేదా మీడియా ముందు హాజరు పరచాలని, లేకుంటే కుటుంబమంతా డీజీపీ ఆఫీసు ఎదుట నిరాహార దీక్ష చేస్తామన్నారు. -
డీజీపీ ఆఫీసులో బతుకమ్మ సంబరాలు (ఫోటోలు )
-
ఏపీలో నేరాలు తగ్గాయి: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
గుంటూరు, సాక్షి: ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పనిచేసిందని.. ఫలితంగానే నేరాలు తగ్గాయని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఇయర్ ఎండింగ్ ప్రెస్ మీట్ నిర్వహించి.. ఈ ఏడాది నమోదైన నేర గణాంకాల్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో నేరాల శాతం క్రమంగా తగ్గుతూ వస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హత్యలు తగ్గాయి. అలాగే దొంగతనాలు తగ్గాయి. టూ వీలర్ దొంగతనాలు తగ్గాయి. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్యాంగులను పట్టుకున్నాం. జిల్లా ఎస్పీ నుండి కానిస్టేబుల్, హోమ్ గార్డుల వరకూ తమ కర్తవ్యాన్ని సమర్థవతంగా నిర్వర్తించారు అని కిందిస్థాయి ఉద్యోగుల్ని అభినందించారాయన. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాం. బ్లాక్ స్పాట్స్ గుర్తించి నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలపై ప్రమాదాలు తగ్గేలా చేశాం. 7.83 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి అని అన్నారాయన. మహిళలపై తీవ్ర నేరాలను భారీగా తగ్గించాం. మహిళలపై 168 మేజర్ కేసులను నేరుగా జిల్లా ఎస్పీలకు కేటాయించి పరిష్కరించాం. రేప్, పోక్సో, డౌరీ డెత్, మహిళా హత్యలపై జరిగిన నేరాలకు జీవిత ఖైదు శిక్షలు పడ్డ కేసులు 57.. 20ఏళ్లు శిక్ష పడిన కేసులు 49.. పదేళ్లు శిక్ష పడిన కేసులు 41.. ఏడేళ్లు శిక్ష పడినవి 15 కేసులు ఉన్నాయి. అలాగే.. వరకట్నం, పొక్సో కేసులు భారీగా తగ్గాయి. ఎస్సీ, ఎస్టీ కేసులు 15.2 శాతం తగ్గాయి లోక్ అదాలత్ లో 4,01,748 పెట్టీ కేసులు పరిష్కారం అయ్యాయి సైబర్ నేరాలు గణనీయంగా 25శాతం తగ్గాయి సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయడం మంచి ఫలితాలనిచ్చింది ఎక్కువ సైబర్ నేరాలకు పాల్పడిన వారు రాజీకి వచ్చి క్షమాపణలు చెప్తున్నారు బ్యాంకుల సమన్వయంతో సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేస్తున్నాం యంగ్ ఆఫీసర్లకు సైబర్ నేరాల అరికట్టేందుకు అవసరమైన ట్రైనింగ్ ఇస్తున్నాం రౌడీ షీటర్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం మొత్తం 4 వేలమందిలో 1000 మంది జైల్లో ఉన్నారు ఈ ఏడాదిలోనే 900 మంది రౌడీషీటర్లు కన్విక్ట్ అయ్యారు 200 మందిపై పీడీ యాక్ట్ లు నమోదు చేశాం 10వేల ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం గంజాయి సాగు చేసేవారికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం 2లక్షల 52వేల ఎకరాలను ట్రైబల్స్ కు అందించింది గంజాయి పెడలర్స్, స్మగ్లర్, కన్జ్యుమర్స్ ఎవరినీ వదిలి పెట్టట్లేదు ఈ మూడేళ్లలో 5లక్షల కేజీల సీజ్డ్ గంజాయిని ధ్వంసం చేశాం ఏపీలో మావోయిస్టుల కదలికలు కూడా తగ్గాయి క్రైమ్ గణాంకాలతో పాటు పోలీసుశాఖలో తీసుకున్న సంస్కరణలు, పోలీసు సంక్షేమం వంటి అంశాలపైనా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. -
తమిళనాడు డీజీపీ ఆఫీస్కు ‘బాంబు’ బెదిరింపు
సాక్షి, చెన్నై: చెన్నై డీజీపీ కార్యాలయానికి బుధవారం రాత్రి వచి్చన ఒక ఈ మెయిల్ పోలీసులను పరుగులు తీయిస్తోంది. చెన్నైలో 30 చోట్ల బాంబులు పెట్టామని, సాహసం చేసి కని పెట్టండి అని వచ్చిన ఆ బెదిరింపు మెయిల్తో పోలీసులు సోదాలను ముమ్మరం చేశారు. కొత్త సంవత్సరం వేడుకల సమయం ఆసన్నం అవుతోండటంతో చెన్నై నగరంలో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసే విధంగా కమిషనర్ సందీప్రాయ్ రాథోర్ ఆదేశాలు ఇచ్చారు. 400 చోట్ల సోదాలు జరిపే విధంగా , 15 వేల మంది సిబ్బంది విధుల్లో ఉండే రీతిలో చర్యలు చేపట్టారు. ఈ పరిస్థితులలో బుధవారం రాత్రి డీజీపీ కార్యాలయానికి ఓ ఈ మెయిల్ వచి్చంది. చెన్నైలో 30 చోట్ల బాంబులు పెట్టినట్టు, బెసెంట్ నగర్, ఎలియట్స్ బీచ్లలో బాంబులు పెట్టి్టనట్లు ఆ మెయిల్లో పేర్కొన్నారు. దీంతో బాంబ్, డాగ్ స్క్వాడ్ ఆయా ప్రాంతాల్లో క్షుణ్ణంగా గాలిస్తున్నాయి. నగరంలో తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్టుగా గతంలో వెలుగు చూసిన ›ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసి సోదాలు ముమ్మరం చేశారు. -
Bathukamma Celebrations: డీజీపీ కార్యాలయం లో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ అభ్యర్థుల డీజీపీ కార్యాలయ ముట్టడి యత్నంతో శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభ్యర్థులు ఒక్కసారిగా దూసుకురాగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శాంతియుత నిరసన తెలుపుతామంటూ బయల్దేరి.. అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి ఒక్కసారిగా పరుగులు తీశారు అభ్యర్థులు. దీంతో వాళ్లను అడ్డుకుని స్టేషన్కు తరలించారు పోలీసులు. జీవో నెంబర్ 46 నుంచి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జీవో నెంబర్ 46తో హైదరాబాద్కు 53 శాతం రిజర్వేషన్.. మిగతా ప్రాంతాలకు 47 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. తద్వారా ఇతర జిల్లాల వాళ్లకు మార్కులు ఎక్కువ ఎంపిక కాకపోవచ్చు. పైగా ఈ జీవో వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నా.. ప్రయోజనం లేకుండా పోతోందని చెబుతున్నారు. -
లంచం ఇవ్వలేను... కనికరించండి!
దుగ్గొండి/ఖైరతాబాద్: తనకు రావాల్సిన ఆస్తి విషయమై న్యాయం చేయాల ని కోరుతూ ఓ రైతు వినూత్నంగా నిరసన బాటపట్టాడు. లంచాలు ఇవ్వక పోవడంతో తనకెవరూ న్యాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మొర వినిపించేందుకు నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా డీజీపీ కార్యాలయానికి వెళ్లాడు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్కి చెందిన గట్ల సురేందర్ అన్నదమ్ముల మధ్య కొన్నేళ్లుగా ఆస్తి గొడవలు ఉన్నాయి. ఊరి పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. అయితే పెద్ద మనుషులు లంచాలు తీసుకుని ఫోర్జరీ పత్రాలు సృష్టించి తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ మేరకు రాసి ఉన్న ఫ్లెక్సీని నాగలికి కట్టాడు. ఆ నాగలిని ఎత్తుకుని హైదరాబాద్ ఇందిరాపార్కు నుంచి డీజీపీ కార్యాలయం వరకు నడుచుకుంటూ బయలుదేరాడు. డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జిల్లా కార్యాలయాల్లో మూడేళ్లుగా తన సమస్య పరిష్కారం కాకపోవడంతో హైదరాబాద్ వచ్చానని సురేందర్ అన్నారు. -
డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్
-
Disha App: ప్రాణాలు కాపాడిన ‘దిశ’
అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్): దిశ యాప్ ఒక మహిళ ప్రాణాలు కాపాడింది. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ చివరిక్షణంలో దిశకు సమాచారం అందించటంతో పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఏడాది వయసున్న ఆమె కుమార్తెను సంరక్షించారు. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. సేకరించిన, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన జ్ఞానప్రసన్న (31) కృష్ణలంకలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తోంది. కొన్నేళ్ల కిందట భర్తతో విభేదాలు రావడంతో ఒంటరిగా జీవిస్తోంది. చదవండి: కృష్ణా జలాల వివాదం తెలుగు రాష్ట్రాలకే పరిమితం ఈ నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకుల్లో రికవరీ ఏజెంట్గా పనిచేసే సింగ్నగర్ లూనా సెంటర్కు చెందిన షేక్ అఖిల్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. అఖిల్కు అతడి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలిసిన ప్రసన్న లూనాసెంటర్లోని అతడి ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. అఖిల్, అతడి కుటుంబసభ్యులు ఆమెను తిట్టి, కొట్టి అక్కడి నుంచి పంపేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె బుధవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తాను మోసపోయానని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చివరి క్షణంలో దిశ యాప్కు సందేశం పంపింది. చికిత్స పొందుతున్న జ్ఞాన ప్రసన్న క్షణాల్లో స్పందించిన పోలీసులు ప్రసన్న ఫోన్ నుంచి వచ్చిన సందేశంతో డీజీపీ కార్యాలయంలో దిశ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆమె ఫోన్ సిగ్నల్ ద్వారా న్యూరాజరాజేశ్వరీపేటలో ఉన్నట్లు గుర్తించి సమీపంలోని అజిత్సింగ్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడే విధుల్లో ఉన్న ఏఎస్ఐ హేమచంద్, కానిస్టేబుల్ ప్రకాష్, హోంగార్డ్ చంద్రశేఖర్ 10 నిమిషాల్లోనే ప్రసన్న ఇంటికి చేరుకున్నారు. చదవండి: రూ.789 కోట్లతో 48 లక్షలమంది పిల్లలకు ‘కానుక’ అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఏడాది వయసున్న ఆమె కుమార్తెను కూడా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రసన్న ప్రాణాపాయస్థితి నుంచి బయటపడింది. ఆమె కుమార్తెను వైద్యసిబ్బంది సంరక్షిస్తున్నారు. ప్రసన్న ఇంకా మాట్లాడే స్థితికి రాకపోవడంతో పోలీసులకు పూర్తి వివరాలు తెలియలేదు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఉన్న ప్రసన్న తల్లిదండ్రులకు, బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. దిశ అధికారులు, పోలీసులకు ప్రశంసలు కేవలం ఓ సందేశం ద్వారా నిమిషాల వ్యవధిలో మహిళ ఇంటికి చేరుకుని మృత్యువాత పడకుండా ఆమెను కాపాడిన దిశ కార్యాలయం అధికారులు, అజిత్సింగ్నగర్ పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు, ప్రజలు ప్రశంసిస్తున్నారు. -
4 జిల్లాలకు పోలీసు బాస్లు లేరు..
సాక్షి, హైదరాబాద్: పలు జిల్లాలకు, కమిషనరేట్లకు పూర్తిస్థాయి పోలీసు బాస్లు లేరు. కొందరికి పదోన్నతులు లభించినా పాతస్థానాల్లో కొనసాగుతున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారులకు భారీ స్థాయిలో స్థానచలనాలు జరగపోవడం గమనార్హం. ఐదేళ్ల క్రితం ఒకేసారి ఏర్పడిన రామగుండం, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్ధిపేట పోలీసు కమిషనరేట్లలో ఖమ్మం, సిద్ధిపేటలకు కమిషనర్లు మారినా రామగుండం సీపీ సత్యనారాయణ, నిజామాబాద్లో కార్తికేయ కమిషనర్లుగా అక్కడే ఉన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తాజాగా కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డిని డీజీపీ కార్యాలయానికి ప్రభుత్వం అటాచ్ చేసింది. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లా లకు పూర్తిస్థాయి ఎస్పీలను నియ మించలేదు. నల్ల గొండ ఎస్పీగా ఉంటూ డీఐజీగా ప్రమోషన్ పొం దిన రంగనాథ్ కూడా 2018 నుంచి అక్కడే ఎస్పీగా కొనసాగుతున్నారు. 2019 ఏప్రిల్లో 23 మంది ఐపీఎస్ అధికారులకు పదో న్నతులు ఇచ్చినా పాత స్థానాల్లోనే 90 శాతం మంది కొనసాగుతున్నారు. వీరికి అదనపు బాధ్యతలు.. ఏడీజీ వీవీ శ్రీనివాసరావు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పదవితోపాటు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సంజయ్జైన్– ఏడీజీ (పీ అండ్ ఎల్), పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ బాధ్యతలు చూస్తున్నారు. ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు విజిలెన్స్ బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఎస్పీ రమణకుమార్ బదిలీతో ఏసీబీలో జాయింట్ డైరెక్టర్ పోస్టు ఖాళీ అయింది. త్వరలో ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు రిటైర్ కానున్నారు. దీంతో ఏసీబీలో కీలకమైన రెండు పోస్టులు ఖాళీ అవనున్నాయి. ఎస్పీలుగా పదోన్నతులుగా లభించినా... మార్చి ఆఖరివారంలో ప్రభుత్వం 32 మంది అడిషనల్ ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించింది. ఇందులో మెజారిటీ అధికారులకు పోస్టింగులు లేక ఖాళీగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం పదవీవిరమణ వయసును 58 నుంచి 61కి పెంచడంతో వీరికి పోస్టింగులు ఇవ్వడం సవాలుగా మారిందని సమాచారం. ఇన్చార్జీలతోనే... కీలకమైన నాలుగు జిల్లాలకు పూర్తిస్థాయి ఎస్పీలు లేరు. నిర్మల్ జిల్లాకు అడిషనల్ ఎస్పీ ప్రవీణ్కుమార్, ఆదిలాబాద్కు అడిషనల్ ఎస్పీ రాజేశ్ చంద్ర ఇన్చార్జి ఎస్పీలుగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన ఆసిఫాబాద్, ములుగు జిల్లాలకు కూడా పోలీసుబాసులు లేరు. ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు రామగుండం సీపీకి, ములుగు జిల్లా బాధ్యతలను జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్కి అప్పగించారు. ప్రభుత్వం గత ఏప్రిల్లో ఖమ్మం సీపీగా విష్ణువారియర్ను నియమించగా, ఖమ్మం సీపీగా ఉన్న ఇక్బాల్ బదిలీ మీద ఆదిలాబాద్కు వెళ్లాల్సి ఉండగా, తన స్థాయి కంటే తక్కువ పోస్టులో విధులు నిర్వహించడం ఇష్టంలేక మిన్నకుండిపోయారని సమాచారం. -
నిబంధనలు అనుసరించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లేవారు ఆయా రాష్ట్రాల్లో ఈ పాస్ నిబంధనల్ని ముందుగానే గమనించి ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని ఏపీ డీజీపీ కార్యాలయం సూచించింది. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాలకు ప్రయాణిస్తున్న వారు సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద అవస్థలు పడుతున్న దృష్ట్యా డీజీపీ కార్యాలయం సోమవారం సూచనలు జారీ చేసింది. ఏపీకి రావాలంటే.. ఏపీలో ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రాష్ట్రానికి రావాలనుకొనే వారు ఉదయం 6 నుంచి 12 గంటల మధ్యనే ప్రయాణించేలా.. ఆ లోపే గమ్యానికి చేరుకునేలా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. అటువంటి వారికి పాస్లు అవసరం లేదు. మిగతా సమయంలో ప్రయాణిస్తే ఈ–పాస్ కచ్చితంగా తీసుకోవాలి. ప్రభుత్వం పేర్కొన్న అత్యవసర సేవలు, అంబులెన్స్ తదితర సేవలు, సంబంధిత సిబ్బందికి ఈ–పాస్ అవసరం లేదు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు అంబులెన్స్లో ప్రయాణించే పేషెంట్లతో ఉండే సహాయకులకు అనుక్షణం సహాయ, సహకారాలను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సామాజిక మాధ్యమాలు (ట్విట్టర్, ఫేస్బుక్) ద్వారా నిరంతరం అందుబాటులో ఉంటుంది. శుభకార్యాలు, అంత్యక్రియలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలకు లోబడి సంబంధిత స్థానిక అధికారుల వద్ద సరైన గుర్తింపు పత్రాలతో అనుమతి పొందాలి. ప్రతి ఒక్కరూ అత్యవసర సమయాల్లో తప్ప మిగతా సమయంలో ఇంటిపట్టున ఉంటూ స్వీయ రక్షణ పొందాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. ఏపీలో ప్రయాణించాలంటే.. ఏపీ పరిధిలో ఉదయం 6 గంటల నుండి 12 గంటల మధ్యే ప్రయాణించేలా.. ఆలోపే గమ్యాన్ని చేరుకునేలా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోగలిగితే ఎలాంటి పాస్లు అవసరం లేదు. మిగతా సమయాల్లో ప్రయాణిస్తే మాత్రం ఈ–పాస్ కచ్చితంగా తీసుకోవాలి. అటువంటి వారు తగిన ధ్రువీకరణ పత్రాలతో ఈ–పాస్కు దరఖాస్తు చేసి అనుమతి పొందాలి. ఏపీలో కర్ఫ్యూ సమయంలో ప్రయాణానికి సిటిజన్ సర్వీస్ పోర్టల్ (http://appolice. gov.in), ట్విట్టర్ (@ APPOLICE100), ఫేస్ బుక్ (@ ANDHRAPRADESHSTATEPOLICE) ద్వారా ఈ–పాస్ పొందవచ్చు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే.. ► తెలంగాణ వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి. అక్కడ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూ ఉండదు. మిగతా సమయాల్లో కర్ఫ్యూ ఉంటుంది. కానీ తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించాలంటే.. కర్ఫ్యూ ఉన్నా లేకపోయినా ఈ పాస్ తప్పనిసరి. https://policeportal. tspolice.gov.in/ ద్వారా తెలంగాణ ఈ–పాస్ పొందిన తర్వాతే ప్రయాణించాల్సి ఉంటుంది. ► తమిళనాడులో పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమల్లో ఉంది. తమిళనాడు భూ భాగంలోకి ప్రవేశించాలంటే ఈ–పాస్ తప్పనిసరి. https:// eregister.tnega.org/ ద్వారా తమిళనాడు ఈ–పాస్ పొందవచ్చు. ► ఒడిశాలో పూర్థిస్థాయిలో కర్ఫ్యూ అమల్లో ఉంది. ఆ రాష్ట్రంలోకి ప్రవేశించాలన్నా ఈ–పాస్ తప్పనిసరి. https://covid19regd. odisha.gov.in/ లింక్ ద్వారా ఈ–పాస్ పొందవచ్చు. ► కర్ణాటకలోనూ పూర్తిస్థాయిలో కర్ఫ్యూ అమలులో ఉంది. కర్ణాటక భూభాగంలోకి ప్రవేశించాలంటే ఈ పాస్ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లింక్ ద్వారా కర్ణాటకలోకి వెళ్లేవారు ఈ–పాస్ పొందవచ్చు. కర్ణాటక ప్రభుత్వం అవసరాన్ని బట్టే వారి భూ భాగంలోకి ప్రవేశానికి అనుమతి ఇస్తుంది. -
పోలీసులను టార్గెట్ చేయొద్దు: డీఐజీ
సాక్షి, మంగళగిరి: ఆలయాల్లో దాడులంటూ సోషల్ మీడియాలో సాగిన దుష్ప్రచారాలపై నిజాలు తెలియజేశామని డీఐజీ పాల్రాజు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులకు నిబద్ధత ఉండదని.. సామాజిక మధ్యమాల్లో దుష్ప్రచారంపై విచారణ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయాలు ఆపదలో ఉన్నాయని దుష్ప్రచారం జరుగుతోందన్నారు. ‘‘2020- 2021లో జరిగిన ఆలయాలపై దాడుల వివరాలు డీజీపీ ఇచ్చారు. 44 కేసుల్లో జరిగిన దాడుల్లో అసలేం జరిగిందో కూడా చెప్పాం. అబద్ధపు ప్రచారాలు కూడా ఎలా జరిగాయో తెలిపాం. కొన్ని కేసులలో ముద్దాయిలు రాజకీయ నేపథ్యం కూడా వెల్లడించాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో రాసిన వార్తకు ఒక నిబద్ధత ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన వార్తలకు నిబద్ధత ఉండదు. (చదవండి: స్థానిక ఎన్నికలు: సుప్రీంను ఆశ్రయించిన సర్కార్) 2014లో ఏలూరులో జరిగిన ఘటనలో ఒక వ్యక్తిని అరెస్టు చేసి, శిక్ష వేశారు. అదే ఘటనను మరల జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తమిళనాడు, కర్నాటకలో జరిగిన సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ ప్రచారం పట్ల విచారణ చేస్తున్నాం. పోలీసు వ్యవస్థను దిగజార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ప్రతి జిల్లాలో స్పెషన్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేశాం. పోలీసులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు. లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని’’ డీఐజీ పాల్రాజు హెచ్చరించారు.(చదవండి: సీఎం జగన్ను కలిసిన బీవోబీ ఈడీ) -
‘గ్యాంగ్వార్’ వీడియోలు ఇప్పటివి కావు
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లాలో గ్యాంగ్వార్ పేరిట పలు టీవీ చానళ్లలో ప్రసారమైన వీడియోల్లోని ఘటనలు గత ఏడాది నవంబర్, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగినవిగా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని డీజీపీ కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కథనాలపై స్పందించిన డీజీపీ గౌతమ్సవాంగ్ తక్షణ విచారణ జరపాలని గుంటూరు రేంజ్ డీఐజీ, నెల్లూరు జిల్లా ఎస్పీలకు ఆదేశాలిచ్చారని పేర్కొంది. ఆ ఘటనలు కేవలం మిత్రుల మధ్య జరిగిన ఘర్షణలని, అయినప్పటికీ కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారని వివరించింది. నిందితులపై రౌడీషీట్ కూడా తెరవనున్నట్టు తెలిపింది. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ పేర్కొంది. -
అంతర్వేది ఘటన.. సీబీఐ దర్యాప్తుకు నిర్ణయం
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు సవాలుగా తీసుకున్నారు. అయినా కూడా కొన్ని రాజకీయ శక్తులు, బృందాలు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రెస్ మీట్లలోను, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. (చదవండి: రథం చుట్టూ రాజకీయం!) అంతేకాక కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం జగన్ రాష్ట్ర డీజీపీని ఆదేశించడమైనది. అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర డీజీపీ కార్యాలయం హోం శాఖకు లేఖ పంపింది. ఇందుకు సంబంధించి రేపు (శుక్రవారం) జీవో వెలువడనుంది. -
శిక్షణ తేదీని ప్రకటించకుంటే చనిపోతాం!
సాక్షి, హైదరాబాద్: తమకు వెంటనే శిక్షణ తేదీని ప్రకటించాలంటూ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎన్నికైన అభ్యర్థులు చేపట్టిన డీజీపీ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ‘శిక్షణ తేదీని వెంటనే ప్రకటిం చండి. లేదా కారుణ్య మరణాలకు అనుమతించండి’ అంటూ బుధవారం చలో డీజీపీ కార్యాలయం పేరిట ముట్టడికి పిలుపునిచ్చా రు. బుధవారం ఉదయం 10 గంటలకల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 2వేల మంది కేడెట్లు లక్డీకాపూల్కు చేరుకున్నారు. ఈ క్రమంలో వచ్చిన వారిని వచ్చినట్లుగా పోలీసులు వారిని వ్యాన్లలోకి ఎక్కించారు. దీంతో తోపులాట, వాగ్వాదం చెలరేగింది. అరెస్టు చేసిన కేడెట్లందరినీ ముషీరాబాద్, గోషామహల్ తదితర ఠాణాలకు తరలించి, సాయంత్రం వదిలిపెట్టారు. కారుణ్యమరణానికి హెచ్చార్సీకి వినతి! తమ శిక్షణ తేదీని ఇంకా ప్రకటించకపోవడం తో ఆర్థికంగా, సామాజికంగా అనేక ఇబ్బం దులు పడుతున్నామని, వేతనం, సర్వీసు కోల్పోతున్నామని పలువురు అభ్యర్థులు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. తాము గతేడాది సెప్టెంబర్లోనే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యామని, తమతోపాటు సెలక్టయిన సివిల్, ఏఆర్లకు శిక్షణ కూడా పూర్తికావొచ్చిందని వాపోయా రు. శిక్షణ తేదీల కోసం ఎదురుచూసి విసిగిపోయామని, ఇక తమకు కారుణ్య మరణాని కి అనుమతివ్వాలని విన్నవించారు. ఈలోగా డీజీపీ కార్యాలయం నుంచి అభ్యర్థులకు పిలుపు వచ్చింది. నలుగురు ప్రతినిధుల బృందంతో లా అండ్ ఆర్డర్ ఏడీజీ జితేందర్ మాట్లాడారు. ప్రస్తుతమున్న బ్యాచ్ల శిక్షణ పూర్తికాగానే అక్టోబర్ చివరి లేదా నవంబర్ మొదటివారంలో శిక్షణ ప్రారంభిస్తామని చెప్పడంతో కేడెట్లు శాంతించారు. -
‘చలో డీజీపీ ఆఫీస్’కు టీఎస్ఎస్పీ అభ్యర్థుల పిలుపు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఎస్పీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు బుధవారం ‘చలో డీజీపీ ఆఫీస్’కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయానికి వచ్చిన తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ)కు సెలెక్ట్ అయిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫలితాలు విడుదలయ్యి దాదాపు 9 నెలల అవుతున్న ఇప్పటి వరకు ట్రైనింగ్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అభ్యర్థులు తెలిపారు. తమతో పాటు సెలెక్ట్ అయిన సివిల్, ఏఆర్ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి వేతనాలు ఇస్తున్నారన్నారు. కానీ టీఎస్ఎస్పీ అభ్యర్థుల ట్రైనింగ్కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని వారు వాపోయారు. శిక్షణ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక.. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇప్పటికే చాలా మంది సెలక్ట్ అయిన అభ్యర్థులు చనిపోయారని తెలపారు. డీజీపీ తక్షణమే స్పందించి ట్రైనింగ్ తేదీని ప్రకటించి అభ్యర్థులకు పూర్తి వేతనాలు ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. -
కరోనా వారియర్ సాంగ్ విడుదల
సాక్షి, హైదరాబాద్: కరోనా వారియర్స్ వీడియో సాంగ్ను డీజీపీ ఎం మహేందర్రెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. డీజీపీ కార్యాలయంలో ఈ పాట విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని నివారణకు పోలీసు శాఖ చేస్తున్న నిరంతర కృషికి స్పూర్తినిస్తూ.. ప్రముఖ దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ‘కరోనా వారియర్’ వీడియోను సాంగ్ను రూపొందించారు. (దశల వారిగా షూటింగ్స్ను అనుమతి: కేసీఆర్) నాలుగున్నర నిమిషాల నిడివి గల ఈ పాట విడుదల చేసిన సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారి అంతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, వైద్యులు, మున్సిపల్ తదితర శాఖలు చేస్తున్న కృషికి ప్రోత్సాహంగా మహిత్ నారాయణ్ వీడియో సాంగ్ను రూపొందించడం పట్ల డీజీపీ అభినందించారు. బాలాజీ రచించిన ఈ పాటను గాయకులు మనో, గీతా మాధురిలతో పాటు తమిళ గాయకుడు టిప్పు, శ్రీకృష్ణ, సాయిచరణ్, నిహాత్, ఆదర్శిని, అంజనా సౌమ్య, హరిణ, బేబీలు పాడారు. (సినిమా షూటింగ్స్కు అనుమతి ఇవ్వండి) -
అత్యవసర ప్రయాణాలకు ఏపీ సరికొత్త నిర్ణయం
సాక్షి, విజయవాడ: కరోనా లాక్డౌన్ను ప్రజలంతా పక్కాగా పాటిస్తున్నారని రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. అయితే, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని గుర్తు చేసింది. ప్రధానంగా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే కొంతమంది ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటివారికోసం కోవిడ్-19 అత్యవసర రవాణా పాసులు అందిస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. (చదవండి: గుంజీలు తీయించి, పూలదండలు వేశారు..) ప్రభుత్వ ఆదేశాల మేరకు పాసుల జారీకి అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొంది. అత్యవసర కారణాలను చూపి ప్రజలు ఈ పాసులు పొందొచ్చని వెల్లడించింది. పాసులు కావాలనుకునేవారు.. 1.పేరు, పూర్తి చిరునామా, 2.ఆధార్ కార్డు వివరాలు, 3.ప్రయాణించే వాహనం నెంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలనే పూర్తి వివరాలు సమర్పించాలి. అన్ని పత్రాలను పరిశీలించిన తరువాత సాద్యమైనంత త్వరగా సంబంధిత పోలీసు అధికారులు పాసులు జారీచేస్తారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. (చదవండి: లాక్డౌన్ అమలులో ఏపీ నెంబర్ వన్) అప్లయ్ చేయడం ఇలా.. కోవిడ్-19 ఎమర్జెన్సీ వెహికల్ పాసులు కావాలనుకునే ప్రజలు తాము నివసిస్తున్న ప్రదేశానికి సంబంధించి పైన ఇచ్చిన వివరాలతో ఆయా జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్ లేదా మెయిల్ ఐడీకి అనుమతి కోరుతూ అప్లయ్ చేయాలి. జిల్లా ఎస్పీల వాట్సాప్ నెంబర్లు, మెయిల్ ఐడీలు కింద ఇవ్వడం జరిగింది. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్/మెయిల్ ఐడీకి పంపిస్తారు. జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్/మెయిల్ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఫార్వార్డ్ చేసిన అనుమతులు (పాసులు) చెల్లవు. ప్రయాణించేటప్పుడు మీ గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని డీజీపీ కార్యాలయం వెల్లడించింది. (చదవండి: కష్టంలో ఆదుకుంటున్న కామన్మ్యాన్) -
ఇదీ కరోనా సేఫ్టీ టన్నెల్
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా పలు రకాల సూక్ష్మక్రిములను నివారించే 3వీ సేఫ్ టన్నెల్ను డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం డీజీపీ మహేందర్రెడ్డి ఈ పరికరాన్ని ప్రారంభించారు. సోడియం హై పోక్లోరేట్తోపాటు మరికొన్ని రసాయనాలను చల్లే పంపులు ఇందులో ఉంటాయి. ఈ టన్నెల్లోకి మనిషి రాగానే పంపులు వాటంతట అవే రసాయనాలను స్వల్ప మోతాదులో దేహంపై పిచికారీ చేస్తా యి. ఈ టన్నెల్లో 20 సెకన్లపాటు ఉంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావచ్చని టన్నెల్ పరికరాన్ని అభివృద్ధి చేసిన వాస్కులర్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు వివరించారు. ఆదివారం నుంచి డీజీపీ కార్యాలయంలోకి వచ్చే సందర్శకులు, కార్యాలయ సిబ్బంది అంతా ఈ టన్నెల్ నుంచే రావాల్సి ఉంటుంది. -
కరోనా : కేంద్ర బలగాలు రావట్లేదు
సాక్షి, హైదరాబాద్ : కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణకు కేంద్ర బలగాలు వస్తున్నాయన్న వార్తలను తెలంగాణ డీజీపీ కార్యాలయం కొట్టిపరేసింది. ఆ వార్తలు అవాస్తవమని తెలిపింది. తెలంగాణకు కేంద్ర బలగాలు కావాలని కోరలేదని, ఆ అవసరం కూడా లేదని స్పష్టం చేసినట్లు పేర్కొంది. కాగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా నేపథ్యంలో హైఅలర్ట్ కొనసాగుతోంది. దోమలగూడ, బౌద్ధనగర్, సికింద్రాబాద్, చందానగర్, కోకాపేట, మణికొండ ప్రాంతాల్లో ఇంటింటికి సర్వే నిర్వహిస్తున్నారు. ( ‘కరోనా’ వెబ్సైట్లు ఓపెన్ చేయొద్దండి ) ఆశావర్కర్లు, ఏఎన్ఎమ్లు అనారోగ్యంతో ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 59కి చేరింది. గడిచిన వారం రోజుల్లోనే 40 కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న విషయం. (కరోనా నియంత్రణ ఏర్పాట్లలో ముందున్నాం ) -
‘కన్నా.. వాస్తవాలు తెలుసుకోండి’
సాక్షి, అమరావతి: జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్న కన్నా లక్ష్మీనారాయణ వాస్తవాలు తెలుసుకోకుండా పోలీస్ శాఖపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు శనివారం రాత్రి డీజీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నట్టుగా పోలీస్ శాఖలో ప్రస్తుతం 80 మంది డీఎస్పీలు వెయింటింగ్లో ఉన్నారన్నది వాస్తవం కాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం 14 మంది డీఎస్పీలు మాత్రమే.. శాఖాపరమైన కారణాలతో వెయిటింగ్లో ఉన్నారని పేర్కొంది. వెయిటింగ్లో ఉన్న పోలీసు అధికారులకు పోస్టింగులివ్వండి: కన్నా సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాలా కాలంగా పోస్టింగ్ ఇవ్వక వెయిటింగ్లో కొనసాగుతున్న పోలీసు అధికారులకు వెంటనే పోస్టులను కేటాయించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. ఇతర శాఖల ఉద్యోగులతో పాటు వెయిటింగ్లో ఉంచిన పోలీసులందరికీ పోస్టింగ్లు ఇవ్వాలని లేఖలో కోరారు. -
‘షేర్’కింగ్లూ.. జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో హింస చెలరేగిన నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, వదంతులు నమ్మవద్దని డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు వెళ్లాయి. చర్యలేంటి? - సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తే.. ఐటీ యాక్ట్ సెక్షన్ 66(ఏ) ప్రకారం పోలీసులు అరెస్టు చేసే వీలుంది. - వ్యక్తుల పరువుకు భంగం వాటిల్లే పోస్టులు పెడితే.. ఐపీసీ 499 సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేయవచ్చు. - ఒక వ్యక్తిని లేదా సంస్థ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా పోస్టులు పెడితే.. పరువు నష్టం దావా వేసే వీలుంది. - అసభ్యకర పోస్టులు పెట్టి ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తే.. ఐపీసీ సెక్షన్లు 292, 292 (ఏ), 293, 294 ప్రకారం అరెస్టు అవుతారు. -
‘ఈచ్ వన్–టీచ్ వన్’లో పోలీసు భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఈచ్ వన్–టీచ్ వన్’కార్యక్రమంలో పోలీసు శాఖ ఉత్సాహంగా పాల్గొంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో కొత్త ఏడాది వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈచ్ వన్–టీచ్ వన్ కార్యక్రమంలో పోలీసు శాఖ చిత్తశుద్ధితో పాల్గొంటుందని చెప్పారు. ఒక్కొక్క పోలీసు యూనిట్ కనీసం తమ పరిధిలోని 20 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులు గా చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. తమ రక్షణ కోసం పోలీసు శాఖ ఉందనే నమ్మకాన్ని పౌరులలో కల్పించాలని చెప్పారు. పోలీసు శాఖ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతని స్తోందని తెలిపారు. 2020 సంవత్సరాన్ని మహిళా రక్షణ–రోడ్డు భద్రత సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలు, పిల్లల రక్షణతో పాటు రోడ్డు భద్రతకు ఈ ఏడాది అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీజీపీలు, ఐజీలు, సీనియర్ పోలీసు అధికారు లు, డీజీపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కానిస్టేబుల్ను అభినందించిన డీజీపీ.. పోలీసు ఉద్యోగం అంటే సామాజిక సేవ అని నిరూపించిన సిద్దిపేట పోలీస్ కానిస్టేబుల్ శ్రీశైలంను డీజీపీ అభినందించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సందర్భంగా ఒక గర్భిణికి అత్యవసరంగా ఏ–పాజిటివ్ రక్తం అవసరమైంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న శ్రీశైలం.. తన రక్తాన్ని దానం చేయడంతో ఆ మహిళకు ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న డీజీపీ.. శ్రీశైలంను అభినందించారు. -
పక్కాగా జీరో ఎఫ్ఐఆర్ అమలు
సాక్షి, హైదరాబాద్ : దిశ ఘటన నేపథ్యంలో జీరో ఎఫ్ఐఆర్ మరోసారి చర్చకు వచ్చింది. పోలీసు స్టేషన్ పరిధులతో సంబంధం లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ముందు దర్యాప్తు ప్రారంభిస్తారు. అనంతరం కేసును సంబంధిత స్టేషన్కు బదిలీ చేస్తారు. వాస్తవానికి ఇదేం కొత్త విధానం కాదు. ఇప్పటికే మనుగడలో ఉన్నదే. దిశ హత్య కేసు అనంతరం జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ మహేందర్రెడ్డి గత నెలాఖరునే మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఈ విధానాన్ని అన్ని పోలీస్స్టేషన్లలో తప్పకుండా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. ప్రత్యేకించి యువతులు, బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారంటూ వచ్చిన ఫిర్యాదులపై ఏమాత్రం ఆలస్యం చేయవద్దని అందులో పొందుపరచనున్నారు. నేడో, రేపో ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లకు ఆదేశాలు చేరనున్నాయి. ఈ ఏడాది 200పైనే.. జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని చాలా ఏళ్లుగా తెలంగాణ పోలీసులు పాటిస్తున్నారు. 2018లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధుల్లో దాదాపు 1,200 కేసులు ఈ విధానంలో నమోదయ్యాయి. అనంతరం దర్యాప్తు దశలో వాటిని ఇతర స్టేషన్లకు బదిలీ చేశారు. తాజాగా వరంగల్లోని సుబేదారిలో నమోదైన యువతి మిస్సింగ్ కేసుతో జీరో ఎఫ్ఐఆర్ల సంఖ్య ఈ ఏడాదిలో 200 దాటింది. గతంలో కేసుల బదిలీ ప్రక్రియ మాన్యువల్గా జరిగేది. కానీ తెలంగాణ పోలీసులు ఈ కేసులో మాత్రం సీసీటీఎన్ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం) ద్వారా ఆన్లైన్లో ఈ ఎఫ్ఐఆర్ను బదిలీ చేయడం గమనార్హం. మహిళలు, యువతులు అదృశ్యమైన సందర్భంలో వెంటనే స్పందిస్తారు. విషయాన్ని సంబంధిత ఎస్పీ, కమిషనర్ కార్యాలయాలకు వెంటనే సమాచారం చేరిపోతుంది. ఆ వెంటనే సీసీటీఎన్ఎస్ ద్వారా డీజీపీ కార్యాలయానికి కేసు వివరాలు చేరతాయి. ఇలాంటి కేసులను ఎస్పీ, కమిషనర్తోపాటు డీజీపీ కార్యాలయం కూడా పర్యవేక్షిస్తాయి. -
సీపీఐ ‘ఛలో డీజీపీ ఆఫీస్’.. ఇంతలో షార్ట్ సర్య్కూట్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న సీపీఐ నేత కూనంనేని సాంబశివరావును అక్రమంగా అరెస్టు చేయడం పట్ల ఆ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఇందుకు నిరసనగా మంగళవారం డీజీపీ కార్యాలయ ముట్టడికి కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఛలో డీజీపీ కార్యాలయం పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో డీజీపీ ఆఫీసు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, డీజీపీ ఛాంబర్ సమీపంలో మంగళవారం షార్ట్సర్య్కూట్ ప్రమాదం జరిగింది. దీంతో ఆఫీసుకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పునరుద్ధరణకు కార్యాలయ సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నారు. -
కటాఫ్ మార్కుల్లో వ్యత్యాసాలు..
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కానిస్టేబుల్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) మంగళవారం రాత్రి ప్రకటించింది. ఇందులో తమ కటాఫ్ మార్కుల్లో వ్యత్యాసాలు వచ్చాయని పలువురు అభ్యర్థులు బుధవారం ఉదయమే డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. టీఎస్ఎల్ పీఆర్బీ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావును కలవాలని ప్రయత్నించారు. వారి వద్ద వినతిపత్రాలు తీసుకున్న పోలీసులు తిప్పి పంపారు. దీనిపై టీఎస్ఎల్ పీఆర్బీ స్పందించింది. ఈ విషయంలో అభ్యర్థులకు అనుమానాలు అక్కర్లేదని, ఒకవేళ అభ్యంతరాలు ఉంటే బుధవారం సాయంత్రం నుంచి టీఎస్ఎల్ పీఆర్బీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చైర్మన్ శ్రీనివాసరావు సూచించారు. డిప్లొమా అభ్యర్థుల ఆవేదన..: డిప్లొమా చేసిన అభ్యర్థులను కానిస్టేబుల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు తొలుత అనుమతించలేదు. వీరంతా కోర్టును ఆశ్రయించారు. ఇంటర్ ఫెయిలైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు, డిప్లొమా ఫెయిలైన అభ్యర్థుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది. డిప్లొమా అభ్యర్థులు 6 సెమిస్టర్ల సర్టిఫికెట్లు చూపాలని స్పష్టం చేసింది. దీంతో పలువురు అభ్యర్థులు వెరిఫికేషన్కు 6 సెమిస్టర్ల సర్టిఫికెట్లు చూపలేకపోయారు. అలాంటి అభ్యర్థుల వివరాలను కటా ఫ్ మార్కుల వెల్లడిలో వారిని పరిగణనలోకి తీసుకోలేదు. వీరంతా తమకు న్యాయం చేయాలని కోరారు. -
సిటీ‘లైఫ్’.. ఇస్మార్ట్ ప్రూఫ్
సాక్షి, హైదరాబాద్: ఇస్మార్ట్ ప్రూఫ్లు.. నేరస్థులను ఇట్టే పట్టిస్తున్నాయి. మూడోకన్ను పడిందంటే మూడినట్టే. నేరాల ప్రివెన్షన్, డిటెక్షన్, కన్వెక్షన్లో సీసీ కెమెరాలతోపాటు ట్యాబ్స్, ల్యాప్టాప్స్, యాప్స్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసుశాఖకు మౌలిక వసతులతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం సమకూర్చింది. సాంకేతిక సహాయంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లోని సిబ్బందిలో జవాబుదారీతనం పెరిగింది. ఫలితంగా వీటిల్లో శిక్షలు, ముఖ్యంగా జీవితఖైదు శిక్షలు పెరిగాయి. జీవితఖైదు పడుతున్న కేసుల్లో హత్య, పోక్సోయాక్ట్, మహిళలపై నేరాలతోపాటు ఇతరాలు ఉంటున్నాయి. జీవితఖైదు శిక్షలు ఈ ఏడాది జనవరి–ఆగస్టు మధ్య రాష్ట్రవ్యాప్తంగా పడిన జీవితఖైదుల్లో 35.8 శాతం ఈ మూడు కమిషనరేట్ల కేసులకు సంబంధించిన తీర్పులే. దీన్ని గుర్తించిన డీజీపీ కార్యాలయం ఇటీవల ప్రత్యేకంగా అభినందించింది. రాష్ట్రంలోని 21 యూనిట్లలో 67 మందికి జీవిత ఖైదుపడగా వారిలో హైదరాబాద్ పరిధిలో 10, సైబరాబాద్, రాచకొండల్లో ఏడుగురు చొప్పున ఉన్నారు. క్లూస్ టీమ్స్.. నేరం జరిగినప్పుడు ఘటనాస్థలాల నుంచి వీటిని ఎంత వేగంగా, పక్కాగా సేకరించ గలిగితే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ఒకప్పుడు మూడు కమిషనరేట్లలో కలిపి కేవలం మూడే క్లూస్టీమ్స్ ఉండేవి. ఫలితంగా వారిపై పనిభారంతో పాటు క్రైమ్ సీన్స్కు చేరుకోవడంలో కాలయాపన జరిగేది. జాప్యాన్ని నివారించడానికి పోలీసు శాఖ డివిజినల్ క్లూస్టీమ్స్ను ఏర్పాటు చేసింది. జియో ట్యాగింగ్ ప్రతి పోలీసు అధికారి రోజువారీ నిర్వర్తిస్తున్న విధులను తెలుసుకోవడం కోసం ప్రత్యేక ఆన్లైన్ నివేదికలను పోలీసు ఉన్నతాధికారులు తెప్పించుకుంటున్నారు. నేరగాళ్ల నివాసాలు, ఆవాసాలను సాంకేతికంగా గుర్తించడానికి సీసీ కెమెరాలకు జియో ట్యాగింగ్ చేయడంతోపాటు ఈ–లీవ్ విధానం అమలు వంటివి ప్రతిస్థాయి అధికారి, సిబ్బందికి అందుబాటులోకి వచ్చాయి. సీసీ కెమెరాలు.. నేరాలను నిరోధించడం, కేసుల్ని కొలిక్కి తేవడం, దోషులను నిర్ధారించడం వంటి అంశాల్లో సీసీ కెమెరాలు బాగా ఉపకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్యవర్గాల సహాయంతో కమ్యూనిటీ సీసీ కెమెరాలు, ‘నేను సైతం’ప్రాజెక్టు కింద సాధారణ ప్రజలతో సీసీటీవీలను ఏర్పాటు చేయించారు. మూడు కమిషనరేట్లలో ఉన్న సీసీ కెమెరాల సంఖ్య 3 లక్షలకు పైనే. రికార్డు అయిన ఫీడ్ను శాస్త్రీయంగా ఎలా సేకరించాలనే అంశంపై పోలీసులకు ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చారు. ఐఎస్ఎస్.. శిక్షల శాతం పెరగడంలో ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ (ఐఎస్ఎస్) పాత్ర ఎనలేనిది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కేంద్రంగా రెండేళ్లుగా పనిచేస్తున్న ఈ విభాగం దర్యాప్తు అధికారులకు ఆద్యంతం సహకరిస్తోంది. -
పోలీసు శాఖలో బదిలీలకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో కిందిస్థాయి సిబ్బందిపై డీజీపీ కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించింది. దీర్ఘకాలికంగా ఒకే పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్లకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఒకే స్టేషన్లో ఐదేళ్లు దాటిన కానిస్టేబుల్, నాలుగేళ్లు దాటిన హెడ్కానిస్టేబుల్, మూ డేళ్లు దాటిన ఏఎస్సైల వివరాలను పంపాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. కిందిస్థాయి సిబ్బంది బదిలీలపై కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. సార్సాల ఘటన తర్వాత మారిన సీన్.. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం సార్సాల గ్రామంలో ఫారెస్ట్ అధికారిపై దాడి జరిగిన తర్వాత డీజీపీ మహేందర్రెడ్డి సీరియస్ అయ్యారు. అది మొదలు రాష్ట్రంలో డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్రతి అంశంపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్పై విమ ర్శలు రావడంతో డీజీపీ తీవ్రంగా స్పందించారు. వెంటనే అన్ని జిల్లాల ఎస్పీ లు, కమిషనర్లకు సందే శాలు పంపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రెండ్లీ పోలీసింగ్పై ఎలాంటి విమర్శలు రావొద్దని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో పంజగుట్ట పోలీస్ ఠాణా ఎదుట ఇటీవల స్వల్ప వ్యవధిలో రెండు హత్యలు జరగడంతో డీజీపీ ఠాణాను అర్ధరాత్రి సందర్శించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన పలువురిపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ పరిసరాలు మురికిగా ఉండటం, డ్యూటీ సమయంలో సిబ్బంది ఏమరుపాటుపై మండిపడ్డారు. గ్రేటర్ తర్వాత జిల్లాల్లో.. తొలుతగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల సందర్శనకు డీజీపీ శ్రీకారం చుట్టారు. పలు జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో ఇప్పటికే కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. దీంతో బదిలీ కాకుండా మిగిలిపోయిన ప్రాంతాల్లో ఈ జాబితాను రూపొందించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే పలు జిల్లాల్లోనూ డీజీపీ పర్యటన ఉంటుందని సమాచారం. -
రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30 అమలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలో భద్రతను పెంచారు. రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30 అమలు చేయనున్నట్లు ఏపీ డీజీపీ కార్యాలయం అధికారులు గురువారం వెల్లడించారు. విజయవాడ, గుంటూరు జిల్లాల పరిధిలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలపై ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా పోలీస్ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు. అసెంబ్లీ పరిసరాలు, సీఎం నివాస ప్రాంతాల వద్ద ఆందోళనలకు అనుమతి లేదని తెలిపారు. భద్రతా కారణాల రీత్యా ప్రజలు, ప్రజాసంఘాలు సహకరించాలని కోరారు. పోలీసుల అనుమతితో విజయవాడ ధర్నా చౌక్లో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. -
43 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 43 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయం శుక్రవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో పలు డివిజన్లలో పనిచేస్తున్న ఎస్డీపీవో (డీఎస్పీ)లు, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్కు చెందిన 30 మందిని పోలీస్ హెడ్క్వార్టర్కు ఎటాచ్ చేశారు. మరో ఏడుగురు డీఎస్పీలను ఇంటెలిజెన్స్కు బదిలీ చేయగా ఆ స్థానాల్లో ఉన్న ఆరుగురిని పోలీస్ హెడ్క్వార్టర్కు బదిలీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీఎస్పీల బదిలీలు చేపట్టినట్టు డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం తెలిపారు. ఎన్నికల ముందు బాబు సర్కారు అడ్డగోలు పోస్టింగ్లు.. సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం సొంత మనుషులకు, సొంత సామాజికవర్గానికి చెందినవారికి సూపర్ న్యూమరీ పేరుతో కీలక పోస్టులు కట్టబెట్టింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి రెండు నెలల ముందే దాదాపు 60 మంది డీఎస్పీ స్థాయి అధికారులను బదిలీ చేసింది. పోలీసుల్లో ఎక్కువ శాతం ఉన్న ఎస్సీ, బీసీ, కాపు, రెడ్డి సామాజికవర్గాలకు చెందినవారికి అప్రధాన (నాన్ ఫోకల్) పోస్టులు, అతి తక్కువగా ఉన్న చంద్రబాబు సామాజికవర్గం అధికారులకు కీలక పోస్టులు అప్పగించారు. వాస్తవానికి.. సీనియారిటీ ప్రకారం పోస్టులు కేటాయిస్తే అన్ని సామాజికవర్గాలకు అవకాశం వస్తుంది. దీనికి విరుద్ధంగా చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందినవారికి మేలు చేకూర్చేలా కొందరు సీఐలకు డీఎస్పీ క్యాడర్ ఇస్తూ సూపర్ న్యూమరీ అవకాశాన్ని వాడుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సూపర్ న్యూమరీ పేరుతో ఫిబ్రవరిలో 18 మందిని డీఎస్పీలుగా అప్గ్రేడ్ చేసి శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వంటివాటిలో కీలక పోస్టుల్లో నియమించారు. వీరిలో ఏకంగా 14 మంది చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ఇంటెలిజెన్స్కు ఏడుగురు.. ఇంటెలిజెన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుతోపాటు మరో ఆరు జిల్లాలకు డీఎస్పీలను బదిలీ చేశారు. ఇప్పటివరకు ఆ స్థానాల్లో ఇంటెలిజెన్స్ డీఎస్పీలుగా కొనసాగిన ఆరుగురిని పోలీస్ హెడ్క్వార్టర్కు పంపారు. ఎం.భక్తవత్సలం (కర్నూలు), వై.గోవిందరావు (విశాఖ అర్బన్ జోన్), కె.విజయపౌల్ (పశ్చిమ గోదావరి), ఏవీ సుబ్బరాజు (విజయనగరం), ఆర్.శ్రీనివాసరావు (గుంటూరు), పి.శ్రీనివాసరావు (విశాఖపట్నం రూరల్)లను తదుపరి పోస్టింగ్ ఇచ్చే వరకు పోలీస్ హెడ్క్వార్టర్ (డీజీపీ ఆఫీసు)కు రిపోర్టు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. -
పోలీసు నియామకాల్లో ‘స్పోర్ట్స్ కోటా’ గందరగోళం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు నియామకాల్లో ఎమ్మెస్పీ (మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్) కోటాలో గందరగోళం నెలకొంది. ఈ కోటా ప్రకారం జాతీయ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్)కు ఆడినవారు ఎమ్మెస్పీ అర్హులు. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) నోటిఫికేషన్లోనూ పేర్కొంది. కానీ, అమలు విషయం లో పోలీసు ఉన్నతాధికారుల్లోనే సమన్వయం కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీరందరినీ ఎమ్మెస్పీ కోటా కింద అనుమతించాలి. కానీ, ఒక్కో జిల్లాలో అధికారులు ఒక్కోలా వ్యవహరించడంతో స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఆశించే అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. దీంతో తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు అభ్యర్థులు డీజీపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అభ్యర్థులు ఏమంటున్నారంటే.. సంగారెడ్డి జిల్లా కోహిర్కు చెందిన విజయలక్ష్మి.. ఛత్తీస్గఢ్లో 59వ నేషనల్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొంది. ఎమ్మెస్పీ కోటాకు అర్హత ఉంది. కానీ, ఈమెకు పోలీసు కానిస్టేబుల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్లో ఎమ్మెస్పీ విభాగం కింద అధికారులు అనుమతించలేదు. కానీ, ఆమెతోపాటు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఆటల్లో పాల్గొన్న వారికి ఇతర జిల్లాల్లో ఎమ్మెస్పీ రిజర్వేషన్ కింద అనుమతి లభించింది. సూర్యాపేట జిల్లా కల్లూరుకు చెందిన విజయ్కుమార్.. స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇతనికి సర్టిఫికెట్ వెరిఫికేషన్లో ఎమ్మెస్పీ కోటా కింద అనుమతించలేదు. ఇతడి తర్వాత సర్టిఫికెట్ వెరికేషన్కు హాజరైన అభ్యర్థులను ఎమ్మెస్పీ కోటాలో అనుమతించారని వాపోతున్నాడు. ఇలాంటి బాధిత అభ్యర్థులు ప్రతీ జిల్లాకు ఉన్నారు. ప్రతీ 100 పోస్టులకు 2 సీట్లు ఎమ్మెస్పీ కోటా కింద భర్తీ చేస్తారు. రాష్ట్రం తరఫున జాతీయ పోటీల్లో పాల్గొన్న ఆశావహులంతా ఇప్పుడు అధికారుల తీరుతో నీరుగారిపోతున్నారు. జీవో 74 ఏం చెబుతోంది? క్రీడా విధానం, ఎమ్మెస్పీ కోటాకు సంబంధించి విధివిధానాలను రూపొందిస్తూ 2012లో జీవో నం 74ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి స్కూల్ క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు 2 శాతం కోటా అమలు చేయాలి. ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, సైక్లింగ్, రోయింగ్, షూటింగ్, ఫెన్సింగ్, రోలర్ స్కేటింగ్, సెయిలింగ్/యాట్చింగ్, ఆర్చరీ, క్రికెట్, చెస్, ఖో–ఖో, జుడో, టైక్వాండో, సాఫ్ట్బాల్, బాడీ బిల్డింగ్ మొత్తం 29 క్రీడలకు ఇందులో చోటు కల్పించారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక సంస్థ (టీఎస్ఎల్పీఆర్బీ) ఎమ్మెస్పీ కోటా కింద కూడా ఇవే 29 క్రీడాంశాలను పరిగణనలోకి తీసుకుంటామని గతేడాది పోలీసు నియామకాల సందర్భంగా విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. కానీ, ఇప్పుడు అది పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ముమ్మాటికీ సమన్వయ లోపమే.. వాస్తవానికి మా వద్ద నుంచి జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించాలంటే చాలా దశలుంటాయి. స్కూలు హెడ్మాస్టర్, పీఈటీ ఆమోదం, జిల్లా అధికారుల ఆమోదం పొందాక మేం కూడా అనుమతించాలి. ఇంత ప్రక్రియ తర్వాత వారు జాతీయ స్థాయిలో ఆడతారు. ఈ వివరాలన్నీ వెబ్స్డైట్లలో ఉంటాయి. నిబంధనల ప్రకారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నీలో అండర్–14 నుంచి అండర్–19 వరకు పాల్గొన్నవారు ఎమ్మెస్పీ కోటాకు అర్హులు. అధికారులు ఒక చోట అనుమతించి, మరోచోట అనుమతించకపోవడం దురదృష్టకరం. రామ్రెడ్డి, సెక్రటరీ,స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్), తెలంగాణ -
నాలుగో సింహానికి మూడో నేత్రం
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్, వుమెన్ ప్రొటెక్షన్ వింగ్ వంటి వినూత్న పద్ధతులతో ముందుకు సాగుతున్న రాష్ట్ర పోలీసులు మరో కొత్త ప్రయత్నా నికి శ్రీకారం చుట్టారు. పోలీసింగ్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు శాంతి భద్రతల విభాగం పోలీసులకు బాడీ వోర్న్ కెమెరా లేదా చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు ఇవ్వనున్నారు. ఇవి స్థానిక ఎస్పీ, కమిషనరేట్లతో పాటు, డీజీపీ ఆఫీసుకు కూడా అనుసంధానమై ఉంటాయి. ఫలితంగా ఘటనాస్థలంలో జరుగుతున్న కార్యక్రమాలను డీజీపీ కార్యాలయంలో ఉన్నతాధికారులు కూడా ప్రత్యక్షంగా వీక్షించగలరు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని త్వరలోనే అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా తొలిదశలో అన్ని జిల్లాల్లోని ముఖ్యమైన 10 పోలీస్ స్టేషన్ల సిబ్బందికి వీటిని పంపిణీ చేశారు. తర్వాత అన్ని పోలీస్ స్టేషన్లకు అందజేస్తారు. అందజేసిన సిబ్బందికి హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో వీటి వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. రాజధానిలో ఫలితాలివ్వడంతో..! చెస్ట్ మౌంటెడ్ కెమెరాలు హైదరాబాద్లో ట్రాఫిక్ విభాగం పోలీసులు చాలా కాలం నుంచే అమలు చేస్తున్నారు. రాజధానిలో ధర్నాలు జరిగినప్పుడు వీటిని సివిల్ పోలీసులు వినియోగించారు. హైదరాబాద్లో సత్ఫలితాలు ఇవ్వడంతో అన్ని జిల్లాలు, కమిషనరేట్లకు పంపిణీ చేయాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. పోలీసుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ఘటనాస్థలంలో సాక్ష్యాధారాల సేకరణకు ఈ విధానం దోహదపడనుంది. ఆందోళనలు, అల్లర్లు, విపత్తులు సంభవించినప్పుడు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం ఫోన్లు, వాకీటాకీల ద్వారానే చెప్పే వీలుంది. ఈ విధానం ద్వారా ఉన్నతాధికారులు వేగంగా స్పందించి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చే వీలుంటుంది. ప్రత్యేకతలేంటి? విదేశాల్లో వీటి వినియోగం ఎప్పట్నుంచో ఉంది. వీటికి 3జీ, 4జీ, ఆడియో, వీడియో సదుపాయంతో పాటు జీపీఎస్ కనెక్షన్ ఉంటుంది. రికార్డింగ్ బటన్ ఆప్షన్తో పాటు 400 నుంచి 500 గ్రాముల బరువు ఉంటాయి. ఈ కెమెరాలను భుజానికి ధరించేందుకు వీలుగా రూపొందిం చారు. వీటిని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో) ఆదేశాల మేరకు సిబ్బంది వినియోగిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు వీటిని వాడుతున్నారు. -
రాజ్యాంగ స్ఫూర్తికి పునరంకితం కావాలి
సాక్షి, హైదరాబాద్ : రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులందరూ పునరంకితం కావాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆదివారం ఉదయం హైకోర్టు ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలవద్దకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ పి.నవీన్రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ వి.ఈశ్వరయ్య, జస్టిస్ చంద్రయ్య, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకల్లో గట్టు శ్రీకాంత్రెడ్డి, కొండా రాఘవరెడ్డి తదితరులు అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందడుగు వేయాలి: గట్టు హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రం ముందడుగువేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డి ఆకాంక్షించారు. లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల్లో జాతీయజెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరుల ఆకాంక్షలు నెరవేరాలని, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ప్రఫుల్లారెడ్డి, కొండా రాఘవరెడ్డి, బి.సంజీవరావు, మహిళావిభాగం అధ్యక్షురాలు అమృతాసాగర్, ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగదేశి రవికుమార్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో .. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాల ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో నాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్నట్లు కాకుండా రాష్ట్రంలో కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు పాలన సాగిస్తుండడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, ముఖ్యనేతలు కె. దయాకర్రెడ్డి, అరవింద్కుమార్గౌడ్, బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఆదివారం శాసనసభ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ లక్ష్యాలు నెరవేరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన సాగుతోందని, కుటుంబ కబంద హస్తాల్లో, అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్రానికి విముక్తి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మజ్లిస్ పార్టీ ఒత్తిడితో నిర్వహించడం లేదని ఆరోపించారు. డీజీపీ కార్యాలయంలో.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సీఐడీ ఎస్పీ సుమతి, డీఎస్పీ వేణుగోపాల్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ యోగేశ్వర్రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
హోంగార్డుల జీవితాలతో చెలగాటం
సాక్షి, అమరావతి: చాలీచాలని వేతనాలతో విధి నిర్వహణ చేస్తున్న హోంగార్డుల జీ(వి)తాలతో చెలగాటం ఆడుతున్నారు. మండుటెండల్లో ఎన్నికల విధులు నిర్వహించిన వారికి అలవెన్సు(డీఏ)లోను కోత పెట్టారు. జీతాలకు అలవెన్సులకు ముడిపెట్టి డీజీపీ కార్యాలయం ఇచ్చిన సర్క్యులర్పై హోంగార్డులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోసం 65 రోజులు పనిచేసిన తమకు కేవలం 15 రోజులకే డీఏ ఇచ్చారంటూ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 12 వేల మంది హోంగార్డులు వాపోతున్నారు. అదే 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమకు డీఏ రూ.9 వేలు ఇవ్వగా ఈసారి రూ.4,500లతో సరిపెట్టడం దారుణమని మండిపడుతున్నారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో చంద్రబాబు సర్కారు ఓటర్లను ప్రలోభపెట్టేలా ప్రవేశపెట్టిన పలు పథకాలకు ఖజానా ఖాళీ చేసిన సంగతి తెల్సిందే. దీంతో ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, బిల్లులు చెల్లించకుండా నిలుపుదల చేసి ఎన్నికల పథకాలకు నిధులు మళ్లించారు. పోలీసు శాఖలో అధికారుల అలవెన్సులు, బిల్లులు మంజూరు కాలేదు. హోంగార్డులకు అయితే మూడు నుంచి నాలుగు నెలల జీతాలు ఇవ్వకుండా నిలిపివేశారు. ఎన్నికల అనంతరం వారికి జీతాలు చెల్లించారు. హోంగార్డుల వేతనాల అవసరాలపై డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన సర్క్యులర్ కొత్త మెలికతో కోతపెట్టారు... డీజీపీ కార్యాలయం నుంచి ఇచ్చిన సర్క్యులర్లో పెట్టిన కొత్త మెలికతో అలవెన్సుల్లో కోతపెట్టినట్టు హోంగార్డులు వాపోతున్నారు. వాస్తవానికి పోలీస్శాఖ నుంచి హోంగార్డుల వేతనం, ఎన్నికల ఫండ్స్ నుంచి డీఏ ఇవ్వాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా అలవెన్సును అరకొరగా ఇవ్వడంతోపాటు వేతనాన్ని కూడా ఎన్నికల ఫండ్స్ నుంచే ఇవ్వడం గమనార్హం. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు రోజుకు జీతం రూ.600, అలవెన్సు రూ.300 కలిపి మొత్తం రూ.900 చొప్పున మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. ఈ లెక్కన 15 రోజులకు వేతనం రూ.9 వేలు, అలవెన్సు రూ.4,500 ఇవ్వాలి. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు మాత్రం 15 రోజులకు అలవెన్సు ఇవ్వకుండానే రోజుకు రూ.600 చొప్పున కేటాయించారు. ఈ లెక్కన ఏప్రిల్ నెలకు మొత్తం రూ.22,500తోపాటు మే 20 నుంచి 24 వరకు జీతం రూ.600 చొప్పున మొత్తం రూ.3వేలు ఎన్నికల ఫండ్స్ ఇచ్చేలా సర్క్యులర్ ఇవ్వడం పట్ల హోంగార్డులు తప్పుబడుతున్నారు. కానిస్టేబుల్స్ తరహాలో అలవెన్సు ఇవ్వాలి వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర్నుంచి కౌంటింగ్ ప్రక్రియ వరకు దాదాపు 65 రోజుల పాటు విధులు నిర్వహించే తమకు డీఏ చెల్లించాల్సి ఉందని హోంగార్డులు చెబుతున్నారు. ఈ లెక్కన అలవెన్సు ఒక్కటే 19,500 రావాల్సి ఉందని చెబుతున్నారు. కానీ 15 రోజులకే అలవెన్సు ఇచ్చారని ఆవేదన చెందుతున్నారు. అదే తమతోపాటు విధులు నిర్వహించిన కానిస్టేబుల్స్కు మాత్రం 65 రోజులకు చెల్లిస్తున్నారని ప్రస్తావిస్తున్నారు. ఇదే విషయమై డీజీపీని కలిసేందుకు హోంగార్డులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానిస్టేబుల్స్తో సమానంగానైనా తమకు ఎన్నికల అలవెన్సులు ఇప్పించాలని కోరునున్నట్టు వారు చెబుతున్నారు. -
ఏసీపీ మల్లారెడ్డిపై వేటు
సాక్షి, హైదరాబాద్: ప్రవాస భారతీయుడు చిగురుపా టి జయరామ్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ ఎస్.మల్లారెడ్డిపై వేటు పడింది. ఈయన్ను గతంలోనే రాచకొండ హెడ్క్వార్టర్స్కు ఎటాచ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసు విభాగం మొత్తం 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇబ్రహీంపట్నం ఏసీపీగా వి.యాదగిరిరెడ్డిని నియమించింది. రాచకొం డలో ఉన్న మల్లారెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కనబెట్టింది. మరోపక్క ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒకేచోట నిర్ణీత కాలం పని చేసిన అధికారులకూ స్థాన చలనం కల్పించారు. బదిలీ అయిన వారి వివరాలు.. ఠి ఏసీబీలో ఉన్న కిరణ్కుమార్ను తూప్రాన్కు, కరీంనగర్ ట్రాఫిక్లో ఉన్న శ్యాంసుందర్ను మామూనూరుకు బదిలీ చేశారు. ఠి సైబరాబాద్ సీటీసీలో ఉన్న ఉమేందర్ను గోదావరిఖనికి, రామగుం డం టాస్క్ఫోర్స్కు నేతృత్వం వహిస్తున్న రమణారెడ్డిని చౌటుప్పల్కు, అక్కడున్న బాపురెడ్డిని బాలానగర్ ట్రాఫిక్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఠి కరీంనగర్ పీటీసీలో ఉన్న సత్యన్నను కామారెడ్డి రూరల్కు, అక్కడి చంద్రశేఖర్గౌడ్ను హైదరాబాద్ నగర భద్రత విభాగానికి బదిలీ చేశారు. ఠి బాలానగర్ ట్రాఫిక్లో పనిచేస్తున్న నరసింహారావును పేట్ బషీరాబాద్కు, ఇక్కడున్న అందె శ్రీనివాసరావును మల్కాజిగిరి ట్రాఫిక్ కు, ఇంటెలిజెన్స్ డీఎస్పీ దేవేందర్ను మీర్చౌక్కు, అక్కడున్న ఏసీపీ ఆనంద్ను సీఎస్డబ్ల్యూకు, సీఐడీ డీఎస్పీ సత్తయ్యను సత్తుపల్లికి బదిలీ చేశారు. ఠి సత్తుపల్లి ఏసీపీ ఆంజనేయులును సీఐడీకి, సైబరాబాద్ ఎస్బీ ఏసీపీ భుజంగరావును రాచకొండకు, రాచకొండ ఏసీపీ జితేందర్రెడ్డిని సీఐడీకి, ఎస్బీ ఏసీపీగా ఉన్న భుజంగరావును భువనగిరికి, అక్కడున్న జితేందర్రెడ్డిని సీఐడీకి, సీఐడీలో ఉన్న గణపతి జాదవ్ను జహీరాబాద్కు, అక్కడున్న ఎన్.రవిని కరీంనగర్కు పీటీసీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఠి మహదేవపూర్ ఎస్డీపీవో ఆర్.కె.కె.ప్రసాద్ను కరీంనగర్ ట్రాఫిక్కు, రాచకొండ క్రైమ్స్ ఏసీపీ శ్రీధర్ను హన్మకొండకు, సీఐడీలో ఉన్న రమేశ్ను ఊట్నూరుకు, అక్కడున్న వెంకటేశ్ను రాచకొండ క్రైమ్కు, హన్మకొండ ఏసీపీ చంద్రయ్యను సైబరాబాద్ సీటీసీ ఏసీపీగా బదిలీ చేశారు. -
మాకు రక్షణ కల్పించండి: ఏపీ బీజేపీ నేతలు
సాక్షి, విజయవాడ: తమకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు పోలీసు శాఖను ఆశ్రయించారు. మంగళవారం డీజీపీ కార్యాలయానికి వచ్చిన బీజేపీ నేతలు.. డీజీపీతో పాటు ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో అక్కడి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కాలంలో తమ పార్టీ నేతలపై దాడులు జరగడంతో బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. బీజేపీ నాయకులకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ మహిళపై బెదిరింపులకు పాల్పడటం దారుణమని అన్నారు. ఆయన వెంటనే బైండోవర్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపారు. టీడీపీ రౌడీలు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
డీజీపీ ఆఫీస్లో హెడ్ కానిస్టేబుల్నంటూ టోకరా!
అజిత్సింగ్నగర్ (విజయవాడ సెంట్రల్) : నున్న రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. డీజీపీ కార్యాలయంలో తాను హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నానని చెప్పి ఓ ఇంట్లో అద్దెకు దిగి అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుంచి ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద సుమారు రూ.4 లక్షలు అప్పులు చేసి ఓ వ్యక్తి పరారైన ఘటన నగరంలో మంగళవారం చర్చనీయాంశంగా మారింది. నున్న రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాయకాపురం ఎల్బీఎస్ నగర్లోని ఓ ఇంట్లో ఆర్నెలల క్రితం అశోక్ అనే వ్యక్తి అద్దెకు దిగాడు. తాను డీజీపీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తానని అందరితో పరిచయం పెంచుకున్నాడు. ప్రతి రోజూ హుందాగా పోలీసుల వలె సఫారీ డ్రస్లు ధరించి వస్తూ, వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో తనకు ప్రమోషన్ వచ్చిందని, రెండు నెలలుగా వేతనాలు రావడం లేదని చెప్పి వేగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.1.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. అలానే చుట్టుపక్కల నివసిస్తున్న మరో ఆరుగురి వద్ద ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద దాదాపు రూ.2.50 లక్షల వరకూ అప్పులు చేశాడు. అయితే కొన్ని రోజుల నుంచి అశోక్ ఇంటి వద్దకు రాకుండా ఉండడం, ఫోను పని చేయకపోవడంతో అప్పులు ఇచ్చిన వారంతా ఆయన కోసం విచారణ చేస్తున్నారు. ఎక్కడా అతని ఆచూకీ లభించకపోవడం.. అసలు అతను హెడ్ కానిస్టేబుల్ కాదని తెలియడంతో బాధితులు తాము మోసపోయినట్లు గ్రహించి నున్న రూరల్ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
ఈ–ఆఫీస్.. పేపర్ లెస్ వర్క్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో పనులన్నీ ఈ–ఆఫీస్ వ్యవస్థ ద్వారానే నిర్వహించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రతీ ఫైలును కంప్యూటర్ల ద్వారానే ఆపరేట్ చేస్తూ ట్రాకింగ్, ఆమోద నిర్ణయాలు, నోట్ ఫైల్ తదితరాలన్నింటినీ ఆన్లైన్లోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పేపర్ వినియోగం లేకుండానే పనులు పూర్తవుతాయని శాఖ భావిస్తోంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ కమిషనరేట్లో ఈ–ఆఫీస్ను ప్రారంభించారు. దీనికోసం ఇప్పటికే అన్నీ స్టేషన్ల ఎస్హెచ్వో, ఏసీపీ, డీసీపీ, అదనపు సీపీలకు శిక్షణనిచ్చారు. రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలోని మినిస్టీరియల్ స్టాఫ్, ఎగ్జిక్యూటివ్ స్టాఫ్కు శిక్షణ ఇస్తున్నారు. ఇన్వార్డు నుంచే ప్రతీ దరఖాస్తుకు నంబర్ ఇవ్వడం, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది, ఏ అధికారి వద్ద ఫైలు ఎన్ని రోజులు పెండింగ్లో ఉంది, తదితర వివరాలను ఆన్లైన్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. జిల్లా పోలీస్ విభాగాల్లోనూ ఈ–ఆఫీస్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గతంలో కేఎం ఆటమ్ అనే సాఫ్ట్వేర్ ద్వారా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం కొన్ని విభాగాలకే పరిమితమైంది. ఈసారి మాత్రం పోలీస్ స్టేషన్ నుంచి డీజీపీ కార్యాలయం వరకు అంతా ఆన్లైన్లోనే కార్యకలాపాలు సాగించేలా ఈ–ఆఫీస్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిపై పోలీస్ అధికారులందరికీ శిక్షణ ఇవ్వాలని అధికారులను డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. దశల వారీగా అన్ని జిల్లాల్లో ఈ–ఆఫీస్ అందుబాటులోకి వస్తుందని డీజీపీ కార్యాలయం తెలిపింది. -
సివిల్ వర్సెస్ ఆర్మ్డ్
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖకు సివిల్ విభాగం, ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుళ్లే బలం, బలగం. అలాంటి వారి మధ్య కొద్ది రోజులుగా కోల్డ్వార్ నడుస్తోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆర్మ్డ్ (ఏఆర్) విభాగం నుంచి సివిల్లోకి కన్వర్షన్ అయిన కానిస్టేబుళ్ల వల్ల పదోన్నతులు రావడం లేదంటూ హైదరాబాద్ కమిషనరేట్ సివిల్ కానిస్టేబుళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సివిల్ విభాగంలో 25 ఏళ్లుగా కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నా పదోన్నతులు లభించడంలేదని, కానీ ఏఆర్ నుంచి వచ్చి ఏడేళ్ల సర్వీసు పూర్తిచేసుకోకుండా పదోన్నతులు పొందుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు సీనియారిటీ ప్రకారం పదోన్నతులివ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఏఆర్ నుంచి కన్వర్షన్ ద్వారా వచ్చిన కానిస్టేబుళ్లూ ఆరోపిస్తున్నారు. సివిల్ కానిస్టేబుళ్ల పదోన్నతి విషయమై కొద్దిరోజుల క్రితం పోలీస్ శాఖ చర్యలు చేపట్టగా పదోన్నతులు నిలిపేయాలని ఏఆర్ కానిస్టేబుళ్లు కోర్టుకెళ్లి ఆదేశాలు తీసుకొచ్చారు. దీంతో పదోన్నతులు అడ్డుకుంటున్నారంటూ సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు ఒకరిపై ఒకరు రగిలిపోతున్నారు. అక్కడలా.. ఇక్కడిలా.. సాధారణంగా బెటాలిన్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్లు ఏఆర్ విభాగానికి కన్వర్షన్ అయితే 7 ఏళ్ల సర్వీసు నిండిన తర్వాతే పదోన్నతికి అర్హులవుతారు. అయితే ఏఆర్ నుంచి సివిల్కు వచ్చే కానిస్టేబుళ్లు ఇందుకు ఒప్పుకోవడం లేదని సిటీ పోలీస్ సివిల్ కానిస్టేబుళ్లు ఆరోపిస్తున్నారు. అక్కడ వర్తించిన నిబంధనలు ఇక్కడ ఎందుకు వద్దని వ్యతిరేకిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పాత సర్వీసు ప్రకారమే పదోన్నతి కల్పించాలంటూ ఏఆర్ కానిస్టేబుళ్లు ప్రత్యారోపణలు చేస్తున్నారు. అధికారుల్లో వణుకు ఓవైపు ఏఆర్ నుంచి కన్వర్షన్ అయిన కానిస్టేబుళ్ల పదోన్నతులపై కోర్టు స్టే విధించింది. మరోవైపు 25 ఏళ్లుగా పదోన్నతి లేకుండా ఉన్న 1990, 91, 92 ,93 ,95, 96 బ్యాచ్లకు చెందిన హైదరాబాద్ కమిషనరేట్ సివిల్ కానిస్టేబుళ్లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కోర్టు ఆదేశాలు.. ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకొని పదోన్నతులు ఎలా కల్పించాలని డీజీపీ కార్యాలయం సందిగ్ధంలో పడింది. ప్రత్యేక అధికారాలు ఉపయోగించడమా? లేక మరిన్ని పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు పంపడమా? తేల్చుకోలేకపోతోంది. ఏ క్షణంలో సిటీ పోలీస్ విభాగంలో సామూహిక సెలవు పరిస్థితి ఏర్పడుతుందోనని ఉన్నతాధికారులు వణికిపోతున్నారు. -
క్రికెట్ బెట్టింగ్పై ఉక్కుపాదం: ఏపీ హోంమంత్రి
సాక్షి, విజయవాడ : క్రికెట్ బెట్టింగ్లపై ఉక్కుపాదం మోపుతామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో బుధవారం ఆయన నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా, కుల,వర్గ విభేదాలను అదుపు చేయగలిగామన్నారు. అలాగే గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కళాశాలల యాజమాన్యాలతో చర్చిస్తామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. మహిళలపై దాడులకు పాల్పడేతే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చినరాజప్ప హెచ్చరించారు. ఎవరైనా సరే రౌడీయిజం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. రాష్ట్రంలో సరిపడనంత మంది పోలీసులు లేకపోయినా నేరాలను నియంత్రించడంలో వారు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. -
క్యాన్సర్ రోగినీ వదలని మోసగాడు!
పెద్దపల్లి: ఆన్లైన్ మోసాలు చేసేవాళ్లు చివరకు రోగులను కూడా వదలడం లేదు. క్యాన్సర్తో బాధ పడుతూ ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న జోయల్ అనే కానిస్టేబుల్ దీనగాధ తెలిసిందే. ఓ ప్రబుద్ధుడు జోయల్కు ఫోన్చేసి తాను డీఎస్పీ అమర్నాథ్రెడ్డిగా పరిచయం పెంచుకుని రూ.14,500 ఆన్లైన్లో పంపిస్తే నీ ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.5 లక్షల చెక్కు పంపిస్తామని చెప్పడంతో సదరు రోగి మోసపోయాడు. ‘మరణశయ్యపై కానిస్టేబుల్’ శీర్షికన ‘సాక్షి’లో గత నెల 28న ప్రచురితమైన కథనానికి స్పందించి సాటి కానిస్టేబుళ్లు రూ.55 వేల వరకు జోయల్ ఖాతాలో జమ చేశారు. డీజీపీ కార్యాలయం నుంచి రూ.4 లక్షల విలువైన మందులు అందించారు. ఈ నెల 2న తాను డీఎస్పీ అమర్నాథ్రెడ్డిని అని జోయల్కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ‘మీ కష్టం తెలుసుకున్నా.. సహాయం చేయాలని డీజీపీతో మాట్లాడాను. సీఎం సరేనంటూ రూ.5 లక్షలు సహాయ నిధి నుంచి విడుదల చేశారు’అని నమ్మబలి కాడు. ఓ ఖాతా నంబర్ ఇచ్చి అందులో రూ.14,500 వేస్తే రూ.5 లక్షల చెక్కు మంజూరవుతుందని చెప్పాడు. నమ్మిన జోయల్ అతడు చెప్పిన ఖాతాలో ఆ మొత్తం గురువారం జమ చేశాడు. మరుసటి రోజు రూ.5 లక్షల చెక్కు కోసం ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆ తర్వాత ఫోన్చేస్తే సిమ్కార్డు తొలగించినట్లు వాయిస్.. దీంతో మోసపోయానని ఆందోళన చెందుతున్నాడు. కాగా, సదరు అమర్నాథ్రెడ్డి సెల్ఫోన్ నంబర్, వాట్స్యాప్ డీపీలో ఓ పోలీస్ అధికారి ఫోటో కనిపించడం విశేషం. ఎవరా అధికారి అనేది మాత్రం పోలీసులే తేల్చాల్సి ఉంది. -
డీజీపీ కార్యాలయంలో కూలిన గోడ
సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు డీజీపీ కార్యాల యంలోని ఓ గోడ కూలిపోయింది. ఆదివారం రాత్రి 9.22 గంటల ప్రాంతంలో సీపీఆర్ఓ కార్యాలయం, ఐపీఎస్ క్వార్టర్స్కు మధ్య ఉన్న ప్రధాన గోడ కూలింది. రాత్రి సమయంలోఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతమున్న సీపీఆర్ఓ కార్యాలయ భవనం నిజాం కాలంలో నిర్మించిందే కావడంతో.. వర్షాలకు ఇది కూడా పూర్తిగా దెబ్బతిన్నట్టు కనిపిస్తోంది. దీంతో ఆ భవనం కూడా ఎప్పుడు కూలుతుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మొదటి అంతస్తులో సీపీఆర్ఓ కార్యాలయం కొనసాగుతుండగా, గ్రౌండ్ ఫ్లోర్లో డీజీపీ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల పిల్లల కోసం కేర్ సెంటర్ను ఏర్పాటుచేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధునీకరణ పనులు కూడా పూర్తికావచ్చాయి. ఇదే సమయంలో వర్షాలతో గోడ కూలడంతో భవనం కూడా డేంజర్ జోన్లో ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై డీజీపీ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
డీజీపీ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: శాంతి భద్రతలు, పోలీస్ అడ్మినిస్ట్రేటివ్ పనుల్లో బిజీగా ఉండే రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న మహిళల కోసం సురక్ష బతుకమ్మ పేరిట ప్రత్యేకంగా బతుకమ్మ పాటలను రూపొందించారు. ఈ సీడీని డీజీపీ అనురాగ్శర్మతో పాటు సీపీ మహేందర్రెడ్డి ఇతర అధికారులు ఆవిష్కరించారు. అనంతరం ఐపీఎస్ అధికారుల సతీమణులు, పోలీస్ కార్యాలయ మహిళా సిబ్బంది బతుకమ్మ ఆడారు. కోలాటాలతో ఉల్లాసంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ ఐపీఎస్, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైల్వే పోలీస్ ఆధ్వర్యంలో..: బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్టు రైల్వే పోలీస్ డీజీపీ కృష్ణప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ రైల్వే పోలీస్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది వారి కుటుంబీకులతో బతుకమ్మ వేడుకల్లో పాల్గొని రాష్ట్ర పండుగను ఘనంగా నిర్వహించాలని కోరారు. -
డీజీపీ ఆఫీసును కబ్జా చేయాలనుంది: సీఎం
సాక్షి, అమరావతి: ‘‘డీజీపీ కార్యాలయాన్ని కబ్జా చేయాలనుంది.. ఇక్కడే సీఎం ఆఫీసును పెట్టుకోవాలనుంది’’ అని సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రూ.40 కోట్లతో నిర్మించిన పోలీస్ హెడ్క్వార్టర్స్(డీజీపీ కార్యాలయం)ను సీఎం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. డీజీపీ కార్యాలయం కబ్జా చేయాలని ఉన్నా చేయనని, తాను అలా చేస్తే ఎవరూ మంచి ఆఫీసు కట్టుకోరని ముక్తాయించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకోసం పాటుపడుతున్న పోలీసుల బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రతీ పోలీసుకూ ఇల్లు కట్టిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ ఫోర్స్ రోబోలను మించిపోతోందన్నారు. గుంటూరు జిల్లాలో బోరుబావి నుంచి చిన్నారిని కాపాడటంలో పోలీసుల చొరవ అభినందనీయమన్నారు. చిన్నా చితకా సంస్థలకు భూములివ్వడం వేస్ట్ చిన్నా చితకా సంస్థలకు భూములిస్తే పెద్దగా ఉపయోగం ఉండదని, అదే పెద్ద పెద్ద సంస్థలకు భూములిస్తే ప్రపంచస్థాయి సంస్థలు అమరావతికి వచ్చే అవకాశముందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం ఆయన ‘కింగ్స్ కాలేజ్ హాస్పిటల్–ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్’ ఏర్పాటులో భాగంగా విజయవాడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన పునాదిరాయి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కింగ్స్ కాలేజీ యూరప్లోనే పెద్ద పేరున్న సంస్థని, భారతదేశంలో 11 ఆస్పత్రులను ఏర్పాటు చేస్తోందని, వీటన్నింటికీ అమరావతిలో నిర్మించే వైద్యకళాశాల హెడ్క్వార్టర్స్ కావాలని ఆయన అన్నారు. కింగ్స్ కళాశాల అమరావతిలో రూ.1,600 కోట్లు పెట్టుబడి పెడుతోందని, 1,000 పడకలతో ఆస్పత్రి, కళాశాల నిర్మాణం చేస్తోందన్నారు. -
డీజీపీ కార్యాలయాన్ని కబ్జా చేయాలనుంది: చంద్రబాబు
అమరావతి: డీజీపీ కార్యాలయాన్ని చూస్తే కబ్జా చేయాలనుందని, తన ఆఫీస్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకోవాలని ఉందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చమత్కరించారు. ఆయన బుధవారం అమరావతిలో నూతనంగా నిర్మించిన డీజీపీ హెడ్ క్వార్టర్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆక్టోపస్ విన్యాసాలను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. డీజీపీ ఆఫీస్ ఓ గార్డెన్ మాదిరిగా ఉందన్నారు. కార్పొరేట్ సెక్టార్ కూడా ఇలాంటి బిల్డింగ్ కట్టలేరని అన్నారు. మనకు ఉన్న వనరులు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. అమరావతిలో మంచి వాతావరణం ఉంటుందని.. మంచి నేల, నీరు, కొండలతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. ఆక్టోపస్ వాళ్లు లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చారని తెలిపారు. ఆక్టోపస్ చేస్తున్న విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. 20 సంవత్సరాల క్రితం ఆక్టోపస్ అవసరం ఎంతో ఉండేదన్నారు. గ్రేహౌండ్స్ అండ్ ఆక్టోపస్ను చూస్తే ఏపీ సేఫ్లో ఉందనే నమ్మకం కలుగుతుందన్నారు. నిన్న ఢిల్లీలో దేశం మొత్తం కలిపి 192 అవార్డులు ఇస్తే , అందులో 52 ఏపీకి రావడం గర్వ కారణమన్నారు. పోలీసులందరికీ అందరికి సొంత ఇంటి కల నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. నిన్న వినుకొండ లో అధికారులు, పోలీసుల పని తీరును అభినందిస్తున్నానన్నారు. అందరూ కలిసి ఓ పసి వాడిని కాపాడారని మెచ్చుకున్నారు. -
పోలీసు పదోన్నతులేవీ?
- నాన్ కేడర్ ఎస్పీ, కన్ఫర్డ్ ఐపీఎస్ హోదాల కోసం ఎదురుచూపులు - ప్రమోటీ, గ్రూప్–1 పోలీసు అధికారుల్లో ఆందోళన - మూడేళ్లుగా పెండింగ్లోనే పదోన్నతుల ప్రక్రియ - కొరత ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసు శాఖ - సీనియారిటీ వివాదాలు, పోలీసు కేసులను చూపుతూ వాయిదా సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో నాన్ కేడర్, కన్ఫర్డ్ ‘ఐపీఎస్’హోదా గందరగోళం కొనసాగుతోంది. పదోన్నతుల జాబితాలో ఉన్న అధికారులు, డైరెక్ట్ గ్రూప్–1 అధికారుల్లో నిరుత్సాహం రోజురోజుకూ పెరిగిపోతోంది. నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందాల్సిన ప్రమోటీ అధికారులు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తికాగానే కన్ఫర్డ్ ఐపీఎస్ కావాల్సిన గ్రూప్–1 అధికారులకు పదోన్నతులు మూడేళ్లుగా ఊరిస్తూనే ఉన్నాయి. కానీ పోలీసు ఉన్నతాధికారులు ఆశించిన స్థాయిలో స్పందించకపోతుండడం, ప్రభుత్వం నుంచి మొదలుకుని డీజీపీ కార్యాలయం వరకు ఎక్కడా పదోన్నతుల వ్యవహారంపై స్పష్టత రాకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ బ్యాచ్ అధికారులు సామూహిక సెలవులో వెళ్లిపోతారోనన్న స్థాయిలో అసంతృప్తి కనిపిస్తోందని పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. ఎదురుచూపులే.. గ్రూప్–1 ద్వారా డీఎస్పీ అయిన అధికారులు ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే.. వారికి కన్ఫర్డ్ ఐపీఎస్గా హోదా ఇవ్వడం కోసం కేంద్ర హోంశాఖకు జాబితా పంపాల్సి ఉంటుంది. ఇలా సర్వీసు పూర్తిచేసుకున్న అధికారులు రాష్ట్రంలో 11 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయి కూడా రెండేళ్లు గడుస్తోంది. స్టేట్ పోలీస్ సర్వీస్ (ఎస్పీఎస్) కన్ఫర్డ్ ఐపీఎస్ కింద 16 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇకపోతే ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్, డీఎస్పీ, అదనపు ఎస్పీ నుంచి నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందేందుకు 60మందికి పైగా అధికారులు ఎదురు చూస్తున్నారు. వారిలో 54 నుంచి 56 ఏళ్ల మధ్య వయసున్న వారికి కన్ఫర్డ్ ఐపీఎస్ హోదా, మిగతావారికి నాన్ కేడర్ ఎస్పీ పదోన్నతులు కల్పించాలి. కానీ రాష్ట్ర విభజన నాటి నుంచి ఏ ఒక్కరికీ పదోన్నతి అందలేదు. సీనియారిటీ జాబితాపై కోర్టుల్లో కేసులు తేలలేదని, అప్పటివరకు తామేమీ చేయలేమని ఉన్నతాధికారులు చేతులెత్తేశారు. కోర్టు కేసులతో.. వాస్తవానికి డీఎస్పీ, అదనపు ఎస్పీ సీనియారిటీ జాబితాను జీవో నంబర్ 108 పేరిట ఉమ్మడి రాష్ట్రంలో 2014, జూన్ చివరి వారంలో అప్పటి ఏపీ ప్రభుత్వం పేరిట జారీ చేశారు. ఇందులో అనేక తప్పులు దొర్లాయని.. జీవోను సవరించాలని ప్రమోటీ అధికారులు, గ్రూప్–1 అధికారులు ఒకరిపై ఒకరు కోర్టుకువెళ్లి స్టే తీసుకువచ్చారు. దీనితో రెండు రాష్ట్రాల మధ్య డీఎస్పీ, ఆపై ర్యాంకు అధికారులు విభజన ఇప్పటివరకు పూర్తి కాలేదు. మూడేళ్లుగా ఏంచేస్తున్నట్టు? ఐపీఎస్ అధికారులు ఏటా బ్యా చ్ల ప్రకారం పదోన్నతి పొందు తారు. కానీ కింది స్థాయిలో పనిచేసే అధికారుల పదోన్నతుల విషయంలో మాత్రం సీనియర్ ఐపీఎస్లు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లయినా డీఎస్పీ, అదనపు ఎస్పీ సీనియారిటీ జాబి తాను సమీక్షించి, మరో జీవో తీసుకురా వడం గానీ, కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతుల కు జాబితా పంపించిందీ గానీ లేదు. అన్నీ ఉన్నా..: రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కమిషనరేట్లు, ప్రత్యేక విభాగాలు ఏర్పాట య్యాయి. దాంతో ఐపీఎస్లు, ఎస్పీల కొరత వేధిస్తోంది. అధికారుల కొరతపై కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేసున్నా రాష్ట్ర పోలీస్ శాఖ తన చేతిలో ఉన్న అధికా రుల పదోన్న తులను పూర్తిచేయకుండా నిర్లక్ష్యం వహిస్తుండడం గమనార్హం. ప్రస్తుతమున్న అధికారుల జాబితాను కేంద్రానికి పంపి, ఒత్తిడి తీసుకువస్తే 11 మంది ఐపీఎస్ అధికారులుగా పదోన్నతులు పొందుతారు. వారికి జిల్లా ఎస్పీలుగా, జోన్ల డీసీపీలుగా, ఇతర దర్యాప్తు విభాగాల్లో కీలక బాధ్యతలను అప్పగించ వచ్చు. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. పదోన్నతుల్లో రాజకీయ ఒత్తిడి! ఆరు నెలల కింద ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు డీజీపీ కార్యాలయం ప్రక్రియ మొదలుపెట్టింది. కానీ హైదరాబాద్ సిటీ, రేంజ్, వరంగల్.. ఇలా సీనియారిటీ పంచాయితీ తో అడ్డంకులు వచ్చాయి. ఇవి చాలవన్నట్టు ఒక్కో బ్యాచ్ అధికారులు ఒక్కో మంత్రి ద్వారా, ఒక్కో ఎంపీ ద్వారా పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో డీఎస్పీ పదోన్నతుల వ్యవహారం అటకెక్కింది. ఈ పదోన్నతులు పూర్తిచేస్తే అదనపు ఎస్పీ, నాన్ కేడర్ ఎస్పీ, కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతులపై దృష్టి సారిస్తామని అటు హోంశాఖ, ఇటు డీజీపీ కార్యాలయం స్పష్టం చేస్తున్నాయి. -
పోలీస్ శాఖలో 18 వేల పోస్టులు
-
పోలీస్ శాఖలో 18 వేల పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటైన నూతన జిల్లాలను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖలో 18,290 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ సెక్రటరీ శివశంకర్ జీవో జారీ చేశారని డీజీపీ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్ విభాగంలో 9,629 పోస్టులు, ఏఆర్ విభాగంలో 5,738, బెటాలియన్స్లో 2,075, కమ్యూనికేషన్ విభాగంలో 143, మినిస్టీరియల్ కింద 599 పోస్టులతోపాటు ఇతర విభాగాల్లో 106 పోస్టులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. భారీగా పదోన్నతులు.. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న 29 మంది మినిస్టీరియల్ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 10 మంది సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్లుగా, 19మం ది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. -
డీజీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
హైదరాబాద్: డీజీపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కానిస్టేబుల్ పరీక్షలో జరిగిన అవకతవకలపై స్పష్టత ఇవ్వకుండానే అనర్హులైన అభ్యర్థులను శిక్షణకు పంపడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడానికి యత్నించగా.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
డీజీపీ కార్యాలయం ముట్టడి
హైదరాబాద్: కానిస్టేబుల్ పరీక్షలో అవకతవకలకు జరిగాయని ఆరోపిస్తూ.. రాతపరీక్ష రాసిన అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. రాతపరీక్షలో జరిగిన అవకతవకలపై వివరణ ఇవ్వకుండా రిక్రూట్మెంట్ పూర్తి చేయొద్దని డిమాండ్ చేస్తూ.. అభ్యర్థులు డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఓపెన్ చాలెంజ్లో రూ.5 వేలు కట్టినా రిప్లే ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
-
కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్: కానిస్టేబుళ్ల నియామకాలకు జరిగిన పరీక్షల ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ కానిస్టేబుల్ పరీక్ష రాసినవారు తెలంగాణ డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. 2016లో కానిస్టేబుళ్ల నియామకానికి నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అయితే ఈ ఫలితాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారని ఆరోపించారు. కాగా, మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఉంటుందని ప్రకటించి ఇప్పుడు 10 శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించారని మహిళా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీ స్పందించారు. ఎలాంటి అక్రమాలు జరగలేదని, కటాఫ్ మార్కులపై అనుమానాలుంటే రిక్రూట్మెంట్ బోర్డులో ఫిర్యాదు చేయవచ్చని డీజీపీ సూచించారు. కటాఫ్ మార్కులను వెబ్ సైట్ లో పెట్టాలని ఆదేశించినట్టు డీజీపీ తెలిపారు. -
నిరుద్యోగులకు కుచ్చుటోపి
హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ జిల్లాలోని పలు మండలాలకు చెందిన నిరుద్యోగులకు హైదరాబాద్కు చెందిన ఓ ఏఆర్ కానిస్టేబుల్ కుచ్చుటోపి పెట్టాడు. ఒక్కొక్క నిరుద్యోగ అభ్యర్థి నుంచి రూ. 1.70 లక్షలు నుంచి రూ. 2 లక్షలు చొప్పున సుమారు రూ. 60 లక్షలు వరకు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశాడు. లావేరు మండలంలోని పోతయ్యవలస గ్రామానికి చెందిన కొంపెల్ల నరేష్ అనే యువకుడు దీనిపై లావేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి బాధిత నిరుద్యోగులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లావేరు: హైదరాబాద్లోని అడిషనల్ డీజీపీ కార్యాలయంలో పీటీవో సెక్షన్లో ఏఆర్ కానిస్టేబుల్ కమ్ డ్రైవర్గా మధు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇతడు ఏలూరు ప్రాంతానికి చెందిన వాడు. తనకు అడిషనల్ డీజీపీ కార్యాలయంలో పోలీస్ ఉన్నతాధికారులతో మంచి పరిచయాలు ఉన్నాయని, హోంగార్డు ఉద్యోగాలు ఈజీగా వేయించగలని తనకు తెలిసిన వారితో చెప్పాడు. ఒక్కొక్క ఉద్యోగానికి రూ. 2 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపాడు. ఇదే విషయాన్ని ఏఆర్ కానిస్టేబుల్తో పరిచయం ఉన్న వ్యక్తులు తమకు తెలిసిన లావేరు మండలంలోని పోతయ్యవలస, లింగాలవలస, భామిని మండలంలోని బాలేరు, కొత్తూరు మండలంలోని ఇరపాడు, పాలకొండ మండలంలోని పాలకొండ గ్రామాలకు చెందిన కొందరు నిరుద్యోగ యువకులకు చెప్పారు. వారంతా హోంగార్డు ఉద్యోగాల కోసం రూ. 2 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించుకొన్నారు. ముందుగా రూ. 1.30 లక్షలు నుంచి రూ. 1.70 లక్షలు చొప్పున ఏఆర్ కానిస్టేబుల్ మధుకు 2012 డిసెంబరులో హైదరాబాద్లోని లక్డీకపూల్ ప్రాంతంలో అందజేశారు. డబ్బులు ఇచ్చిన తర్వాత సంవత్సరాలు గడచినా హోంగార్డు ఉద్యోగాలు రాకపోవడంతో అతనిని నిరుద్యోగ యువకులు ప్రశ్నిస్తే ఇదిగో అదిగో జాయినింగ్ ఆర్డర్లు రెడీ అవుతున్నాయంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి తప్పించుకుని తిరిగేవాడు. మధు చేసిన మోసంపై లావేరు మండలంలోని పోతయ్యవలస గ్రామానికి చెందిన కొంపెల్ల నరేష్ అనే వ్యక్తి ఇటీవల లావేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల అదుపులో మధు? నరేష్ ఫిర్యాదు మేరకు లావేరు పోలీసులు హైదరాబాద్ వెళ్లి మధును పట్టుకొని ఆదివారం రాత్రి స్థానిక స్టేషన్కు తీసుకువచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం లావేరు పోలీసుల అదుపులో మధు ఉన్నట్టు సమాచారం. మధును తీసుకువచ్చిన విషయం తెలుసుకున్న లావేరు, భామిని, పాలకొండ, కొత్తూరు మండలాలకు చెందిన బాధిత నిరుద్యోగులు సోమవారం లావేరు పోలీస్ స్టేషన్కు వచ్చారు. తమను మధు ఏవిధంగా మోసం చేశాడో వారంతా పోలీసులు, విలేకరులకు తెలిపారు. వీరే కాకుండా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మరికొంత మంది నిరుద్యోగులు వద్ద నుంచి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని మధు డబ్బులు తీసుకున్నట్టు తెలిసింది. -
ప్రతీ పోలీసుస్టేషన్లో ఇంకుడుగుంత: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ప్రతీ పోలీసుస్టేషన్ ఆవరణలో తప్పనిసరిగా ఇంకుడుగుంతను తవ్వాలని డీజీపీ అనురాగ్శర్మ పోలీసులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో నీటి కోసం ఇబ్బందులు పడకుండా ప్రతీ నీటిచుక్కను ఒడిసి పట్టుకోవాలని సూచించారు. సోమవారం ఇక్కడ పోలీసు ప్రధానకార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంకుడుగుంతల కార్యక్రమంలో డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతీ పోలీస్స్టేషన్లో వారంలో ఒకరోజు స్వచ్ఛ తెలంగాణను పాటించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఐజీ సంజయ్కుమార్ జైన్, ఎస్పీ రమేష్రెడ్డిలతో కూడిన అధికారుల బృందం డీజీపీ కార్యాలయంలోని అన్ని సెక్షన్లను పరిశీలించింది. డీజీపీ కార్యాలయంలో అత్యంత పరిశుభ్రతను పాటిస్తున్న సీ-సెక్షన్ కు డీజీపీ ప్రోత్సాహక బహుమతిగా రూ.2 వేలు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ పోలీసు అధికారులు గోపీకృష్ణ, కృష్ణప్రసాద్, రవిగుప్తా, సందీప్ శాండిల్య, బాలనాగదేవి, నవీన్చంద్, శివధర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, అకున్ సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
డీజీపీ కార్యాలయంలో ‘క్రష్’ ఏర్పాటు
హైదరాబాద్: రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల చిన్న పిల్లల కోసం ‘క్రష్' (చిన్న పిల్లల సంరక్షణ కేంద్రం)’ ఏర్పాటుకు పోలీసు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. డీజీపీ కార్యాలయంలో పలువురు మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారు చిన్నారుల సంరక్షణ పట్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చిన్నారుల సంరక్షణ కోసం ‘క్రష్’ ఏర్పాటు చేయాలని పోలీసు సంక్షేమ విభాగం నిర్ణయించింది. ఈ మేరకు డీజీపీ అనురాగ్శర్మ ఆమోదం తెలిపారు. దీంతో వారం రోజుల్లో క్రష్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పోలీసు సంక్షేమ విభాగం ఐజీ సౌమ్యమిశ్రా చర్యలు ప్రారంభించారు. -
మహిళను వేధించిన డీఎస్పీపై వేటు
వికారాబాద్: ఓ మహిళా హోంగార్డును లైంగికంగా వేధించిన డీఎస్పీపై ఉన్నతాధికారులు వేటు వేశారు. సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పరిగికి చెందిన ఓ హోంగార్డు గతంలో మృతిచెందాడు. ఆయన భార్యకు ఉపాధి కల్పిస్తూ హోంగార్డు ఉద్యోగం ఇచ్చి అప్పటి ఎస్పీ రాజకుమారి విధుల్లో నియమించారు. కొంతకాలం వరకు ఎస్పీ కార్యాలయంలో పనిచేసిన ఆ మహిళ 2 నెలల క్రితం పరిగి ఠాణాకు బదిలీ అయ్యారు. అయితే, తనను వికారాబాద్ ఏఆర్ డీఎస్పీ ఎ.లక్ష్మీనారాయణ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదికను డీజీపీ కార్యాలయానికి అందచేశారు. ఈ మేరకు డీజీపీ అనురాగ్శర్మ డీఎస్పీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గతంలో లక్ష్మీనారాయణ మంత్రి మహేందర్రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ పోలీస్గా అవార్డు తీసుకోవడం గమనార్హం. -
అదో సిల్లీ కేసు
దాని పూర్తి వివరాలు నా దృష్టిలో ఉండవు కేటీఆర్ గన్మెన్పై ఉన్న కేసుపై డీజీపీ వ్యాఖ్య మత్తయ్య మా దృష్టిలో ఫిర్యాదుదారుడని స్పష్టీకరణ హైదరాబాద్: విశాఖపట్నం పోలీసు కమిషనరేట్లోని పెందుర్తి పోలీసుస్టేషన్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ గన్మెన్, అనుచరులపై నమోదుయిన కేసు సిల్లీ కేసు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ జాస్తి వెంకట రాముడు వ్యాఖ్యానించారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాముడు మాట్లాడారు. ఈ కేసుతో పాటు ఓటుకు కోట్లు కౌంటర్ కేసులపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు డీజీపీ ఇలా స్పందించారు. విలేకరులు: 2013లో పెందుర్తితో కేటీఆర్ గన్మెన్, అనుచరులపై ఉన్న కేసు ఏమిటి? ఇన్నాళ్ళ తరవాత ఇప్పుడు హడావుడిగా నోటీసులు ఎందుకు జారీ చేశారు? డీజీపీ: అదో సిల్లీ కేసు. అలాంటి వాటికి సంబంధించిన వివరాలన్నీ నా దగ్గర ఉండవు. రోటీన్గానే నోటీసులు ఇచ్చి ఉంటారు. స్థానిక పోలీసుల్ని అడగండి. విలేకరులు: తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఓటుకు కోట్లు కేసులో నిందితుడిగా ఉన్న మత్తయ్యకు ఏపీ పోలీసులు షెల్టర్ ఇచ్చారనే విమర్శలున్నాయి కదా...! డీజీపీ: మత్తయ్య ఓ ఫిర్యాదుదారిడిగానే మాకు తెలుసు. ఓ కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తికి అండగా ఉండాల్సిన బాధ్యత పోలీసులకు, ప్రభుత్వానికి ఉంది. అందుకు తగ్గట్టే స్పందించాం. విలేకరులు: రాష్ట్రంలో ప్రతిపక్షాలపై దాడులు పెరిగాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని సంఘటనలూ కనిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన ఏంటి? డీజీపీ: రాష్ట్రంలో ఎక్కడా అలాంటి పరిస్థితి లేదు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎవరైనా బాధితులు ఉంటే వచ్చి నాతో మాట్లాడవచ్చు. అయితే ఈ సందర్భంగా అక్కడే ఉన్న అదనపు డీజీ (శాంతిభద్రతలు) ఆర్పీ ఠాకూర్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ... గడిచిన ఆరు నెలల్లో ఒక్క ఫ్యాక్షన్ హత్య కూడా నమోదు కాలేదన్నారు. పొలిటికల్ క్రైమ్ పూర్తిగా తగ్గిందని చెప్పారు. విలేకరులు: ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తున్న కేసులు తెలంగాణ ఏసీబీ దర్యాప్తు చేస్తున్న ఓటుకు కోట్లుకు కౌంటరేనా? నోటీసుల జారీ కూడా వారి యాక్షన్కు రియాక్షన్లా కనిపిస్తోంది... డీజీపీ: వీటిపై మీ ఉద్దేశం ఏమిటి? అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. సీఐడీ దగ్గర ఉన్న కేసు దర్యాప్తులో భాగంగానే నోటీసుల జారీ ప్రక్రియ జరుగుతోంది. దీనిపై ఎక్కువ ఆలోచించకండి. విలేకరులు: కొందరు మాజీ డీజీపీలే మీవి కౌంటర్ కేసులని, మీది రియాక్షన్ అని అంటున్నారు కదా..! డీజీపీ: రిటైర్ అయినవాళ్ళు ఏదైనా చెప్పవచ్చు. వారికి ఎలాంటి క్రమశిక్షణా నియమావళిలు ఉండవు. అది వాస్తవం కాదు. విలేకరులు: ఏపీ-తెలంగాణ పోలీసు మధ్య విభేదాలు వచ్చాయని, అవి కొనసాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి... డీజీపీ: మేమంతా ఆలిండియా సర్వీసు అధికారులం. మాకు నేషనల్ ఇంట్రెస్ట్ అనేది తొలి ప్రాధాన్యం. దేశం మొత్తానికి ఒకే పోలీసు వ్యవస్థ ఉంటుంది. తెలంగాణ అధికారులతో స్నేహపూరితంగా ఉన్నాం. ఎలాంటి అగాధం లేదు. -
హెడ్ కానిస్టేబుల్కు ‘అమెరికా’డాక్టరేట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో కమ్యూనికేషన్స్ విభాగం హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న కొలుకూరి శ్రీధర్కు అమెరికాలోని హోన్స్టన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. దూర విద్యా విధానంలో ‘పోలీస్ కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ సిస్టం ఇన్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఏపీ’ అనే అంశంపై చేసిన పరిశోధనకుగానూ ఈ పురస్కారం అందుకున్నారు. పట్టాను బెంగళూరులోని వర్శిటీ భారత ప్రధాన కార్యాలయం సోమవారం శ్రీధర్కు అందజేసింది. హైదరాబాద్లోని గాంధీనగర్కు చెందిన శ్రీధర్ 1996లో పోలీసు కమ్యూనికేషన్స్లో కానిస్టేబుల్గా చేరారు. పీహెచ్డీ చేయడంలో భాగంగా 2012లో వర్శిటీకి అప్లై చేసుకున్న శ్రీధర్ దాదాపు మూడు వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించి పరిశోధన పత్రాలను రూపొందించారు. యూనివర్శిటీ డెరైక్టర్ కోడూరి వెంకటేష్ సారథ్యంలో రూపొందించారు. శ్రీధర్ మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. డాక్టరేట్ను తన తల్లికి అంకితమిస్తున్నానని చెప్పారు. -
డీజీపీ కార్యాలయంలో ‘సిట్’ భేటీ
భవిష్యత్తు కార్యాచరణపై చర్చ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం వెలుగులోకొచ్చాక దీనికి కౌంటర్గా ఏపీలో నమోదైన కేసుల్ని దర్యాప్తు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) శనివారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో భేటీఅయింది. సిట్ సారథి డీఐజీ మహ్మద్ ఇక్బాల్తోపాటు సభ్యులుగా ఉన్న చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏఎస్పీ దామోదర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రాథమికంగా 13 జిల్లాల్లో నమోదై, తమకు బదిలీ అయిన 88 కేసుల స్వరూపస్వభావాలను చర్చించారు. దర్యాప్తు ఏ కోణంలో ప్రారంభించాలి, నోలీసుల్ని ఏ ఏ నేరాలకింద, ఎవరెవరికి జారీచేయాలి అనేది ఖరారు చేయడానికి న్యాయనిపుణులతోనూ సిట్ సంప్రదింపులు జరుపుతోంది. సోమవారం నుంచి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు విజయవాడ సత్యనారాయణపురం పోలీసుస్టేషన్ నుంచి బదిలీ అయిన ‘మత్తయ్య కేసు’ దర్యాప్తునూ సీఐడీ అధికారులు ముమ్మరం చేశారు. ఇందులో టీఆర్ఎస్, హైదరాబాద్ ఏసీబీ పేర్లతో వచ్చిన ఫోన్ బెదిరింపులు ప్రధాన ఆరోపణ కావడంతో ఆయా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి మత్తయ్యతోపాటు మరికొందరి కాల్ డేటాలను అధికారికంగా తీసుకున్న దర్యాప్తు అధికారి విశ్లేషించడం ప్రారంభించారు.సోమవారం నుంచి నోటీసుల జారీతోపాటు ఇతర చర్యలు మొదలుపెడతారని తెలుస్తోంది. 12 మంది సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోన్గానీ ఇతర మంత్రుల ఫోన్లుగానీ ట్యాప్ అయ్యాయా? లేదా? అనే విషయాన్ని తెలియజేయాలంటూ 12 మంది సర్వీస్ ప్రొవైడర్లకు సిట్ శనివారం నోటీసులు జారీ చేసింది. ఓటుకు కోట్లు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో సీఎం చంద్రబాబు ఫోన్ ఆడియో సంభాషణల టేపులు బయటపడిన సంగతి తెలిసిందే. -
డీజీపీతో టీటీడీపీ నేతల భేటీ
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నేతలు డీజీపీ అనురాగ్ శర్మతో సమావేశమయ్యారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర టీడీపీ నేతలు డీజీపీని కలిశారు. రాజకీయ దురుద్దేశంతోనే అక్రమ కేసులో ఇరికించారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్కు డబ్బులు పంపిణీ చేస్తుండగా రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని రేవంత్ రెడ్డి.. స్టీఫెన్ను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. సికింద్రాబాద్లోని లాలాగూడలో స్టీఫెన్కు 50 లక్షల రూపాయలు ఇస్తుండగా పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. -
పోలీసు ఎంపికలో సమూల మార్పులు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో అమలులోకి తీసుకువచ్చిన పోలీసు ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు తీసుకురావాలని డీజీపీ జాస్తి వెంకట రాముడు నిర్ణయించారు. దీనికి సంబంధించిన తొలి సమావేశం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఇందులో అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొని పలు సూచనలు చేశారు. వాటిని నియామక బోర్డ్ అధికారులు మంగళవారం డీజీపీ రాముడి దృష్టికి తీసుకువెళ్లి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ప్రధానాంశాలివి... - రిక్రూట్మెంట్లో స్క్రీనింగ్ పరీక్షగా ఉన్న 5 కిమీ పరుగును వివిధ ఇబ్బందులతో పూర్తిగా తొలగించాలని సిఫార్సు చేశారు. - ఇకపై జరిగే పోలీసు రిక్రూట్మెంట్స్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసేందుకు వెసులు బాటు. - 100 మీటర్లు, 800 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్ జంప్ వంటి పరీక్షల్లోనూ పలు మార్పులు చేయనున్నారు. - టెక్నికల్ విభాగాలుగా పిలిచే పోలీసు కమ్యూనికేషన్స్, రవాణా విభాగం, వేలి ముద్రల విభాగాల్లో ఎంపిక ప్రక్రియను సాధారణ, ఆర్డ్మ్ రిజర్వ్ విభాగాల ఎంపిక ప్రక్రియలకు పూర్తి భిన్నంగా డిజైన్ చేస్తున్నారు. - కానిస్టేబుల్ ఎంపిక విధానానికి భిన్నంగా ఎస్సై రిక్రూట్మెంట్లో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్ని అమలు చేయాలని కొందరు ఉన్నతాధికారులు సిఫార్సు చేశారు. -
చిక్కిన టక్కరి
డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిన అవినాష్ హైదరాబాద్ నుంచి పెద్దాపురం తరలింపు.. లొంగుబాటు వెనుక ‘అదృశ్యశక్తి’ హస్తం? అమలాపురం టౌన్ :మానవ హక్కుల చైర్మన్ పద విని అడ్డం పెట్టుకుని, హోం మంత్రి చుట్టాన్నని చెప్పుకొని జిల్లాలో దందాలకు దిగిన మాయలమారి పేరాబత్తుల అవినాష్ దేవ్చంద్ర గురువారం హైదరాబాద్లో డీజీపీ కార్యాలయంలో పోలీసులకు లొంగిపోయాడు. అవినాష్ అక్రమాలు, ఆగడాలపై నాలుగు రోజుల కిందట ప్రసార మాధ్యమాలు ఎలుగెత్తాయి. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఆ మాయలోడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో జల్లెడపట్టాయి. అతడు హైదరాబాద్లోనే కొన్ని అదృశ్య శక్తుల నీడలో తలదాచుకున్నట్టు సమాచారం అందటంతో ఆ నగరానికి జిల్లా నుంచి పోలీసు బృందాలు మూడు రోజుల కిందటే వెళ్లి గాలించాయి. ఇంతలో అవినాషే డీజీపీ కార్యాలయంలో లొంగిపోయి ఉత్కంఠకు తెరదించాడు. అయితే తొలి నుంచీ అవినాష్కు అండగా నిలుస్తున్న టీడీపీ ప్రభుత్వంలోని ఓ అదృశ్య శక్తి అతని లొంగుబాటు వ్యూహంలోనూ తెరవెనుక పనిచేసినట్లు తెలుస్తోంది. అవినాష్ చేసిన మోసాలు, అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తుండటం, హోంమంత్రి బంధువునంటూ చెలరేగిపోవటంతో ఇప్పుడు అతడిని కాపాడే అవకాశాలు ఆ అదృశ్య శక్తికి సన్నగిల్లాయి. దీంతో ఎంతటి అజ్ఞాతంలో ఉన్నా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పన్నిన నిఘా వలకు ఒకటిరెండు రోజుల్లో అవినాష్ చిక్కక తప్పేదికాదు. ఈ క్రమంలో అతడికి అండగా ఉన్న అదృశ్య శక్తే లొంగుబాటుకు వ్యూహరచన చేశారని తెలుస్తోంది. అతను అజ్ఞాతంలో ఉండేకొద్దీ ప్రభుత్వానికి అప్రతిష్ట పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ఈప్రచారానికి తెరదించాలనే వ్యూహంతోనే స్వచ్ఛందంగా లొంగిపోయేలా చేసినట్టు తెలుస్తోంది. అవినాష్ అక్రమాలు వెలుగు చూసిన 72 గంటల్లో ఆ టక్కరి చిక్కడంతో జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకుంటోంది. హైదరాబాద్ నుంచి పెద్దాపురానికి.. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిన అవినాష్ను విచారణ నిమిత్తం ప్రత్యేక పోలీసు బందోబస్తుతో గురువారం మధ్యాహ్నమే అక్కడ నుంచి పెద్దాపురానికి తరలించే ఏర్పాటు చేశారు. పెద్దాపురం సీఐ శివకుమార్కు డీజీపీ కార్యాలయ అధికారులు ఆ నిందితుడిని అప్పగించారు. రాజమండ్రి నుంచి ఒకటి, పెద్దాపురం నుంచి రెండు కేసులు అవినాష్పై నమోదు కావడం, మరిన్ని ఫిర్యాదులు అందే అవకాశం ఉండడంతో విచారణ నిమిత్తం అవినాష్ను హైదరాబాద్ నుంచి పెద్దాపురానికి తీసుకువస్తున్నారు. ఊపిరి పీల్చుకున్న బాధితులు.. అవినాష్ దౌర్జన్య దృశ్యాలు టీవీలో చూసి అతనికి భయపడి ఫిర్యాదు చేసేందుకు జంకిన జిల్లాలోని బాధితులు ఇప్పుడు అతడు పోలీసులకు లొంగిపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. మొన్నటి వరకు అవినాష్ వల్ల ఎన్ని ఇబ్బందులు, బెదిరింపులు ఎదురైనా ఆ బాధను అతని ఆగడాలకు జడిసి ఫిర్యాదుకు వెనుకాడారు. ఫిర్యాదు చేస్తే రాజకీయ అండతో తమనేం చేస్తాడోనని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తి పోలీసుల అదుపులోకి రావడంతో బాధితుల్లో కొంత ధైర్యం కనిపిస్తోంది. అతని బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఇక ముందుకు రావచ్చునని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అవినాష్కు అంగుళూరులో ఆధార్ కార్డు అవినాష్కు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామం చిరునామాతో ఆధార్ కార్డు, రేషన్కార్డు ఉన్నారుు. కొన్నేళ్ల క్రితం కోనసీమ నుంచి ఖమ్మం జిల్లా చర్ల మండలం మామిడిగూడానికి వలస వెళ్లిన అవినాష్ కుటుంబానికి అంగుళూరులో బంధువులు ఉన్నారు. అతని అమ్మమ్మది ఆ గ్రామమేనని తెలిసింది. అయితే ఆధార్ కార్డులో అతడు 1990 జనవరి 4న పుట్టినట్టుగా ఉంది. ఆ లెక్కన అతని వయసు ప్రస్తుతం 25 ఏళ్లు ఉండాలి. అయితే అతని వయసు 32 ఏళ్లు కావడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్యాకేజీ పొందేందుకు అవినాష్ ఇక్కడ ఆధార్ పుట్టించుకున్నాడా అనే అనుమానాలు ఆ గ్రామ ప్రజల నుంచి వ్యక్తమవడం గమనార్హం. ఏ సెక్షన్కు ఎంత శిక్ష.. అవినాష్ అక్రమాలపై పెద్దాపురం పోలీసులు ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ కేసులు రుజువైతే శిక్షలు కఠినంగా ఉంటాయని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’కి తెలిపారు. 419 సెక్షన్ రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా, 420 సెక్షన్కు ఏడేళ్ల జైలు, జరిమానా, 506 రెడ్విత్ 34సెక్షన్కు రెండేళ్ల జైలు, జరిమానా, 342 సెక్షన్కు ఏడాది జైలు శిక్ష, 323 సెక్షన్కు ఏడాది జైలు, 384 సెక్షన్కు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. -
డీజీపీ కార్యాలయాన్ని సందర్శించిన విదేశీ అధికారులు
హైదరాబాద్: నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కార్యక్రమంలో భాగంగా 21 దేశాలకు చెందిన 47 మంది పోలీసు అధికారులు తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని సందర్శించారు. డీజీపీ కార్యాలయాన్ని సందర్శించిన వారిలో ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, ఫిజి, ఇండోనేషియా, కెన్యా, ఉగాండా మొదలైన పలు దేశాలకు చెందిన అధికారులున్నారు. -
జిల్లా ఎస్పీగా పి.విశ్వప్రసాద్
సాక్షి, మహబూబ్నగర్: జిల్లాకు కొత్త పోలీస్బాస్గా పి.విశ్వప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డి.నాగేంద్రకుమార్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలొచ్చాయి. జిల్లాకు ఎస్పీగా రానున్న పి.విశ్వప్రసాద్ మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం కొండపాక గ్రామానికి చెందినవారు. 1996 బ్యాచ్కు చెందిన ఆయన ఇప్పటి వరకు కడప, పరకాల, గురజాల ప్రాంతాల్లో డీఎస్పీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత వరంగల్ అదనపు ఎస్పీగా, విశాఖపట్నం ట్రాఫిక్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయనకు 2011లో ఐపీఎస్ హోదా దక్కింది. ఆ తర్వాత ఇంటలిజెన్స్ ఎస్పీగా, విశాఖపట్నంలో శాంతిభద్రతల డీసీపీగా పనిచే శారు. ప్రస్తుతం ఎల్బీనగర్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న విశ్వప్రసాద్ జిల్లాకు ఎస్పీగా తొలిసారి రానున్నారు. ఏపీకి నాగేంద్రకుమార్ జిల్లాకు పోలీస్బాస్గా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించిన నాగేంద్రకుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే అవకాశ ం ఉంది. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్ల పంపకాల కోసం కేంద్రం ఏర్పాటుచేసిన ప్రత్యుష్సిన్హా కమిటీ కూడా నాగేంద్రకుమార్ను ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది. దీనిపై మరో రెండువారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎస్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీచేసింది. నాగేంద్రకుమార్ ఏపీకి వెళ్లాల్సి ఉన్నందున ఆయనకు తెలంగాణలో ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. రెండేళ్లకు పైగా.. మహబూబ్నగర్ జిల్లా ఎస్పీగా నాగేంద్రకుమార్ రెండేళ్లకు పైబడిగా పనిచేశారు. అప్పటినుంచి రెండేళ్ల మూడునెలలుగా ఆయన జిల్లాకు సేవలందిస్తున్నారు. గత 30ఏళ్లలో ఇలాంటి అవకాశం లభించిన అతికొద్దిమంది ఎస్పీల్లో నాగేంద్రకుమార్ ఒకరు. ఇలా రెండేళ్లకు పైబడి జిల్లా ఎస్పీగా గతంలో జితేందర్, సుధీర్బాబులు పనిచేశారు. పోలీసుల సంక్షేమానికి కృషి మహబూబ్నగర్ క్రైం: జిల్లా ఎస్పీగా డి.నాగేంద్రకుమార్ 2012 జూలై5న బాధ్యతలు చేపట్టారు. అప్పటికే జిల్లాలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. అయినా జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆయన ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వరుసగా జరిగిన మునిసిపిల్, గ్రామపంచాయతీ, సాధారణ ఎన్నికల్లో ఎటువంటి సంఘవ్యతిరేక చర్యలు చోటుచేసుకోకుండా, అవినీతి అక్రమాలు జరగకుండా ప్రజలు ప్రశాంతంగా తమ ఓటుహక్కును వినియోగించుకునే విధ ంగా పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీనికితోడు అంతర్ జిల్లా దొంగలముఠాను పట్టుకోవడంలో ఆయన సఫలీకృతులయ్యారు. పోలీసుల సంక్షేమానికి ఎనలేని కృషిచేశారు. ముఖ్యంగా పోలీసుల అమరుల కుటుంబాలకు ఇళ్లస్థలాలు కేటాయించడంతో పాటు నిర్మాణానికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే విధంగా కృషిచేశారు. -
వారానికి ఐదు రోజులు యూనిఫాం తప్పనిసరి
* అదనపు డీజీలు మొదలుకొని ఎస్పీల వరకు.. * డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాలు సాక్షి,హైదరాబాద్: ఇకపై వారానికి ఐదు రోజుల పాటు యూనిఫాంను తప్పనిసరిగా ధరించాలని తమ హెడ్క్వార్టర్స్లోని అధికారులకు రాష్ట్ర డీజీపీ అనురాగ్శర్మ సోమవారం ఆదేశించారు. రాష్ట్ర విభజన అనంతరం డీజీపీ కార్యాలయంలోని కొందరు అధికారులు మినహా మిగతా వారు యూనిఫాం ధరిం చి రాకపోవడం డీజీపీ దృష్టికి వచ్చింది. అదనపు డీజీలు మొదలుకుని ఎస్పీ స్థాయి అధికారుల వరకు సివిల్ దుస్తుల్లోనే కా ర్యాలయానికి రావడం వలన క్రమశిక్షణ దెబ్బతింటున్నదని ఆ యన భావించినట్లు తెలిసింది. దీంతో ఇకపై సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు యూనిఫాంను తప్పని సరిగా ధరించి రావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
డీజీపీ కార్యాలయం విభజన పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన డెడ్లైన్ దగ్గర పడుతుండడంతో పోలీసుశాఖలో రెండు రాష్ట్రాల డీజీపీ కార్యాలయాల ఏర్పాటుపై ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం డీజీపీ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీనకు, లక్డీకాఫూల్లోని రాష్ట్ర సీఐడీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ డీజీపీనకు కేటాయించాలని నిర్ణయించారు. అంతేకాకుండా పక్కనే ఉన్న హైదరాబాద్ రేంజ్ డీఐజీ కార్యాలయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయానికే కేటాయించారు. రాష్ర్ట గవర్నర్ సలహాదారు సయ్యద్ సలావుద్దీన్తో మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ ప్రతిపాననను అందజేశారు. ఈనెల 15 లోగా కీలకమైన పోలీసు శాఖను రెండుగా విభజించాలనే లక్ష్యంతో పోలీసు ఉన్నతాధికారులున్నారు. ఇక ఏసీ గాడ్స్లోని సీఐడీ సైబర్క్రైమ్ కార్యాలయాన్ని ఎపీకి కేటాయించడంతోపాటు పక్కనే మరో భవనాన్ని కూడా అద్దెకు తీసుకుని ఈ విభాగానికి కేటాయించాలని నిర్ణయించారు. లక్డీకాపూల్లోని ఇంటెలిజెన్స్ కార్యాలయాన్ని రెండు రాష్ట్రాలకు కేటాయించారు. ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోనే తెలంగాణ సీఐడీ కార్యాలయంతోపాటు మరి కొన్ని పోలీసు కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. యూసుఫ్గూడలోని ఎపీఎస్పీ సాయుధ పటాలం ప్రధాన కార్యాలయం శౌర్యభవన్ను రెండు రాష్ట్రాలకు కేటాయించారు. రెడ్హిల్స్లోని రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ప్రధాన కార్యాలయాన్ని రెండుగా విభజించారు. వీటిని పరిశీలించిన డీజీపీ నేతృత్వంలోని అధికారుల బృందం చివరికి ఈ నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి తెలియచేసింది. దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
తెలంగాణాలో బందోబస్తుకు మరి కొందరు అధికారులు
హైదరాబాద్: తెలంగాణాలో బుధవారం జరిగే తొలి విడత పోలింగ్ బందోబస్తు ను పర్యవేక్షించడానికి కొందరు సీనియర్ ఐపిఎస్ అధికారులను కూడా నియమిస్తు డీజీపీ బి.ప్రసాదరరావు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో హైదరాబాద్నగర కమిషనరేట్ పరిధిలో గోవింద్సింగ్, వేణుగోపాలకృష్ణ, వివి శ్రీనిశ్రీనివాసరావు, టి.యోగానంద్లు బందోబస్తును పర్యవేక్షిస్తారు. కరీంనగర్ జిల్లాకు వినయ్జ్రంన్రే, మెదక్ జిల్లాకు సివివి ఎస్కె రాజు, సైబరాబాద్లో శ్రీకాంత్, మహబూబ్నగర్ లో కె.వంకటేశ్వరరావు, నల్లగొండ జిల్లాకు రవిచంద్ర, రంగారెడ్డి జిల్లాకు త్రివిక్రమ్ వర్మ, అదిలాబాద్ జిల్లాకు వెంకట్రామ్రెడ్డి, కరీంనగర్ జిల్లాకు రంజిత్కుమార్, వరంగల్,ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలో యాంటి నక్సలైట్ టీమ్ల పర్యవేక్షణకు చంద్రశేఖర్రెడ్డిలు బందోబస్తులో భాగంగా పర్యవేక్షిస్తారని డీజీపీ కార్యాలయం తెలిపింది. -
రెండు రాష్ట్రాల డీజీపీలు ఒకేచోట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోనే రెండు రాష్ట్రాల డీజీపీలు కొనసాగనున్నారు. అలాగే ప్రస్తుతం హైదరాబాద్లో గల రాష్ర్టస్థాయి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విభాగాధిపతుల కార్యాలయాల్లోనే రెండు రాష్ట్రాలకు చెందిన కార్యాలయాలు కొనసాగుతాయి. ఉమ్మడి రాజధాని గ్రేటర్ హైదరాబాద్లో ఇరు రాష్ట్రాలకు భవనాల కేటాయింపు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఇందుకు సంబంధించిన కమిటీ చైర్మన్గా ఉన్న శ్యాంబాబు హైదరాబాద్లోని 179 విభాగాధిపతులతో సమావేశాలను దశల వారీగా శుక్రవారంతో పూర్తి చేశారు. ఉమ్మడి రాజధానిలో ప్రభుత్వ కార్యాలయ భవనాలు ఇరు రాష్ట్రాలకు కేటాయించే అధికారం రాష్ట్ర గవర్నర్ నర్సింహన్కు ఉంది. ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోనే కొన్ని అంతస్తులను తెలంగాణ డీజీపీ కార్యాలయానికి, మరి కొన్ని అంతస్తులను ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయానికి కేటాయించనున్నారు. అలాగే పోలీసు శాఖకు చెందిన అన్ని కార్యాలయాలను ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విభజించనున్నారు. సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాకును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంగా కేటాయించాలని నిర్ణయించిన నేపథ్యంలో భద్రతాపరంగా దాని ఎదురుగా గల పాడుపడిన జి-బ్లాకును కూల్చి వేయాలని పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే రాష్ట్రపతి పాలన సమయంలో ఎటువంటి నిర్మాణాలను కూల్చివేతకు అనుమతించబోనని నర్సింహన్ స్పష్టం చేశారు.