gandra Venkata ramana reddy
-
కేటీఆర్ పర్యటనలో మాజీ స్పీకర్ మదుసుదనాచారికి చేదు అనుభవం!
గణపురం: మంత్రి కేటీఆర్ గణపురం మండల పర్యటనలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసుదనాచారికి చేదు అనుభవం ఎదురైంది. కేటీఆర్కు స్వాగతం పలికేందుకు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న క్రమంలో గణపురం ప్రధాన రోడ్డుపై ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తాను మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసుదనాచారిని అని తెలపడంతో ఆయన వాహనాన్ని వదిలిపెట్టారు. కానీ ఆయన వెంట వచ్చే నాయకుల వాహనాన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన సిరికొండ వాహనంలో నుంచి దిగి వచ్చి నన్ను, నా వెంట వచ్చే నేతలను అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వాహనాన్ని హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. అక్కడ నుంచి హెలిప్యాడ్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన మరో బందోబస్తు వద్ద కూడా సిరికొండ వాహనాన్ని నిలిపి ఆయన అధికార పీఏను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కాగా.. కేటీఆర్ పర్యటనలో కావాలనే సిరికొండను అడుగడుగునా అవమానించారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత పర్యటనలో టీబీజీకేఎస్ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకంలో సిరికొండ పేరు లేకపోవడం ఆయన వర్గీయులను ఆగ్రహానికి గురిచేసింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే గండ్ర వ్యవహారంపై అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలో కవిత సమక్షంలోనే సిరికొండ, గండ్ర వర్గీయులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. కాగా.. కేటీఆర్ పర్యటనలో సిరికొండ వాహనాన్ని పోలీసులు తెలియక అడ్డుకున్నారా? లేక గండ్ర ఆదిపత్య పోరు కోసం చేయించారా? అని సిరికొండ వర్గీయులు, ప్రజలు చర్చింకుంటున్నారు. అంతటా వర్గపోరే.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటనలో ఆసాంతం బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు కనిపించింది. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్గీయులు నినాదాలతో హోరెత్తించారు. డబుల్ బెడ్ రూంల ప్రారంభోత్సవం, బహిరంగ సభ వద్ద జై సిరికొండ, చారి సాబ్ జిందాబాద్ అంటూ కొందరు నినాదాలు చేయగా.. మరికొందరు జై గండ్ర జైజై గండ్ర అంటూ నినదించారు. బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతున్న సమయంలో అభిమానులు చాలామంది జై సిరికొండ అంటూ నినాదాలు చేయడంతో.. ‘మీకు దండం పెడతా, ఆపండి.. ఇది మన కార్యక్రమం, సజావుగా జరగనివ్వండి’ అని మంత్రి కోరారు. ఇదిలా ఉండగా సభలో కూర్చున్న పలువురు ‘భూకబ్జాదారులు.. ఎమ్మెల్యే అనుచరులు’ అంటూ నినాదాలు చేశారు. -
‘డర్టీ డజన్ ఎమ్మెల్యేలు, దొరగాని దొడ్లో పశువులుగా మారారు’
సాక్షి భూపాలపల్లి/మొగుళ్లపల్లి: ‘మేం గెలిపిస్తే.. మా గుండెల మీద తన్ని, ఆస్తుల సంపాదన కోసం కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరిన డర్టీ డజన్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం దొరగాని దొడ్లో పశువులుగా మారారు’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్నుద్దేశించి ’’నక్సలైట్ ఎజెండా అంటివి ఏమైంది? మోసం చేసిన కోవర్టులకే మంత్రి పదవులా..’అంటూ ఘాటు విమర్శలు చేశారు. రేవంత్ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొనసాగింది. రాత్రి మొగుళపల్లి మండల కేంద్రంలో జరిగిన సభలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు ధరణితో దందాలు చేస్తున్నారని, భూకబ్జాలకు పాల్పడుతూ పేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు, ఉపాధి లభించక, కనిపెంచిన తల్లిదండ్రుల బాధలు చూడలేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒక్క ఇల్లూ ఇవ్వలేదు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని, ముదనష్టపోడు కేసీఆర్ ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. పసి పిల్లాడిని కుక్కలు పీక్కొని తింటే పట్టించుకోని దుర్మార్గ ప్రభుత్వం ఇదని రేవంత్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు రెండుసార్లు అధికారం ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే రూ. 500కే గ్యాస్ సిలిండర్, రూ. 2 లక్షల రైతు రుణమాఫీ, సొంతింటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, 2 లక్షల కొలువులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. గండ్ర ఆస్తి మొత్తం కాంగ్రెస్దే స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. గండ్ర ఆస్తి మొత్తం కాంగ్రెస్దేనని అన్నారు. ఆయనను ఎమ్మెల్యేను, చీఫ్విప్ను చేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఈ విషయాలపై మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రాజీవ్గాంధీ విగ్రహం సాక్షిగా విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. -
రేవంత్రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ప్రగతి భవన్ పేల్చాలన్న వాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైల్లో పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ,మండలి మీడియా పాయింట్ల్లో బుధవారం వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర డీజీపీతోపాటు పార్లమెంట్ స్పీకర్కు రేవంత్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో రేవంత్ సంఘ విద్రోహ శక్తులు మాట్లాడే భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. పేల్చేయడం, కూల్చేయడమే కాంగ్రెస్ ఎజెండానా? దీనితో ప్రజలకు ఆయన ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వానికి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
కవిత సమక్షంలోనే కస్సుబుస్సు.. ‘రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేను తానే..’
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో అధికార పార్టీ నాయకులు బజారున పడ్డారు. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు మంత్రి సత్యవతి రాథోడ్, సీఎం కేసిఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత సమక్షంలోనే బహిర్గతమయ్యాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ భవనం ప్రారంబోత్సవానికి హాజరైన మంత్రి సత్యవతి, ఎమ్మెల్సీ కవిత సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి బలప్రదర్శనకు దిగారు. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేను తానేనని చాటిచెప్పేందుకు ఇదదరూ తీవ్రంగా ప్రయత్నించారు. అనుచరగణాన్ని రెచ్చగొట్టి వారిమధ్య ఉన్న వైరాన్ని బహిర్గతం చేసుకున్నారు. పార్టీ శ్రేణులను ఆయోమయానికి గురిచేశారు. ఎవరి గోల వారిదే బిఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ భవన శిలాఫలకం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. శిలాఫలకంపై ఎమ్మెల్సీ మదుసూధనాచారి, జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి పేరు లేకపోవడంతో వారిద్దరి అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్సీ చారికి, జడ్పీ చైర్మన్ శ్రీహర్షిణికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తామేమి తక్కువ కాదన్నట్లు గండ్ర అనుచరులు సైతం నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంత ఇరువర్గాల నినాదాలు, గోలతో కార్మికసంఘ భవనం వర్గపోరుకు వేదికలా మారిపోయింది. వేదికపై ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్, కేసిఆర్ తనయ కవిత అవాక్కయ్యారు. ఘర్షణ పడుతున్నవారిని వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. నివురు గప్పిన నిప్పు వాస్తవానికి భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి రాజకీయ ప్రత్యర్థులు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గండ్ర అధికార పార్టీ అభ్యర్థి మధుసూదనాచారిపై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్కు చేయిచ్చి కేసిఆర్ సమక్షంలో కారెక్కారు గండ్ర వెంకటరమణారెడ్డి. రాజకీయ ప్రత్యర్థులిద్దరూ ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ అంతర్గత విబేధాలు మాత్రం అలానే ఉన్నాయి. గులాబీ దళపతి ఎవ్వరిని తక్కువ చేయకుండా ఓడిపోయిన మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తగిన ప్రాధాన్యత కల్పించారు. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో బయటపడడం పార్టీలో కలకలం సృష్టించింది. వీరి గొడవ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేసింది. కారులో అసంతృప్తి ఎమ్మెల్యే గండ్ర మీద జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనను భూపాలపల్లికి చెందిన పార్టీ నేతలు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆమె బాహాటంగానే విమర్శలు చేశారు. భూపాలపల్లికి జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి అయితే వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చి స్థానికులకు ప్రాధాన్యత లేకుండా చేశారనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని నియోజకవర్గ ఇంఛార్జీ పుట్ట మధు అనుచరురాలుగా ముద్రపడ్డ శ్రీహర్షిణికి భూపాలపల్లిలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనే చర్చ సాగుతోంది. భూపాలపల్లి బీఆర్ఎస్లో విబేధాలకు రాబోయే ఎన్నికలే కారణంగా జనం భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గండ్ర బిఆర్ఎస్ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతుండగా ఎమ్మెల్సీ చారి సైతం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఒకరిపై మరొకరిపై చేయి సాధించేందుకు పోరు సాగిస్తున్నారట. ఇప్పటికే సిట్టింగ్లకే టిక్కెట్ ఇస్తామని గులాబీ దళపతి ప్రకటించడంతో ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకుని టిక్కెట్ పొందే పనిలో చారి ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గండ్ర వెంకటరమణారెడ్డి సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుటుంబం నుంచి భూపాలపల్లి చేజారిపోకుండా అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వకపోతే...తన భార్య గండ్ర జ్యోతిని బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కవిత సమక్షంలో బయటపడ్డ బీఆర్ఎస్ వర్గపోరు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతలు విబేధాలతో రచ్చకెక్కారు. మధుసూదనాచారి, గండ్ర మధ్య ఆధిపత్య పోరు కీలక నేతల సాక్షిగా బయటపడింది. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత పర్యటనలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో.. కార్మిక సంఘం భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. అయితే.. జిల్లాకు చెందిన నేతలు మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణరెడ్డిలు బలప్రదర్శనలు దిగారు. ఈ క్రమంలో శిలాఫలకం మీద మధుసూదనాచారి పేరు లేదని ఆయన వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈలోపు గండ్ర వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలకు దిగాయి. ఆపై తోపులాటకు దిగాయి. దీంతో పోలీసులు, ఇతర నేతలు జోక్యం చేసుకుని పరిస్థితి సరిదిద్దే యత్నం చేశారు. -
గులాబీ కోటలో భూపాలపల్లి ఫైట్.. మాజీ స్పీకర్ VS సిట్టింగ్ ఎమ్మెల్యే
గులాబీ కోటలో భూపాలపల్లి ఫైట్ మొదలైందా? మాజీ స్పీకర్కు, సిట్టింగ్ ఎమ్మెల్యేకు మధ్య పోరు షురూ అయిందా? టీఆర్ఎస్ నాయకత్వం ఎవరికి మద్దతిస్తోంది? భూపాలపల్లిలో అధికార పార్టీ తరపున పరీక్ష రాసేదెవరు? సీటు రానివారి పరిస్థితి ఏంటి? జయశంకర్ భూపాలపల్లిలోని ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం భూపాలపల్లిలో అధికార పార్టీలో సెగలు మొదలయ్యాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సిటింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య సీటు కోసం పంచాయతీ అక్కడి రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. ఎమ్మెల్సి మధుసూదనాచారి పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. సారు రావాలి.. మీరు కావాలి అంటూ ఆయన అనుచరులు, అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరపడం వెనుక మతలబేంటని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మధుసూదనాచారి భూపాలపల్లి నుండి మళ్ళీ పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. అధిష్టానం నుండి వచ్చిన స్పష్టమైన సూచనల ప్రకారమే చారి మళ్ళీ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి? 2018 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో మధుసూదనాచారి ఓడిపోవడం, తర్వాత గండ్ర అధికార పార్టీలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో చారి భూపాలపల్లి నియోజకవర్గానికి దాదాపు దూరమయ్యారు. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన మధుసూదనాచారి, ముఖ్యమంత్రి మాట మేరకే నియోజకవర్గానికి దూరంగా ఉన్నారన్న మాటలు వినిపించాయి. కేసీఆర్ మాట జవ దాటకుండా ఉండి మళ్ళీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సి పదవి పొందారు. భూపాలపల్లిలో అధికార పార్టీకి వ్యతిరేకత మొదలైందని కేసీఆర్ చేయించిన సర్వేలో వెల్లడైందన్న వార్తలు అప్పట్లో బాగానే వినిపించాయి. బర్త్డే పాలిట్రిక్స్? మాజీ స్పీకర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదనే ఆలోచన ప్రజల్లో మొదలైనట్లుగా సీఎం దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రజల్లో చారీ పట్ల మళ్ళీ ఆదరణ మొదలైందని ఊహాగానాలు వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే మధుసూదనాచారి నియోజకవర్గంలో వరుసగా పర్యటించడం...ఎమ్మెల్సీ నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించుతుండటంతో ఆయన వర్గం నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 13న నియోజకవర్గ వ్యాప్తంగా మధుసూదానాచారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగటంతో భూపాలపల్లిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నియోజకవర్గంలో మధుసూదనాచారి మళ్ళీ యాక్టివ్ అవుతుండటంతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య ఎమ్మెల్యే చేస్తున్న వాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే పరీక్ష రాయబోతున్న మీ సహాయ సహకారాలు కావాలి అనడం, ఎమ్మెల్యే సీటు నాదే.. గెలుపు నాదే అని మాట్లాడుతుండటంతో భూపాలపల్లి ఎమ్మెల్యే సీటు విషయంలో ఏదో జరుగుతుందనే చర్చ సాగుతోంది. స్థానికంగా అధికార పార్టీ పట్ల వ్యతిరేకత మొదలవడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మధుసూదనాచారి మళ్ళీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరో ఏడాదిలో జరిగే ఎన్నికల పరీక్షలో రాసేదెవరో.. ఉత్తీర్ణులయ్యేదెవరో అన్న చర్చ నియోజకవర్గంలో తీవ్రంగా జరుగుతోంది. -
నేనేమైనా వృద్ధుడినా.. సీటు నాదే.. గెలుపు నాదే..
జయశంకర్ భూపాలపల్లి: 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. నేనే గెలుస్తా.. సీటు నాదే.. గెలుపు నాదే.. ఇక చర్చలు ఆపండి.. నేనేమైనా వృద్ధుడినా, మంచి ఆరోగ్యంగా ఉన్నాను. చక్కగా ప్రజలకు సేవలు అందించగలిగే సామర్థ్యం, ఓపిక ఉంది.. నన్ను ఒక్కడిని గెలిపిస్తే.. నేను, నా సతీమణితో పాటు జీఎంఆర్ఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నాం అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నంటిని నెరవేరుస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదేనని అన్నారు. త్వరలోనే గోరికొత్తపల్లి మండలంగా ఏర్పడబోతుందని తెలిపారు. జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.168కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ఇందుకు జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. వంద పడకల ఆస్పత్రిలో 71పోస్టుల మంజూరుకి రాష్ట్ర మంత్రి హరీశ్రావు అంగీకరించారని, త్వరలోనే నియామకాలు జరుగుతాయని తెలిపారు. భూపాలపల్లిని ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. చెల్పూరు నుంచి భూపాలపల్లి పట్టణంలోని బాంబులగడ్డ వరకు జాతీయ రహదారి విస్తరణ, సైడ్ డ్రెయినేజీ నిర్మాణ పనులకు రూ.80 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.15కోట్లతో చేపట్టిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అదనపు భవన నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయని అన్నారు. వర్షాలు తగ్గాక భూపాలపల్లికి వస్తానని సీఎం కేసీఆర్ చెప్పాడని తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన సుమారు రూ.3కోట్లతో శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మాణం చేపట్టగా కొందరు కావాలని ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దేవుడి గుడి నిర్మించడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణిసిద్ధు, వైస్చైర్మన్ కొత్త హరిబాబు, జంగేడు పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు కొక్కుల తిరుపతి, నూనె రాజు, క్యాతరాజు సాంబమూర్తి, ముంజాల రవీందర్, పిల్లలమర్రి నారాయణ, శిరుప అనిల్, మాడ హరీశ్రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘కేసీఆర్ రైతుబంధు’గా పేరు పెట్టాలి
సాక్షి, హైదరాబాద్ : సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, పంట సీజన్ రాగానే రైతుల అకౌంట్లలో పెట్టుబడి సాయం పడుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. దీంతో రైతులు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లడం మానేశారని, వ్యవసాయాన్ని వదిలేసిన వారు కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో ఆలోచించి ఇలాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చారని, ఈ పథకం స్ఫూర్తితోనే కేంద్రం కూడా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తెచ్చిందన్నారు. ఇలా దేశానికి స్ఫూర్తిదాయకమైన ఈ పథకానికి ‘కేసీఆర్ రైతుబంధు’గా నామకరణం చేయాలని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు కావడంతో తమ నియోజకవర్గమైన భూపాలపల్లికి 31 ఏళ్ల కిందట కాలువలు తవ్వినా ఒక్క రోజు కూడా నీళ్లు రాలేదన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకతీయ కాలువలో 150 రోజుల నుంచి నీళ్లు పారుతున్నాయన్నారు. విమర్శలు చేసే వారంతా ఈ ప్రాజెక్టును చూస్తే వారి అభిప్రాయం మారిపోతుందన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ ఎమ్మెల్యేలు ఓసారి ప్రాజెక్టును చూసి రావాలని సూచించారు. ధాన్యం ఇతర పంటలను ఎక్స్పోర్టు చేసేందుకు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలు ముగిశాక కూడా కొత్త పథకాలు బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేశారని, పట్టణాభివృద్ధికి చర్యలు వేగవంతం చేశారన్నారు. వరంగల్ లాంటి పట్టణాల్లో ఐటీ విస్తరణకు మంత్రి కేటీఆర్ విశేష కృషి చేస్తున్నారు. ఏ ప్రభుత్వాలైనా ఎన్నికల ముం దు పథకాలు తీసుకురావడం సాధారణమని, కేసీఆర్ మాత్రం ఎన్నికలు పూర్తయ్యాక కూడా కొత్తపథకాలు తెస్తున్నారన్నారు. సరిపడా విద్యుత్, నీరు అందుబాటులో ఉండటం వల్ల భూములు అమ్మకుండా వ్యవసాయం చేస్తు న్నారని పేర్కొన్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా భూమి లభించట్లేదన్నారు. -
అప్పుడు లేని మాంద్యం ఇప్పుడెలా?
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల కింద ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయంలో లేని మాంద్యం ఇప్పుడెలా వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.శ్రీధర్బాబు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సైతం బడ్జెట్లో ఎక్కడా మాంద్యం గురించి ప్రస్తావించలేదని తెలిపారు. కానీ ప్రస్తుత పూర్తిస్థాయి బడ్జెట్లో మాత్రం 15 నెలల నుంచి మాంద్యం ఉందని చెప్పి బడ్జెట్కు కోత పెట్టారని విమర్శించారు. ఆదివారం శాసనసభలో బడ్జెట్పై చర్చలో ఆయన మాట్లాడారు. వాహనాలు, ట్రాక్టర్ల కొనుగోళ్లు 30 శాతం తగ్గాయని చెబుతున్నారని, కానీ మాంద్యానికి ఇది ప్రామాణికం కాదని తెలిపారు. రెవెన్యూ మిగులు ఉన్న సమయంలో రాష్ట్ర బడ్జెట్ ఎలా తగ్గిందో చెప్పాలన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది బడ్జెట్లో కీలకమైన విద్యా శాఖకు 24 శాతం, వైద్యానికి 25 శాతం, గ్రామీణాభివృద్ధికి 32 శాతం తక్కువగా కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. కాళేశ్వరం చూసే చేరాం: ఎమ్మెల్యే గండ్ర టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రైతుల సంక్షే మం కోసం ప్రభుత్వం అనేక పథకాలు తెచ్చిందని, రైతు బంధుతో రైతుల్లో ధీమా పెంచారని తెలిపా రు. సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు ఎనలేని ప్రయోజనం కలుగుతోందని, దాన్ని చూసే 12 మంది కాంగ్రెస్ సభ్యులం టీఆర్ఎస్లో చేరామన్నారు. -
మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై..
సాక్షి, నాగర్ కర్నూల్/నిజామాబాద్/భూపాలపల్లి : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్ పార్టీలో కొద్దిపాటి కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమకు కేబినెట్ బెర్త్ దక్కకపోవడంపై పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. తనకు మంత్రి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పారంటూ మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ అధిష్టానాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలోనే పలువురు టీఆర్ఎస్ సీనియర్ నేతలు పార్టీని వీడతారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. దీంతో కొందరు నేతలు మీడియాకు ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ టీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. తాను టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని తెలిపారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని గుర్తుచేశారు. తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ మారతానంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. అలాంటి ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. కేసీఆర్పై పూర్తి విశ్వాసం ఉంది.. తనకు సీఎం కేసీఆర్పై పూర్తి విశ్వాసం ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవి రానందకు అసంతృప్తి లేదని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. తాను ఎవరిని నమ్ముతానో వారితోనే చివరి వరకు ఉంటానని తెలిపారు. టీఆర్ఎస్లో పదవుల కోసం చేరలేదు : గండ్ర మంత్రివర్గ ఏర్పాటుపై తాను అసంతృప్తితో ఉన్నట్టు వచ్చిన వార్తల్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి పదవుల కోసం రాలేదని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై పట్ల నమ్మకంతోనే టీఆర్ఎస్లో చేరానని తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నట్టు చెప్పారు. పదవుల కన్నా పార్టీని బలోపేతం చేయడంపై తన దృష్టి ఉందని పేర్కొన్నారు. సీఎం ఆశీస్సుల వల్లే తన కుటుంబానికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కిందని అన్నారు. తను అనని మాటలు అన్నట్లుగా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాసేపు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అవతారమెత్తారు. భూపాలపల్లి బస్డిపోకు నూతనంగా వచ్చిన సూపర్ లగ్జరీ బస్సును బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం డిపో నుంచి బస్టాండ్ వరకు బస్సును నడిపి ప్లాట్ఫాంపై ఉంచారు. దీంతో బస్టాండ్లో ఉన్న ప్రయాణికులంతా నివ్వెరపోయారు. అందరూ బస్సు వద్దకు వచ్చి చూడ సాగారు. పచ్చడి బాగుందే అక్కా.. బాగున్నారా? అందరూ పచ్చడే తెచ్చుకున్నారా? మీతో నాకూ కాస్త వడ్డించండి అంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క వరి నాటు కూలీలతో కలసి రోడ్డుపై కూర్చుని భోజనం చేశారు. బుధవారం ఎమ్మెల్యే మహబూబాబాద్ జిల్లా ఎంచగూడెం గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కూలీలు రోడ్డుపై కూర్చుని భోజనం చేస్తున్నారు. వారిని చూసిన ఎమ్మెల్యే కారు ఆపి కూలీలతో మాట్లాడారు. మీతోపాటు నాకూ వడ్డించండి అని కూలీలతో కలసి భోజనం చేశారు. పచ్చడి బాగుందంటూ కితాబిచ్చారు. -
జయశంకర్ సార్ యాదిలో..
సాక్షి, భూపాలపల్లి: ప్రొఫెసర్ జయశంకర్ తన గురువని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాలుపంచుకోవాలని ఎప్పుడూ చెప్పేవారని, ఆయన సూచనల మేరకే తాను టీఆర్ఎస్లో చేరానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని జయశంకర్ విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ.. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ తన తండ్రి క్లాస్మేట్ అని, సార్ వద్ద తాను కొద్ది రోజులు చదువుకున్నానని తెలిపారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. సీఎం కే.చంద్రశేఖర్రావుకు కుడి భుజంలా ఉండి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని గుర్తు చేశారు. సార్ బ్రతికి ఉంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యేవారన్నారు. జయశంకర్ పేరు మీద భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. మొక్కలు నాటాలి.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో మంజూర్నగర్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న జయశంకర్ ఎకో పార్కు పనులను పరిశీలించారు. అనంతరం పార్కు ఆవరణలో మొక్కలు నాటారు. మంత్రి మాట్లాడుతూ.. జయశంకర్ పార్కులో మంచి సౌకర్యాలు కల్పించి భూపాలపల్లి వాసులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. వానలు సమృద్ధిగా కురువాలంటే ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటాలన్నారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని సూచించారు. అనంతరం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలు, పొలం గట్లు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పచ్చని వాతావరణం నెలకొనేలా మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. అనంతరం తెలంగాణకు హరితహారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గ్రామ పంచాయతీ నర్సరీ జాబితా 2019 బుక్లెట్ను మంత్రి దయాకర్రావు విడుదల చేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓ ప్రదీప్కుమార్శెట్టి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్లు జక్కు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, ఎఫ్డీఓ సారయ్య, టీఆర్ఎస్ నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, కొత్త హరిబాబు, కటకం జనార్దన్, పైడిపెల్లి రమేష్, శిరుప అనిల్, పిల్లలమర్రి నారాయణ, ముంజాల రవీందర్, మంథెన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
కారెక్కుతున్న మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి అయిదు నెలలు అవుతున్నా టీఆర్ఎస్లో చేరేందుకు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సగం ఖాళీ అవగా...తాజాగా మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలో కారెక్కనున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 24న వీరంతా టీఆర్ఎస్లోచేరేందుకు ముహుర్తం ఖరారైంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. తాజా చేరికలతో తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. ఈ ముగ్గురు చేరికతో ఇక కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రోహిత్ రెడ్డి, సీతక్క మాత్రమే మిగలనున్నారు. జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజా చేరికలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 104కు చేరనుంది. -
ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని..
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గండ్ర వెంకటరమణారెడ్డిపై విజయలక్ష్మి అనే మహిళ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ మహిళ విభాగం ఖండించింది. దీనిపై సోమవారం వారు గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గండ్రను రాజకీయంగా ఎదుర్కొలేక.. టీఆర్ఎస్ అతని వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. విజయలక్ష్మి అసత్య ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై తాము డీజీపీని కలువనున్నామని తెలిపారు. 2019లో గెలిచే అవకాశం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ టార్గెట్ చేసి రాజకీయంగా బలహీన పరచాలని చూస్తోందని ఆరోపించారు. నీచ రాజకీయాలకు మహిళలను వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. టీఆర్ఎస్ బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలన్నారు. గండ్ర సతీమణి జ్యోతి మాట్లాడుతూ.. తన భర్తపై అసత్య ప్రచారం చేయడం ద్వారా ఆయన గెలుపు అవకాశాల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఆడంగి రాజకీయాలు చేయకుండా.. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కొవాలని సవాలు విసిరారు. ఓ మాయ లేడీ మాటలు నమ్మి, మమల్ని నిందిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. లాయర్ సునీతా రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్లోని గెలుపు గుర్రాలను అడ్డుకునేందుకే టీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించని టీఆర్ఎస్ వారిని ఇలాంటి వ్యవహారాల్లో వాడుకుంటుందన్నారు. విజయలక్ష్మీపై కేసు నమోదు తనపై విజయలక్ష్మీ చేసిన ఆరోపణలను గండ్ర ఖండించారు. ఆమె తనపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా, వేధింపులకు గురి చేస్తుందని గండ్ర పేర్కొన్నారు. దీనిపై ఆయన ఆదివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. గండ్ర ఫిర్యాదు మేరకు పోలీసులు 384, 506 సెక్షన్ల కింద విజయలక్ష్మీపై కేసు నమోదు చేశారు. ‘గండ్ర’పై విజయలక్ష్మీ ఆరోపణలు -
‘సింగరేణి ఎన్నికల్లో నైతిక విజయం మాదే’
-
‘సింగరేణి ఎన్నికల్లో నైతిక విజయం మాదే’
సాక్షి, హైదరాబాద్ : సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... బలుపును చూసి వాపు అనుకోవడం పొరపాటు అని అన్నారు. గనుల్లో టీబీజీకేఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచిందని గండ్ర ఆరోపించారు. కొన్నిచోట్ల బెదిరింపులకు పాల్పడిందని, అధికార దుర్వినియోగంపై పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆయన అన్నారు. కాగా సింగరేణి ఎన్నికల్లో మొత్తం 17 కార్మిక సంఘాలు పోటీ పడగా, టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్), సీపీఐ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ల మధ్యే ప్రధాన పోటీ ఏర్పడింది. 11 డివిజన్లకుగానూ 9 డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకుంది. ఏఐటీయూసీ రెండు డివిజన్లతో సరిపెట్టుకుంది. -
ఆ నలుగురే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు
► మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి రామగుండం(పెద్దపల్లి జిల్లా): తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్తోపాటు ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీశ్రావు మాత్రమే పాలిస్తున్నారని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు ఆ నలుగురి చేతుల్లో నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి, అవి అటకెక్కడానికి కారకులయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు, కార్మికులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో మిగిలిన ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు అసహనంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రాజెక్టుల రిడిజైనింగ్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. -
అభివృద్ధిపై కేసీఆర్కు చిత్తశుద్ధి లేదు: గండ్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని, కలెక్టర్లతో జరిగిన సమీక్షాసమావేశమే దీనికి నిదర్శనమని కాంగ్రెస్ నేత, మాజీ చీఫ్విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మన ఊరు– మన ప్రణాళిక అని.. గతంలో పట్టించుకోకుండా పక్కనబెట్టిన పాత ముచ్చటనే ఇప్పుడు కలెక్టర్లకు చెప్పార న్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించారని, ఆ సంగతిని మరిచిపోయారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విషజ్వరాలు, ఆరోగ్య సమస్యలతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని, వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. నిలోఫర్ ఆసుపత్రిలో మందులు లేక గర్భిణులు చనిపోవడం బాధాకరమ న్నారు. వీటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. -
'కేసీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణరెడ్డి డిమాండ్ చేశారు. కేసులకు తాము భయపడేది లేదని, ఇప్పటికైనా కేసీఆర్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలని ఆయన గురువారమిక్కడ హితవు పలికారు. తెలంగాణ వద్దు...ప్యాకేజీ ముద్దు అని తాము ఎన్నడు అనలేదని గండ్ర పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ నేతలు సన్నాసులంటూ కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
రుణమాఫీపై కేసీఆర్ నిర్లక్ష్యం:గండ్ర
సాక్షి, హైదరాబాద్ : వర్షాలు కురుస్తున్నా, ఖరీఫ్ పనులు ప్రారంభమైనా పంట రుణాలను మాఫీ చేయడంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తక్షణమే రూ.6 వేల కోట్ల రుణ బకాయిలను విడుదల చేసి, రైతులను రుణ విముక్తులను చేయాలని, మెడిసిన్ ఎంట్రన్స్ పేపర్ లీక్ అయిందని వస్తున్న ఆరోపణలపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవాలని, లీక్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
‘గండ్ర’వి దివాళాకోరు రాజకీయాలు
కాంగ్రెస్లో ఉనికి కోసమే వెంకటరమణారెడ్డి ఆరోపణలు తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైంది టీఆర్ఎస్ జల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు హన్మకొండ : భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు గండ్ర సత్యనారాయణరావు, గండ్ర వెంకటరమణారెడ్డి, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగంతో అక్రమాలకు పాల్పడిన గండ్ర వెంకటరమణారెడ్డి ఉనికి కోసం స్పీకర్పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యాపారాల్లో లబ్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు తక్కెళ్లపల్లి రవీందర్రావు సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. గండ్ర వెంకటరమణారెడ్డి అక్రమ వ్యాపారాల గు రించి జిల్లా ప్రజలందరికీ తెలుసని, ఆయ న చేసిన విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ హ యాంలో గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన అక్రమాలు, అవినీతి ఆయనకు ఇప్పుడూ గుర్తుకువస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశా రు. తెలంగాణలో టీడీపీ ఎప్పుడో భూస్థాపితమైందని పేర్కొన్నారు. ఉనికిలేని టీడీపీకి జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు మాటల్లో వాస్తవాలు లేవని అన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా కాంగ్రెస్, టీడీపీలు కలిసి చేస్తున్న దుష్ర్పచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. స్పీకర్ మధుసూదనాచారి నిత్యం ప్రజలకు అందుబాటు ఉం టూ భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల కోసం కృషి చేస్తున్న స్పీకర్పై, స్పీకర్ కుటుంబంపై దిక్కుతోచని స్థితిలో ఇద్దరు నేతలు విమర్శలు చేస్తున్నారని అ న్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, ప్రతిపక్ష నేతల మాటలను పట్టించుకోవడం లేదన్నారు. -
తలసానిపై చీటింగ్ కేసు పెట్టాలి
4.5 కోట్ల మంది ప్రజలను ఆయన మోసం చేశారు: గండ్ర సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే మంత్రివర్గంలో కొనసాగుతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దుయ్యబట్టారు. దీనిపై సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద స్పీకర్ కార్యాలయాన్ని వివరణ కోరగా తలసాని తన రాజీనామా లేఖ పంపలేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. 4.5 కోట్ల మంది తెలంగాణ ప్రజలను మోసగించినందుకు తలసానిపై సుమోటోగా చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయం వద్ద గండ్ర మీడియాతో మాట్లాడుతూ తలసాని రాజీనామాకు సంబంధించి తమకు మొదటి నుంచి అనుమానం రావడంతో ఆర్టీఐ ద్వారా వివరాలు కోరగా అసలు విషయం బయటపడిందన్నారు. రాజీనామా లేఖ ఇవ్వకుండానే, ఒక పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఆయన రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని మండిపడ్డారు. తలసాని మంత్రిగా కొనసాగడం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవడమేనన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందున గవర్నర్ వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ నిస్సిగ్గుగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి చేత రాజీనామా చేయించకుండానే మంత్రి వర్గంలోకి తీసుకోవడం ఏ రకమైన ఆదర్శ పాలనవుతుందని ఎద్దేవా చేశారు. తలసానిపై 420 కేసు పెట్టాలి: షబ్బీర్ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినందుకు మంత్రి తలసానిపై తక్షణమే సుమోటోగా 420 కేసు నమోదు చేయాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. పవిత్రమైన అసెంబ్లీని తలసాని అవమానపరిచారని మండిపడ్డారు. తలసాని దుశ్చర్యపై పార్లమెంటులో తమ పార్టీ తరఫున చర్చకు పట్టుబడుతామన్నారు. సీఎల్పీ కార్యాలయ ఆవరణలో షబ్బీర్ విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చెప్పే మాటలకు చేతలకు పొంతనే లేదని ధ్వజమెత్తారు. సీఎం ఓవైపు నీతి వాక్యాలు వల్లిస్తూ మరోవైపు రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తలసాని రాజీనామా విషయంలో గవర్నర్ నరసింహన్ పాత్రపైనా అనుమానం కలుగుతోందని షబ్బీర్ పేర్కొన్నారు. తలసాని రాజీనామా చేశారా లేదా అని గవర్నర్ ఎందుకు పర్యవేక్షించడం లేదని ప్రశ్నించారు. గవర్నర్కు నిజాయితీ ఉంటే ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కొనసాగరాదన్నారు. ఆయనకు పదవిలో ఉండే అర్హత లేదన్నారు. -
'ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా చేయలేదు'
-
కాంగ్రెస్కు క్రెడిట్ దక్కుతుందనే కేసీఆర్ ఆందోళన
హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూపుదాల్చిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ను అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయని కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి గుర్తు చేశారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. అలాంటి ప్రాజెక్ట్ను సీఎం కేసీఆర్ పనికిరాదనడం రాజకీయ దురుద్దేశమేనని గండ్ర వ్యాఖ్యానించారు. తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తయితే కాంగ్రెస్కు క్రెడిట్ దక్కుతుందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారని గండ్ర అన్నారు. అందుకే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టి కుట్రలు పన్నుతున్నారని, మహారాష్ట్ర సర్కార్ ప్రాణహిత చేవెళ్లకు గతంలోనే అంగీకరించిందని, ఇప్పుడక్కడ అధికారంలోకి వచ్చిన బీజేపీ వ్యతిరేకిస్తుందనడంతో కేసీఆర్ రాజీ పడుతున్నారని మండిపడ్డారు. తన కూతరు కవితకు కేంద్రంలో మంత్రి పదవి కోసం బీజేపీతో కేసీఆర్ సఖ్యతగా ఉంటున్నారని గండ్ర ఆరోపించారు. -
'కమీషన్ కాకతీయగా మారింది'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ చేపట్టిన మిషన్ కాకతీయ.. కమీషన్ కాకతీయగా మారిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ లో ఎన్ని పనులు జరిగాయో వెల్లడించాలని గండ్ర డిమాండ్ చేశారు. మొక్కుబడిగా పనులు చేసి కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 'మిషన్ కాకతీయ'పై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇద్దరు సీఎంలు ప్రజల మనోభావాలను రెచ్చగొడుతున్నారని గండ్ర వెంకట రమణారెడ్డి దుయ్యబట్టారు. -
కేసీఆర్ ప్రభుత్వం నీటి మీద బుడగే...
వరంగల్ : కేసీఆర్ ప్రభుత్వం నీటి మీద బుడగలాంటిదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై మాట తప్పుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజలను అయోమయం చేసేలా హామీలపై రోజుకో మాట మాట్లాడుతున్నారని గండ్ర మండిపడ్డారు. రుణ మాఫీ ఉందా? లేదా? ఖరీఫ్ లో రైతులకు రుణాలు అందుతాయా లేదా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. ఎన్నికల ముందు తెలంగాణలో అర్హులందరికీ పించన్లు ఇస్తానన్న కేసీఆర్ ఇప్పుడేమో 5లక్షల బోగస్ పింఛన్లు ఉన్నాయని వాటిలో కోత పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రెండు బెడ్రూంల గృహాలు నిర్మించి ఇస్తానన్న కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న పేదల కంటే ఎక్కువ ఇళ్లు మంజూరయ్యాయని అక్రమార్కుల పని పడుతామని అనడం..ఇక ఇళ్ల మంజూరు లేదని చెప్పడానికి కాదా అని గండ్ర సూటిగా ప్రశ్నించారు. -
దొంతీ .. కరుణచూపు
సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో నర్సంపేట నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన దొంతి మాధవరెడ్డిని తిరిగి కాంగ్రెస్లోకి రప్పించుకునేందుకు సోమవారం ముఖ్య నేతలు చర్చలు జరిపారు. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే దొంతి సహకారం అవసరం కావడంతో జిల్లాకు చెందిన ఆ పార్టీ ముఖ్య నేతలు సారయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు, నాయిని రాజేందర్రెడ్డి, ఇనుగాల వెంకటరాంరెడ్డి, పొదెం వీరయ్య కలిసి దొంతితో సమావేశమై హరిత హోటల్లో చర్చలు జరిపారు. 50 జెడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్కు 24, టీఆర్ఎస్కు 18, టీడీపీకి 6, బీజేపీకి 1, ఇండిపెండెంట్ 1 గెలుచుకున్నారు. తెలంగాణలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ అవకాశం ఉన్న ఏ ఒక్క జెడ్పీ పీఠాన్ని కూడా వదలకూడదనే పట్టుదలతో ఉండడంతో జిల్లాలో దొంతి కరుణ తప్పనిసరి అయింది. మాధవరెడ్డి ఇంటికి గండ్ర తప్ప ముఖ్య నాయకులందరూ వెళ్లి మొదట చర్చలు జరిపిన తర్వాత హరిత హోటల్కు వేదిక మార్చారు. చర్చల్లో వచ్చిన అంశాలను కాంగ్రెస్ నాయకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మొదటి నుంచి ప్లాన్ ప్రకారం గెలిచిన జెడ్పీటీసీ అభ్యర్థులను మాధవరెడ్డి 10మందిని తన వద్ద ఉంచుకున్నారు. జెడ్పీ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకోవడం కోసం మాధవరెడ్డి సహకారం అవసరమైంది. దీనికి ప్రతిఫలంగా మాధవరెడ్డిపై ఉన్న సస్పెన్షన్ను తొలగిస్తామని కాంగ్రెస్ పెద్దలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా దొంతి జెడ్పీ పీఠం తన నియోజకవర్గానికే కావాలని, జిల్లా అధ్యక్ష పదవి కూడా తనకే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఈ ప్రతిపాదనను దుగ్యాల శ్రీనివాసరావు వ్యతిరేకించారు. మొదట తన నియోజకవర్గానికి జెడ్పీ పీఠం కావాలని డిమాండ్ చేయడంతో పాటు దొంతికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడానికి ఆయన అంగీకరించలేదు. అయితే మాధవరెడ్డి మెట్టుదిగకపోవడంతో చివరకు జెడ్పీ పీఠం ఆయన నియోజకవర్గానికే కేటాయించాలనే అభిప్రాయానికి వచ్చారు. కానీ జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చేందుకు మాత్రం ప్రస్తుత ఇన్చార్జి నాయిని, దుగ్యాల, గండ్ర అంగీకరించకపోవడంతో దొంతి కొంత సానుకూలత చూపారు. టీఆర్ఎస్ పార్టీకి జెడ్పీ పీఠం దక్కకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ నేతలు దొంతిని పార్టీలోకి తీసుకుని జెడ్పీ చైర్మన్ పదవి అప్పగించేందుకు సానుకూలత చూపారు. అయితే మంగళవారం మరో దఫా జరిగే చర్చల్లో స్పష్టత రానుంది. నర్సంపేట నియోజకవర్గంలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, నగర పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న దొంతి తనపట్టు నిలుపుకున్నారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన దొంతికి మళ్లీ అదే పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ కావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. -
ఎంపీగా కడియం గెలుపు, గండ్ర ఓటమి
వరంగల్ : వరంగల్ లోక్సభ స్థానం నుంచి కడియ శ్రీహరి గెలుపొందారు. 3.33 లక్షల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఇక పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు గెలుపొందారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి భూపాలపల్లిలో పోటీ చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి మధుసూధనరెడ్డిపై ఆయన ఓడిపోయారు. -
పీసీసీ పదవి ఇస్తే కాదనను: గండ్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తనకు అప్పగించాలని అధిష్టానం భావిస్తే కాదనబోనని, పార్టీ ఏ బాధ్యత అప్పగిస్తే దాన్ని చిత్తశుద్ధితో విజయవంతంగా నిర్వర్తిస్తానని చీఫ్విప్ గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీతో పొత్తులు పెట్టుకుంటే.. అవకాశాలు కోల్పోతామన్న ఆవేదన కాంగ్రెస్ కార్యర్తల్లో, నేతల్లో ఉందని చెప్పారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ ఒంటరిగా వెళ్తేనే మంచిదన్న అభిప్రాయం ఎక్కువమంది నేతల నుంచి వినిపిస్తోందని తెలిపారు. అయినా పొత్తులు ఇతరత్రా అంశాలు అధిష్టానం చూస్తుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేర్చిందని, దీన్ని తప్పుబట్టడం అర్థం లేనిదన్నారు. తన స్థాయికి మించి జగన్ కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. -
'బాబు గజదొంగ అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చంద్రబాబు రెండుసార్లు ఎందుకు ఓడిపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలను అభివృద్ధి చేసినట్లయితే టీడీపీ ప్రజలు ఎందుకు ఓడించారని అన్నారు. పలు అవినీతి కుంభకోణాలు తప్ప, చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని గండ్ర విమర్శించారు. దేశంలో అత్యంత ధనిక నేత చంద్రబాబు నాయుడు అంటూ పదేళ్ల క్రితమే మీడియా సంస్థలు ప్రకటించాయని గండ్ర తెలిపారు. చంద్రబాబు గజదొంగ అనడానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష హోదా కూడా దక్కదని గండ్ర జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల్లో డబ్బు సంప్రదాయాన్ని, ఓటుకు నోటు విధానాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడేనని అన్నారు. -
'విలీనం చేయకుంటే టీఆర్ఎస్ది ప్రతిపక్ష స్థానమే'
-
వైఎస్సార్ సీపీని అభినందించాల్సిందే: చీఫ్ విప్ గండ్ర
హైదరాబాద్:రాజ్యసభ ఎన్నికల్లో తగినంత బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభినందించాల్సిందేనని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన గండ్ర.. పార్టీకి తగినంత బలం లేని కారణంగా వైఎస్సార్ సీపీ పోటీకి దూరంగా ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి నాలుగో అభ్యర్థికి సరి పడా బలం లేని కారణంగా ముగ్గురు అభ్యర్థులతోనే పోటీకి సిద్ధమైందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆలస్యమైనందున కే.కేశవరావు(కేకే) పార్టీని వీడారని గండ్ర తెలిపారు. గత అనుబంధంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు కేకే ఓటు వేశారన్నారు. ఈ ఎన్నికకు టీఆర్ఎస్ విలీనానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన పిటీషన్లును సుప్రీంకోర్టు తిరస్కరించిన తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం సమంజసం కాదని సీమాంధ్ర నేతలకు విజ్క్షప్తి చేశారు. -
'టీఆర్ఎస్ అభ్యర్థి కేకేకు ఓటు వేసే అంశంపై చర్చిస్తాం'
హైదరాబాద్:టీఆర్ఎస్ అభ్యర్థి కె.కేశవరావు(కేకే)కు ఓటు వేసే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపికపై రేపు ఉదయం గోల్కొండ హోటల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా సమావేశం కానున్నట్ల గండ్ర స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలనే అంశంపై చర్చిస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఎమ్.ఎ.ఖాన్ ను గెలిపించుకుంటామన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కేకేకు ఓటేసి అంశాన్ని కూడా భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతిని గండ్ర ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ మంత్రులు సీఎంను వ్యతిరేకిస్తున్నప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఎలా అనుకుంటున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు టీడీపీ పార్టీలో తెలంగాణ టి.టీడీపీ నేతలు ఉండాలో లేదో తెలుసుకోవాలన్నారు. -
దీక్ష చేసినా...వేషాలు వేసినా విభజన తథ్యం
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేసినా......లగడపాటి రాజగోపాల్ ఎన్ని వేషాలు వేసినా రాష్ట్ర విభజన తథ్యమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఢిల్లీకి చేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత నేతలు కూడా ఢిల్లీ బాటపట్టారు. ఈ సందర్భంగా హస్తిన చేరుకున్న గండ్ర అక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కిరణ్, లగడపాటి దగ్గర ఎలాంటి అస్త్రాలు లేవని అన్నారు. కాగా అవసరం అయినప్పుడు చివరి బ్రహ్మస్త్రాన్ని వాడతామని లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీలో చర్చ ముగించుకుని రాష్ట్రపతికి చేరుతున్న తరుణంలో ఉభయ ప్రాంతాల నేతలు ఢిల్లీలో మోహరించారు. తెలుగుదేశం, కాంగ్రెస్లకు చెందిన ఇరు ప్రాంతాల నేతలు వేర్వేరుగా హస్తినకు చేరుకుంటున్నారు. 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావే శాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించేందుకు ఉభయ ప్రాంతాల నేతలు సిద్ధమవుతున్నారు. -
'కిరణ్ మంత్రుల విశ్వాసాన్ని కోల్పోయారు'
హైదరాబాద్ : తెలంగాణ బిల్లును వెనక్కి పంపాలనటం రాజ్యాంగ విరుద్దమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. తెలంగాణ మంత్రులను సంప్రదించకుండా కిరణ్ ఇచ్చిన తీర్మాన నోటీసు ప్రభుత్వ తీర్మానంగా పరిగణించరాదని వారు అన్నారు. సీఎం ఏకపక్షంగా ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని స్పీకర్ను కోరినట్లు గండ్ర, శ్రీధర్ బాబు తెలిపారు. సభలో బిల్లుపై చర్చ జరుగుతున్నప్పుడు తీర్మానం ఇవ్వటం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలను కించపరుస్తున్న సీఎంపై తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రలు విశ్వాసం కోల్పోయామని అన్నారు. ఇప్పటికైనా సీఎం నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం కిరణ్, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు ఒకేతీరుగా వ్యవహరించడంపై.. గండ్ర మండిపడ్డారు. ప్రభుత్వ తిరస్కార తీర్మానాన్ని అనుమతించారదని ఇప్పటికే లేఖలిచ్చిన టీ మంత్రులు.. ప్రభుత్వంలో తాము భాగస్వామ్యులైనప్పటికీ తమని ఏమాత్రం సంప్రదించకుండా సీఎం ఏకపక్షంగా తీర్మానాన్ని ఇచ్చారని.. కాబట్టి ఈ తీర్మానం నోటీసును తిరస్కరించాలని డిమాండ్ చేశారు. దీన్ని ప్రభుత్వ తీర్మానంగా పరిగణించరాదని అన్నారు. -
గండ్రతో టీఆర్ఎస్ మంతనాలు
సీఎం నోటీసు, రాజ్యసభ ఎన్నికలపై చర్చ పెద్దల సభకు కేకే పోటీపై కొనసాగుతున్న అస్పష్టత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై స్పీకర్కు సీఎం నోటీసు, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఖరి తదితర అంశాలపై టీఆర్ఎస్ ముఖ్య నేతలు శనివారం ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డితో చర్చించారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, శాసనసభ్యులు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు, ఏనుగు రవీందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దాస్యం వినయ్ భాస్కర్లు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత టీఆర్ఎస్ శాసనసభా పక్ష కార్యాలయంలోనే గండ్రతో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్కు నోటీసును ఇచ్చే అధికారం రాజ్యాంగబద్ధంగా లేదని, ఈ నోటీసులో చాలా తప్పులున్నాయని విశ్లేషించారు. దీనిపై లోతుగా చర్చించి రాజ్యాంగంలోని అంశాలను, శాసనసభా నిబంధనలను ఉదహరించాలని నిర్ణయించారు. సీఎం కిరణ్ వ్యవహార శైలిని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకించే విధంగా సమన్వయం చేయాలని గండ్రను కేకే కోరారు. స్పీకర్కు నోటీసు ఇచ్చామని సీమాంధ్రలో ప్రచారం చేసుకోవడానికి తప్ప.. దీనిద్వారా తెలంగాణ ఏర్పాటుకు జరిగే నష్టం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఏమిటని గండ్రను టీఆర్ఎస్ నేతలు ఆరా తీశారు. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడం మినహా తెలంగాణ నేతలు ఈ విషయంలో చేయగలిగేదేమీ ఉండదన్నారు. స్పీకర్ కు సీఎం ఇచ్చిన లేఖలో చాలా లోపాలున్నాయని, వాటిపై ఆదివారం వివరంగా చెప్తానని కేకే అన్నారు. మరోవైపు మంత్రి జానారెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళుతున్న నేపథ్యంలో ఆయనతో కేకే ఫోన్లో మంతనాలు జరిపారు. రాజ్యసభకు కాంగ్రెస్ తరపున ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపితే టీఆర్ఎస్ అభ్యర్థిగా కేకే రంగంలోకి దిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కేకేకు టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యునిగా అవకాశమిస్తే రెండు పార్టీల మధ్య వారధిగా పనిచేయడానికి వీలుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. పోటీ ఉంటే దూరమే మేలు.. కాంగ్రెస్ తరపున నలుగురు సభ్యులను పోటీకి దించితే తమ పార్టీ అభ్యర్థి పోటీ చేయకుండా ఉండటమే మేలని టీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులను మాత్రమే రంగంలోకి దించితే టీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టాలని, లేకుంటే పోటీకి వెళ్లొద్దని సూచిస్తున్నారు. -
'గడువు వద్దంటూ రాష్ట్రపతికి లేఖ రాస్తాం'
హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై గడువు పెంచొందంటూ రాష్ట్రపతికి లేఖ రాస్తామని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి స్పష్టం చేశారు. విభజన బిల్లుపై చర్చకు మరింత సమయం కావాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు కోరడం సమంజసం కాదన్నారు. తెలంగాణ బిల్లు అంశంపై గురువారం మీడియాతో మాట్లాడిన గండ్ర..సీమాంధ్ర నేతల వైఖరిని తప్పుబట్టారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువు దుర్వినియోగం చేసి మరింత సమయం కావాలని పట్టుబట్టడం కుట్రలో భాగమేనన్నారు. ఈ మేరకు టి.ఎమ్మెల్యేలమంతా కలిసి రాష్ట్రపతికి లేఖ రాస్తామన్నారు. అసెంబ్లీలో చర్చకు మిగిలిన ఏడు రోజులు పూర్తిగా వినియోగం చేసుకుని ఈ నెల 23 వ తేదీలోపు చర్చలు పూర్తి చేయాలని గండ్ర సూచించారు. ఒకవేళ గడువు పెంచాలని తీర్మానం చేయాలని చూస్తే మాత్రం అడ్డుకుంటామని హెచ్చరించారు. -
విభజన చర్చలో తిట్ల పురాణం
సాక్షి, హైదరాబాద్: తోడు దొంగలు... వెన్నుపోటుదారుడు... మోసకారి... గజదొంగ... సిగ్గులేదు... లూటీచేశారు... ఇవీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై చర్చ సందర్భంగా వినిపించిన తిట్ల పురాణం. ఆవేశకావేశాలు, దూషణలు, ఆరోపణలు, ఉద్రిక్త పరిస్థితులతో శాసనసభ గురువారం దద్దరిల్లింది. టీడీపీ, టీఆర్ఎస్ సభ్యుల మధ్య యుద్ధవాతావరణం ఏర్పడింది. దీంతో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క సభను శుక్రవారానికి వాయిదా వేశారు. చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి విభజన బిల్లుకు అనుకూలంగా మాట్లాడుతూ... చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడానికి వీల్లేదని... వెనుకబడిన ప్రాంతమని ప్రస్తావించాలంటూ అప్పటి మంత్రి దాస్యం ప్రణయ్భాస్కర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారని ఆరోపించడంతో సభలో గందరగోళానికి తెరలేచింది. తెలుగుదేశం పార్టీ సభ్యులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెల్లోకి దూసుకుని వచ్చారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్రావుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ‘‘కాంగ్రెస్-టీఆర్ఎస్ తోడుదొంగలు.. చంద్రబాబును దెబ్బతీయాలని కలసి పనిచేశాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ైవె ఎస్ 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ కావాలంటూ సంతకాలు చేయించి పంపారు. 2004 ఎన్నికల్లో ఇద్దరూ కలసి చంద్రబాబును దింపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపు తెలంగాణ ఇస్తామని చెప్పి.. పదేళ్లయినా ఇవ్వలేదు. వెయ్యిమంది విద్యార్థుల చావుకు కారణం వీరే. చంద్రబాబు 2008లో రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చారు. ఆ లేఖను వెనక్కి తీసుకోలేదు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నారు. కాంగ్రెస్కు సిగ్గులేదు.. మీ సీఎం ఏం మాట్లాడుతున్నారో చెప్పండి’’ అంటూ దయాకర్రావు విరుచుకుపడ్డారు. తోడుదొంగలు వ్యాఖ్యపై ఆగ్రహంతో వెల్లోకి దూసుకొచ్చిన టీఆర్ఎస్ సభ్యులు చంద్రబాబును దూషించడంతో టీడీపీ సభ్యులు సైతం వెల్లోకి దూసుకొచ్చారు. ఇరు పార్టీల సభ్యులు పరస్పరం తీవ్రంగా దూషించుకున్నారు. ఒక దశలో టీడీపీ సభ్యుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, టీఆర్ఎస్ సభ్యుడు నల్లాల ఓదెలు నువ్వెంతంటే నువ్వెంత? అంటూ హైదరాబాద్ను లూటీ చేశారు... దోచుకున్నారంటూ తిట్లపురాణం ఎత్తుకున్నారు. ఇరుపార్టీల నేతలు వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. ఈ దశలో డిప్యూటీ స్పీకర్ కల్పించుకుని... సభ సజావుగా సాగడానికి సూచనలు ఇవ్వాలే తప్ప.. రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు.. కేవలం సూచనలే చేయండని సూచించారు. ఆ తరువాత టీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు మాట్లాడుతూ... ‘‘తోడుదొంగలు అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నా. రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరికాయలు, ఆపరేషన్, ఇద్దరు పిల్లల సిద్ధాంతాలు ఎవరివి? ఎన్డీఏ హయాంలో తెలంగాణ రాకుండా అడ్డుకున్నామని చెప్పలేదా? స్పీకర్గా యనమల ఉన్నప్పుడు తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడానికి వీల్లేదని రూలింగ్ ఇవ్వలేదా? పార్లమెంట్లో బిల్లు పెట్టమని మీ నాయకుడు ఎందుకు చెప్పరు? వెన్నుపోటుదారుడు, మోసకారి, గజదొంగ అన్న మారు పేర్లు చంద్రబాబునాయుడుకు ఉన్నాయి...’’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. దీంతో టీడీపీ సభ్యులు ఒక్కసారిగా పోడియంలోకి దూసుకెళ్లి హరీశ్రావు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ దశలోనే సభను డిప్యూటీ స్పీకర్ శుక్రవారానికి వాయిదా వేశారు. -
ప్రపంచ స్థాయికి ఓరుగల్లు ఖ్యాతి
వెంకటాపురం, న్యూస్లైన్ : జిల్లాలో కాకతీయులు కట్టడాలు నిర్మించడం వలన ఓరుగల్లు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చేప్పే అవకా శం మనకు లభించిందని ప్రభుత్వ చీఫ్విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం రామప్ప ఆలయ ప్రాంగణంలో రెండవ రోజు కొనసాగిన కాకతీయ ము గింపు ఉత్సవాలకు ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గండ్ర మాట్లాడుతూ పురాతన ఆలయాలు కాకతీయులు నిర్మిం చినవేనని, అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయం టే అప్పటి సైన్స్ పరిజ్ఞానం ఎంతో గొప్పదన్నారు. దేవునిపై విశ్వాసం ఉండాలనే ఉద్ధేశంతోనే వారు ఆలయాలు నిర్మించారని పేర్కొన్నారు. నీటిలో తేలియాడే ఇటుకల తో రామప్ప ఆలయాన్ని నిర్మించడం అద్భుతమన్నారు. వారి కీర్తిని ప్రపంచ నలుమూలల చాటిచెప్పాలని కోరా రు. కాకతీయ ఉత్సవాలను భవిష్యత్లో అన్ని ప్రాంతా ల్లో నిర్వహించాలని చెప్పారు. అనంతరం కళాకారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ రాపోలు ఆనంద్భాస్కర్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, నాగపూరి రాజలింగం, కలెక్టర్ కిషన్, ఆసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, ఐటీడీఏ పీఓ సర్ఫరాజ్ అహ్మద్, ట్రైనీ కలెక్టర్ రాజీవ్గాంధీ, జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, ములుగు ఆర్డీఓ సభావట్ మోతీలాల్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, డీపీఆర్ఓ వెంకటరమణ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు ఘన స్వాగతం ఉత్సవాలకు వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులకు స్థానిక కళాకారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నంది విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఉత్సవాల ప్రారంభానికి ముందు కర్ణాటకకు చెందిన కళాకారులు చేసిన ‘గొల్లు గుణిత’ నృత్యం ఆకట్టుకుంది. ఉత్సవాలను తిలకించేందుకు మూడువేల మంది తరలివచ్చారు. కనువిందు చేసిన ఒడిస్సీ నృత్యం రామప్పలో శనివారం రాత్రి జరిగిన కాకతీయ ఉత్సవాల్లో పద్మశ్రీ మాధవి ముద్గల్ చేసిన ఒడిస్సీ నృత్యం కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచింది. ఆమె శిష్యులైన షోయాభిదాస్, షాలాకారాయి, శోభాబీస్ట్, దీపిక బీస్ట్ లు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కర్ణాటక కళాకారులు డోలు నృత్యాలు, వెంపటి నాగేశ్వరి బృందంచే శివాష్టకం నృత్యాలు అలరించాయి. -
సమైక్య తీర్మానం సాధ్యం కాదు: చీఫ్ విప్ గండ్ర
హైదరాబాద్:రాష్ట్ర విభజన బిల్లుపై రేపట్నుంచి అసెంబ్లీలో చర్చిస్తామని చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి తెలిపారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు శుక్రవారం వరకూ సభ కొనసాగుతోందన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్సార్ సీపీ చేస్తున్న సమైక్య తీర్మానం డిమాండ్ సాధ్యం కాదన్నారు. అసెంబ్లీ మాత్రం శుక్రవారం వరకూ జరుగుతుందని, మధ్యలో కొన్ని సెలవులుంటాయన్నారు. కాగా అసెంబ్లీ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందనేది స్పీకర్ ప్రకటిస్తారని తెలిపారు. సభలో టీడీపీ ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలకు స్పీకర్ ఆవేదన చెందారన్నారు. తక్షణమే ఆయన స్పీకర్ కు క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నాం: గండ్ర
తెలంగాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ను కోరినట్లు ప్రభుత్వ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలని దిగ్విజయ్ తమకు సూచించారని, కాంగ్రెస్ వల్లే తెలంగాణ వస్తోందన్న విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని ఆయన సూచించినట్లు చెప్పారు. విభజన బిల్లు రేపు లేదా సోమవారం అసెంబ్లీకి రావొచ్చని, దీనిపై తక్షణమే సభలో చర్చించాలని పట్టుబడతామని గండ్ర తెలిపారు. విభజన బిల్లుపై అసెంబ్లీ చర్చ జరగనుండగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఇప్పుడు సమైక్య తీర్మానం అనడం అసమంజసమని వివరించారు. -
'సీమాంధ్ర నేతల సమైక్య తీర్మానం సరికాదు'
హైదరాబాద్ : తెలంగాణ బిల్లును ప్రాధాన్యతగా తీసుకుని అసెంబ్లీలో చర్చను చేపట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మంత్రి డీకె అరుణ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత నేతలు గురువారం గండ్ర నివాసంలో భేటీ అయ్యారు. విభజన బిల్లు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై వారు చర్చ జరిపారు. భేటీ అనంతరం గండ్ర, డీకె అరుణ మీడియాతో మాట్లాడుతూ 2009 నుంచి తెలంగాణ తీర్మానం కోసం తాము పోరాడుతున్నామని, అయితే ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. ఇప్పుడు విభజన బిల్లు అసెంబ్లీకి వస్తుండగా సీమాంధ్ర నేతలు సమైక్య తీర్మానం ప్రవేశపెట్టాలనుకోవటం సరికాదన్నారు. అలాంటి తీర్మానానికి ఆస్కారం లేదని వారు స్పష్టం చేశారు. -
విడిపోతే విజయవాడే రాజధాని : గండ్ర
హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకే నష్టమని మంత్రి పార్థసారథి అన్నారు. అందుకు ప్రతిగా మీకు విడిపోవాలనే ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. అంతే కాకుండా విడిపోతే మీకు విజయవాడ రాజధాని అవుతుందని కూడా ఆయన అన్నారు. మీరు పైకి మాత్రమే సమైక్యమంటున్నారని గండ్ర విమర్శించారు. -
రాయల తెలంగాణకు ఒప్పుకోం: విద్యాసాగర్రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక వర్గం ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పన్నిన కుట్రలో భాగమే రాయల తెలంగాణ ప్రతిపాదన అని, దీన్ని తాము ఒప్పుకోబోమని బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగరరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ కుటిల నీతికి ఇదో నిదర్శనమని మండిపడ్డారు. నాటి కేంద్రప్రభుత్వం-నిజాంనవాబు, రజాకార్లతో యథాతథ స్థితి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టే నేడు సోనియా, మజ్లిస్తో ఒప్పందానికి వచ్చారన్నారు. మేం కోరుతున్నది తెలంగాణ మాత్రమే: గండ్ర స్వయంపాలన కోసమే తామంతా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నామే తప్ప రాయల తెలంగాణ కాదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.తెలంగాణ ప్రజలంతా తెలంగాణ కోరుతుంటే రాయల తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు ఈనెల 9న అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నామన్నారు. సభ్యుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ మూడు రోజుల గడువు ఇచ్చే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. దురుద్దేశాలతోనే రాయల తెలంగాణ : ఈటెల గోదావరిఖని, న్యూస్లైన్: దురుద్దేశాలతోనే రాయల తెలంగాణను కాంగ్రెస్పార్టీ తెరమీదకు తెచ్చిందని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో సోమవారం టీబీజీకేఎస్ సభలో ఆయన మాట్లాడారు. బిల్లు పెట్టకుండా, కాలయాపన చేస్తుండడం వల్లే రాయల తెలంగాణ వంటి కొత్త సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. కేసీఆర్ వల్లే ‘రాయల’ ప్రతిపాదన: ఎంపీ రాథోడ్ మంచిర్యాల, న్యూస్లైన్: టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ వల్లే కేంద్రం రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను విలీనం చేస్తామని ప్రకటించి జాప్యం చేయడవం వల్లనే కాంగ్రెస్ రాజకీయ లబ్దికోసం కోసం రాయల తెలంగాణ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. రాయల పేరుతో కాంగ్రెస్ కుట్ర: ఎర్రబెల్లి పాలకుర్తి, న్యూస్లైన్: రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ కుట్ర చేస్తోందని టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. సోమవారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ అంశాన్ని చర్చకు తీసుకురావడంలో కుట్ర దాగి ఉందన్నారు. ‘రాయల’ ఆమోదిస్తే ఉద్యమం: టీజేఎఫ్ హైదరాబాద్,న్యూస్లైన్: రాయలతెలంగాణ ప్రతిపాదన చేస్తే మరో ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ సోమవారం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీజేఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. పది జిల్లాల తెలంగాణ కావాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై 4న జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం అవుతున్నట్లు చెప్పారు. టీజీవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాయల తెలంగాణ అంటే మళ్లీ సమ్మె చేస్తామని హెచ్చరించారు. 5న విద్యాసంస్థల బంద్: శ్రీనివాస్ మాదిగ సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా ఉస్మానియా విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 5న తెలంగాణ విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్టు మాదిగ విద్యార్థి సమాఖ్య(ఎంఎస్ఎఫ్) రాష్ట్ర కో ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. తెలంగాణ కోసం 6న టీసీఎంజీ చలోఢిల్లీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం నిర్ణయించింది. ఈనెల 6న ఢిల్లీ వెళ్లి వారం రోజులపాటు అక్కడే మకాం వేయాలని తీర్మానించింది. సోమవారం రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ నివాసంలో సారథ్య బృందం నాయకులు జి.నిరంజన్, బి.కమలాకరరావు, నర్సింహారెడ్డి, శ్యాంమోహన్, డాక్టర్ శంకర్, బొల్లు కిషన్ తదితరులు సమావేశమై యాత్ర గురించి చర్చించారు. -
'విభజనపై సోనియా నిర్ణయమే శిరోధార్యం'
రాష్ట్ర విభజన విషయంలో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయమే శిరోధార్యమని ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన వరంగల్లో మాట్లాడుతూ... ఈ నెలాఖరులోగా టి.బిల్లు అసెంబ్లీకి వస్తుందని తెలిపారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే విప్ జారీ చేసే అవకాశం ఉండదన్నారు. భద్రచలంతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకే కాంగ్రెస్ అధిష్టానం కట్టుబడి ఉందని గండ్ర వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసునని గండ్ర వెంకటరమణ రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు. -
'చంద్రబాబు మాట్లాడిన తీరు అభ్యంతరకరం'
హైదరాబాద్: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల మరణంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు అభ్యంతరకరమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డారు. జీవితంలో అధికారం దక్కదనే అసహనంతో బాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకపార్టీకి అధ్యక్షుడిగా ఉండా చంద్రబాబు ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారని గండ్ర తెలిపారు. బాబు తన వైఖరిని మార్చుకోకుంటే తెలంగాణలో అడుగుపెట్టలేరని గండ్ర హెచ్చరించారు. తెలంగాణ టీడీపీ నాయకులు బాబు నాయకత్వంపై పునరాలోచన చేయాలన్నారు. పంజాబ్, శ్రీలంక సమస్యలను అప్పటి ఇందిరా గాంధీ, ఆమె తనయుడు రాజీవ్ గాంధీలు సరిగా డీల్ చేయకనే ఉగ్రవాదానికి బలయ్యారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఖండించారు. చంద్రబాబుకు మతిభ్రమించిందని ఎద్దేవా చేశారు. -
తెలంగాణ తీర్మానంపై ఓటింగ్ ఉండదు: చీఫ్ విప్ గండ్ర
హైదరాబాద్: తెలంగాణపై అసెంబ్లీకి వచ్చే తీర్మానంపై ఓటింగ్ ఉండదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు. కేవలం అభిప్రాయం మాత్రమే కోరతారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ అంశం అసెంబ్లీ తీర్మానానికి వస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఓడిద్దాం అని ఆయన చెప్పారు. ఈ పరిస్థితులలో ఈ విషయంలో ఉత్కంఠ మొదలైంది. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి వస్తుందా? రాదా? వస్తే ఓటింగ్ జరుగుతుందా? అభిప్రాయమే కోరతారా?.. ఇలాంటి ప్రశ్నలన్నీ తలెత్తుతున్నాయి. -
'జగన్ కు బెయిల్ రావడంపై బాబు వ్యాఖ్యలు అర్ధరహితం'
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డికి చట్ట ప్రకారమే బెయిల్ వచ్చిందని ప్రభత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ తెలిపారు. జగన్ కు సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జగన్మోహనరెడ్డికి బెయిల్ రావడం వెనుక కాంగ్రెస్ హస్తం ఉందన్న బాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆయన వ్యాఖ్యలు అర్ధరహితమని ఆయన తెలిపారు. జగన్ కు చట్ట ప్రకారమే బెయిల్ వచ్చిందన్న విషయాన్ని బాబు తెలుసుకోవాలన్నారు. సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జగన్ హైదరాబాద్ వదిలి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. అలాగే రెండు లక్షల రూపాయల విలువైన రెండు పూచీకత్తులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. -
సోనియా ప్రకటనను స్వాగతిస్తున్నాం: చీఫ్ విప్ గండ్ర
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటనను స్వాగతిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు అవుతున్నందున సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమించాలని గండ్ర విజ్ఞప్తి చేశారు. టీడీపీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది అని చీఫ్ విప్ గండ్ర విమర్శించారు. రెండు ప్రాంతాల ప్రజలను గందరగోళపరిచే టీడీపీ విధానం సరికాదు ఆయన హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాలు ముగియగానే అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చర్చకు వస్తుంది అని ఆయన తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుంది అని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
మోడీ విమర్శలకే పరిమితమయ్యారు: గండ్ర
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికే నరేంద్ర మోడీ పరిమితయ్యారని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మోడీ తన ప్రసంగంలో బీజేపీ విధానం చెప్పలేకపోయారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం-బీజేపీ మధ్య పొత్తుకు మోడీ పర్యటన దోహదపడిందని గండ్ర వ్యాఖ్యానించారు. బాలకృష్ణ, మురళీమోహన్లు...మోడీని ఎందుకు కలిశారో టీడీపీ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ పొత్తుపై చంద్రబాబునాయుడు తన వైఖరిని స్పష్టం చేయాలని గండ్ర అన్నారు. విభజనపై రాష్ట్రపతిని బాబు కలవాలనుకోవటం ఆయన రెండు కళ్ల విధానానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి అస్థిర విధానాలతో చంద్రబాబు మరింత పలుచన అవుతున్నారని గండ్ర అన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర నేతల వైఖరిని హైకమాండ్ గమనిస్తోందని..... వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది అధిష్టానం చూసుకుంటుందని గండ్ర పేర్కొన్నారు. -
అధిష్టానం నిర్ణయానికి అంతా కట్టుబడే ఉంటాం : గండ్ర