Foreign education
-
విదేశీ విద్యకు ప్రయాణ బీమా దన్ను
విద్య కోసం విదేశాల బాట పట్టినప్పుడు కొత్త సంస్కృతులు, సవాళ్లు, వ్యక్తిగత వృద్ధి అవకాశాలు ఇలాంటివి ఎన్నో ఉక్కిరిబిక్కిరి చేసే అనుభవాలు ఎదురవుతాయి. అయితే, ఈ ఉత్కంఠభరితమైన సాహసయాత్రలో రిసు్కలు, అనిశి్చతులూ ఉంటాయి. హెల్త్ ఎమర్జెన్సీల నుంచి.. ట్రిప్లు రద్దవడం వరకు పలు రకాల సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే విదేశాల్లో విద్యాభ్యాసాన్ని ఎంచుకున్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఒక ఆప్షన్ కాదు.. తప్పనిసరిగా తీసుకోతగిన రక్షణ కవచంలాంటిది. ఇందుకు గల అనేక కారణాల్లో కొన్ని... ఆరోగ్య సంరక్షణకు.. విదేశాల్లో హెల్త్కేర్ వ్యవస్థలు, వ్యయాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. పలు దేశాల్లో వైద్య వ్యయాలు భారీగానే ఉంటాయి. దీన్ని అధిగమించడం శక్తికి మించిన భారంగా అనిపించవచ్చు. ఉదాహరణకు అమెరికాలో మామూలుగా ఆసుపత్రికి వెళ్లినా వందల కొద్దీ డాలర్ల వ్యయంతో కూడుకున్న వ్యవహారంగా ఉంటుంది. ఇక మిగతా దేశాల్లో ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ అనేది వేల కొద్దీ డాలర్లతో ముడిపడి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఊహించని వ్యయాల భారం నుంచి ఉపశమనం కలిగిస్తుంది ప్రయాణ బీమా. డాక్టర్ విజిట్స్, ఆసుపత్రిలో చేరడం, ఎమర్జెన్సీ మెడికల్ ఎవాక్యుయేషన్లు మొదలైన వాటన్నింటికీ కవరేజీని ఇస్తుంది. ఈ విషయంలో భరోసా లభించడం వల్ల విద్యార్థులు తమ చదువుపై నిశ్చింతగా ఫోకస్ చేసేందుకు వీలుంటుంది. ప్రయాణాలకు ఆటంకాలెదురైనా.. రాజకీయ అనిశి్చతి, ప్రకృతి వైపరీత్యాలు లేదా వ్యక్తిగతంగా అత్యవసర పరిస్థితులు తలెత్తడం మొదలైన ఊహించని అంశాల వల్ల ప్రయాణ ప్రణాళికలపై ప్రభావం పడొచ్చు. ఒకవేళ మీరు వెళ్లే దేశంలో ప్రకృతి వైపరీత్యం తలెత్తి, ట్రిప్ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి, మళ్లీ కొత్తగా బుక్ చేసుకోవాల్సి వస్తే.. ఆయా వ్యయాలన్నింటికీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ద్వారా కవరేజీని పొందే అవకాశం ఉంటుంది. అదనంగా ఆర్థిక భారం పడకుండా మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే మీ ట్రిప్ను కుదించుకున్నా లేక అది రద్దయినా.. ప్రయాణ ఏర్పాట్ల కోసం మీరు వెచి్చంచిన మొత్తం డబ్బు వృధా కాకుండా చూసుకోవడానికి వీలవుతుంది. విలువైన వస్తువులకు భద్రత.. విదేశాల్లో విద్యాభ్యాసం కోసం వెళ్తున్నప్పుడు విలువైన ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, ఇతరత్రా అవసరమైన ఎల్రక్టానిక్స్ వస్తువులను వెంట తీసుకెళ్లే అవకాశం ఉండొచ్చు. సరిగ్గా పాఠాలు ప్రారంభమయ్యే సమయానికి మీ ల్యాప్టాప్ పోయిందంటే ఎంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చు. అదే ప్రయాణ బీమా ఉంటే ఈ గందరగోళం నుంచి బైటపడేందుకు ఆస్కారం ఉంటుంది. దీనితో ఆయా ఉత్పత్తుల రీప్లేస్మెంట్ ఖర్చులతో పాటు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత సామాన్లకు కూడా కవరేజీని పొందవచ్చు. విదేశాల్లో 24 గంటల ఎమర్జెన్సీ సహాయం.. 24/7 ఎమర్జెన్సీ అసిస్టెన్స్ సర్విస్ అనేది ట్రావెల్ ఇన్సూరెన్స్లో అత్యంత కీలకమైన ఫీచర్లలో ఒకటి. లోకల్ డాక్టరును సంప్రదించడం మొదలుకుని అత్యవసరంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం వరకు వివిధ ఎమర్జెన్సీ సందర్భాల్లో తక్షణ సహాయం పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటికి దూరంగా ఉండే సమయంలో విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు సహాయం అందుబాటులో ఉంటుందనే ఆలోచన ఎంతో నిశ్చింతనిస్తుంది. థర్డ్ పార్టీ లయబిలిటీ ప్రమాదాలనేవిఅనుకోకుండానే జరిగిపోతాయి. మనం ఎంత పరిశోధన చేసి, ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా.. సరిగ్గా సమయం వచ్చేసరికి అన్నీ పక్కకు వెళ్లిపోవచ్చు. విదేశాల్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ప్రమాదవశాత్తూ థర్డ్ పార్టీలకు ఏదైనా నష్టం కలిగించడం వల్ల పరిహారాన్ని చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. అద్దెకు తీసుకున్న ఇల్లు ప్రమాదవశాత్తూ దెబ్బతిన్నా, ఏదైనా ప్రమాదంలో ఎవరైనా గాయపడినా .. మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది లీగల్, ఆర్థిక వ్యయాలను కవర్ చేస్తుంది. దూరదృష్టి ముఖ్యం.. ప్రయాణ బీమా అనవసర ఖర్చు అనే ఉద్దేశంతో పక్కన పెట్టేసేద్దామని అనిపించినా.. విదేశాల్లో విద్యాభ్యాసం చేసేటప్పుడు ఎదురయ్యే రిసు్కల గురించి ఒకసారి ఆలోచిస్తే.. ఇది ఎంతో వివేకవంతమైన పెట్టుబడి కాగలదు. హెల్త్ ఎమర్జెన్సీలు, ప్రయాణాలు రద్దు కావడం, వస్తువులు పోవడం, లీగల్ ఖర్చులు, కాలేజీ ఫీజులపరమైన నష్టాలు మొదలైన వాటన్నింటికీ ట్రావెల్ ఇన్సూరెన్స్తో కవరేజీ ఉంటుందనే ఆలోచన కొండంత భరోసానిస్తుంది. మిగతా వాటి గురించి ఆందోళన చెందకుండా నిశ్చింతగా చదువుపై దృష్టి పెట్టేందుకు ఉపయోగపడుతుంది. -
ఎడతెగని ఎదురుచూపు
రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చెందిన సంగీత గతేడాది బీటెక్ పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాలోని ప్రఖ్యాత వర్సిటీలో దరఖాస్తు చేయగా.. 2023 ఆగస్టులో ఆమెకు అడ్మిషన్ లభించింది. దీంతో ఆమె రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తు పరిశీలన పూర్తి చేసుకుని పీజీ కోర్సులో చేరిపోయింది. స్కాలర్షిప్ వస్తుందన్న ఆశతో అప్పు చేసి అమెరికా వెళ్లింది. ప్రస్తుతం ఎమ్మెస్ మొదటి సంవత్సరం పూర్తయ్యింది. వచ్చే ఏడాది మార్చిలో రెండో సంవత్సరం కూడా పూర్తవుతుంది. కానీ విద్యానిధి పథకానికి ఆమె అర్హత సాధించిందా? లేదా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. సంగీత తండ్రి మాసాబ్ట్యాంక్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించగా.. అర్హుల జాబితా ఇంకా సిద్ధంకాలేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆయనకు అధికారుల నుంచి ఇదే సమాధానం వస్తోంది. ఇది ఒకరిద్దరి ఆవేదన కాదు.. దాదాపు ఆరువేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఎదురు చూపులివి.సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న మహాత్మా జ్యోతి బా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హుల ఎంపిక ఏడా దిన్నరగా నిలిచిపోయింది. 2023– 24 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద దరఖాస్తుల స్వీకరణే తప్ప అర్హులను తేల్చటంలేదు. దీంతో ఈ స్కాలర్షిప్ వస్తుందన్న ఆశతో అప్పులు చేసి విదేశాలకు వెళ్లిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకొన్న చాలామంది విద్యార్థులు ఇప్పటికే సగం కోర్సు కూడా పూర్తిచేశారు. కానీ తమ దరఖాస్తుల పరిస్థితి ఏమిటనేది ఇప్పటికీ తేలలేదు. దాదాపు రెండు సీజన్లలో వచ్చిన దరఖాస్తుల విషయం ఎటూ తేల్చకుండానే.. ఇప్పుడు మరోమారు దరఖాస్తుల స్వీకరణ సైతం చేపట్టారు. బీసీ సంక్షేమ శాఖ నాన్చుడు ధోరణి వల్ల దాదాపు ఆరువేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిభావంతులైన బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు కూడా ఆయా సామాజిక వర్గాల విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకాన్ని అందిస్తున్నాయి. ఆ శాఖలు దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి స్కాలర్షిప్లు అందిస్తుండగా, బీసీ సంక్షేమ శాఖలో మాత్రం ఏడాదిన్నరగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నది.డిమాండ్ ఎక్కువ.. కోటా తక్కువపూలే విదేశీ విద్యానిధి పథకానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇతర శాఖలతో పోలిస్తే బీసీ సంక్షేమ శాఖలో వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయి. ఈ పథకం కింద ఏటా రెండు దఫాలుగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ స్ప్రింగ్ సీజన్, ఫాల్ సీజన్ అని ఏటా రెండుసార్లు ఉంటుంది. సెప్టెంబర్ వరకు మొదటి దఫా, జనవరిలో రెండో దఫా దరఖాస్తులను సంక్షేమ శాఖలు స్వీకరిస్తాయి. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన తర్వాత... విద్యార్థుల డిగ్రీ మార్కులతోపాటు జీఆర్ఈ/జీమ్యాట్లో మార్కులు, ఐఈఎల్టీఎస్/టోఫెల్ మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు శాఖలవారీగా ప్రత్యేక కమిటీలుంటాయి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లో పోటీ తక్కువగా ఉండడంతో అర్హుల ఎంపిక ఆలస్యం లేకుండా సాగిపోతున్నది. బీసీ సంక్షేమ శాఖలోవిపరీతమైన పోటీ ఉండడంతో ఉప కులాలవారీగా కోటాను విభజిస్తూ అర్హులను ఎంపిక చేస్తున్నారు. బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలవారీగా అర్హులను ఎంపిక చేస్తారు. ఏటా (రెండు సీజన్లు కలిపి) 300 మందికి స్కాలర్షిప్లు ఇస్తారు. ఒక్కో సీజన్కు సగటున 3 వేల దరఖాస్తులు వస్తున్నాయి. ఈ లెక్కన గత రెండు సీజన్లలో 6 వేలకు పైబడి దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అర్హులను ఎంపిక చేయలేదు. కోటా పెంపు కోసమేనట!పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి డిమాండ్ అధికంగా ఉండటంతో ప్రస్తుతం 300 యూనిట్లుగా ఉన్న కోటాను కనీసం వెయ్యికి పెంచాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై పలు సమీక్షలు నిర్వహించిన తర్వాత బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి కోటా పెంపు ప్రతిపాదనలు పంపింది. ఏటా కనీసం 800 మంది విద్యార్థులకైనా ఈ పథకం కింద స్కాలర్íÙప్లు ఇవ్వాలని సీఎం కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ఫైలు సీఎం వద్దకు చేరి దాదాపు ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ మోక్షం కలగలేదు. కోటా పెంపు తర్వాతే అర్హుల ఎంపిక చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి ప్రస్తుత పరిస్థితి2023–24 విద్యా సంవత్సరంలో వచ్చిన దరఖాస్తులు 6 వేలకుపైగా ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి ఇచ్చే స్కాలర్షిప్ రూ.20 లక్షలు సంవత్సరానికి ఇచ్చే మొత్తం స్కాలర్íÙప్లు 300 -
విదేశీ విద్యకు సాయమందించండి
సాక్షి, హైదరాబాద్: తమ పిల్లలు చదువుకునేందుకు విదేశాలకు వెళ్లారని, వారికి అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద సాయమందించాలని పలువురు తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. గురువారం గాందీభవన్లో ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన మల్లు భట్టి విక్రమార్కను సామాన్య ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. విదేశీ విద్యానిధి పథకం కింద పెద్ద చదువులు చదువుకునే విద్యార్థులకు ప్రజాప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పిన భట్టి.. వీలున్నంత త్వరగా ఆ నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. » తన తల్లి బ్రెస్ట్ కేన్సర్తో బాధపడుతున్నారని, ఆమె ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు అవసరమైన సాయం అందించాలని మహేశ్ కోరగా, భట్టి వెంటనే స్పందించి ఇప్పటివరకు అయిన ఆస్పత్రి బిల్లులకు ఎల్ఓసీ ఇప్పించాలని తన పీఏను ఆదేశించారు. స్వయంగా తన నంబరు ఆ యువకుడికి ఇచ్చి ఎలాంటి సమస్య ఉన్నా తనకు తెలియజేయాలని సూచించారు. » జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా తమకు పోస్టింగులు ఇవ్వలేదంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు భట్టికి విజ్ఞప్తి చేయగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. » ట్రాన్స్కో, జెన్కోలలో ఖాళీగా ఉన్న డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, ఇంజనీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంబంధిత శాఖ సిబ్బంది కూడా విజ్ఞప్తి చేశారు. » ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల కోసం పలువురు విజ్ఞప్తి చేశారు. మంత్రితో ముఖాముఖిలో భాగంగా మొత్తం 300 దరఖాస్తులు వచ్చాయి.ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యే శంకర్, టీపీసీసీ ప్రధానకార్యదర్శి అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. భట్టి దృష్టికి పటాన్చెరు పంచాయితీ పటాన్చెరు నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ నేత లు, ప్రస్తుత ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిల మధ్య నెలకొన్న రాజకీయ పంచాయితీ భట్టి దృష్టికి వచ్చింది. పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో వచ్చిన నేతలంతా తమపై మహిపాల్రెడ్డి పెత్తనం చేస్తున్నారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి అన్యాయం చేస్తున్నారని, తద్వారా నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతోందని వివరించారు. ఆ తర్వాత కాట శ్రీనివాస్గౌడ్ కూడా టీపీసీసీ అధ్యక్షుడి చాంబర్లో భట్టితో పాటు మహేశ్గౌడ్ను కలిసి ఫిర్యాదు చేశారు. -
Andhra Pradesh: విదేశీ విద్య.. ఇప్పుడు మిథ్య!
పేద పిల్లలకు విదేశాల్లోనూ ఉన్నత చదువులు అందించాలనే గొప్ప ఆలోచనతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని దెబ్బ తీసేందుకు కూటమి సర్కారు కుయుక్తులు పన్నుతోంది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి 4 నెలలు గడిచినా విదేశీ విద్యకు పైసా విదల్చకుండా ఆ పథకం లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు డబ్బులు ఇవ్వడం ఆపేసింది. కొత్తగా విదేశాలకు వెళ్లిన విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను సైతం పట్టించుకోవడం లేదు.విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం అందించే ప్రభుత్వ సాయానికి జనవరి నుంచి పేద విద్యార్థులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, మరికొందరి అర్హతపై ఇంటర్వ్యూ సైతం పూర్తయింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ పేరుతో నిధుల విడుదలను నిలిపివేశారు. ప్రభుత్వ సాయం అందుతుందనే ఆశతో ఇంటర్వ్యూ పూర్తయిన చాలా మంది విద్యార్థులు అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లారు. నెలలు గడుస్తున్నా వారికి సాయం అందించే విషయంలో స్పష్టత రావడం లేదు. ఇప్పుడు వీరి పరిస్థితి ఏమిటో తెలియక ఆందోళనకు గురవుతున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ వరకు విదేశీ విద్యా దీవెన పథకం కింద పేద విద్యార్థులకు రూ.107.07 కోట్లు అందించింది. గతేడాది విదేశాలకు వెళ్లిన విద్యార్థులకు నాలుగు విడతల్లో ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వం అందించాలి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్లో మరోమారు నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వారికి సాయం విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండటం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విదేశీ విద్యా పథకం మంజూరైందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటేకనీసం సమాధానం చెప్పే వారే కరువయ్యారు.ఏదైనా అప్డేట్ ఉందేమో చూద్దామనుకుంటే జ్ఞాన భూమి పోర్టల్ అసలు తెరుచుకోవడం లేదు. ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తులను సైతం అధికారులు తొలగించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఈ పథకాన్ని కొత్త ప్రభుత్వం ఎత్తేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్లకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల వినతులు సమర్పించనప్పటికీ వారి నుంచి స్పష్టత రాక పోవడం శోచనీయం. – సాక్షి, అమరావతిప్రభుత్వ సాయం అందుతుందని మా అబ్బాయిని విదేశీ చదువుకు పంపించా. కూటమి ప్రభుత్వం వచ్చాక విదేశీ విద్యకు సాయం అందించలేదు. కనీసం మా దరఖాస్తు ఏమైందో తెలుసుకుందామంటే జ్ఞాన భూమి పోర్టల్ తెరుచుకోవడం లేదు. సమాధానం చెప్పే నాథుడే లేడు. నెలలు గడుస్తున్నా మా ఆవేదన పట్టించుకోవడం లేదు. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పాటికి సాయం అందేది. ఇప్పుడొచ్చిన చంద్రబాబు ప్రభుత్వ సాయం అందించకపోతే మా అబ్బాయి చదువు కోసం మేము అప్పులు చేసి అవస్థలపాలుకాక తప్పదు. – గుంటూరుకు చెందిన ఒక చిరుద్యోగి మా అమ్మాయిని విదేశాల్లో డాక్టర్ చదివిద్దామని విదేశీ విద్యా సాయం కోసం దరఖాస్తు చేసి నాలుగు నెలలు దాటింది. మా దరఖాస్తు ఏమైందో తెలియదు. జ్ఞాన భూమి పోర్టల్ తెరుచుకోవడం లేదు. విదేశీ విద్య పథకాన్ని కొత్త ప్రభుత్వం నిలిపేస్తుందని అంటున్నారు. నిబంధనల పేరుతో సాయాన్ని అరకొరగా పరిమితం చేస్తారంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం సాయం అందిస్తుందో లేదో తెలిస్తే.. మా తిప్పలు మేము పడతాం. – పశ్చిమదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ రైతు ఆవేదనపేద బిడ్డలపై పెద్ద మనసు చూపిన జగన్విదేశాల్లో చదివేందుకు వెళ్లిన పేద బిడ్డలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా 408 మందికి రూ.107.07 కోట్లు అందించారు. గత చంద్రబాబు ప్రభుత్వం 2016–17 నుంచి అమలు చేసిన పథకంలో 3,326 మందికి రూ.318 కోట్లు ఎగ్గొట్టింది. అదే మాదిరి ఈసారి కూడా విదేశీ విద్య పథకంలో ఎంపికైన వారికి మొండి చెయ్యి చూపించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.⇒ గత చంద్రబాబు ప్రభుత్వం అగ్రవర్ణ పేదలను విస్మరించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు కేవలం రూ.15 లక్షలు చొప్పున మాత్రమే సాయం అందించి చేతులు దులుపుకొంది. అదే జగన్ సర్కారు ఒక్కొక్కరికి రూ.కోటి నుంచి రూ.కోటి 25 లక్షల వరకు సాయం అందించింది. వైఎస్ జగన్ అగ్రవర్ణ పేదల(ఈబీసీ)తో పాటు కాపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు కూడా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా విదేశాల్లో చదువులకు ఊతమిచ్చారు.⇒ ప్రపంచంలో టాప్ 50 క్యూఎస్ ర్యాంకింగ్ సాధించిన యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎంíపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు.. కాపు, ఈబీసీ విద్యార్థులకు రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందించారు. నాలుగు విడతల(సెమిస్టర్)ల్లో ఆ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు జమ చేసేవారు.⇒ విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఖర్చులను సైతం ప్రభుత్వమే చెల్లించేది. పీజీ, పీహెచ్డీ కోర్సులతో పాటు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులకూ పథకాన్ని వర్తింపజేశారు. అటువంటి గొప్ప పథకాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
విదేశాల్లో మారిన పరిస్థితులు.. మనోళ్ల ఆశలు ఆవిరి!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల విదేశీ విద్య ఆశలు ఆవిరైపోతున్నాయి. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా, బ్రిటన్ లాంటి దేశాలకు ఎమ్మెస్కు వెళ్లాలనుకునేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఆర్థిక సంక్షోభంతో అమెరికా తదితర దేశాల్లో ఐటీ రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన వారు కూడా పునరాలోచనలో పడుతున్నారు. కొన్నాళ్లు వేచి చూడటమే మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు. కొందరు ఆయా దేశాల్లో ఉన్న తమతోటి మిత్రులతో అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గురించిన వివరాలు కనుక్కుంటున్నారు. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియాలో పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని ఆయా దేశాల్లో ఉన్నవిద్యార్థులు చెబుతున్నారు. ఆ రోజులు పోయాయ్! విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఎమ్మెస్ చదువు చాలామంది విద్యార్థులకు ఓ కల. ముఖ్యంగా బీటెక్ పూర్తి చేయగానే ఏదో ఒక వర్సిటీలో చదువుకోసం ప్రయతి్నంచేవారు. వీలైనంత త్వరగా ఎమ్మెస్ పూర్తి చేస్తే, ఫుల్టైమ్ జాబ్తో త్వరగా సెటిల్ అవడానికి వీలవుతుందని భావించేవారు. అప్పు చేసి మరీ విమానం ఎక్కేసేవారు. ఎమ్మెస్ చేస్తూనే ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్తో ఎంతోకొంత సంపాదించుకోవడానికి ఆసక్తి చూపేవారు.కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. పరిస్థితి అంత సాను కూలంగా లేదని కన్సల్టెన్సీలు, ఇప్పటికే అక్కడ ఉన్న విద్యార్థులు చెబుతున్నారు. 2021లో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య 6.84 లక్షలుగా ఉంది. 2023లో కూడా పెరుగుదల నమోదైనా 2024కు వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక ప్రస్తుత పరిస్థితిని, విద్యార్థుల నుంచి వస్తున్న ఎంక్వైరీలను బట్టి చూస్తే 2025లో ఈ సంఖ్య మరింత తగ్గే వీలుందని కన్సల్టెన్సీలు అంచనా వేస్తున్నాయి. వెళ్లినవారికి ఉపాధి కష్టాలు ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో విదేశాల్లో స్కిల్డ్ ఉద్యోగం దొరకడం గగనంగా మారుతోందని, అన్ స్కిల్డ్ ఉద్యోగాలకు కూడా విపరీతమైన పోటీ ఉందని అంటున్నారు. ఆర్థిక సంక్షోభంతో అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఉద్యోగాలు తీసివేసే పరిస్థితి నెలకొనడం, మరోవైపు భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చినవారి సంఖ్య ఇప్పటికే గణనీయంగా పెరిగిపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కూడా ప్రభావం చూపిస్తోందని అంటున్నారు. రోజూ పదుల సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నా, ప్రయత్నాలు కొనసాగిస్తున్నా.. ఉద్యోగం రాకపోవడం మాట అలా ఉంచితే కనీసం ఇంటర్వ్యూకు పిలిచే పరిస్థితి కూడా ఉండటం లేదని తెలుస్తోంది. విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఫీజులు ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకు అవసరం. కాగా ఈ మేరకు అప్పు చేసి వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉండేది. ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఖర్చులకు సరిపడా సంపాదించుకోవడంతో పాటు రుణం తీర్చగలమనే ధీమా గతంలో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. చాలా కంపెనీలు ఏడాది క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి అమెరికాలో కొనసాగుతోంది. తాజాగా నాస్కామ్ జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు అమెరికాలో 20 వేల మంది ఉన్నట్టు తేలింది. అస్ట్రేలియాలో ఇచ్చిన ఆఫర్లు వెనక్కు తీసుకుంటున్నట్లు సమాచారం. అప్పు తీర్చలేక, ఇండియా రాలేక, అమెరికాలో ఉద్యోగం లేకుండా ఉండలేక విద్యార్థులు నానా అవస్థలూ పడుతున్నారు. దేశంలో ఐటీ సెక్టార్పైనా ప్రభావం అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఇండియా ఐటీ సెక్టార్పైనా ప్రభావం చూపించింది. పలు కంపెనీలు వరుసగా లే ఆఫ్లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్ నియామకాలు తగ్గాయి. దీంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది. నైపుణ్యం సమస్య! దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే అవసరమైన నైపుణ్యం ఉంటున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వీళ్లే బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నారని పేర్కొంటున్నాయి. స్వల్ప సంఖ్యలో విద్యార్థులు చిన్నాచితకా ఉద్యోగంతో సరిపెట్టుకుంటుండగా, ఎక్కువమంది అన్స్కిల్డ్ ఉద్యోగులుగా లేదా నిరుద్యోగులుగా కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. తాజాగా అమెరికాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పరిస్థితిని మరింత దిగజార్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు వెళ్లినవారి సంఖ్య 2024లో గణనీయంగా తగ్గిందని అంటున్నారు. మంచి ఉద్యోగం మానుకుని అమెరికా వచ్చా బీటెక్ అవ్వగానే ఓ ఎంఎన్సీలో మంచి ఉద్యోగం వచ్చింది. రెండేళ్ళల్లో ప్రమోషన్లు కూడా వచ్చాయి. కానీ అమెరికా వెళ్ళాలనే కోరికతో అప్పు చేసి ఇక్కడికి వచ్చా. ప్రస్తుతం ఎంఎస్ పూర్తి కావొచ్చింది. కానీ జాబ్ దొరికే అవకాశం కని్పంచడం లేదు. ఇప్పటికీ డబ్బుల కోసం ఇంటి వైపే చూడాల్సి వస్తోంది. – మైలవరపు శశాంక్ (అమెరికా వెళ్ళిన ఖమ్మం విద్యారి్థ) రెండేళ్ళ క్రితం వరకూ అమెరికాలో ఎంఎస్ గురించి రోజుకు సగటున 50 మంది వాకబు చేసేవారు. ఇప్పుడు కనీసం పది మంది కూడా ఉండటం లేదు. కెనడాలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుండటం, అమెరికాలో ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం సన్నగిల్లడమే ఈ పరిస్థితికి కారణం. – జాన్సన్, యూఎస్ కన్సల్టింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు అమెరికాలో ఐటీ రంగం పరిస్థితి ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. కొందరు ఉన్న ఉద్యోగాలు కోల్పోతున్నారు. భారతీయ విద్యార్థులు నూటికి కనీసం ఆరుగురు కూడా కొత్తగా స్కిల్డ్ ఉద్యోగాలు పొందడం లేదు. – అమెరికాలోని భారతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎన్వీఎన్అప్పుచేసి అమెరికా వచ్చా. పార్ట్ టైం జాబ్ కూడా ఒక వారం ఉంటే ఇంకో వారం ఉండటం లేదు. కన్సల్టెన్సీలు కూడా చేతులెత్తేస్తున్నాయి. మరోవైపు ఎంఎస్ పూర్తి చేసిన నా స్నేహితులకు స్కిల్డ్ ఉద్యోగాలు దొరకడం లేదు. మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా ఉంటోంది. – సామా నీలేష్ (అమెరికా వెళ్ళిన హైదరాబాద్ విద్యార్థి) -
విదేశీ విద్యానిధికి మరింత ప్రోత్సాహం!
సాక్షి, హైదరాబాద్: ‘విదేశీ విద్యానిధి పథకం’లబ్ధిదారుల సంఖ్య పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సంక్షేమ పథకాల్లో అత్యంత ఎక్కువ ఆర్థికసాయం అందుతున్న పథకం కూడా ఇదే కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అత్యంత పరిమిత సంఖ్యలో అర్హులను గుర్తిస్తుండటంతో విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలన్న విద్యార్థులు తీవ్ర నిరాశ పడుతున్నారు. గత ఆరేళ్లుగా సంక్షేమశాఖల వారీగా వస్తున్న దరఖాస్తుల సంఖ్యను విశ్లేషిస్తూ విద్యార్థుల సంఖ్య పెంపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించగా...ఆ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్టు సమాచారం. అతి త్వరలో ఈ ఫైలుకు మోక్షం కలుగుతుందని, ఎక్కువ మందికి లబ్ధి కలిగించాలని సంక్షేమశాఖలు భావిస్తున్నాయి.పూలే విద్యానిధికి అత్యధిక దరఖాస్తులు విదేశీ విద్యానిధి పథకం కింద అర్హత సాధించిన విద్యార్థికి నిర్దేశించిన దేశాల్లో పీజీ కోర్సు చదివేందుకు గరిష్టంగా రూ.20లక్షల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. పీజీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన వెంటనే రూ.10 లక్షలు, రెండో సంవత్సరం పూర్తి చేసిన తర్వాత మరో రూ.10 లక్షల సాయాన్ని సంబంధిత సంక్షేమ శాఖలు నేరుగా విద్యార్థి ఖాతాలో జమ చేస్తాయి. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులకు రూ.20లక్షల సాయంతో పాటుగా ప్రయాణ ఖర్చుల కింద కోర్సు ప్రారంభ సమయంలో ఫ్లైట్ చార్జీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.ప్రస్తుతం బీసీ సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యా నిధి పథకం కింద 300 మందికి మాత్రమే అవకాశం కలి్పస్తున్నారు. ఇందులో బీసీ కేటగిరీలోని కులాల ప్రాధాన్యత క్రమంలో 285 మంది విద్యార్థులకు, ఈబీసీల నుంచి 15 మందికి అవకాశం ఇస్తున్నారు. వాస్తవానికి బీసీ సంక్షేమ శాఖకు ఏటా 5 వేలకు పైబడి దరఖాస్తులు వస్తున్నాయి. కానీ అందులో 5 నుంచి 7శాతం మందికే అవకాశం లభిస్తుండగా, మిగిలిన విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెంచాలని పెద్ద సంఖ్యలో వినతులు రావడంతో బీసీ సంక్షేమశాఖ ఈ దిశగా ప్రతిపాదనలు తయారు చేసింది.ప్రస్తుతమున్న 300 పరిమితిని కనీసం వెయ్యి వరకు పెంచాలని కోరింది. ఒకేసారి ఇంతపెద్ద సంఖ్యలో పెంచే అవకాశం లేదని ఉన్నతాధికారులు సూచించడంతో కనీసం 800లకు పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 210 పరిమితిని 500కు, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 100 పరిమితిని 300 నుంచి 500 వరకు పెంచాలంటూ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. ఈ అంశంపై ఇటీవల సంక్షేమ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలోనూ చర్చించారు. సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా ఉండటంతో ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు తెలిసింది. అతి త్వరలో ఈ ప్రతిపాదనలు ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు వెలువడతాయని విశ్వసనీయ సమాచారం. -
విదేశీ విద్యా పథకానికి మంగళం!
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన జగనన్న విదేశీ విద్యా పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడేసిందా అనే ప్రశ్నకు విద్యార్థుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. జ్ఞానభూమి ఆన్లైన్ పోర్టల్ రెండు నెలలుగా తెరుచుకోకపోవడమే దీనికి కారణం. – సాక్షి, అమరావతి విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం అందించే ప్రభుత్వ సాయానికి ఎన్నికల ముందునుంచే పేద విద్యార్థులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కొన్ని దరఖాస్తులు పరిశీలన పూర్తికాగా, మరికొందరి అర్హతపై ఇంటర్వ్యూ సైతం పూర్తయింది. వారి పరిస్థితి ఇప్పుడు ఏంచేయాలో తెలియని ఆయోమయంలో పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ వరకు రూ.107.07 కోట్లను విదేశీ విద్యా పథకం కింద పేద విద్యార్థులకు అందించింది. ఈ ఏడాది జనవరి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. కొందరికి ఇంటర్వ్యూలు కూడా అధికారులు పూర్తి చేశారు. కాగా.. అంతకుముందు ఎన్నికల కోడ్ పేరుతో నిధుల విడుదలను నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అయినా పరిశీలించి సాయం విడుదల చేసిందా అంటే అదీలేదు. విద్యార్థులకు ఉదారంగా సాయమందించిన వైఎస్ జగన్ పేద కుటుంబాల్లోని పిల్లల పెద్ద చదువులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదారంగా ఆర్థిక సాయం అందించారు. జగనన్న విదేశీ విద్యా పథకం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ విద్యార్థులకు విదేశాల్లో చదువుకు ఊతమిచ్చారు. ప్రపంచంలో టాప్ 50 క్యూఎస్ ర్యాంకింగ్ సాధించిన యూనివర్సిటీల్లో సీటు పొందిన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు.. కాపు, ఈబీసీ విద్యార్థులకు రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందించారు. నాలుగు విడతల్లో ఆ మొత్తాన్ని విద్యార్థులకు చెల్లించేవారు. విద్యార్థుల ప్రయాణానికి అవసరమైన ఖర్చులను సైతం ప్రభుత్వమే చెల్లించేది. పీజీ, పీహెచ్డీ కోర్సులతో పాటు విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్సులకు విదేశీ విద్యాదీవెన పథకాన్ని వర్తింపజేశారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.15 లక్షల వరకే సాయం అందిస్తే.. జగన్ ప్రభుత్వం గరిష్టంగా రూ.కోటి నుంచి రూ.కోటి 25 లక్షల వరకు అందించడం విశేషం. సమాధానం చెప్పేవారూ కరువు ప్రభుత్వం సాయం అందిస్తుందనే ఆశతో ఇంటర్వ్యూలు పూర్తయిన చాలామంది విద్యార్థులు అప్పులు చేసిమరీ చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. నెలలు గడుస్తున్నా వారికి సాయం అందించే విషయంలో స్పష్టత రావడం లేదు. విదేశీ విద్యా పథకం తమకు మంజూరైందో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కనీసం సమాధానం చెప్పే వారే కరువయ్యారు. పోర్టల్లో ఏదైనా అప్డేట్ ఉందేమో అని చూస్తే జ్ఞానభూమి పోర్టల్ అసలు తెరుచుకోవడం లేదు. ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తులను సైతం అధికారులు తొలగించినట్టు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఈ పథకాన్ని కొత్త ప్రభుత్వం ఎత్తేసిందని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్లకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల వినతులు సమర్పించినప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. స్పష్టత రావడానికి మరో నెల పట్టవచ్చని.. పథకాన్ని మార్చి విధి విధానాలు కఠినతరం చేసి ఆర్థిక సాయాన్ని తగ్గించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. -
విదేశీ చదువుల క్రేజ్
-
విదేశాలకు వెళ్లాలా? వద్దా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సాయం అందించే ఓవర్సీస్ విదేశీ విద్యానిధి పథకాల లబ్ధిదారుల ఖరారు అంశం పెండింగ్లో పడింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొంతకాలం ఆపేయాలని నిర్ణయించాయి. వివిధ సంక్షేమ శాఖలు క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తుల స్వీకరించడంతోపాటు ఆయా విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను సైతం పూర్తి చేశాయి. మెరిట్ ఆధారంగా వడపోసినప్పటికీ అర్హుల జాబితాలను మాత్రం ప్రకటించలేదు. నెలన్నరపాటు వివిధ దశల్లో వడపోత చేపట్టినా... సకాలంలో ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదు. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు ఒక్కసారిగా ఈ ప్రక్రియను నిలిపివేశాయి. విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు పక్షం రోజులవుతోంది. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ మే 13తో పూర్తి కానుంది. కానీ దేశవ్యాప్తంగా జూన్ 1న ఎన్నికలు ముగియనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అప్పటివరకు కోడ్ అమల్లో ఉంటుంది. అప్పటివరకు విదేశీ విద్యానిధి పథకం లబ్ధిదారుల ఎంపిక జాబితా వెలువడే అవకాశం లేదు. ఈ క్రమంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విదేశీ వర్సిటీల్లో ఏప్రిల్ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే సంక్షేమ శాఖలు ఓవర్సీస్ విద్యానిధి లబ్ధిదారుల ఎంపికను జనవరిలోనే మొదలుపెడతాయి. దరఖాస్తుల స్వీకరణ, ధ్రువపత్రాల పరిశీలన, ఇతర ప్రక్రియ పూర్తి చేసి మార్చి మొదటి వారంలో లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసేది. కానీ ఈ దఫా అర్హుల జాబితా విడుదలలో జాప్యం జరిగింది. విదేశీ విద్యానిధి సాయం వస్తుందన్న ఆశతో వందల సంఖ్యలో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అప్పు చేసి మరీ... ఈ పథకం కింద అర్హత సాధిస్తేనే ఉన్నత విద్యలో చేరేందుకు సిద్ధమయ్యే పరిస్థితి ఉండగా... ఇప్పుడు పథకం కింద లబ్ధి చేకూరుతుందా? లేదా? అనే గందరగోళం అభ్యర్థుల్లో నెలకొంది. దీంతో విదేశాలకు వెళ్లాలా? వద్దా? అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మరికొందరు మాత్రం అర్హత సాధిస్తామనే ధీమాతో అప్పు చేసి మరీ విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. విమానం టికెట్లు బుక్ చేసుకుని గడువులోగా యూనివర్సిటీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఓవర్సీస్ విద్యానిధి కింద బీసీ సంక్షేమ శాఖ ద్వారా 300 మందికి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి 350 మందికి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 500 మందికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఉన్నత విద్యా కోర్సు పూర్తి చేసే వరకు రూ.20 లక్షలు రెండు వాయిదాల్లో ఇస్తారు. ఈ మొత్తాన్ని సదరు విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. -
రూ. 5 లక్షలిస్తే ‘విద్యానిధి’ మీదే!
వరంగల్ జిల్లాకు చెందిన మురిపాల సిద్ధార్థ్ ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్లాలనుకున్నాడు. బీటెక్లో మంచి మార్కులు రావడంతో విదేశీ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఓ మధ్యవర్తి.. ఈ పథకం కింద రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందేలా చూస్తానని, అందుకు ప్రతిఫలంగా రూ. 5 లక్షలు ఇవ్వాలంటూ బేరమాడాడు. ఆర్థిక సాయంపై ఆశతో సిద్ధార్థ్ తండ్రి ఒప్పుకున్నాడు. రూ.లక్ష కూడా ఇచ్చాడు. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో అధికారులు సిద్ధార్థ్ తండ్రిని పిలిచి మంచి మార్కులు, ఉత్తమ స్కోర్ ఉండడంతో మీ కుమారుడు తప్పకుండా ఎంపికవుతాడని చెప్పాడు. ఈ క్రమంలో ఎంపికైన సిద్ధార్థ్ అమెరికా వెళ్లి చదువు కొనసాగిస్తున్నాడు. అయితే ఎంఎస్ కోర్సులో చేరిన తర్వాత అడ్మిషన్ సర్టిఫికెట్, ధ్రువపత్రాలను సమర్పించాలని సిద్ధార్థ్ తండ్రికి అధికారులు ఫోన్ చేశారు. దీంతో ధ్రువపత్రాలను సమర్పించిన ఆయన మధ్యవర్తి విషయాన్ని వెల్లడించారు. అధికారులు ఫిర్యాదు ఇవ్వాలని చెప్పడంతో లేఖ ఇచ్చాడు. కానీ మధ్యవర్తి ఫోన్ నంబర్ పనిచేయకపోవడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. మధ్యవర్తి మాటలు విని తాను మోసపోయినట్లు చివరకు సిద్ధార్థ్ తండ్రి గుర్తించాడు. సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా నిధి పథకం కింద గరిష్టంగా రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, బీసీ సంక్షేమ శాఖ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరిట ఈ పథకాలు అమలవుతున్నాయి. అర్హుడైన విద్యార్థికి రెండు దఫాలుగా గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ఆర్థిక సాయం అందించే పథకం ఇదే కావడం గమనార్హం. కాగా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఈ పథకానికి విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో మధ్యవర్తులు దరఖాస్తుదారులను మాయ మాటలతో మోసం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. అత్యంత గోప్యంగా ఎంపిక ప్రక్రియ పరిమిత కోటాతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఏటా గరిష్టంగా 2 వందల మందికి, బీసీ, ఈబీసీలకు 300 మందికి సాయం అందిస్తోంది. బీసీ, ఈబీసీ కేటగిరీలో ఈ ఏడాది ఏకంగా 3వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో దరఖాస్తు, సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో మధ్యవర్తులు తల్లిదండ్రులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అడుగుతూ ఈ పథకం కింద తప్పకుండా మీకు ఆర్థిక సాయం అందేలా చూస్తామని నమ్మబలుకుతున్నారు. విద్యానిధి పథకం కింద దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన, అర్హుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. సంబంధిత సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి/కార్యదర్శితో పాటు సంక్షేమ శాఖ కమిషనర్/డైరెక్టర్, అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు, ఉప సంచాలకులు ఇందులో ఉంటారు. ఈ ప్రక్రియ ఆద్యంతం గోప్యంగా సాగుతుంది. ఎంపికైన తర్వాత జాబితా వెలువడినప్పుడు మాత్రమే అర్హుల పేర్లు బయటకు వస్తాయి. ఈ అంశాన్ని మధ్యవర్తులు అవకాశంగా మలుచుకుంటున్నారు. కొందరు జాబితా వెలువడిన వెంటనే లబ్ధదారులకు ఫోన్లు చేసి తమ ప్రయత్నం వల్లే ఆర్థిక సాయం అందుతోందంటూ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వసూళ్లకు తెగబడుతున్నారు. అధికార యంత్రాంగం నజర్ వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి తండ్రి ఇటీవల ఫిర్యాదు చేయడంతో విద్యానిధి పథకంలో జరుగుతున్న అక్రమ వ్యవహారంపై అధికారులు దృష్టి పెట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రులను పిలిపించి మధ్యవర్తుల అంశంపై ఆరా తీస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి నుంచి లిఖిత పూర్తక ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యానిధి అర్హతలు, ఎంపిక ఇలా... విదేశీ విద్యా నిధి పథకంలో గ్రాడ్యుయేషన్ మార్కులు కీలకం. నిర్దేశించిన దేశాల్లో ఎంఎస్ చదువుకునే విద్యార్థులు ఈ పథకం కింద ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్థి డిగ్రీ మార్కులకు 60 శాతం స్కోర్, జీఆర్ఈ/జీమ్యాట్ స్కోర్కు 20 శాతం, ఐఈఎల్టీఎస్/టోఫెల్కు మరో 20 శాతం మార్కులుంటాయి. దరఖాస్తులను అధికారులు వడపోసి నిబంధనల ప్రకారం అత్యధిక మార్కులున్న వారిని రిజర్వేషన్ల వారీగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో అత్యధిక మార్కులున్న వారి జాబితాను రూపొందించి పరిమితికి లోబడి అర్హుల ఎంపిక చేపడతారు. బీసీల్లో మాత్రం సబ్ కేటగిరీలు, ఈబీసీ కేటగిరీ వారీగా వడపోత చేపట్టి ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థికి మొదటి రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక సగం, చివరి రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక మిగతా సాయాన్ని ప్రభుత్వం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. విద్యార్థి చదువుకు సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తేనే నిధులు విడుదలవుతాయి. -
Vidya Deevena: నిధుల్ని విడుదల చేయనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పేద విద్యార్థులకు సైతం కల్పిస్తూ.. మరోవైపు, సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అత్యున్నత స్థాయి విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావాలన్న విద్యార్థుల కలల సాకారానికి ఆర్థిక తోడ్పాటునందిస్తూ.. ‘జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అందించనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.6 కోట్లను, సివిల్ సర్విసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ.100.5 లక్షలను మొత్తం రూ.42.6 కోట్లను ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం సివిల్ సర్విస్ పరీక్షలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు రూ.1లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ.50 వేల ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శిక్షణతోపాటు వారు సొంతంగా ప్రిపేర్ అయ్యేందుకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తోంది. అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పాసైన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. నిజానికి.. గత ప్రభుత్వంలో సివిల్ సర్వీసెస్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు మేలు కలిగేలా అరకొరగా పథకాన్ని అమలుచేసింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం లంచాలకు, వివక్షకు తావులేకుండా అర్హులైన ప్రతి అభ్యర్థికీ లబ్ధిచేకూరుస్తూ నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన కేవలం శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉన్న విదేశీ విద్యను పేద విద్యార్థులు సైతం అభ్యసించే వీలు కల్పిస్తూ.. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్/టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం తదితర 21 ఫ్యాకలీ్టలలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు విమాన ప్రయాణం, వీసా ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. దీనిద్వారా ప్రపంచంలోని టాప్–320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ఇక గడిచిన 10 నెలల్లో కేవలం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద 408 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇతర వివరాల కోసం https:// jnanabhumi.ap.gov.in ను చూడవచ్చు. -
విదేశీ విద్యను ఇక్కడే కల్పించేలా...
భారతదేశంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల (ఎఫ్హెచ్ఇఐ) క్యాంపస్ల ఏర్పాటు, నిర్వహణ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఈ క్రమబద్ధీకరణ ఉదారంగానూ, సమర్థంగానూ ఉందని చెప్పాలి. ఇది నూతన విద్యా విధానపు సిఫార్సులను అనుసరిస్తోంది. అయితే, ఇది ఇప్పటికే ఉన్న దేశంలోని విద్యా వ్యవస్థలను సవాలు చేయడానికి ప్రయత్నించడం అనేది ఒక అవకాశంతోపాటు ఆందోళన కరమైన విషయం కూడా! ఇంకా, విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన భారతీయ క్యాంపస్లోని విద్యాపరమైన నాణ్యతను తమ దేశంలోని ప్రధాన క్యాంపస్తో సమానంగా ఉండేలా చూసుకోవాలి. చాలా గొప్ప ఆలోచనే అయినప్పటికీ, క్రమబద్ధీకరణ యంత్రాంగం దీన్ని ఎలా అనువర్తించగలుగుతుంది? యూజీసీ క్రమబద్ధీకరణ విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు పాలన పరంగా ప్రత్యేక అధికారాలకు అనుమతిస్తోంది. అన్ని విభాగాలలో యూజీ/ పీజీ/ డాక్టోరల్/ పోస్ట్డాక్టోరల్ అధ్యయనాలు, డిగ్రీల ప్రదానం, డిప్లొమాలు, సర్టిఫికేట్లను ఇచ్చే వీలు కల్పిస్తోంది. ఈ విదేశీ విద్యా సంస్థలు మొత్తం సబ్జెక్ట్వారీగా, ప్రపంచ ర్యాంకింగ్స్లో 500 లోపు ఉంటే అది నిజంగా గొప్ప అడుగే. కాకపోతే, ప్రపంచంలో కనీసం 20 ప్రముఖ ర్యాంకింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు వివిధ కారణాల వల్ల ఈ ర్యాంకింగ్ సంస్థల చర్యలలో పాల్గొనడం లేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ర్యాంకింగ్లను ఎలా ప్రామాణీ కరిస్తారనేది ప్రశ్న. కాకపోతే భారతీయ, విదేశీ ఉన్నత విద్యాసంస్థల మధ్య సహకారం కోసం 2022లో జరిగిన విద్యా సంబంధ సహకార నియంత్రణ నేపథ్యంలో చూస్తే, ఉమ్మడి డిగ్రీ, ద్వంద్వ డిగ్రీ కార్య క్రమాలకు ఉత్తేజకరమైన కాలం ముందుందని చెప్పొచ్చు. దేశంలో అడుగుపెట్టే విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ఈ క్రమ బద్ధీకరణ ద్వారా, భారతీయ ఉన్నత విద్యా సంస్థలు లేదా భారతీయ కంపెనీలతో జాయింట్ వెంచర్లోకి ప్రవేశించవచ్చు. జాయింట్ వెంచర్లు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పక్షాలు తమ వనరులతో ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడానికి అంగీక రించే వ్యాపార పరమైన ఏర్పాటు అని మనం అర్థం చేసుకున్నప్పటికీ – విదేశీ ఉన్నత విద్యా సంస్థ భౌతిక, విద్యా, పరిశోధనా మౌలిక సదుపాయాలతో కూడిన స్వతంత్ర క్యాంపస్ను కలిగి ఉండాలని ఈ నిబంధన ఎందుకు నొక్కి చెబుతోంది? దాని విద్యాపరమైన, పరిశోధనా కార్యక్రమాలను సీరి యస్గా నిర్వహించడానికి ఏ విదేశీ ఉన్నత విద్యా సంస్థ అయినా భారతదేశంలో ఉండటం కోసం భూమిపై, వనరులపై పెట్టుబడి పెడుతుందా? దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న భారతీయ క్యాంపస్ లతో వనరులను పంచుకునే సహకార క్యాంపస్ నమూనా మరింత ఆచరణీయంగా ఉంటుంది. ఇప్పుడు ‘కంపెనీ’ పాత్రను చూద్దాం. నిర్దేశిత లక్ష్యాల కోసం, సెక్షన్ 8 కింద నమోదు అయిన కంపెనీ, లాభాలు ఏవైనా ఉంటే, వాటిని ఆ నిర్దేశిత లక్ష్యాల కోసమే ఉపయోగించాలి. లాభాలను దాని సభ్యులకు చెల్లించకూడదు. ఇంకా, ఇండియన్ ట్రస్ట్ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం, ఒక విదేశీయుడు లేదా ఎన్నారై, భారతీయ ట్రస్ట్కు ట్రస్టీగా ఉండకూడదు. అయితే ఫెమా చట్టం, 1999 నిబంధనలకు అనుగుణంగా ఉండే పక్షంలో నిధులను సరిహద్దులు దాటించడానికీ, విదేశీ కరెన్సీ ఖాతాల నిర్వహణకూ, చెల్లింపులకూ, అమ్మకాలకూ అను మతిస్తోందని తెలుస్తున్నప్పుడు ఇక్కడ ఏదో లోపం ఉందని గమనించాలి. నిధులను స్వదేశానికి పంపగలిగే వీలు ఉన్నట్లయితే, సంబంధిత విదేశీ ఉన్నత విద్యా సంస్థ లాభాలను పొందగలదని దీని అర్థమా? అంటే ఇప్పుడు విద్య ‘లాభార్జన’ కోసమా? భవిష్యత్తులో భారతదేశం ఆకర్షణీయమైన ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా మారుతుందని ఈ క్రమబద్ధీకరణ ఆశిస్తోంది. ఏ విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ఏయే కార్యక్రమాలతో తమ క్యాంపస్లను మన దేశంలో ఏర్పరుస్తాయి; వారు స్థానిక అధ్యాపకులను తీసుకుంటారా, అంతర్జాతీయంగానా; విద్యార్థుల ప్రవేశం కోసం వారు ఉప యోగించే కొలమానాలు ఏవి అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయకంగా, అక్రిడిటేషన్ అనేది భారతదేశంతో పాటు చాలా దేశాలలో నాణ్యతా తనిఖీ విధానం. విదేశీ ఉన్నత విద్యా సంస్థ నాణ్యతాపరమైన హామీ, ఆడిట్కు లోనవుతుందనీ, యూజీసీకి తన నివేదికను సమర్పించాలనీ ఈ క్రమబద్ధీకరణ నిర్దేశిస్తోంది. ఏదైనా నెరవేరదగిన హామీ నెరవేర్చని పక్షంలో వినియోగదారు న్యాయస్థానంలో పరిష్కారాన్ని కోరవచ్చు. ఒక విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన రుసుముల చట్రాన్ని నిర్ణ యించుకోవడానికి ఈ క్రమబద్ధీకరణ అనుమతించడం నిజానికి ప్రగతి శీలమైనది. భారతదేశంలోని విద్యాసంస్థలు మాత్రం ఫీజు నిర్ణా యక కమిటీల ఇష్టాలకు లోబడుతున్నప్పుడు, విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు ఈ ప్రత్యేక గౌరవం ఎందుకు? ఫెమా నిబంధనలు ఉన్నప్ప టికీ, పరిమాణాత్మకం కాని మొత్తాలను ఎల్లప్పుడూ సర్దుబాటు చేయ వచ్చు. అలాంటప్పుడు, అకడమిక్ పరపతి ఆధారితమైన రుసుము చట్రాన్ని తప్పనిసరి చేయడం మరింత విశ్వసనీయమైన ఎంపిక. విదేశీ ఉన్నత విద్యా సంస్థ అందించే కార్యక్రమాలు ఆన్లైన్ , బహిరంగ మరియు దూరవిద్యా (ఓడీఎల్) విధానంలో అనుమతించ బడవు అనే షరతు నిర్బంధపూరితంగా ఉంది. ఎమ్ఐటి, స్టాన్ ఫోర్డ్, హార్వర్డ్ వంటి అ్రగ్రశ్రేణి విద్యాసంస్థలు అద్భుతమైన ఆన్లైన్ ప్రోగ్రామ్లను కలిగి ఉన్నాయి. ఇటీవలి కాలంలో యూజీసీ అనేక ఓపెన్, దూరవిద్యా నిబంధనలను సడలించినప్పుడు, వాటిని మన విద్యార్థులకు ఎందుకు దూరంచేయాలి? విశ్వవిద్యాలయాల ప్రపంచ ర్యాంకింగ్లను గుర్తించడానికి రెండు ముఖ్యమైన కొలమానాలు ఏవంటే... అంతర్జాతీయీకరణ, పరిశో ధన. భారతీయ క్యాంపస్లలో విదేశీ విద్యార్థులు, అధ్యాపకులు వర్ధిల్ల డాన్ని అంతర్జాతీయీకరణ అంటారు. ఒక ప్రముఖ ఫ్యాకల్టీ ఎక్కువ డబ్బు సంపాదించడం లేదా మెరుగైన పరిశోధనా సౌకర్యాల కోసం, లేదా తన పరిధిలోని అత్యుత్తమ వ్యక్తులతో పరస్పర సంభాషణ కోసం; అవకాశాలను అన్వేషించడం లేదా కొత్త ఉత్పత్తులు, ప్రక్రియలకు దారితీసే పేటెంట్లను, ఐపీఆర్లను తమ హోదాకు జతచేసు కోవడం కోసం పనిచేస్తారు. అవి సాధ్యం కాదని తెలిసినప్పుడు, మహా అయితే ఏదో ఒక వారం సందర్శన కోసం తప్ప, ఎవరూ బయ టకు రారు. అప్పుడు విదేశీ ఉన్నత విద్యా సంస్థ ఎలా పని చేస్తుంది? అధ్యాపకులు, సిబ్బంది నియామకంలో పూర్తి స్వయంప్రతిపత్తి ఈ క్రమబద్ధీకరణలో అత్యంత ముఖ్యమైన భాగం. మన సంస్థలలోని అత్యుత్తమ అధ్యాపకులు విదేశీ ఉన్నత విద్యా సంస్థలకు వలసవెళ్లే అవకాశం ఉండటం ఈ నిబంధనకు రెండో కోణం. బహుశా, చివరికి ఒక కొత్త సాధారణ స్థితి ఏర్పడవచ్చు. ఆ స్థితి మన విద్యా సంస్థలలో నాణ్యతను పెంచినట్లయితే, దానిని స్వాగతించాలి. మన విద్యా సంస్థల ఫీజు కమిటీ సిఫార్సులు, అడ్మిషన్ల కోసం రాష్ట్ర లేదా కేంద్ర నిబంధనలు మొదలైన వాటికి కట్టుబడి ఉండాలి. అధ్యాపకు లను ఎన్నుకోవడంలో, ఫీజులను నిర్ణయించడంలో ప్రవేశ నిబంధనలను ఏర్పర్చడంలో మన సంస్థలకు స్వయంప్రతిపత్తిని ఎందుకు పొడిగించకూడదు? అవన్నీ అంతర్జాతీయ ర్యాంకింగ్ సంస్థలకు చెందిన అవే కొలమానాలపై పోటీ పడాలని భావిస్తున్నాం కదా! ఏదైనా ప్రయోగం విషయంలో దాని విమర్శకులు దానికి ఉంటారు. విదేశాల్లోని మాతృసంస్థల్లో అయ్యేదానితో పోల్చినప్పుడు తక్కువ ఖర్చుతో, విదేశీ విద్యార్హతలతో భారతీయ విద్యార్థులు నాణ్యమైన విద్యను ఇక్కడే పొందేందుకు ఈ క్రమబద్ధీకరణ వీలు కల్పిస్తే, ఇది స్వాగతించాల్సిన విషయమే. అయితే ఐఐటీల వంటి మన ప్రథమశ్రేణి విద్యాసంస్థలను సాధారణంగా ఎంపిక చేసుకునే విద్యార్థులు కూడా ఈ కొత్త క్యాంపస్లలో చేరేలా ప్రభావితం అయితే, అది ఆందోళన కలిగించే అంశం అవుతుంది. అందుకే, నాణ్యతా ప్రమాణాలు ఎన్నో రెట్లు పెరిగినందున విద్యారంగానికి భారీ పెట్టుబడులు అవసరం. పరిశోధనా సౌకర్యాల్లో భారీ స్థాయి వృద్ధి అవసరం. ప్రభుత్వ నిధులను అలా ఉంచుతూనే, విదేశీ నిధులను అనుమతించడం, విజయవంతమైన వ్యవస్థలను అనుసరించడం మేలు. ఎస్ఎస్ మంథా, ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) మాజీ ఛైర్మన్; అశోక్ ఠాకూర్, కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ మాజీ కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
విదేశీ విద్యకే మొగ్గు
సాక్షి, అమరావతి: విదేశీ విద్యపై భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. అంతర్జాతీయ యూనివర్సిటీలు/విద్యా సంస్థలు ప్రదానం చేసే డిగ్రీలకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో విదేశాల బాటపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022 నాటికి 79 దేశాల్లో 13 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు వివిధ వర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే గతేడాది ఏకంగా 7.5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు పయనమయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3.37 లక్షల మంది తరలివెళ్లారు. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు కెనడా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికాకే మొదటి ప్రాధాన్యత.. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) కోర్సుల్లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ కోర్సులకు మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు వాటినే ఎంచుకుంటున్నారు. మంచి పే ప్యాకేజీల కోసం బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరేవారూ ఉంటున్నారు. ఈ క్రమంలో భారతీయులు తమ మొదటి ప్రాధాన్యతను అమెరికాకే ఇస్తున్నారు. ఇక్కడ స్టెమ్ కోర్సుల్లోనే ఎక్కువ మంది చేరుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో 4.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. రెండో స్థానంలో కెనడా.. భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశాల్లో అమెరికా తర్వాత కెనడా రెండో స్థానంలో నిలుస్తోంది. యూఎస్తో పోలిస్తే వర్సిటీల్లో సీటు సాధించడం, ఇమ్మిగ్రేషన్ విధానాలు అనుకూలంగా ఉండటంతో కెనడాకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆ దేశ ఇమ్మిగ్రేషన్– సిటిజన్షిప్ డేటా ప్రకారం.. కెనడాకు వచ్చిన అంతర్జాతీయ విద్యార్థుల జాబితాలో 1.86 లక్షల మందితో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక యూకే తక్కువ కాల వ్యవధిలో వివిధ కోర్సులు అందిస్తుండటం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల్లో విద్యాభ్యాసం తర్వాత శాశ్వత నివాసితులుగా మారేందుకు అవకాశాలు ఉండటం భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సుల్లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉండటంతో జర్మనీని ఎంచుకుంటున్నారు. వెనక్కి వచ్చేవారు తక్కువే.. ముఖ్యంగా 2015–19 మధ్య విదేశాల్లో చదివిన భారతీయ విద్యార్థుల్లో కేవలం 22 శాతం మంది మాత్రమే స్వదేశానికి తిరిగి వచ్చి మంచి ఉపాధిని పొందినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. -
విదేశీ విద్యా దీవెన కింద 1,830 మందికి సాయం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తున్న ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం కింద ఇప్పటివరకు 1,830 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం లభించింది. గత ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్య పథకం అక్రమాల పుట్టగా మారిందని విజిలెన్స్ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకంలోని లోపాలను చక్కదిద్ది మరింత ఎక్కువ మందికి, మరింత ఎక్కువ ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీనికింద రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ విద్యార్థులందరికీ సంతృప్త విధానంలో విదేశీ విద్యకు ప్రభుత్వం సాయమందిస్తోంది. 21 నిర్దేశిత సబ్జెక్ట్ కేటగిరీల్లో 50 విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో ప్రవేశం పొందినవారికి ట్యూషన్ ఫీజు కింద రూ.కోటి 25 లక్షల వరకు ఆర్థిక సాయం (వాస్తవ రుసుం) అందిస్తోంది. ఈబీసీలు రూ.కోటి వరకు ఆర్థిక సాయానికి అర్హులు. గత టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు మాత్రమే సాయం అందించేది. అంతేకాకుండా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 లక్షలకే పరిమితం చేసింది. ఆ ఆదాయ పరిమితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.8 లక్షలకు పెంచింది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులకు మేలు జరుగుతోంది. -
దక్షిణాదిలో ఇంజనీరింగ్ దర్జా..
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకే అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. అందులోనూ సాఫ్ట్వేర్ రంగాన్నే ఎంచుకుంటున్నారు. విదేశీ విద్య, అక్కడే స్థిరపడాలన్న ఆకాంక్ష దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల్లోనే ఎక్కువగా కన్పిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులు మాత్రం వివిధ కోర్సులతో కూడిన కాంబినేషన్ డిగ్రీలు, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులను ఎంచుకుంటున్నారు. ప్రతి విభాగంలోనూ పాలనాపరమైన ఉద్యోగాల్లో స్థిరపడాలన్న ఆకాంక్ష వెలిబుచ్చుతున్నారు. సాంకేతిక విద్య వైపు ఎక్కువగా మొగ్గు చూపకపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు తగ్గుతున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఈ మేరకు కోర్సుల్లో మార్పులు తేవాలని కేంద్ర ప్రభుత్వానికి ఏఐసీటీఈ సూచించింది. సగానికిపైగా ఇక్కడే.. దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు (2022 గణాంకాలు) అందుబాటులో ఉన్నాయి. ఇందులో 6,74,697 సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి. ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు దేశవ్యాప్తంగా 3,39,405 ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి. 2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్ళలో అవి 5.3 శాతం పెరిగాయని మండలి గుర్తించింది. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ తర్వాత తక్షణ ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ లేదా ఇతర సాంకేతిక ఉపాధి అవకాశాలను ఎంచుకుంటున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఉండే ఇంజనీరింగ్ సీట్లలో 54 శాతం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో విద్యార్థులు ఒకే విధమైన కోర్సుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్)ని, ఎంబీఏ, ఎంసీఏను ఎంచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు మాత్రం ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. ఆ తర్వాత పోటీ పరీక్షల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగానే సివిల్స్ వంటి పోటీ పరీక్షకు ఉత్తరాదిలోనే ఎక్కువగా శిక్షణ కేంద్రాలు ఉంటున్నాయని తేలింది. విదేశాలు లేదా సాఫ్ట్వేర్.. బీటెక్ పూర్తయిన వెంటనే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు స్వదేశంలో ఎంటెక్కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎక్కువ మంది విదేశాలకు వెళ్తున్నారు. బీటెక్లో బ్రాంచీ ఏదైనా విదేశాల్లో మాత్రం సాఫ్ట్వేర్ అనుబంధ బ్రాంచీల్లోనే ఎంఎస్ పూర్తి చేస్తున్నారు. గత ఐదేళ్ళుగా సగటున 4 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, దక్షిణాది రాష్ట్రాల నుంచి 2.8 లక్షల మంది ఉన్నారని, ఇందులో బీటెక్ నేపథ్యం ఉన్న వాళ్ళు 1.50 లక్షల మంది ఉన్నారని ఏఐసీటీఈ పరిశీలనలో తేలింది ఎంఎస్ చేసేటప్పుడే పార్ట్ టైం ఉపాధి మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎంఎస్ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో స్థిరపడుతున్న వారిలో దక్షిణాది విద్యార్థులదే ముందంజ అని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా కాలేజీల్లో సంప్రదాయ కోర్సుల సీట్లు మిగిలిపోతున్నాయి. ఏదేమైనా ఉత్తర, దక్షిణ రాష్ట్రాల్లో నెలకొన్న వ్యత్యాసంపై మరింత అధ్యయనం అవసరమని ఏఐసీటీఈ భావిస్తోంది. -
Nara Lokesh : దళితులు పీకిందేమీ లేదు
సాక్షి ప్రతినిధి కర్నూలు: దళితులపై నారా లోకేశ్ నోరుపారేసుకున్నారు. అసభ్య పదజాలంతో ఆ వర్గాన్ని దూషించారు. ‘యువగళం’ పేరుతో చేస్తున్న పాదయాత్రలో లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి. పాదయాత్రలో భాగంగా గురువారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి లోకేశ్ చేరుకున్నారు. జక్కసానిపల్లిలో ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురానికి చెందిన అక్కులప్ప అనే దళితుడు విదేశీ విద్య, అవుట్ సోర్సింగ్, కస్తూరిబా గురుకుల పాఠశాలలోని ఉద్యోగులను పర్మినెంట్ చేసే విషయంలో టీడీపీ వైఖరిని ప్రశ్నిం చాడు. టీడీపీ అధికారంలోకి వస్తే ‘అంబేడ్కర్ విదేశీ విద్య’ అని పేరు మారుస్తారా? అన్నారు. ఇందుకు లోకేశ్ బదులిస్తూ ‘విదేశీ విద్యను చంద్రబాబు తీసుకొచ్చారు. కొంతమంది పిల్లలైనా విదేశాలకు వెళ్తే, మరో పదిమంది వెళ్తారనే ఉద్దేశంతో ప్రారంభించారు. ప్రస్తుతం చాలామంది పిల్లలు విదేశాలకు వెళ్లి ఇరుక్కుపోయారు. టీడీపీ ప్రభుత్వం ఒక ఏడాది ఫీజులు చెల్లించింది. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు. విదేశాల్లో చదివే విద్యార్థులు అప్పులపాలయ్యారు. విదేశీ విద్యతో పాటు బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు తీసేశారు. ప్రభుత్వం రూ.30కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చినంత మాత్రాన పిల్లలు విదేశాలకు వెళ్లరు. విదేశీ విద్యపై పోరాడిన వ్యక్తి మీ లోకేశ్. మంగళగిరి వేదికగా నేనే పోరాడాను. దళితులు పీకింది లేదు... పొడిచింది లేదు. ఈయన పేరు పెట్టేందుకు!’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలంరేపుతున్నాయి. గతంలో లోకేశ్ తండ్రి చంద్రబాబు కూడా ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు?’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
విదేశీ విద్యకు ‘అంబేద్కర్ విద్యానిధి’ అండ.. ఏటా రూ.20 లక్షల సాయం
నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో చదువుకునేందుకు ఎస్సీ విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఆర్థికసాయం అందిస్తోంది. మన రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ విద్యార్థులకు విదేశీ యూనివర్సిటీల్లో సీట్ వస్తే చాలు ప్రభుత్వం ఈ ఆర్థికసాయం చేస్తుంది. దీంతో విద్యానిధి పథకానికి జిల్లా ఎస్సీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మొదట్లో రూ.10లక్షలు.. ఈ పథకం కింద ఒక్కో ఎస్సీ విద్యార్థి విదేశీ యూనివర్సిటీల్లో పీజీ చదివేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం విద్యానిధి పథకం కింద మొదట్లో రూ.10లక్షల ఆర్థికసాయం అందించింది. అయితే రూ.10లక్షలు సరిపోక అప్పులు చేయాల్సి వచ్చిన పరిస్థితి రావడంతో పెద్దగా విదేశాల్లో చదివేందుకు ఎస్సీ విద్యార్థులు పెద్దగా ముందుకు రాలేదు. అయితే ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం మళ్లీ పథకం నిబంధనలు సడలించింది. కుటుంబ ఆదాయం రూ.5లక్షలకు పెంచడంతోపాటు విదేశీ విద్యకు అందించే ఆర్థికసాయాన్ని రూ.20లక్షలు చేసింది. దీంతో జిల్లాకు చెందిన ఎస్సీ విద్యార్థులు విదేశీ విద్యకోసం వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కుల ఆధారంగా దరఖాస్తులు.. విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు పరీక్షలు రాసి సీటు పొందితే ఆ మార్కుల ఆధారంగా షెడ్యూల్డ్ కులాల శాఖలో దరఖాస్తు చేసుకున్నవారిని అన్ని ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రభుత్వం విదేశీ విద్యనభ్యసించేందుకు ఆర్థికసాయం అందిస్తుంది. ప్రధానంగా యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లోని యూనివర్సిటీల్లో చదివేందుకు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటి వరకు 35 మందికి.. ప్రభుత్వం 2015లో విదేశీ విద్యకోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్సీ విద్యార్థులు 65 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరి అర్హతలు పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించి 35 మందిని ఎంపిక చేసి ఆర్థికసాయం అందించారు. ప్రస్తుతం వారంతా వివిధ దేశాల యూనివర్సిటీల్లో ఉన్నత చదువులు చదువుతున్నారు. కాగా 2021లో అత్యధికంగా తొమ్మిది మంది విద్యార్థులు విదేశీ విద్యకు ఎంపిక కావడం గమనార్హం. -
విదేశీ చదువుల్లో ఏపీ దూకుడు
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి దేశం నుంచి వెళ్లే విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే అగ్రస్థానంలో ఉన్నారు. 2016 నుంచి 2021 వరకు ఆరేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మన దేశం నుంచి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో 15 శాతం మంది ఏపీ విద్యార్థులే కావడం విశేషం. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తర్వాత పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారు. వీరిలో అత్యధికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో చదువుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 2019–2020లో కరోనా కారణంగా విదేశాలు రాకపోకలపై నిషేధం విధించాయి. పలు దేశాలు వీసాల మంజూరును నిలిపేయడంతో విద్యార్థుల విదేశీ విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడింది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో విదేశాల్లో చదువులకు వెళ్లినవారు సైతం వెనక్కి వచ్చేశారు. అగ్రభాగాన ఏపీ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నవారిలో ఏటా ఏపీ నుంచే అత్యధిక శాతం మంది ఉంటున్నారు. దేశం మొత్తం మీద 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2016లో 3,71,506 మంది విదేశాలకు వెళ్లారు. వీరిలో ఏపీ విద్యార్థులు 12.43 శాతం మంది ఉన్నారు. ఇక 2017లో 4,56,823 మంది వెళ్లగా వారిలో ఏపీ విద్యార్థుల శాతం.. 12.27. అలాగే 2018లో 5,20,342 మంది విదేశాలకు వెళ్లగా 12.06 శాతం మంది ఏపీ విద్యార్థులే. 2019లో 5,88,931 మందికిగాను ఏపీ విద్యార్థుల శాతం.. 11.79గా ఉంది. 2020లో 2,61,604 మంది విదేశీ విద్యార్థుల్లో 13.62 శాతం మంది ఏపీ విద్యార్థులున్నారు. ఇక ఈ ఏడాది విదేశాలకు వెళ్లిన 71,769 మందిలో 16.42 శాతం మంది ఏపీ విద్యార్థులే ఉండడం విశేషం. (చదవండి: పిల్లలకు టీకా.. జనవరి 1 నుంచి టీకా రిజిస్ట్రేషన్లు) 2020లో తగ్గిపోయిన విద్యార్థులు.. 2020 తర్వాత గణాంకాలను పరిశీలిస్తే.. దేశం నుంచి విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్లే వారి సంఖ్య ఆ ఏడాది ఒక్కసారిగా పడిపోయింది. కాగా, గత ఆరేళ్లలో 2019లో అత్యధికంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఆ ఏడాది దేశం నుంచి 5,88,931 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఇది 2020లో 2,61,406కు తగ్గిపోయింది. 2020 తర్వాత అత్యధిక కాలం ప్రవేశ నిషేధాలు అమలు కావడం, వీసాలు నిలిపివేయడం విదేశీ చదువులపై ప్రభావం చూపించాయి. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో అమెరికా సహా కొన్ని దేశాలు నిషేధాలను పాక్షికంగా సవరించాయి. వ్యాక్సినేషన్ పూర్తయ్యాక వీసాల మంజూరును ప్రారంభించాయి. ఈ ఏడాది మంజూరైన వీసాలను బట్టి 71,769 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఏర్పడింది. వీరిలోనూ ఏపీ విద్యార్థులే అత్యధికం. ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి 11,790 మంది విదేశీ చదువులకు వెళ్లారు. ఏపీ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర నుంచి 10,166 మంది, గుజరాత్ నుంచి 6,383 మంది, పంజాబ్ నుంచి 5,791 మంది, తమిళనాడు నుంచి 4,355 మంది, కర్ణాటక నుంచి 4,176 మంది ఉన్నారు. (చదవండి: ఆరోగ్యంలో అగ్రపథం.. టాప్ 5లో ఏపీ) -
వీసా ఇంటర్వ్యూ.. విజయం సాధించడం ఇలా!
విదేశీ చదువు ఒక డోర్ అనుకుంటే.. దాన్ని తెరిచే ‘కీ’.. వీసా ఇంటర్వ్యూ! నిజానికి స్టడీ అబ్రాడ్ విద్యార్థులు విమానం ఎక్కాలా.. వద్దా.. అని నిర్ణయించేది ఈ వీసా ఇంటర్వ్యూనే! ఫారిన్ ఎడ్యుకేషన్ దరఖాస్తు ప్రక్రియలో చివరి అంకమైన వీసా ఇంటర్వ్యూ అత్యంత కీలకమైంది. కాని విదేశాల్లో చదవాలని కలలు కనే ఎంతో మంది ప్రతిభావంతులు... వీసా ఇంటర్వ్యూలో తడబడి అవకాశాన్ని జార విడుచు కుంటున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఫాల్ సెషన్ (ఆగస్టు–సెప్టెంబర్)కు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఉపయోగపడేలా.. వీసా ఇంటర్వ్యూల తీరుతెన్నులపై ప్రత్యేక కథనం... ఇంటర్వ్యూ ఉద్దేశం స్టడీ అబ్రాడ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు... సదరు విదేశంలో నివసించేందుకు, విద్యను అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత కలిగి ఉన్నారా.. అనే అంశాన్ని ప్రధానంగా పరిశీలిస్తారు. చదువు పూర్తయిన తర్వాత అభ్యర్థి స్వదేశానికి తిరగి వెళ్తాడా లేదా అనే విషయాన్ని అంచనా వేస్తారు. అంతేకాకుండా విద్యార్థి ఇచ్చే సమాధానాల్లో నిజాయితీని కూడా చూస్తారు. ఒక్కోదేశంలో ఒక్కో తీరు ► విదేశీ విద్యకు సంబంధించి వీసా ఇంటర్వ్యూ విధానం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. ► అమెరికాలో విద్యను అభ్యసించాలంటే.. ఎఫ్–1 వీసా పొందాల్సి ఉంటుంది. దీని కోసం వీసా ఇంటర్వ్యూకు హాజరవడం తప్పనిసరి. ► యూకే బోర్డర్ ఏజెన్సీ సైతం వీసా ఇంటర్వ్యూని తిరిగి ప్రవేశపెట్టింది. ఒకసారి వీసా తిరస్కారానికి గురైన లేదా ప్రామాణిక టెస్టుల్లో తక్కువ స్కోర్లు పొందిన అభ్యర్థులను వీసా ఇంటర్వ్యూకి పిలిచే అవకాశాలు ఎక్కువ. ► స్టడీ అబ్రాడ్ పరంగా మరో ముఖ్యమైన దేశం కెనడాకు సంబంధించి అవసరం అనుకుంటేనే విద్యార్థులను వీసా ఇంటర్వ్యూకు పిలుస్తారు. కెనడాలో స్టూడెంట్ వీసా పొందాలంటే.. వైద్య పరీక్షలు తప్పనిసరి. ఆస్ట్రేలియా భిన్నంగా ఆస్ట్రేలియా.. దరఖాస్తు ఆధారంగా అభ్యర్థిని ఇంటర్వ్యూకి పిలవాలా.. వద్దా అనేది నిర్ణయిస్తోంది. దీనికి సంబంధించి కింది వాటిలో ఏదైనా ఒకటి జరగొచ్చు. ► వీసా ఇంటర్వ్యూయర్ అభ్యర్థిని టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేయడం. ► అభ్యర్థిని పిలిచి నేరుగా ఇంటర్వ్యూ చేయడం. ► మరింత సమాచారం కోరుతూ అభ్యర్థికి లెటర్ రాయడం. ► ఇంటర్వ్యూ నిర్వహించకుండానే అభ్యర్థికి తిరస్కరణ లేఖ పంపడం. ► ఇంటర్వ్యూ నిర్వహించకుండా వీసా మంజూరు చేయడం. అవసరమైన పత్రాలు వీసా ఇంటర్వ్యూలో ప్రధానంగా అప్లికేషన్ లేదా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ లెటర్ను అడుగుతారు. దీంతోపాటు ఇంటర్వ్యూయర్ కింది డాక్యుమెంట్లలో దేన్నైనా అడిగేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఆయా డాక్యుమెంట్లను సిద్ధంగా తమ వద్ద ఉంచుకోవడం మంచిది. అవి.. పాస్పోర్ట్, ఫీజు రిసీట్, 10–12 తరగతులు, బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్స్, మార్కుల మెమోలు, జీఆర్ఈ/జీమ్యాట్/శాట్ స్కోర్కార్డ్స్, వర్క్ ఎక్స్పీరియెన్స్ సర్టిఫికెట్. ఫైనాన్షియల్ ప్రొఫైల్ వీసా ఇంటర్వూ్వ ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యమైంది.. విద్యార్థి ఫైనాన్షియల్ ప్రొఫైల్. అభ్యర్థి సదరు దేశంలో విద్యనభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక స్థోమతను కలిగి ఉన్నాడా.. లేదా? అనే నిర్ణయానికి వచ్చేందుకు పలు డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. అవి.. –లోన్ అప్రూవల్ లెటర్, సేవింగ్స్ బ్యాంక్ స్టేట్మెంట్ (3 నెలలు), ఫిక్స్డ్ డిపాజిట్ సర్టిఫికెట్స్(3 సంవత్సరాలు). ఇలా చేస్తే మేలు ► వీసా ఇంటర్వ్యూను ఇంగ్లిష్లో మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు ఇంగ్లిష్పై పట్టు సాధించాలి. ఇంటర్వ్యూయర్ అడిగే ప్రశ్నలను అర్థం చేసుకొని.. సమాధానాలను చక్కటి ఇంగ్లిష్లో చెప్పగలిగేలా ఉండాలి. ► చేరేబోయే ప్రోగ్రామ్ గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఆ కోర్సును సదరు దేశంలోనే ఎందుకు చదవాలనుకుంటున్నారో చెప్పి ఒప్పించగలగాలి. కోర్సు పూర్తయ్యాక స్వదేశంలో లభించే ఉద్యోగ అవకాశాలను వివరించేలా సిద్ధంకావాలి. ► ఇంటర్వ్యూయర్ వద్దకు వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి. తక్కువ సమయంలో ఇంటర్వ్యూని ముగించాలని భావిస్తుంటారు. కాబట్టి సమాధానాలను సూటిగా చెప్పడం ద్వారా ఇంటర్వ్యూయర్ మనుసు గెలవొచ్చు. అడిగే ప్రశ్నలు ► వీసా ఇంటర్వ్యూయర్ పలు ప్రశ్నలను అడిగేందుకు ఆస్కారం ఎక్కువ. అవి... ► విదేశీ విద్య కోసం ఈ దేశాన్ని ఎందుకు ఎంచుకున్నారు ► భారత్లో ఎందుకు చదవాలనుకోవడం లేదు ► ఎందుకు నిర్దిష్ట ప్రోగ్రామ్ పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు ► మీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అక్కడే(సదరు దేశం) ఉద్యోగం అవకాశం దక్కితే ఏం చేస్తారు ► ఒకవేళ వ్యక్తిగత ఆర్థిక స్థోమత విద్యాభ్యాసానికి సహకరించని పరిస్థితుల్లో మీ వద్ద ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉన్నాయి? డూస్.. డోంట్స్ ► చక్కటి వస్త్రధారణతోపాటు సంభాషణ, ప్రవర్తనపై దృష్టిపెట్టాలి. ► ప్రశ్నలను ఆసాంతం విని..తర్వాత సమాధానానికి ఉపక్రమించాలి. ► ఆత్మవిశ్వాసం ప్రదర్శించాలి. ఇంటర్వ్యూయర్తో వాదించడం సరికాదు. ► సదరు దేశం, విద్యనభ్యసించబోతున్న విశ్వవిద్యాలయం గురించి తెలుసుకోవాలి. ► అవసరమైన డాక్యుమెంట్లను వెంట సిద్ధంగా ఉంచుకోవాలి. -
ఫారెన్ ఎడ్యుకేషన్.. చలోచలో
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా పూర్తిస్థాయిలో తగ్గనప్పటికీ రెండేళ్ల కిందటితో పోలిస్తే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం తెలంగాణ విద్యార్థులు ఈ ఏడాది మరింత ఆసక్తి చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫారెన్లో చదువుకోవాలనుకుంటున్న వారిలో ఏకంగా 90 శాతం మంది అమెరికా, బ్రిటన్, కెనడాలనే తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నట్లు తేలింది. ముంబై కేంద్రంగా విదేశీ విద్యాసంస్థల కన్సల్టెంటుగా పనిచేసే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ‘యోకెట్’ 30 వేల మంది తెలంగాణ విద్యార్థులపై నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పెరిగిన ఆర్థిక చేయూతతో విదేశాలవైపు... ఒకప్పుడు విదేశీ విద్య అంటే కేవలం ఉన్నత వర్గాలకే పరిమితం. కానీ ప్రస్తుతం విద్యా రుణాలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి రావడంతో విదేశీ విద్య అనేది పేద విద్యార్థులకు సైతం అందుబాటులోకి వచ్చింది. అందుకే నేటి కాలం విద్యార్థుల్లో చాలా మంది విదేశీ విద్యపై మక్కువ పెంచుకుంటున్నారు. తెలంగాణలో బీటెక్, ఎంబీబీఎస్ ఇతర గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థుల్లో అధిక శాతం మంది ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా, బ్రిటన్, కెనడాలకే ప్రాధాన్యమిస్తున్నారని తాజా సర్వే వెల్లడించింది. ఆ తరువాత స్థానంలో ఆస్ట్రేలియాతోపాటు ఐరోపా దేశాలైన జర్మనీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్స్ను ఎంచుకుంటున్నారని సర్వే వివరించింది. ఏటేటా పెరుగుతున్న సంఖ్య... విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతుండటాన్ని ‘యోకెట్’ తన సర్వేలో ప్రత్యేకంగా గుర్తించింది. 2019లో 8,000 మంది విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లినట్లు సర్వే సంస్థ తెలిపింది. అయితే 2020లో కరోనా లాక్డౌన్ కారణంగా విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో చాలా మంది తమ చదువులను ఈ ఏడాదికి వాయిదా వేసుకున్నారని, అయినప్పటికీ 2019తో పోలిస్తే గతేడాది రాష్ట్రం నుంచి ఏకంగా 17 శాతం మంది విద్యార్థులు అధికంగా విదేశాలకు వెళ్లారని తెలిపింది. అలాగే 2019 గణాంకాలతో పోల్చినపుడు ఈ ఏడాది విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న తెలంగాణ విద్యార్థుల సంఖ్య 62 శాతానికి చేరుకుందని సర్వే వెల్లడించింది. అందరికీ కంప్యూటర్ సైన్సే కావాలి.. తెలంగాణ విద్యార్థులు మాస్టర్స్ చేసేందుకు అక్కడ ఎంచుకుంటున్న కోర్సులపైనా సర్వే సంస్థ విద్యార్థుల నుంచి వివరాలు సేకరించింది. విదేశాలకు వెళ్తున్న వారిలో 50 శాతం మంది కంప్యూటర్ సైన్స్ ఎంచుకంటున్నారని తేలింది. అలాగే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (ఎంఐఎస్) కోర్సులో చేరేందుకు తెలంగాణ విద్యార్థులు ఎక్కువ మొగ్గుతున్నట్లు సర్వే వివరించింది. ఇక ఆ తరువాత స్థానంలో ఐటీతోపాటు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోస్పేస్, కెమికల్ ఇంజనీరింగ్ వంటి కోర్సులు ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. 55 శాతం రుణాల ద్వారానే.. ఈ సర్వేలో ‘యోకెట్’ గమనించిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. తెలంగాణ నుంచి విదేశాలకు మాస్టర్స్ చేసేందుకు వెళ్తున్న విద్యార్థుల్లో 55 శాతం మందికి అంత ఆర్థిక స్తోమత లేదు. అయినా వారు బ్యాంకు రుణాలపై ఆధారపడి విదేశాలకు వెళ్తున్నారు. అలాగే 30 శాతం మంది పూర్తిగా సొంత నిధులను సమకూర్చుకొని వెళ్తుండగా 15 శాతం మంది విద్యార్థులు స్కాలర్షిప్లపై ఆధారపడి విదేశాలకు వెళ్తున్నారు. తెలంగాణ నుంచి ఎక్కువగా వెళ్తున్నారు కరోనా విపత్తు కారణంగా పలు దేశాలకు విధించిన ఆంక్షలు గతేడాది విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకున్న చాలా మంది విద్యార్థులను నిరాశకు గురిచేశాయి. కానీ 2021లో ఇండియా నుంచి విదేశాలకు వెళ్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల్లో ముఖ్యంగా తెలంగాణ నుంచి గణనీయ వృద్ధి కనిపిస్తోంది. 2020లో కరోనా కారణంగా వెళ్లలేకపోయిన వారంతా వారి ప్రయాణాన్ని 2021–22కు మార్చుకుంటున్నారు. - తుముల్ బుచ్, యోకెట్ సహ వ్యవస్థాపకుడు -
దళితుల కోసం ప్రత్యేక వర్సిటీ
సాక్షి, హైదరాబాద్: దళితుల కోసం ప్రత్యేకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచన ముఖ్యమంత్రికి ఉందని, త్వరలో అది ఏర్పాటయ్యే అవకాశముందని ఎస్సీ అభివృద్ధి, సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కూడా దీన్ని ఏర్పాటు చేయాలని సీఎంను కోరారని సభ దృష్టికి తెచ్చారు. పద్దులపై చర్చలో భాగంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ విషయాలపై పలువురు సభ్యుల సందేహాలను నివృత్తి చేస్తూ కొప్పుల వివరాలు వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లో ఉండేందుకు గతంలో ఇష్టపడేవారు కాదని, కానీ ప్రస్తుతం వాటిలో సీట్ల కోసం పెద్దపోటీ నెలకొందన్నారు. కల్యాణలక్ష్మి, ఉపాధి రుణాలతో ఆయా కుటుం బాలకు ఆసరాగా ఉంటుండగా, వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందించి ప్రపంచంలో ఎక్కడైనా పోటీని తట్టుకునేలా నిలిచేందుకు దోహదం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లో నాణ్యమైన, ఉన్నత విద్యను పొందేందుకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. -
ఫేస్బుక్ మోసం: పరీక్షలు లేకుండా విదేశాల్లో విద్య
సాక్షి, హైదరాబాద్ : ఎలాంటి పరీక్షలు లేకుండా విదేశాల్లో విద్యనభ్యసించడానికి అవసరమైన వీసా, అడ్మిషన్లు ఇప్పిస్తానంటూ ఫేస్బుక్ ద్వారా ఎర వేసిన సైబర్ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.6.7 లక్షలు కాజేశారు. ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో రూ.5 లక్షలు, నిర్ధిష్ట సమయం కంటే ముందే పంపించేస్తానంటూ మరో రూ.1.7 లక్షలు కాజేశారు. ఈ బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అమీర్పేటకు చెందిన ఓ యువకుడు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని భావించాడు. దీనికోసం ఇంటర్నెట్తో పాటు సోషల్మీడియాలోనూ సెర్చ్ చేశాడు. ఫేస్బుక్ ద్వారా ఈ యువకుడికి పరిచయమైన సైబర్ నేరగాడు తాను విదేశాల్లో ఉంటున్నట్లు నమ్మించాడు. మెసెంజర్, వాట్సాప్ల ద్వారా సంప్రదింపులు జరుపుతూ తాను ఒక కన్సల్టెంట్ అని, ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం (ఐఈఎల్టీఎస్) పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా లండన్లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విధ్య అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తానంటూ నమ్మబలికాడు. తొలుత ప్రాసెసింగ్ ఫీజుగా రూ.50 వేలు చెల్లించమని చెప్పాడు. ఆపై రకరాల రుసుముల పేర్లు చెప్పి మొత్తం రూ.5 లక్షల తన బ్యాంక్ ఖాతాల్లో, వాలెట్స్లో డిపాజిట్ చేయించుకున్నాడు. ఇంత డబ్బు చెల్లించిన తర్వాత నగర యువకుడు ఎప్పుడు లండన్ పంపుతావంటూ సైబర్ నేరగాడిని పదేపదే ప్రశ్నించాడు. దీంతో వీసా, అడ్మిషన్ వ్యవహారాలు ప్రాసెసింగ్లో ఉన్నాయని, నిర్దేశిత సమయం కంటే తొందరగా వెళ్లాలని భావిస్తున్నారా? అని ప్రశ్నించాడు. దీనికి ఔనంటూ యువకుడు సమాధానం చెప్పాడు. స్పీడ్ ప్రాసెసింగ్ కోసం మరో రూ.1.7 లక్షలు చెల్లించాలంటూ చెప్పి ఆ మొత్తాన్నీ డిపాజిట్ చేయించుకున్నాడు. ఆపై నగర యువకుడు ఎంతగా ప్రయత్నించినా ఆ సైబర్ నేరగాడు అందుబాటులోకి రాలేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ–యాడ్స్ యాప్ ఓఎల్ఎక్స్లో సెకండ్ హ్యాండ్ కారు విక్రయిస్తానంటూ ఉన్న ప్రకటన చూసిన నగరవాసి స్పందించాడు. అందులో ఉన్న నెంబర్లో సంప్రదించగా ఆర్మీ ఉద్యోగిగా అవతలి వ్యక్తి చెప్పాడు. బేరసారాల తర్వాత కారును రూ.1,75,218కి విక్రయించడానికి ఒప్పందం కుదిరింది. ఈ మొత్తం డిపాజిట్ చేయించుకున్న సైబర్ నేరగాళ్లు బాధితుడిని మోసం చేశారు. చిక్కడపల్లికి చెందిన మరో వ్యక్తి కూడా రూ.1.3 లక్షలకు కారు బేరమాడి, రూ.61 వేలు చెల్లించి మోసపోయాడు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్ పే ద్వారా చేసిన బదిలీ అవతలి వ్యక్తికి చేరలేదు. దీంతో ఆ సంస్థ కస్టమర్ కేర్ను సంప్రదించాలని భావించాడు. దీనికోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన అతగాడు ఓ నెంబర్ తీసుకుని కాల్ చేశాడు. అవతలి వ్యక్తులు చెప్పినట్లే తన బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు వివరాలు, పిన్ నెంబర్ అందించాడు. వీటి ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఈయన ఖాతా నుంచి రూ.92,794 కాజేశారు. తన ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతా నుంచి రూ.56 వేలు పోయాయంటూ దత్తాత్రేయనగర్కు చెందిన ఓ వైద్యుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. అలానే బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి తన పేరుతో ఫేస్బుక్లో నకిలీ ఖాతా తెరిచిన సైబర్ నేరగాళ్లు స్నేహితుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతాలపై కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ప్రేయసికి అరుదైన కానుక.. ఇద్దరూ అరెస్టు తల్లి పక్కలో ఉండగానే అడవి జంతువుల దాడి! -
అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?
సాక్షి, అమరావతి: అమెరికాలో ఉన్నత విద్య అంటే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో క్రేజ్. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా మనవాళ్లు వెనుకాడటం లేదు. 2019-20లో అమెరికాలో ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు ఏకంగా 7.60 బిలియన్ డాలర్లు వెచ్చించడం విశేషం. ఆ దేశంలో అత్యధికంగా చదువుతున్న విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో గత ఐదేళ్లతో పోలిస్తే 2019-20లో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు 4.40 శాతం తగ్గారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావంతో 2020-21కి ముందస్తు దరఖాస్తులు దాదాపు 40 శాతం తగ్గిపోయాయి. ఈ మేరకు అమెరికా స్టేట్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ తాజాగా విడుదల చేసిన నివేదిక అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించింది. 27 టాప్ యూనివర్సిటీల వైపే భారతీయుల మొగ్గు ► అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో 1,93,124 మంది భారతీయ విద్యార్థులే. సంఖ్యాపరంగా విదేశీ విద్యార్థుల్లో చైనీయులు మొదటి స్థానం (3.72 లక్షల మంది)లో ఉన్నారు. ► భారతీయ విద్యార్థులు ఎక్కువగా ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మెడిసిన్, మ్యాథ్స్ కోర్సుల్లో ఎంఎస్, పీహెచ్డీ చేస్తున్నారు. ► అమెరికాలో మొత్తం 74 యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్థులు ఉన్నారు. వీరిలో 50 శాతం మంది 27 టాప్ యూనివర్సిటీల్లోనే చేరారు. ► కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయిస్, పెన్సిల్వేనియా, ఫ్లోరిడా, ఓహియో, మిచిగాన్, ఇండియానా రాష్ట్రాల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. ► మన దేశీయులు అత్యధికంగా చేరుతున్నవాటిలో న్యూయార్క్ యూనివర్సిటీ, నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ (బోస్టన్), యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ► ఇల్లినాయిస్, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (లాస్ఏంజెల్స్), యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (శాండియాగో), పర్డు్య యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీలు ఉన్నాయి. ► 2019-20లో అమెరికాలో మొత్తం 10.75 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యాభాస్యం చేశారు. ఆ దేశంలో మొత్తం విద్యార్థుల్లో విదేశీ విద్యార్థుల వాటా 5.50 శాతం. వీరు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు 44 బిలియన్ డాలర్లు సమకూర్చారు. గత నాలుగేళ్లలో యూఎస్లో భారతీయ విద్యార్థులు ఇలా.. విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య 2018-19 1,96,271 2017-18 1,86,924 2016-17 1,86,000 2015-16 1,65,918 -
విదేశీ విద్యపై తగ్గని మోజు!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలోనూ విదేశీ విద్యపై విద్యార్థుల ఆసక్తి తగ్గట్లేదు. అమెరికా వంటి దేశాల్లో కరోనా విజృంభిస్తున్నా చదువుకునేందుకు విదేశాలకు వెళ్లే ప్రణాళికలు వేసుకుంటున్నారు. అనేక దేశాల్లో కరోనా కారణంగా పరిస్థితులు ఇబ్బందికరంగా మారినా.. వచ్చే 6 నెలల నుంచి 10 నెలల్లోగా విదేశాలకు వెళ్లేందుకు మన విద్యార్థులు సిద్ధం అవుతున్నట్లు లీవరేజ్ ఎడ్యు సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సహకారం అందించే ఈ సంస్థ ప్రస్తుత కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆసక్తిపై సర్వే నిర్వహించింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్కు చెందిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విభాగం కూడా అదే అంశాన్ని వెల్లడించింది. వచ్చే 6 నుంచి 10 నెలల్లో విదేశాల్లో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వస్తాయన్న అంచనాతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. ఏటా దేశవ్యాప్తంగా 30 లక్షల మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్నారు. దీంతో వచ్చే 10 నెలల కాలంలో విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లాలనుకునే విద్యార్థులతో మాట్లాడి నివేదిక రూపొందించింది. లీవరేజ్ సర్వేలో తేలిన అంశాలివే.. – దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న విద్యార్థుల్లో 76 శాతం మంది విద్యార్థులు రాబోయే 6 నుంచి 10 నెలల్లో విదేశాల్లో తమ విద్యను కొనసాగించాలని భావిస్తున్నట్లు తేలింది. – ఈ వేసవి ముగిసే నాటికి తాము విదేశాల్లో చదువుకునే అంశంపై నిర్ణయం తీసుకుంటామని 16 శాతం విద్యార్థులు పేర్కొన్నారు. – 8 శాతం మంది విద్యార్థులు మాత్రం కరోనా వ్యాప్తి కారణంగా విదేశాల్లో చదువుకునే అంశాలపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. తర్వాత ఆలోచిస్తామని చెప్పారు. – సెప్టెంబర్ నుంచి జనవరి నాటికి అంతర్జాతీయ యూనివర్సిటీలు చేపట్టే చర్యల ఆధారంగా, అక్కడి పరిస్థితులను బట్టి తమ నిర్ణయాల్లో మార్పులు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తామని 25 శాతం మంది చెప్పినట్లు వెల్లడించింది. – 70 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు అంతర్జాతీయంగా అరోగ్య సంరక్షణ వ్యవస్థపై నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఆరోగ్య సంరక్షణకు కెనడా, బ్రిటన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తాయని, ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, భారత్, జర్మనీ, స్వీడన్, ఫిన్లాండ్ ఉన్నట్లు పేర్కొన్నారు. – సర్వేలో పాల్గొన్న విద్యార్థుల్లో 76 శాతం మంది పీజీ కోసం విదేశాలకు వెళ్తామని చెప్పగా, మిగతా 34 శాతం మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదివేందుకు వెళతావుని చెప్పారు. – విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది బ్రిటన్ వెళ్తామని చెప్పుకొచ్చారు. బ్రిటన్లో చదువుకుంటామని 28 శాతం మంది చెప్పగా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్లో చదువుకుంటామని 20 శాతం మంది విద్యార్థులు పేర్కొన్నారు. కెనడాలో చదువుకునేందుకు 15 శాతం మంది, అమెరికాలో చదువుకునేందుకు 18 శాతం మంది ఆసక్తి కనబరిచారు. ప్రణాళికలు మార్చుకోవట్లేదు.. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఎక్కువ మంది కరోనా కారణంగా తమ ప్రణాళికలు మార్చుకోవట్లేదని టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్కు చెందిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విభాగం పేర్కొంది. రానున్న 6 నెలల్లో విదేశాలకు వెళ్లాలనుకునే వారిలో 73 శాతం మంది నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్లు తెలిపింది. ప్రణాళికలను మార్చుకున్న 27 శాతం మందిలో సగం మాత్రం తమ ప్రణాళికలను వచ్చే ఏడాదికి లేదా ఆపై సంవత్సరానికి వాయిదా వేసుకున్నట్లు తెలిపారని వెల్లడించింది. మిగతా సగం మంది ఆన్లైన్ ప్రోగ్రామ్స్పై ఆసక్తి కనబర్చినట్లు తేలింది. ఇటీవల వస్తున్న సర్వేల్లో మాత్రం దేశంలోనే చదువుకోవాలనుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొంది. గతవారం నిర్వహించిన సర్వేలో 31 శాతం మంది తమ ప్రణాళికలు మార్చుకున్నట్లు వెల్లడించింది. చదవండి: కర్ఫ్యూ వేళలు పొడిగిద్దామా! ప్రభావం ఎక్కువే ఉంటుంది.. విదేశాలకు వెళ్లే విద్యార్థులపై కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంటుందని, అది దేశీయ విద్యకు ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే 70 శాతం విద్యార్థులపై ఆ ప్రభావం ఉందని ఢిల్లీలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ ఫైనాన్స్ ఫౌండర్, డైరెక్టర్ జితిన్ చాడా ఇటీవల పేర్కొన్నారు. అమెరికా, ఐరోపాకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఇప్పటికే తమ ప్రయత్నాలు విరమించుకున్నారని వెల్లడించారు. విదేశీ విద్యపై కరోనా ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అన్షు చోప్రా పేర్కొన్నారు. స్థానికంగానే తమ పిల్లలను చదివించుకునేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు కరోనా కారణంగా భారత విద్యా రంగం మెరుగుపడుతుందని, విదేశాలకు వెళ్లకుండా ఇక్కడ చదువుకోవాలనుకునే వారి సంఖ్య పెరుగుతుందని ఫరీదాబాద్లోని మానవ్ రచ్నా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టడీస్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) ప్రొఫెసర్ డాక్టర్ సుభాజిత్ ఘోష్ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయి దేశంలోనే చదువుకునే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొన్నారు. -
విదేశీ విద్య.. ఇలా సాధ్యమే!
విదేశాల్లో చదవటమంటే చాలా మందికి ఒక కల. ఒకప్పుడిది చాలా ధనవంతులు, ఎంతో ప్రతిభ కలిగిన వారికే సాధ్యమయ్యేది కూడా. కానీ, ఇపుడు విదేశీ విద్యావకాశాలు విస్త ృతమై... చాలామందికి అందుబాటులోకి వచ్చాయి. దేశంలో పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలున్నా.. వాటిలో ప్రవేశానికి కటాఫ్ 99 శాతం. దీన్నే రీచ్ఐవీ సీఈఓ విభా కాగ్జి మాటల్లో చెప్పాలంటే... దేశంలో ఆమోదనీయ స్థాయిలో ఉన్న నాణ్యమైన విద్య 2 శాతంలోపే!!. మరి మిగిలిన 98 శాతం మంది మాటేంటి? అందుకే ఇపుడు తల్లిదండ్రులు కూడా సాధ్యమైనంత వరకూ తమ పిల్లలకు నాణ్యమైన విద్య చెప్పించాలంటే అది విదేశాల్లోనే సాధ్యమనే భావనతో ఉంటున్నారు. కాకపోతే ఈ ఖరీదైన విదేశీ విద్యను అందుకోవడం ఆర్థి కంగా అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ అందుకోవాలంటే అందుకు ప్రణాళిక అవసరమంటున్నారు నిపుణులు. వారు చెప్పిన వివరాల సమాహారమే ఈ కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం విదేశాల్లో కోర్సు పూర్తి చేయడమన్నది ఖరీదైన వ్యవహారమే. ఐవీ లీగ్ కాలేజీల్లో ఏడాది ట్యూషన్ ఫీజు రూ.30– 35 లక్షల మధ్య ఉంది. దీనికి తోడు అదనపు వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వసతి, ఆహారం, కన్వేయన్స్, విద్యకు అవసరమైన వస్తువుల కొనుగోలు, హెల్త్ ఇన్సూరెన్స్, వినోద ఖర్చులు అదనం. వీటన్నిటికీ మరో రూ.10 లక్షల బడ్జెట్ వేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం ప్రభావం, రూపాయి విలువ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2018లో డాలర్తో రూపాయి మారకం విలువ 13 శాతం వరకు పడిపోయింది. మరి 2–4 ఏళ్ల కోర్సుల కాలంలో రూపాయి విలువలో వచ్చే వ్యత్యాసాల ఆధారంగా కోర్సు ఫీజులకు చేసే చెల్లింపులు పెరిగిపోవడం, లేదా తగ్గడం జరుగుతుంది. కాబట్టి పిల్లల్ని విదేశీ విద్య కోసం పంపించాలనుకునే వారు మూడేళ్ల కోర్సు కోసం రూ.50 లక్షల బడ్జెట్ వేసుకోవచ్చు. దీనికి 8 శాతం ద్రవ్యోల్బణ రేటును కూడా ముడిపెట్టాలి. అంటే... ఇప్పుడు రూ.50 లక్షల వ్యయమయితే, పదేళ్ల తర్వాత 8 శాతం ద్రవ్యోల్బణం ఆధారంగా కోర్సు ఫీజు రూ.1.07 కోట్లకు పెరిగిపోతుంది. ఇంత పెద్ద మొత్తాన్ని చూస్తే అసాధ్యమేనని అనిపించొచ్చు. కానీ, క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తూ వెళితే సాధ్యమే. ముందుగానే ప్రారంభించాలి పిల్లల విద్యా వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ముందు నుంచే పొదుపు మొదలు పెట్టిన వారికి లక్ష్యం సులువవుతుంది. పిల్లలు నెలల వయసులో ఉన్నప్పటి నుంచే వారి విద్యావసరాలకు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలనేది ఫైనాన్షియల్ అడ్వైజర్లు చేసే సూచన. అందుకే. సిప్ విధానంలో ప్రతినెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళితే పిల్లలు ఉన్నత విద్యకు వచ్చే సరికి రూ.50 లక్షల నిధి సాకారం అవుతుంది. ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూ వెళతారు కనుక పెద్ద భారం కూడా అనిపించదు. దీర్ఘకాలం చేతిలో మిగిలి ఉంటే... అధిక రాబడుల కోసం ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. సరైన చోట పెట్టుబడి పైన చెప్పుకున్నట్టు ముందు నుంచే ఇన్వెస్ట్ చేస్తూ వెళితే అనుకున్నంత నిధి సమకూరుతుందనుకోవద్దు. మీ అవసరాలకు తగిన మొత్తం సమకూరేందుకు, ఇన్వెస్ట్ చేసే మొత్తం, దానిపై ఆశించే రాబడులు, కాంపౌండింగ్ ప్రయోజనంతో నిర్ణీత సమయానికి ఎంత సమకూరుతుందన్నది ఆధారపడి ఉంటుంది. ఇందుకు అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ సూచన తీసుకోవాలి. 5–10 ఏళ్లు, అంతకుమించి సమయం ఉంటే, ఈక్విటీ, ఈక్విటీ కలగలసిన సాధనాల్లో మెరుగైన రాబడులనే ఆశించొచ్చు. ‘‘దీర్ఘకాలం పాటు సమయం ఉంటే 65–70%పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవడం సురక్షితమే. మంచి ఫలితాల కోసం బ్యాలెన్స్డ్ ఫండ్ను ఎంచుకోవాలి. స్టాక్స్, బాండ్లలోనూ ఇవి ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీలకు వర్తించే పన్ను ప్రయోజనాలే వీటికీ అమలవుతాయి. ఇవి 65% వరకు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక లాభం ఏడాదిలో రూ.లక్ష దాటితే (అమ్ముకున్న సమయంలో) దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. లక్ష వరకూ పన్ను ఉండదు. ఆపై లాభంపై 10%పన్ను చెల్లించాల్సి ఉంటుంది’’ అని ఫిన్స్కాలర్జ్ వెల్త్ మేనేజర్స్ వ్యవస్థాపకురాలు రేణు తెలిపారు. ఆలస్యంగా మొదలు పెడితే... పిల్లలు పుట్టిన వెంటనే వారి విద్య కోసం పెట్టుబడి మొదలుపెట్టని వారు, ఈ అవసరాన్ని కొంత ఆలస్యంగా తెలుసుకుని పెట్టుబడి పెట్టాలనుకునే వారు... సిప్తోపాటు ఏక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం పరిష్కారం. లక్ష్యానికి దీర్ఘకాలం లేకపోతే వచ్చిన సమస్య ఏంటంటే రాబడులకు రిస్క్ తీసుకోలేని పరిస్థితి. షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్లో అంత ఆటుపోట్లు ఉండవు. రాబడులు బాండ్ ఈల్డ్స్కు స మానంగా ఉంటాయి. మూడేళ్లకు పైగా కొనసాగితే ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే తక్కువ పన్ను రేట్లు అమలవుతాయి. విద్యా రుణం తీసుకోవచ్చు... లక్ష్యానికి సరిపడా ఇన్వెస్ట్ చేయలేని వారు, ఇన్వెస్ట్ చేసినప్పటికీ నిర్ణీత సమయంలో అవసరమైనంత నిధి సమకూరని వారు, ఆలస్యంగా ఇన్వెస్ట్ చేయడం ఆరంభించిన వారు పిల్లల విదేశీ విద్యా వ్యయాలను గట్టెక్కేందుకు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం పరిష్కారం. దాదాపు అన్ని బ్యాంకులు విద్యా రుణాలను ఆఫర్ చేస్తున్నాయి. మంచి విద్యా సంస్థల్లో సీటు సంపాదిస్తే సులువుగానే రుణం పొందొచ్చు. పైగా, విద్యా రుణంపై ఆదాయ పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పన్ను చెల్లించే ఆదాయం ఉన్న వారికి ఇదో అదనపు ఆకర్షణ. సంప్రదాయ ఇన్వెస్టర్లయితే... పిల్లల ఉన్నత విద్య అనేది విస్మరించరాని అంశం. అలాగే, వాయిదా వేసేది కూడా కాదు. పెట్టుబడుల్లో రిస్క్ తీసుకోలేని వారు అయితే, పిల్లల ఉన్నత విద్యావసరాల కోసం మరింత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు రమ్య (25) నెదర్లాండ్స్లో మాస్టర్ ఆఫ్ సైన్స్కు వెళుతోంది. ఆమె చిన్నప్పటి నుంచే ఆమె తండ్రి ఇన్వెస్ట్ చేయడం ఆరంభించాడు. కానీ, సంప్రదాయ సాధనాల్లో చేయడంతో రాబడులు పెద్దగా లేవు. దీంతో కోర్సుకు కావాల్సినంత సమకూరలేదు. దీంతో రమ్య విద్యావసరాల కోసం ఆమె తండ్రి తన రిటైర్మెంట్ నిధిలోనూ కొంత ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొని మెరుగైన రాబడులను ఇవ్వలేవు. దీర్ఘకాలం కోసం పీపీఎఫ్, డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం కాస్తంత నయం. రికరింగ్ డిపాజిట్ కూడా కాస్త మెరుగైన ఆప్షనే. లక్ష్యానికి సమీపంలో... పిల్లల ఉన్నత విద్యకు మరో 2 ఏళ్లు ఉందనగా, ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు కొద్దికొద్దిగా వాటిని డెట్ ఫండ్స్లోకి మళ్లించుకోవాలి. ఎందుకంటే ఉన్నట్టుండి మార్కె ట్లు పడిపోతే పెట్టుబడుల విలువ అమాంతం కరిగిపోయే ప్రమా దం ఉంటుంది. కనుక పెట్టుబడులను రక్షించుకోవాలనుకుంటే ముందు నుంచే క్రమంగా వైదొలగడం అవసరం. విద్యా వ్యయం ఏ దేశంలో ఎంతెంత? యూఎస్ఏ ట్యూషన్ ఫీజు: ప్రైవేటు కాలేజీల్లో సుమారు రూ.25–30 లక్షలు. ప్రభుత్వ కాలేజీల్లో రూ.15–23 లక్షలు. నివాస వ్యయం: నెలకు రూ.75,000. పశ్చిమ తీరం కంటే తూర్పు తీరంలో తక్కువ. మొత్తం ఖర్చు: ఏటా దాదాపు రూ.34 లక్షలు. ఆస్ట్రేలియా ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు అయితే రూ.10–16 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్కు 12–18 లక్షలు. నివాస వ్యయం: నెలకు రూ.86,000. పట్టణాలను బట్టి ఇందులో మార్పు ఉంటుంది. సిడ్నీ, కాన్బెర్రా పట్టణాల మధ్యే నివాస వ్యయం నెలకు రూ.17,000 తేడా ఉంటుంది. మొత్తం వ్యయం: ఏడాదికి సుమారుగా రూ.25 లక్షలు. యూకే ట్యూషన్ ఫీజు: రూ.8–18 లక్షలు. నివాస వ్యయం: లండన్లో అయితే ప్రతి నెలా రూ.1.1 లక్ష వరకు. లండన్ బయట అయితే రూ.91,000. మొత్తం వ్యయం: ఏడాదికి సుమారుగా రూ.25 లక్షలు. కెనడా ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.10–15 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.8–20 లక్షలు. నివాస వ్యయం: వీసా అవసరాలను బట్టి ప్రతి నెలా రూ.57,000 వరకు మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.19.8 లక్షలు సింగపూర్ ట్యూషన్ ఫీజు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.5–13 లక్షలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుకు రూ.10–25 లక్షలు. నివాస వ్యయం: రూ.50,000 వరకు ప్రతి నెలా. మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.18 లక్షలు జర్మనీ ట్యూషన్ ఫీజు: పబ్లిక్ యూనివర్సిటీల్లో ఫీజు ఉండదు. కొన్ని నామమాత్రంగా ఏడాదికి రూ.40,000 వరకు చార్జ్ చేస్తున్నాయి. నివాస వ్యయం: మ్యూనిక్, బెర్లిన్ వంటి పెద్ద పట్టణాల్లో అయితే ప్రతి నెలా రూ.54,000. కాలేజీ డార్మెటరీల్లో ఉండేట్టు అయితే రూ.42,000 చాలు. ఫ్రీబర్గ్, హాన్నోవర్ వంటి చిన్న పట్టణాల్లో అయితే రూ.42,000 వరకు అవసరం అవుతుంది. మొత్తం వ్యయం: ఏటా దాదాపు రూ.5.4 లక్షలు. -
బ్రాహ్మణ పరిషత్ ప్రతిపాదనలకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రతిపాదించిన పలు పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విదేశీ విద్య పథకం కింద రూ. 5 లక్షలు అంతకంటే తక్కువ ఆదాయం కలిగిన బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ. 2 లక్షల లోపు ఆదాయం కలిగిన బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ విధానాల ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ చేయటానికి ఏర్పరచిన పథకాన్ని ఆమోదించింది. వేద పాఠశాలలకు రూ. 2 లక్షల గ్రాంట్ మంజూరు చేయడానికి అంగీకరించింది. 75 ఏళ్లు నిండిన వేద పండితులకు నెలకు రూ. 2,500 చొప్పున గౌరవ పారితోషికం ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. శాస్త్ర పారంగతులు వేద పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ. 250 చొప్పున స్టైఫండ్ ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. స్మార్ధం పూర్తి చేసిన వారికి రూ. 3 లక్షలు, వేద పాఠశాలల నుంచి బయటకు వచ్చే ముందు, క్రమాంతం, గణాంతం చదువుకున్న వారికి రూ. 5 లక్షల ప్రత్యేక గ్రాంట్ ఇవ్వడానికి ప్రభుత్వ ఆమోదం లభించింది. కుటీర పరిశ్రమ ఏర్పాటుకు సబ్సిడీ.. బ్రాహ్మణుల్లో రూ. 2 లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి చిన్న కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలన్నా లేదా వ్యాపారం చేసుకోవాలన్నా రూ. 1 లక్ష ప్రాజెక్టు అయితే 80 శాతం సబ్సిడీ, రూ. 12 లక్షల లోపు ప్రాజెక్టు అయితే రూ. 5 లక్షలు మించకుండా 60 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇంతకు ముందు మంజూరైన వాటిలో ఈ నియమం పాటించిన వారికి వర్తింపజేయాలని ప్రభుత్వం సూచించింది. విదేశీ విద్య పథకం, బ్రాహ్మణ ఉపాధి పథకాల కింద దరఖాస్తు చేయదలచిన వారు అక్టోబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ జనరల్ బాడీ సమావేశం ఈ నెల 20న జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో 2018–19 ఏడాదికి సంబంధించిన కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు సమాచారం. -
విదేశీ విద్యతో బంగారు భవిత
నేటి యువతరం విదేశీ విద్యపై క్రేజ్ పెంచుకుంది. ప్రపంచంలోనే మేటి యూనివర్సిటీలు విదేశాల్లో ఉండడం, పైగా పరిశోధనాత్మక విద్యాబోధన అందిస్తుండడం విద్యార్థులనుఆకర్షిస్తోంది. చదువుకుంటూనే సంపాదించే వెసులుబాటు ఆయా యూనివర్సిటీలుకల్పిస్తుండడంతో విద్యార్థులు విదేశీ విద్యపై మోజు పెంచుకుంటున్నారు. అయితే ఏయే కోర్సులకు ఏయే దేశాల్లోని యూనివర్సిటీలను ఎంచుకోవాలి, నకిలీ యూనివర్సిటీల బారినపడకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఆయా యూనివర్సిటీల్లో ప్రవేశానికి ఏయే అర్హత పరీక్షలు రాయాలి, అవి ఎప్పుడు నిర్వహిస్తారు వంటి వివరాలను నిపుణులు వివరిస్తున్నారు. తిరుపతి: అమెరికాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అనే సంస్థ విడుదల చేసిన ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం 1998–99లో అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కేవలం 707 మంది మాత్రమే. తాజాగా 2017–18 విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య 1.86 లక్షలకు చేరుకుంది. వీరందరూ స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్) కోర్సుల్లో విద్యనభ్యసించేవారు మాత్రమే. యూఎస్ఏ కా కుండా 2017లో ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్లిన వారు దాదాపు లక్ష మంది, ఆస్ట్రేలి యాకు 65,471మంది, జర్మనీకి 15,529 మంది వెళ్లారు. జిల్లా నుంచి గత విద్యా సంవత్సరంలో దాదాపు 600 మందికిపైగా విద్యార్థులు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ తెలిపిన వివరాల మేరకు 2017–18లో బీసీ కార్పొరేషన్ నుంచి 15మంది, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఆరుగురు, కాపు కార్పొరేషన్ నుంచి 9మంది, మొత్తం 30మంది విదేశాలకు వెళ్లారు. వీరందరికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల స్కాలర్షిప్ను ప్రభుత్వం అందిస్తోంది. మరో రూ.10 లక్షలు విద్యా రుణం కింద బ్యాంకులు మంజూరు చేశాయి. ఇంటర్ తరువాత విదేశాల్లో బీటెక్ సాట్(స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్–పేపర్ బేస్డ్): ఇంటర్ తరువాత అమెరికాలోని పేరుగాంచిన యూనివర్సిటీల్లో బీటెక్ చేయడానికి సాట్(స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్–పేపర్ బేస్డ్) అర్హత పరీక్షను రాయాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివేటప్పుడే (ఏడాది ముందే) సాట్లో మంచి స్కోర్తో ఉత్తీర్ణత సాధిస్తే వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందవచ్చు. క్రిటికల్ రీడింగ్, రైటింగ్ అండ్ మ్యాథ్స్, ఇంగ్లీష్ వ్యాసంలో పరీక్ష నిర్వహిస్తారు. సాట్లో అర్హత పొందిన వారికి ఐదేళ్లు చెల్లుబాటు ఉంటుంది. ప్రతి ఏడాది డిసెంబర్, మార్చ్, మే, జూన్లో పరీక్షలు ఉంటాయి. సాట్ స్కోర్ను అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్(యూకె), సింగపూర్, కెనడా దేశాలు పరిగణనలోకి తీసుకుంటాయి. సాట్కు సంబంధించిన అధికార వెబ్సైట్ ఠీఠీఠీ.ఛిౌ ్ఛజ్ఛ b్చౌటఛీ.ౌటజలో మరింత సమాచారం పొందవచ్చు. ఏసీటీ(పేపర్–బేస్డ్):అమెరికాలోని యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి అం దుబాటులో ఉన్న మరో మార్గం అమెరికన్ కా లేజ్ టెస్టింగ్(ఏసీటీ). ఏసీటీలో సాధించిన స్కోరు ఐదేళ్లపాటు చెల్లుతుంది. ఇంగ్లీష్, మ్యా థ్స్, సైన్స్, రీడింగ్ అంశాల్లో ప్రశ్నలుంటాయి. అలాగే యాక్ట్ ప్లస్ పరీక్షలో ఆప్షనల్గా 30నిమిషాల పాటు హైస్కూల్ స్థాయి ఇంగ్లీష్ రచనా నైపుణ్యాన్ని పరీక్షించే రాత పరీక్ష ఉంటుంది. ప్రతి ఏడాది ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్లో ఐదుమార్లు పరీక్ష నిర్వహిస్తారు. అధికారిక వెబ్సైట్ ఠీఠీఠీ.్చఛ్టి.ౌటజలో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇతర అర్హత పరీక్షలు ఇంటర్ తరువాత విదేశాల్లో బీటెక్ చేయడానికి సాట్, ఏసీటీతో పాటు ఇతర అర్హత పరీక్షలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం(ఐఈఎల్టీఎస్), టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్(టోఫెల్/టీఓఈఎఫ్ఎల్), పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్(పీటీఈ). టాప్ 10 అమెరికన్ యూనివర్సిటీలు లండన్లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పత్రిక టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచంలోని టాప్ 10 విశ్వవిద్యాలయాలు అమెరికా నుంచే వస్తున్నాయి. 2018లోనూ మొదటి స్థానాన్ని మసాచుసెట్స్(ఎంఐటీ), ద్వితీ య స్థానం హార్వర్డ్, మూడో స్థానంలో స్టాన్ఫోర్డ్ వంటి యూనివర్సిటీలున్నాయి. విద్యలో నాణ్య మైన రీసెర్చ్, విభిన్న దేశాల సంస్కృతుల సమ్మేళనం, లెర్నింగ్ బై డూయింగ్(చదువుతూనే సంపాదించడం), సుస్థిరమైన ప్లేస్ మెంట్స్తోపాటు గ్లోబల్ సిటిజన్గా ఎది గేందుకు ఇక్కడ ఆస్కారం ఉంది. విదేశాల్లో ఎంబీఏ అమెరికాతో పాటు ఇతర దేశాల్లో ఎంబీఏ చెయ్యడానికి జీమాట్(గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్) పరీక్ష రాయాలి. ప్రముఖ యూనివర్సిటీలు జీమాట్ స్కోర్ నే అర్హతగా పరిగణిస్తాయి. అమెరికాలో ఎంబీఏ అడ్మిషన్కు పని అనుభవం తోడైతే మంచి యూనివర్సిటీల్లో అడ్మిషన్ లభిస్తుంది. జీమాట్ స్కోర్ ఐదేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. అధికారిక వెబ్సైట్ ఠీఠీఠీ.జఝ్చఛి.ఛిౌఝ. ఇతర అర్హత పరీక్షలు విదేశాల్లో ఎంబీఏ చేయడానికి జీమాట్తో పాటు ఇతర అర్హత పరీక్షలు ఉన్నాయి. ఇంగ్లండ్(యూకే)లో ఎంబీఏ చేయడానికి టోఫెల్/ఐఈఎల్టీఎస్, ఆస్ట్రేలియాకు ఐఈఎల్టీఎస్/టోఫెల్/పీటీ ఈ, కెనడాలో ఐఈఎల్టీఎస్/జీఆర్ఈ, న్యూజి లాండ్లో ఐఈఎల్టీఎస్ అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. డిగ్రీ తర్వాత విదేశాలకు... బీటెక్ తరువాత అమెరికాలో మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎంఎస్) చేయడానికి జీఆర్ఈ(గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్స్)తో పాటు ఐటీఎల్టీఎస్/టోఫెల్లో ఏదో ఒక పరీక్ష తప్పనిసరిగా రాయాలి. ఈ పరీక్షలు ఏడాది పొడవునా నిర్వహిస్తూ ఉంటారు. మొత్తం 340 మార్కులకు 300 పైగా స్కోర్ సా ధించిన వారికి అమెరికాలో మంచి యూ నివర్సిటీల్లో అడ్మిషన్ లభిస్తుంది. ఆరు నెలల ముందే విద్యార్థులు ఆయా పరీక్షల్లో సాధించిన స్కోర్స్ ను తమ వద్ద ఉంచుకుని యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవాలి. జీఆర్ఈలో సాధించిన స్కోరు ఐదేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. జీఆర్ఈ స్కోరు ఆధారంగా 130కిపైగా దేశాల్లోని దాదాపు 3,200 విద్యాసంస్థల్లో ప్రవేశం పొందవ చ్చు. అమెరికా కాకుండా ఆస్ట్రేలియా, కెన డా, జర్మనీ వంటి దేశాల్లో ఎంఎస్ చెయ్యడానికి ఐఈఎల్టీఎస్ పరీక్ష రాస్తే సరిపోతుంది. ఈ పరీక్షను ఏడాదిలో నాలుగు మార్లు నిర్వహిస్తారు. ఇందులో సాధించిన స్కోరును 140 దేశాల్లోని సుమారు 6 వేల విద్యాసంస్థలు అర్హతగా పరిగణిస్తున్నాయి. అలాగే టోఫెల్ అర్హత పరీక్షలో సాధించిన స్కోరు రెండేళ్ల పాటు చెల్లుబాటు ఉంటుం ది. అమెరికా, కెనడా, బ్రిటన్తోపాటు 130దేశాల్లోని దాదాపు 10వేల కళాశాలలు, యూనివర్సిటీలు ఈ స్కోరును అర్హతగా పరిగణిస్తాయి. ఈ పరీక్షను ఏడాది పొడవునా వివిధ తేదీల్లో 50రోజులకుపైగా నిర్వహిస్తారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఏయే దేశాల్లో ఏయే కోర్సుల ఎంపిక 1. అమెరికా: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, బయోలాజికల్ సైన్సెస్, ఎంబీఏ విద్యకు అమెరికా ప్రసిద్ధి. ఏటా రెండు మార్లు అడ్మిషన్(ఆగస్టు, జనవరి) నిర్వహిస్తారు. అమెరికాలో ఎంఎస్/ ఎంబీఏ చేయడానికి 16 ఏళ్ల డిగ్రీ అవసరం. ఇండియాలో బీటెక్ మినహా మిగిలినవన్నీ 15 ఏళ్ల డిగ్రీలు కావడంతో పైన తెలిపిన కోర్సులకు బీటెక్ విద్యార్థులు మాత్రమే అర్హులు. ఎంఎస్ తరువాత ఉద్యోగ అన్వేషణకు ఏడాది, ఆ తరువాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) కింద మరో ఏడాది అక్కడ ఉండొచ్చు. స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్) విద్యార్థులు అదనంగా 17 నెలలు అక్కడే ఉండొచ్చు. దీనికి అర్హత పరీక్ష జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్/టోఫెల్, ఎంబీఏకు జీమాట్. 2. ఆస్ట్రేలియా: ఇంజినీరింగ్లో కెమికల్, సివిల్, ఏరోస్పేస్ బ్రాంచ్లు ఇక్కడ ప్రసిద్ధి. మెల్బోర్న్, న్యూసౌత్వేల్స్, సిడ్నీ, మోనాన్, క్వీన్స్ల్యాండ్ యూనివర్సిటీలు ఇంజినీరింగ్ విద్యకు పేరుగాంచినవి. ఇక్కడ చదువుకుంటూనే పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి యూనివర్సిటీలు అనుమతిస్తున్నాయి. ఉద్యోగ అన్వేషణలో భాగంగా రెండేళ్ల పాటు విద్యార్థులు అక్కడ ఉండొచ్చు. ఐఈఎల్టీఎస్/పీటీఈ అర్హత పరీక్షలు. 3.జర్మనీ: తక్కువ ఖర్చుతో ఇంజినీరింగ్లో విదేశీ పట్టా పొందాలనుకునే వాళ్లకు జర్మనీ ఉత్తమం. ఈ దేశంలో పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీలు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ట్యాషన్ ఫీజులు తీసుకోకపోవ డం విశేషం. గ్రాడ్యుయేట్ కోర్సులకు మా త్రం తక్కువ మొత్తంలో ఫీజులు ఉంటాయి. మంచి ప్రతిభ ఉన్నవారికి 90శాతం స్కాలర్షిప్ అందించడంతో పాటు చదువు పూర్తైన వెంటనే ఉద్యోగావకాశాలను ఆ దేశం కల్పిస్తుంది. ఆటోమేటివ్ ఇంజినీరింగ్ చేరాలనుకునే వారు జర్మనీకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. హంబోల్డ్, మ్యూనిచ్, బెర్లిన్, ఆర్డబ్ల్యూటీహెచ్ ఆచన్, కిర్లోస్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ దేశంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు. అయితే అత్యధిక శాతం విద్యాబోధన జర్మన్ భాషలోనే ఉండడంతో జర్మన్ భాషా పరిజ్ఞానం తప్పనిసరి. 4.ఇంగ్లండ్(యూకే): మేనేజ్మెంట్(ఎంబీఏ), హ్యుమానిటీస్, ఇంజినీరింగ్ విద్యకు యూకే ప్రసిద్ధి. రెండేళ్ల మాస్టర్స్ డిగ్రీని ఒక్క ఏడాదిలోనే పూర్తి చేసే వెసులుబాటు ఈ దేశంలో ప్రత్యేకత. ప్రపంచ ప్రముఖ యూనివర్సిటీలైన ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఈ దేశంలోనే ఉన్నాయి. అయితే కోర్సు పూర్తైన తరువాత ప్లేస్మెంట్స్లో ఉద్యోగం రాకుంటే వెంటనే స్వదేశం తిరిగొచ్చేయాలి. పేద విద్యార్థులు రాణించొచ్చు ప్రతిభ ఉంటే పేద వారైనప్పటికీ విదేశాల్లో విద్యనభ్యసించొచ్చు. ప్రభుత్వం, ఆయా కార్పొరేషన్లతోపాటు విదేశాల్లోని పలు విశ్వవిద్యాలయాల్లోనూ స్కాలర్షిప్స్ పొందవచ్చు. మా సంస్థలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్, టోఫెల్, జీమ్యాట్కు శిక్షణ ఇస్తున్నాం. విదేశీ విద్యపై మరింత సమాచారం కావాలంటే 96981 23456 నంబరులో సంప్రదించవచ్చు. – ఎన్.శ్రీధర్, డైరెక్టర్, కెరీర్ లాంచర్, తిరుపతి -
అండగా విదేశీ విద్యా నిధి
కాజీపేట: చదువుకోవాలని తపన ఉండి .. మెరిట్ స్టూడెంట్ అయితే చాలు .. నిరుపేదలైన బీసీ విద్యార్థులకు అర్హతను బట్టి విదేశీ విద్యను అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తోంది. అందుకు విదేశీ విద్యా నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎంతో ప్రతిభ ఉన్నా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విదేశాల్లో చదువు అందని ద్రాక్షలాగే మారుతోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకానికి శ్రీకారం చుట్టింది. 2016–17 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తోంది. అక్టోబర్ 10న జీఓ నం 23 ద్వారా ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లా నుంచి 11 మంది విదేశీ విద్యా నిధి పథకానికి దరఖాస్తు చేసుకోగా ముగ్గురు ఎంపికయ్యారు. వారికి ప్రభుత్వం మొదటి విడతగా రూ.10లక్షలు అందజేసింది. రెండో విడతగా మరో రూ.10 లక్షలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అర్హత గల దేశాలు.. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాలు వెళ్లేవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అర్హత పరీక్షలు : ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ, జీఎంఏటీ అభ్యర్థులు గుర్తింపు పొందిన విదేశీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది ఉండాలి. పాస్పోర్టు ఉండాలి. ఎంపికైన యూనివర్సిటీలో ఒక సంవత్సరంలోగా చేరాలి. లేకపోతే అడ్మిషన్ను నిలిపివేస్తారు. అభ్యర్థి దరఖాస్తు చేసిన కోర్సు, వీసా వివరాలు మార్చుకోవద్దు. అభ్యర్థులు ఆన్లైన్లో www.telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రుణం అందించే విధానం.. ఎంపికైన అభ్యర్థులకు రూ. 20లక్షలకు గాను రెండు విడతలుగా రూ.10 లక్షలు చెక్కులు అందజేస్తారు. అభ్యర్థులు పది లక్షల ఎడ్యుకేషన్ లోన్ ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి అప్లై చేసుకోవచ్చు. స్కాలర్షిప్ పొందిన విద్యార్థుల యూసీలను సంబంధిత యూనివర్సిటీల నుంచి మాత్రమే సమర్పించాలి. అర్హతలు, వయస్సు .. విద్యార్థి వయస్సు దరఖాస్తు చేసే సమయానికి 30 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. ఈ పథకానికి అర్బన్లో 2 లక్షలు, రూరల్లో అయితే రూ.1.50 లక్షల ఆదాయ పరిమితి ఉంటుంది. విద్యార్హతలు: ఇంజనీరింగ్ డిగ్రీ, మేనేజ్మెంట్ డిగ్రీ, ప్యూర్ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్ సోషల్ సైన్స్, హ్యుమానిటీ మొదలైన డిగ్రీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఒక్కో కుటుంబంలో ఒక్కరు మాత్రమే అర్హులు. ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి.. బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–డీ వారు బీసీ సంక్షేమశాఖలో దరఖాస్తు చేసుకోవాలి. బీసీ–సీ వారు ఎస్సీ సంక్షేమశాఖలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. బీసీ–ఈ వారు మైనార్టీ సంక్షేమశాఖలో దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్లు.. బీసీ–ఏ వారికి 29 శాతం, బీసీ–బీ వారికి 42 శాతం, బీసీ–డీ వారికి 29 శాతం, మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు మూడు శాతం చొప్పున రిజర్వేషన్ ఉంటుంది. -
విదేశాల్లో ఎంబీబీఎస్కూ నీట్ !
-
విదేశాల్లో ఎంబీబీఎస్కూ నీట్ !
న్యూఢిల్లీ: విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)లో ఉత్తీర్ణత సాధించడాన్ని కేంద్రం త్వరలోనే తప్పనిసరి చేసే అవకాశముందని ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం చివరిదశ పరిశీలనలో ఉందన్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తిచేసిన అభ్యర్థులు దేశంలో వైద్య వృత్తిని చేపట్టేందుకు భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) ఫారిన్ మెడికల్గ్రాడ్యుయేట్ ఎగ్జామ్(ఎఫ్ఎంజీఈ)ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష రాసే మొత్తం విద్యార్థుల్లో కేవలం 12 నుంచి 15 శాతం మాత్రమే ఉత్తీర్ణులు అవుతున్నారని పేర్కొన్నారు. ఒకవేళ ఈ పరీక్షలో ఉత్తీర్ణులు కాకుంటే వైద్యవృత్తిని చేపట్టడం కుదరదన్నారు. దీంతో పలువురు చట్టవిరుద్ధంగా వైద్య వృత్తిని ప్రారంభిస్తున్నారని తెలిపారు. -
వేదన మిగిల్చిన ‘విదేశీ విద్య’
సాక్షి, అమరావతి: కాపు కార్పొరేషన్ ద్వారా ‘విదేశీ విద్యాదీవెన’ పథకానికి లబ్ధిదారులను ఎంపికచేసిన ప్రభుత్వం వారికి సాయం చేయడం మరిచిపోయింది. గతేడాది ఎంపిక చేసిన విద్యార్ధులకు ఇంతవరకూ సాయం అందకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకంతో తమ పిల్లల్ని విదేశాలకు పంపిన తల్లిదండ్రులు అప్పులపాలయ్యారు. విదేశీ విద్యాదీవెన పథకం ద్వారా విదేశాల్లో పీజీ చదువుకునే కాపు విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తుంది. విదేశాల్లో సీట్లు సంపాదించిన వారు చదువుకునే యూనివర్సిటీ వివరాలతో విదేశీ విద్యాదీవెన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్న వారికి మొదటి సెమిష్టర్ పూర్తయ్యేలోపు రూ. 5 లక్షలు, రెండో సెమిష్టర్కు మరో రూ. 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి సారిగా కార్పొరేషన్ నుంచి 2014–15లో విదేశీ విద్య కోసం దరఖాస్తులు చేసుకున్న 400 మందికి రెండు విడతల్లో కాపు కార్పొరేషన్ చెల్లింపులు చేసింది. అనంతరం 2016–17 విద్యా సంవత్సరానికి 580 మంది కాపు విద్యార్థినీ విద్యార్థులకు విదేశీ విద్యకు సీట్లు ఇప్పించాలని కార్పొరేషన్ నిర్ణయించింది. కాపు కార్పొరేషన్ హామీ మేరకు విద్యార్థికి రూ.10 లక్షలు విద్యా రుణంగా ఇప్పించేందుకు ఆంధ్రా బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది. ఒకవైపు విమాన ఛార్జీ కూడా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేసింది. సుమారు మూడు వేల మంది ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. మే నెలాఖరులో ఇంటర్వ్యూలు నిర్వహించి 512 మందిని మొదట ఎంపిక చేశారు. ఆ తరువాత మొత్తం 681 మంది కాపు విద్యార్థులను విదేశీ విద్యకు ఎంపిక చేసినట్లు కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ ప్రకటించారు. బ్యాంకుల్లో రుణం తీసుకునే అవకాశమూ లేదు... 2015–16 బ్యాచ్లో విదేశాల్లో చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులను పిలిపించి ఏ కన్వెన్షన్ సెంటర్లో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆ తరువాత నేటికీ ఎంపికైన విద్యార్థులకు పైసా ఇవ్వలేదు. సెమిష్టర్ల వారీగా ఫీజులు చెల్లించలేకపోతున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ విద్యాదీవెన పథకం కింద రుణం మంజూరైనట్లు ఆన్లైన్లో నమోదు కావడంతో బ్యాంకుల్లో విద్యారుణం తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ‘ కాపు కార్పొరేషన్ ద్వారా రూ.10 లక్షలు ఇస్తారని, మరో రూ.10 లక్షలు బ్యాంకు ద్వారా రుణం ఇప్పిస్తారని ప్రభుత్వం చేసిన ప్రకటనలు చూసి మురిసిపోయాను. నా కుమార్తెను ఎంబీబీఎస్ చదివించేందుకు 2016లో చైనా పంపాను. ఆ తరువాత ఆన్లైన్లో కాపు కార్పొరేషన్కు దరఖాస్తు చేశాం. విజయవాడలో 2017 మే 30న ఇంటర్వూ నిర్వహించిన అధికారులు విదేశీ విద్యాదీవెన పథకం కింద లబ్ధిదారుగా ఎంపిక చేశారు. జూలై 23న డబ్బులు మంజూరయ్యాయని ప్రొసీడింగ్స్ లెటర్ కూడా ఇచ్చారు. అయితే నేటి వరకు పైసా కూడా ఇవ్వలేదు. అప్పుచేసి రెండు సెమిస్టర్ల ఫీజు రూ.8 లక్షలు కట్టాను. ఖర్చులు కలిపి ఇప్పటి వరకు రూ.13 లక్షలు అయ్యాయి. కాపు కార్పొరేషన్కు వెళితే ఫైల్ ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. – ఇది ఓ విద్యార్థిని తండ్రి ఆవేదన -
విదేశీ విద్యకు వెనుకడుగు
రాష్ట్రంలో పేద విద్యార్థులకు అమలు చేస్తున్న విదేశీ విద్య పథకానికి విద్యార్థుల నుంచి ఆశించిన స్పందన లభించడం లేదు. విదేశీ విద్య కోసం ప్రభుత్వం రూ. 10 లక్షలు చెల్లిస్తుంది. ఇంతపెద్ద మొత్తంలో చెల్లించే సౌలభ్యం ఉన్నా విద్యార్థులు ఈ పథకాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు మాత్రం లేకుండా నిబంధనలు విధించారు. విద్యార్థుల కుటుంబ వార్షికా దాయం నిబంధన ఈ పథకం అమలులో మొదటి అడ్డంకిగా చెప్పుకోవచ్చు. ఏలూరు (ఆర్ఆర్పేట): విదేశాల్లో ఎంఎస్, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేట్, పీహెచ్డీ చదివే దళిత, గిరిజన విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2013వ సంవత్సరంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కేవలం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉండడంతో ఇతర వర్గాల నుంచి వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో బీసీ విద్యార్థుల కోసం బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని, మైనార్టీ విద్యార్థుల కోసం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పేరిట పథకాలను 2016వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, కెనడా, సింగపూర్, డెన్మార్క్, కజకిస్తాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేసే అవకాశం కల్పించింది. ఆర్థిక ప్రయోజనం ఇలా.. ఈ పథకం ప్రకారం లబ్ధిదారులకు రూ.10 లక్షలతో పాటు విమాన ఛార్జీలు, వీసా ఫీజులు చెల్లిస్తారు. దీనిలో విద్యార్థి విదేశానికి వెళ్లిన తరువాత ముందుగా రూ. 5 లక్షలు చెల్లిస్తుంది. మొదటి సెమిస్టర్ పూర్తి అయిన తరువాత మిగిలిన రూ. 5 లక్షలు చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా ఏడాదికి రాష్ట్రంలో సుమారు 300 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, 500 మంది బీసీ విద్యార్థులకు, 350 మంది ముస్లిం, మైనార్టీ విద్యార్థులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. రెట్టింపు ఖర్చు ఈ పథకం కింద విద్యార్థికి ప్రభుత్వం రూ.10 లక్షలు చెల్లిస్తున్నా విదేశీ చదువులకు వెళ్లే విద్యార్థులు దానికి రెండింతలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. క్షేత్ర స్థాయిలో వారికి రూ. 20 లక్షల వరకూ ఖర్చు అవుతోంది. ఫీజులు, విమాన ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం చెల్లిస్తున్నా, కొన్ని దేశాల్లో విద్యా సంస్థల ఫీజులే అధికంగా ఉండడం, హాస్టల్ ఛార్జీల భారం, ఇతర చిల్లరమల్లర ఖర్చులు వెరసి తడిసి మోపెడవుతున్నాయి. జర్మనీ వంటి దేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లినా ఆయా విద్యా సంస్థలకు కోర్సుకు చెల్లించాల్సిన మొత్తాన్ని బ్యాంక్ బ్యాలెన్స్గా చూపాల్సి ఉంటుంది. అంత మొత్తం సామాన్య, మధ్యతరగతి వారు నిల్వ చేయడం మాటల్లో చెప్పినంత తేలిక కాదంటున్నారు. అడ్డంకులు ఇలా.. ఈ పథకాన్ని అందిపుచ్చుకోవాలంటే విద్యార్థుల తల్లిదండ్రులకు ఎన్నో అడ్డంకులు ఎదురౌతున్నాయి. వాటన్నింటినీ ఎదుర్కోవడం వారికి పెను సవాలుగా మారుతోంది. ఆదాయ సర్టిఫికెట్కు వెళితే విదేశీ విద్యకు పంపే వారికి దారిద్య్రరేఖకు దిగువ ఉన్నారని సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని రెవెన్యూ అధికారులు తేల్చిచెప్పేస్తున్నారు. అక్కడ వారిని బతిమాలి ఎలాగోలా సర్టిఫికెట్ తెచ్చుకుంటే సంక్షేమ శాఖ కార్యాలయాల్లో అధికారులు వేసే యక్ష ప్రశ్నలతో చాలా మంది తల్లిదండ్రులు ఈ పథకాన్ని అందిపుచ్చుకోవడం తమ వల్ల అయ్యే పనికాదని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న తరువాత విద్యార్థి, వారి తల్లిదండ్రులు అనేక ఇంటర్వ్యూలను ఎదుర్కోవలసి వస్తోంది. చివరికి పథకానికి ఎంపికైనా నిధులు మంజూరుకు మాత్రం నెలలకు నెలలు ఎదురుచూడాల్సి వస్తోంది. వేళ్లతో లెక్కించే సంఖ్యలోనే విద్యార్థుల ఎంపిక.. విద్యానిధి పథకం కింద 2014 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కేవలం 23 మంది విద్యార్థులు మాత్రమే విదేశీ చదువులకు ఎంపికయ్యారు. వీరిలో కేవలం 13 మంది విద్యార్థులకు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. ఈ ఏడాది 30 మంది విద్యార్థులకు అవకాశం ఉన్నా ఇప్పటి వరకూ కేవలం ఏడుగురు విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఈ ఏడాది ఒక గిరిజన విద్యార్థి, ముగ్గురు మైనార్టీ విద్యార్థులు విదేశాలకు వెళ్లగా మరో ఏడుగురి దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్నాయి. 2016–17 విద్యాసంవత్సరంలో 29 మంది బీసీ విద్యార్థులు ఈ పథకానికి ఎంపికై విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ ఏడాది 70 మంది విద్యార్థులు విదేశీ చదువులకు వెళ్లడానికి అవకాశమున్నా ఇప్పటికీ కేవలం 10 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు తలప్రాణం తోకకొచ్చింది.. మా అమ్మాయిని విదేశీ విద్య చదివించడానికి ఈ పథకాన్ని వినియోగించుకుందామని ఆన్లైన్లో దరఖాస్తుకు ప్రయత్నించగా ఎక్కడా వీలుకాలేదు. తరువాత మైనార్టీ సంక్షేమ శాఖలో సంప్రదించగా వారి కార్యాలయం నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుకలిగింది. దరఖాస్తు చేసుకుని ఇప్పటికి ఆరు నెలలు గడుస్తోంది. మంజూరు కావడానికి సమయం పడుతుంది అంటున్నారు. అధికారులు తమ సొంత డబ్బు ఉచితంగా ఇస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దరఖాస్తు చేయడమే ప్రహసనంగా మారింది. – ఎం.శోభారాణి, విద్యార్థి తల్లి ఇబ్బందులున్నమాట వాస్తవమే.. ఈ పథకాన్ని అందిపుచ్చుకోవడంలో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎదురవుతున్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడానికి రెవెన్యూ అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రతి 3 – 4 నెలలకు ఒకసారి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారికి నిధులు మంజూరు చేయడం త్వరగానే జరిగిపోతుంది. – జి.లక్ష్మీ ప్రసాద్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి. -
‘పథకం’ ప్రకారం బ్రాహ్మణుల అభివృద్ధి
- వరాలు ప్రకటించిన రాష్ట్ర సర్కార్ - రూ.6 లక్షలలోపు ఆదాయం ఉంటే వివేకానంద విదేశీ విద్య - టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు సరస్వతీ విద్యా ప్రశస్తి - ఆన్లైన్లో దరఖాస్తుకు తుది గడువు సెప్టెంబర్ 30 - ఆరోగ్య బీమా పథకం కింద రూ.2 లక్షల వరకు ఉచిత వైద్యం - కుటుంబ సభ్యులు మరణిస్తే అంత్యక్రియలకు రూ.15 వేలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణులపై వరాల జల్లు కురిపించింది. వారి సంక్షేమానికి, అభివృద్ధికి పలు పథకాలు ప్రకటించింది. గురువారం ఇక్కడ తన చాంబర్లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాల్లో బ్రాహ్మణులకు సర్కారు పెద్దపీట వేస్తోందని తెలిపారు. వివేకానంద విదేశీ విద్యా పథకం క్రింద 41 మందికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. రెండేళ్ల విదేశీ విద్యను అభ్యసించేవారికి గరిష్టంగా రూ.20 లక్షలు, ఒక ఏడాది విదేశీ విద్యకు రూ.15 లక్షలు, ఏడాదిలోపు అయితే రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రూ.6 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు మాత్రమే వివేకానంద విదేశీ విద్య పథకానికి అర్హులని తెలిపారు. సరస్వతీ విద్యా ప్రశస్తి పథకం కూడా ప్రవేశపెట్టామని, ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి ఆర్థిక సహయం అందిస్తామని చెప్పారు. ఎస్ఎస్సీలో రూ.7500, ఇంటర్లో రూ.10 వేలు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డిగ్రీ, పీజీ స్థాయిల్లో 75 శాతం, ప్రొఫెషనల్ కోర్సుల్లో 80 శాతం మార్కులు సాధించినవారికి రూ.15 వేలు, 20 వేలు, 25 వేల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఆరోగ్య బీమా పథకం కింద కుటుంబ యజమానితోపాటు ముగ్గురు సభ్యులకు, రాష్ట్రంలోని ఏదేని ఆస్పత్రుల్లో రూ.2 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని, దీనికి ఈ నెల 14 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని రమణాచారి సూచించారు. పరిశ్రమలు, వ్యాపారం, స్వయం ఉపాధికిగాను సబ్సిడీ పథకాలు తీసుకవచ్చామని, రూ. 5లక్షల ప్రాజెక్టు చేపట్టేవారికి 75 శాతం గ్రాంట్, రూ.10 లక్షల ప్రాజెక్టు అయితే 50 శాతం, రూ.25 లక్షల ప్రాజెక్టు అయితే 30 శాతం గ్రాంట్ అందిస్తున్నామని పేర్కొన్నారు. బ్రాహ్మణ కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకు రూ.15 వేలు ఆర్థిక సహకారం అందిస్తున్నామని చెప్పారు. బ్రాహ్మణ రచయితలు, కవుల రచనల ముద్రణకు రూ.50 వేలు, సామూహిక ఉపనయనాలకు రూ.11,116 మంజూరు చేస్తామన్నారు. -
విదేశీ విద్యకు ‘కవరేజీ’ ఉందా!!
♦ స్టూడెంట్ ట్రావెల్ పాలసీ లేకుంటే కష్టం ♦ స్థానిక హెల్త్ పాలసీలకన్నా ఇవే చౌక ♦ విద్య ముగిసే వరకూ కవరేజీ గడువు శ్రీకర్ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అంతా బాగానే ఉన్నా కొత్త వాతావరణం కావటంతో ఇమడలేకపోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. చికిత్స చేయించుకోవటానికి ఆసుపత్రికి వెళ్లాడు. కానీ అక్కడి వ్యయం భరించటం తన వల్ల కాలేదు. చేసేదేమీ లేక తల్లిదండ్రులను సంప్రతించి తిరిగి ఇండియాకు వచ్చేశాడు. అదే శ్రీకర్ కనక ట్రావెల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే...! పరిస్థితి మరోలా ఉండేది. విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేయాలన్న అభిలాష మన దేశ విద్యార్థుల్లో ఏటేటా పెరుగుతూనే ఉంది. నిజానికి పిల్లల్ని విదేశాలకు పంపటం అంత తేలిక్కాదు. విదేశాల్లో విద్య, వసతి రూపేణా ఎదురయ్యే అధిక వ్యయాలను భరించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా రుణాల కోసం దరఖాస్తు చేస్తారు. ఇంతా చేసి... విదేశీ గడ్డపై అడుగు పెట్టాక ఎదురయ్యే అవాంఛనీయ పరిస్థితులను తట్టుకునేందుకు ముందుగానే సరైన రక్షణ చర్యలు తీసుకోవడాన్ని మాత్రం మర్చిపోతారు. అందుకే ఇన్ని చేసిన వారు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు. వైద్య, దంత చికిత్సలు స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు అందులో వైద్య, ప్రమాద కవరేజీ ఉండేలా చూసుకోవాలి. దాంతో విదేశాల్లో అనుకోకుండా ఎదురయ్యే భారీ వైద్య ఖర్చుల నుంచి రక్షణ లభిస్తుంది. దంత చికిత్సల కవరేజీ కూడా చాలా అవసరం. ఎందుకంటే విదేశాల్లో దంత వైద్య ఖర్చులు మన దేశంతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ. డాక్యుమెంట్లు, న్యాయపరమైన ఖర్చులకూ... ట్రావెల్ ఇన్సూరెన్స్లో... న్యాయపరంగా తలెత్తే ఖర్చులు, పాస్పోర్ట్, ఇతర విలువైన డాక్యుమెంట్లు చోరీకి గురైతే ఆదుకునే కవరేజీ కూడా ఉండేలా చూసుకోవడం అవసరం. కాంప్రహెన్సివ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు ఈ కోవలోకి వస్తాయి. బ్యాగేజీ తనిఖీలు ఆలస్యమైనా పరిహారం ఇస్తాయి. స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నది ట్రావెల్ ఇన్సూరెన్స్కు భిన్నమైనది. ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది ఓ వ్యక్తి పర్యటనకు మాత్రమే కవరేజీ ఇస్తుంది. పర్యటన పూర్తితో ఇది ముగిసిపోతుంది. కానీ, స్టూడెంట్ ట్రావెల్ బీమా మాత్రం విదేశాల్లో అకడమిక్ కాల వ్యవధి వరకు అమల్లో ఉంటుంది. పాలసీ వ్యయం విదేశాల్లో తీసుకునే పాలసీ కంటే మన దేశంలో తీసుకునే స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఖర్చు తక్కువ. అయితే, ఈ ప్రీమియం కూడా ఏ దేశానికి వెళుతున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అమెరికాలో ఉన్నత విద్య పర్యటనకు పాలసీ వ్యయం ఆఫ్రికాతో పోల్చుకుంటే ఎక్కువ. కారణం అమెరికాలో వైద్య వ్యయాలు భారీగా ఉండడమే. కొలంబియా యూనివర్సిటీ 3 లక్షల డాలర్ల హెల్త్ కవరేజీని రూ.1,30,000కు అందిస్తోంది. అదే 5 లక్షల డాలర్ల కవరేజీని స్వదేశంలో రూ.46,851కే పొందే అవకాశం ఉంది. ఇక కెనడా వెళ్లే విద్యార్థులు అక్కడ యూనివర్సిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను తీసుకునే సదుపాయం ఉంది. ఇందుకు ఏటా రూ.40,000 వ్యయం అవుతుంది. అయితే, పాలసీ ఎంపికలో ప్రీమియం కీలకం కాదు. వైద్య చికిత్సలు సులభంగా పొందటమే ముఖ్యం. కొన్ని బీమా సంస్థలు అందించే పాలసీలతో నెట్వర్క్ హాస్పిటళ్లలో నగదు రహిత చికిత్సలు పొందొచ్చు. యూనివర్సిటీ పాలసీ ఎంచుకుంటే మాత్రం అందులో ఉన్న లాభ, నష్టాల గురించి ముందుగానే విచారించి తగిన నిర్ణయం తీసుకోవాలి. పాలసీ తీసుకునే ముందు... విద్యా సంస్థలు కూడా తమ విద్యార్థులకు ఈ బీమా ఉండాల్సిన అవసరాన్ని అర్థం చేసుకుంటున్నాయి. దీంతో విదేశాల్లోని కొన్ని కళాశాలలు తమ విద్యార్థులకు స్వయంగా కొన్ని రకాల పాలసీల్ని సూచిస్తున్నాయి. అయితే, కొన్ని విదేశీ కళాశాలలు తా ము సూచించిన సంస్థల నుంచే పాలసీని తీసుకోవాలన్న నిబంధనను అమలు చేస్తున్నాయనే అభిప్రాయం ఉంది. కాకపోతే ఇది అన్నింటికీ వర్తించదు. కొన్ని యూనివర్సిటీలే ఇలా చేస్తున్నాయి. కొన్ని సాధారణ నిబంధనలను సూచిస్తున్నాయి. వాటికి సరిపోయే పాలసీని ఏ సంస్థ నుంచైనా తీసుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి బయల్దేరే ముందే స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. లేదా అక్కడికి వెళ్లిన తర్వాత సాధారణ ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవచ్చు. కానీ ఈ రెండింటిలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉత్తమం. ఎందుకంటే ఇది ఎన్నో రకాల కవరేజీలను అందించే సమగ్ర పాలసీ. అలాకాక పరాయి దేశంలో సాధారణ ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే అకడమిక్ గడువులోపు స్వదేశానికి వెళ్లి వచ్చే ప్రతిసారీ విడిగా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు తాము అడ్మిషన్ పొందిన కళాశాలల నిబంధనల ప్రకారం బీమా పాలసీ తీసుకోవడం తప్పనిసరా, కాదా అన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవాలి. ఉన్నతమైన సేవలు ఇన్సూరెన్స్ కంపెనీని బట్టి పరిహార చెల్లింపుల ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. చాలా వరకు మనదేశంలోని బీమా సంస్థలు విదేశాల్లోని అత్యవసర సేవల సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. క్లెయిమ్ కోసం ఏ దేశంలో అయితే ఉన్నారో అక్కడి స్థానిక నంబర్ను కాల్ చేయాల్సి ఉంటుంది. -
శాసనమండలి ప్రశ్నోత్తరాలు
విదేశీ విద్యపై నిబంధనలను సడలిస్తాం సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు విద్యార్థుల కుటుంబ వార్షికాదాయ నిబంధనను రూ.2 లక్షల నుంచి పెంచడం, ప్రస్తుతమున్న ఐదు దేశాలతోపాటు జర్మనీ, న్యూజిల్యాండ్, దక్షిణకొరియా వంటి దేశాలకు అనుమతివ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి జి.జగదీశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సెలక్షన్ విధానంలో మార్పులు తీసుకురావాలని, ట్రంప్ విధానాలతో అమెరికా విద్యపై అభద్రతాభావం నెలకొన్న నేపథ్యంలో ఇతర దేశాల్లోనూ అనుమతివ్వాలని, కనీస అర్హత మార్కులు తగ్గించాలని సభ్యులు కోరారు. ఇప్పటివరకు 1,019 మంది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల విదేశీ విద్యకోసం రూ.8.80 కోట్లు కేటాయించామన్నారు. ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలను సద్వినియోగం చేసుకుని సంస్థ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటు¯న్నట్లు రవాణా శాఖ మంత్రి పి.మహేందర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్లలోని 150 ఖాళీ స్థలాల్లో వాణిజ్య సముదాయాలు, పెట్రోలు బంకులు, సినిమా హాళ్లు తదితరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా సంస్థకు ఏటా రూ.30 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని చెప్పారు. హెచ్పీసీఎల్, ఐఏసీఎల్ సంస్థలకు 69 బస్టాండ్లలో పెట్రోలు బంకుల ఏర్పాటుకు అవకాశం ఇవ్వడం ద్వారా ఏటా మరో రూ.4 కోట్ల ఆదాయం వస్తుందన్నారు. 357 బస్ స్టేషన్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. పాత ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో బీబీఓటీ పథకం కింద 20 ఖాళీ స్థలాలను 33 ఏళ్ల కాలపరిమితికి లీజుకు ఇచ్చే ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. 10 మంది విద్యాశాఖ అధికారులపై చర్యలు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ‘కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాలు పెంచే ఆలోచన చేస్తున్నాం. హైదరాబాద్లోని 16 మదర్సాలలో రూ.48.60 లక్షల మేర అవకతవకలు జరిగాయి. 10 మంది విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకున్నాం. అవకతవకలకు పాల్పడిన వారి నుంచి డబ్బు రికవరీ చేస్తాం. విచారణ సాగుతోంది. ఇందులో ఎంతటి వారున్న ఉపేక్షించేది లేదు. విద్యాశాఖలో అవినీతి అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం ‘వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లిని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే రూ.10 కోట్లు కేటాయించాం. గంగదేవిపల్లిని ఆదర్శంగా తీసుకుని వచ్చే 3,4 ఏళ్లలో రాష్టంలోని అన్ని గ్రామాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తాం. నూటికి నూరు శాతం మద్యపాన నిషేధం, ఇంటి పన్ను వసూ లు, కుటుంబ మరుగుదొడ్లు, వాటి వినియోగం, కుటుంబ నియంత్రణ (కుటుంబానికి ఇద్దరు పిల్లలు), పొదుపు బృందాలు/పథకాల్లో అవ గాహన, పాఠశాలల్లో వంద శాతం విద్యార్థులు నమోదును ఈ గ్రామపంచాయతీ సాధించింది. ఇప్పటికే 14 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధించింది’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. -
'తప్పుడు సర్టిఫికెట్లతో విద్యార్థులు జాగ్రత్త'
హైదరాబాద్: ఉన్నత చదువులకు అమెరికా వెళ్లే విద్యార్థులు తప్పుడు సర్టిఫికెట్లతో జాగ్రత్తగా ఉండాలని యూఎస్ కాన్సులేట్ అవినీతి నిరోధక అధికారి ఆడం ఫర్గుసన్ హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారు. అమెరికా కల్పిస్తోన్న ఉన్నత విద్యావకాశాలను వినియోగించుకొనేందుకు విద్యార్థులు సన్నద్ధం కావాలన్నారు. ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు అందుకు కావాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని, అదే సందర్భంలో తప్పుడు సర్టిఫికెట్లను నివేదించడం వారి భవిష్యత్తుకి ప్రమాదకరమని చెప్పారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ నేతృత్వంలో భారతీయ విద్యార్థుల పట్ల ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు. తప్పుడు సర్టిఫికెట్ల పట్ల యుఎస్ అనుసరిస్తున్న అవినీతి నిరోధక విధానాలను ఫర్గుసన్ విద్యార్థులకు వివరించారు. -
విదేశీ విద్యకు సాయం ఇలా..
బీసీ ఓవర్సీస్ పథకం మార్గదర్శకాలు జారీ సాక్షి, హైదరాబాద్: జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే బీసీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం కింద 2016-17లో ముందుగా 300 మంది విద్యార్థులకు రూ.20 లక్షల సాయమందించనున్నారు. ఈ మేరకు సోమవారం బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎఫ్ఏసీ) సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఇవీ మార్గదర్శకాలు.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షన్నర లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు కుటుంబ వార్షికాదాయం. ఉద్యోగులు అయిన వారు తాము పనిచేస్తున్న సంస్థ నుంచి తప్పనిసరిగా వేతన సర్టిఫికెట్ జతపరచాలి. తాజా టాక్స్ అసెస్మెంట్తో పాటు, తాజా వేతన సర్టిఫికెట్ను కూడా జతచేయాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మీ-సేవా నుంచి పొందాలి. పత్రికా ప్రకటన వెలువడే జూలై 1 నాటికి 30 ఏళ్ల వయసు మించరాదు. విద్యార్హతలు.. ఇంజనీరింగ్/ మేనేజ్మెంట్/ ప్యూర్సెన్సైస్/ అగ్రికల్చర్ సెన్సైస్/ మెడిసిన్, నర్సింగ్ / సోషల్ సెన్సైస్/ హ్యుమానిటీస్ వంటి ఫౌండేషన్ డిగ్రీలో 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్ను సాధించాలి. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాల్లో చదవొచ్చు. టోఫెల్/ఐఈఎల్టీఎస్ అండ్ జీఆర్ఈ/జీమాట్ అర్హత కలిగి ఉండాలి అక్రిడెటెడ్ విదేశీ విద్యాలయంలో ప్రవేశం పొంది ఉండాలి చెల్లుబాటయ్యే పాస్పోర్ట్ కలిగి ఉండాలి అక్రిడెటెడ్ వర్సిటీ/విద్యాసంస్థలో సొం తంగా ప్రవేశానికి ఏర్పాట్లు చేసుకోగలగాలి ఎంపికైనట్లు వర్తమానం అందాక సంబంధిత యూనివర్సిటీలో ఏడాదిలోగా చేరాలి. ఏ దేశంలో చదవదలుచుకున్నారో ఆ దేశ వీసాను విద్యార్థే పొందాల్సి ఉంటుంది. దరఖాస్తులకు అవసరమైన అన్ని పత్రాలను జతచేయాలి ఎంపిక పద్ధతి.. వార్తాపత్రికల్లో ప్రకటనల ద్వారా దరఖాస్తుల ఆహ్వానం ఏటా ఆగస్టు/సెప్టెంబర్, జనవరి/ఫిబ్రవరిలలో ఈ-పాస్ పోర్టల్లో నోటిఫికేషన్ ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30లోగా, జనవరి 28 నుంచి ఫిబ్రవరి 29లోగా http://www.telanganaepass.cgg. gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి 30 శాతం మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేస్తారు. బీసీ-ఏ 29 శాతం, బీసీ-బీ 42 శాతం, బీసీ-డీ 29 శాతం (33 శాతం మహిళలు, 3 శాతం వికలాంగ విద్యార్థులు కలుపుకొని) కేటాయిస్తారు. (బీసీ-సీ, బీసీ-ఈలతో పాటు, బీసీ-ఏ లోని మెహతర్, సిక్లిగర్/సైకల్గర్, బీసీ-బీలోని దూదేకుల, లడ్డాఫ్, పింజరి లేదా నూర్బాషా.. వీరంతా కూడా మైనారిటీ సంక్షేమశాఖ పరిధిలోకి వస్తారు-అందువల్ల వీరిని మినహాయించారు -
బీసీలకూ ‘విదేశీ విద్య’ ఆర్థిక సహాయం
రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమశాఖ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు అందిస్తున్న తరహాలో వీరికి కూడా అమలు చేయాలని భావిస్తోంది. కొన్ని బీసీ కులాలు, సంచారజాతులకు చెందిన వారు ఎస్సీల కంటే కూడా వెనుకబడి ఉన్న నేపథ్యంలో... వారికి కూడా విదేశాల్లో ఉన్నత విద్య అవకాశాలను కల్పించాలని బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కూడా సానుకూలంగా ఉన్నారని, దీనికి త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. విదేశాల్లో విద్యకోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతూ ఇటీవలే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే మైనారిటీ, బీసీ విద్యార్థులకూ ఈ పథకాన్ని వర్తింప చేయాలని, రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఐఐటీల్లోనూ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఐఐఎం, బిట్స్ పిలానీ తదితర కోర్సుల్లో ప్రవేశం పొందే బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ను వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదించింది. ఇలా చేయడం వల్ల విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు... బీసీ, ఈబీసీ విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నట్లు సమాచారం. ఇక కేంద్ర ఓబీసీ జాబితాలో రాష్ట్రానికి చెందిన 26 కులాలను చేర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని బీసీ శాఖ కోరినట్లు తెలుస్తోంది. జాతీయ బీసీ కమిషన్ 2015 ఏప్రిల్లోనే రాష్ట్రానికి వచ్చి ఆయా కులాలను ఓబీసీ జాబితాలో చేర్చే అంశంపై బహిరంగ విచారణను నిర్వహించింది కూడా. కానీ ఏడాది గడిచినా ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో... ప్రభుత్వపరంగా కేంద్రానికి విజ్ఞప్తిచేయాలని కోరినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో ఓబీసీలుగా గుర్తించకపోవడంతో ఆ 26 కులాలకు చెందినవారు ఉద్యోగ, విద్య అవకాశాలను కోల్పోతున్నారని... దీనిపై త్వరగా నిర్ణయం వెలువడేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. -
అత్యుత్తమ చదువులకు అమెరికా
స్టడీ అబ్రాడ్ : కంట్రీ ప్రొఫైల్ విదేశీ విద్యకు ప్రపంచంలో ఎన్నో దేశాలు అందుబాటులో ఉన్నాయి. అయితే భారతీయ విద్యార్థులకు.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలవారికి అమెరికా.. మొదటి గమ్యస్థానంగా నిలుస్తోంది. అభిరుచికి తగిన, సత్వర ఉపాధినందించే కోర్సులుండటమే ఇందుకు కారణం. అమెరికాలో విద్యనభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య.. మార్చి-2016 నాటికి 1,94,438కి చేరుకుంది. ఈ నేపథ్యంలో యూఎస్ విద్యా విధానంలోని ప్రత్యేకతలపై ఫోకస్... నాణ్యమైన విద్య.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన విద్య.. సులువైన నిబంధనలతో అందుబాటులో ఉంటుంది. ఇక్కడి యూనివర్సిటీల్లో మెరుగైన మౌలిక సౌకర్యాలు, పరిశోధనలకు అనువైన వాతావరణం, నిష్ణాతులైన అధ్యాపకులు ఉంటారు. గ్రాడ్యుయేట్ స్థాయిలోనే మంచి ఉపాధినందించే కోర్సులు ఉంటాయి. లెర్నింగ్ బై డూయింగ్ లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో సమగ్ర విద్య అందుతుంది. విద్యార్థులు క్యాంపస్లో పనిచేసుకోవడానికి వారానికి 20 గంటలు, సెలవులతో కలిపితే 40 గంటల వరకు అవకాశం ఇస్తారు. విదేశీ విద్యార్థులకు క్యాంపస్ బయట పనిచేసుకోవడానికి అనుమతి ఉండదు. ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో పనిచేసుకునే అవకాశం పొందవచ్చు. చాలా డిగ్రీ కోర్సుల్లో 12 నెలల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. దీంతో వారికి నచ్చిన రంగాన్ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. అనుకూలతలు అమెరికా విద్యా వ్యవస్థలో ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయి. కోర్సును మధ్యలో మార్చుకునే అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేషన్లో మొదటి రెండేళ్ల తర్వాత కోర్సుపై ఒక అవగాహన వస్తుంది. అప్పుడు విద్యార్థుల అభిరుచిని బట్టి కోర్సు మారే సౌలభ్యం ఉంది. దీంతో ఇష్టంలేని కోర్సు పూర్తి చేయాల్సి వస్తుందనే బాధ ఉండదు. టెక్నాలజీ విద్యలో అత్యుత్తమ టెక్నాలజీని అందిస్తామని అమెరికా యూనివర్సిటీలు గర్వంగా చెప్పుకుంటాయి. సాంకేతిక పరికరాలు, వనరులను సమకూర్చడంలో ముందుంటాయి. ఆధునిక టె క్నాలజీని వినియోగించుకుని విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకునేలా దోహదపడతాయి. క్యాంపస్ అనుభవం క్యాంపస్ జీవనం అమెరికా విద్యా వ్యవస్థలోనే గొప్ప అంశం. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని దేశాల విద్యార్థులు అక్కడే ఉంటారు. సానుకూల వాతావరణంలో జరిగే చర్చల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు నాణ్యతా ప్రమాణాలు ఉన్న అమెరికా విద్యకు మంచి గుర్తింపు ఉంది. విద్యా సర్టిఫికెట్లకు దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల్లో మంచి ఆదరణ ఉంటుంది. అక్కడ గతేడాది మార్చి నాటికి 1,48,360 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. ఈ ఏడాది మార్చి నాటికి 1,94,438కి చేరుకుందని స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ పేర్కొంది. విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళ్లేందుకు, వీసా కోసం దరఖాస్తు చేసుకునేందుకు కన్సల్టెన్సీల బదులు రిప్రజెంటేటివ్స్ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే కన్సల్టెన్సీలకు విదేశీ విద్యాసంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. రిప్రజెంటేటివ్స్ ఆయా ఇన్స్టిట్యూట్లతో నేరుగా టచ్లో ఉంటారు. అందువల్ల వాళ్లయితే ఖచ్చితమైన, తాజా సమాచారం చెబుతారు. బోగస్ వెబ్సైట్లు, కన్సల్టెన్సీల ద్వారా ప్రవేశించిన చాలా మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇటేవలే వెనక్కి పంపిన విషయం తెలిసిందే. - ఇంతియాజ్ బన్నూరు, ఏఈసీసీ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ -
అమెరికా ఆశలకు ‘ఇమిగ్రేషన్’ గండి
-
అమెరికా ఆశలకు ‘ఇమిగ్రేషన్’ గండి
విదేశీ విద్యకోసం వెళ్లిన విద్యార్థులకు ఎయిర్పోర్ట్లో చుక్కెదురు తిప్పి పంపిన అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఎయిర్ ఇండియా కార్యాలయం వద్ద ఆందోళన హైదరాబాద్: విదేశీ విద్యను అభ్యసించేందుకు అష్టకష్టాలు పడి వీసా సంపాదించి... ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన విద్యార్థులను విమానాశ్రయంలోనే ఇమిగ్రేషన్ సిబ్బంది అడ్డుకున్నారు. వీసాను తిరస్కరించి ఇక్కడికి పంపించారు. విమానం ఎక్కేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లిన మరికొందరు విద్యార్థులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. బీటెక్ పూర్తి చేసిన కొందరు విద్యార్థులు ఆన్లైన్లో విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీసా రావడంతో అంతా సవ్యంగా సాగిపోతోందని భావించారు. ఈ నెల 15న 19 మంది ఎయిర్ ఇండియా విమానంలో యూఎస్ చేరుకున్నారు. విమానం దిగగానే అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు బ్యాంక్ లోన్, సర్టిఫికెట్లు, ఆధార్ తదితరాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ... 36 గంటల పాటు అక్కడే ఉంచుకొని తిరిగి ఇండియాకు పంపారు. ఈ నెల 19న మరికొందరు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లగా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో దిక్కుతోచని విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు సోమవారం హైదరాబాద్లోని ఎయిర్ ఇండియా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. జనవరి 5 నుంచి 10 వరకు జరిగే ఓరియెంటేషన్ క్లాస్లకు హాజరుకాకపోతే.. అష్టకష్టాలు పడి చెల్లించిన లక్షల రూపాయలు వృథా కావడంతో పాటు విద్యా సంవత్సరం నష్టపోతామని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విదేశాంగ మంత్రితో చర్చిస్తా... ‘‘అమెరికాలో యూనివర్సిటీలకు చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులను వారి శ్రేయస్సు మేరకే ఆపుతాం. కొన్ని వర్సిటీలకు గుర్తింపు సమస్యలు ఉన్నాయని ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను అనుమతించడం లేదు. ఎయిర్ ఇండియా విమాన సంస్థ మాత్రమే. యూఎస్ వెళ్లి.. అక్కడ అనుమతి లభించని విద్యార్థులు సొంత ఖర్చులతో తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంపై విదేశాంగ మంత్రితో చర్చిస్తాం.’’ - కేంద్ర పౌర విమాన యాన మంత్రి అశోక్గజపతి రాజు -
విదేశీ విద్యకు ఉపకారవేతనం
ప్రతిభావంతులను ప్రోత్సహించే ఉద్దేశంతో వివిధ దేశాల ప్రభుత్వాలు భారతీయ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నాయి.. పీజీ నుంచి పరిశోధన స్థాయి వరకు కోర్సులను తమ దేశంలో పూర్తి చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి.. ట్యూషన్ ఫీజు నుంచి మొదలు వసతి ఖర్చులను సైతం భరిస్తున్నాయి.. తద్వారా విదేశీ విద్యను ఉచితంగా అందుకునే మార్గంగా నిలుస్తున్నాయి.. ఈ క్రమంలో భారతీయ విద్యార్థులకు ఉపకారవేతనాలను అందిస్తున్న దేశాలు, కోర్సులు, సంబంధిత వివరాలు.. చైనా సబ్జెక్టులు: చైనీస్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఫైన్ ఆర్ట్స్, బోటనీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్, పొలిటికల్ సైన్స్, ఎంబీఏ, సెరికల్చర్, అగ్రోనమీ. ్షిప్ వ్యవధి: 1-4 ఏళ్లు అకడమిక్ సెషన్ సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది. స్కాలర్షిప్ కింద లాడ్జింగ్, ట్యూషన్ ఫీజు, రోజువారీ ఖర్చులను చెల్లిస్తారు. అర్హత: 60 శాతం మార్కులతో ఫైన్ ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ. పీజీ కోర్సులకు రెండేళ్ల పరిశోధన అనుభవం ఉండాలి. చైనీస్ లాంగ్వేజ్ కోసం సంబంధిత సబ్జెక్ట్లో సర్టిఫికెట్/డిప్లొమా. వయసు: 40 ఏళ్లు. నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో జనవరి/ఫిబ్రవరిలో ప్రచురిస్తారు. కొరియా సబ్జెక్టులు: బయోటెక్నాలజీ, కొరియన్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, అగ్రికల్చర్. స్కాలర్షిప్ల సంఖ్య: 3-5 స్కాలర్షిప్ వ్యవధి: 3-5 ఏళ్లు అకడమిక్ సెషన్ అక్టోబర్లో ప్రారంభమవుతుంది. స్కాలర్షిప్ కింద ట్యూషన్ ఫీజు, నివాస ఖర్చులు, హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులను చెల్లిస్తారు. అర్హత: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ (ఎన్ఐఐఈడీ) నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. వయసు: 40 ఏళ్లు. నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ఫిబ్రవరి/ మార్చిలో ప్రచురిస్తారు. జపాన్ సబ్జెక్టులు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్, క్వాలిటీ అండ్ రిలయబిల్టీ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, రోబోటిక్స్, లేజర్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, జపనీస్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఫిషరీస్, జపనీస్ స్టడీస్, ఎర్త్కిక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్/ఇంజనీరింగ్. స్కాలర్షిప్ల సంఖ్య: 30-35. స్కాలర్షిప్ వ్యవధి: 18 నెలల నుంచి 2 ఏళ్లు ( నిబంధనల మేరకు పొడిగింపు కూడా లభిస్తుంది). అకడమిక్ సెషన్ ఏప్రిల్/అక్టోబర్లలో ప్రారంభమవుతుంది. స్కాలర్షిప్ కింద ట్యూషన్ ఫీజు, వసతి, మెడికల్ ఇన్సూరెన్స్కు సంబంధించిన ఖర్చులను జపాన్ ప్రభుత్వం చెల్లిస్తుంది. తిరుగు ప్రయాణానికి విమాన టికెట్లను కూడా అందజేస్తుంది. అర్హత: ఎంచుకున్న కోర్సు మేరకు సంబంధిత సబ్జెక్ట్లో 60 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసి ఉండాలి. వయసు: 35 ఏళ్లు. నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ఏప్రిల్/మేలో ప్రచురిస్తారు. ఇజ్రాయెల్ సబ్జెక్టులు: ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్మెంట్, మాస్ కమ్యూనికేషన్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, హిబ్రూ లాం గ్వేజ్, జుడాయిజం, హిస్టరీ ఆఫ్ జ్యూయిష్ పీపుల్, అగ్రికల్చర్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, మిడిల్ ఈస్ట్ స్టడీస్. స్కాలర్షిప్ల సంఖ్య: 5-7. స్కాలర్షిప్ వ్యవధి: 8 నెలలు. అకడమిక్ సెషన్ అక్టోబర్లో ప్రారంభమవుతుంది. స్కాలర్షిప్ కింద ట్యూషన్ ఫీజు, నివాస, హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులను ఇజ్రాయెల్ ప్రభుత్వం చెల్లిస్తుంది. అర్హత: వయోపరిమితి లేదు. ఎంచుకున్న కోర్సు మేరకు హ్యుమానిటీస్ విద్యార్థులు సంబంధిత డిగ్రీలో 55 శాతం మార్కులు, అగ్రికల్చర్ విద్యార్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో జనవరి/ ఫిబ్రవరిలో ప్రచురిస్తారు. బెల్జియం సబ్జెక్టులు (మాస్టర్స్ కోర్సులు): అగ్రోనమీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫొనెటిక్స్. స్కాలర్షిప్ల సంఖ్య: 2. స్కాలర్షిప్ వ్యవధి: 10 నెలలు అర్హత: సంబంధిత సబ్జెక్ట్లో 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. వయసు: 35 ఏళ్లు. స్కాలర్షిప్ కింద ట్యూషన్ ఫీజు, మెడికల్ ఇన్సూరెన్స్ ఖర్చులను చె ల్లిస్తారు. నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ఫిబ్రవరి/మార్చిలో ప్రచురిస్తారు. ఇటలీ సబ్జెక్టులు: కేటగిరీ-ఏ కోర్సులు-ఇటాలియన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ (కాల వ్యవధి: 3నెలలు). కేటగిరీ-బి కోర్సులు: ఫ్యాషన్ టెక్నాలజీ, ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్, ఇటాలియన్ లాంగ్వేజ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బయోటెక్నాలజీ, అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇన్ మ్యూజిక్/ఆర్ట్, ఇటాలియన్ లాంగ్వేజ్ టీచింగ్ తదితరాలు (కాల వ్యవధి: 6-9 నెలలు). స్కాలర్షిప్ కింద నెలవారీగా కొంత మొత్తం, కోర్సు ఫీజును చెల్లిస్తారు. నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ఏప్రిల్లో ప్రచురిస్తారు. మెక్సికో సబ్జెక్టులు (పీజీ, పీహెచ్డీ): అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, లాటిన్ అమెరికన్ స్టడీస్, స్పానిష్ లిటరేచర్, హిస్టరీ, ఎకనామిక్స్, సైకాలజీ, జాగ్రఫీ.స్కాలర్షిప్ల సంఖ్య: 6. స్కాలర్షిప్ వ్యవధి: 1-2 ఏళ్లు. అకడమిక్ సెషన్ సెప్టెంబర్/అక్టోబర్లో ప్రారంభమవుతంది. స్కాలర్షిప్ కింద ట్యూషన్ ఫీజు, నెల వారీ ఖర్చులను చెల్లిస్తారు. అర్హత: పీజీ కోర్సులకు సంబంధిత సబ్జెక్ట్లో 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, పీహెచ్డీ కోర్సులకు సం బంధిత సబ్జెక్ట్లో 65 శాతం మార్కులతో పీజీ ఉండాలి.యసు: 26 ఏళ్లు (పీజీ కోర్సులకు), 30 ఏళ్లు (పీహెచ్డీ కోర్సులకు). నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో జూన్/జూలైలో ప్రచురిస్తారు. టర్కీ సబ్జెక్టులు (రీసెర్చ్ స్కాలర్షిప్): అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. స్కాలర్షిప్ల సంఖ్య: 4స్కాలర్షిప్ వ్యవధి: 2-8 నెలలు.అర్హత: సంబంధిత సబ్జెక్ట్లో 60శాతం మార్కులతో పీజీ. వయసు: 45 ఏళ్లు.నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ప్రచురిస్తారు. యునెటైడ్ కింగ్డమ్ (యూకే) కామన్వెల్త్ స్కాలర్షిప్/ఫెలోషిప్స్ సబ్జెక్టులు (పీజీ/పీహెచ్డీ/మెడికల్ విభాగంలో క్లినికల్ ట్రైనింగ్): ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ/బయోకెమికల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, అగ్రోనమీ, ఫారెస్ట్రీ, హిస్టరీ, సోషియాలజీ, మేనేజ్మెంట్ స్టడీస్, ఎకనామిక్స్, ఫిలాసఫీ, సైకాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, లా, ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తదితర సబ్జెక్టులు. మెడిసిన్ (క్యాన్సర్ రీసెర్చ్, కార్డియాలజీ, గైనకాలజీ, డెంటిస్ట్రీ తదితర..).స్కాలర్షిప్ వ్యవధి: పీజీ-ఏడాది, పీహెచ్డీ-మూడేళ్లు, క్లినికల్ ట్రైనింగ్-ఆరు నెలలు.నోటిఫికేషన్: మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో ఆగస్టు/సెప్టెంబర్లలో ప్రచురిస్తారు. అగాథ హరిసన్ మెమోరియల్ ఫెలోషిప్ సబ్జెక్టులు (అడ్వాన్స్డ్ రీసెర్చ్): హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్.అర్హత: సంబంధిత సబ్జెక్ట్లో పీహెచ్డీ (60 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసి ఉండాలి) తోపాటు మూడేళ్ల బోధనానుభవం. వయసు: 30-40 ఏళ్లు.నోటిఫికేషన్: ప్రముఖ దినపత్రికలలో ఏప్రిల్/మేలో ప్రచురిస్తారు. సంప్రదించాల్సిన చిరునామా అండర్ సెక్రటరీ (స్కాలర్షిప్), మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఎక్స్టర్నల్ స్కాలర్షిప్ డివిజన్, సెకండ్ ఫ్లోర్, వింగ్-6, వెస్ట్ బ్లాక్-1, ఆర్కే పురం, న్యూఢిల్లీ-110066. వెబ్సైట్: http://mhrd.gov.in/ ప్రతిభ ఉండి విదేశాల్లో ఉచితంగా చదవాలనుకునే వారికి చక్కని అవకాశం మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్కాలర్షిప్లు. జపాన్, యూకే, చైనా, ఇజ్రాయెల్, కొరియా తదితర దేశాల ప్రభుత్వాలు ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్, ఆర్ట్స్, సైన్స్ సంబంధిత విభాగాల్లో పీజీ నుంచి పీహెచ్డీ కోర్సులను ఉచితంగానే పూర్తి చేయవచ్చు. స్కాలర్షిప్ కింద ట్యూషన్ ఫీజు, భోజన, వసతి, హెల్త్ ఇన్సూరెన్స్ ఖర్చులను చెల్లిస్తారు. కొన్ని దేశాలు ప్రయాణ ఖర్చులను కూడా భరిస్తున్నాయి. కానీ దక్షిణ భారత విద్యార్థుల్లో ఈ స్కాలర్షిప్ల పట్ల అంతగా అవగాహన ఉండటం లేదు. ఈ స్కాలర్షిప్ల కోసం వచ్చిన దరఖాస్తుల్లోంచి ప్రతిభ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం ముందుగా చదవాలనుకుంటున్న యూనివర్సిటీ, కోర్సును ఎంచుకోవాలి. ఈ క్రమంలో మన పూర్తి వివరాలతో సంబంధిత వర్సిటీ డిపార్ట్మెంట్ డీన్తో ఈ-మెయిల్ ద్వారా సంప్రదింపులు (కమ్యూనికేషన్) ప్రారంభించాలి. తర్వాత నిర్దేశించిన విధంగా దరఖాస్తును పూర్తి చేయాలి. దీనికి రెజ్యూమె, దరఖాస్తు చేసుకున్న వర్సిటీ నుంచి వచ్చిన ప్రత్యుత్తరాన్ని జత చేయాలి. ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. మొదటి రెండు దశలు భారత్లో ఉంటే చివరి దశను సంబంధిత దేశం (దరఖాస్తు చేసుకున్న దేశం)లో నిర్వహిస్తారు. మొదటి దశలో వచ్చిన దరఖాస్తులను ప్రతిభ ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి రెండో దశ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇక్కడ అప్లికేషన్తోపాటు జత చేసిన రెజ్యుమె, దరఖాస్తు చేసుకున్న వర్సిటీ డీన్ ఇచ్చిన ప్రత్యుత్తరం వంటి అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. తద్వారా చదువు పట్ల నిబద్ధత తెలియడంతోపాటు రౌండో దశకు ఇంటర్వ్యూకు సులువుగా అర్హత సాధించవచ్చు. ఇంటర్వ్యూ బోర్డులో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఐఏఎస్ ఆఫీసర్, సైకాలజిస్ట్, సంబంధిత దేశ రాయబార కార్యాలయ ఉద్యోగి ఉంటారు. చివరి దశను సదరు దేశంలో నిర్వహిస్తారు. స్కాలర్షిప్ వ్యవధి ఎంచుకున్న కోర్సును బట్టి ఉంటుంది. కొన్ని దేశాల్లో ప్రతిభ ఆధారంగా పొడిగింపు కూడా లభిస్తుంది. మరో కీలక అంశం..ఇటువంటి ప్రభుత్వ స్కాలర్షిలకు ఎంపికైన విషయాన్ని రెజ్యూమెలో ప్రస్తావించడం కెరీర్ ఉన్నతికి ఎంతగానో దోహదం చేస్తుంది. -డాక్టర్ కన్నెగంటి రమేశ్ బాబు, (ఇజ్రాయెల్ ప్రభుత్వ స్కాలర్షిప్తో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో పోస్ట్డాక్టోరల్ చేశారు) -
నయాక్రేజ్.. స్టడీ ఆబ్రాడ్
విదేశీ విద్యకు నానాటికీ క్రేజ్ పెరుగుతోంది. భారత్ నుంచి ప్రతిఏటా లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు పయనమవుతున్నారు. ప్రధానంగా అమెరికా, యునెటైడ్ కింగ్డమ్(యూకే), ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, న్యూజిలాం డ్లు విద్యార్థులకు హాట్ ఫేవరేట్గా మారాయి. వీటితోపాటు జర్మనీ, కెనడాల పట్ల కూడా మన విద్యార్థులు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆయా దేశాల్లో అత్యున్నత ప్రమాణాలను కలిగిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అందిస్తున్న కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండటం.. తద్వారా అవకాశాలు విస్తృతం అవుతుండటంతో విద్యార్థులు విదేశీ విద్యవైపు మొగ్గుచూపుతున్నారు. విదేశీ డిగ్రీకి భారత జాబ్ మార్కెట్లో ఉన్న డిమాండ్ కూడా విద్యార్థులు స్టడీ అబ్రాడ్ దిశగా పయనమయ్యేట్లు చేస్తోందంటున్నారు నిపుణులు. పీజీ, డాక్టోరల్ కోర్సులకు విదేశీ యూనివర్సిటీల్లో ఉన్న అధునాతన సౌకర్యాలు, ఫ్యాకల్టీ, పరిశోధనలకు ప్రోత్సాహం కూడా భారతీయ విద్యార్థులను అమితంగా ఆకర్షిస్తున్నాయని చెప్పొచ్చు. ఉన్నత విద్య కోసం మన సిటీ విద్యార్థులు అధిక సంఖ్యలో సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఆయా దేశాల్లో కోర్సులు, పేరున్న విద్యాసంస్థలు, ప్రవేశ పరీక్షలు, ఫీజులపై స్పెషల్ ఫోకస్.. మొదటి ఓటు.. అమెరికాకే ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. భారత్లోని మిగతా నగరాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు యూఎస్కు ఉన్నత విద్య కోసం వె ళ్తున్నట్లు తాజా సర్వే సైతం వెల్లడించింది. అక్కడ నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తుండడమే ఇందుకు కారణం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం.. అమెరికాకు విదేశీ విద్యార్థుల రాక భారీగా పెరుగుతోంది. అక్కడి విశ్వవిద్యాలయాల్లో 2012-13లో ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య 8,19,644. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 55 వేల మంది అధికంగా వచ్చారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయులే ఎక్కువగా ఉండడం గమనార్హం. తర్వాత స్థానాల్లో చైనా, కొరియా విద్యార్థులు ఉన్నారు. అగ్రరాజ్యంలో నాణ్యమైన మల్టీ డిసిప్లినరీ కోర్సులు అందుబాటులో ఉండడం అన్ని దేశాల విద్యార్థులను ఆకర్షిస్తోంది. స్టూడెంట్స్లోని అసలైన శక్తిసామర్థ్యాలను వెలికితీసి, సుశిక్షితులైన మానవ వనరులుగా తీర్చిదిద్దేలా ఆయా కోర్సులు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ మిట్, స్టాన్ ఫోర్డ్, యేల్, హార్వర్డ్, ప్రిన్స్టన్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, న్యూయార్క్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, మిచిగాన్ యూనివర్సిటీ వంటి టాప్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అమెరికాలో అండర్గ్రాడ్యుయేట్ కోర్సులకు కోర్సు ప్రారంభానికి ఏడాది నుంచి ఏడాదిన్నర ముందుగానే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 400 యూనివర్సిటీలు కామన్ అప్లికేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అమెరికా యూనివర్సిటీలకు దరఖాస్తుకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు వ్యయమవుతుంది. అండర్గ్రాడ్యుయేట్ కోర్సుకు ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ఉంటుంది. ఇతర ఖర్చులు అదనం. టోఫెల్, ఐఈఎల్టీఎస్, జీమ్యాట్, జీఆర్ఈ వంటి పరీక్షల్లో ప్రతిభ చూపాలి. ఆస్ట్రేలియా విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల జాబితాలో ముందు వరుసలో నిలుస్తున్న మరోదేశం... ఆస్ట్రేలియా. అక్కడ 1200 విద్యాసంస్థలు, 22 వేల రకాల కోర్సులు ఉన్నాయి. 2013 జూలై నుంచి 2014 మార్చి వరకు 24,205 మంది భారతీయ విద్యార్థులు అస్ట్రేలియా స్టూడెంట్ వీసాలను పొందారు. గతంలో పోలిస్తే ఇది 32.9 శాతం అధికమని ఆస్ట్రేలియన్ హై కమిషన్ ప్రతినిధి వెల్లడించారు. ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్సలాండ్, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ వంటి మంచి పేరున్న విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో విద్యాసంస్థలో ప్రవేశానికి, స్టూడెంట్ వీసా కోసం ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంచుకున్న యూనివర్సిటీని బట్టి దరఖాస్తుల తేదీలు వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరిలో ప్రారంభమై డిసెంబర్లో ముగుస్తుంది. ఈ దేశంలో అండర్గ్రాడ్యుయేట్ బ్యాచిలర్ డిగ్రీకి ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.8.5 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు అవుతుంది. జీవన వ్యయం దాదాపు రూ.10 లక్షలు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీల్లో చేరేందుకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టుల్లో అర్హత సాధించడం తప్పనిసరి. యునెటైడ్ కింగ్డమ్ ప్రపంచంలోని అనేక ఆధునిక ఇన్స్టిట్యూట్స్కు ప్రేరణ ఆక్స్ఫర్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలని చెబుతారు. అలాంటి ప్రఖ్యాత యూనివర్సిటీలు ఉన్న దేశమే యూకే. ఇక్కడ ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్లతోపాటు యూనివర్సిటీ కాలేజీ లండన్, ఇంపీరియల్ కాలేజీ లండన్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స, కింగ్స్ కాలేజీ లండన్ వంటి ప్రఖ్యాత కాలేజీలు ఉన్నాయి. యూకేలో దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్/అక్టోబర్ నుంచి జనవరిలోగా జరుగుతుంది. సెమిస్టర్ ప్రారంభానికి మూడు నెలలు ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం మేలు. యూకేలో విద్య ఖరీదైనదే. ఇక్కడ ట్యూషన్ ఫీజులు అధికంగానే ఉంటాయి. ప్రముఖ యూనివర్సిటీలో చదవాలంటే ఏడాదికి రూ.38 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇతర ఖర్చులు రూ.5 లక్షల వరకు ఉంటాయి. న్యూజిలాండ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోసం న్యూజిలాండ్కు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. గత ఐదేళ్లలో వీరి సంఖ్య 50 శాతం పెరిగింది. నిబంధనలు సరళంగా ఉండటం, ట్యూషన్ ఫీజులు తక్కువగా ఉండటంతో మన విద్యార్థులు న్యూజిలాండ్ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్ వర్సిటీలు ప్రతిఏటా స్థానం దక్కించుకుంటున్నాయి. ద యూనివర్సిటీ ఆఫ్ అక్లాండ్, యూనివర్సిటీ ఆఫ్ కాంటర్బెరీ, విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్, ఏయూటీ యూనివర్సిటీ, వైకాటో యూనివర్సిటీ, మాస్సీ యూనివర్సిటీ. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ట్యూషన్ ఫీజు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు. కాస్ట్ ఆఫ్ లివింగ్ రూ.7 లక్షలు ఉంటుంది. న్యూజిలాండ్లో ఒక విద్యా సంవత్సరంలో రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఫిబ్రవరి నుంచి జూన్, జూలై నుంచి నవంబర్. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య సమ్మర్స్కూల్ క్రెడిట్ కోర్సులను ఆఫర్ చేస్తారు. సెమిస్టర్లను బట్టి దరఖాస్తు చేసుకోవాలి. కోర్సు ప్రారంభానికి 8 నెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మేలు. ఫ్రాన్స్ స్టూడెంట్స్ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న మరోదేశం.. ఫ్రాన్స్. ఫ్యాషన్, బిజినెస్, హాస్పిటాలిటీ కోర్సులను అందించడంలో ఫ్రాన్స్కు మంచి పేరుంది. అక్కడ బెస్ట్ అకడమిక్ ఇన్స్టిట్యూట్స్ ఉండడం, తక్కువ ఫీజులు, సరళమైన వీసా నిబంధనలు, ఎన్నో రకాల స్కాలర్షిప్స్, కోర్సు పూర్తయిన తర్వాత కూడా ఏడాదిపాటు దేశంలోనే ఉండేందుకు అనుమతి... వంటి సానుకూల కారణాల నేపథ్యంలో గత ఐదేళ్లలో ఫ్రాన్స్కు వెళ్తున్న భారత విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. ఈ దేశంలో ఎకోలీ నార్మలీ సుపీరియరీ, ఎకోలీ పాలిటెక్నిక్, యూనివర్సిటీ ఫియరీ ఎట్ మేరీ క్యూరీ వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరిలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీసా కోసం మూడు నెలలు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. ఫ్రాన్స్లో ట్యూషన్ ఫీజు ప్రతి సెమిస్టర్కు రూ.50 వేలు. ఇతర ఖర్చులు రూ.24 వేల నుంచి రూ.49 వేల వరకు ఉంటుంది. ఎలాంటి ప్రవేశ పరీక్షలు రాయాల్సిన అవసరంలేదు. ముందస్తు ప్రణాళికతో సులభంగా ‘వీసా’.. ‘‘స్టడీ అబ్రాడ్ ఔత్సాహిక విద్యార్థులు వీలైనంత ముందుగా అడ్మిషన్కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకోవడం శ్రేయస్కరం. తర్వాత దశలో.. ఆఫర్ లెటర్, యాక్సప్టెన్స్ లెటర్ ఆధారంగా జారీ చేసే వీసా ప్రాసెస్ను విజయవంతంగా ముగించుకోవచ్చు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, కెనడా దేశాల్లోని ఇన్స్టిట్యూట్లలో చదవాలనుకునే విద్యార్థులు అడ్మిషన్ ప్రక్రియను అకడెమిక్ సెషన్ ప్రారంభానికి ముందు 12 నుంచి 8 నెలల సమయంలో మొదలుపెట్టాలి. దీనివల్ల అడ్మిషన్ లెటర్ సరైన సమయంలో చేతికందుతుంది. వీసా దరఖాస్తుకు తగిన సమయం అందుబాటులో ఉంటుంది. సాధారణంగా వీసా మంజూరుకు నాలుగు నుంచి ఆరు వారాల గడువు పడుతుంది. కాబట్టి అకడెమిక్ సెషన్ ప్రారంభానికి నెల రోజుల ముందు నాటికే వీసా చేతిలో ఉండే విధంగా మొత్తం ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఆఫర్ లెటర్ ఆధారంగా మంజూరు చేసే వీసా విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా యూఎస్ వీసా (ఐ-20) జారీ క్రమంలో ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో విద్యార్థి.. సదరు కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి తిరిగొస్తామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసే విధంగా సమాధానం ఇవ్వాలి. అంతేకాకుండా స్టడీ అబ్రాడ్ కోణంలో ఒక దేశాన్ని లక్ష్యంగా ఎంచుకున్న విద్యార్థులు తర్వాత దశలో తమకు సరితూగే ఇన్స్టిట్యూట్లను, యూనివర్సిటీలను అన్వేషించాలి. వాటికి సదరు ప్రభుత్వ నియంత్రణ సంస్థల గుర్తింపు ఉందో, లేదో క్షుణ్నంగా పరిశీలించాలి. గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం ఖరారైతేనే అడ్డంకుల్లేకుండా వీసా మంజూరవుతుంది’’ -అరుళ్ జోసఫ్, మేనేజర్, స్టడీ ఓవర్సీస్- గ్లోబల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ -
ఎస్సీల విదేశీ చదువుకు రూ.10 లక్షల సాయం
నేటినుంచి దరఖాస్తుల స్వీకారం.. గడువు 27 సాక్షి, హైదరాబాద్: విదేశాలకు వెళ్లి ఉన్నత వృత్తివిద్యా కోర్సులు పూర్తి చేయాలనుకునే షెడ్యూల్డు కులాల విద్యార్థులకు రూ.పది లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్చార్జి క మిషనర్ బి.ఉదయలక్ష్మి గురువారం ఒక ప్రకటన చేస్తూ ఎస్సీలకు చెంది, ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వారు మాత్రమే దరఖాస్తు చేయడానికి అర్హులని తెలిపారు. మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ తదితర వృత్తి విద్యాకోర్సులను అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్లలో అభ్యసిద్దామనే ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలకు మించి ఉండరాదన్నారు. పీజీ చేద్దామనుకునేవారు గ్రాడ్యుయేషన్లో ఉన్నత శ్రేణిలోను, పీహెచ్డీ చేయాలనుకునేవారు పీజీలో ఉన్నత శ్రేణిలోను ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆసక్తి క లిగిన అభ్యర్థులు శుక్రవారం నుంచి ఆన్లైన్లో www.apepass.cgg.gov.in ద్వారా అనుమతించిన ఫార్మాట్లో ధ్రువపత్రాలతోసహా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసేందుకు ఈ నెల 27 వతేదీ తుదిగడువుగా పేర్కొన్నారు. అందిన దరఖాస్తుల్లో అర్హులైన వారిని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సారథ్యంలోని రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక చేస్తుందని తెలిపారు. -
విదేశీ విద్య - వీసా ఎలా?
విదేశీ విద్య దిశగా ఆలోచించే ప్రతి విద్యార్థి దృష్టి వీసా మీదే. వీసా వస్తుందా? రాదా? మొదటి ప్రయత్నంలోనే వీసాను పొందాలంటే ఏయే విధానాలు పాటించాలి? దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుంది? దరఖాస్తులో ఏయే అంశాలను పొందుపరచాలి.. ఇలా ఎన్నో సందేహాలు.. ఈ నేపథ్యంలో వీసా ప్రక్రియ వివరాలు.. దరఖాస్తు ఇలా యూనివర్సిటీ అడ్మిషన్ లేదా కన్ఫర్మేషన్ లెటర్ అందిన వెంటనే వీసా ప్రక్రియను ప్రారంభించాలి. వీసా మంజూరు కోసం వర్సిటీలు ఇచ్చేఅడ్మిషన్ కన్ఫర్మేషన్ లెటర్ తప్పనిసరి. వీసా కోసం కోర్సు ప్రారంభానికి కనీసం మూడు నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి. మరికొన్ని దేశాలు ఆరునెలల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన విధించాయి. దరఖాస్తు చేసే ముందే సంబంధిత వివరాలన్నీ తెలుసుకోవాలి. ఆయా దేశాల రాయబార కార్యాలయాల్లో, కాన్సులేట్లలో వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా దేశాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించాయి. వీసాకు సంబంధించిన విధివిధానాలను సంబంధిత దేశ కాన్సులేట్కు ఫోన్ లేదా మెయిల్ చేసి తెలుసుకోవచ్చు. ముందుగా ఇంటర్వ్యూ వీసా కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు ముందుగా ఇంటర్వ్యూను ఎదుర్కోవాలి. వీసా ప్రక్రియలో దీన్ని చాలా ముఖ్య దశగా పరిగణించాలి. ఇంటర్వ్యూ ఇంతసేపు ఉంటుందని కచ్చితంగా చెప్పలేం. వ్యక్తులను బట్టి సమయం మారుతుంటుంది. కొన్ని సందర్భాల్లో పది నుంచి పదిహేను నిమిషాల్లో పూర్తవుతుంది. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. ఇంటర్వ్యూలో సాధారణంగా అకడెమిక్ రికార్డు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, భవిష్యత్ లక్ష్యాలు, ఎంచుకున్న కోర్సు వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలు ఈ విధంగా ఉండొచ్చు.. సంబంధిత దేశానికి (ఉదాహరణకు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా) ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎక్కడ ఉంటారు? ఎవరి దగ్గర ఉంటారు? {పస్తుతం మీ వృత్తి ? ఎన్నేళ్ల అనుభవం ఉంది? కోర్సు పూర్తయ్యాక స్వదేశానికి వెళతారా? భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? సరిపడా ఆర్థిక వనరులు ఉన్నాయా? నిర్ణయాత్మక అంశాలు వీసా ప్రాసెస్లో అకడెమిక్ రికార్డు కీలకపాత్ర పోషిస్తుంది. సంబంధిత ఎగ్జామ్స్లో చక్కని స్కోర్తోపాటు అకడెమిక్ రికార్డులో బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకోవాలి. బ్యాక్లాగ్స్ కారణంగా కొన్నిసార్లు వీసా మంజూరు చేయకపోవచ్చు. వీటికి సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. మన వాదన సహేతుకంగా ఉంటే వీసా మంజూరు చేస్తారు. వీసా పొందే క్రమంలో కీలకాంశం విద్యార్థి ఆర్థిక స్థోమత. వీసా మంజూరు చేసేందుకు సదరు విద్యార్థి ఆర్థిక స్థోమతను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నా రు. కోర్సు ఫీజు, సంబంధిత దేశంలో కోర్సు కాల వ్యవధిలో నివసించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయూ? లేవా? అనే విషయూలను కూడా వీసా మంజూరుకు ముందు పరిశీలిస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ ముఖ్యం ఉన్నతవిద్య దిశగా.. ప్రవేశ ప్రక్రియలో విజయం సాధించడం ఎంత ముఖ్యమో.. వీసా ఇంటర్వ్యూలో గట్టెక్కడం కూడా అంతే ముఖ్యం. ఇంట ర్వ్యూ విజయంలో బాడీ లాంగ్వేజ్ కీలకమైంది. మనం ఎంత స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇస్తున్నామనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారు. అందుకే ఇంటర్వ్యూలో ఎంతో అప్రమత్తంగా సమాధానాలివ్వాలి. ఆకట్టుకునే విధంగా సరళంగా, సూటిగా సమాధానం చెప్పాలి. మాట్లాడే తీరును బట్టి భాష మీద పట్టు ఉందనే విషయం స్పష్టం కావాలి. అడిగిన ప్రశ్నల పరిధి మేరకే సమాధానం చెప్పాలి. కోర్సు పూర్తయ్యాక ఉన్న అవకాశాల దృష్ట్యా స్వదేశానికి తిరిగి వస్తాం అనే సమాధానం చెప్పడం ఉత్తమం. వర్సిటీ ఎంపిక కీలకమే యూనివర్సిటీ ఎంపిక కూడా ఒక్కోసారి కీలకంగా మారుతుంది. కాబట్టి సరైన యూనివర్సిటీ, కోర్సును ఎంచుకోవాలి. ఉదాహరణకు 70 శాతం అకడెమిక్ రికార్డు ఉన్న విద్యార్థి.. 55 శాతం అకడెమిక్ రికార్డును పరిగణించే యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుంటే వీసా తప్పకుండా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కారణం తన ప్రతిభకు సరితూగే యూనివర్సిటీని ఎంచుకోకపోవడమే. ఇటీవలి కాలంలో నకిలీ యూనివర్సిటీల భాగోతం బయటకు వస్తున్న తరుణంలో సంబంధిత ఏజెన్సీల అక్రెడిటేషన్ఉన్న యూనివర్సిటీలనే ఎంచుకోవాలి. ఒక్కోసారి అక్కడి యూనివర్సిటీ/ఏదైనా సంస్థ మంజూరు చేసిన స్కాలర్షిప్ లభిస్తే.. వీసా పొందడానికి ఆ అంశం కూడా అడ్వాంటేజ్గా ఉంటుంది. రెండోసారి ఒకసారి వీసా రిజెక్ట్ అయినా.. పరిస్థితులకనుగుణంగా డాక్యుమెంట్స్, టెస్ట్ స్కోర్స్ సంబంధిత అంశాల్లో కొన్ని మార్పులు చేసి(ఉంటేనే).. మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రెండోసారి దరఖాస్తు చేసుకోవడం వల్ల అవకాశాలు తక్కువగా ఉంటాయని భావించడం సరికాదు. రెండోసారి కూడా మొదటిసారిగానే అవకాశాలు ఉండొచ్చు. అందుకు మొదటిసారి వీసా నిరాకరణకు గల కారణాలను సహేతుకంగా వివరించాలి. ఆ కారణాలను వీసా ఆఫీసర్ సమంజసం అని భావిస్తేనే ఇది సాధ్యం. గతంలో కంటే మెరుగైన ర్యాంక్ ఉన్న యూనివర్సిటీలో ప్రవేశం లభిస్తే.. ఆ యూనివర్సిటీ ప్రవేశ పత్రంతో వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీసా దరఖాస్తుకు కావాల్సిన ధ్రువ పత్రాలు పాస్పోర్ట్ వీసా దరఖాస్తు అడ్మిషన్/కన్ఫర్మేషన్ లెటర్ అకడెమిక్ అర్హతల ధ్రువ పత్రాలు కోర్సు ఫీజు రసీదులు నిర్దేశిత పరీక్షల (జీఆర్ఈ, టోఫెల్, జీమ్యాట్, ఐఈఎల్టీఎస్ తదితర) స్కోర్ కార్డులు ఆర్థిక స్థోమత ఉన్నట్లు రుజువు (ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్) సదరు విద్యార్థిని వేరే వ్యక్తులు స్పాన్సర్ చేస్తే.. సంబంధిత స్పాన్సర్ ఇచ్చే లెటర్, స్పాన్సరర్ ఐటీ స్టేట్మెంట్ ముఖ్యమైన వెబ్సైట్స్ www.gov.uk www.ustraveldocs.com www.ica.gov.sg www.immi.gov.au www.immigration.govt.nz www.immigration.ca/en/ -
విదేశీ విద్యకు ఉపకార వేతనాలు
విదేశాల్లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనే ఆకాంక్ష విద్యార్థులందరికీ ఉంటుంది. కానీ, ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోతే అది వాస్తవరూపం దాల్చదు. ఇలాంటివారికి ఉపకార వేతనాలు నిజంగా ఒక వరమేనని చెప్పుకొవచ్చు. స్కాలర్షిప్స్తో విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోవచ్చు. యూనివర్సిటీలు, విద్యాసంస్థలతోపాటు కొన్ని స్వచ్ఛంద, సామాజిక సంస్థలు కూడా ఉపకార వేతనాలను అందిస్తున్నాయి. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటునందించాలనే లక్ష్యంతో ఇవి పనిచేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకొనే ఔత్సాహిక విద్యార్థులకు అందుబాటులో ఉన్న కొన్ని స్కాలర్షిప్స్ గురించి తెలుసుకుందాం... ఇన్లాక్స్ శివ్దాసానీ ఫౌండేషన్ స్కాలర్షిప్ ఈ ఫౌండేషన్ రెండు రకాల ఉపకార వేతనాలను అందజేస్తోంది. అవి.. యూనివర్సిటీ స్పెసిఫిక్, కోర్సు స్పెసిఫిక్. అమెరికా, యూకేతోపాటు ఇతర యూరోపియన్ దేశాల్లోని ప్రఖ్యాత వర్సిటీల్లో చదివే విద్యార్థులకు రెండేళ్లపాటు వీటిని ఇస్తారు. పీహెచ్డీ విద్యార్థులకైతే నాలుగేళ్లపాటు అందజేస్తారు. అర్హతలు: నిర్దేశిత కోర్సులు మినహా మిగిలిన కోర్సులను అభ్యసించేవారికి ఈ ఉపకార వేతనం ఇస్తారు. 30ఏళ్లలోపు వయస్సున్నవారు అర్హులు. అభ్యర్థులు భారత్లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అకడమిక్ పరంగా మెరుగైన రికార్డు ఉండడంతోపాటు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను కలిగి ఉండాలి. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తును పూర్తిచేసి ఫౌండేషన్ చిరునామాకు పంపాలి. అభ్యసించబోయే కోర్సు, కళాశాల వివరాలను జతచేయాలి. తమ విద్యార్హతలు,నైపుణ్యాలకు సంబంధించిన సమాచారం పంపించాలి. ఎంపిక: షార్ట్లిస్టులో చోటు సంపాదించిన విద్యార్థులకు రెండు దశల్లో ఇంటర్వ్యూ నిర్వహించి, తుది విజేతలను ప్రకటిస్తారు. దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 15, 2014 వెబ్సైట్: www.inlaksfoundation.org ఐఈఎల్టీఎస్ స్కాలర్షిప్ విదేశాల్లో పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించే ఐఈఎల్టీఎస్ అభ్యర్థులకు బ్రిటిష్ కౌన్సిల్ ప్రతిఏటా ఉపకార వేతనాలను అందజేస్తోంది. ఒక్కొక్కరికి దాదాపు రూ.3లక్షల చొప్పున కేవలం ఎనిమిది మందికే ఈ స్కాలర్షిప్ ఇస్తారు. అర్హతలు: అభ్యర్థుల ఐఈఎల్టీఎస్ స్కోర్ కనీసం 6.0 ఉండాలి. బ్రిటిష్ కౌన్సిల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖా స్తును పూర్తిచేసి పంపాలి. ఐఈఎల్ టీఎస్ టెస్ట్ రిపోర్ట్తో పాటు నిర్దేశించిన ఇతర డాక్యుమెంట్లను కూడా జతచేయాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ఉండదు. షార్ట్లిస్టులో ఉన్న అభ్యర్థులు బ్రిటిష్ కౌన్సిల్ నిర్ణయించే ఒక సామాజిక అంశంపై ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అభ్యర్థుల భాషా పరిజ్ఞానం, ప్రజంటేషన్ స్కిల్స్ను పరీక్షిస్తారు. దరఖాస్తుల చివరి తేది: జూన్ 30, 2014 వెబ్సైట్: www.britishcouncil. in/ నరోత్తమ్ శెఖ్సారియా స్కాలర్షిప్ మెరుగైన అకడమిక్ రికార్డు ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ అందుకోవచ్చు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్యూర్ సెన్సైస్, అప్లయిడ్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, హ్యూమానిటీస్, లా, ఆర్కిటెక్చర్, మేనేజ్మెంట్లో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసే అభ్యర్థు లకు ఈ ఉపకార వేతనం ఇస్తారు. అర్హతలు: భారత్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 30 ఏళ్లలోపు వయస్సు ఉండాలి. దరఖాస్తు: ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక: షార్ట్లిస్ట్లో ఉన్న అభ్యర్థులకు వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు. వెబ్సైట్: http://pg.nsfoundation.co.in -
ఆర్జించు.. సముపార్జించు...
ఆర్థిక మాంద్య పరిస్థితులు, డాలర్తో రూపాయి మారకం విలువ తగ్గడం వంటి కారణాలతో విదేశీ విద్య.. భారతీయ విద్యార్థికి భారంగా మారుతోంది. కాబట్టి విదేశాల్లో అందుబాటులో ఉన్న పార్ట్టైమ్ జాబ్స్.. ఆయా యూనివర్సిటీలు వారానికి ఎన్నిగంటలు జాబ్ చేసుకునే వెసులుబాటు ఇస్తాయి? తదితర అంశాల గురించి తెలుసుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులువుగా గట్టెక్కొచ్చు. అమెరికా: ఎఫ్-1 వీసాతో అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థులకు కోర్సు మొదటి ఏడాదిలో ఆఫ్ క్యాంపస్ జాబ్ చేసుకునేందుకు అనుమతి ఉండదు. సంబంధిత అధికారి ప్రత్యేక అనుమతి ఇస్తేనే జాబ్ చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్.. కోర్సు మొదటి ఏడాది పూర్తయ్యాక ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వొచ్చు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే వారానికి 20 గంటలపాటు ఆన్ క్యాంపస్ జాబ్ చేసుకోవచ్చు. సెలవుల్లో వారానికి 40 గంటల వరకూ ఆన్ క్యాంపస్ ఉద్యోగం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బ్రిటన్: బ్రిటన్లో బ్యాచిలర్ కోర్సులు, అంతకంటే ఉన్నతస్థాయి కోర్సుల్లో చేరిన విదేశీ విద్యార్థులు.. కాలేజీ జరుగుతున్నప్పుడు వారానికి 20 గంటల వరకు జాబ్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. సెలవుల్లో అయితే ఫుల్టైమ్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ కంటే కింది స్థాయి కోర్సుల్లో చేరిన విద్యార్థులు తరగతులు జరుగుతున్నప్పుడు వారానికి 10 గంటలు ఉద్యోగం చేసుకునే వీలుంది. సింగపూర్: చదువు కోసం వచ్చిన విద్యార్థులకు కోర్సు తరగతులు జరుగుతున్నప్పుడు, సెలవుల్లో ఉద్యోగం చేసుకునేందుకు ఎంప్లాయిమెంట్ ఆఫ్ ఫారిన్ మ్యాన్పవర్ ప్రత్యేకంగా వర్క్పాస్ ఎగ్జమ్షన్ ఇస్తే పార్ట్టైమ్ జాబ్ చేసుకునే వీలుంటుంది. కొన్ని స్కూల్స్లో మాత్రం 14 ఏళ్ల వయసు దాటిన వారికి వర్క్పాస్ ఎగ్జమ్షన్ అవసరం ఉండదు. ఈ స్కూల్స్లో సెలవుల్లో ఉద్యోగం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా: విదేశీ విద్యార్థులకు వర్క్పర్మిట్ విషయంలో వెసులుబాటు బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక్కడి యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు తరగతులు జరుగుతున్నప్పుడు 15 రోజులకు 40 గంటలపాటు జాబ్ చేసుకోవచ్చు. అదే సెలవుల్లో అయితే ఎన్నిగంటలైనా పార్ట్టైమ్ ఉద్యోగం చేసుకునే వీలుంటుంది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన వారికి ఉన్న మరో వెసులుబాటు ఏమంటే.. పోస్ట్గ్రాడ్యుయేట్ రీసెర్చ్ విద్యార్థులకు సంబంధించి ఇన్ని గంటలే పని చేయాలనే నియంత్రణ ఏమీ లేదు. కెనడా: పబ్లిక్ యూనివర్సిటీలు, కమ్యూనిటీ కాలేజీలు, ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో చేరిన విద్యార్థులు ఎలాంటి వర్క్ పర్మిట్ లేకుండానే తమ క్యాంపస్లలో వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు. కోర్సులో చేరిన ఇన్స్టిట్యూట్ కోసం, ఆ ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో ఏర్పాటైన ప్రైవేట్ బిజినెస్లో విదేశీ విద్యార్థులు పార్ట్టైమ్ జాబ్ చేసుకునే వీలుంటుంది. ఆఫ్ క్యాంపస్ వర్క్పర్మిట్ ప్రోగ్రామ్ ద్వారా విదేశీ విద్యార్థులు రెగ్యులర్ అకడెమిక్ సెషన్ సమయంలో వారానికి 20 గంటలు పనిచేసుకోవచ్చు. వేసవి, శీతాకాల సెలవులప్పుడు ఎన్నిగంటలైనా జాబ్ చేసుకోవచ్చు. -
విదేశీ విద్యపై అవగాహన పెంచుకోవాలి
మొయినాబాద్, న్యూస్లైన్: విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడి ప్రదేశాలు, విశ్వవిద్యాలయాలపై అవగాహన పెంచుకోవాలని గ్యానె డాట్కామ్ ప్లానింగ్ హెడ్ సీఈఓ జయ్ ఈపెన్ అన్నారు. మండలంలోని హిమాయత్నగర్లోని అభినవ్ హైటెక్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ‘విదేశీ విద్య- ఉత్తమ ఎంపిక’ అంశంపై చివరి సంవత్సరం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ.. విదేశీ దౌత్య మర్యాదలు, నిర్వహణ నియమాలకు సంబంధించిన అంశాలను విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం గురించి తెలుసుకోవాలన్నారు. విద్యార్థులకు అవసరమైన సమాచారమంతా ఇటర్నెట్లో అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. ప్రైవేటు కన్సల్టెన్సీల మాయమాటలు నమ్మవద్దని, వాటి మోసపూరిత ప్రకటనలతో మోసపోవద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం నార్వే, ఆస్ట్రియన్ యూనిువర్సిటీలకు మంచి పేరు ప్రఖ్యాతులున్నాయని నార్వేలోని జోవిక్ యూనివర్సిటీ అధ్యాపకుడు ప్రొఫెసర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐలెట్స్ తదితర పోటీ పరీక్షలకు విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరం నుంచే సిద్ధం కావాలన్నారు. సదస్సులో ప్రిన్స్టన్ రివ్యూమానియా హెడ్ ఫజల్ హాసన్, కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ భాస్కరన్, మేనేజర్ మృణాల్ చక్రవర్తి, గ్యానెడాట్కామ్ వైస్ ప్రెసిడెంట్ శశికిరణ్, అభినవ్ హైటెక్ ఇంజినీరింగ్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సునంద యాదవ్, హెచ్ఓడీ కృష్ణప్రియ, ప్లేస్మెంట్ అధికారి శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు విదేశీ విద్య
చింతలపూడి, న్యూస్లైన్: అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు విదేశీ విద్యను అందించనున్నట్టు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. చింతలపూడి బాలికల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విదేశీ కళాశాలల్లో ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ కోర్సుల ప్రవేశం కోసం దరఖాస్తు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు రుణం అందించే అవకాశం ఉందన్నా రు. అవసరమైతే మరో రూ.5 లక్షలు అందజేస్తామని చెప్పా రు. పథకంలో భాగంగా రాష్ట్రంలో ఈ ఏడాది 500 మంది విద్యార్థులను విదేశాలకు పంపారన్నారు. రూ. 2 లక్షల సంవత్సర ఆదాయం ఉన్న కుటుంబాల్లోని విద్యార్థులు పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా నుంచి ఈ ఏడాది ఇద్దరు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. జిల్లాకు నాలుగు కళాశాల హాస్టళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు చెందిన 1,022 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో వీరికి స్టడీ క్యాంపుల నిర్వహణ ఆలస్యమైందని.. వచ్చేనెల మొదటి వారంలోపు క్యాంపులు ప్రారంభించాలని ఆదేశించినట్టు తెలిపారు. వసతి గృహాల మరమ్మత్తులకు జిల్లాలో రూ.4.70 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. ఈ నిధుల్లో రూ. 2.70 కోట్లు మరమ్మత్తులకు, మిగిలినవి మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఏఎస్డబ్ల్యువో జీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. -
విదేశీ విద్యకు చేయూతనిచ్చే.. స్కాలర్షిప్లు
విదేశీ విద్య.. సన్నాహాల్లో భాగంగా విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించే అంశాల్లో స్కాలర్షిప్స్ ఒకటి. ఈ దిశగా ఇన్స్టిట్యూట్షనల్ స్కాలర్షిప్స్ విద్యార్థులకు ఎంతో చేయూతనిస్తాయి. ఇటీవలి ఆర్థిక మాంద్యం కారణంగా ఈ తరహా స్కాలర్షిప్ల సంఖ్య తగ్గుతోంది. ట్యూషన్ ఫీజు మొదలు కోర్సు కాల వ్యవధిలో అవసరమయ్యే అన్ని ఖర్చులూ అందిస్తున్నారుు. మన దేశంలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కూడా పలు దేశాలతో కల్చరల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం పేరుతో స్కాలర్షిప్ల విషయంలో చేయూతనిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ స్కాలర్షిప్ల వివరాలు... గవర్నమెంట్ స్కాలర్షిప్స్: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో స్కాలర్షిప్లను అందిస్తున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా ఆయా దేశాలు భారతీయ విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. భారత ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ సంబంధిత స్కాలర్షిప్ల ఎంపిక కోసం విధి విధానాలను రూపొందిస్తుంది. ఈ జాబితాలో యూకే, న్యూజిలాండ్, చైనా, బెల్జియం, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, చెక్ రిపబ్లిక్, కొరియా, మెక్సికో, నార్వే, టర్కీ, స్లోవేకియా దేశాలు ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులు ఈ దేశాల్లో నిర్దేశిత విభాగాల్లో పీజీ, పీహెచ్డీ, షార్ట్ టర్మ్ కోర్సులు చేయవచ్చు. వివరాలకు: www.education.nic.in యూకే ఇక్కడ విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు కామన్వెల్త్ స్కాలర్షిప్స్ ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయి. మెడిసిన్, క్యాన్సర్ రీసెర్చ్, కార్డియూలజీ, గైనకాలజీ, డెంటిస్ట్రీ విభాగాల్లో పీజీ, పీహెచ్డీ చేసే వారికి.. ఇంజనీరింగ్, సైన్స్, వ్యవసాయం అనుబంధ శాస్త్రాలు, హ్యుమానిటీస్, సోషల్సైన్స్ ఔత్సాహికులకు ఈ స్కాలర్షిప్లు మంజూరు చేస్తారు. పీజీ విద్యార్థులకు ఏడాదిపాటు, పీహెచ్డీ వారికి మూడేళ్లు ఈ స్కాలర్షిప్ను అందిస్తారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ- సెయింట్ జాన్స్ కాలేజీలో చేరే విద్యార్థుల కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, సోషల్ సైన్స్ విభాగాల్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోషిప్ అందజేస్తారు. ఇవే కాకుండా బ్రిటిష్ చెన్వెనింగ్ స్కాలర్షిప్స్, రోడ్స్ స్కాలర్షిప్స్, చార్లెస్ వాలేస్ స్కాలర్షిప్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. వివరాలకు: www.educationuk.org యూఎస్ఏ విదేశీ విద్య దిశగా ఆలోచిస్తున్న ప్రతి విద్యార్థి ఆలోచన యూఎస్ఏ చూట్టూ ఉంటుంది. ఈ దేశానికి సంబంధించి అందుబాటులో ఉన్న స్కాలర్షిప్స్ను పరిశీలిస్తే.. ఇన్ల్యాక్స్ స్కాలర్షిప్ (www.inlaksfoundation. org)అమెరికాలో (ఐరోపాలో కూడా) రెండేళ్లపాటు ఉన్నత విద్యనభ్యసించాలనుకునే వారికి ఈ స్కాలర్షిప్లు అందజేస్తారు. ఫుల్బ్రైట్ నెహ్రూస్ మాస్టర్స్ ఫెలోషిప్ ఫర్ లీడర్షిప్ డెవలప్మెంట్ (www.usief.org.in/scripts).. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కమ్యూనికేషన్ స్టడీస్, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ప్రొఫెషనల్ స్టడీస్ అభ్యసించాలనుకునే వారికి ఈ ఫెలోషిప్ అందజేస్తారు. కొలంబియా యూనివర్సిటీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్, రోటరీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వివరాలకు: www.scholars4dev.com ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియాలో అందుబాటులో ఉన్న స్కాలర్షిప్లు.. ఎండీవర్ అవార్డ్స్: ఆసియా- పసిఫిక్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల విద్యార్థుల కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహిస్తున్న మెరిట్-బేస్డ్ స్కాలర్షిప్ ప్రోగ్రాం ఇది. ఆస్ట్రేలియాలో రీసెర్చ్, విద్యాభ్యాసం, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సులు చదివేవారు దీనికి అర్హులు. ఈ అవార్డులు వొకేషనల్, డిప్లొమా కోర్సులు మొదలు రీసెర్చ్, డాక్టోరల్ ప్రోగ్రాంల వరకు అందుబాటులో ఉంటాయి. ఆస్ట్రేలియన్ లీడర్షిప్ అవార్డ్స్: సామాజిక, ఆర్థిక విభాగాలకు చెందిన కోర్సుల్లో చేరే ఆసియా- పసిఫిక్ ప్రాంత విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆస్ట్రేలియన్ డెవలప్మెంట్ స్కాలర్షిప్స్: ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉన్న దేశాలకు చెందిన విద్యార్థులు వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటితోపాటు కామన్వెల్త్ సభ్యదేశాలకు చెందిన విద్యార్థులకు వరల్డ్ బ్యాంక్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యునెటైడ్ నేషన్స్, రోటరీ ఇంటర్నేషనల్ సంస్థలు పలు స్కాలర్షిప్ సదుపాయాలను కల్పిస్తున్నాయి. వివరాలకు: www.studyinaustralia.gov.au సింగపూర్ సింగపూర్లో స్కాలర్షిప్ పొందిన అంతర్జాతీయ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, కొంతమేర నివాస ఖర్చులు, బుక్ అలవెన్స్, కంప్యూటర్ అలవెన్స్లని అందిస్తున్నారు. ఇక్కడ అందుబాటులో ఉన్న స్కాలర్షిప్లు.. ఏషియాన్ స్కాలర్షిప్: ఏషియాన్ సభ్య దేశాలకు చెందిన విద్యార్థులు సింగపూర్లో చదువుకునేందుకు ఈ స్కాలర్షిప్ తోడ్పడుతుంది. ట్యూషన్ఫీజు, నివాస ఖర్చులు లభిస్తాయి. డీఎఫ్ఎస్ స్కాలర్షిప్: విద్యార్థులు గత పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఫారెన్ స్టూడెంట్స్ ఎండోవ్డ్ స్కాలర్షిప్: నాలుగేళ్ల కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఏడాదికి 4.5 వేల సింగపూర్ డాలర్లు లభిస్తాయి. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ట్రాక్ స్కాలర్షిప్: సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ కోర్సులు చదివే విద్యార్థులకు ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎస్ఎంయూ స్కాలర్షిప్: నాలుగేళ్ల కోర్సుల్లో చేరిన వారికి ట్యూషన్ ఫీజు, క్యాష్ అలవెన్స్ లభిస్తుంది. యూనివర్సిటీ స్టడీ అవార్డ్స్: వీటిని సింగపూర్లోని ప్రభుత్వ యూనివర్సిటీలు తమ ఇన్స్టిట్యూట్లలో చేరిన విద్యార్థులకు మాత్రమే అందిస్తుంటాయి. ఇవేకాక.. జూనియర్ కాలేజ్ (ప్రీ-యూనివర్సిటీ) స్థాయిలో చేరాలనుకునే విద్యార్థులకు ఎస్ఐఏ యూత్ స్కాలర్షిప్, ఎ-స్టార్ ఇండియా యూత్ స్కాలర్షిప్, ఏషియాన్ స్టూడెంట్ స్కాలర్షిప్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వివరాలకు: www.moe.gov.sg కెనడా కెనడాలో డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్ విద్యార్థులకు ఆర్థిక చేయూతనందిస్తోంది. టీచింగ్ లేదా రీసెర్చ్ అసిస్టెన్స్ పేరిట ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ప్రోగ్రాంను ప్రారంభించింది. వీటితో పాటు రోటరీ ఫౌండేషన్ స్కాలర్షిప్, నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా రీసెర్చ్ అసోసియేట్షిప్, సౌవే స్కాలర్స్ ప్రోగ్రాం, భారత మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్కాలర్షిప్లు కూడా కెనడాలో పరిశోధనకు వెళ్లే వారికి లభిస్తున్నాయి. ఇవి కాకుండా ఇతర స్కాలర్షిప్స్: రీసెర్చ్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్స్ (www. sshrccrsh.gc.ca): సోషల్ సెన్సైస్ అండ్ హ్యుమానిటీస్ కౌన్సిల్ అందిస్తున్న ఈ స్కాలర్ షిప్ను అందుకోవడానికి హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్లో పరిశోధన చేసే అభ్యర్థులు అర్హులు. కెనడా ఆసియా-పసిఫిక్ అవార్డ్స్ : ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు చెందిన విద్యార్థులు.. కెనడా యూనివర్సిటీల్లో రీసెర్చ్ చేయడానికి వీలుగా ఈ స్కాలర్షిప్ తోడ్పడుతోంది. కెనడా సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక వ్యవస్థలపై పరిశోధనలకు స్కాలర్షిప్ మంజూరులో అధిక ప్రాధాన్యమిస్తారు. డాక్టోరల్ స్టూడెంట్ రీసెర్చ్ అవార్డ్స్: కెనడా ఆర్థిక, రాజకీయ, సాంఘిక, అంశాలపై పరిశోధన చేయాలనుకునే వారికి ఈ స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. వేనియర్ కెనడా గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్: సోషల్ సెన్సైస్, నేచురల్ సెన్సైస్, ఇంజనీరింగ్, హెల్త్ స్టడీస్లో పరిశోధనలకు ప్రవేశపెట్టిన ప్రోగ్రాం ఇది. వివరాలకు: www.educationauincanada.ca న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ డాక్టోరల్ రీసెర్చ్ స్కాలర్షిప్స్: సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ విభాగాల్లో పరిశోధనలు చేసే వారికి ఈ స్కాలర్షిప్లు లభిస్తున్నాయి. విద్యార్థుల అకడెమిక్ కెరీర్ మెరిట్ ఆధారంగా వీటిని మంజూరు చేస్తారు. లెర్న్ ఫెలోషిప్స్: న్యూజిలాండ్ ప్రభుత్వం 2007 నవంబర్లో ప్రారంభించిన పథకమే ఈ ‘లెర్న్ ఫెలోషిప్’ ప్రోగ్రాం. గ్రీన్హౌస్ వాయువులు, సంబంధిత అంశాలపై పరిశోధనలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఫెలోషిప్లను ప్రారంభించారు. వివరాలకు: www.newzealandeducated.com జపాన్ జపాన్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్, క్వాలిటీ అండ్ రిలయబిలిటీ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, లేజర్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, జపనీస్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఫిషరీస్, జపనీస్ స్టడీస్, ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల్లో పీహెచ్డీ చేయాలనుకునే వారికి మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ స్కాలర్షిప్లను అందిస్తుంది. వివరాలకు: www.education.nic.in స్టడీ అబ్రాడ్ జర్మనీ ఔత్సాహికులకు ఎన్నో స్కాలర్షిప్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక సంస్థలు, రాజకీయ పార్టీలు ‘ప్రమోషన్ ఆఫ్ టాలెంట్’ పేరుతో ఈ అవకాశాలను అందిస్తున్నాయి. డీఏఏడీ (DAAD) స్కాలర్షిప్స్: ఈ స్కాలర్షిప్లను జర్మన్ అకడమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ అందిస్తోంది. డాక్టోరల్ స్టడీస్ అభ్యర్థులకు ఫెలోషిప్స్, పీహెచ్డీ స్కాలర్స్కు శాండ్విచ్ మోడల్ ఫెలోషిప్స్, పీహెచ్డీ రిజిస్టర్డ్ స్కాలర్స్కి ఫెలోషిప్స్ అందిస్తారు. వీటితోపాటు కొన్ని నిర్దేశిత పీజీ కోర్సుల విద్యార్థులకు కూడా వీటిని అందిస్తారు. కొన్రాడ్ అడన్యూర్ ఫౌండేషన్: పీహెచ్డీ చేసే విద్యార్థులకు ఇవి లభిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల్లో పరిశోధకులకు స్కాలర్షిప్ మంజూరులో ప్రాధాన్యతనిస్తారు వెబ్సైట్: www.kas.deఫ్రెడ్రిచ్ నౌమన్ ఫౌండేషన్: ఫ్రీ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీకి అందించే ఈ స్కాలర్షిప్ను యూనివర్సిటీ డిగ్రీ కోసం అడుగుపెట్టే విదేశీ విద్యార్థులకు అందజేస్తారు. హాన్స్ బాక్లెర్ ఫౌండేషన్: అన్ని విభాగాల విద్యార్థులకు స్కాలర్షిప్లు లభిస్తాయి. పని అనుభవం ఉన్న వారికి మరింత ప్రాధాన్యం. వివరాలకు:www.studyin.de యూరోపియన్ యూనియన్ దేశాల్లో పీజీ మొదలు, పీహెచ్డీ వరకు స్కాలర్షిప్ అందించేది ఎరాస్మస్ ముండస్ స్కాలర్షిప్స్. దీని ద్వారా యూరోపియన్ యూనియన్ దేశాల్లోని 103 పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. వివరాలకు: www.ec.europa.eu ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో ఉన్నత విద్య కోసం ఐఈఎల్టీఎస్ స్కాలర్షిప్ను బ్రిటిష్ కౌన్సిల్ అందజేస్తుంది. వివరాలకు: www.britishcouncil.in పపంచవ్యాప్తంగా 9వేల ఇన్స్టిట్యూట్లలో ఉన్నత విద్య కోసం టోఫెల్ (ఖీైఊఉఔ) స్కాలర్షిప్ను ఈటీఎస్ (ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్) సంస్థ అందజేస్తుంది. వివరాలకు: www.ets.org విదేశాల్లో ఇంజనీరింగ్, నేచురల్ సెన్సైస్, హ్యుమానిటీస్, మెడిసిన్, బిజినెస్ మేనేజ్మెంట్, మిలటరీ, నేవల్ అండ్ ఏవియేషన్ సైన్స్ విభాగాల్లో పీజీ కోర్సు చేయాలనుకునే వారికి కె.సి. మహీంద్రా స్కాలర్షిప్లు చేయూతనిస్తాయి. వివరాలకు: www.mahindra.com ఐటీసీ సంస్థ బిజినెస్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ సంబంధిత కోర్సుల్లో పీజీ లేదా ఆపై స్థాయి కోర్సుల్లో ప్రవేశం కోరుకునే వారికి వీటిని అందిస్తారు. ఎంపికైన వారికి ఏడాదికి లక్ష రూపాయలు చొప్పున రెండేళ్లపాటు స్కాలర్షిప్ అందజేస్తారు. ప్యూర్ సైన్స్, అప్లయిడ్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, లా, హ్యుమానిటీస్, ఆర్కిటెక్చర్, మేనేజ్మెంట్ విభాగాల్లో పీజీ చేయాలనుకునే విద్యార్థులు నారోత్తమ్ సెక్సారియా ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి సంవత్సరానికి గరిష్టంగా పది లక్ష రూపాయల వరకు అందజేస్తారు. వివరాలకు:www.nsscholarship.net దేబేష్ కమల్ స్కాలర్షిప్: హ్యుమానిటీస్, బేసిక్ సెన్సైస్, అప్లయిడ్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, టెక్నాలజీ విభాగాల్లో పీజీ చేయాలనుకునే విద్యార్థులకు. వివరాలకు: www.sriramakrishna.org జేఎన్ టాటా ఎండోమెంట్ స్కాలర్షిప్స్: అన్ని రకాల విభాగాల్లో షార్ట్టర్మ్ కోర్సుల నుంచి డాక్టోరల్ స్టడీస్ వరకు ఈ స్కాలర్షిప్ అందజేస్తారు. ఎంపికైన వారికి కోర్సును బట్టి లక్షన్నర రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు అందజేస్తారు. వివరాలకు: www.dorabjitatatrust.org ఉపయోగపడే వెబ్సైట్స్: www.scholarshipsinindia.com www.scholarshippositions.com www.scholarships.com www.scholarshipnet.info www.studyabroadfunding.org www.eastchance.com www.financialaidtips.org -
సమగ్ర సన్నాహాలతో విదేశీ విద్య..
జి. ఆరుళ్ జోసెఫ్, హైదరాబాద్. విదేశీ విద్య.. ప్రతి విద్యార్థి కల.. గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం పొరుగింటికి వెళ్లొచ్చినంత సులువుగా మారింది.. జాబ్ మార్కెట్లో ఫారెన్ డిగ్రీకి డిమాండ్, తల్లిదండ్రుల ప్రోత్సాహం, బ్యాంకులు సైతం సులువుగానే రుణాలను మంజూరు చేస్తుండడంతో.. విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య రెట్టింపవుతోంది.. ఈ నేపథ్యంలో మన విద్యార్థులకు టాప్ డెస్టినేషన్స్గా నిలుస్తోన్న దేశాలు, అడ్మిషన్ విధివిధానాలు తదితర అంశాలపై ఫోకస్.. యూఎస్ఏ అడ్మిషన్ సెషన్: ఫాల్ (ఆగస్ట్), స్ప్రింగ్ (జనవరి), సమ్మర్ (మే/జూన్). ఇందులో ఫాల్, స్ప్రింగ్ సెషన్లలోనే అక్కడి యూనివర్సిటీలు అధిక శాతం అడ్మిషన్లను స్వీకరిస్తాయి. సమ్మర్ సెషన్లో తక్కువ శాతంలోనే అడ్మిషన్లు జరుగుతాయి. టోఫెల్, జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్తోపాటు కొత్తగా వచ్చిన పీటీఈ (పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్) పరీక్షల స్కోర్ల ఆధారంగా అక్కడి యూనివర్సిటీలు ప్రవేశం కల్పిస్తున్నాయి. వీటిల్లో ఎంఎస్ కోర్సులకు టోఫెల్/ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ స్కోర్ తప్పనిసరి. బ్యాచిలర్ కోర్సులకు-టోఫెల్, సాట్ స్కోర్ ఉండాలి. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ తప్పనిసరి. యూఎస్ వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం మంది కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, బయోటెక్నాలజీ, ఎంబీఏ, బయాలాజికల్ సెన్సైస్ కోర్సుల్లో చేరుతున్నారు. వసతి విషయానికొస్తే సాధారణంగా యూనివర్సిటీ క్యాంపస్లలోనే వసతి సౌకర్యం లభిస్తుంది. ఈ సౌకర్యం లభించని వారికి అక్కడి వర్సిటీల్లో ఉండే ఇండియన్ స్టూడెంట్స్ లేదా అసోసియేషన్స్ను సంప్రదించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవచ్చు. అమెరికాలో యూనివర్సిటీ క్యాంపస్లలోనే పార్ట్టైమ్ జాబ్ చేసే వెసులుబాటు ఉంటుంది. వారానికి 20 గంటలపాటు పార్ట్ టైమ్ జాబ్ చేయవచ్చు. లివింగ్ కాస్ట్ సంవత్సరానికి 12 వేల యూఎస్ డాలర్లు. అమెరికా వీసా పొందే క్రమంలో ఆ దేశ కాన్సులేట్ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఇందుకోసం ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. అమెరికాలో ఫీజులు.. చదువుతున్న స్ట్రీమ్ను బట్టి 10 వేల నుంచి 25 వేల డాలర్ల మధ్యలో ఉంటాయి. నెలకు 600 నుంచి 1500 డాలర్ల వరకు ఖర్చవుతుంది. వెబ్సైట్: www.usa.gov ఆస్ట్రేలియా అడ్మిషన్ సెషన్: ఫిబ్రవరి/మార్చి, జూలై, నవంబర్. ఇందులో అధిక శాతం అడ్మిషన్లు ఫిబ్రవరి/మార్చి, జూలై సెషన్లలో పూర్తవుతాయి. నవంబర్ సెషనల్లో మాత్రం స్వల్ప సంఖ్యలోనే మాత్రమే అడ్మిషన్లను అక్కడి యూనివర్సిటీలు స్వీకరిస్తాయి. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు ఐఈఎల్టీఎస్ (6.5/9) స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్, టోఫెల్ స్కోర్ అవసరం. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు మూడు సెషన్లుగా అడ్మిషన్ల ప్రక్రియను చేపడతాయి. ఆస్ట్రేలియాకు సంబంధించి సెన్సైస్ (కంప్యూటర్, ఐటీ), ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్/మెకానికల్), ఏవియేషన్, ఎంబీఏ అక్కడికి పాపులర్ కోర్సులు. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. రెండు వారాల్లో(15 రో జులు) 40 గంటలు పార్ట్ టైమ్ జాబ్ చేసే వెసులుబాటును ఆస్ట్రేలియన్ వర్సిటీలు కల్పించాయి. ఆస్ట్రేలియా కాన్సులేట్లోని డ్రాప్బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. ఆస్ట్రేలియాలో యూజీ కోర్సులకు 10,000 నుంచి 16,500 ఆస్ట్రేలియన్ డాలర్లు, పీజీ కోర్సులకు 9,000 నుంచి 18,500 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించాలి. నెలవారీ ఖర్చు.. 1,500 ఆస్ట్రేలియన్ డాలర్లు. వెబ్సైట్: www.studyinaustralia.gov.au యూకే అడ్మిషన్ సెషన్: సెప్టెంబర్/అక్టోబర్, ఫిబ్రవరి/మార్చి లేదా ఏప్రిల్/జూన్. ఇందులో అధిక శాతం అడ్మిషన్లు సెప్టెంబర్/అక్టోబర్ సెషన్లలో పూర్తవుతాయి. ఫిబ్రవరి/ మార్చి లేదా ఏప్రిల్/జూన్ సెషన్లో మాత్రం స్వల్ప సంఖ్యలోనే అడ్మిషన్లను అక్కడి యూనివర్సిటీలు స్వీకరిస్తాయి. యూకే యూనివర్సిటీలు ఐఈఎల్టీఎస్ (6.5/9), టోఫెల్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్త్తున్నాయి. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ అవసరం. యూకేకు వెళ్లే విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది ఎంబీఏ, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సెన్సైస్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. యూకే వర్సిటీలు వారానికి 20 గంటలపాటు పార్ట్టైమ్ జాబ్ చేసే వెసులు బాటును కల్పించాయి. యూకే కాన్సులేట్లోని డ్రాప్బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. యూకేలో ఫీజు.. యూజీ కోర్సులకు 9,500 యూరోలు, పీజీ కోర్సులకు 12,000 పౌండ్లు, ఎంబీఏ కోర్సుకు 15,000 యూరోలు. నెలవారీ ఖర్చు 600 నుంచి 1,000 యూరోల మధ్యలో ఉంటుంది. వెబ్సైట్:www.educationuk.org కెనడా అడ్మిషన్ సెషన్: సెప్టెంబర్/అక్టోబర్, జనవరి, మార్చి. ఇందులో అధిక శాతం అడ్మిషన్లు సెప్టెంబర్/అక్టోబర్, జనవరి సెషన్లలో పూర్తవుతాయి. మార్చి సెషన్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు మాత్రమే అడ్మిషన్లను స్వీకరిస్తాయి. కెనడా యూనివర్సిటీలు ఐఈఎల్టీఎస్ (6.5/9) స్కోర్తో ప్రవేశం కల్పిస్తున్నాయి. పీజీ డిప్లొమా కోర్సులకు మాత్రమే జీఆర్ఈ స్కోర్ తప్పనిసరి. ఇంజనీరింగ్, సెన్సైస్, మేనేజ్మెంట్ కోర్సులను అత్యధిక మంది విద్యార్థులు ఎంచుకుంటున్నారు. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. కెనడాలో పార్ట్టైమ్ జాబ్ చేయాలంటే మాత్రం వర్క్ పర్మిట్ తప్పనిసరి. ఆ దేశ కాన్సులేట్లోని డ్రాప్బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. వెబ్సైట్: www.cic.gc.ca ఐర్లాండ్ అడ్మిషన్ సెషన్: సెప్టెంబర్, ఫిబ్రవరి ఇందులో అధిక శాతం అడ్మిషన్లు సెప్టెంబర్ సెషన్లో పూర్తవుతాయి. ఫిబ్రవరి సెషన్లో మాత్రం స్వల్ప సంఖ్యలో మాత్రమే అడ్మిషన్లను అక్కడి యూనివర్సిటీలు స్వీకరిస్తాయి. ఐర్లాండ్ ఇన్స్టిట్యూట్లు ఐఈఎల్టీఎస్ (6.5/9) స్కోర్తో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఐర్లాండ్కు వెళ్లే విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎంబీఏ, సెన్సైస్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వారానికి 20 గంటలపాటు పార్ట్టైమ్ జాబ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ దేశ కాన్సులెట్లోని డ్రాప్బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీ సం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. వెబ్సైట్:www.thecompleteuniversityguide.co.uk న్యూజిలాండ్ అడ్మిషన్ సెషన్: సెప్టెంబర్/అక్టోబర్, ఫిబ్రవరి, మే. ఇందులో అధిక శాతం అడ్మిషన్లు సెప్టెంబర్/అక్టోబర్, ఫిబ్రవరి సెషన్లో పూర్తవుతాయి. మే సెషన్లో మాత్రం స్వల్ప సంఖ్యలో మాత్రమే అడ్మిషన్లను అక్కడి యూనివర్సిటీలు స్వీకరిస్తాయి. న్యూజిలాండ్కు సంబంధించి ఇంజనీరింగ్, ఎంబీఏ, హోటల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పాపులర్. న్యూజిలాండ్ యూనివర్సిటీలు ఐఈఎల్టీఎస్ (6.5/9) స్కోర్తో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వారానికి 20 గంటలపాటు పార్ట్టైమ్ జాబ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ దేశ కాన్సులేట్లోని డ్రాప్బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. వెబ్సైట్: www.immigration.govt.nz జర్మనీ అడ్మిషన్ సెషన్: ఏప్రిల్, అక్టోబర్. లైఫ్ సెన్సైస్, బయో సెన్సైస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సంబంధిత కోర్సులకు సరైన వేదిక జర్మనీ. జర్మనీలో మాస్టర్ కోర్సులకు టోఫెల్ (స్కోర్ 80/120), ఐఈఎల్టీఎస్ (స్కోర్ 6.5/9) తప్పనిసరి. కొన్ని కోర్సులకు మాత్రం జీఆర్ఈ స్కోర్ అవసరం. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ ఆవశ్యకం. ఇక్కడ సంవత్సరానికి 90 రోజులు పార్ట్ టైమ్ జాబ్ చేయవచ్చు. కొన్ని యూనివర్సిటీలు మాత్రం సెలవుల్లోనే ఈ సౌలభ్యం కల్పిస్తాయి. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. కొన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు ఫ్రీ ఎడ్యుకేషన్ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ట్యూషన్ ఫీజు నుంచి విద్యార్థులకు మినహాయింపు లభిస్తుంది. సాధారణంగా జర్మనీలో చదవాలనుకునే వారికి జర్మన్ భాష పరిజ్ఞానం తప్పనిసరి అనే నిబంధన అమల్లో ఉంది. జర్మనీలో సెమిస్టర్కు ఫీజు 500- 1,000 యూరోలు, నెలవారీ ఖర్చు 300 నుంచి 400 యూరోలు. వెబ్సైట్:www.studyin.de సింగపూర్ అడ్మిషన్ సెషన్: సెప్టెంబర్/అక్టోబర్, జూలై. సింగపూర్లో ఇంజనీరింగ్, ఎంబీఏ, హోటల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పాపులర్. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వారానికి 16 గంటలపాటు పార్ట్టైమ్ జాబ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ దేశ కాన్సులెట్లోని డ్రాప్బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. వెబ్సైట్: www.singaporeedu.gov.sg స్విట్జర్లాండ్ అడ్మిషన్ సెషన్: సెప్టెంబర్. హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, ఎంబీఏ, ఇంజనీరింగ్ కోర్సులను ఇక్కడికి వెళ్లే విద్యార్థుల్లో అత్యధిక శాతం ఎంచుకుంటున్న కోర్సులు. ఇక్కడి యూనివర్సిటీల్లో ప్రవేశం పొందాలంటే ఐఈఎల్టీఎస్ (6.5/9) స్కోర్ ఉండాలి. ఆ దేశ కాన్సులేట్లోని డ్రాప్బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. వెబ్సైట్: www.crus.ch దృష్టి సారించాల్సిన అంశాలు ఫారెన్ ఎడ్యుకేషన్ దిశగా ఆలోచించే ప్రతి విద్యార్థి ముందుగా ‘తనకు అనుకూలమైన కోర్సు.. మంచి కాలేజీతోపాటు దేశం గురించీ తెలుసుకోవాలి. ఏ ఇన్స్టిట్యూట్కి ఎంత ప్రాముఖ్యం ఉందో తెలుసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఆయా దేశాల ఇమిగ్రేషన్ శాఖ వెబ్సైట్లలోని సమాచారాన్ని పరిశీలించాలి. అకడమిక్ షెడ్యూల్ ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉంటుంది. ఆ మేరకు వీలైనంత ముందు సన్నాహకాలు మొదలు పెట్టాలి. ఎంచుకున్న దేశం, యూనివర్సిటీని షెడ్యూల్ను అనుసరించి కనీసం 8 నుంచి 12 నెలల దరఖాస్తు చేసుకుంటే సంబంధిత ప్రక్రియ ఆటంకం లేకుండా ముగియడానికి, వీసా దరఖాస్తుకు తగిన సమయం లభిస్తుంది. అమెరికా, కెనడా, జర్మనీ యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేట్ లెవల్ ప్రోగ్రామ్లలో చేరడానికి 16 సంవత్సరాల ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. కొన్ని వర్సిటీలు మాత్రమే 15 సంవత్సరాల ఫార్మల్ ఎడ్యుకేషన్ అర్హతగా బ్రిడ్జ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. మిగతా దేశాల్లో మాత్రం 15 సంవత్సరాల ఫార్మల్ ఎడ్యుకేషన్ సరిపోతుంది. విదేశీ వర్సిటీలు అడ్మిషన్ సమయంలో చాలా అంశాలను ఆధారం చేసుకుంటాయి. మెరిట్(అకడ మిక్ రికార్డ్), సాట్/జీఆర్ఈ/జీమ్యాట్ వంటి పరీక్షల స్కోర్, టోఫెల్/ఐఈఎల్టీఎస్ స్కోర్, ఎస్ఓపీ, సమ్మరీ ప్రాజెక్ట్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్, రీసెర్చ్ ఎక్స్పీరియెన్స్, వర్క్ ఎక్స్పీరియెన్స్, రెజ్యుమె, ఫైనాన్షియల్ స్టేట్మెంట్.. తదితరాలు. ఫారెన్ ఎడ్యుకేషన్లో మరో కీలక అంశం ‘స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ)’. దీని ద్వారా విద్యార్థి లీడర్షిప్ స్కిల్స్, సంబంధిత కోర్సుపై అవగాహన, భవిష్యత్ లక్ష్యాలు తదితర విషయాలు తెలుస్తాయి. ఒకే సీటు ఉండి.. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నప్పుడు ఎస్ఓపీ ద్వారానే అడ్మిషన్ కేటాయిస్తారు. వీసా కోసం.. సమర్పించాల్సిన డాక్యుమెంట్లు.. పాస్పోర్ట్ వీసా అప్లికేషన్ వీసా ఫీజు డీడీ అడ్మిషన్/కన్ఫర్మేషన్ లెటర్ అకడమిక్ అర్హతల సర్టిఫికెట్లు కోర్సు ఫీజు రసీదులు నిర్దేశిత పరీక్షల (జీఆర్ఈ తదితర) స్కోర్లు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు సదరు విద్యార్థిని వేరే వ్యక్తులు స్పాన్సర్ చేస్తే.. సంబంధిత స్పాన్సర్ ఇచ్చే లెటర్ స్పాన్సరర్ ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ అక్రెడిటేషన్ ఇటీవలి కాలంలో ఫేక్ యూనివర్సిటీల బాగోతం బయటకు వస్తున్న తరుణంలో సంబంధిత ఏజెన్సీల అక్రెడిటేషన్ఉన్న యూనివర్సిటీలనే ఎంచుకోవాలి. దేశాల వారీగా అక్రెడిటేషన్ సంస్థల వివరాలు.. అమెరికా-ది కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అక్రెడిటేషన్ బ్రిటన్-క్వాలిటీ అస్యూరెన్స్ ఏజెన్సీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆస్ట్రేలియా-కామన్వెల్త్ రిజిస్ట్రర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ న్యూజిలాండ్-న్యూజిలాండ్ క్వాలిఫికేషన్స్ అథారిటీ కెనడా-అసోసియేషన్ ఆఫ్ కెనడియన్ యూనివర్సిటీస్+ప్రొవిజినల్ చార్టర్ జర్మనీ-ఏజెన్సీ ఫర్ సెన్సైస్ అండ్ ఇంజనీరింగ్ సింగపూర్-నో సెంట్రల్ అథారిటీ (సింగపూర్ క్లాస్-ఏ ప్రైవేట్ ఇనిషియేటివ్) -
విదేశీ విద్యకు స్పందన ఏదీ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎస్సీ, ఎస్టీ గ్రాడ్యుయేట్ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకానికి స్పందన కరువైంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఈ ఏడాది అట్టహాసంగా ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ.. పథకంపై విద్యార్థులకు అవగాహన కల్పించడంపై మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఈ పథకానికి తొలి ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 22 మంది మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా.. జిల్లా నుంచి కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు పైచదువుల కోసం ఏటా సగటున 250 మందికిపైగా విదేశాలకు పరుగులు పెడుతున్నట్లు అంచనా. అయితే సర్కారు ప్రవేశపెట్టిన కొత్త పథకానికి స్పందన అత్యంత స్వల్పంగా ఉందంటే పథకంప్రచారం ఎలా ఉందో తెలుస్తోంది. నలుగురంటే నలుగురే..! అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద జిల్లా వ్యాప్తంగా కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎస్సీ సంక్షేమ శాఖకు ముగ్గురు విద్యార్థులు, గిరిజన సంక్షేమ శాఖకు మరో విద్యార్థి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా నలుగురు విద్యార్థుల దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. అర్హతలను బట్టి వారిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అయితే హైదరాబాద్ జిల్లాలో ఎస్టీ కేటగిరీ నుంచి ఒక్క విద్యార్థి కూడా దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం.