Digitization
-
రైతులకూ ఆధార్ తరహా యూనిక్ ఐడీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ఆధార్ తరహాలో యూనిక్ కోడ్ (యూసీ) ఐడీలను కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్ మొదటి వారం నుంచి మార్చి నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ప్రాజెక్ట్ మార్గదర్శకాలను విడుదల చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటలైజేషన్ దిశగా.. వ్యవసాయ రంగాన్ని పూర్తి గా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో ప్రతి రై తుకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. పైలట్ ప్రాజెక్ట్గా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చేపట్టిన ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయా లని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో భూ యజమానులతోపాటు కౌలు రైతులకు సైతం వీటిని జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్–అగ్రిస్టాక్ ప్రాజెక్ట్ పేరిట అమలు చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ యూనిట్ (ఎస్పీఎంయూ)ను ఏర్పాటు చేశారు. వెబ్ల్యాండ్ డేటా ఆధారంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల రిజిస్ట్రీని రూపొందిస్తారు. అనంతరం 14 అంకెల విశిష్ట సంఖ్యతో ఆధార్ తరహాలోనే ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు జారీ చేస్తారు. యూనిక్ ఐడీ ద్వారానే సంక్షేమ ఫలాలు ఈ కార్డుల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు కలగనున్నాయి. ఇక నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలు ఈ యూనిక్ కోడ్ను తప్పనిసరి కానుంది. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు, పంటను మార్కెట్లో విక్రయించుకునేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. దీనిని కిసాన్ క్రెడిట్ కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రుణార్హత, రుణ బకాయిలు, పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.అగ్రి సెన్సెస్–2019 ప్రకారం లెక్క ఇదీవ్యవసాయ, ఉద్యాన, పట్టు పంటల సాగు విస్తీర్ణం: 67.44 లక్షల హెక్టార్లు వెబ్ల్యాండ్ డేటా ప్రకారం రైతులు: 76,06,943 మంది 2.5 ఎకరాలలోపు ఉన్న రైతులు: 52,01,870 మంది 2.5 నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న రైతులు: 15,62,042 మంది 5 ఎకరాలకు పైబడి ఉన్న రైతులు: 8,43,031 మంది కౌలు రైతులు: 16.50 లక్షల మంది సెంటు భూమి కూడా లేని కౌలుదారులు: 810 లక్షల మంది దేవదాయ, అటవీ భూముల సాగుదారులు: 1.50 లక్షల మంది -
భారత్లోనూ ‘సింగపూర్లు’ సృష్టిస్తాం
సింగపూర్: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక మోడల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సింగపూర్ ప్రగతి ప్రయాణం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భారత్లోనూ ‘సింగపూర్లు’ సృష్టించాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేర్చాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. సింగపూర్ను పరిపాలిస్తున్న నాలుగో తరం నాయకత్వంలో దేశం మరింత వేగంగా అభివృద్ధికి పథంలో దూసుకెళ్తుందన్న విశ్వాసం ఉందని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. సింగపూర్ కేవలం ఒక భాగస్వామ్య దేశం మాత్రమే కాదని, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సింగపూర్ భాగస్వామ్యంతో భారత్లోనూ సింగపూర్లు సృష్టిస్తామన్నారు. నాలుగు నెలల క్రితం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లారెన్స్ వాంగ్కు మోదీ అభినందనలు తెలియజేశారు. వేగం పుంజుకున్న పరస్పర సహకారం భారతదేశ ‘తూర్పు కార్యాచరణ విధానం’లో సింగపూర్ పాత్ర చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి, డిజిటలైజేషన్, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధ(ఏఐ), అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆరోగ్య సంరక్షణ, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో సింగపూర్తో కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చామన్నారు. తాము నమ్ముతున్న ప్రజాస్వామ్య విలువలు భారత్, సింగపూర్ను అనుసంధానిస్తున్నాయని వివరించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం గత పదేళ్లలో రెండు రెట్లకుపైగా పెరిగిందన్నారు. భారత్లో సింగపూర్ పెట్టుబడులు మూడు రెట్లు పెరిగి, 160 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. రెండు దేశాల ప్రజల మధ్య యూపీఐ చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి వచి్చందని తెలిపారు. త్వరలో తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రం భారత్–సింగపూర్ మధ్య సంబంధాలకు 2025లో 60 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ వేడుకలను రెండు దేశాలు కలిసి నిర్వహించుకోవాలని, ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని మోదీ సూచించారు. మొట్టమొదటి తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాన్ని త్వరలో సింగపూర్లో ప్రారంభించబోతున్నామని చెప్పారు. భారత్లో పర్యటించాలని లారెన్స్ వాంగ్ను మోదీ ఆహా్వనించారు. 4 అవగాహనా ఒప్పందాలు సెమీ కండక్టర్ల తయారీ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, సింగపూర్ తీర్మానించుకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ సమీక్షించారు. సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్, సింగపూర్ నాలుగు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్లో పెట్టుబడులు పెట్టండి ప్రధాని మోదీ గురువారం ప్రఖ్యాత సింగపూర్ కంపెనీల సీఈఓలతో సమావేశమయ్యారు. తమ దేశంలో వైమానిక, ఇంధనం, మౌలిక సదుపాయాలు, తయారీ, నైపుణ్యాభివృద్ధితోపాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు, వ్యాపార అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని సూచించారు. సెమీ కండక్టర్ కంపెనీ సందర్శన సింగపూర్లో ప్రఖ్యాతిగాంచిన సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్ను నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ కలిసి సందర్శించారు. భారత్–సింగపూర్ మధ్య సంబంధాల్లో సెమీ కండక్టర్లు, టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యం ఉందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉగ్రవాదం పెను ముప్పుప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఉగ్రవాదం పెద్ద ముప్పుగా మారిందని భారత్, సింగపూర్ ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఈ మేరకు ఇరు దేశాలు గురువారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఎక్కడ ఉన్నా సరే అంతం చేయాల్సిందేనని పేర్కొన్నాయి. ఇందుకోసం అన్ని దేశాలు అంకితభావంతో కృషి చేయాలని సూచించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో నౌకలు, గగనతలంలో విమానాల స్వేచ్ఛా విహారానికి అవకాశం ఉండాలని ఇరుదేశాలు ఉద్ఘాటించాయి. -
ఫైనాన్స్ డిజిటలైజేషన్తో కొత్తతరం బ్యాంకింగ్
ముంబై: ఫైనాన్స్లో డిజిటలైజేషన్ తదుపరి తరం బ్యాంకింగ్ సంస్కరణలకు మార్గం సుగమం చేస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. తక్కువ వ్యయాలతో అందరికీ ఫైనాన్షియల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఫైనాన్స్ డిజిటలైజేషన్ దోహదపడుతుందని వివరించారు. 2023–24 కరెన్సీ అండ్ ఫైనాన్స్ రిపోర్ట్ (ఆర్సీఎఫ్)లో ఆయన ముందుమాట రాస్తూ, ఫ్లాగ్షిప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగదారుల రిటైల్ చెల్లింపుల విధానాన్ని విప్లవాత్మకంగా మార్చిందని పేర్కొన్నారు. ఈ కామర్స్ విభాగ పురోగతినీ ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లావాదేవీలను వేగవంతంగా, ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తేలిగ్గా నిర్వహించేలా చేసిందని గవర్నర్ చెప్పారు. డిజిటల్ కరెన్సీ రంగంలో ఈ– రూపాయి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల(సీబీడీసీ) ప్రయోగాత్మక అమల్లో రిజర్వ్ బ్యాంక్ ముందంజలో ఉందని అన్నారు. ఓపెన్ క్రెడిట్ ఎనేబుల్మెంట్ నెట్వర్క్, డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్, ఫ్రిక్షన్లెస్ క్రెడిట్ కోసం పబ్లిక్ టెక్ ప్లాట్ఫారమ్ వంటి కార్యక్రమాలతో డిజిటల్ రుణ వ్యవస్థ శక్తివంతంగా మారుతోందన్నారు. బ్యాంకులు అలాగే నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలతో (ఎన్బీఎఫ్సీ) లెండింగ్ సరీ్వస్ ప్రొవైడర్లుగా ఫిన్టెక్లు సహకరిస్తున్నాయని అన్నారు. ఇదే సమయంలో ఇప్పుడు డిజటలైజేషన్ ఎదుర్కొంటున్న సైబర్ సెక్యూరిటీ, డేటా గోప్యత, డేటా బయాస్, వెండర్, థర్డ్–పార్టీ రిస్్కలు వంటి సవాళ్లను పరిష్కరించాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్ అన్నారు. మరోవైపు డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజలో ఉందని నివేదిక పేర్కొంది. భారత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పదో వంతు వాటా కలిగి ఉందని 2026 నాటికి ఇది ఐదవ వంతుగా పురోగమిస్తుందని నివేదిక అంచనావేసింది. ఆర్బీఐ ప్రస్థానంపై వెబ్ సిరీస్ రిజర్వ్ బ్యాంక్ తన తొంభై ఏళ్ల ప్రస్థానంపై అయిదు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ను రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. ఒక్కో ఎపిసోడ్ 25–30 నిమిషాల నిడివితో ఈ సిరీస్ సుమారు మూడు గంటలు ఉంటుంది. దీన్ని జాతీయ టీవీ ఛానల్స్, ఓటీటీ ప్లాట్ఫాంలలో ప్రసారం చేసే యోచన ఉన్నట్లు సిరీస్ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ జారీ చేసిన పత్రంలో ఆర్బీఐ తెలిపింది. ఎకానమీలో రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యత, దాని కార్యకలాపాలు మొదలైన వాటి గురించి అవగాహన కలిగించే విధంగా ఈ సిరీస్ ఉంటుంది. 1935లో ఏర్పాటైన ఆర్బీఐ ఈ ఏడాది ఏప్రిల్లో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. -
మోదీ 2.0
పెద్ద నోట్ల రద్దు. దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం బారులు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)తో యావద్దేశం ఒకే మార్కెట్గా మారిన వైనం. సామాన్యులు, వ్యాపారస్తులు, చిన్న పరిశ్రమలను తీవ్ర ఇబ్బందుల పాలు చేసిన రెండు నిర్ణయాలు. అయినా వాటి ఉద్దేశాన్ని ప్రజలకు వివరించడంలో మోదీ సఫలమయ్యారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడమే గాక దేశ ఆర్థిక పురోగతి కోసం దూర దృష్టితో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటైజేషన్కు ఊతమిచ్చారు. దాంతో 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని మరింత మెజారిటీతో ఆశీర్వదించారు. కాంగ్రెస్ వరుసగా రెండోసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది... బీజేపీతో నేరుగా తలపడుతున్న రాష్ట్రాలు మినహా మిగతా చోట్ల ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కశీ్మర్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, కేరళల్లో వాటితో సీట్ల సర్దుబాటు చేసుకుంది. యూపీలో ఎవరూ ఊహించని విధంగా బీఎస్పీ, ఎస్పీ కలసి పోటీ చేశాయి! విపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మళ్లీ ఎన్డీఏదే అధికారమన్న మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనాలే నిజమయ్యాయి. బీజేపీ బలం 282 నుంచి 303కు పెరిగింది! ఓట్ల శాతం కూడా 31 నుంచి 37.3 శాతానికి పెరిగింది. ఎన్డీఏకు 353 మంది ఎంపీలు సమకూరారు. కాంగ్రెస్ 44 సీట్ల నుంచి కనాకష్టంగా 52 దాకా ఎగబాకింది. పెద్ద నోట్ల రద్దు 2016 నవంబర్ 8 రాత్రిని దేశ ప్రజలు ఎన్నిటికీ మర్చిపోలేరు! ప్రధాని మోదీ టీవీ ముందుకొచ్చి రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు సంచలనాత్మక ప్రకటన చేశారు. నల్లధనం, నకిలీ నోట్ల ఏరివేత, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతివ్వాలని కోరారు. వాటి స్థానే కొత్త రూ.500తో పాటు రూ.2,000 నోట్లు తేనున్నట్టు చెప్పారు. నిరీ్ణత గడువులోపు పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరి పడ్డ ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు! ఇంతా చేసి... రూ.15.41 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయగా దాదాపుగా ఆ మొత్తమంతా (రూ.15.3 లక్షల కోట్లు) తిరిగి బ్యాంకుల్లోకి రావడం గమనార్హం.విశేషాలు... ⇒ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశీ్మర్లోని పుల్వామాలో జరిగిన జైషే ఉగ్ర సంస్థ దాడిలో ఏకంగా 40 మంది జవాన్లు ప్రాణాలు విడిచారు. దీనికి మోదీ సర్కారు సర్జికల్ స్ట్రయిక్స్తో బదులిచి్చంది. పాక్లోని బాలాకోట్లోని ఉగ్ర స్థావరాలను మన వాయుసేన విమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. ఈ ఉదంతం బీజేపీకి బాగా కలిసొచి్చంది. ⇒ ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎన్డీఏ సర్కారు ధ్వంసం చేస్తోందన్న విమర్శలు కాంగ్రెస్, ఇతర విపక్షాలకు పెద్దగా లాభించలేదు. ప్రతి పేద మహిళకు ఏడాదికి రూ.72,000, ఇల్లులేని వారందరికీ ఇంటి స్థలం, ఉచిత వైద్య పరీక్షలు, ఔషధాలు, ఉచిత వైద్యం వంటి కాంగ్రెస్ హామీలను జనం పట్టించుకోలేదు. ⇒ సీబీఐ, కాగ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్వీర్యమయ్యాయని, విపక్షాలవి కుటుంబ రాజకీయాలని, కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యమే లేదని మోదీ చేసిన విమర్శలు ప్రజలను ఆకట్టుకున్నాయి.జీఎస్టీ2017 దాకా ఒకే ఉత్పత్తి, ఒకే సేవపై దేశవ్యాప్తంగా రకరకాల ధరలుండేవి. రాష్ట్రానికో రీతిలో వ్యాట్, ఎక్సైజ్ సుంకాలు దీనికి కారణం. రాష్ట్రాల స్థాయిలో పన్నుల ఎగవేతా ఎక్కువగా ఉండేది. వీటికి పరిష్కారంగా దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్, ఒకే పన్ను సంకల్పంతో మోదీ సర్కారు 2017 జూలై 1 నుంచి జీఎస్టీని అమల్లోకి తెచి్చంది. తొలుత పెద్దగా ప్రభావం కనిపించకున్నా కొన్నేళ్లుగా పన్నుల ఆదాయం భారీగా పెరుగుతోంది.17వ లోక్సభలో పార్టీల బలాబలాలు (మొత్తం సీట్లు 543) పార్టీ స్థానాలు బీజేపీ 303 కాంగ్రెస్ 52 డీఎంకే 24 వైఎస్సార్సీపీ 22 టీఎంసీ 22 శివసేన 18 జేడీ(యూ) 16 బిజూ జనతాదళ్ 12 బీఎస్పీ 10 టీఆర్ఎస్ 9 స్వతంత్రులు 51 ఇతరులు 4 – సాక్షి, నేషనల్ డెస్క్ -
షరతులు నచ్చితేనే రుణం..
ఎన్నో అవసరాలకు రుణాలు తీసుకోవడం నేడు సర్వ సాధారణంగా మారింది. డిజిటైజేషన్ కారణంగా కోరుకున్నంత రుణం నిమిషాల వ్యవధిలోనే బ్యాంక్ ఖాతాకు జమ అవుతోంది. అవసరంలో ఉన్న వారు రుణం వస్తే చాలన్నట్టు, మిగిలిన ముఖ్యమైన విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనివల్ల తర్వాతి కాలంలో పడే భారాన్ని చూసి ఆందోళన చెందే పరిస్థితి. షరతులు, నియమ, నిబంధనలు, ఫీజుల గురించి తెలుసుకోకుండానే రుణ ఒప్పందంపై నిస్సంకోచంగా సంతకాలు చేయకూడదు. రుణానికి సంబంధించి కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్/ముఖ్య విషయాల సమాహారం)ను తప్పకుండా చదవాలి. దాన్ని అర్థం చేసుకున్న తర్వాతే బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీతో అంగీకారానికి రావాలి. కేఎఫ్ఎస్ను రుణ గ్రహీతలకు తప్పకుండా అందజేయాలంటూ ఆర్బీఐ తన నియంత్రణ పరిధిలోని అన్ని ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఒక విధంగా రుణ గ్రహీతకు రుణంపై కళ్లు తెరిపించేదే కేఎఫ్ఎస్. కేఎఫ్ఎస్తో రుణ గ్రహీత నిర్ణయం సులభంగా మారుతుంది. ఒక బ్యాంక్ ఇస్తున్న రుణ ఆఫర్తో పోలిస్తే మరో బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ రుణ ఆఫర్లో ఏది మెరుగైనదో తేల్చుకోవచ్చు. కేఎఫ్ఎస్ అందించకపోయినా, ఒకవేళ కేఎఫ్ఎస్లో వైరుధ్యాలు ఉన్నా వాటిని రుణదాత దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఫిర్యాదును 30 రోజుల్లో పరిష్కరించకపోతే, పరిష్కారం సహేతుకంగా లేకపోతే ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్మన్ను సంప్రదించొచ్చు. ఒకవేళ డిజిటల్ రుణం అయితే దానికి కూలింగ్ ఆఫ్ పీరియడ్ అని ఉంటుంది. ఆ కాలంలో రుణ గ్రహీత తనకు మంజూరైన రుణాన్ని వెనక్కి తిప్పికొట్టొచ్చు. దీనికి ఎలాంటి పెనాలీ్టలు పడవని గార్గ్ వివరించారు. కేఎఫ్ఎస్ అంటే..? 2023 నవంబర్ 15న ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ ఎన్బీఎఫ్సీ బజాజ్ ఫైనాన్స్కు చెందిన ‘ఈకామ్’, ‘ఇన్స్టా ఈఎంఐ కార్డ్’ రుణ ఉత్పత్తులను తక్షణం నిలిపివేయాలని కోరింది. కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్)ను రుణ గ్రహీతలకు బజాజ్ ఫైనాన్స్ అందించకపోవడంతో ఆర్బీఐ ఈ చర్యలకు దిగింది. కేఎఫ్ఎస్ అన్నది ఒక డాక్యుమెంట్ (పత్రం). ఇందులో రుణానికి సంబంధించి కీలక సమాచారం అంతా ఉంటుంది. నిజానికి రుణ ఒప్పందంలో (లోన్ అగ్రిమెంట్) అన్ని వివరాలు ఉన్నప్పటికీ, అందులోని పదజాలం అర్థం చేసుకోవడం అందరికీ సులభం కాదు. కీలక వివరాలన్నింటినీ సులభంగా అర్థమయ్యేలా కేఎఫ్ఎస్ చెబుతుంది. అందుకే దీన్ని కీలక సమాచార పత్రంగా చెబుతారు. రుణంపై వడ్డీ రేటు ఎంత, షరతులు, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చార్జీలు, నిర్ణీత కాలం కంటే ముందే సంబంధింత రుణాన్ని తీర్చివేస్తే విధించే చార్జీలు, రుణ వాయిదా చెల్లింపుల్లో ఆలస్యం అయితే పడే పెనాల్టీ చార్జీలు.. ఇలా రుణానికి సంబంధించి సమగ్ర వివరాలు అందులో వెల్లడించడం బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల బాధ్యత. సమస్యల పరిష్కార యంత్రాంగాన్ని కూడా అందులో తెలియజేయాలి. కేఎఫ్ఎస్ పారదర్శకతను తీసుకొస్తుంది. కీలక వివరాలన్నీ ఉండడంతో, రుణ గ్రహీత అన్నీ తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలు కలుగుతుంది. అందుకే దీన్ని రుణదాతలు అందరికీ అందించాలంటూ ఆర్బీఐ ఆదేశాలు తీసుకొచ్చింది. ‘‘కేఎఫ్ఎస్ అంటే రుణానికి సంబంధించి అస్థిపంజరం వంటిది. రుణం తీసుకునే వ్యక్తి అన్ని కీళ్లను తెలుసుకోవాలి, వంపులు, కదలికలను తెలుసుకోవాలి’’అని సింఘానియా అండ్ కో పార్ట్నర్ రాజీవ్ శర్మ వివరించారు. డిజిటల్ రుణాలకు సంబంధించి కేఎఫ్ఎస్ మరింత కీలకం. ఎందుకంటే రుణ ప్రక్రియలో ఒకటికి మించిన పారీ్టలు భాగస్వాములై ఉంటాయి. ఏమి చూడాలి..? రుణ కాల వ్యవధి, రుణానికి సంబంధించి నెలవారీ చెల్లించాల్సిన మొత్తం (ఈఎంఐ) గురించి కేఎఫ్ఎస్లో స్పష్టంగా ఉంటుంది. రుణానికి అనుబంధంగా ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలని బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీ కోరుతోందా? అన్నది కేఎఫ్ఎస్లో పరిశీలించుకోవాలని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. ముఖ్యంగా రుణానికి సంబంధించి చెబుతున్న వడ్డీ రేటు వార్షికమేనా? అన్నది చూడాలి. రుణం చెల్లించకపోతే ఎదురయ్యే పరిణామాలు గురించి, అన్ని రకాల చార్జీల గురించి తెలుసుకోవాలి. రుణ గ్రహీత కోరితే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కేఎఫ్ఎస్ కాపీ, రుణ డాక్యుమెంట్లను ఈమెయిల్కు పంపిస్తాయని పరిజిత్ గార్గ్ చెబుతున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా రుణం తీసుకుంటున్నట్టు అయితే, రుణ వివరాల పేజీ నుంచే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని శర్మ సూచించారు. నెట్బ్యాంకింగ్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆదిల్ శెట్టి తెలిపారు. పారదర్శకత కోసం.. ‘‘చారిత్రకంగా చూస్తే రుణ వ్యయాల విషయంలో పారదర్శకత ఉండేది కాదు. వడ్డీ రేటునే ప్రముఖంగా ప్రకటనల్లో పేర్కొనడం కనిపించేది. తక్కువ వడ్డీ రేటుకు వస్తుందని రుణం తీసుకున్న తర్వాతే.. వివిధ రకాల ఫీజుల భారం తెలిసొచ్చేది. పారదర్శకత లేకపోవడం వల్ల వారు వివిధ రుణ ఉత్పత్తులను పోల్చుకుని, వాస్తవ రుణ వ్యయాల గురించి అర్థం చేసుకోలేకపోయేవారు’’అని మై మనీమంత్ర ఎండీ రాజ్ ఖోస్లా పేర్కొన్నారు. అన్ని రకాల చార్జీల గురించి కేఎఫ్ఎస్లో పేర్కొనడం పారదర్శకత, వినియోగదారు అనుకూల రుణ వాతావరణానికి దారితీస్తుందన్నారు. ‘‘ఇప్పటికైతే రుణాలపై వడ్డీ రేటు, ఇతర ఫీజులు, చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ చార్జీలు తదితరమైనవి ఉండేవి. కేఎఫ్ఎస్ను అన్ని రకాల రిటైల్, ఎంఎస్ఎంఈ రుణాలకు విస్తరించాం. రుణాల పంపిణీలో పారదర్శకత పెంపు, కస్టమర్లు తగిన నిర్ణయం తీసుకునేందుకు ఇది వీలు కలి్పస్తుంది’’అని ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. వడ్డీ రేటు వేరు, ఏపీఆర్ వేరు ఈ రెండింటి మధ్య ఉన్న బేధాన్ని రుణ గ్రహీతలు అర్థం చేసుకోవాలి. యాన్యువల్ పర్సంటేజ్ రేట్ (ఏపీఆర్) అంటే అన్ని చార్జీలు కలిపినది. ఉదాహరణకు రూ.లక్ష రుణాన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) నుంచి 36 నెలల కాలానికి 18 శాతం రేటుపై తీసుకున్నారని అనుకుందాం. అంటే నెలవారీ ఈఎంఐ రూ.1,500 అనుకుంటాం. కానీ కాదు. ఈ రుణం ఏపీఆర్ 20.16 శాతం అవుతుంది. అంటే చెల్లించాల్సిన ఈఎంఐ రూ.1,680 అవుతుంది. ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, ఆరంభంలో విధించే పలు చార్జీలు అన్నీ కలసి ఈ స్థాయికి చేరింది. రుణంపై నికర వడ్డీ రేటుకు అన్ని రకాల చార్జీలు కలిపి ఏపీఆర్ ఎంత అన్నది కేఎఫ్ఎస్లో పేర్కొనాలన్నది ఆర్బీఐ ఆదేశం. అయితే, రుణ వాయిదా ఆలస్యంగా చెల్లిస్తే విధించే ఆలస్యపు రుసుము, కంటింజెంట్ చార్జీలు ఇందులో భాగంగా ఉండవని బ్యాంక్ బజార్ ఆదిల్ శెట్టి తెలిపారు. ఈఎంఐ బౌన్స్ చార్జీలు, రుణాన్ని ముందస్తుగా చెల్లించేట్టు అయితే విధించే చార్జీలు కూడా ఏపీఆర్లో కలసి ఉండవు. ఇవి తెలుసుకున్న తర్వాతే.. ► చెల్లింపుల సామర్థ్యం: ఎంత రుణం కావాలన్న స్పష్టత ఒక్కటీ ఉంటే సరిపోదు. తీసుకునే ఆ రుణానికి నెలవారీ ఎంత మేర చెల్లించగలరు? అన్నది చాలా కీలకమైన అంశం అవుతుంది. దీని ఆధారంగానే కాల వ్యవధిని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. తక్కువ కాలవ్యవధిని ఎంపిక చేసుకుంటే ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం ఎంపిక చేసుకుంటే ఈఎంఐ తగ్గుతుంది. దీనివల్ల చెల్లించాల్సిన వడ్డీ మొత్తం కూడా పెరుగుతుంది. బ్యాంకుల మధ్య వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు తదితర చార్జీలను పోల్చుకున్న తర్వాతే ఏ బ్యాంక్ నుంచి తీసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి. ఎందుకంటే 0.5% వ్యత్యాసమున్నా 4–5 ఏళ్ల చెల్లింపుల్లో చెప్పుకోతగ్గంత తేడా వస్తుంది. తమ ఆదా యంలో అన్ని రుణాలకు చేసే చెల్లింపులు 40% మించకుండా చూసుకోవాలి. ► ఆదాయంలో అప్పుల రేషియో: బ్యాంక్లు రుణం ఇచ్చే ముందు రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు, ఆదాయంలో అప్పుల రేషియోని చూస్తాయి. ఆదాయంలో అప్పులకు చేసే చెల్లింపులు 43 శాతం మించి ఉంటే అప్పుడు చెల్లింపుల్లో రిస్క్ ఉన్నట్టు అవి భావించొచ్చు. దాంతో రుణ దరఖాస్తు తిరస్కరణ లేదంటే అధిక వడ్డీ రేటును విధించొచ్చు. ► క్రెడిట్ స్కోర్: 750 అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటే దాన్ని ఉత్తమమైనదిగా పరిగణిస్తాయి బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు. అంతేకాదు రుణం సులభంగా, వేగంగా లభిస్తుంది. డిమాండ్ చేసి వడ్డీ రేటులో కొంత తగ్గింపు ప్రయోజనాన్ని సైతం పొందొచ్చు. ► ముందస్తు చెల్లింపులు: రుణాన్ని నిర్ణీత కాలానికి ముందే లేదంటే నెలవారీ వీలున్నప్పుడల్లా అదనపు చెల్లింపులు చేసుకుంటూ వెళితే త్వరగా తీరిపోతుంది. దీనివల్ల వడ్డీ రూపంలో చెప్పుకోతగ్గంత ఆదా చేసుకోవచ్చు. కాకపోతే చాలా సంస్థలు మందుస్తు రుణ చెల్లింపులపై 2–4 శాతం చార్జీ విధిస్తుంటాయి. ఈ తరహా చార్జీ అమలు చేయని సంస్థ నుంచి తీసుకోవడం అనుకూలం. మెరుగైన అవగాహన ‘‘కస్టమర్లలో అవగాహన పెంచేందుకు ఇదొక అవకాశం. రుణానికి సంబంధించి అన్ని ముఖ్యమైన వివరాలను తెలియజేయడం వల్ల రుణగ్రహీత అనుభవం మెరుగ్గా ఉంటుంది. ఎంఎస్ఎంఈ రుణ గ్రహీతలు మెరుగైన నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుంది’ ’అని గోద్రేజ్ క్యాపిటల్ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు. వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణాలు, డిజిటల్ రుణాలకే లోగడ కేఎఫ్ఎస్ తప్పనిసరి. ఇకపై అన్ని రిటైల్ రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలకు ఇది ఇవ్వాల్సి ఉంటుంది. ‘‘రుణాలపై అసలు వ్యయాలు ఎంత మేర ఉన్నాయనేది రుణ గ్రహీతలకు దీనివల్ల తెలుస్తుంది. చెప్పకుండా విధించే చార్జీలకు కళ్లెం వేస్తుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం రుణ గ్రహీతల్లో రుణ ఎకోసిస్టమ్ పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది.’’అని ఫైనాన్సింగ్ ప్లాట్ఫామ్ ‘వెలాసిటీ’ వ్యవస్థాపకుడు, సీఈవో అభిరూప్ మేధేకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కేఎఫ్ఎస్ రిటైల్ రుణ గ్రహీతలకు మేలు చేస్తుంది. కార్పొరేట్ సంస్థలకు కేఎఫ్ఎస్తో ప్రత్యేకంగా అవసరం ఉండదు. ఎందుకంటే ఆయా సంస్థల వద్ద ఆర్థిక, న్యాయ నిపుణులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. కనుక బ్యాంకుల ఒప్పంద పత్రాలను అవి సమగ్రంగా సమీక్షించుకోగలవు. కానీ, చిన్న సంస్థలు, వ్యక్తులకు ఇది కష్టమైన పనే అవుతుంది. వ్యక్తులు అయితే బ్యాంక్ మార్కెటింగ్ సిబ్బంది చెప్పిందే నమ్మాల్సిన పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే కేఎఫ్ఎస్ను వ్యక్తులు, ఎంఎఎస్ఎంఈ రుణాలకు ఆర్బీఐ తప్పనిసరి చేసింది. -
నెట్టింట.. ప్రభుత్వ బడులు!
సాక్షి, అమరావతి: కనీస సదుపాయాల లేమి.. శిథిలమైన గదులు.. ఇది ఒకప్పటి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కార్పొరేట్ సదుపాయాలతో అవి కళకళలాడుతున్నాయి. గతంలో విద్యార్థులకు టెక్ట్స్ బుక్స్ కూడా లేని పరిస్థితుల నుంచి బూట్లు, బెల్టు, టై, నోటు పుస్తకాలతో సహా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సగర్వంగా చదువుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల(ఐఎఫ్పీ)ను అందుబాటులోకి తేవడంతో డిజిటల్ వైపు అడుగులు వేసింది. ఇప్పుడు వాటిని సమర్థంగా వినియోగించి, పేదింటి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అన్ని ప్రభుత్వ బడులను ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిరంతరాయంగా డిజిటల్ బోధన అందించేందుకు, సమకాలీన ప్రపంచ పోకడలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అన్ని పాఠశాలలను డిజిటలైజేషన్ చేయనున్నారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పి స్తోంది. ఇప్పటికే 8,700 పాఠశాలలకు నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా, ఇందులో 3,700 ఉన్నత పాఠశాలలు, మరో 5 వేలు ప్రాథమిక పాఠశాలలున్నాయి. వచ్చే రెండు, మూడు నెలల్లో అన్ని ప్రభుత్వ బడులకు నెట్ సదుపాయం కల్పించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కల్పన విభాగం పనిచేస్తోంది. 100 ఎంబీపీఎస్ వేగంతో నెట్ సదుపాయం ఈ ఏడాది ప్రారంభంలో 4,800 ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి, +2 వరకు సెక్షన్కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్పీ స్క్రీన్లను అందుబాటులోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ బోధనను అందుబాటులోకి తెచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లో 60మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను అందించి, టోఫెల్ బోధన చేపట్టారు. రెండో దఫాలో 32వేల ఐఎఫ్పీలు, 22వేల స్మార్ట్ టీవీలను పాఠశాలలకు అందించింది. వీటితోపాటు విద్యార్థులకు మెరుగైన బోధన, ఉత్తమ కంటెంట్ను అందించేందుకు, 4 డీటీహెచ్ (ఈ విద్య) చానెళ్లు, 5 దీక్ష–ఏపీ చానెళ్లు, ఏపీ ఈ–పాఠశాల పోర్టల్ ద్వారా కూడా కంటెంట్ను పంపిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులకు టోఫెల్ బోధన అందిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు, మ్యాథ్స్ ల్యాబ్స్ పాల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ను అందుబాటులోకి తెచ్చి విద్యపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఇకపై విద్యార్థులకు ఫ్యూచర్ టెక్ పాఠాలను సైతం బోధించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మేనేజ్మెంట్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), లార్జ్ లెర్నింగ్ మాడ్యూల్స్, 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వనున్నారు. పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే ప్రభుత్వం దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేసింది. ప్రతి పాఠశాలలోను డిజిటల్ లెర్నింగ్ అంతరాయం లేకుండా కొనసాగేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని సైతం కల్పిస్తోంది. హైసూ్కళ్లకు ఏపీ ఫైబర్నెట్, బీఎస్ఎన్ఎల్ ద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో బ్రాడ్బ్యాండ్ సదుపాయాన్ని, ప్రాథమిక పాఠశాలలకు జియో ద్వారా నెట్ అందిస్తోంది. అందుకు అవసరమైన 5జీ సిమ్ కార్డులతో వైఫై రౌటర్లను సరఫరా చేస్తోంది. -
డేటా సెంటర్లపై 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో (జనవరి–జూన్) దేశీ డేటా సెంటర్ (డీసీ) మార్కెట్లోకి 21.4 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ ఒక నివేదికలో తెలిపింది. డిజిటలీకరణ వేగవంతం అవు తుండటం, టెక్నాలజీ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, 5జీ..కృత్రిమ మేథ.. బ్లాక్చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి అధునాతన టెక్నాలజీల వినియోగం పెరుగుతుండటం తదితర అంశాల కారణంగా భారత్లో డేటా సెంటర్ల పరిశ్రమ పురోగమనం కొనసాగుతోందని వివరించింది. డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతుండటం, టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో పాటు నియంత్రణపరమైన తోడ్పాటు వంటి అంశాల కారణంగా భారత్లోని డేటా సెంటర్లు పెట్టుబడులకు ఆకర్షణీయంగా మారాయని తెలిపింది. 2020 –2023 మధ్య కాలంలో భారతీయ డీసీ సామర్ధ్యం రెట్టింపయ్యిందని, ఈ ఏడాది ప్రథమార్ధంలో 880 మెగావాట్లకు చేరిందని పేర్కొంది. 2023 ఆఖరు నాటికి ఇది 1,048 మెగావాట్లకు చేరగలదని సీబీఆర్ఈ నివేదిక వివరించింది. 2018 – 2023 ప్రథమార్ధం మధ్యకాలంలో భారత డీసీ మార్కెట్లోకి మొత్తం 35 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు పేర్కొంది. ఇందులో హైపర్స్కేల్ డీసీల వాటా 89 శాతంగా ఉండగా, కో–లొకేషన్ డీసీల వాటా 11% ఉంది. రాష్ట్రాలవారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్కి పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. -
సొంత ఫిన్టెక్ ఏర్పాటులో ఎల్ఐసీ
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) తాజాగా సొంత ఫిన్టెక్ విభాగాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను మదింపు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ సిద్ధార్థ మహంతి తెలిపారు. మరోవైపు, కార్యకలాపాల డిజిటలీకరణ కోసం ప్రాజెక్ట్ డైవ్ (డిజిటల్ ఇన్నోవేషన్, వేల్యూ ఎన్హాన్స్మెంట్)ను చేపట్టామని, దీనికి కన్సల్టెంట్ను నియమించుకున్నామని పేర్కొన్నారు. కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా కస్టమర్లు తమ ఇంటి దగ్గరే మొబైల్ ఫోన్తో అన్ని సరీ్వసులను పొందగలిగేలా వివిధ ప్రక్రియలను సులభతరం చేస్తున్నట్లు మహంతి పేర్కొన్నారు. -
భూ రికార్డుల డిజిటలైజేషన్లో ఏపీ ఆదర్శం
సాక్షి, విశాఖపట్నం: భూ సంబంధిత వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టిర్కీ, సంయుక్త కార్యదర్శి సోన్మోని బోరా ప్రశంసించారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల మోడ్రనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన విశాఖలోని ఓ హోటల్లో శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో ప్రస్తుతం అమలు చేస్తున్న భూ విధానాలు, రికార్డుల నవీకరణ, ఇతర ప్రక్రియల గురించి ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు వివరించారు. దేశమంతటికీ ఒకే వేదికగా మాతృభూమి పేరుతో పైలట్ జియో పోర్టల్ను ఆవిష్కరించారు. అజయ్ టిర్కీ మాట్లాడుతూ సాంకేతికత సహకారంతో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలు భూ రికార్డులను నవీకరించి మాతృభూమి పోర్టల్కు అనుసంధానం చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల భూ రికార్డులను నవీకరించాలని, రాజ్యాంగంలో గుర్తించిన అన్ని భాషల్లోకి అనువదించాలని సూచించారు. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్తోపాటు అర్హత కలిగిన కొన్ని రాష్ట్రాలకు, జిల్లాలకు భూమి సమ్మాన్ ప్లాటినం సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రదర్శించిన ప్రజంటేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారు. ప్రధానంగా జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా చేపడుతున్న రీ సర్వే వల్ల భవిష్యత్తులో బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని టిర్కీ పేర్కొన్నారు. రీ సర్వే, ల్యాండ్ రికార్డుల నవీకరణ, మోడరన్ రికార్డు రూముల నిర్వహణ, భూ సంబంధిత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని ప్రకటించారు. సోన్మోని బోరా మాట్లాడుతూ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ప్రాజెక్టుల్లో భాగంగా భూ సంవాద్–6 ప్రాజెక్టు విజయవంతమయ్యేలా అందరూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న భూ సంబంధిత విధానాల గురించి ఏపీ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగం కమిషనర్ సిద్ధార్థ జైన్, జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం గురించి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతా«దికారులు, ఎన్ఐసీ, ఐటీ టీం అధికారులు, విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
చదువులపై ‘ఈనాడు’ చిత్తు కథ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలకు ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన విద్యపై ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు మరోసారి విషం కక్కారు. పేదల చదువులపై పూర్తి వక్రీకరణలు, అభూత కల్పనలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈనాడు పత్రికలో కథనాన్ని ప్రచురించారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడంలో భాగంగానే ఈ కథనం ప్రచురించారు. ఈ కథనంలోని డొల్లతనాన్ని, రామోజీ ఏడుపుగొట్టుతనాన్ని ప్రభుత్వం బట్టబయలు చేసింది. ♦ బెస్ట్ అవైలబుల్ పథకంలో ఎంపిక చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు అందేదని ఈనాడు రాసింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం పలు పథకాల ద్వారా విద్యార్థులకు మేలు చేస్తోంది. అత్యుత్తమ విద్యను అందిస్తోంది. ఒక్క అమ్మ ఒడి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థి తల్లికీ ఏడాదికి రూ.15 వేలు అందిస్తోంది. ఇవికాక ప్రభుత్వ విద్యా రంగంలో ప్రతి విద్యార్థి మీద ఏడాదికి అదనంగా చేస్తున్న ఖర్చు రూ.30 వేల పైనే. ♦ బెస్ట్ అవైలబుల్ పథకం కొందరికే అందేది. అంటే మిగిలిన విద్యార్థులకు నాసిరకం చదువులు అందినా పర్వాలేదనేది ఈనాడు అభిప్రాయమా? ఇది పేదలు, ఎస్సీ, ఎస్టీలు బడుగు, బలహీనవర్గాల వారికి అన్యాయం చేసినట్టుగా కాదా? అందరికీ నాణ్యమైన విద్య అందడం ఈనాడుకి ఇష్టంలేదా? ♦ మంచి చదువులు ఏ ఒక్కరికో కాదు.. అందరికీ సమానంగా అందాలన్నదే ఈ ప్రభుత్వ ధ్యేయం. అందుకే కార్పొరేట్ స్కూళ్లకంటే మెరుగ్గా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతోంది. మన బడి నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. తొలి దశలో రూ.3,699 కోట్లతో 15,715 స్కూళ్లలో సదుపాయాలు కల్పించింది. రెండో దశలో మరో 22,344 స్కూళ్లను రూ.8,000 కోట్లతో బాగుచేస్తోంది. ఇందులో ఇప్పటికే రూ.2,949 కోట్లు ఖర్చు చేసింది. నాడు – నేడు పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న మౌలిక సదుపాయాలు ప్రైవేటు స్కూళ్లలో కూడా లేవన్నది నిజం. ♦ పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం విప్లవాత్మక మార్పుగా అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చింది. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకే కాకుండా, ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్న వారికీ వర్తిస్తోంది. అమ్మ ఒడి ద్వారా ఈ నాలుగేళ్లలో సుమారు 45 లక్షల మంది తల్లులు అందుకున్న మొత్తం రూ.26,067.28 కోట్లు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే ఏడాదికి రూ.100 కోట్లు ఎక్కడ? ఒక్క అమ్మ ఒడి ద్వారా ఈ నాలుగేళ్ల కాలంలో ఇచ్చిన రూ.26,067.28 కోట్లు ఎక్కడ? ఈ పథకం ద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదల పిల్లలు ఎంతగానో లబ్ధిపొందారు. ♦ విద్యా రంగంలో ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల వల్ల 14,28,568 మంది ఎస్సీ విద్యార్థులు, 5,19,116 మంది ఎస్టీ విద్యార్థులు లబ్ధి పొందారు. మరోవైపు 10వ తరగతి, ఇంటర్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 22,761 మంది విద్యార్థులను జగనన్న ఆణిముత్యాల పేరుతో ప్రభుత్వం సత్కరించింది. ♦ జగనన్న గోరుముద్ద ద్వారా ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోంది. దీనికి రాగిజావను కూడా ఇటీవల అదనంగా చేర్చింది. ఈ నాలుగేళ్లలో కేవలం జగనన్న గోరుముద్ద పథకం మీద పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.4,286.7 కోట్లు. ఇలాంటి ఆహారాన్ని ఉచితంగా ఏ ప్రైవేటు పాఠశాలలైనా అందిస్తున్నాయా? ♦ బడికి వెళ్లే పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద వారికి కావాలి్సన యూనిఫాం, పుస్తకాలు, షూ, బెల్టు, సాక్సులు, ఇంగ్లిష్ డిక్షనరీ, వర్క్స్ బుక్స్ లాంటివాటిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. దీని కోసం నాలుగేళ్లలో చేసిన ఖర్చు అక్షరాలా రూ.3,366.53 కోట్లు. చంద్రబాబు అమలు చేసిన స్కీమ్లో ప్రైవేటు పాఠశాలలు ఇలాంటివి అందించాయా? ♦ అందరికీ ఇంగ్లిష్ మీడియం, మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల కాన్సెప్టు, బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, టోఫెల్లో శిక్షణ, పరీక్షలు ఇవన్నీ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఈ సదుపాయాలన్నీ ఉన్నాయా? ♦ కార్పొరేట్ పాఠశాలలు పోటీ పడలేనంతగా ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నత స్థాయిలో ఉంచే మరో అంశం డిజిటలీకరణ. గ్లోబల్ సిటిజన్లను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దీనిపై గణనీయంగా ఖర్చు చేస్తోంది. ఆరు, ఆపై తరగతుల వారికి ప్రతి తరగతి గదిలో ఒక ఐఎఫ్పీ ప్యానెల్ ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో రూ.440 కోట్లతో 30,213 తరగతి గదుల్లో ఐఎఫ్పీల ఏర్పాటు చేసింది. రెండో దశలో మరో రూ.520 కోట్లు ఖర్చు చేస్తోంది. 5వ తరగతి లోపు 10,038 తరగతి గదుల్లో తొలిదశలో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది. ఇలాంటి ఏర్పాటు ఉన్న ప్రైవేటు స్కూళ్లు ఎన్నో ఈనాడు చెప్పగలదా? ♦ డిజిటల్ విద్యలో భాగంగా 4 నుంచి 10వ వతరగతి వరకు సుమారు 16 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ కంటెంట్ను ప్రభుత్వం అందిస్తోంది. అంతేకాక 8వ తరగతి చదువుకునే ప్రతి విద్యార్థికి బైజూస్ కంటెంట్తో ట్యాబ్ను ఉచితంగా ఇస్తోంది. ఇందుకోసం 5.18 లక్షల మంది విద్యార్థులకు ఏడాదికి రూ.686 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇలా సౌకర్యాలు, డిజిటల్ ఎడ్యుకేషన్ ఉన్న ప్రైవేటు పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? లక్షల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వీటిద్వారా మేలు పొందడంలేదా? ఇలా గడచిన 50 నెలల్లో ప్రభుత్వ విద్యా రంగం మీద చేసిన ఖర్చు అక్షరాలా రూ.68,607 కోట్లు. విద్యార్ధులకు మేలు జరిగేలా చర్యలు బెస్ట్ అవైలబుల్ స్కీంలో చేరిన విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 9, 10 తరగతులు వారిని అదే పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. మిగిలిన విద్యార్థులు వారు కోరుకున్న ప్రభుత్వ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరే అవకాశాన్ని కల్పించింది. వీరికి ప్రభుత్వ పరంగా మిగిలిన విద్యార్థుల మాదిరిగానే అన్ని పథకాలు, సదుపాయాలు కల్పిస్తోంది. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనేది పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వ పరిశీలనలో తేలింది ఏంటంటే బెస్ట్ అవైలబుల్ స్కూళ్లుగా గుర్తించిన చాలా పాఠశాలల్లో కనీస ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు లేవు. వరుసగా ఐదేళ్లపాటు పదో తరగతిలో 90 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధించాలి. అందులో 50% విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఫలితాలు సాధించిన స్కూళ్లే ఈ స్కీంకు అర్హత పొందుతాయి. ఈ నిబంధనలేవీ ఎంపిక చేసిన స్కూళ్లలో లేవు అని ప్రభుత్వం వివరించింది. -
సుప్రీంకోర్టులో ఉచిత వైఫై సేవలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు డిజిటైజేషన్ దిశగా మరో కీలక అడుగు పడింది. అత్యున్నత న్యాయస్థానంలోని మొదటి అయిదు కోర్టు రూముల్లో వైఫై సేవలను అందుబాటులో తెచ్చినట్లు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం ప్రకటించారు. లాయర్లు, కక్షిదారులు, మీడియా వ్యక్తులు, ఇతర సందర్శకులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ఇనిషియేటివ్లో భాగంగా తీసుకువచ్చిన ఈ వెసులుబాటును ‘ ఇఐ గిజీఊజీ‘ లాగిన్ చేయడం ద్వారా ఉపయోగించుకోవచ్చునన్నారు. ‘అన్ని కోర్టు రూములు ఇకపై పుస్తకాలు, పేపర్లు కనిపించవు. అయితే దీనర్థం, పుస్తకాలు, కాగితాలపై అస్సలు ఆధారపడబోమని కాదు’అని సీజేఐ పేర్కొన్నారు. కాగా, వేసవి సెలవుల అనంతరం సోమవారం సుప్రీంకోర్టు తిరిగి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభించింది. -
RBI Annual Report 2022-23: కట్టలు తెంచుకున్న కరెన్సీ!
ముంబై: చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ అలాగే పరిమాణం రెండూ మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో (2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చి) వరుసగా 7.8 శాతం, 4.4 శాతం పెరిగాయి. అయితే 2021–22లో ఈ పెరుగుదల (2020–21తో పోల్చి) వరుసగా 9.9 శాతం, 5 శాతంగా ఉన్నాయి. మొత్తంగా పరిస్థితి చూస్తే, డిజిటలైజేషన్ మార్గంలో ఎన్ని చర్యలు తీసుకున్నా వ్యవస్థలో బ్యాంకు నోట్ల విలువ, పరిమాణం పెరగడం గమనార్హం. అయితే పెరుగుదల శాతాల్లో తగ్గడమే ‘చెప్పుకోవడానికి’ కొంత ఊరటనిచ్చే అంశం. ఆర్బీఐ ఈ మేరకు విడుదల చేసిన వార్షిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ♦ విలువ పరంగా చూస్తే, రూ. 500, రూ. 2,000 నోట్ల వాటా 31 మార్చి 2023 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువలో 87.9 శాతం. 31 మార్చి 2022లో ఇది 87.1 శాతం. ♦ రూ. 500 డినామినేషన్ అత్యధికంగా 37.9% వాటాను కలిగి ఉంది. తరువాతి స్థానంలో రూ. 10 డినామినేషన్ బ్యాంక్ నోటు ఉంది. ఈ నోట్లు 2023 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంక్ నోట్లలో రూ.10 నోట్ల పరిమాణం 19.2%గా ఉన్నాయి. ♦ 2023 మార్చి చివరి నాటికి రూ. 25,81,690 కోట్ల విలువ కలిగిన మొత్తం రూ. 500 డినామినేషన్ నోట్లు 5,16,338 లక్షలు. 2022 మార్చి చివరి నాటికి రూ. 500 నోట్ల సంఖ్య 4,55,468 లక్షలు. అంటే వ్యవస్థలో రూ.500 నోట్లు వార్షికంగా పెరిగాయన్నమాట. ♦ ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లలో రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 డినామినేషన్లు ఉన్నాయి. చెలామణిలో ఉన్న నాణేలు 50 పైసలు, రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 డినామినేషన్లను కలిగి ఉంటాయి. ♦ 2022–23 మధ్యకాలంలో ఆర్బీఐ లైవ్–పైలట్ ప్రాతిపదికన ఈ–రూపాయిని కూడా ప్రారంభించింది. 2023 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న ఈ–రూపాయి–హోల్సేల్ అలాగే ఈ–రూపాయి–రిటైల్ విలువలు వరుసగా రూ. 10.69 కోట్లు రూ. 5.70 కోట్లుగా ఉన్నాయి. ♦ 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు నోట్ల ఇండెంట్, సరఫరాలు రెండూ గత సంవత్సరంతో (2021–22) పోలిస్తే 1.6 శాతం స్వల్పంగా పెరిగాయి. రూ.2000 నోట్ల ప్రింటింగ్కు ఇండెంట్ లేదు. రూ.2000 నోట్ల సంగతి ఇదీ... ఆర్బీఐ నివేదిక ప్రకారం రూ.2,000 నోట్ల అంశాన్ని పరిశీలిస్తే, 2023 మార్చి చివరి నాటికి రూ.3,62,220 కోట్ల విలువ చేసే 4,55,468 లక్షల నోట్లు వ్యవస్థలో ఉన్నాయి. పరిమాణం పరంగా చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు 2023 మార్చి చివరినాటికి చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 1.3 శాతానికి తగ్గాయి. 2022 మార్చి నాటికి ఈ నోట్లు 1.6 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా కూడా నోట్లు 2022 మార్చిలో మొత్తం నోట్లలో 13.8 శాతం ఉంటే, 2023 మార్చి నాటికి 10.8 శాతానికి పడిపోయింది. తగ్గుతున్న మోసాల ‘విలువ’..: 2022–23లో బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య 13,530కి చేరుకుంది. అయితే విలువ మాత్రం దాదాపు సగానికి తగ్గి రూ. 30,252 కోట్లుగా ఉంది. కార్డ్, ఇంటర్నెట్ డిజిటల్ పేమెంట్లలోనే మోసాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. -
డిజిటలైజేషన్, మొండిబకాయిలపై దృష్టి
న్యూఢిల్లీ: బ్యాంకులు డిజిటలైజేషన్పై దృష్టి సారించాలని అలాగే ఒత్తిడితో కూడిన రుణాలపై (మొండిబకాయిలకు దారితీసే అవకాశమున్న ఖాతాలు) నిఘా ఉంచాలని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ సూచించారు. ఆర్థిక అక్షరాస్యత, అన్ని వర్గాలను ఫైనాన్షియల్ చట్రంలోకి తీసుకురావడంపై కూడా బ్యాంకులు దృష్టి పెట్టాలన్నారు. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జోనల్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, బ్యాంకులు నిరర్థక ఆస్తులను సకాలంలో గుర్తించాలి. బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా మొండిబకాయిలకు తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్స్) చేయాలి. టెక్నాలజీ వినియోగంపై పూర్తి స్థాయి దృష్టి సారింపు అవసరం. భవిష్యత్తు అంతా దీనిపైనే ఆధారపడి ఉంటుంది. డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. -
డిజిటల్ అగ్రగామిగా భారత్!
ఆధార్, ఏకీకృత చెల్లింపు వ్యవస్థలు, డేటా పంపిణీ... ఈ మూడూ కలిసి భారత్ను ‘ప్రపంచ డిజిటల్ అగ్రగామి’గా నిలబెట్టాయని ‘స్టాకింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ : లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ డిజటల్ జర్నీ’ అనే శీర్షికతో తాజాగా విడుదల చేసిన కార్యాచరణ పత్రంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వెల్లడించింది. ఈ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించడం ద్వారానే భారత్ మహమ్మారి కాలంలో నిరుపేద కుటుంబాలకు చెప్పుకోదగిన వాటాతో మద్దతును వేగంగా అందివ్వగలిగిందని, డిజిటల్ అకౌంట్ అగ్రిగేటర్ ద్వారా ఆర్థిక సేవల సులభ సంప్రాప్యత నుంచి దాదాపు 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు లబ్ధి పొందారని, దీన్నింకా వేగంగా తమ సొంతం చేసుకుంటున్నారని ఆ పత్రం ప్రశంసించింది. అదే సమయంలో భారత్లో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇప్పటికీ లేదని ఐఎమ్ఎఫ్ పత్రం పేర్కొంది. పౌరుల గోప్యతను కాపాడటానికి డేటా ఉల్లంఘనలకు పాల్పడిన వారిని జవాబుదారీగా చేయడానికి దృఢమైన డేటా పరిరక్షణ చట్టం రూపకల్పన తప్పనిసరి అని సూచించింది. మానవ జీవితాలను, ఆర్థిక వ్యవస్థను మార్చి వేస్తున్న ప్రపంచ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్ర క్చర్ని భారతదేశం నిర్మించిందని, ఇది అనేక దేశాలు అనుసరించాల్సిన పాఠం అవుతుందని తాజా ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. ‘ఇండియా స్టాక్’ అనేది భారత్లో సాధారణంగా ఉపయోగిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐలు) సెట్కి సామూహిక పేరు. దీంట్లో మూడు విభిన్నమైన పొరలు ఉంటున్నాయి. అవి, 1. ప్రత్యేక గుర్తింపు (ఆధార్), 2. కాంప్లిమెంటరీ చెల్లింపు వ్యవస్థలు (ఏకీకృత చెల్లింపు ఇంటర్ఫేస్, ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్, ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీస్), 3. డేటా పంపిణీ (డిజీలాకర్, అకౌంట్ అగ్రిగేటర్). ఇవన్నీ కలిసి అనేక పబ్లిక్, ప్రైవేట్ సేవలకు.. ఆన్ లైన్, కాగిత రహిత, నగదు రహిత, గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే డిజిటల్ సంప్రాప్య తను కల్పించాయని ‘స్టాకింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ : లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ డిజటల్ జర్నీ’ అనే శీర్షికతో కూడిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కార్యాచరణ పత్రం తెలిపింది. ఈ మదుపు ప్రయో జనం భారత్ వ్యాప్తంగా అనుభవంలోకి రావడమే కాకుండా కోవిడ్ 19 మహమ్మారి కాలంలో దేశానికి ఎంతో సేవచేసిందని ఆ పత్రం వెల్లడించింది. ప్రభుత్వ ఖజానా నుంచి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంటుకు నేరుగా సామాజిక భద్రతా చెల్లింపుల పంపిణీని సులభతరం చేయడంలో ఆధార్ సహక రించిందని అది పేర్కొంది. దీనివల్ల లీకేజీలను తగ్గించడం, అవినీతిని అరికట్టడం, విస్తృతిని పెంచడం, సమర్థంగా కుటుంబాల వద్దకు చేరు కోవడానికి ఒక సాధనాన్ని అందించడంలో ఇది సహకరించింది అని వ్యాఖ్యానించింది. విస్తృతంగా డిజిటల్ చెల్లింపులు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర ప్రభుత్వ సంస్కరణల కారణంగా 2021 మార్చి వరకు జీడీపీలో 1.1 శాతం వ్యయాన్ని ఆదా చేసినట్లు భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించడం ద్వారా భారత్ మహమ్మారి కాలంలో నిరుపేద కుటుంబాలకు చెప్పుకోదగిన వాటాతో మద్దతును వేగంగా అందించగలిగింది. మహమ్మారి ఆవహించిన తొలి నెలల కాలంలో నిరుపేద కుటుంబాల్లో 87 శాతం కనీసం ఒక లబ్ధి పథకాన్నయినా అందుకున్నారు. సృజనాత్మక ఆవిష్కరణను, పోటీని పెంచడానికి, మార్కెట్లను విస్తరించడానికి, ప్రభుత్వ ఆదాయ సేకరణను పెంచుకోవడానికి, ప్రభుత్వ వ్యయ సమర్థతను మెరుగుపర్చుకోవడానికి ఇండియా స్టాక్ ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడింది. డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వవ్యాప్తమయ్యాయి. దేశంలో అన్ని చెల్లింపుల లావాదేవీల్లో యూపీఐ చెల్లింపులు 68 శాతంగా ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల ఉపయోగం చిన్న వర్తకుల కస్టమర్ పునాదిని విస్తరించింది, వారి నగదు ప్రవాహాన్ని నమోదు చేసి, ద్రవ్య సంప్రాప్యతను మెరుగుపర్చింది. పెరిగిన ప్రభుత్వ రాబడి 2021 ఆగస్టులో మొదటిసారి ప్రారంభించి నది మొదలు ‘అకౌంట్ అగ్రిగేటర్’ ద్వారా ఆర్థిక సేవల సులభ సంప్రాప్యత నుంచి దాదాపు 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు లబ్ధి పొందారని, దీన్ని వేగంగా తమ సొంతం చేసుకుంటున్నారని ఆ పత్రం తెలిపింది. డిజిటలీకరణ అనేది ఆర్థిక వ్యవస్థ అధికారికీకరణను కూడా బలపర్చింది. 2017 జూలై నుంచి 2022 మార్చి మధ్యలో జీఎస్టీ కోసం 88 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వ రాబడులు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ సర్వీస్ ప్రొవిజన్ను కూడా క్రమబద్ధీకరించారు. ఉదాహరణకు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్లను ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా పౌరులు పొందవచ్చు. అదేవిధంగా, ఇండియా స్టాక్ ‘నో యువర్ కస్టమర్’ నిబంధ నలను డిజిటలీకరించి, సులభతరం చేసింది. ఖర్చు లను తగ్గించింది. ఇ–కేవైసీని ఉపయోగిస్తున్న బ్యాంకులు సమ్మతి ఖర్చును 12 అమెరికా డాలర్ల నుంచి 6 అమెరికన్ సెంట్లకు తగ్గించుకున్నాయి. మహిళలే లక్ష్యంగా జన్ధన్ ఖర్చుల్లో ఈ తగ్గుదల తక్కువ ఆదాయం ఉన్న క్లయింట్లు కొత్త ఉత్పత్తుల అభివృద్ధి కోసం సేవలను మరింతగా ఆకర్షిస్తూ, లాభాలు ఆర్జించడానికి వీలు కల్పించింది. ఆర్థిక అభివృద్ధిలో అందర్నీ భాగస్వామ్యం చేయడానికి సంబంధించి ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ ఆ పత్రం ఇలా చెప్పింది. ‘‘తక్కువ ఖర్చుతో కూడిన బ్యాంక్ ఖాతాకు అవకాశం కల్పించడం వల్ల బ్యాంక్ ఖాతా లతో వ్యక్తుల కవరేజీ రెట్టింపు అయింది. జన్ ధన్ పథకం ఆర్థికంగా అర్హత లేనివారిని, ప్రత్యేకించి గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకుంది. ఈ పథకం కింద 2022 ఆగస్టు నాటికి 46 కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలను పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తెరిచారు. డిజిటల్ బ్యాక్బోన్ ను ఉపయోగించడం వల్ల భారత్ తన వ్యాక్సిన్ పంపిణీని శరవేగంగా చేయగలడమే కాదు... భారీస్థాయి అంతర్గత వలసలు వంటి సవాళ్లను అధిగమించింది’’ అని ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. కో–విన్ లో పొందుపర్చిన టెక్నాలజీని ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జమైకాలలో కూడా అమలు పర్చారు. ఇది ఆయా దేశాల వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను సులభతరం చేసింది. డేటా పరిరక్షణ తప్పనిసరి సవాళ్ల విషయానికి వస్తే, భారత్లో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇప్పటికీ లేదని ఐఎమ్ఎఫ్ పత్రం పేర్కొంది. పౌరుల గోప్యతను కాపాడ టానికి; కంపెనీలు, ప్రభుత్వాలు విచక్షణారహితంగా డేటా సేకరించడాన్ని నిరోధించడానికి; డేటా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీలు, ప్రభు త్వాలను జవాబుదారీగా చేయడానికి దృఢమైన డేటా పరిరక్షణ చట్ట రూపకల్పన తప్పనిసరి. సముచితమైన రీతిలో డేటా నిర్వహణకు, సైబర్ భద్రత రంగంలో తగిన మదుపులు పెట్టడానికి ఇది చాలా అవసరం. సామాజిక సహాయం మరింత దృఢంగా, స్వీకరించదగినదిగా చేసే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విషయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) కూడా సహకరిస్తుంది. ఉదాహరణకు, రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ పథకాల మధ్య డేటా పంపిణీకి ఆధార్ను ఉపయోగించవచ్చని ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. చివరగా, డీపీఐ (డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)ని ప్రభావితం చేయడానికి కాలక్రమాలు, నాణ్యత, సాధారణ ప్రభుత్వ ద్రవ్య నివేదికల కవరేజీ వంటివాటిని భారత్ గణనీయంగా మెరుగుపర్చుకుంది. అదే సమయంలో తన పౌరుల కోసం ప్రభుత్వ రంగ జవాబుదారీతనాన్ని మెరుగుపర్చుకోవడంలో ద్రవ్యపరమైన పారదర్శకతను విస్తరించడం అనేది కీలక అంశంగా ఉంటోంది. – ఎమ్. ముఖేశ్ రాణా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా -
క్రెడిట్కార్డ్... అవసరాలకు భరోసా!
న్యూఢిల్లీ: దేశంలో క్రెడిట్ కార్డ్ రుణ పరిమాణం గణనీయంగా పెరుగుతోంది. 2023 జనవరిలో వార్షికంగా వినియోగం 29.6 శాతం పెరిగి, రూ. 1,86,783 కోట్లుగా నమోదయ్యింది. 2022 జనవరితో (13 నెలల్లో) పోల్చితే 32 శాతంపైగా పెరుగుదల (రూ. 1,41,254 కోట్ల నుంచి రూ. 1,86,783 కోట్లు) నమోదుకావడం గమనార్హం. ఈ స్థాయిలో రుణాల విలువ నమోదుకావడం ఒక రికార్డు. డిజిటలైజేషన్పై విశ్వాసం పెరగడం ప్రత్యేకించి కోవిడ్ అనంతరం కాలంలో వినియోగ అవసరాలు దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెలువరించిన ఒక సర్వే గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు... ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో (2022 ఏప్రిల్–2023 జనవరి) రుణ పరిమాణం 20 శాతం పెరిగింది. ఒక్క జూన్లో రికార్డు స్థాయిలో 30.7 శాతం పురోగతి కనబడింది. ► 2023 జనవరి చివరినాటికి వివిధ బ్యాంకులు దాదాపు 8.25 కోట్ల క్రెడిట్ కార్డులు జారీ చేశాయి. ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల జారీలో మొదటి ఐదు స్థానాలూ ఆక్రమించాయి. ► రోనా కష్టకాలం నేపథ్యంలో 2021 మధ్యలో క్రెడిట్ కార్డ్ వినియోగం చరిత్రాత్మక కనిష్ట స్థాయిని చూసింది. అయితే అప్పటితో పోల్చితే ఇప్పుడు పరిస్థితి ఎంతో మెరుగైంది. సంబంధిత సూచీ రికవరీ మార్గంలో పురోగమిస్తోంది. సాధారణ ఆర్థిక పరిస్థితులు నెలకొనడం, గృహ ఆదాయంపై మెరుగుదల వంటి సానుకూల సెంటిమెంట్ దీనికి నేపథ్యం. చెల్లింపుల సౌలభ్యత పలు విభాగాలు డిజిటలైజ్ అయ్యాయి. దీని ఫలితంగా కస్టమర్ల క్రెడిట్ కార్డ్ వ్యయాలు పెరిగాయి. ఆరోగ్యం, ఫిట్నెస్, విద్య, యుటిలిటీ బిల్లులు తదితర విభాగాల్లో ఖర్చు పెరగడానికి క్రెడిట్ కార్డ్ చెల్లింపుల సౌలభ్యత ఖచ్చితంగా దోహదపడింది. క్రెడిట్ కార్డ్ వినియోగంలో నెలవారీ వృద్ధి ధోరణి పటిష్టంగా ఉంది. గడచిన కొన్ని నెలలుగా క్రెడిట్ కార్డ్ వ్యయాల్లో స్థిరమైన వృద్ధి ఉంది. ముఖ్యంగా గత 11 నెలల నుండి క్రెడిట్ కార్డ్ వ్యయాలు స్థిరంగా రూ. 1 లక్ష కోట్లు పైబడి ఉండడం ఇక్కడ గమనించాల్సిన అంశం. డిసెంబర్ 2022లో మొత్తం క్రెడిట్ కార్డ్ వ్యయాల్లో ఈ–కామర్స్ వాటా 60 శాతంగా ఉండడం మరో విశేషం. భవిష్యత్తులోనూ క్రెడిట్ కార్డ్ వినియోగం మరింత పుంజుకుంటుందని విశ్వసిస్తున్నాం. – రామమోహన్ రావు, ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈఓ వ్యక్తిగత రుణాలు పెరుగుతున్నాయ్ ఈ రోజుల్లో తనఖా రుణాలు, వ్యాపార రుణాలు వంటి సురక్షిత రుణాలు వెనుకబడుతుండగా, వ్యక్తిగత రుణ విభాగం పెరుగుతోంది. ఇప్పు డే ఉపాధి రంగంలోకి ప్రవేశిస్తున్న తాజా గ్రాడ్యుయేట్లు, వారి ముందువారి కంటే ఆర్థికంగా ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారు. అలాగే వారి క్రెడిట్ స్కోర్లను అధికంగా కొనసాగించడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నారు. మరిన్ని ఫిన్టెక్ కంపెనీలు ఆన్లైన్లో తమ కార్యకలాపాలను పెంచుకోవడం, సమాచారాన్ని పంచుకోవడంతో యువకులు మరింత సమాచారంతో క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లను చేస్తున్నారు. మహమ్మారి సమయంలో క్రెడిట్ కార్డులు ప్రధానంగా కిరాణా కొనుగో లు, యుటిలిటీ బిల్లులు చెల్లించడానికి ఉపయోగించడం జరిగింది. తిరిగి మళ్లీ ఆయా విభాగాల్లో క్రెడిట్ కార్డ్ వ్యయాలు పెరుగుతున్నాయి. వీ స్వామినాథన్, ఆండ్రోమెడ లోన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ -
Insurance Fraud Survey 2023: బీమాలో పెరుగుతున్న మోసాలు
న్యూఢిల్లీ: బీమా సంబంధిత మోసాలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని బీమా సంస్థలు భావిస్తున్నాయి. ఈ విధమైన మోసాల రిస్క్ నేపథ్యంలో.. చురుకైన రిస్క్ నిర్వహణ విధానం అవసరమని అవి భావిస్తున్నట్టు డెలాయిట్ సర్వే నివేదిక వెల్లడించింది. జీవిత బీమా, ఆరోగ్య బీమాలో మోసాలు పెరిగిపోవడాన్ని బీమా సంస్థలు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. డిజిటైజేషన్ పెరిగిపోవడం, కరోనా తర్వాత మారుమూల ప్రాంతాల నుంచి పనిచేస్తుండడం, నియంత్రణలు బలహీనపడడం వంటివి మోసాలు పెరిగిపోవడానికి కారణాలుగా డెలాయిట్ ‘ఇన్సూరెన్స్ ఫ్రాడ్ సర్వే 2023’ నివేదిక వెల్లడించింది. మోసాలు భారీగా పెరిగిపోయాయని సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది బీమా కంపెనీల ప్రతినిధులు చెప్పగా, మోస్తరుగా ఉన్నట్టు 10 శాతం మంది తెలిపారు. 2020 జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. బీమా సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగుల అభిప్రాయాలను డెలాయిట్ తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలు బీమా రంగంలో వేగం, మెరుగైన కస్టమర్ అనుభవం, సులభ వినియోగానికి సాయపడినట్టు డెలాయిట్ తెలిపింది. అదే సమయంలో రిస్క్లు సైతం పెరిగినట్టు పేర్కొంది. డేటా చోరీ, థర్డ్ పార్టీల కుమ్మక్కు, బీమా ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో విక్రయించడం అన్నవి బీమా రంగానికి ఆందోళనకర అంశాలుగా ప్రస్తావించింది. ఈ మోసాలను అధిగమించేందుకు వ్యూహాత్మక జోక్యం, బీమా కార్యకలాపాల నిర్వహణపై ఉన్నతస్థాయి మేనేజ్మెంట్ దృష్టి సారించడం, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసమని సూచించింది. తిరిగి ఆవిష్కరించుకోవాలి.. ‘‘భారత బీమా రంగం డిజిటల్ విప్లవం ఆరంభ దశలో ఉంది. వేగవంతమైన వ్యాపార కార్యకలాపాలు, కస్టమర్లను సొంతం చేసుకోవడం, టెక్నాలజీతో కూడిన అనుభవాన్ని అందించేందుకు ఇతర రంగాల మాదిరే బీమా పరిశ్రమ సైతం తనను తాను తిరిగి ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’’అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడర్ సంజయ్ దత్తా అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ కంపెనీ బోర్డ్, యజమాన్యానికి మోసాల నివారణ ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు 40 శాతం జీవిత బీమా, ఆరోగ్య బీమా కంపెనీల ప్రతినిధులు ఈ సర్వేలో తెలిపారు. మిగిలిన బీమా కంపెనీల ప్రతినిధులు సైతం తమ ప్రాధాన్య అంశాల్లో మోసాల నివారణ కూడా ఒకటిగా పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పటిష్టమైన మోసాల నివారణ కార్యాచరణ అవసరమని ఈ సర్వే నివేదిక ప్రస్తావించింది. -
డిజిటల్ లెండింగ్ హవా
ముంబై: ఈ దశాబ్దంలో డిజిటల్ లెండింగ్ దూసుకుపోతుందని, ఫిన్టెక్ సంస్థలు ఈ సేవలను మరింతగా వినియోగదారుల చెంతకు తీసుకెళతాయని క్రెడిట్ సమాచార సంస్థ ఎక్స్పీరియన్స్ తెలిపింది. 2030 నాటికి అన్సెక్యూర్డ్ రుణాల్లో సంప్రదాయ రుణవితరణతో పోలిస్తే డిజిటల్ రుణాలదే పైచేయి అవుతుందని ఈ సంస్థ అంచనా వేసింది. అన్సెక్యూర్డ్ చిన్న సైజు రుణాలతోపాటు, సెక్యూర్డ్ అధిక సైజు రుణాల్లో డిజిటల్ లెండింగ్ మరింత విస్తరిస్తుందని పేర్కొంది. ‘‘సంప్రదాయ రుణదాతలు సాధారణంగా ఆస్తుల తనఖాపై రుణాల్లో (సెక్యూర్డ్) అధిక వాటా కలిగి ఉంటారు. డిజిటైజేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ విభాగంలోకి సైతం ఫిన్టెక్ సంస్థలు చొచ్చుకుపోతాయి. దీంతో అవి చెప్పుకోతగ్గ మార్కెట్ వాటాను సొంతం చేసుకోగలవు’’అని ఎక్స్పీరియన్స్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఇండియా ఎండీ సాయికృష్ణన్ శ్రీనివాసన్ తెలిపారు. డిజిటల్గా సౌకర్యవంతమైన అనుభవాన్ని కస్టమర్లకు అందిస్తున్నప్పటికీ డిజిటల్ లెండింగ్ సంస్థలకు తదుపరి దశ వృద్ధి అన్నది సవాలుగా ఈ నివేదిక పేర్కొంది. డిజిటల్ లెండింగ్ విభాగంలో బడా టెక్నాలజీ సంస్థలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేసింది. రికవరీ ఏజెంట్లపై ముందే చెప్పాలి: ఆర్బీఐ డిజిటల్ లెండింగ్ సంస్థలు (డిజిటల్ వేదికల రూపంలో రుణాలిచ్చేవి) కస్టమర్లకు రికవరీ ఏజెంట్ల వివరాలను ముందే వెల్లడించాలని ఆర్బీఐ ఆదేశించింది. ‘‘ఏదైనా రుణం చెల్లింపుల్లేకుండా ఆగిపోతే, ఆ రుణం వసూలుకు ఏజెంట్ను నియమించినట్టయితే.. సంబంధిత ఏజెంట్ పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలను కస్టమర్కు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ రూపంలో తెలియజేయాలి’’అని తాజా ఆదేశాల్లో ఆర్బీఐ పేర్కొంది. డిజిటల్ లెండింగ్, రుణాల రికవరీకి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ గతేడాది చివర్లో కఠినతరం చేయడం తెలిసిందే. -
ఇండియా అవుతోంది‘డిజిటల్’
సాక్షి, అమరావతి: భారతదేశంలో డిజిటలైజేషన్ వేగంగా జరుగుతోందని, ఇది కొత్త తరహా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని నాబార్డు వెల్లడించింది. డిజటలైజేషన్ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమేనని స్పష్టంచేసింది. ‘భవిష్యత్తులో ఇండియాలో ఉద్యోగ అవకాశాలు’ పేరిట నాబార్డు విడుదల చేసిన అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా 10 కోట్ల మందికిపైగా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేశారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసింది. వివిధ రంగాల్లో డిజటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపింది. 2021లో పలు స్టార్టప్లలో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు రూ.3.53 లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టడమే దీనికి నిదర్శనమని పేర్కొంది. 2025 నాటికి దేశీయ డిజిటల్ ఎకానమీ విలువ రూ.80 లక్షల కోట్లకు చేరడమే కాకుండా 5.5 కోట్ల నుంచి 6 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మూడో తరం టెక్నాలజీతో బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలతో పాటు ఈ కామర్స్, సోషల్ మీడియా, డిజిటల్ అడ్వర్టైజింగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో భారీ మార్పులు తెచ్చిందని తెలిపింది. నాలుగో తరం టెక్నాలజీ అయిన బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా వస్తే తయారీ రంగంతో పాటు వ్యవసాయంలో పెద్ద ఎత్తున ఆటోమేషన్ జరుగుతుందని పేర్కొంది. స్వయం ఉపాధి కోవిడ్ లాక్డౌన్తో భారీగా పెరిగిన నిరుద్యోగ సమస్యను డిజిటలైజేషన్ పరిష్కరించినట్లు నాబార్డు పేర్కొంది. 2020 జనవరి నాటికి దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్య 41 కోట్లు ఉండగా కోవిడ్ దెబ్బతో 2021 జూన్ నాటికి 38.6 కోట్లకు పడిపోయిందని తెలిపింది. కోవిడ్ తర్వాత దేశీయ యువత ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని, ఒకరి కింద పని చేయడం కాకుండా నచ్చిన సమయంలో స్వతంత్రంగా పని చేసుకునే ‘గిగ్’ విధానానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలతో పాటు ఓలా, ఉబర్ వంటి ట్రావెల్ సంస్థల్లో గిగ్ వర్కర్లుగా పనిచేయడానికి యువత మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది. ఉదాహరణకు లక్ష కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన జొమాటోలో ప్రత్యక్షంగా 5,000 మంది పనిచేస్తుంటే, పరోక్షంగా 3.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పిస్తోంది. వీరంతా పని చేసిన సమయాన్ని బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ. 30,000 వరకు ఆదాయం పొందుతున్నారు. అయితే, ఈ గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని నాబార్డు చెప్పింది. వీరికి పీఎఫ్, గ్రాట్యుటీ, అనారోగ్యానికి గురైతే సెలవులు, ఎర్న్ లీవులు వంటి సామాజిక భద్రత లేదని, ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలంది. పెరుగుతున్న ఆటోమేషన్, రోబోటిక్ విధానానికి అనుగుణంగా యువత నైపుణ్యం పెంచుకోవాలని సూచించింది. ఏటా దాదాపు 1.2 కోట్ల మంది యువత డిగ్రీలు చేత పట్టుకొని వస్తున్నారని, వీరందరికీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యం కల్పించడం అతిపెద్ద సవాల్ అని ఆ నివేదిక పేర్కొంది. -
భారత టెక్నాలజీతో కోట్ల కొద్దీ ఆదా
న్యూఢిల్లీ: ఇతర దేశాలు బిలియన్ల కొద్దీ డాలర్లను ఆదా చేసుకునేందుకు డిజిటల్ చెల్లింపులు, కో–విన్, విశిష్ట గుర్తింపు సాంకేతికత వంటి భారతీయ టెక్నాలజీలు సహాయపడగలవని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. అలాగే ఆయా దేశాలు డిజిటైజేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. జీ20కి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో భారత్ .. తన వంతు బాధ్యతగా పలు దేశాలకు మన టెక్నాలజీ స్టాక్ను (ఉత్పత్తులు, సాధనాలు మొదలైనవి) ఆఫర్ చేసే ప్రణాళికలు ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇండియా స్టాక్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ విషయాలు వివరించారు. రూ. 1.28 లక్షల కోట్లకు ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 1.28 లక్షల కోట్ల స్థాయికి చేరగలవని అంచనా వేస్తున్నట్లు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఐటీ హార్డ్వేర్, విడిభాగాల తయారీదార్లు, హియరబుల్–వేరబుల్స్ ఉత్పత్తులకు కూడా కొత్తగా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వర్తింపచేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత విస్తరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొబైల్ ఫోన్ సెగ్మెంట్ అత్యంత వేగంగా ఎదుగుతున్న విభాగంగా ఉండటంతో దానిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు. 2023–24లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి రూ. 1 లక్ష కోట్లకు చేరుతుందని ఆయన పేర్కొన్నారు. -
డిజిటైజేషన్లో భారత్ భేష్
ముంబై: డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో భారత్ అసాధారణ రీతిలో కృషి చేస్తోందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల ప్రశంసించారు. టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వృద్ధి సాధనలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) గణనీయంగా తోడ్పాటునివ్వగలవని ఆయన తెలిపారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ లీడర్షిప్ సమిట్లో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల ఈ విషయాలు వివరించారు. 2025 నాటికి చాలా మటుకు అప్లికేషన్లు ..క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయాలతో రూపొందుతాయని, సుమారు 90 శాతం డిజిటల్ పని అంతా క్లౌడ్ ప్లాట్ఫామ్స్పైనే జరుగుతుందని ఆయన చెప్పారు. ‘ఈ నేపథ్యంలోనే మేము ప్రపంచవ్యాప్తంగా 60 పైగా రీజియన్లు, 200 పైగా డేటా సెంటర్లపై ఇన్వెస్ట్ చేస్తున్నాం. భారత్లో మరింతగా విస్తరిస్తున్నాం. హైదరాబాద్లో మా నాలుగో రీజియన్ ఏర్పాటు చేస్తున్నాం. క్లౌడ్ను అంతటా అందుబాటులోకి తేవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం‘ అని నాదెళ్ల చెప్పారు. భారత్లో క్లౌడ్ వినియోగానికి భారీ అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. క్లయింట్ సర్వర్ శకంతో పోలిస్తే ప్రస్తుతం అంతా మారిపోయిందని .. అన్ని వ్యాపారాల్లోనూ క్లౌడ్ వినియోగం పెరుగుతోందని నాదెళ్ల వివరించారు. 2020 ఫిబ్రవరి తర్వాత తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్న సత్య నాదెళ్ల .. హైదరాబాద్తో పాటు ఢిల్లీ, బెంగళూరు నగరాలను సందర్శించనున్నారు. కస్టమర్లు, స్టార్టప్లు, డెవలపర్లు, విద్యావేత్తలు, విద్యార్థులు మొదలైన వారితో సమావేశం కానున్నారు. కృత్రిమ మేధ హవా.. ఆటోమేషన్ గురించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ చాలా కీలకంగా మారగలదని నాదెళ్ల చెప్పారు. ‘ముందుగా మనకు భారీ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అది లేకుండా ఏఐ ప్రయోజనాలను పొందలేము. అందుకే మేము మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్ చేస్తున్నాం‘ అని ఆయన తెలిపారు. ఉద్యోగులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ ఉండటం, మార్కెట్ శక్తులు దానికి తగ్గ ప్రోత్సాహాన్ని అందిస్తుండటం వంటి అంశాలు భారత్కు సానుకూలమైనవని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. రీసెర్చ్ సంస్థ ఐడీసీ గణాంకాల ప్రకారం దేశీయంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల మార్కెట్ 2026 నాటికి 13 బిలియన్ డాలర్లకు చేరనుంది. 2021–26 మధ్య కాలంలో ఏటా 23.1 శాతం వృద్ధి నమోదు చేయనుంది. భారత్లోని టాప్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసు ప్రొవైడర్లలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజూర్ ఉన్నాయి. -
‘డిజిటల్’ స్థాయికి విద్యా రంగం
సాక్షి, అమరావతి: ఆధునిక ఆలోచనలు, పిల్లల భవిష్యత్తు పట్ల నిబద్ధత ఉన్న ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రంలో విద్యారంగం ఎంత ఆధునికతను సంతరించుకుంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెబుతుంది. ఆధునిక భావాలు, అధునాతన విద్యా విధానాలపై అవగాహన ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో విద్యారంగం తీరుతెన్నులు మరాయి. ఓ వైపు ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలను మెరుగు పరుస్తూనే, మరోవైపు ఆధునిక విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో 2022లో విద్యా రంగం మరో ముందడుగు వేసింది. చిన్నారులకు పునాది స్థాయి నుంచే అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు సాంకేతికతను, డిజిటల్ సాధనాలను సమర్థంగా వినియోగించుకొనేందుకు ప్రభుత్వం డిజిటల్ విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్ది వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకొనేలా చర్యలు తీసుకుంది. ట్యాబులు, స్మార్ట్ టీవీలు, వాల్టాప్ కంప్యూటర్లు రాష్ట్రంలో శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్ల నుంచి ఉన్నత పాఠశాలల వరకు అధునాతన పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. స్మార్ట్ టీవీలు, వాల్టాప్ కంప్యూటర్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పీ), ప్రొజెక్టర్ బేస్డ్ డీసీఆర్లను నెలకొల్పుతోంది. 50 వేలకు పైగా శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, హైస్కూల్, హైస్కూల్ప్లస్ స్కూళ్లలో ఈ డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. తరగతి గదులను డిజిటలీకరణ చేస్తున్నారు. విద్యార్థులను అత్యున్నత సామర్థ్యాలతో తీర్చిదిద్దేందుకు సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలో 1,000 స్కూళ్లకు సీబీఎస్ఈ గుర్తింపు కూడా వచ్చింది. మిగతా స్కూళ్లకూ గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టారు. డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయించి ఆధునిక ఈ–కంటెంట్ ద్వారా బోధన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10 వ తరగతి వరకు దాదాపు 32 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ సంస్థ ఈ–కంటెంట్ను కూడా ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్లలో బైజూస్ యాప్ ద్వారా ఈ– కంటెంట్ను డౌన్లోడ్ చేయించింది. దీనివల్ల స్కూళ్లలోనే కాకుండా ఇంటి వద్ద కూడా బాలలు వాటిని చదివేలా చేస్తున్నారు. ఏవైనా సందేహాలున్నా తిరిగి వెనక్కి వెళ్లి ఈ–కంటెంట్ను చూసుకొనే వెసులుబాటు ఉండటంతో విద్యార్థులు కూడా ఉత్సాహంగా చదువుకోగలుగుతున్నారు. విద్యార్థులు, టీచర్లకు ట్యాబుల పంపిణీ సీబీఎస్ఈ విధానం, డిజిటల్ విద్యలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 5.18 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు, ఆ తరగతి టీచర్లకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబులను ప్రభుత్వం ఉచితంగా అందించింది. ఒక్కో ట్యాబు ఖరీదు రూ.16 వేలు కాగా బైజూస్ కంటెంట్కు ఆ సంస్థ బయటి మార్కెట్లో ధర ఒక్కో విద్యార్థికి రూ.16 వేలు అవుతుంది. ఈలెక్కన ఒక్కో విద్యార్థికీ రూ.32 వేలు విలువైన ట్యాబు, కంటెంట్ ఉచితంగా ప్రభుత్వం అందించింది. డిసెంబర్ 21న బాపట్ల జిల్లా యడ్లపల్లి జడ్పీ హైస్కూలులో సీఎం వైఎస్ జగన్ ఈ ట్యాబుల పంపిణీ ప్రారంభించారు. డిజిటల్ విద్యా విధానంతో ఎన్నో ప్రయోజనాలు ► బోధనాభ్యసన ప్రక్రియల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారు ► సంప్రదాయ అభ్యసన విధానంలో విద్యార్థి ఏదైనా ఒక రోజు దాన్ని కోల్పోతే మరునాటి నుంచి అభ్యసనంలో వెనుకబడతాడు. డిజిటల్ విద్యా విధానంలో ఎక్కడి నుంచైనా ఆయా అభ్యాసాలను నేర్చుకోవచ్చు ► డిజిటల్ విద్యాభ్యాసంలో విద్యార్థుల అభ్యసన వేగం, సామర్థ్యాలకు అనుగుణంగా స్టడీ మెటీరియల్ను సరళీకరించడానికి ఉపాధ్యాయులకు అవకాశమిస్తుంది ► విద్యార్థులు తెలివిని పెంచుకోగలుగుతారు. ► వారంతట వారే కొత్త అంశాలను డిజిటల్ విధానంలో నేర్చుకోగలుగుతారు. ► వారికి అవసరమైన అంశాలను ఆన్లైన్లో వనరులను శోధించడం, అధ్యయనం చేయడం ద్వారా అభివృద్ధి సాధిస్తారు. ► సంప్రదాయ విద్యా విధానంలో ఉండే పుస్తకాల బరువు డిజిటల్ విధానంలో ఉండదు ► పాఠ్యాంశాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి ► విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా రూపుదిద్దుకుంటారు. భవిష్యత్తులో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నతావకాశాలను పొందుతారు. -
డిజిటలైజేషన్లో భారత్ మార్గదర్శి
వాషింగ్టన్: డిజిటలైజేషన్ విషయంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ పేర్కొన్నారు. సాధికారత, సామాజిక భద్రతా ప్రమాణాల పెంపు వంటి అంశాలకు సంబంధించి భారత్లో డిజిటలైజేషన్ గణనీయమైన పాత్ర పోషిస్తోందని ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు. కోవిడ్–19 సమయంలో సామాజిక భద్రత విషయంలో భారత్లో డిజిటలైజేషన్ కీలక ప్రాత పోషించిందని అన్నారు. పేదరికం సమస్యలు కూడా డిజిటలైజేషన్లో తగ్గుముఖం పడతాయని పేర్కొంటూ, భారత్లో ఈ పరిస్థితి కనిపిస్తోందన్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెరుగుదల, వాతావరణ మార్పులు వంటి పలు అంశాల విషయంలో భారత్సహా పలు వర్థమాన దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. డిసెంబర్లో భారత్లో జరగనున్న జీ–20 దేశాల సదస్సులో దేశాల రుణ సమస్యలు, విద్యారంగం పురోగతి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని డేవిడ్ మాల్పాస్ వెల్లడించారు. -
డిజిటల్ ఆరోగ్య సేవల్లో ఏపీ నంబర్ వన్
సాక్షి, అమరావతి: డిజిటల్ ఆరోగ్య సేవల్లో ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరో ముందడుగు వేసింది. శుక్రవారానికి రాష్ట్రంలో కోటి హెల్త్ రికార్డులను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు అనుసంధానం చేసి, ఈ ఘనతను సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచిందని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ జీఎస్ నవీన్కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వంటి క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో 3.4 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అథారిటీ రికార్డులను రాష్ట్ర ప్రజలకు అందజేశామని, ఇది కూడా మిగతా రాష్ట్రాలకంటే అధికమేనని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు డిజిటలైజేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. రోగుల ఆరోగ్య నివేదికలను డిజిటలైజ్ చేసి భద్రపరచడంతో పాటు అవసరమైనప్పుడు వాటిని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇందులో అర్బన్, రూరల్ హెల్త్ సెంటర్ల నుంచి బోధనాస్పత్రుల వరకు భాగస్వాములవుతాయన్నారు. ఈ కేంద్రాలన్నీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఎకో సిస్టంలో భాగంగా మారాయని ఆయన వివరించారు. -
AP: ఇక డిజిటల్ బడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి విద్యార్ధికీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతుల ఏర్పాటుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఫౌండేషన్ స్థాయి నుంచి హైస్కూల్ ప్లస్ స్థాయి వరకు స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి ప్రాథమిక ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే పూర్తి చేసింది. ఫౌండేషన్ నుంచి హైస్కూల్ ప్లస్ వరకు... ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్యావిధానం లేకపోవడంతో 3 నుంచి 6 ఏళ్ల వయసు పిల్లలకు సరైన పూర్వ ప్రాథమిక పరిజ్ఞానం అందడం లేదు. నేరుగా 1వ తరగతిలో చేరుతున్న విద్యార్ధులు స్కూలు వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతోంది. దీనివల్ల ఒకటో తరగతి వయసుకు అలవడాల్సిన అక్షర, సంఖ్యా పరిజ్ఙానం కొరవడుతోంది. ఫలితంగా పై తరగతులకు వెళ్లే కొద్దీ వెనుకబాటుకు గురవుతున్నారు. ప్రథమ్ సంస్థ, న్యాస్, రాష్ట్ర స్థాయి సర్వేల్లో ఇవే అంశాలు వెల్లడయ్యాయి. దీన్ని సరిదిద్దేందుకు పూర్వ ప్రాథమిక విద్యకు వీలుగా ఫౌండేషనల్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థాయి నుంచే చిన్నారులకు డిజిటల్ సాంకేతికతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆసక్తికరంగా బోధనకు ఏర్పాట్లు చేసింది. ఫౌండేషనల్ స్థాయి నుంచి ఇంటర్ స్థాయి అయిన హైస్కూల్ ప్లస్ స్కూళ్ల వరకు డిజిటల్ తరగతుల బోధనను అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ టీచర్లకు శిక్షణ డిజిటల్ పరికరాల ద్వారా విద్యా బోధన, ఉపకరణాల వినియోగంపై పలువురు ప్రభుత్వ టీచర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. డిజిటల్ డివైస్లను సక్రమంగా వినియోగించడంలో 30 శాతం మంది పూర్తిస్థాయిలో విజయవంతమయ్యారు. 20 శాతం మందికి మరికొంత శిక్షణ అవసరమని గుర్తించారు. మిగతా 50 శాతం మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది. తొలిదశ స్కూళ్లలో మార్చి నాటికి.. మూడు దశల్లో 45,328 ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేయనున్నారు. తొలిదశ కింద 15,694 స్కూళ్లలో వీటిని అందుబాటులోకి తెస్తారు. రెండో దశ కింద 2023–24లో 14,331 స్కూళ్లలో, మూడో దశలో 15,303 స్కూళ్లలో డిజిటల్ తరగతి గదులను సిద్ధం చేస్తారు. తొలిదశ స్కూళ్లలో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటును మార్చి, ఏప్రిల్ నాటికి పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందుబాటులోకి తేనున్నారు. పాఠశాలలకు ఇంటర్నెట్ డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బ్రాడ్ బ్యాండ్/లీజ్డ్ లైన్, టెలిఫోన్ లైన్ విత్ మోడెమ్, యూఎస్బీ మోడెమ్/డాంగిల్/పోర్టబుల్ హాట్స్పాట్, వీఎస్ఏటీ తదితరాల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే 2,658 స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం ఉండగా మూడు నెలల్లో మిగతా స్కూళ్లలోనూ అందుబాటులోకి తేనున్నారు. డిజిటల్ బోధన ఇలా.. తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీ) ఏర్పాటు చేసి డిజిటల్ విద్యాబోధన నిర్వహిస్తారు. విద్యాశాఖ అంచనాల ప్రకారం 45,328 స్కూళ్లలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు రూ.511.28 కోట్లు వ్యయం కానుంది. -
భవిష్యత్కు సిద్ధంగా వాణిజ్య శాఖ
న్యూఢిల్లీ: వాణిజ్య శాఖ భవిష్యత్తుకు సన్నద్ధమవుతోందని, 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించేందుకు కావాల్సిన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వాణిజ్య శాఖ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా వాణిజ్య ప్రోత్సాహక మండలిని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వద్ద సమర్థవంతమైన సంప్రదింపులు, చర్చలకు వీలుగా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ఇందులో భాగంగా ఉంటుందన్నారు. సులభతర వాణిజ్య ప్రక్రియకు వీలుగా డిజిటైజేషన్, డేటా అనలైటిక్స్ ఎకోసిస్టమ్ను మెరుగుపరచనున్నట్టు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా పెంచడం, దేశీయంగా ఉపాధి కల్పించడమే ఉద్దేశ్యమని చెప్పారు. వాణిజ్య శాఖ పునర్నిర్మాణంలో భాగంగా సిబ్బందిని తగ్గించబోమని మంత్రి భరోసా ఇచ్చారు. ఇతర దేశాలతో బహుమఖ, ద్వైపాక్షిక ఒప్పందాల దిశగా తమ శాఖ సంప్రదింపులు చేస్తోందన్నారు. అంతర్జాతీయ వేదికల వద్ద భారత్ తరఫున సమర్థంగా వాదనలు వినిపించేందుకు ప్రైవేటు రంగం నుంచి నిపుణులను నియమించుకుంటామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా పనితీరు ఉందన్నారు. -
ఫండ్స్లో ఇన్వెస్టర్ల ఖాతాలు ఓకే
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి క్వార్టర్లో ఆస్తుల నిర్వహణా కంపెనీ(ఏఎంసీ)లు ఇన్వెస్టర్లను ఓమాదిరిగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్–జూన్(క్యూ1)లో కొత్తగా 51 లక్షల ఇన్వెస్టర్ ఖాతాలు జత కలిశాయి. దీంతో 43 ఫండ్ హౌస్ల ద్వారా మొత్తం ఇన్వెస్టర్ల ఖాతాలు 13.46 కోట్లకు చేరాయి. ఇటీవల మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్లు)పట్ల అవగాహన పెరగడం, లావాదేవీలలో డిజిటైజేషన్ వంటి అంశాలు ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులు కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు. గత 12 నెలల్లో స్పీడ్ ఎంఎఫ్ అసోసియేషన్(యాంఫీ) గణాంకాల ప్రకారం గతేడాది క్యూ4(జనవరి–మార్చి)లో 93 లక్షల ఖాతాలు ప్రారంభంకాగా.. గత 12 నెలల్లో 3.2 కోట్ల ఇన్వెస్టర్ ఖాతాలు జత కలిశాయి. అయితే భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణ పరిస్థితులు, బలపడుతున్న బాండ్ల ఈల్డ్స్, యూఎస్ ఫెడ్ కఠిన విధానాలు వంటి అంశాలు క్యూ1లో పెట్టుబడులను ప్రభావితం చేసినట్లు ఎల్ఎక్స్ఎంఈ నిపుణులు ప్రియా అగర్వాల్ వివరించారు. ఈ నేపథ్యంలో ఇకపై పెట్టుబడులు ఊపందుకునే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈక్విటీలకే ప్రాధాన్యం ఎంఎఫ్లలో రిటైల్ ఇన్వెస్టర్లు అత్యధికంగా ఈక్విటీ ఫండ్స్కే ఆసక్తి చూపుతారని మైవెల్త్గ్రోత్.కామ్ సహవ్యవస్థాపకుడు హర్షద్ చేతన్వాలా పేర్కొన్నారు. దీంతో మార్కెట్ పరిస్థితులు ఫోలియోలపై ప్రభావం చూపుతాయని తెలియజేశారు. రానున్న కాలంలో మార్కెట్లు స్థిరపడితే ఫండ్స్లో పెట్టుబడులు పుంజుకుంటాయని అంచనా వేశారు. ఎంఎఫ్ పరిశ్రమలో 10 కోట్ల ఫోలియోలు 2021 మే నెలకల్లా నమోదయ్యాయి. 2020–21లో 81 లక్షలు, 2021–22లో 3.17 ఇన్వెస్టర్ ఖాతాలు జత కలిశాయి. క్యూ1లో జత కలిసిన 51 లక్షల ఖాతాలలో 35 లక్షల ఫోలియోలు ఈక్విటీ ఆధారిత పథకాలేకావడం గమనార్హం! -
సైబర్ నేరాలు.. ఏటా రూ.10 లక్షల కోట్ల భారం !
న్యూఢిల్లీ: సైబర్ నేరాలనేవి డిజిటలీకరణకు అతి పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. వీటి వల్ల 2025 నాటి కల్లా ఎకానమీలపై ఏటా 10 లక్షల కోట్ల మేర భారం పడనుందని అంచనాలు నెలకొన్నాయి. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. సైబర్ నేరాల వల్ల ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలపై ఏటా 6 లక్షల కోట్ల డాలర్ల మేర భారం పడుతోందని, 2025 నాటికి ఇది దాదాపు 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయని ఆయన వివరించారు. వ్యాపారంలో టెక్నాలజీ వినియోగ తీవ్రతను బట్టే ప్రతి కంపెనీ వృద్ధి ఆధారపడి ఉంటోందని మహేశ్వరి తెలిపారు. పరిశ్రమ వృద్ధి చెందే కొద్దీ, కంపెనీలు సైబర్ సెక్యూరిటీపైనా, విశ్వసనీయ టెక్నాలజీపైనా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. డిజిటల్కు మారే క్రమంలో భారత్ .. క్లౌడ్ సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. -
డిజిటైజేషన్తో బ్యాంకింగ్లో పెను మార్పులు
న్యూఢిల్లీ: డిజిటైజేషన్, కొంగొత్త టెక్నాలజీలు.. బ్యాంకింగ్ రంగంలో గతంలో ఎన్నడూ లేనంతగా పెను మార్పులు తీసుకొస్తున్నాయని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. ఖర్చులు తగ్గించి, సర్వీసులను విస్తృతంగా అందించేందుకు తోడ్పడుతున్న డిజిటల్ విప్లవానికి దేశీ బ్యాంకులు అలవాటు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా సర్వీసులు అందించడంపై బ్యాంకులు చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటోందని ఖారా చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త టెక్నాలజీల వినియోగంపై అవి మరింతగా దృష్టి పెడుతున్నాయని డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ‘పరిశ్రమలు, వ్యాపారాల నిర్వహణ తీరుతెన్నులను డిజిటల్ ఆవిష్కరణలు మార్చేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో ఈ మార్పులు మరింత వేగవంతం అవుతున్నాయి. ప్రస్తుతం డిజిటైజేషన్, డిజిటల్ ఆవిష్కరణలనేవి బ్యాంకింగ్ పరిశ్రమకు వ్యూహాత్మక ప్రాధాన్యత అంశాలుగా మారాయి‘ అని ఖారా వివరించారు. మారే పరిస్థితులకు అనుగుణంగా డిజిటల్ విధానాలకు వేగంగా మళ్లాల్సిన అవసరాన్ని బ్యాంకులు గుర్తించాయని ఆయన చెప్పారు. కొత్త టెక్నాలజీలు, ఆవిష్కరణలను అందిపుచ్చుకోవడం, వినియోగించుకోవడం, నాణ్యమైన మౌలిక సదుపాయాలు వంటివి డిజిటల్ రుణాల వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఖారా పేర్కొన్నారు. రుణాల ప్రక్రియ కూడా డిజిటల్గా మారాలి.. ప్రస్తుతం పేమెంట్ వ్యవస్థ డిజిటల్గా మారిందని, ఇక రుణాల విభాగం కూడా డిజిటల్గా మారాల్సిన సమయం వచ్చిందని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా చెప్పారు. బ్యాంకులు దీనిపై కసరత్తు చేస్తున్నాయని వివరించారు. ఇప్పటికే కొన్ని రుణ ఉత్పత్తుల డిజిటైజేషన్ను మొదలుపెట్టాయని పేర్కొన్నారు. బ్యాంకింగ్ పరిశ్రమలో టెక్నాలజీ, ఆవిష్కరణల వినియోగం క్రమంగా పెరుగుతోందని, కరోనా వైరస్ మహమ్మారి రాకతో ఇది మరింత వేగం పుంజుకుందని మెహతా తెలిపారు. మరోవైపు, భారత్ చాలా వేగంగా డిజిటల్ ఆధారిత ఎకానమీగా రూపాంతరం చెందుతోందని ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్సీ) కంట్రీ హెడ్ (ఇండియా) వెండీ వెర్నర్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఫిన్టెక్ వినియోగం భారత్లోనే ఉందని, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాలు కూడా ఈ విషయంలో ముందుంటున్నాయని పేర్కొన్నారు. భారత్లో ఫిన్టెక్ మార్కెట్ 50–60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని.. ఇది మరింతగా వృద్ధి చెందగలదని అంచనా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
దేవుడి నగల వివరాల డిజిటలీకరణ
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు సంబంధించి దేవుడి నగల వివరాలన్నిటినీ డిజటలీకరణ చేయాలని దేవదాయ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. దేవుడికి సంబంధించిన బంగారు, వెండి నగలను అన్నివైపుల నుంచి ఫొటోలు తీసి, ఆ నగ బరువు వివరాలతో సహా కంప్యూటరీకరణ చేయాలని నిర్ణయించారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన గొల్లపూడిలోని కమిషనర్ కార్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న సమావేశాలు మంగళవారం మొదలయ్యాయి. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ వాణీమోహన్, ఆర్జేసీలు, డిప్యూటీ కమిషనర్లు, జిల్లాల అసిస్టెంట్ కమిషనర్లు, ప్రధాన ఆలయాల ఈవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆలయాల్లో ఎటువంటి అవకతవకలకు అవకాశాలు లేకుండా పూర్తి పారదర్శక విధానాలను అమల్లోకి తెచ్చేందుకు.. దేవుడి నగలతో పాటు ఆలయ భూములు, ఇతర ఆస్తులు, లీజుల వివరాలతోపాటు ఆలయాలకు ఏటా ఏ రూపంలో ఎంత ఆదాయం వస్తోంది, ఎంత మొత్తం ఖర్చవుతోంది, బ్యాంకులలో డిపాజిట్లు ఏ మేరకు ఉన్నాయనే వివరాలను ఆలయాల వారీగా నిర్వహించే 6 రకాల రిజిస్టర్లను కూడా కంప్యూటరీకరించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఆయా ఆలయాల్లో వెంటనే చేపట్టాలని మంత్రి వెలంపల్లి, వాణీమోహన్ సూచించారు. జమా ఖర్చులపై విధిగా ఆడిట్ జమా ఖర్చులకు సంబంధించి ఆలయాల వారీగా ఏటా ఆడిట్ జరిపించాలని మంత్రి వెలంపల్లి ఆదేశించారు. దశలవారీగా పూర్తిస్థాయిలో క్యాష్ లెస్ విధానం అమలు చేయాలన్నారు. దేవుడి భూములు, షాపులు, ఇతర లీజులకు సంబంధించి ఎటువంటి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు వసూలు చేయాలని సూచించారు. ఆలయాల్లో పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రైవేట్ ఆలయాలపై దాడులు జరిగినా దేవదాయ శాఖ స్పందించి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తుందని హెచ్చరించారు. -
క్లౌడ్ నిపుణుల అడ్డా భారత్
న్యూఢిల్లీ: క్లౌడ్ నిపుణుల విషయంలో ప్రపంచంలో రెండవ కేంద్రంగా భారత్కు అవకాశం ఉందని నాస్కామ్ వెల్లడించింది. ప్రభుత్వ, విద్య, నైపుణ్య కేంద్రాలు, సాంకేతిక సంస్థల సహకారంతో ఇది సాధ్యపడుతుందని తెలిపింది. డ్రౌప్ సహకారంతో నాస్కామ్ రూపొందించిన నివేదిక ప్రకారం.. మూడవ స్థానంలో ఉన్న భారత్లో 2021 మార్చి నాటికి 6,08,000 మంది క్లౌడ్ నిపుణులు ఉన్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 15 లక్షలకు చేరుకుంటుంది. ఆ సమయానికి డిమాండ్ 20 లక్షలుగా ఉంటుంది. పెద్ద ఎత్తున నైపుణ్య కార్యక్రమాలు చేపడితే నిపుణుల సంఖ్య నాలుగేళ్లలో 18 లక్షలకు పెరుగుతుంది. 26 శాతం వార్షిక వృద్ధితో క్లౌడ్ మార్కెట్ 2022 నాటికి రూ.41,510 కోట్లను తాకుతుంది’ అని నాస్కామ్ తెలిపింది. నివేదిక రూపకల్పనలో టీసీఎస్, యాక్సెంచర్ సహకారం అందించాయి. క్లౌడ్ సేవలకు డిమాండ్: డిజిటలీకరణ పెద్ద ఎత్తున జరుగుతుండడంతో క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. మౌలిక వసతులు, అనుకూలత, తక్కువ ఖర్చుల కారణంగా క్లౌడ్ వైపు చిన్న కంపెనీలు సైతం మొగ్గు చూపుతున్నాయి. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ మరో కారణం’ అని నాస్కామ్ వివరించింది. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ పేరుతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహకారంతో నాస్కామ్ ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, క్లౌడ్ విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తోంది. క్లౌడ్ రంగంలో 2020లో 3,80,000 ఉద్యోగాల కోసం డిమాండ్ ఏర్పడింది. 2019తో పోలిస్తే ఇది 40 శాతం అధికం. క్లౌడ్ నైపుణ్యాల డిమాండ్ ప్రస్తుత సరఫరాను మించిపోయింది. నైపుణ్యతపై దృష్టి పెట్టాలి అని నాస్కామ్ తెలిపింది. -
ఆ వార్తల్లో నిజం లేదు.. మణిరత్నం సినిమాలు భద్రపరుస్తాం
‘దళపతి’ (1991), ‘రోజా’ (1992), బొంబాయి (1995), ‘యువ’ (2004).. ఇలా ఎన్నో అద్భుత చిత్రాలను అందించారు దర్శకుడు మణిరత్నం. ఇప్పటివరకూ ఆయన 26 సినిమాలు తీశారు. వాటిలో ‘క్లాసిక్’ అనదగ్గవి చాలా ఉన్నాయి. ఆ క్లాసిక్స్ని భద్రపరిచే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయం గురించి ఈ ప్రాజెక్ట్తో అసోసియేట్ అయిన శివేంద్ర సింగ్ మాట్లాడుతూ– ‘‘క్లాసిక్ సినిమాలను ఇప్పటి సాంకేతికతో భద్రపరచడం, మెరుగులు దిద్దడం వంటి అంశాలపై 2017లో చెన్నైలో వర్క్షాప్ చేశాం. అప్పుడు మణిరత్నంతో మాట్లాడాను. ఆయన సినిమాల్లో కొన్ని ప్రింట్స్, నెగటివ్స్ మెరుగైన స్థితిలో లేవు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘దళపతి’, ‘రోజా’, ‘బొంబాయి’ వంటి ఆణిముత్యాలను ‘ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్’ (ఎఫ్హెచ్ఎఫ్)లో ఎలా భద్రపరుస్తామో వివరించాం. మణిరత్నం సానుకూలంగా స్పందించారు. సినిమాలను 8కె రిజల్యూషన్లో భద్రపరుస్తాం. ఇప్పుడు అందరూ 4కె రిజల్యూషన్ను మాత్రమే వినియోగిస్తున్నారు. పాత ప్రింట్స్, నెగటివ్లను జాగ్రత్తగా డీల్ చేస్తున్నాం. ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్లో ప్రసాద్ కార్పొరేషన్ సహకారం ఉంది. అలాగే మేం ఒక ఓటీటీ ఫ్లాట్ఫామ్ కోసం ఇలా చేస్తున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని పేర్కొన్నారు. -
పెరిగిన డిజిటలైజేషన్తో విస్తరించిన మార్కెట్
సాక్షి, అమరావతి: ఐటీ ఉద్యోగార్థులకు తీపి కబురు. కరోనా వైరస్ వ్యాప్తితో అగమ్యగోచరంగా ఉన్న ప్రస్తుత తరుణంలో కూడా ఈ ఏడాది దేశంలో ఐటీ ఉద్యోగాల జాతర జరగనుంది. 2021–22లో భారీసంఖ్యలో కొత్త ఉద్యోగుల నియామకానికి దేశంలో ఐటీ కంపెనీలు సన్నద్ధమవుతున్నాయని ప్రముఖ కన్సల్టెన్సీ ఏజెన్సీ ‘లింక్డిన్’ తాజా నివేదిక వెల్లడించింది. కరోనా పరిస్థితులతో దేశంలో డిజిటలైజేషన్ మరింతగా పెరగనుండటంతో పెరగనున్న మార్కెట్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే 2020–21 కంటే 2021–22లో 45 శాతం ఎక్కువగా కొత్త ఉద్యోగుల నియామకానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాయి. లింక్డిన్ తాజా నివేదికలోని ప్రధాన అంశాలు.. రానున్న రెండేళ్ల మార్కెట్ను అంచనా వేసి.. కరోనా నేపథ్యంలో డిజిటలైజేషన్, ఆన్లైన్ కార్యకలాపాలు అమాంతంగా పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆన్లైన్, డిజిటలైజేషన్ ప్లాట్ఫామ్స్కు మార్కెట్ విస్తరిస్తోంది. ఈ పరిస్థితి నిపుణులైన మానవ వనరులు ఉండి వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్కు సానుకూలాంశంగా మారింది. దాంతో రానున్న రెండేళ్లలో మార్కెట్ పరిస్థితులను అంచనా వేసి ఆ మేరకు అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఐటీ కంపెనీలు ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. దీంతో దేశంలో కొత్త ఐటీ ఉద్యోగాలు భారీగా లభించనున్నాయి. ► 2020–21లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో పెరిగిన డిజిటలైజేషన్తో ఐటీ కంపెనీలకు మారెŠక్ట్లో కొత్త అవకాశాలు లభించాయి. దీంతో 2020 నవంబర్ నుంచి ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగ నియామకాలను వేగవంతం చేశాయి. ‘వర్క్ ఫ్రం హోమ్’విధానంలోనే పనిచేసేందుకు కొత్త ఉద్యోగులను నియమించాయి. ► ఇక రానున్న ఏడాదిలో దేశంలో డిజిటలైజేషన్ మరింతగా పెరగనుంది. దాంతో కొత్త ఉద్యోగాల కల్పన కూడా అదే రీతిలో పెరుగుతుంది. 2020–21 కంటే ఈ 2021–22లో 45 శాతం ఎక్కువగా కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నాయి. ► ప్రధానమైన నాలుగు ఐటీ కంపెనీలే కొత్తగా లక్షమంది ఉద్యోగుల నియామకానికి సన్నద్ధమవడం విశేషం. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, విప్రో సంస్థలే దాదాపు లక్షమంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. ► టీసీఎస్ కొత్తగా 40 వేలమంది ఉద్యోగులను నియమించనుంది. ఇన్ఫోసిస్ 26 వేలమందిని, హెచ్సీఎల్ 12 వేలమందిని కొత్తగా తీసుకోవాలని నిర్ణయించాయి. విప్రో దాదాపు 20 వేలమంది కొత్త ఉద్యోగులను నియమించాలని భావిస్తోంది. గత ఏడాది విప్రో 9 వేలమందినే నియమించగా ఈసారి ఏకంగా 20 వేలమంది వరకు తీసుకోవాలని భావిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ► ఇక దేశంలో మిగిలిన ఐటీ కంపెనీలు కూడా అదే రీతిలో కొత్త ఉద్యోగుల నియామకానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మరో లక్షకుపైగా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. యువతకు ఇదే అవకాశం ప్రపంచవ్యాప్తంగా అంచనాలకు మించి డిజిటలైజేషన్ విస్తరిస్తోంది. ప్రపంచ ఆర్ధికవ్యవస్థకు ఇది అనివార్య పరిస్థితి. దీంతో కొత్త ప్లాట్ఫామ్స్కు అవకాశాలు పెరిగాయి. ఈ మార్కెట్ను దక్కించుకునేందుకు ఐటీ కంపెనీలు ముందస్తుగా సిద్ధమవుతాయి. తద్వారా భారీగా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ పరిస్థితిని యువత సద్వినియోగంచేసుకోవాలి. అందుకోసం ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. – పీవీజీడీ ప్రసాదరెడ్డి, వీసీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
చిన్న సంస్థలకు... అమెజాన్ 1,873 కోట్లఫండ్
న్యూఢిల్లీ: దేశీయంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంబీ) డిజిటైజేషన్ ప్రయోజనాలు చేకూర్చడం అగ్రి–టెక్, హెల్త్–టెక్ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు తోడ్పాటు అందించడంపై ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ మరింతగా దృష్టి పెట్టనుంది. ఇందుకోసం 250 మిలియన్ డాలర్లతో (సుమారు రూ. 1,873 కోట్లు) ఫండ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. చాలా మటుకు ఆర్థిక వ్యవస్థలకు చిన్న, మధ్య తరహా వ్యాపారాలే దన్నుగా ఉంటాయని, వాటికి ఊతమిచ్చేందుకే అమెజాన్ సంభవ్ (ఎస్ఎంభవ్) వెంచర్ ఫండ్ను ప్రారంభిస్తున్నట్లు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సీఈవో ఆండ్రూ జస్సీ వెల్లడించారు. సరికొత్త వ్యాపారాలను నిర్మించడంలో మరిన్ని ఎస్ఎంబీలకు తోడ్పాటు అందించాలన్నది తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సరికొత్త ఐడియాలను, ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ ఫండ్ను ఉద్దేశించినట్లు అమెజాన్ ఇండియా గ్లోబల్ ఎస్వీపీ అమిత్ అగర్వాల్ తెలిపారు. ‘ఈ ఫండ్ ప్రధానంగా ఎస్ఎంఈ డిజిటైజేషన్, రైతుల ఉత్పాదకతను పెంచగలిగే అగ్రిటెక్ ఆవిష్కరణలు, ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలకు ఉపయోగపడే హెల్త్–టెక్నాలజీ ఆవిష్కరణలపై దృష్టి పెడుతుంది‘ అని ఆయన వివరించారు. వెంచర్ ఫండ్ ద్వారా ఎం1ఎక్స్చేంజీ అనే స్టార్టప్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు అగర్వాల్ తెలిపారు. ఇది చిన్న వ్యాపార సంస్థలకు ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ మార్కెట్ప్లేస్ ఎక్సే్చంజీ తరహా సేవలు అందిస్తోంది. 2025కి ఆన్లైన్లోకి 10 లక్షల షాపులు.. లోకల్ షాప్స్ ప్రోగ్రాం కింద 2025 నాటికి పది లక్షల కిరాణా షాపులను ఆన్లైన్లోకి తేవాలని నిర్దేశించుకున్నట్లు అగర్వాల్ తెలిపారు. గడిచిన ఆరు నెలల్లో ఈ ప్రోగ్రాం కింద ఆన్లైన్ బాట పట్టిన దుకాణాల సంఖ్య 10 రెట్లు పెరిగిందని ఆయన వివరించారు. సరఫరా వ్యవస్థలో భారత్కు ముఖ్య పాత్ర: ఇంద్రానూయి కోవిడ్ అనంతర పరిస్థితుల్లో అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించగలిగే అవకాశాలు ఉన్నాయని పెప్సీకో మాజీ చైర్మన్ ఇంద్రా నూయి అభిప్రాయపడ్డారు. అయితే, కీలక ఉత్పత్తుల సరఫరాలో తన స్థానం గురించి, పోషించాల్సిన పాత్ర గురించి భారత్ లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు. తయారీకి సంబంధించి తన నియంత్రణలో ఉంచుకోవాల్సిన ఉత్పత్తులను, దేశీయంగా అవసరాల కోసం ఇక్కడే తయారు చేసుకోవాల్సిన కీలక ఉత్పత్తులను గుర్తించాలని సూచించారు. అమెజాన్ సంభవ్ కార్యక్రమం సందర్భంగా నూయి ఈ విషయాలు చెప్పారు. -
వర్చువల్ కార్యకలాపాలకు డిమాండ్
ముంబై: కరోనా మహమ్మారి కారణంగా డిజిటలైజేషన్ పెరిగిన నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి మధ్య సాంకేతిక రంగంలో ఉద్యోగ నియామకం స్థిరంగా ఉందని గ్లోబల్ జాబ్ సైట్ ఇన్డీడ్ తెలిపింది. జనవరిలో దేశీయ టెక్ జాబ్స్ పోస్టింగ్ 13 శాతం మేర పెరిగాయని పేర్కొంది. రిమోట్ వర్కింగ్, టెక్నాలజీ ఆధారిత వ్యాపార కార్యకలాపాల అవసరం పెరగడం వంటి కారణాలతో టెక్ నియామకాలను పెంచుకోవాల్సి వచ్చిందని ఇన్డీడ్.కామ్ ఎండీ సాషి కుమార్ తెలిపారు. సమీప భవిష్యత్తులో డిజిటలైజేషన్, వర్చువల్ కార్యకలాపాలు మరింత వృద్ధి చెందుతాయని, దీంతో ఈ రంగాలలో టెక్ సంబంధిత ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తొలి పది టెక్ ఉద్యోగాలలో అప్లికేషన్ డెవలపర్ జాబ్స్ ప్రథమ స్థానంలో ఉన్నాయని, ఆ తర్వాత ఐటీ సెక్యూరిటీ స్పెషలిస్ట్, సేల్స్ఫోర్స్ డెవలపర్స్, సైట్ రిలయబులిటీ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఉన్నాయని వివరించారు. గతేడాది ఏప్రిల్ – ఈ ఏడాది జనవరి మధ్య కాలంలో బిజినెస్ ఇంటలిజెన్స్ డెవలపర్, ఎస్ఏపీ కన్సల్టెంట్, సీనియర్ క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజనీర్, టెక్నికల్ కన్సల్టెంట్, ఆటోమేషన్ ఇంజనీర్ జాబ్స్ సానుకూల నమోదు కనిపించిందని తెలిపారు. టెక్ ఆధారిత ఉద్యోగాలు ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ–కామర్స్ కంపెనీలలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. -
బ్యాంకింగ్ డిజిటలైజేషన్లో బాలారిష్టాలు
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ డిజిటలైజేషన్ పక్రియ మెరుగుపడుతున్నా, ఇంకా పలు అడ్డంకులు ఉన్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ పేర్కొంది. పలు ప్రభుత్వ రంగ, చిన్న ప్రైవేటు రంగ బ్యాంకుల తక్కువ లాభదాయకత, మొండిబకాయిల భారం వంటి అంశాలను ఈ మేరకు విడుదల చేసిన ఒక నివేదికలో ప్రస్తావించింది. ‘రిటైల్ బ్యాంకింగ్లో సాంకేతిక పరమైన అవరోధాలు: పెద్ద బ్యాంకుల్లో మారాల్సిన పరిస్థితులు’’ అన్న శీర్షికన విడుదలైన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► భారత్లో ప్రధానమైన డిజిటల్ పేమెంట్ వ్యవస్థ– యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వినియోగం భారీగా పెరిగేందుకు కోవిడ్–19 ప్రేరిత అంశాలు దోహదపడుతున్నాయి. 2020 జూన్ నుంచి నవంబర్ మధ్య గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ దాదాపు రెట్టింపయ్యింది. ► మొబైల్ పేమెంట్ యూజర్లు ఈ–వాలెట్ల నుంచి యూపీఐ వైపునకు మారుతున్నారు. 2020 అక్టోబర్లో మొత్తం పేమెంట్స్ మార్కెట్ లావాదేవీల్లో యూపీఐ వాటా 51 శాతం కావడం గమనార్హం. ► ఇదే ధోరణి ఇకముందూ కొనసాగుతుందని భావిస్తున్నాం. స్మార్ట్ఫోన్ వినియోగం పెరగడం, ఇంటర్నెట్ కనెక్టివిటిలో పురోగతి, సాంకేతికతను ఎక్కువగా ఇష్టపడే యువత అధిక సంఖ్యలో ఉండడం ఇందుకు దోహదపడతాయి. ► బ్యాంకింగ్లో సాంకేతికత వినియోగం పెరిగేందుకు పలు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ► అయితే మొండిబకాయిల భారం, తక్కువ లాభదాయకత వంటి అంశాలు సాంకేతికతపై బ్యాంకింగ్ వ్యయాలను క్లిష్టతరం చేస్తున్నాయి. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)సహా ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకులు, కొన్ని బ్యాంకింగ్–యేతర ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) బ్యాంకింగ్ విషయంలో సాంకేతిక అవరోధాలను విజవంతంగా అధిగమించగలుగుతున్నాయి. అలాగే పలు ఫైనాన్షియల్ సంస్థలు కస్టమర్లకు సంబంధించి పలు సేవల విషయంలో ఆధునిక సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) వినియోగాన్ని ముందుకు తీసుకువెళ్లగలుగుతున్నాయి. ► సాంప్రదాయక బ్యాంకులు, ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీల మధ్య భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో బ్యాంకులు తమ వ్యవస్థలను అప్గ్రేడ్ చేసుకోడానికి మరిన్ని పెట్టుబడులు అవసరం అవుతాయి. -
బీమా... పూర్తిగా డిజిటల్!
వ్యక్తుల మధ్య భౌతిక దూరం.. అత్యవసర పనులకే కాలు బటయటపెట్టడం.. వీలుంటే ఇంటి నుంచే కార్యాలయ పని (వర్క్ ఫ్రమ్ హోమ్).. ఇవన్నీ కరోనా వైరస్ కారణంగా వచ్చిన మార్పులు. బీమా పరిశ్రమ అభివద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) ఈ పరిస్థితులను అర్థం చేసుకుంది. అన్ని రకాల టర్మ్ పాలసీలను, ఇందుకు సంబంధించి ఇతర సేవలను డిజిటల్ గా అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆఫ్ లైన్ విభాగంలోని టర్మ్ ప్లాన్లు, వాటి డాక్యుమెంట్లను కూడా బీమా సంస్థలు ఇప్పుడిక డిజిటల్ గానే అందించనున్నాయి. ఫలితంగా పాలసీదారులు సౌకర్యంగా, తామున్న చోటు నుంచే పాలసీలను పొందే వీలు కలిగింది. కోవిడ్–19 ్టకాలంలో ఆఫ్ లైన్ బీమాకు సంబంధించి ఇదొక వెసులుబాటు. కరోనా వైరస్ చాలా రంగాల్లో డిజిటైజేషన్ కు దారితీసిందనే చెప్పుకోవాలి. బీమా పరిశ్రమ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. బీమా సంస్థలు ఆన్ లైన్ మాధ్యమాల ద్వారా పాలసీలను విక్రయించేందుకు, అదే విధంగా పాలసీదారులు ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకునేందుకు, బీమా క్లెయిమ్ లు చేసుకునేందుకు వీలుగా ఐఆర్డీఏఐ నిబంధనల్లో కొన్ని మార్పులను తీసుకొచ్చింది. ఆన్ లైన్ లో బీమా పాలసీలను దాదాపు అన్ని సంస్థలు ఇప్పటికే ఆఫర్ చేస్తున్నాయి. అయితే, ఆఫ్ లైన్ లో అందించే టర్మ్ పాలసీలను కూడా డిజిటల్ రూపంలో అందించడం తాజాగా వచ్చిన మార్పుల్లో భాగమని చెప్పుకోవాలి. బీమా పరిశ్రమ పూర్తిగా డిజిటల్ రూపం సంతరించుకునే దిశగా ఇది తొలి మెట్టుగానే భావించాలి. బీమా పరిశ్రమ మరింత విస్తరణకు కూడా ఈ నిర్ణయం దోహదపడే వీలుంది. ప్రపోజల్స్కు డిజిటల్ ఆమోదం ఆన్ లైన్ ద్వారా టర్మ్ ప్లాన్లను కొనుగోలు చేయడం నేటి యువతరానికి కొత్తేమీ కాదు. కానీ, ఆఫ్ లైన్ లో అంటే బీమా ఏజెంట్లు లేదా బీమా కార్యాలయాల నుంచి పాలసీలను తీసుకోవాలంటే ప్రస్తుతం వెనుకాడాల్సిన పరిస్థితులున్నాయి. ఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారా బీమా పాలసీల పంపిణీ, ప్రచారం అన్నది కరోనా వైరస్ విస్తరణ సమయంలో కష్టసాధ్యమని ఐఆర్డీఏఐ గుర్తించింది. భౌతికంగా పాలసీదారులు ప్రపోజల్ పత్రాలను పూర్తి చేయడం, సంతకాలు చేసిన తర్వాత వాటిని సమర్పించడం వంటి పనులపై కరోనా ప్రభావం ఉన్నట్టు గుర్తించిన ఐఆర్డీఏఐ నిబంధనల పరంగా వెలుసుబాటు కల్పించింది. ‘‘టర్మ్ ప్లాన్లు అర్థం చేసుకునేందుకు ఎంతో సులభంగా ఉంటాయి. ఇప్పుడు టర్మ్ ప్లాన్లను తీసుకునేందుకు భౌతికంగా సంతకాలు అవసరం లేకుండా చేయడం అన్నది మంచి నిర్ణయమే అవుతుంది’’ అని ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ సీఈవో రుషబ్ గాంధీ పేర్కొన్నారు. ‘‘కరోనా నేపథ్యంలో కస్టమర్లు ఎవరిని కలవాలన్నా వెనుకాడుతున్న పరిస్థితి ఉంది. దీంతో ప్రపోజల్ పత్రాలను ఫోన్ ద్వారా లేదా వీడియోకాల్ ద్వారా తీసుకుంటున్నాం. అయితే, సంతకం తీసుకోవడం సవాలుగానే ఉంది. దీంతో డిజిటల్ రూపంలో ఓటీపీ ద్వారా ఆమోదం తీసుకోవడం దీనికి పరిష్కారం. ప్రపోజల్ పత్రాలకు సంబంధించి కస్టమర్ల సంతకాలు లేకుండానే వారి ఆమోదం తీసుకునేందుకు బీమా సంస్థలను ఐఆర్డీఏఐ అనుమతించింది’’ అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ న్యాయ, నిబంధనల విభాగం హెడ్ అనిల్ పీఎం తెలిపారు. ఈ విధానంలో కస్టమర్ల మెయిల్ బాక్స్ కు ఈ మెయిల్ రూపంలో లేదా మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ రూపంలో లింక్ ను బీమా సంస్థలు పంపిస్తాయి. ఈ లింక్ ను క్లిక్ చేసి వచ్చే పేజీలో ఓటీపీ ఇవ్వడం ద్వారా ప్రపోజల్ పత్రానికి ఆమోదం తెలియజేసినట్టు అవుతుంది. పూర్తిగా నింపిన ప్రపోజల్ పత్రానికి పాలసీదారులు ఆమోదం తెలిపినట్టుగా చట్టపరమైన ఆధారాలను బీమా సంస్థలు కలిగి ఉండాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. ఇందుకు వీలుగా అవసరమైన డిజిటల్ సదుపాయాలు కల్పించుకోవాలని ఆదేశించినట్టు అనిల్ తెలిపారు. అదే విధంగా డిజిటల్ విధానంలో కస్టమర్లు ప్రపోజల్ పత్రానికి సంబంధించి ఆమోదం తెలియజేసే వరకు ప్రీమియం ముందుగా చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదని ఆయన పేర్కొన్నారు. నూతన విధానాన్ని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ప్రయోగాత్మకంగా ఐఆర్డీఏఐ అనుమతించినట్టు చెప్పారు. ‘‘టర్మ్ ప్లాన్ల వ్యాపారం ఎక్కువగా ఆన్ లైన్ విధానంలో కొనసాగుతోంది. కాకపోతే ఐఆర్డీఏఐ తాజా ఆదేశాల వల్ల ఆఫ్ లైన్ విధానంలోనూ టర్మ్ ప్లాన్లను విక్రయించే బీమా సంస్థలకు వెసులుబాటు లభించనుంది. నిజంగా ఇది సులభతరమైన ప్రక్రియే అవుతుంది. ఇది మంచి ఫలితాలను ఇస్తే ఇతర బీమా ఉత్పత్తులకూ ఈ విధానాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది’’ అని అనిల్ వివరించారు. ఈ–పాలసీలు ఈ సమయంలో బీమా పాలసీ పత్రాలను ప్రచురించడం, వాటిని కస్టమర్లకు అందించడం చాలా కష్టమైన పని అంటూ బీమా కంపెనీలు ఐఆర్డీఏఐకు మొరపెట్టుకున్నాయి. తద్వారా అన్ని రకాల జీవిత బీమా పాలసీలను ఆన్ లైన్ లో డిజిటల్ రూపంలో అందించేందుకు అనుమతి పొందాయి. దీంతో కొత్తగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి పాలసీ డాక్యుమెంట్లను వారి మెయిల్ ఐడీకి బీమా సంస్థలు పంపిస్తున్నాయి. 2016లో ఐఆర్డీఏఐ తీసుకొచ్చిన నిబంధనల మేరకు.. బీమా ప్లాన్ పత్రాలను ఎలక్ట్రానిక్ రూపంలో పంపించడంతోపాటు.. హార్డ్ కాపీని కూడా పాలసీదారులకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ సదుపాయాన్ని వినియోగించుకున్న కస్టమర్లకు మాత్రం బీమా ప్లాన్ డిజిటల్ కాపీని పంపిస్తే సరిపోయేది. ఇప్పుడిక ఈ నియంత్రణల్లేవు. పాలసీబాండ్ ను పీడీఎఫ్ రూపంలో కస్టమర్ మెయిల్ బాక్స్ కు పంపించినా సరిపోతుందని, ఫిజికల్ పాలసీ డాక్యుమెంట్ ను పంపించడం తప్పనిసరి కాదని అనిల్ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రీలుక్ పీరియడ్ పరంగానూ జాప్యం అవుతోంది. కస్టమర్లు బీమా పాలసీని అందుకున్న నాటి నుంచి 15 రోజుల్లోపు తమకు నచ్చకపోతే వెనక్కి తిప్పి పంపొచ్చు. అప్పుడు కట్టిన ప్రీమియంలో అధిక భాగం వెనక్కి వచ్చేస్తుంది. అయితే, ఇప్పుడు ఎలక్ట్రానిక్ రూపంలో పాలసీని అందుకుంటున్న కస్టమర్లకు బీమా సంస్థలు 30 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ ను అమలు చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు తమ పాలసీ డాక్యుమెంట్ ను అర్థం చేసుకునేందుకు మరింత సమయం లభించినట్టు అయింది. పాలసీ వద్దనుకుంటే 30 రోజుల్లోపు వారు ఎలక్ట్రానిక్ రూపంలోనే తిప్పి పంపించేయవచ్చని, కేవలం ఈ మెయిల్ ద్వారా విషయాన్ని తెలియజేసినా సరిపోతుందని ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యూటీ సీఈవో రుషబ్ గాంధీ తెలిపారు. మొత్తంమీద బీమా రంగం విస్తరణకు కూడా తాజా నిర్ణయాలు దోహదపడతాయని విశ్లేషణ. కస్టమర్ల అభీష్టమే.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా డిజిటల్ పాలసీలను పంపిస్తే చాలన్న వెసులుబాటును ఐఆర్డీఏఐ కల్పించింది. కానీ, తమకు ఫిజికల్ గా పాలసీ బాండ్ కావాలంటూ పాలసీదారులు డిమాండ్ చేస్తే బీమా సంస్థలు తప్పకుండా పంపించాల్సి ఉంటుంది. అందుకు ఎటువంటి చార్జీలను కూడా అదనంగా వసూలు చేయకూడదు. డిజిటల్ రూపంలో పాలసీల జారీ ప్రక్రియ వల్ల బీమా కంపెనీలకు నిర్వహణ, ప్రాసెస్ ఖర్చులు తగ్గుతాయి. ఇలా ఆదా అయిన మొత్తాన్ని కస్టమర్ల సేవల మెరుగుదలపై కంపెనీలు ఖర్చు చేయగలవని గాంధీ పేర్కొన్నారు. దీనివల్ల సందిగ్ధత తొలగిపోవడంతోపాటు, బీమా కంపెనీలు, కస్టమర్లు నేరుగా అనుసంధానమయ్యేందుకు, పారదర్శకత పెంపునకు దారితీస్తుంది. కొనుగోలు ప్రక్రియ సులభతరం అవడం వల్ల మరింత మంది బీమా పాలసీల కొనుగోలుకు ప్రోత్సాహకరంగా ఉంటుందని బీమా కంపెనీలు అంటున్నాయి. అన్నింటి మాదిరే బీమా పాలసీ బాండ్ ను కూడా ఫోన్ ద్వారా పొందడం మంచి పరిణామంగా అనిల్ పేర్కొన్నారు. భౌతికంగా పాలసీ పత్రాలను పంపే విషయంలో చిరునామాల్లో తప్పులు దొర్లడం కారణంగా కొన్ని కంపెనీలకు తిరిగి వెళుతుంటాయి. అదే డిజిటల్ పాలసీ విషయంలో ఇటువంటి ఇబ్బందులు ఉండకపోవడం కూడా కస్టమర్లు, బీమా కంపెనీలకు సౌకర్యంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. -
పాతవి ‘పది’లం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దశాబ్దాల కిందటి పదో తరగతి రికార్డులను కంప్యూటరీకరించేందుకు కసరత్తు మొదలైంది. 2004 నుంచి పదో తరగతి చదివిన విద్యార్థుల రికా ర్డుల కంప్యూటరీకరణ జరిగినా అంతకుముందు పదో తర గతి చదివిన వారి రికార్డుల ప్రక్రియ జరగలేదు. తాజాగా వాటిని కూడా కంప్యూటరీకరించేందుకు రంగం సిద్ధమవుతోంది. తద్వారా గత 61 ఏళ్లలో పదో తరగతి చదివిన విద్యార్థులకు సంబంధించిన మార్కుల వివరాలను సురక్షితంగా భద్రపరిచేలా ప్రభుత్వ పరీక్షల విభాగం (బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ఏర్పాట్లు చేస్తోంది. 2004 నుంచి ఏటా సగటున 9.5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరైతే 2014 జూన్ 2న తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఏటా 5.5 లక్షల మంది పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో 1958 నుంచి 2004 వరకు 46 ఏళ్లలో ఏటా సగటున 5 లక్షల మంది పరీక్షలు రాసినట్లు అంచనా వేసినా విద్యార్థుల సంఖ్య 2 కోట్లు దాటుతోంది. ఇప్పుడు వారందరికీ సంబంధించిన సబ్జెక్టులవారీ మార్కుల సమగ్ర సమాచారంతోపాటు ఇతరత్రా వివరాలను కంప్యూటరీకరిం చేందుకు పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఇది పూర్తయితే రాష్ట్రంలో పదో తరగతి చదువుకున్న వారి సమగ్ర సమాచారం ఆన్లైన్లో అందుబాటులోకి రానుంది. -
ఇంటింటికి ఇంటర్నెట్
మహేశ్వరంర (రంగారెడ్డి): ప్రభుత్వం తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు పనులు చేపట్టింది. ఈ ఫైబర్ గ్రిడ్ సేవలను ఈ ఏడాది ఫిబ్రవరి 19న హైదరాబాద్లో కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రభుత్వం రూ.5వేల కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకా న్ని అమలు చేయాలని భావిస్తోంది. ఇంటింటికి ఇంటర్నెట్ నినాదం టీ ఫైబర్ గ్రిడ్ పథకం ముఖ్య ఉద్దేశం. పైలెట్ ప్రాజెక్టుగా మన జిల్లాలో మహేశ్వరం మండలంలోని నాలుగు గ్రామాలను ఎంపిక చేసింది. మహేశ్వరం, మన్సాన్పల్లి, తుమ్మలూ రు, సిరిగిరిపురం గ్రామాల్లో టీ ఫైబర్ గ్రిడ్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం లైన్లు వేశారు. ఒక్కో గ్రామంలో సుమారు రూ.50 లక్షలతో పనులు చేపట్టి పూర్తిచేశారు. టెలిఫోన్, వైఫై, ఈ–హెల్త్ ఈ– ఎడ్యుకేషన్, ఈ– పంచాయతీ, పౌర సేవలు, మినీ థియేటర్స్, వీడియో కాన్ఫరెన్స్లు, మీసేవ కేంద్రాల ద్వారా అందే సేవలు, ట్రిపుల్ సర్వీస్లు (ఇంటర్నెట్, కేబుల్ నెట్వర్క్, ల్యాండ్ లైన్ ఫోన్ సర్వీసులు), గ్రామంలో వీధి దీపాలను ఆటోమెటిక్ పద్ధతిలో వేయడం, ఆర్పడం వంటి సేవలను అందించనున్నారు. ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన గ్రామాల్లో తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, ప్రభుత్వ పాఠశాల, గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రులు, మీ సేవా కేంద్రాలతో పాటు గ్రామంలో పది కనెక్షన్లు ఇచ్చారు.ఈ –హెల్త్ ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నారు. వైద్య సిబ్బంది వ్యక్తుల ఆరోగ్య వివరాలు ఆన్లైన్లో పొందుపర్చి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సేవలు అందిస్తారు. అదేవిధంగా జనన, మరణ, ధ్రువీకరణ పత్రాలు సహా ఇతర ధ్రువీకరణ పత్రాలు 24 గంటల్లో ఇచ్చేలా మన్సాన్పల్లి గ్రామంలో సేవలను విస్తరించారు. రోగులు ఆస్పత్రి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వైద్యులు వీడియో కాన్ఫరెన్స్లో బీపీ, షుగర్ పరీక్షల వివరాలు సేకరిస్తారు. రోగులకు అవసరమయ్యే మందులను లైవ్లో చెబుతారు. ప్రజలను సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకు సులభతరం చేశారు. బటన్ నొక్కితే అధికారులు, ప్రజా ప్రతినిధులకు మెయిల్ వెళ్తుంది. వారు మెయిల్ చూసుకుని సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారు. ఈ– ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడం కోసం మినీ థియేటర్ను ఏర్పాటు చేశారు. పాఠశాలలకు డిజిటలైజేషన్ చేసి నాణ్యమైన విద్యను స్మార్ట్ క్లాస్ల ద్వారా విద్యార్థులకు అందిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులకు అనుభవం కలిగిన ఉపాధ్యాయుల చేత పాఠాలు చెప్పిస్తారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం, సలహాలు, సూచనలు, పంటల సాగు, తెగుళ్ల నివారణకు మందుల, ఎరువుల వాడకం వివరాలు, నిత్యం రైతు బజార్లో కూరగాయాల ధరల వివరాలు అందించనుంది. వీధి దీపాలను ఇంటర్నెట్తో అనుసంధానం చేసి పంచాయతీ కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించడానికి ఏర్పాటు చేశారు. స్మార్ట్ వాయిస్, వీడియో కాన్ఫరెన్స్లు, వాతవరణం, ఉష్ణోగ్రతల వివరాలు, తాజా వార్తల అప్డెట్స్, అసెంబ్లీ సమావేశాలు, జీఓలు పలు అంశాలను తెలుసుకోవచ్చు. ఈ నాలుగు గ్రామాల్లో వచ్చే ఫలితాల ఆధారంగా టీ ఫైబర్ గ్రిడ్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. -
బీమా వృద్ధికి టెక్నాలజీ దన్ను
సాక్షి, బిజినెస్ బ్యూరో : పాలసీల విక్రయం నుంచి సర్వీసుల దాకా జీవిత బీమా రంగంలో టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి పూర్తి డిజిటల్ సంస్థగా ఎదిగే దిశగా ఇన్వెస్ట్ చేస్తున్నామంటున్నారు బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ తరుణ్ చుగ్. గత ఆర్థిక సంవత్సరం పరిశ్రమకు రెట్టింపు స్థాయిలో కొత్త ప్రీమియం ఆదాయాలు సాధించామని, ఈసారీ మరింత వ్యాపార వృద్ధికి సానుకూల పరిస్థితులు ఉన్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ పనితీరు ఎలా ఉంది. ఈసారి అంచనాలేంటి? గత ఆర్థిక సంవత్సరం అటు మొత్తం జీవిత బీమా రంగానికి ఇటు మా సంస్థకూ సానుకూలంగానే గడిచింది. కొత్త బిజినెస్ ప్రీమియంలు, ముఖ్యంగా యులిప్స్లో పెట్టుబడులు పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు యులిప్స్ను సురక్షితమైన, మెరుగైన పెట్టుబడి సాధనంగా విశ్వసిస్తున్నారనడానికి ఇది నిదర్శనం. 2017–18లో పరిశ్రమ కొత్త ప్రీమియం ఆదాయం 19 శాతం పెరగ్గా, ప్రైవేట్ బీమా సంస్థల్లో మేం అత్యధికంగా 38 శాతం వృద్ధి సాధించాం. 2016–17లో మార్కెట్ వాటా 1.9 శాతం ఉండగా, గత సంవత్సరం 2.2 శాతానికి పెరిగింది. గత క్వార్టర్లో యులిప్ గోల్ అష్యూర్ వంటి పథకాలను ప్రవేశపెట్టాం. కొత్త బిజినెస్ ప్రీమియం ఆదాయాలు పెంచుకునేందుకు ఇవన్నీ తోడ్పడ్డాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం కూడా పరిస్థితులు సానుకూలంగానే కనిపిస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయాలు పెరుగుతుండటం, మరింత మెరుగైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకుంటున్న రిటైల్ ఇన్వెస్టర్లు .. సముచిత రాబడులు అందించే పెట్టుబడి సాధనాల వైపు చూస్తుండటం తదితర అంశాలు ఈసారి వ్యాపార వృద్ధికి తోడ్పడే అవకాశాలు ఉన్నాయి. జీవిత బీమా రంగంలో ప్రస్తుతం ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? బీమా రంగ సంస్థలు డిజిటైజేషన్ అవసరాన్ని గుర్తెరిగాయి. కస్టమర్కు మెరుగైన అనుభూతినివ్వడంతో పాటు కొత్త వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు, వ్యయాలను తగ్గించుకునేందుకు, సులభతరంగా కార్యకలాపాల నిర్వహణకు ఇది తోడ్పడుతోంది. రాబోయే రోజుల్లో ప్రీ–సేల్స్ నుంచి పోస్ట్ సేల్స్ సర్వీసెస్ దాకా అంతా పేపర్రహితంగానే జరిగే అవకాశం ఉంది. బీమా పాలసీల అమ్మకాలు ఆన్లైన్లో మరింతగా పెరగునున్నాయి. డిజిటైజేషన్ కారణంగా ఎలాంటి సర్వీసైనా క్షణంలోనే అందుబాటులో ఉంటుంది. మా విషయానికొస్తే.. 2019 నాటికల్లా పూర్తి డిజిటల్ సంస్థగా ఎదిగే దిశగా ఐటీ ఇన్ఫ్రాను అప్గ్రేడ్ చేసేందుకు భారీ పెట్టుబడులు పెడుతున్నాం. మీ సంస్థలో టెక్నాలజీ వినియోగం ఎలా ఉంటోంది? కస్టమర్తో పాటు ఉద్యోగులకు కూడా తోడ్పడేటటువంటి టెక్నాలజీలను మేం ఉపయోగిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో లైఫ్ అసిస్ట్ పేరుతో కస్టమర్స్ కోసం పోర్టల్ ప్రారంభించాం. బజాజ్ అలయంజ్ లైఫ్ పాలసీకి సంబంధించి తలెత్తే ప్రశ్నలన్నింటినీ దీని ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఆధార్, ఫండ్ స్విచింగ్, కాంటాక్ట్ వివరాలు అప్డేట్ చేసుకోవడం మొదలైన వాటన్నింటికీ ఇది ఉపయోగపడుతుంది. దీన్ని రెండు లక్షల మందికి పైగా కస్టమర్లు ఉపయోగించుకుంటున్నారు. ఇక పాలసీ సేవలపై కస్టమర్స్కి తోడ్పాటు అందించేందుకు బోయింగ్ పేరిట వర్చువల్ చాట్ అసిస్టెంట్ కూడా అందుబాటులో ఉంది. ఇక మా శాఖల్లో లభించే సర్వీసులన్నీ కస్టమర్ ఇంటి దగ్గరే అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించి మోసంబీ పేరుతో చేతిలో ఇమిడే చిన్న పరికరాన్ని రూపొందిం చాం. దీని తోడ్పాటుతో కేవలం నాలుగు నెలల్లోనే రూ. 160 కోట్లకు పైగా రెన్యువల్ ప్రీమియంలు సేకరించగలిగాం. దీంతో పాటు ఫొటో డె డూప్ పేరుతో మరొక ఫీచర్ కూడా అందుబాటులోకి తెచ్చాం. కేవలం సెల్ఫీ క్లిక్ చేయడం ద్వారా పాలసీదారు ఆన్లైన్లో లాగిన్ అయి.. పాలసీ సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. లాగిన్ అయ్యేందుకు పట్టే సమయాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. అమ్మకాల కోసం ఇన్స్టాబ్ పేరుతో ప్రత్యేకంగా యాప్ కూడా ఉంది. ఏజెంటు అప్పటికప్పుడు బీమా ప్రీమియంను లెక్కగట్టి, ట్యాబ్లెట్ లేదా స్మార్ట్ఫోన్ ద్వారా కొత్త ప్రపోజల్ను ఆఫ్లైన్లో కూడా ప్రాసెస్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా గత ఆర్థిక సంవత్సరం 27,000 పైచిలుకు పాలసీలు ప్రాసెస్ చేశాం. ఇక సేల్స్ టీమ్ మధ్య పరస్పరం సమాచారం పంచుకునేందుకు ఐస్మార్ట్, పేపర్రహితంగా ఏజెంట్ల నియామకం చేపట్టేందుకు ఐ–రిక్రూట్ పోర్టల్ లాంటివి ఉన్నాయి. అటు మా ఉద్యోగులు, మానవ వనరుల విభాగం మధ్య అనుసంధానంగా వ్యవహరించేందుకు వికి పేరుతో చాట్బాట్ను రూపొందించాం. -
డిజిటైజేషన్ను 6 వారాల్లో పూర్తి చేయండి
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్బోర్డుకు చెందిన రికార్డుల డిజిటైజేషన్ను 6 వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిజిటైజేషన్ పూర్తయిన తర్వాత ఆ రికార్డులను తిరిగి వక్ఫ్బోర్డుకు అప్పగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రికార్డుల డిజిటైజేషన్ నిమిత్తమే వక్ఫ్బోర్డు కార్యాలయానికి ప్రభుత్వం సీలు వేసిన నేపథ్యంలో ప్రభుత్వ చర్యను తప్పు పట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. వక్ఫ్బోర్డ్ రికార్డులను జప్తు చేసి, కార్యాలయానికి సీలు వేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఎం.ఎ.కె.ముఖీద్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వక్ఫ్బోర్డు కార్యాలయానికి వేసిన సీలును తొలగించినట్లు తెలిపారు. కార్యాలయ కార్యకలాపాలకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. రికార్డులున్న గదినే తాము స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు 4 నుంచి 6 వారాల సమయం పడుతుందని చెప్పారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఖురేషీ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. అధికారుల అత్యుత్సాహం వల్ల రికార్డులు తారుమారయ్యే ప్రమాదం ఉందన్నారు. అయితే ఈ వ్యవహారంలో అధికారులు అనుసరించిన విధానం తప్పు కావొచ్చేమో గానీ, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకే రికార్డులను స్వాధీనంలోకి తీసుకుని డిజిటైజేషన్ చేస్తోందని పేర్కొంది. రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియను 6 వారాల్లో పూర్తి చేసి, రికార్డులను వక్ఫ్బోర్డుకు అప్పజెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ వ్యాజ్యాన్ని పరిష్కరించింది. -
ఇక ఈ–పాస్బుక్కు
♦ అమలుకు రెవెన్యూ శాఖ కసరత్తు ♦ పాత పుస్తకాల పంపిణీ నిలిపివేత ♦ ఆధునిక పరిజ్ఞానంతో కొత్త పుస్తకాలు ♦ నకిలీలకు చెక్ పెట్టేందుకు ‘డిజిటల్’ ♦ ఆన్లైన్ పనులు చేపడుతున్న అధికారులు నిర్మల్రూరల్: నకిలీ పాసు పుస్తకాల ఆట కట్టించేం దుకు.. రైతన్నకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఈ–పాస్బుక్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీంతో నకిలీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రెవెన్యూ శాఖలో అవినీతికి ముకుతాడు వేయొచ్చని భావిస్తోంది. అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతులకు మేలు జరిగేలా ఈ–పట్టాదారు పాస్బుక్లను జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు అన్ని పనులను మీసేవతో లింకప్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు పాస్ పుస్తకాలనూ డిజిటలైజేషన్ చేసే పనికి శ్రీకారం చుట్టింది. పాస్ పుస్తకాలను మాన్యువల్గా కాకుండా ఆన్లైన్ ద్వారా జారీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే మాన్యువల్ పాస్ పుస్తకాలు ఇవ్వొద్దని ఆదేశాలూ జారీ చేసింది. పాత పుస్తకాలతో అక్రమాలు ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఈ–పాస్ పుస్తకాల విధానానికి పనులు మొదలుపెట్టింది. భూమి హక్కులు పొందేందుకు రైతులకు గతంలో సర్వే నంబర్, విస్తీర్ణం ఆధారంగా పాస్ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. కాలక్రమంలో ఈ విధానానికి స్వస్తిచెప్పి.. రైతు పట్టా పుస్తకాల పేరిట టైటిల్ డీడ్, పాస్ పుస్తకం అనే రెండు రకాల పుస్తకాలను పంపిణీ చేశారు. వీటిలో భూమి స్వభావం, విస్తీర్ణం తదితర వివరాలు పొందుపర్చారు. అక్రమాలు చోటు చేసుకోకుండా వరుస సంఖ్య కేటాయించారు. అయినప్పటికీ పాస్ పుస్తకాల పంపిణీలో భారీగానే అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. బోగస్ పట్టా పాస్ పుస్తకాల దందా చాలాచోట్ల వెలుగులోకి వచ్చింది. నకిలీ పాస్పుస్తకాల ద్వారా చాలామంది అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు గతంలో పలు సంఘటనలూ బయటకు వచ్చాయి. అవినీతిని అరికట్టేందుకు.. రెవెన్యూ శాఖలో ప్రధానంగా పాస్పుస్తకాల జారీలో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి, అక్రమాలు బయటపడ్డాయి. బోగస్ పుస్తకాలను తయారు చేసి ఇచ్చిన ఘటనలు అనేక జిల్లాల్లో కనిపించాయి. ఇందులో పలువురు అధికారులూ సస్పెండ్ అయిన సంఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో రెవెన్యూ శాఖలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం నూతన సంస్కరణలను అమలులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. బోగస్ పట్టాపాస్ పుస్తకాలను పూర్తిగా నియంత్రించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే భూముల కొనుగోలు, ఇతర కారణాలతో భూహక్కులను పొందుతున్న వారికి పాస్ పుస్తకాల జారీని నిలిపివేసింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలనూ జారీచేసింది. కొత్తగా ఈ–పాస్పుస్తకాలనే అందించేందుకు సన్నద్ధమవుతోంది. పకడ్బందీగా కొత్త పుస్తకం ఇప్పటివరకు కొనసాగిన మాన్యువల్ విధానానికి పుల్స్టాప్ పడనుంది. ఇప్పుడు క్షేత్రస్తాయిలో ఆధునికీకరిస్తున్న డాటా నేరుగా సీసీఎల్ఏ వరకు వెళ్తుంది. అక్కడి నుంచి లబ్ధిదారులకు నేరుగా ఈ–పాస్పుస్తకం అందేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా జరిగితే కొంతమంది ఇంటి అడ్రస్లు మార్పులు ఉంటే అవి తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తహసీల్దార్ల ద్వారానే లబ్ధిదారులకు అందించాలా.. లేక ఆన్లైన్ ద్వారా తీసుకునే అవకాశం కల్పించాలా.. అనే దానిపై చర్చిస్తోంది. ఇక ఈ–పాస్ పుస్తకం పూర్తిగా డిజిటల్గా ఉంటుంది. దీనిపైన అధికారుల సంతకాలు, పట్టాదారు వివరాలు డిజిలైజ్డ్ అయి వస్తాయి. వీటిని మార్చడానికి బోగస్ చేయడానికి వీలు లేదు. ఈ పుస్తకం చినగడం, మంటల్లో వేసిన కాలిపోవడం వంటివి జరగకుండా పకడ్బందీగా రూపొందిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈపుస్తకాలు యూనిక్ కోడ్ ఆధారంగా జారీ కానున్నాయి. సర్వే నంబర్, 1బి ఖాతా సంఖ్యతో తహసీల్దార్, ఆర్డీవో డిజిటల్ సంతకంతో ఈ–పాస్బుక్ను ముద్రించనున్నారు. నిలిచిన పాస్పుస్తకాల జారీ ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తీసుకువస్తున్న ఈ–పాస్పుస్తకాల నేపథ్యంలో జిల్లాలో మాన్యువల్గా పాస్బుక్లను ఇవ్వడం నిలిపివేశారు. అయితే రైతులకు రుణాలు కావాలంటే బ్యాంకుల్లో పాస్పుస్తకాలను చూపడం తప్పనిసరి. ప్రస్తుత సీజన్లో రైతులు రుణాల కోసం బ్యాంకుల వెంట తిరగాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని మండలాల్లో రైతులకు మాన్యువల్గా పాస్ పుస్తకాలను అందిస్తున్నారు. ఇకనుంచి మాత్రం పూర్తిస్థాయిలో ఈ–పాస్పుస్తకాలనే ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ ప్రయత్నంతోనైనా ఏళ్ల తరబడి నడుస్తున్న నకిలీ పట్టా పాస్ పుస్తకాల అక్రమాలకు తెరపడాలని రైతులు ఆశిస్తున్నారు. త్వరలో అందుబాటులోకి.. ప్రభుత్వం ఈ–పాస్పుస్తకాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే పాస్ పుస్తకాల జారీని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు త్వరలోనే ఈ–పాస్ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. బోగస్ పుస్తకాలకు కళ్లెం వేసేందుకు డిజిటలైజ్డ్ ఈ–పాస్ పుస్తకాలు ఉపయోగపడతాయి. నిర్మల్ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు : 02(నిర్మల్, భైంసా) రెవెన్యూ మండలాలు : 19 ప్రస్తుతం సాగుభూమి : 3లక్షల 64వేల ఎకరాలు రైతుల సంఖ్య : లక్షా 35వేల 565 మంది (సమగ్ర సర్వే ప్రకారం) -
‘కార్డు’న్నా.. కటకటే..
♦ వాడే విధానం తెలియక రైతుల అవస్థలు ♦ బ్యాంకులో డబ్బులున్నా తీయలేని పరిస్థితి ♦ సాగు పెట్టుబడులకు చేతిలో డబ్బులేని వైనం ♦ వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు ఖమ్మంవ్యవసాయం: బ్యాంకింగ్ విధానాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వ్యవస్థలో వచ్చిన మార్పులు తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్ కావడం.. వర్షాలు అనుకూలిస్తుండటంతో పల్లెల్లో సాగు పనులు ఊపందుకున్నాయి. దుక్కులు దున్నటం.. విత్తనాలు కొనుగోలు చేయడం వంటి పనులు చురుకుగా సాగుతున్నాయి. రైతులు ఈ సీజన్లో ఏ పని చేయాలన్నా డబ్బుతోనే ముడిపడి ఉంది. చేతిలో డబ్బులు లేకపోతే వ్యవసాయ పనులు సాగని పరిస్థితి. గత ఏడాది పంట ఉత్పత్తులు అమ్మగా వచ్చిన నగదు.. అరకొరగా అందిన రుణమాఫీ డబ్బులు.. కొత్తగా వచ్చే పంట రుణాలు కూడా రైతుల ఖాతాల్లోనే జమ అయ్యాయి. అయితే వ్యవసాయ పనులు, పెట్టుబడులకు నగదు అవసరం ఉండి.. బ్యాంకుకు వెళితే నగదు లేదని అధికారులు చెబుతున్నారు. నగదు రావడం లేదని, ప్రస్తుతం విధానం మారిందని తేల్చి చెబుతున్నారు. దీంతో తమ పనులు ఎలా కావాలని, సాగు పెట్టుబడులకు నగదు ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనికి క్రెడిట్ కార్డులను వినియోగించుకోవాలని, అంతకు మించి మరో మార్గం లేదని చెబుతున్నారు. తమకు క్రెడిట్ కార్డు అంటే తెలియదని, అవి తమ దగ్గర లేవని చెబితే కార్డులు ఇస్తామని సమాధానం చెబుతున్నారే తప్ప నగదు మాత్రం ఇవ్వటం లేదు. ఇక సహకార బ్యాంకులు కూడా ఈ ఏడాది రూపే కార్డుల విధానాన్ని అమలు చేస్తుండగా.. ఆ బ్యాంకులు కూడా నగదు ఇవ్వని పరిస్థితి నెలకొంది. రూపే, క్రెడిట్ కార్డులున్నా ఏటీఎంలలో నగదు రావటం లేదు. గ్రామాలు, మండల కేంద్రాల్లో క్రెడిట్ కార్డు వినియోగించేందుకు పాస్ మిషన్లు లేవు. విత్తనాలు వ్యాపారులు మాత్రం నగదు చెల్లిస్తేనే విత్తనాలు, ఎరువులు ఇస్తామని చెబుతూ.. ఆ వి«ధానాన్నే పాటిస్తున్నారు. దీంతో రైతులు పాస్ మిషన్లు ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. మిషన్లలో క్రెడిట్ కార్డులను వినియోగించే విధానం తెలియక, బ్యాంకులో ఉన్న తమ నగదులో ఎంత ఖర్చవుతుందో..? ఎంత ఉందో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు. దుక్కి దున్నే ట్రాక్టర్కు, చేలు, పొలాల్లో పనిచేసే కూలీలకు నగదు చెల్లించడం పెద్ద సమస్యగా మారింది. బ్యాంకులో నగదు ఉన్నా.. అన్నదాతలకు కొత్త విధానాలు అవస్థలకు గురిచేస్తున్నాయి. డిజిటలైజేషన్ తెచ్చిన తంటాలు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దుతోపాటు బ్యాంకింగ్ రంగంలో కూడా సమూల మార్పులు తెచ్చింది. నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించి.. చర్యలు చేపట్టింది. ఆన్లైన్ విధానంలో లావాదేవీలు చేపట్టాలని బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నగదు చెల్లింపులు లేకుండా.. కొనుగోళ్లు, అమ్మకాలు జరిపే విధంగా మిషనరీ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిని అన్ని రకాల వ్యవస్థల్లో కూడా అమలు చేస్తున్నారు. కానీ.. వ్యవసాయ రంగంలో ఈ విధానం అమలుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విత్తన, ఎరువుల అమ్మకానికి వ్యాపారులకు పాస్ మిషన్లు, డీబీటీ(డైరెక్ట్ బెనిఫట్ ట్రాన్స్ఫర్) మిషన్లను ఇచ్చి అమలు చేయిస్తున్నారు. అయినప్పటికీ వీటిని వ్యాపారులు పూర్తిస్థాయిలో వినియోగించటం లేదు. మిషన్లు ఉన్న ప్రాంతాల్లో విధానం తెలియక రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఎరువులు, విత్తనాల కొనుగోళ్లకు అవస్థలు చేతిలో నగదు లేక, క్రెడిట్ కార్డు, రూపే కార్డు వినియోగం తెలియక ఎరువులు, విత్తనాలు కొనుగోలుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏటీఎంలలో నగదు డ్రా చేసి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలంటే ఏటీఎంలలో నగదు ఉండటం లేదు. ఇక ఆ కార్డులు పట్టుకుని దుకాణాలకు వెళితే కొన్ని దుకాణాల్లో పాస్ మిషన్లు లేకపోవటం, ఉన్న దుకాణాల్లో డ్రా చేసే విధానం తెలియక రైతులు కార్డులను వ్యాపారుల చేతిలో పెట్టాల్సి వస్తోంది. చేతిలో నగదు లేని పరిస్థితి వ్యవసాయ పనులకు అవసరమైన పెట్టుబడులు లేక కొందరు రైతులు అవస్థలు పడుతుండగా.. అరకొర రుణాల ద్వారా, గత ఏడాది పండించిన పంటల ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకున్న నగదు విడుదల కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కమీషన్, వడ్డీ వ్యాపారులకు పండగ వ్యవసాయ పెట్టుబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను, కమీషన్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా బ్యాంకుల నుంచి తమకు కూడా నగదు రావటం లేదని చెబుతూనే రూ.3 నుంచి రూ.5 వడ్డీకి నగదును అప్పుగా ఇస్తున్నారు. తప్పని పరిస్థితిలో వ్యవసాయ పెట్టుబడులకు రైతులు అధిక వడ్డీలకు సైతం నగదును తీసుకుంటూ సాగు పనులు చేసుకోక తప్పటం లేదు. కార్డు వాడకం తెలియట్లేదు.. ఎప్పుడు బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకొని ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునే వాళ్లం. ఇప్పుడు బ్యాంకుకు వెళితే నగదు లేదంటున్నారు. అదేమంటే.. క్రెడిట్ కార్డు వినియోగించుకొని ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకోవచ్చని చెబుతున్నారు. కార్డు వాడకం తెలియడం లేదు. కార్డు తీసుకొని ఓ దుకాణానికి వెళితే అవసరమైన విత్తనాలు లేవన్నారు. నగదు అవసరానికి దొరకక అప్పు చేసి.. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశా. – ఆలస్యం గోవిందరావు, రైతు, నేరడ, చింతకాని మండలం కౌలు సాగు తగ్గించా.. ప్రతి ఏటా నా భూమితోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంటా. కొందరి దగ్గర అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తూ.. పంటలు వచ్చాక తీర్చుతున్నా. ఈ ఏడాది అప్పిచ్చే వాళ్లు తమ వద్ద నగదు లేదని చెప్పారు. దీంతో కౌలు వ్యవసాయాన్ని తగ్గించా. పనులు చేయించడానికి నగదు సమస్య బాగా ఉంది. – కంబాల నాగరాజు, రైతు, అమ్మపాలెం, కొణిజర్ల మండలం. -
ఆరోగ్య రికార్డుల డిజిటైజేషన్
టాటా ట్రస్ట్తో వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్య రికార్డులన్నింటినీ డిజిటైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీహెచ్సీలు మొదలు నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల వరకు వచ్చే రోగుల వైద్య వివరాలను ఆన్లైన్లో భద్రపరచనుంది. ఈ బాధ్యతను టాటా ట్రస్ట్కు అప్పగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుగా పిలిచే ఈ పద్ధతిలో రోగులందరి ఆరోగ్య సమాచార వివరాలను రిపోర్టులతో సహా స్కానింగ్ చేసి ఆన్లైన్లో ఉంచుతారు. సంబంధిత రోగికి కేటాయించిన ఆన్లైన్ నంబర్ను ఎంటర్ చేయగానే వారి ఆరోగ్య రికార్డులు వస్తాయి. మరో నంబర్ ఏదైనా ఇచ్చినా ఆధార్ నంబర్తోనే సమాచారం వచ్చేలా చేయాలని భావి స్తున్నారు. ఎప్పటిలోగా దీన్ని పూర్తి చేయాలనేది ఖరారు కాలేదని టాటా ట్రస్ట్ ప్రతినిధి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
మహిళలకు ‘స్త్రీనిధి’ ఫోన్లు!
డిజిటలైజేషన్ను ప్రోత్సహించేందుకే.. ♦ ఈ ఏడాది రూ.50 కోట్లతో 84 వేల మందికి ఫోన్లు ♦ స్త్రీనిధి బ్యాంకు మేనేజింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీలను (డిజిటలైజేషన్) ప్రోత్స హించేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు మొబైల్ ఫోన్లు అందించాలని స్త్రీనిధి బ్యాంకు నిర్ణయించింది. ఈ ఏడాది రూ.50 కోట్లతో దాదాపు 84 వేల మందికి డిజిటల్ ఫోన్లను అందించనుంది. డిజిటలైజేష న్ను ప్రోత్సహించాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ట్లు స్త్రీనిధి బ్యాంకు వెల్లడించింది. శనివారం సచివాలయంలో స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ సమా వేశం జరిగింది. బ్యాంకు చైర్పర్సన్ అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామీణాభి వృద్ధి శాఖకు ఇన్చార్జి స్పెషల్ సీఎస్గా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, కమిష నర్ నీతూకుమారి ప్రసాద్, ఆర్థిక శాఖ కార్య దర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఆర్సీఎస్, మెప్మా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మేనేజింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఎండీ జి.విద్యాసాగర్రెడ్డి వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు మొబైల్ ఫోన్ సమకూర్చే నిమిత్తం ఒక్కో మహిళకు రూ.6 వేల చొప్పున స్త్రీనిధి బ్యాంకు రుణమిస్తోందని ఎండీ చెప్పారు. రుణాన్ని పొందిన మహిళలు నెలకు రూ.275 చొప్పున కనీస వడ్డీతో 24 నెలల్లోపు చెల్లించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు వారికి నచ్చిన మోడల్, నచ్చిన కంపెనీ మొబైల్ను తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రుణాలు స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామీణ ప్రాంతా ల్లోని స్వయం సహాయక మహిళల కుటుం బాల్లో మరుగు దొడ్డి నిర్మాణానికయ్యే ఖర్చు రూ.12 వేలను రుణంగా అందిస్తామని, 12 నెలల్లోపు రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని ఎండీ విద్యాసాగర్రెడ్డి తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్నందున నిధులు వచ్చేలోగా స్త్రీనిధి బ్యాంక్ రుణమిస్తుం దన్నారు. అలాగే వికలాంగులైన (ఎస్హెచ్జీ మహిళల) పిల్లలకు మెరుగైన శిక్షణ కోసం సెర్ప్ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 70 నైబర్హుడ్ కేంద్రాలకు ఆర్థిక తోడ్పాటును అందించాలని బ్యాంక్ నిర్ణయించింది. బ్యాంకు నికర ఆదా యంలో 2% (రూ.80 లక్షల) నిధుల ను కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆయా నైబర్హుడ్ కేంద్రాలకు అందించనున్నట్లు ఎండీ తెలిపారు. స్త్రీనిధి బ్యాంక్ కింద రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే నష్ట పరిహారం చెల్లించాలనే ప్రతిపా దనను కమిటీ ఆమోదించింది. వివిధ స్థాయి ల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు ఈ తరహా పరిహారం అందించనున్నారు. రుణ లక్ష్యాన్ని చేరకపోవడంపై అసంతృప్తి స్త్రీనిధి బ్యాంక్ వార్షిక రుణ లక్ష్యాన్ని చేరుకో వడంలో వెనుకబడటం పట్ల మేనేజింగ్ కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్ల రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందించాల్సి ఉండగా, 10 నెలలు గడిచినా రూ.650 కోట్ల మేరకే రుణాలిచ్చారు. రుణ లక్ష్యంలో వెనుక బాటుకు కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయమే కారణమని.. 2, 3 నెలల పాటు రుణాలను నగదుగా ఇచ్చేందుకు క్షేత్ర స్థాయి లో విముఖత వ్యక్తం చేశారని వివరణ ఇచ్చా రు. మార్చిలోగా లక్ష్యాన్ని చేరుకునేం దుకు చర్యలు చేపట్టినట్లు విద్యాసాగర్రెడ్డి పేర్కొ న్నారు. రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మహిళలకు అక్కడి ప్రభుత్వాలు సూక్ష్మ రుణాలను అందించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసేందుకు ఆయా రాష్ట్రాలతో అవగాహన ఒప్పందం కుదిరిందని విద్యాసాగర్రెడ్డి తెలిపారు. సభ్యుల వద్దకే చైర్పర్సన్ సాధారణంగా ఏ సంస్థకు సంబంధిం చిన మేనేజింగ్ కమిటీ సమావేశమైనా సదరు సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఆ కమిటీలో సభ్యులుగా ఉన్న అధికారులు, అనధికారులు చైర్మన్ ఉండే కార్యాలయా నికి రావాలి. అయితే.. శనివారం స్త్రీనిధి బ్యాంక్ మేనేజింగ్ కమిటీ సమావేశం మాత్రం చైర్మన్ ఉండే బ్యాంక్ ప్రాంగ ణంలో కాకుండా, కమిటీ సభ్యులు ఉన్న సచివాలయంలో జరగడం గమనార్హం. సచి వాలయంలో సమావేశమై తేనే వస్తామని కొందరు సభ్యులు భీష్మించుకుని కూర్చోవడంతో చివరికి బ్యాంక్ చైర్పర్సనే సచివాలయానికి వచ్చి మేనేజింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. -
గ్రూప్-2 జవాబు పత్రాల డిజిటైజేషన్
- భవిష్యత్తు అవసరాల కోసం జేపీజీ ఫార్మాట్లోకి మార్పు - రేపటికల్లా పూర్తికానున్న ప్రక్రియ, ఆ తరువాతే ప్రాథమిక ‘కీ’ విడుదల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1,032 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఈ నెల 11, 13 తేదీల్లో నిర్వహిం చిన రాత పరీక్ష జవాబు పత్రాల డిజిటైజేషన్కు టీఎస్పీఎస్సీ శ్రీకారం చుట్టింది. భవిష్యత్తు అవసరాలు, రిఫరెన్స కోసం అభ్యర్థుల జవాబు పత్రా లను జేపీజీ ఫార్మాట్లోకి మారుస్తోంది. పరీక్ష రాసేందుకు 7,89,437 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 63 శాతం మంది హాజరయ్యారు. వారందరికి సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ చేపడుతోంది. దీంతో భవిష్యత్తులో మూల్యాంకనానికి సంబంధించిన సమస్యలు తలెత్తినా డిజిటలైజ్ చేసిన జవాబు పత్రాలను చూసుకునేలా వాటిని టీఎస్పీఎస్సీ సర్వర్లో భద్రపరుస్తోంది. తద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయవచ్చని భావిస్తోంది. ఈ ప్రక్రియ బుధవారం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తరువాతే గ్రూప్-2 రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ని టీఎస్పీఎస్సీ విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి తగిన చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఆ తరువాతే చేపట్టి ఫలితాలను ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు. -
ఎఫ్ఎంబీల డిజటలైజేషన్పై సంతృప్తి
కర్నూలు(అగ్రికల్చర్): భూముల పీల్డ్ మెజర్మెంటు బుక్(ఎఫ్ఎంబీ)ల డిజిటలైజేషన్ ప్రక్రియపై ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ వైస్ చైర్మన్ కే.వెంకటరయణ సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమం చురుగ్గా సాగుతోందన్నారు. కలెక్టరేట్ భూమి రికార్డులు, సర్వే విభాగంలో జరుగుతున్న ఎఫ్ఎంబీల డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. పలువురు డిజిటలైజర్లతో చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమ వేగవంతానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. అన ంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ జిల్లా, అనంతపురం జిల్లా ముందంజలో ఉన్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఆలస్యంగా మొదలైనా సంతప్తికరంగా ఉందన్నారు. జిల్లాలో 4.80 లక్షల ఎప్ఎంబీలుండగా ఇప్పటి వరకు 62 వేల వరకు డిజిటలైజ్ చేసినట్లు వివరించారు. 2017 మార్చి చివరినాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. ఎఫ్ఎంబీల డిజిటలైజేషన్తో మ్యుటేషన్ చేయడం సులభమవుతుందని, దేశంలో ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో భూములను సబ్ డివిజన్ చేయవచ్చన్నారు. సర్వే డీడీ ఝాన్సీరాణి మాట్లాడుతూ 137 మంది డిజటలైజర్లతో కార్యక్రమాన్ని చేపడుతున్నారని, 30 మంది పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్వే ఏడీ చిన్నయ్య, ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యలో సమున్నత మార్పులు
ప్రస్తుత గ్లోబలైజేషన్, డిజిటలైజేషన్ నేపథ్యంలో ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని కమిటీ పేర్కొంది. జాతీయ స్థాయిలో ఎడ్యుకేషన్ కమిషన్ను ఏర్పాటు చేయాలి. ఇది ప్రతి ఐదేళ్లకోసారి కరిక్యులం, బోధన, ఇతర అంశాలపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు సలహాలు, సూచనలు అందించాలి. ఉన్నత విద్య నియంత్రణ సంస్థల్లో ఇండస్ట్రీ నిపుణులు, పూర్వ విద్యార్థులు, ఇతర విద్యావేత్తలు ఇలా అన్ని వర్గాలకు చెందినవారు ఉండేలా చర్యలు తీసుకోవాలి. యూనివర్సిటీల స్థాయిలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్టడీస్ను సమీకృతం చేసే విధానాలు రూపొందించాలి. విద్యా రంగంలో అకడమిక్, నిర్వహణ విభాగాల కోసం జాతీయ స్థాయిలో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ను రూపొందించాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో సమస్యల పరిష్కారం కోసం ఎడ్యుకేషన్ ట్రిబ్యునల్స్ ఉండాలి. వర్సిటీ పరిధిలో అనుబంధ కళాశాలలు వందకు మించకూడదు. ఉన్నత విద్యా సంస్థల్లో ఉమ్మడి నియంత్రణ విధానాలు జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా సంస్థలు వేర్వేరు విధానాలతో నిర్వహణ సాగిస్తున్నాయి. వీటన్నిటినీ ఒకే విధానంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని కమిటీ పేర్కొంది. నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ను సమర్థంగా పర్యవేక్షించేందుకు స్వతంత్ర వ్యవస్థను రూపొందించాలి. జాతీయ స్థాయిలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల సమాచార సేకరణ, సమీకృతం చేయడం కోసం సెంట్రల్ ఎడ్యుకేషనల్ స్టాటిస్టికల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లు తప్పనిసరిగా వర్సిటీలు, కళాశాలల నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలి. ప్రతి విద్యా సంస్థ తప్పనిసరిగా ఎన్బీఏ లేదా న్యాక్ గుర్తింపు పొందాలి. న్యాక్, ఎన్బీఏలను పునర్వ్యవస్థీకరించాలి. గ్లోబల్ ర్యాంకులు పొందేలా వర్సిటీల్లో నాణ్యత ప్రమాణాలు ఉండేలా న్యాక్, ఎన్బీఏలు చర్యలు తీసుకోవాలి. మూక్స్కు ప్రాధాన్యం.. ప్రత్యేక వ్యవస్థ అంతర్జాతీయంగా తాజా పరిణామాలపై అవగాహన, అంతర్జాతీయంగా సబ్జెక్ట్ నైపుణ్యాల వృద్ధి. ఈ క్రమంలో ప్రాచుర్యంలోకి వస్తున్న విధానం మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్). వీటిని విస్తరించేందుకు కమిటీ పలు సూచనలు చేసింది. మూక్స్ నిర్వహణ, అభివృద్ధి, సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి. మూక్స్, ఓడీఎల్ కోర్సుల్లో నిరంతరం మార్పులు చేర్పులు చేస్తుండాలి. స్కిల్ డవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఒకేషనల్ కోర్సులు అందించాలి. విదేశీ వర్సిటీలకు ఆహ్వానం.. పరస్పర ఒప్పందం అంతర్జాతీయ నైపుణ్యాలు పొందడానికి విద్యా వ్యవస్థను గ్లోబలైజ్ చేయాలని కమిటీ పేర్కొంది. అందులో ప్రధానంగా విదేశీ వర్సిటీలను ఆహ్వానించడం, లేదా వాటితో భారత్లోని యూనివర్సిటీలు ఒప్పందం చేసుకోవడం వంటివి కీలకం. ప్రపంచంలోని టాప్-200 జాబితాలో ఉన్న వర్సిటీలు భారత్లోని వర్సిటీలతో ఒప్పందం ద్వారా ఇక్కడ అడుగుపెట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ఆ ఇన్స్టిట్యూట్లు ఇచ్చే సర్టిఫికెట్లకు గుర్తింపు కల్పించాలి. భారత్లోని ఇన్స్టిట్యూట్లు కూడా ఇతర దేశాల్లో క్యాంపస్లు నెలకొల్పేందుకు అనుమతివ్వాలి. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే విధంగా కరిక్యులం రూపొందించాలి. విదేశీ ఫ్యాకల్టీ ఆకర్షితులయ్యేందుకు కృషి చేయాలి. టీచింగ్ పోస్టుల్లో బెస్ట్ టాలెంట్ను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. రీసెర్చ్వైపు ఆకర్షితులయ్యేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఎంఫిల్, పీహెచ్డీ అభ్యర్థులను అకడమిక్ అసిస్టెంట్స్, అకడమిక్ అసోసియేట్స్గా పరిగణించాలి. కొత్తగా నియమితులైన ఫ్యాకల్టీకి విధుల్లో చేరే ముందుగా మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ట్రైనింగ్ అకాడమీల నేతృత్వంలో ఇండక్షన్ ప్రోగ్రామ్లు నిర్వహించాలి. తర్వాత పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ అందించాలి. ఇండక్షన్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు వాళ్లు ఫ్యాకల్టీగా నియమితులైన యూనివర్సిటీలో నాలుగు నుంచి ఆరు వారాల వ్యవధిలో ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించాలి. ఆయా ఇన్స్టిట్యూట్లలో ఫ్యాకల్టీ నైపుణ్యాలను, అకడమిక్ పెర్ఫార్మెన్స్ను పరీక్షించేలా తప్పనిసరిగా మూల్యాంకన వ్యవస్థ ఉండాలి. సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుల పదోన్నతుల క్రమంలో వారిలో లీడర్షిప్ నైపుణ్యాలు పెంపొందించేలా ఉన్నత విద్యా సంస్థలు లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు నెలకొల్పి వీటిపై షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్లు నిర్వహించాలి. ఆర్ అండ్ డీ కి అనువైన వాతావరణం మన దేశంలోని యువత రీసెర్చ్ దిశగా విదేశాలకు వెళుతున్న క్రమంలో ఇక్కడే ఆ అవకాశం కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. పబ్లిక్, ప్రైవేట్ విభాగంలో రానున్న పదేళ్లలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా కనీసం 100 కొత్త రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ఇన్నోవేషన్, క్రియేటివిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంపొందించేందుకు రానున్న ఐదేళ్ల కాలంలో ఉన్నత విద్యా సంస్థల్లో అదనంగా వంద ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్, స్టడీస్కు ప్రాధాన్యమిస్తూ మానవ వనరులను అభివృద్ధి చేసేలా అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవాలి. -
పన్ను చెల్లింపుదార్లను.. 10కోట్లకు పెంచాలి
రెట్టింపు చేయడమే లక్ష్యం... ♦ వేధింపుల భయాన్ని తొలగించాలి... ♦ ఎగవేతదారుల పని చట్టం చూసుకుంటుంది... ♦ డిజిటైజేషన్తో మరింత మెరుగైన పన్నుల వ్యవస్థ ♦ ప్రత్యక్ష, పరోక్ష పన్ను విభాగాల వార్షిక సదస్సులో అధికారులకు ప్రధాని మోదీ సూచనలు న్యూఢిల్లీ: దేశంలో పన్ను చెల్లింపుదార్ల సంఖ్యను రెట్టింపుస్థాయిలో 10 కోట్లకు పెంచాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ), పరోక్ష పన్నుల విభాగం(సీబీఈసీ) అధికారుల వార్షిక సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ లక్ష్యాన్ని నిర్ధేశించారు. ప్రస్తుతం దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు 5.43 కోట్లుగాఉందని ప్రధాని చెప్పారు. పన్నులు ఎగవేసేవారిని చట్టం ఉపేక్షించబోదని, కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. రాజస్వ జ్ఞాన సంఘం పేరుతో రెండు రోజులపాటు ఈ సదస్సు జరుగుతోంది. మరోపక్క, పన్ను అధికారులు.. చెల్లింపుదారులతో సుహృద్భావంతో మెలగాలని.. వారిలో ఉన్న వేధింపు భయాలను పోగొట్టేందుకు ప్రయత్నించాల్సిందిగా కూడా సూచించారు. ‘పన్నుల యంత్రాంగం అనేది ఆదాయం, జవాబుదారీతనం, దర్యాప్తు, సమాచారం, డిజిైటైజేషన్(ఆర్ఏపీఐడీ) అనేవి ఐదు మూల స్తంభాలపై నిలబడాలి. ప్రజలందరిలో చట్టాల పట్ల గౌరవం ఉండాల్సిందే. అంతేకాదు పన్ను ఎగవేతదారులు చట్టాలను చూసి భయపడాలి కూడా. అయితే, అందరినీ ఎగవేతదారుల కోణంలో చూడటం సరికాదు. ప్రజలు పన్ను అధికారులను చూసి భయపడకూడదు. భారతీయులు ఎప్పుడూ నిజాయితీపరులే. వారిలో నమ్మకాన్ని మరింతగా పెంపొందించగలిగితే.. ఎలాంటి ఒత్తిడీ చేయకుండానే సులువుగా పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధించేందుకు వీలవుతుంది’ అని మోదీ సూచించారు. కాగా, సదస్సులో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి జయంత్ సిన్హా కూడా పాల్గొన్నారు. డిజిటైజేషన్పై మరింత దృష్టి... పన్నుల యంత్రాంగాన్ని మరింత మెరుగ్గా, సమర్థ్ధవంతంగా తీర్చిదిద్దేందుకు డిజిటైజేషన్పై దృష్టిసారించాలని సీబీఈసీ, సీబీడీటీలకు ప్రధాని సూచించారు. మరోపక్క, పన్ను చెల్లింపుదారుల్లో అపనమ్మకాన్ని తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పన్నుల చెల్లింపులో వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలన్నారు. దేశంలో పన్నుల యంత్రాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై అభిప్రాయాలు, సూచనలు చేయాల్సిందిగా అధికారులతో ప్రధాని పేర్కొన్నారు. ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొచ్చేవిధంగా ఈ ‘జ్ఞాన సంగం’ సదస్సును ‘కర్మ సంఘం’గా మార్చుకోవాలని చెప్పారు. అధికారుల నుంచి సూచనలు... దాదాపు గంటపాటు సీబీడీటీ, సీబీఈసీ ఉన్నతాధికారులతో మోదీ వివిధ అంశాలపై చర్చించడంతోపాటు వారి నుంచి అభిప్రాయాలను అడిగితెలుసుకున్నారు. పన్ను చెల్లింపుదారులతో వ్యవహరించే తీరుకు సంబంధించి నిబంధనలతో ఒక చట్టాన్ని తీసుకురావాల్సిందిగా ఈ సందర్భంగా ప్రధానికి అధికారుల నుంచి ఒక సూచన వచ్చింది. తాము దర్యాప్తు సంస్థల మాదిరిగా పనిచేయాలా.. లేదంటే పన్ను చెల్లింపుదారులకు స్నేహపూర్వక విభాగాలుగా ఉండాలా అని కూడా కొంతమంది అధికారులు మోదీని అడిగారు. సదస్సులో జైట్లీ మాట్లాడుతూ... పన్ను విభాగాలు పూర్తిస్థాయిలో డిజిటైజేషన్పై దృష్టిసారించాలన్నారు. పన్ను చెల్లింపుదారుల్లో అపనమ్మకాన్ని పోగొట్టేందుకు తాము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీబీడీటీ చైర్మన్ అతులేశ్ జిందాల్ చెప్పారు. నల్లధనం కొందరివద్దే... దేశంలో నల్లధనం అనేది కొందరివద్ద మాత్రమే పోగుపడి ఉందని మోదీ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు అనువుగా ఉండేవిధంగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దగలిగితే.. పన్నులు వాటంతటవే వస్తాయని చెప్పారు. పన్నుల వ్యవస్థలో లోపాలను కూడా మోదీ ఎత్తిచూపారు. ‘భారత్లో పన్నులను ఎలా చెల్లించాలి అని గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వెదికితే దాదాపు 7 కోట్ల వరకూ సమాధానాలు దొరుకుతాయి. అదే చెల్లించకుండా ఉండాలంటే ఏం చేయాలని అడిగితే మాత్రం 12 కోట్ల సమాధానాలు వచ్చిపడతాయి’ అని దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ఆదాయపు పన్ను(ఐటీ) విభాగంలో 42,000 మంది అధికారులు ఉన్నప్పటికీ.. పన్ను రిటర్నుల మదింపుతో కేవలం 8% ఆదాయమే లభిస్తోందన్నారు. ‘ప్రత్యక్ష పన్నుల ఆదాయంలో 92 శాతం మూలం వద్ద పన్ను విధింపు(టీడీఎస్- ఎక్కువగా ఉద్యోగులకు సంబంధించినవే), కార్పొరేట్ల ముందస్తు పన్ను చెల్లిం పులు, సెల్ఫ్ అసెస్మెంట్ పన్నుల రూపంలోనే ఖజానాకు వస్తోంది’ అని మోదీ చెప్పారు. -
రెండు మ్యూజియంల డి జిటైజేషన్ పూర్తి
న్యూఢిల్లీ: హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియం, నాగార్జునకొండలోని ఆర్కియాలజికల్ మ్యూజియంల డిజిటైజేషన్ పూర్తయినట్టు కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. మంగళవారం ఆ శాఖ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ దేశంలోని 10 మ్యూజియంల డిజిటైజేషన్ వివరాలతో కూడిన పోర్టల్ను ప్రారంభించారు. వీటి లో సాలార్జంగ్ మ్యూజియం, నాగార్జునకొండ మ్యూజియం కూడా ఉన్నాయి. -
నగరీకరణలో మనిషి గల్లంతు
నగరాల అభివృద్ధికి చర్యలు తీసుకోవద్దని ఎవరూ అనరు. కాకపోతే, నగర జీవితమంటే ఐటీ, డిజిటలైజేషన్, వైఫై, గ్రోత్ కారిడార్లు మాత్రమే కాదు. కనీస జీవన ప్రమాణాలకు, స్వచ్ఛమైన తాగు నీరు, గాలి, పరిశుభ్రత, భద్రతలకు హామీని కల్పించాలనే యోచనే లేకుండా శరవేగంగా నగరాలు, మహా నగరాల నిర్మాణం కోసం వెంపర్లాడటం మంచిది కాదనేది సహేతుక విమర్శ. ఈ వెంపర్లాట వల్లనే మానవ సంబంధాలు, సామాజిక విలువల గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. పట్టణాల్లో, ముఖ్యంగా నగరాల్లో నేరాలు పెచ్చుపెరిగి పోవ డానికి ప్రధాన కారణం మానవ ప్రవర్తనలో వస్తున్న మార్పేనని సామాజికవేత్తలు చెబుతున్నారు. మానవత్వం లోపించిన నగరీకరణే ఇందుకు కారణమంటున్నారు. సమకాలీనం హైదరాబాద్, విజయవాడ, కడప... అవరోహణక్రమంలో మహానగరం, నగరం, పట్టణం. ఒకటి ఎప్పట్నుంచో రాష్ట్ర రాజధాని, మరొకటి ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న రాష్ట్ర రాజధాని, ఇంకొకటి భవిష్యత్తులో రాజధాని స్థాయి నగరం కాగలదిగా ఎదుగుతున్న పట్టణం. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ఇవి సగర్వంగా ప్రాతినిధ్యం వహించాయి. ఈ మూడు చోట్ల ఇటీవల చోటు చేసుకున్న నేర ఘటనలు ఆందోళనకరమైనవి. వాటిని నిశితంగా పరిశీలించి, లోతుగా విశ్లేషిస్తే.. నేరం, ఆ నేరం కన్నా తీవ్రత, ఆ తీవ్రత కన్నా దాని ప్రభావం, అన్నింటిని మించి నేరాలు జరిగిన తీరును చూస్తే గగుర్పాటు కలుగుతోంది. పటిష్టమైన మన కుటుంబ వ్యవస్థ పునాదుల్నే ఈ ఘటనలు సవాలు చేస్తున్నాయి. మానవ సంబంధాలు చాలా వేగంగా చెడిపోతున్నాయనే ప్రమాద సంకేతాలను వెలువరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య, కుటుంబాల మధ్య సంబంధాల్లో వస్తున్న మార్పులు ఆ కుటుంబాలకే పరిమితంగాక సమాజంలో అశాంతిని, అలజడిని రేకెత్తిస్తున్నాయనే వాస్తవానికి అద్దం పడుతున్నాయి. నేరాలు జరిగాక కేసు నమోదు, నేరస్తుల గుర్తింపు, దర్యాప్తు, న్యాయవిచారణ, శిక్షలు... ఇదంతా మామూలే! కానీ, నేర నేపథ్యాన్ని, అందులో ఇమిడిన సామాజికాంశాల్ని, ప్రభావిత కారకాల్ని లోతుగా పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు తెరపైకొస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గుతూ, పట్టణీకరణ, నగరీకరణ శరవేగంగా జరుగుతున్న ఈ తరుణంలో ఇటీవలి నేరాల్ని సామాజిక దృష్టికోణం నుండి విశ్లేషించుకోవాలి. పాలకుల గాలివాటం విధానాలతో తీరూ-తెన్నూ లేకుండా సాగుతున్న నగరీకరణ పదఘట్టనలకు నిర్దాక్షిణ్యంగా నలిగిపోతున్న సున్నితాంశాలెన్నో! ‘‘నగరాలు అందరి కోసం’’అనే నినాదంతో హైదరాబాద్లో అంతర్జాతీయ ‘మెట్రో పొలిస్‘ సదస్సు జరుగుతున్న తరుణంలో ఇవి తప్పక చర్చకు రావాల్సిందే! నేరాల తీరే ఘోరం! ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లల్ని హతమార్చి, ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ ప్రొఫెసర్ నిర్వాకం నిర్ఘాంతపరచింది. మంచి అకడమీషియన్గా పేరున్న ఆయన ఇలా చేశాడంటే ఎవరూ నమ్మట్లేదు! భార్యాభర్తల తప్పొప్పుల పట్టిక తయారు చేసే ముందు అందుకు దారి తీసిన పరిస్థితుల్ని చర్చించాలి. ఇటువంటిదే ఎప్పుడో జరిగి, ఇటీవలే వెలుగుచూసిన కడప దుర్ఘటన. ఇందులో భార్యాభర్తలు, ముగ్గురు పిల్లలూ హతమయ్యారు. ఆ ఘటన హతురాలి తల్లి నిరంతర పోరాటం వల్లనే నిజం వెలుగు చూసింది. ముఖ్యంగా భర్త అనుమానపు వైఖరే భార్య హత్యకు, పిల్లల ఊచకోతకు, అతని ఆత్మహత్యకు కారణమని దర్యాప్తు కథనం. ఆ శవాలతో పాటు కొన్ని డాక్యుమెంట్లను పూడ్చిపెట్టడాన్ని చూస్తే ఆ భర్తది ఆత్మహత్యా? హత్యా? అన్న అనుమానాలూ రేగుతున్నాయి. విజయవాడ సమీపంలో ఇటీవల ముగ్గురు హతులు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంటాడి, కాల్పులు జరిపి ముగ్గుర్నీ హతమార్చిన ఘటన కౌబాయ్ సినిమాను తలపింప చేసింది. మహానగరాల్లో, విదేశాల్లో సంపన్నులకు ‘జాతకాలు’ చెప్పే రెండు కుటుంబాల మధ్య స్పర్థ, ఆధిపత్య పోరు వారి జాతకాల్నే మార్చేసింది. ఈ సీరియల్ హత్యల పరంపరలో మొదట దెబ్బతిన్న వర్గం, అమెరికాలో ఉన్న వారి సహకారంతో ఢిల్లీ కిరాయి హంతకులతో కోటి రూపాయల డీల్ కుదుర్చుకొని ప్రత్యర్థుల్ని హతమార్చిన తీరు ఆశ్చర్యకరం. ఈ మూడు ఘటనల్లోనూ కొన్ని మౌలిక సామాజికాంశాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కనీస మానవ విలువల పతనం, స్వార్థం, ఆధిపత్యం, అసహనం, పిచ్చి తెగింపు, ప్రాణాలంటే లెక్కలేనితనం... తీవ్ర స్థాయిలో ఉన్నాయి. సమకాలీన సమాజంలోని ఈ సామాజిక రుగ్మతలను ఎప్పటికప్పుడు గుర్తించి, నియంత్రించే వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరం. దీంతో ఎవరికి తోచినట్టు వారు నిర్వచిస్తున్న ‘అభివృద్ధి’ ధృతరాష్ట్ర కౌగిలిలో మానవ సంబంధాలు నలిగిపోక తప్పడంలేదు. గమ్యం ఎరుగని ఈ నాగరికత పరుగులో అసలు మనిషే కనుమరుగైపోతున్నాడు. నగరీకరణ దుష్ఫలితాలెన్నో! స్మార్ట్ సిటీల గురించి పెద్ద ఎత్తున మాట్లాడే వారు ముందు అదేంటో నిర్వచించాలి. అప్పుడే మంచి చెడులు బేరీజు వేసి చూసే అవకాశం ఉంటుంది. ఇలా విమర్శనాత్మకంగా మాట్లాడటం కొందరికి రుచించదు. దాదాపు నలబై శాతం జనాభా కేంద్రీకృతమౌతున్న నగరాల అభివృద్ధికి చర్యలు తీసుకోవద్దని ఎవరూ అనరు. కాకపోతే, నగర జీవితమంటే ఐటీ, డిజిటలైజేషన్, వైఫై, గ్రోత్ కారిడార్లు వగైరా మాత్రమే కాదు. మనిషి జీవన ప్రమాణాలు, కనీసావసరాలైన స్వచ్ఛమైన తాగు నీరు, గాలి, పరిశుభ్రత, భద్రతల గురించిన ఆలోచనే లేకుండా అతి వేగంగా భారీ నగరాలు, మహానగరాల నిర్మాణం కోసం వెంపర్లాడటం మంచిది కాదన్న విమర్శ సహేతుకం. ఈ వెంపర్లాట వల్లనే మానవ సంబంధాలు, సామాజిక విలువల గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. పట్టణాల్లో, ముఖ్యంగా నగరాల్లో నేరాలు పెచ్చుపెరిగిపోవ డానికి మానవ ప్రవర్తనలో వస్తున్న మార్పే ప్రధాన కారణమని సామాజికవేత్తలు చెబుతున్నారు. మానవత్వరహితమైన నగరీకరణే ఇందుకు కారణమంటున్నారు. అర్థం, పర్థం లేకుండా విస్తరిస్తున్న మన నగరాలు జీవనయోగ్యమైనవి కావని ప్రమాణాలను నిర్ధారించే సంస్థలు చెబుతున్నాయి. వాహనం నంబర్, సెల్ఫోన్ నంబర్, ఎల్పీజీ నంబర్, ఆధార్ నంబర్.... ఇలా చివరకు మనుషులకు కూడా ఓ ప్రత్యేక నంబరిచ్చేస్తారు. అప్పుడిక సంఖ్యలుగా తప్ప మనుషులకు గుర్తింపుండదు. స్థూలంగా అందరి సంఖ్యగా మాత్రమే మనుషులు మిగిలిపోతారు. ఓట్ల రాజకీయాల పుణ్యమా అని ఈ పరిస్థితి ఇప్పటికే వచ్చింది. మున్ముందు అది మరింత అమానవీయం కానుంది. మనుషుల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోతున్నాయి. ఎదురింట్లో ఏం జరుగుతుందో, పక్కింట్లో ఎవరుంటున్నారో కూడా ఇరుగు పొరుగులకు పట్టదు. మన నగరాల్లో ‘సామాజికమైన పట్టింపు లేనితనం’ (టౌఛిజ్చీ ఠఛిౌఛ్ఛిట్ఛటట) పెరిగిపోతోంది. ఇదివరకిలా ఉండేది కాదు. గ్రామాల్లోలా కాకపోయినా, పట్టణాలు, నగరాల్లోనూ మనిషికి మనిషికి మధ్య, మానవ సమూహాలకు మధ్య సత్సంబంధాలుండేవి. మంచి- చెడు చర్చకు వచ్చేది. ఎంతోకొంత ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండేవారు. ప్రాచీన గ్రీకు తత్వవేత్త ప్లేటో (క్రీ.పూ.4వ శతాబ్ది) సైతం నగరీకరణ అడ్డదిడ్డంగా కాకుండా ఓ పద్ధతి ప్రకారం జరగాలంటూ కొన్ని నియమాలను సూచించారు. ‘‘మనిషి జ్ఞాపకశక్తికి ఉన్న పరిమితిని బట్టి 5,040 మందికి మించి గుర్తుపెట్టుకోలేం, మన ఊళ్లో, నగరంలో ఉంటున్న వాళ్లంతా మనకు తెలిసినవారై ఉండాలి’’ అంటూ నగర జనాభా 5,040 కి మించకూడదని ఆయన చెప్పాడు. నగరాల్లో జీవన ప్రమాణాలు పెంచడం, మానవ సంబంధాల్ని పరిరక్షించడం, ‘నైబర్వుడ్ పాఠశాల,’ ‘నైబర్వుడ్ డాక్టర్’ నమూనాలను విస్తరింపజేయడానికి ప్లేటో ఆలోచన స్ఫూర్తి కావాలనేదే సగటు మనిషి వాంఛ. కుటుంబం కుదేలయింది! ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇపుడు ఇల్లే చిన్నాభిన్నమైంది. భారతీయ సామాజిక వ్యవస్థకు మూలస్తంభమైన ఉమ్మడి కుటుంబం నేడు దాదాపుగా చెదిరిపోయింది. చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో మనిషికి మనిషి తోడుండే వారు. ఎంతో భరోసా ఉండేది. కుటుంబ సభ్యుల మధ్యే కాక కుటుంబాల మధ్యా సామరస్యం వెల్లివిరిసేది. ఆర్థిక సమస్యలేకాదు, ఏ ఆపద ఎదురైనాగానీ జీవనం నేటిలా ఇన్ని ఒత్తిళ్ల మధ్య సాగేది కాదు. అనునయింపులు, ఓదార్పులు నోటి మాటలుగానే గాక, గాయపడిన మనసులకు సాంత్వన చేకూర్చగలిగేవి. తద్విరుద్ధంగా నేటి జీవనం యాంత్రికమై పోయింది. అవకాశాలు తగ్గి, అవసరాలు పెరగడంతో అత్యధికుల్లో స్వార్థం పెచ్చుపెరిగింది. జనానికి ఎవరి మీదా విశ్వాసం లేకుండా పోతోంది. పరస్పర అనుమానాలు బలపడి, సహనం నశించి, అహాల అంతరాలు పెరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు, ఆవేశకావేశాలకు ఇవన్నీ కారణమౌతున్నాయి. నడుమ పిల్లలు నలుగుతున్నారు. దైవ భక్తిలో సైతం పాపభీతే తప్ప స్వచ్ఛమైన ఆధ్యాత్మికత కనబడకుండా పోతోంది. నగరాలను మెరుగుపరచాలని, జీవనయోగ్యం చేయాలని భావించేవారు ఈ మౌలికాంశాలపై దృష్టిని పెట్టాలి. జీవన ప్రమాణాలను పెంచడంతో పాటు మానవ సంబంధాల, విలువల పునరుద్ధరణకు ఏం చేయగలమో శాస్త్రీయంగా ఆలోచించాలి. శాస్త్ర సాంకేతికత జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచే ఉపకరణమే తప్ప, జీవన లక్ష్యం కారాదు. శాస్త్ర ప్రగతితో ప్రపంచమే ఓ కుగ్రామమైందంటూ గ్లోబలీకరణ గురిం చి గొప్పలు చెప్పుకోవడం గాక, వేల ఏండ్ల క్రితమే మన పూర్వీకులు ప్రవచిం చిన ‘‘వసుధైక కుటుంబం’’ భావనలోని స్ఫూర్తిని పరివ్యాప్తం చేయాలి. దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్టు -
పన్నుల వడ్డింపునకే కేబుల్టీవీ డిజిటైజేషన్!
న్యూఢిల్లీ: వివిధ రకాలుగా పన్నులను వడ్డించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కేబుల్ టీవీ డిజిటైజేషన్ ప్రక్రియ అమలుకు సిద్ధమయ్యాయని ‘ఆర్థిక సర్వే’ పేర్కొంది. సర్వేలో వెల్లడైన ప్రకారం.. రాష్ట్రప్రభుత్వాల ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తే.. ఇదివరకే వినోదపు పన్ను వడ్డింపు రెండు నుంచి మూడు రెట్లు పెరిగింది. డిజిటైజేషన్ ద్వారా కేబుల్ టీవీ చందాదారులకు సంబంధించి పూర్తి పారదర్శకత వస్తుందని, తద్వారా పన్నులు కచ్చితంగా వసూలు అయ్యేందుకు వీలవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేశాయి. డిజిటైజేషన్కు అవసరమైన సెట్టాప్ బాక్సుల తయారీవల్ల దేశీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమకు మేలు చేకూర్చడంతోపాటు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలూ దొరుకుతాయి. టీవీ, రేడియో, సినిమా, ప్రింట్ మీడియా, యానిమేషన్ వంటి రంగాలు గత రెండేళ్లలో అనూహ్య వృద్ధి సాధించాయి. 2018 నాటికి ఈ రంగాలు రూ.1,78,600 కోట్ల వృద్ధిసాధిస్తాయి. దేశంలో ప్రస్తుతం 800 టీవీ చానెళ్లు, 245 ఎఫ్ఎం, 170 కమ్యూనిటీ రేడియోలు ఉన్నాయి -
సెట్ టాప్ బాక్స్ అమర్చుకున్నారా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీ ఇంట్లో సెట్ టాప్ బాక్సు ఉందా? లేకుంటే ఈ రోజే సెట్ టాప్ బాక్స్(ఎస్టీబీ) అమర్చుకోండి. ఎందుకంటే డిజిటైజేషన్లో భాగంగా సెప్టెంబరు 19 నుంచి హైదరాబాద్ నగరంలో అనలాగ్ సిగ్నల్స్ కనుమరుగవుతున్నాయి. డిజిటల్ ప్రసారాలు మాత్రమే కొనసాగుతాయి. డిజిటల్ సిగ్నల్స్ అందుకోవాలంటే కేబుల్ టీవీ ప్రేక్షకులు తప్పనిసరిగా ఎస్టీబీ అమర్చుకోవాల్సిందే. నగరంలో డిజిటైజేషన్ ఈ ఏడాది మార్చి 31కే పూర్తి కావాలి. కేబుల్ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల18 వరకు గడువు ఇస్తూ గత నెల తీర్పు వెలువరించింది. 70 శాతం పూర్తి... రెండో దశలో డిజిటైజేషన్ తప్పనిసరి కానున్న 38 నగరాల్లో హైదరాబాద్, వైజాగ్ కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్, విశాఖపట్నం నగరాలకే దీనిని పరిమితం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 10 లక్షల టీవీలున్నాయి. ఇందులో లక్ష ఇళ్లలో డీటీహెచ్ సిగ్నల్స్ ద్వారా టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. మిగిలిన 9 లక్షల్లో 70 శాతం గృహాల్లో ఎస్టీబీలు అమర్చుకున్నారు. కేబుల్ టీవీ కనెక్షన్లలో 60 శాతం మంది ఎస్టీబీలను కొనుగోలు చేశారని ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.ప్రభాకర్ రెడ్డి ‘సాక్షి’ కి తెలిపారు. హైదరాబాద్లో ఈ ప్రాంతాల్లోనే.. నాంపల్లి, ఆసిఫ్నగర్, చార్మినార్, మెహిదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్పేట, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, హిమాయత్నగర్, విద్యానగర్, కాచిగూడ, దిల్సుఖ్నగర్ ప్రాంతాలను డిజిటైజేషన్ పరిధిలోకి తెస్తారు. డిజిటైజేషన్ కానున్న ప్రాంతాల్లో శ్రీనగర్ కాలనీ, యూసుఫ్గూడ, సనత్నగర్, బల్కంపేట, ఎస్ఆర్ నగర్, కంటోన్మెంట్, తార్నాక, హబ్సిగూడ, సంతోష్నగర్, చంపాపేట కూడా ఉన్నాయి. అలాగే బోయినపల్లి, జూబ్లీహిల్స్, బోరబండలోని ప్రాంతాలు కూడా దీని కిందకు రానున్నాయి.