gas connections
-
‘సబ్సిడీ సిలిండర్’ ఎందరికి?
సాక్షి, హైదరాబాద్: సబ్సిడీ సిలిండర్లు అర్హులైన అందరికీ అందుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్కార్డుదారులు 90 లక్షలకు పైగా ఉండగా, తెల్లరేషన్కార్డులు ఉండి..ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న 40 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఉంది. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోకపోయి ఉండొచ్చని లబ్ధిదారుల ఎంపికను బట్టి అర్థమవుతోంది. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని చెప్పినా, ఇప్పటివరకు రెండోవిడత దరఖాస్తుల స్వీకరణ మొదలే కాలేదు. గృహావసర గ్యాస్ కనెక్షన్లు రాష్ట్రంలో 1.24 కోట్లు ఉన్నాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే రాష్ట్రంలో 10,75,202 ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో అర్హులందరికీ అవకాశం కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన దరఖాస్తులే ప్రాతిపదికగా... తెల్లరేషన్కార్డు కలిగి ఉన్న 90 లక్షల కుటుంబాల్లో అత్యంత నిరుపేదలు 20 శాతం అనుకున్నా, కనీసం 70 లక్షల కుటుంబాలకు సబ్సిడీ గ్యాస్ పథకం ద్వారా లబ్ధి చేకూరాలి. అయితే ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకుంటే, రేషన్కార్డు కలిగిన 40 లక్షల కుటుంబాలే మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్టు భావించాల్సి ఉంటుంది. వారం రోజుల పాటే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించగా, గ్రామాలు, పట్టణాల్లో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకోనట్టు ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులను బట్టి అర్థమవుతోంది. 40 లక్షల కుటుంబాలను మాత్రమే మహాలక్ష్మి కింద ఎంపిక చేసిన ప్రభుత్వం ఇతర అర్హులైన కుటుంబాలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే ఆ సమాచారమైనా దరఖాస్తుదారులకు రాలేదు. ప్రజాపాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ పథకానికి ఎంపికయ్యే అవకాశం ఉంటుందో లేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. కాగా ఎవరిని లబ్ధిదారులుగా గుర్తించారో వారికి కూడా ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఎవరికి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. రూ. 80 కోట్లు మాత్రమే విడుదల చేసిన సర్కార్ రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 80 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)ల ఖాతాల్లో జమ చేస్తే, పథకానికి అర్హులైన వినియోగదారుల రీఫిల్లింగ్ సమయంలో సిలిండర్ డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత గ్యాస్ కంపెనీలు రీయింబర్స్ చేస్తాయి. ఇందుకోసం తొలి విడతగా రూ. 80 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కాగా గ్యాస్ సిలిండర్ రీఫిల్ చార్జీ రూ.955 కాగా, మహాలక్ష్మి పథకం కింద రీఫిల్లింగ్ తర్వాత రూ.455 తిరిగి వినియోగదారులకు అందుతాయి. ఈ లెక్కన 40 లక్షల గ్యాస్ కనెక్షన్ల కోసం సబ్సిడీ కింద ఒక విడతలో రూ.120 కోట్లు సబ్సిడీ కింద ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. సగటున సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అందజేస్తే సాలీనా రూ.546 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. -
ఇంకా కట్టెల పొయ్యిలే..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని గ్రామీణ ప్రాంత కుటుంబాలు ఇంకా కట్టెల పొయ్యిల పైనే వంట చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యం అధిగమించేందుకు చేపడుతున్న కార్యక్రమాల ఫలితాలు ఆశించినంతగా లేవు. దేశంలో ఉన్న హౌస్హోల్డ్స్కు పూర్తిస్థాయిలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ.. పంపిణీ ప్రక్రియలో లోపాలు, శుద్ధ ఇంధన వాడకంపై అవగాహన కల్పించడంలో వెనుకబాటుతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా వంటకు శుద్ధ ఇంధనాన్ని విని యోగిస్తున్నారు. దేశంలోని 15 రాష్ట్రాలకు సంబంధించి శుద్ధ ఇంధన వాడకంపై నీతి ఆయోగ్ నివేదికను రూపొందించింది. ఇందులో ఆరు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 33% మాత్రమే ఎల్పీజీ సిలిం డర్ల ద్వారా వంట చేస్తున్నట్లు తేలింది. దేశంలో ఉన్న శుద్ధ ఇంధన విని యోగంలో అధికంగా ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) కనెక్షన్లే ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్త రాది రాష్ట్రాలతో పాటు పట్టణ నేపథ్యమున్న దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితులను పరి శీలిస్తూ వివరాలను నీతి ఆయోగ్ రిపోర్టులో పేర్కొంది. శుద్ధ ఇంధన వినియోగానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. మూడింట ఒక వంతే.. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామాల్లోనే వంటచెరకు వినియోగం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మూడింట ఒక వంతు మాత్రమే శుద్ధ ఇంధనాన్ని వాడుతున్నారు. కేవలం 33% మాత్రమే గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. వంటచెరకు లభ్యత ఎక్కువగా ఉండటంతో వినియోగశాతం పెరిగినప్పటికీ.. క్రమంగా ఆ ప్రభావం పర్యావరణంపై పడుతోంది. కొన్నిచోట్ల వంటచెరకుతో పాటు వంటచెరకు వ్యర్థాలు, ఇతర వ్యర్థాలను వినియోగిస్తున్నట్లు పరిశీలనలో తేలింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ కనెక్షన్లు ఇస్తున్నప్ప టికీ.. లబ్ధిదారులంతా వీటిని తక్కువ సందర్భా ల్లోనే వినియోగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో శుద్ధ ఇంధన వినియోగం సంతృప్తికరంగా ఉంది. దేశంలో శుద్ధ ఇంధన వినియోగంలో తెలంగాణ ఆరో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో గోవా, రెండో స్థానంలో పంజాబ్, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, హరియాణా, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలున్నాయి. రాష్ట్రంలో గృహాలకు మించి కనెక్షన్లు.. కొన్ని రాష్ట్రాల్లో గ్యాస్ కనెక్షన్లు గృహాల సంఖ్యకు మించి ఉన్నాయి. రాష్ట్రంలో 91.46 లక్షల గృహాలున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతుండగా.. అందులో 1.01 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లున్నాయి. పట్టణ ప్రాంతాలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గృహాల సంఖ్యకు మించి కనెక్షన్లున్నాయి. ఒక్కో గృహంలో ఒకటి, అంతకు మించి కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సరఫరా, అందుబాటులో ఉన్న డీలర్లు, నివాస ప్రాంతం మారడంతో కొత్త కనెక్షన్లు తీసుకోవడం లాంటి కారణాలతో కనెక్షన్లు పెరిగినట్లు తెలుస్తోంది. విస్తృత అవగాహన కల్పించాలి.. శుద్ధ ఇంధన వినియోగాన్ని విస్తృతం చేయాలంటే నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేయాల్సిన అవసరముందని నీతి అయోగ్ పేర్కొంది. ఆ మేరకు రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. ‘గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధ ఇంధన వాడకంపై విస్తృత అవగాహన కల్పించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి. అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూడాలి. అవసరమైనంత మేర ఎల్పీజీ సిలిండర్లు తక్కువ వ్యవధిలో సరఫరా చేసే వెసులుబాటు కల్పించాలి. విద్యుత్ సరఫరాకు వైర్లను వినియోగిస్తున్నట్లుగా గ్యాస్ సరఫరాకు పైప్లైన్లు ఏర్పాటు చేయాలి..’అని సూచించింది. -
పేదలందరికీ ‘ఉజ్వల’ వంట గ్యాస్ కనెక్షన్లు
న్యూఢిల్లీ: ఉజ్వల యోజనలో భాగంగా వంటగ్యాస్ కనెక్షన్లను పేదలందరికీ ఉచితంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 2016లో ప్రారంభించిన ఈ పథకాన్ని తొలుత గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఉద్దేశించారు. అనంతరం దీనిని ఎస్సీ, ఎస్టీలకు, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి విస్తరించారు. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. వంటగ్యాస్ కనెక్షన్ లేని, ప్రభుత్వ పథకాల లబ్దిదారులు కాని వారికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన వర్తింపజేయాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సోమవారం నిర్ణయించిందని ఆయన వివరించారు. 50 శాతానికి పైగా(కనీసం 20 వేలు) గిరిజన జనాభా ఉన్న బ్లాకుల్లో ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ పాఠశాలల్ని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు రూ.2,242 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. -
మామ అక్రమాలను నిలదీసినందుకు..
సాక్షి హైదరాబాద్: బోగస్ పత్రాలతో కోడలు సహా 25 మంది పేరిట బ్యాంకు ఖాతాలు, గ్యాస్ కనెక్షన్లు తీసుకొని వాటి ద్వారా ప్రతి నెలా వంట గ్యాస్ సబ్సిడీ కాజేయడమే కాకుండా దీనిపై నిలదీసిన కోడలికి కొడుకు చేత తలాక్ ఇప్పించిన ఉదంతం నగరంలోని పాతబస్తీలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం సైదాబాద్కు చెందిన మహ్మద్ రహ్మన్ కూతురు నస్రీన్కు ఫలక్నుమా పోలీస్టేషన్ పరిధిలో ఉంటున్న మహ్మద్ యూసుఫ్ కుమారుడు మహ్మద్ అలీకి 2014లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత దంపతులు సౌదీ అరేబియాలో వెళ్లిపోయారు. నకిలీ ఖాతా తెరిచి... ఇటీవల అనారోగ్యానికి గురైన నస్రీన్ వైద్యం కోసం హైదరాబాద్ వచ్చింది. చికిత్స ఖర్చుల కోసం భర్తను డబ్బు పంపాలని కోరింది. దీంతో భర్త.. జహానుమాలోని సిండికేట్ బ్యాంకులో నస్రీన్ పేరిట ఉన్న ఖాతాలోంచి సొమ్ము తీసుకోవాల్సిందిగా భార్యకు సూచించాడు. అయితే తనకు ఖాతా లేకున్నా ఆ బ్యాంకులోకి సొమ్ము ఎలా వచ్చిందని మామ మహ్మద్ యూసఫ్ను అడగ్గా ఆయన అదేమీ చెప్పకుండానే డబ్బును బ్యాంకు నుంచి తీసుకొచ్చి కోడలికి ఇచ్చాడు. దీనిపై అనుమానం వచ్చిన నస్రీన్... ఆ బ్యాంకుకు వెళ్లి ఖాతా వివరాలు పరిశీలించగా 2014లో తన పేరిట బోగస్ పత్రాలతో తెరిచినట్లు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా 2014 నుంచి ఆ ఖాతాలో తన భర్త జమ చేస్తున్న సొమ్మును మామ కాజేసిట్లు తెలుసుకుంది. అలాగే తన పేరిట, తోటికోడళ్లు, ఇతర మహిళల పేరిట బోగస్ పత్రాలతో 25 బ్యాంకు ఖాతాలను తెరిచి వాటి ద్వారా గ్యాస్ కనెక్షన్లను మామ సంపాదించాడని నస్రీన్ తెలుసుకుంది. ఈ కనెక్షన్ల పేరిట ప్రతి నెలా గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకొని అక్రమంగా సబ్సిడీ సొమ్మును పొందుతున్నట్లు ఆమె గుర్తించింది. పోస్టులో తలాక్..: ఈ అక్రమాలకు తన పేరును ఎందుకు వాడుకున్నావంటూ మామను నిలదీయగా సౌదీలో ఉన్న కొడుకుకు లేనిపోనివి చెప్పి పోస్టు ద్వారా తలాక్ ఇప్పించాడని నస్రీన్ ‘సాక్షి’కి తెలిపింది. మామపై ఈ నెల 1న పోలీసులకు ఫిర్యాదు చేయగా 14న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని వివరించింది. తాను జూలై 11న సౌదీ నుంచి వస్తే సెప్టెంబర్ 24న అందిన తలాక్ లేఖలో జూలై 2వ తేదీన తనకు తలాక్ ఇచ్చినట్లు భర్త అందులో పేర్కొన్నాడని బాధితురాలు చెప్పింది. తన పిల్లలు సౌదీలోనే ఉన్నారని, మామ, భర్త కలసి తన జీవితాన్ని నాశనం చేశారని వాపోయింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. మహ్మద్ యూసఫ్ గతంలోనూ పలు అక్రమాలకు పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. మరణించిన అల్లుడి పిల్లలను తన పిల్లలుగా చూపుతూ వారి పేరిట నకిలీ పాస్పోర్టులను తయారు చేసి గతంలో తాను పని చేసిన సౌదీ కంపెనీ నుంచి ఆర్థిక సాయం కూడా పొందాడని తెలిపింది. తనకు న్యాయం చేస్తానని పోలీసు కమిషనర్ హామీ ఇచ్చారని నస్రీన్ వివరించింది. -
పేద మహిళలకు కానుక ‘ఉజ్వల’
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: పొగ రహిత దేశాన్ని చూడాలన్నదే ప్రధాన మంత్రి మోదీ లక్ష్యమని, ఇందుకోసం పేద మహిళలు వంటగదిలో ఇబ్బందులు పడకుండా వారికి కానుకగా ఉజ్వల యోజనను ప్రవేశపెట్టారని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. శనివారం సూర్యాపేటలో ఆయన ఉజ్వల యోజనను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. అలాగే దళితులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఎస్వీ కాలేజి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంబేడ్కర్ జయంతి రోజు రాష్ట్రంలో ఉజ్వల పథకాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పథకం కింద ఒక్క రూపాయి కూడా కట్టనవస రం లేకుండా పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందిస్తామన్నారు. రాష్ట్రంలోని మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కోమురం భీం జిల్లాల్లో ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉన్నారని, ఈ జిల్లాల్లో 40 శాతం కటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు లేవని అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు లేవని, వీరందరికీ ఈ పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ నెల 20న దేశ వ్యాప్తంగా 15 వేల పైచి లుకు గ్రామాల్లో ఉజ్వల మేళా నిర్వహిస్తున్నామని, గ్యాస్ కనెక్షన్ కోసం పేదలు ఈ మేళాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఉజ్వల్ పథకంతో రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు పెరుగుతుండటంతో పంపిణీకి సమస్య లేకుండా డిస్ట్రిబ్యూటర్లను కూడా పెంచుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 73 పొగ రహిత గ్రామాలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వచ్చే నెల 5వ తేదీ నాటికి రాష్ట్రంలో 73 గ్రామాలను పొగ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దనున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయిస్తామని, నిరుద్యోగ భృతి కింద యువతకు ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇస్తామని చెప్పారు. అనంతరం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లబ్ధిదారులకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ సభలో ఎమ్మెల్సీ రాంచందర్రావు, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చింతా సాంబమూర్తి, నేతలు ప్రేమేందర్రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్రావు, జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గ్యాస్ కనెక్షన్లు పెంచండి: ఎంపీ వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్ల మంజూరు సంఖ్యను పెంచాల్సిందిగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్కు ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయనను కలసిన వినోద్ వినతిపత్రాన్ని సమర్పించారు. అలాగే గ్యాస్ డీలర్లకు ఇస్తున్న కమీషన్ను పెంచాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణలోని గ్రామీణ పాంత్రాల్లో గ్యాస్ సరఫరాకు వీలుగా రాష్ట్ర ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వినోద్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రదాన్ను కలసిన వారిలో గ్యాస్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దీపక్సింగ్ గెహ్లాట్ తదితరులు ఉన్నారు. -
అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు
► పెండింగ్ కనెక్షన్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలి ► జేసీ శ్రీకేశ్ బి. లఠ్కర్ విజయనగరం కంటోన్మెంట్ : అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని జేసీ శ్రీకేశ్ బి.లఠ్కర్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, సంబంధిత డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న దీపం కనెక్షన్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలన్నారు. సుమారు 4.78 లక్షల కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో దీపం పథకం కనెక్షన్లపై అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు మార్చిలోగా గ్యాస్ కనెక్షన్లు అందించాలన్నారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఐదు కిలోల గ్యాస్ సిలిండర్తో కూడిన స్టవ్ను అందించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి గ్రామస్థాయి అధికారులు, రేషన్ డీలర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. అలాగే ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సాధికార సర్వే గమనిస్తే ఎవరికి గ్యాస్ కనెక్షన్ లేదో తెలుస్తుందని చెప్పారు . జూన్ చివరి నాటికి అర్హులందరికీ కనెక్షన్లు మంజూరు చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. దీపం కనెక్షన్లపై ప్రతి 15 రోజులకోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. పెట్రోల్ బంక్లు, గ్యాస్ ఏజెన్సీదారులు నగదురహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ జె. శాంతికుమారి, ఏఎస్ఓ పి. నాగేశ్వరరావు, హెచ్పీసీఎల్ సేల్స్ మేనేజర్లు ఎం. చౌదరి, వివిధ గ్యాస్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు శ్రీధర్ రాజా, డీలర్లు శ్రీనివాసరావు, టి. సీతారామయ్య, రామకృష్ణ, వినియోగదారుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
-
ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
- రాష్ర్టంలో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అమలు - 20న విశాఖలో లాంఛనంగా ప్రారంభించనున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ - రాష్ట్రానికి లక్షా 90 వేల గ్యాస్ కనెక్షన్లు మంజూరు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో దారిద్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల(బీపీఎల్) వారికి ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు కానున్నాయి. ‘ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించనుంది. రాష్ట్రానికి సంబంధించి ఈ నెల 20న విశాఖపట్నంలో ఈ పథకాన్ని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లాంఛనంగా ప్రారంభించనున్నారని చమురు కంపెనీలు తెలిపాయి. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో లక్షా 90 వేల కనెక్షన్లను మంజూరు చేయనున్నారు. తెలంగాణలోనూ లక్ష కనెక్షన్లు మంజూరైనట్టు సమాచారం. వీటిని బీపీఎల్ కుటుంబాల్లోని మహిళల పేరిట అందజేస్తారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన కొద్దిమందికి కేంద్రమంత్రితోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందజేయనున్నట్టు చమురు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే పేరుకు ఉచితమే అయినప్పటికీ.. గ్యాస్ సిలిండర్పై వచ్చే సబ్సిడీ మొత్తాన్ని వాయిదాల రూపంలో తిరిగి తీసేసుకుంటారని ఈ వర్గాలు వెల్లడించాయి. సబ్సిడీని ఇలా... ఈ పథకం కింద ఇచ్చే ఒక్కో గ్యాస్ కనెక్షన్కు రూ.3,200 మేరకు వ్యయమవుతుందని చమురు కంపెనీలు చెబుతున్నాయి. ఈ కనెక్షన్ కింద మహిళా లబ్ధిదారులకు ఒక సిలిండర్, రెగ్యులేటర్, గ్యాస్ స్టవ్ ఇస్తారు. అదేవిధంగా ప్రధానమంత్రి బొమ్మ ముద్రించిన ఉజ్వల్ పుస్తకాన్ని అందజేస్తారు. ఇందులో రూ.1,600ను కేంద్రం సబ్సిడీగా అందిస్తుంది.మిగిలిన రూ.1,600 ను వినియోగదారుడు ముందుగా చెల్లించే పనిలేకుండా రుణంగా ఇస్తారు. దీన్ని గ్యాస్ సిలిండర్పై వచ్చే సబ్సిడీగా వసూలు చేస్తారు. ఘనత కేంద్రానికే దక్కేలా ప్రణాళిక ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకం ఘనత అంతా తమకే దక్కేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఎక్కడా రాష్ట్రప్రభుత్వ ఆనవాలు లేకుండా దీన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఎంపీల ద్వారా ప్రతీ జిల్లా కేంద్రంలో పథకాన్ని ప్రారంభిస్తారు. అదేసమయంలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఉజ్వల్ మేళా’లను నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మతో ఈ మేళాలను నిర్వహించనుండడం విశేషం. తద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ల మంజూరు ఘనతను పూర్తిగా తానే తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. -
అక్టోబర్ నాటికి నూరు శాతం గ్యాస్ కనెక్షన్లు
ఏలూరు (ఆర్ఆర్పేట) : జిల్లాలో వచ్చే అక్టోబర్ నెలాఖరులోగా రెండు లక్షల గ్యాస్ క¯ð క్షన్లు ఇచ్చి నూరుశాతం పూర్తి చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు చెప్పారు. కలెక్టరేట్లో శుక్రవారం దీపం పథకంపై జిల్లాలోని గ్యాస్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన వారికి 11 లక్షల గ్యాస్ క¯ð క్షన్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికే 9 లక్షల గ్యాస్ క¯ð క్షన్లు అందించామని, రెండు లక్షలు అక్టోబరు నెలాఖరులోగా అందిస్తామన్నారు. సమావేశంలో డీఎస్వో డి.శివశంకర్రెడ్డి పాల్గొన్నారు. -
‘దీపం’ పంపిణీ నెల రోజుల్లో పూర్తి చేయాలి
కాకినాడ సిటీ : జిల్లాకు మంజూరైన దీపం గ్యాస్ కనెక్షన్లను నెల రోజుల్లోగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఎల్పీజీ డీలర్లను జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో దీపం కనెక్షన్ల పంపిణీ పురోగతిపై సమీక్షించారు. జిల్లాకు 2,26,000 దీపం కనెక్షన్లు మంజూరైనట్టు తెలిపారు. వీటిలో 1,31,000 కనెక్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారన్నారు. మిగిలిన కనెక్షన్లను త్వరితగతిన పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. ఎంపీడీఓల సమన్వయంతో లబ్ధిదారుల జాబితాలకు జన్మభూమి గ్రామ కమిటీల ఆమోదంతో త్వరితగతిన పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. అన్ని కనెక్షన్లను డోర్ డెలివరీ చేయాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారు. సర్వే సత్వరమే పూర్తి చేయాలి ప్రజాసాధికార సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. సర్వే ప్రగతిపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టరేట్ నుంచి మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. ఎన్యూమరేటర్లను ఉదయమే క్షేత్రస్థాయికి పంపించాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలని, ఎన్యూమరేటర్లుగా ఉన్న మహిళలను సాయంత్రం విధుల నుంచి రిలీవ్ చేయాలన్నారు. పింఛన్ల పంపిణీకి తీసుకున్న ట్యాబ్లను ఐదో తేదీ సాయంత్రానికి తహసీల్దార్లకు అప్పగించాలని ఎంపీడీఓలకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పద్మ, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. -
మా ఇంటికి కిటికీలు ఉండేవి కావు: మోదీ
లక్నో: 'చాలా పేద కుటుంబుంలో పుట్టి పెరిగాను. మా ఇంటికి కిటికీలు కూడా ఉండేవి కావు. ఇంట్లో వంట కట్టెల పోయ్యిపై అమ్మ వంట చేయాల్సి వచ్చేది' అని ప్రధాని నరేంద్ర మోదీ తన కుటుంబ నేపథ్యాన్ని వివరించారు. ఉత్తరప్రదేశ్ లోని బాలియాలో 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన మరికొన్ని అంశాలు... మొత్తం 5 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేస్తామని పేర్కొన్నారు. మహిళల పేరిటే ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమ్మ కష్టాలు చూసిన వాడ్ని కనుక మహిళల ఇబ్బందులను తొలగించేందుకు తమ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాలు ఓట్ల గురించి మాత్రమే ఆలోచించాయి తప్ప ప్రజల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం గత ప్రభుత్వాలు పనిచేయలేదని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
'పేదలకు గ్యాస్ కనెక్షన్లు అధికంగా ఇవ్వాలి'
న్యూఢిల్లీ: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బృందం గురువారం ఢిల్లీలో పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కలిసింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి, పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని ధర్రేంద్రకు వైఎస్ జగన్ వివరించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు గ్యాస్ కనెక్షన్లు అధికంగా ఇవ్వాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ వెంట పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. అంతకముందు వైఎస్ జగన్ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) నదీమ్ జైదీని కలిశారు. ఏపీలో ఫిరాయింపుల వ్యవహారాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అధికార టీడీపీ సాగిస్తున్న అనైతిక రాజకీయాలు, ప్రలోభాలతో ఎమ్మెల్యేలను లోబర్చుకుంటున్న తీరును వివరించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్ జగన్ నేతృత్వంలో 'సేవ్ డెమొక్రసీ' ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పార్టీ నాయకులతో పాటు వైఎస్ జగన్ ఢిల్లీలో పలువురు జాతీయ పార్టీల నేతలను, కేంద్ర మంత్రులను కలిశారు. -
తగ్గిన ‘దీపం’ వెలుగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదింటి మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు ఉద్దేశించిన ‘దీపం’ పథకానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయి. గతేడాది ఈ పథకానికి రూ.37.61 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.21.61కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పటికే 6,55,354 మందికి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా, 5,43,412 మంది అర్హులను గుర్తించారు. వీరిలో ఇప్పటివరకు రెండు లక్షల మందికి మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. భారీ లక్ష్యం ముందున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో కేటాయింపులను తగ్గించినట్లుగా తెలుస్తోంది. -
దీపానికీ పచ్చముద్ర
జన్మభూమి కమిటీ ఓకే అంటేనే గ్యాస్ కనెక్షన్ జిల్లా వ్యాప్తంగా 35 వేల కనెక్షన్లు కుప్పానికే 9 వేలు అర్హులైన పేదలందరికీ దీపం గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలతో కూడిన జన్మభూమి కమిటీ ఓకే చెప్పందే కనెక్షన్ మంజూరు చేయడంలేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల మాటలు చెల్లుబాటు కావడం లేదన్న విమర్శలున్నాయి. అర్హతతో సంబంధం లేకుండా టీడీపీ శ్రేణులకే గ్యాస్ కనెక్షన్లు అందుతున్నట్లు సమాచారం. చిత్తూరు: చంద్రబాబు ప్రభుత్వం దీపం గ్యాస్ కనెక్షన్లకు సైతం జన్మభూమి కమిటీల ఆమోదముద్ర తప్పనిసరి చేయడంతో టీడీపీ నేతలకు తప్ప పేదలకు గ్యాస్ అందని పరిస్థితి ఏర్పడింది. జన్మభూమి కమిటీలు ఆమోదముద్ర వేసిన జాబితానే తహశీల్దార్లు ఓకే చేస్తుండగా వాటికి మాత్రమే పౌరసరఫరాల శాఖ అధికారులు కనెక్షన్లు పంపిణీ చేస్తున్నారు. అర్హులైన పేదలందరికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ ప్రకటించింది. ఈ ప్రకారం సర్వే నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా 4.45 లక్షల మందికి గ్యాస్ లేనట్లు తేలింది. ఇందులో ఈ ఏడాది 1,60,800 మందికి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 70 వేలమంది దరఖాస్తు చేసుకోగా మొదటి విడతలో 35 వేల కనె క్షన్లు పంపిణీ చేశారు. మిగతా 35 వేల మందికి రెండవ విడతలో పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నా జన్మభూమి కమిటీల ఆమోదం లభించకపోవడంతో పెండింగ్లో పడినట్లు తెలుస్తోంది. లక్ష్యం మేరకు ఇంకా 1.35 లక్షల మందికి ఈ ఏడాదే గ్యాస్ ఇవ్వాల్సి ఉంది. పెండింగ్ జాబితా కాకుండా జిల్లా వ్యాప్తంగా మరో 3 లక్షలమంది అర్హులున్నారు. వీరందరికీ ఎప్పటిలోగా గ్యాస్ అందిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. అర్హతలతో పాటు అధికార పార్టీ నేతల సిఫారసు కూడా.. దీపం కనెక్షన్ కావాల్సిన వారు నిబంధనల ప్రకారం దరఖాస్తుతోపాటు రేషన్కార్డు, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పిస్తున్నారు. అయితే జన్మభూమి కమిటీల ఆమోదముద్ర తప్పనిసరి కావడంతో కేవలం అధికార పార్టీ కార్యకర్తలు చెప్పినవారికే గ్యాస్ ఇస్తున్నారు తప్పితే అర్హుల దరఖాస్తులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంకే ప్రాధాన్యం ఇస్తూ జిల్లాను గాలికొదిలేశారన్న విమర్శలున్నాయి. 14 నియోజకవర్గాల పరిధిలో 35 వేల కనె క్షన్ ఇచ్చినట్లు చెబుతున్నా ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 9వేల కనెక్షన్లు ఇవ్వడం ఇందుకు నిదర్శనం. జిల్లా వ్యాప్తంగా 4.50 లక్షల పైచిలుకు అర్హులకు గ్యాస్ లేదని గణాంకాలు చెబుతున్నా అధికారులు మాత్రం వారందరికీ గ్యాస్ ఇచ్చే ప్రయత్నం చేయకుండా జన్మభూమి కమిటీల మాటున కేవలం అధికార పార్టీ కార్యకర్తలకే పంపిణీ చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
సగం మందికి నో గ్యాస్
♦ ఇంటిగ్రేటెడ్ సర్వేలో గుర్తింపు ♦ జిల్లాలో 5.50 లక్షల కార్డుదారులకే గ్యాస్ ♦ అర్హుల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు ♦ మార్చి 31లోగా 1.50 లక్షల దీపం కనెక్షన్లు ♦ నెలకు 25 వేల కనెక్షన్ల పంపిణీకి చర్యలు సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో అల్పాదాయ వర్గాల(బీపీఎల్)కు చెందిన వారిలో సగం మందికి గ్యాస్ కనెక్షన్ లేదని లెక్కతేల్చారు. వీరిలో అర్హులను గుర్తించి దీపం పథకంలో కొత్త కనెక్షన్లు మంజూరుకు చర్యలు చేపట్టారు. నెలకు కనీసం 25వేల కనెక్షన్ల చొప్పున 2016 మార్చి 31లోగా జిల్లాలో 1.50 లక్షల కనెక్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బీపీఎల్ కార్డు కలిగి ఆ కుటుంబంలో ఏ ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ లేకుంటే కొత్త గ్యాస్ కనెక్షన్ వచ్చినట్టే. ఏజెన్సీలో 43,978 మందికే గ్యాస్ ఇంటిగ్రేటెడ్ సర్వే మేనేజ్మెంట్ ఇన్ ఫర్మేషన్ సిస్టమ్ వద్ద ఉన్న గణాంకాలను బట్టి జిల్లాలో 10,85,573 బీపీఎల్ కార్డుల్లో 5,49,595 కార్డుదారులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మిగిలిన 5,35,978 కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్ లేదని నిర్ధారణకు వచ్చారు. వీరిలో అత్యధికం ఏజెన్సీ పరిధిలోనే ఉన్నారు. ఏజెన్సీలో 2,19,092 కార్డుదారులుంటే వారిలో కేవలం 43,978 మందికి మాత్రమే గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కార్డు తీసుకునేటప్పుడు, ఆ తర్వాత డీలర్ల ద్వారా సేకరించిన వివరాల ప్రకారం లెక్కతేలిన ఈ జాబితాపై నిగ్గు తేల్చేందుకు ఇంటింటా సర్వే జరపాలని ఇప్పటికే తహశీల్దార్లను జిల్లా యంత్రాంగం ఆదేశించింది. గ్యాస్ కనెక్షన్లు లేని వారిలో ఎవరైనా ఈ మధ్యకాలంలో గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారా? లేదా అని ఆరా తీస్తున్నారు. ఎంతలేదనుకున్నా మరో నాలుగు లక్షలకుపైగా గా్యస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉంటుందని అంచనా. బీపీఎల్ కార్డుదారులందరికీ గ్యాస్ సాచురేషన్ పద్ధతిలో అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్న సర్కారు తొలి విడతగా జిల్లాకు 1.50 లక్షల దీపం కనెక్షన్లు మంజూరు చేసింది. గతేడాది మంజూరు చేసిన 33 వేల కనెక్షన్లు ఇంకా పంపిణీ జరగకపోవడంతో వాటితో సహా 2016 మార్చి 31లోగా జిల్లాలో 1.50 లక్షల దీపం కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించింది. ఆ మేరకు గ్యాస్ కంపెనీలకు సబ్సిడీమొత్తాన్ని సర్కార్ జమ చేసిందంటున్నారు. జన్మభూమి కమిటీలతో ప్రమేయం లేకుండా గ్యాస్ కనెక్షన్ లేని బీపీఎల్ కార్డుదారులందరికీ దీపం కనెక్షన్ మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టామని రూరల్ డీఎస్ఓ శాంతకుమారి తెలిపారు. -
పేదల ‘దీపం’కు మోక్షం !
తొలి విడతకు ఐదు వేల కనెక్షన్లు కొనసాగుతున్న లబ్ధిదారులు ఎంపిక డిసెంబర్లోగా కనెక్షన్ల పంపిణీ పూర్తిడ సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లోని పేదింటి మహిళలకు ‘దీపం’ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. తొలి విడతగా నియోజకవర్గానికో ఐదు వేల దీపం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జీహెచ్ఎసీ పౌరసరఫరాల శాఖ అధికారులు లబ్ధిదారులకు ఎంపికకు కసరత్తు ప్రారంభించారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తిచేసి ఈ ఏడాది చివరి నాటికి అర్హులకు కనెక్షన్లు జారీ చేసే విధంగా చర్యలు చేపట్టారు. అర్హులైన నిరుపేద మహిళలకు దీపం పథకం కింద కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం ఫిబ్రవరి నెలలోనే మార్గదర్శకాలు విడుదల చేసింది. రాజకీయ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో మార్గదర్శకాల్లో కొద్దిపాటి మార్పులు చేసి ఇన్చార్జి మంత్రులకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను కట్టబెడుతూ సరిగ్గా రెండు మాసాల క్రితం మరో ఉత్తర్వు ఇచ్చింది. అప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలతో పాటు అర్బన్ ఐకేపీ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ కార్యాలయం (సీఆర్వో), రంగారెడ్డి పౌరసరఫరాల శాఖ కేవలం కనెక్షన్ల మంజూరు, గ్యాస్ ఏజెన్సీల ఎంపిక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి సర్కిల్లోనూ స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో వార్డు కమిటీ సమావేశాల్లో లబ్ధిదారులను ఎంపిక నిర్వహించాలి, కానీ ప్రస్తుతం కార్పొరేటర్లు మాజీలయ్యారు. దీంతో నియోజకవర్గ ఎమ్మెల్యే సమక్షంలో డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపికను పౌర సరఫరాల అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉచితంగా కనెక్షన్లు జీహెచ్ఎంసీ పరిధిలోని నిరుపేద కుటుంబాల్లో దీపం పథకం కనెక్షన్లు వెలుగు నింపనున్నాయి. వాస్తవంగా పథకం కింద ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా అందించాల్సి ఉంటుంది. గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ రూ.1600 లను ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటికే మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కనెక్షన్లకు సంబంధించి నిధులను సైతం విడుదల చేసింది. సిలిండర్ కోసం సెక్యూరిటీ డిపాజిట్ రూ.1450, కాగా, రెగ్యులేటర్ కోసం రూ.150లు. దీపం పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు జారీ చేసి ఖాళీ సిలిండర్, రెగ్యులేటర్ అందజేస్తారు. లబ్ధిదారులు కనెక్షన్ డాక్యుమెంట్, పాస్బుక్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఐఎస్ఐ మార్క్ గల గ్యాస్ స్టౌవ్, పైపు, గ్యాస్(నిండిన) మాత్రమే కోనుగోలు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారుడు దీపం కనెక్షన్తో పాటు డీలరు వద్ద తప్పనిసరిగా గ్యాస్ స్టౌవ్ను కొనుగోలు చేయాల్సి అవసరం లేదు. చమురు సంస్థలు కూడా కనెక్షన్లకు సిద్ధమయ్యాయి. -
మత్స్యకారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ
ముత్తుకూరు (శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు) : కృష్ణపట్నం పోర్టు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కితాబునిచ్చారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మత్స్యకారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణపట్నం పోర్టు గురించి మాట్లాడారు. అనంతరం సీవీఆర్ జ్యోతి పథకం కింద మొత్తం 660 మంది మత్స్యకారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పోర్టు సీఈవో అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
గాలిలో దీపం
- దీపం పథకం కింద జిల్లాకు 31,159 కనెక్షన్లు మంజూరు - పూర్తికాని లబ్ధిదారుల ఎంపిక - జూన్ నాటికే కనెక్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశం - ఓపెన్ కాని దీపం వెబ్సైట్ - మూడేళ్లలో మంజూరై, గ్రౌండు కాని 69,273 కనెక్షన్లు రద్దు సాక్షి ప్రతినిధి, తిరుపతి: దీపం పథకం కింద పేదలకు ఇచ్చే గ్యాస్ కనెక్షన్ల మంజూరులో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏటా జిల్లాకు వేల సంఖ్య లో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పేదలందరికీ మాత్రం చేరడం లేదు. లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. 2011-14 అంటే మూడేళ్లలో సాధారణ, ప్రత్యేక కేటగిరీలో జిల్లాకు 87,271 కనెక్షన్లు మంజూరు కాగా, ఇందులో కేవలం 17,998 కనెక్షన్లు మాత్రమే లబ్ధిదారుల కు ఇచ్చారు. మిగిలిన 69,273 కనెక్షన్లను పెం డింగ్లో ఉంచారు. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గత మూడేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న గ్యాస్ కనెక్షన్లను రద్దు చేసింది. తాజాగా జిల్లాకు 31,159 కనెక్షన్లను మంజూరు చేశారు. వీటిని కూడా జూన్ లోపల గ్రౌండ్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇంతవరకు లబ్ధిదారుల ఎంపిక జరిపి వారికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన దాఖలాలు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు. ఏటా జరిగే తంతు మాదిరి ఈసారీ జరుగుతుందేమోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తులు ఎంపీడీవో కార్యాలయంలో ఇచ్చి దీపం కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక ఇలా.. మండలంలో దరఖాస్తులను ఏంపీడీవోలకు అందజేయాలి. అందులో అర్హులైన వారిని గుర్తించి వారి దరఖాస్తులను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. రూరల్ పరిధిలో డీఆర్డీఏ పీడీకి, నగర, పట్టణ పరిధిలో అయితే కమిషనర్కు జాబితాను అందజేస్తారు. వీరు ఇన్చార్జి మంత్రి ఆమోదంతో తుది జాబితాను ఎంపిక చేసి లిస్టును గ్యాస్ ఏజెన్సీలకు పంపుతారు. దీనికి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్సైట్ను తయారు చేసింది. రెండు నెలలుగా ఆ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల దరఖాస్తులను అప్లోడ్ చేయలేదు. చివరకు ఈ వెబ్సైట్ పనిచేయకపోవడంతో తాజాగా ఈనెల 17వ తేదీన ఈపీడీఎస్ వెబ్సైట్లోనే దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని సూచించింది. దీంతో ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. -
వెలగని దీపం!
పాలమూరు : దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు దీపం పథకం ద్వారా ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించాలన్న సర్కారులక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. కనెక్షన్లు మంజూరై రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు ఏ ఒక్కరికీ గ్యాస్ అందకపోవడం గమనార్హం. గత ఏప్రిల్లో నియోజకవర్గానికి ఐదువేల చొప్పున జిల్లాలోని 14 నియోజకవర్గాలకు 70వేల కనెక్షన్లను ప్రభుత్వం మంజూరుచేసింది. దరఖాస్తులు స్వీకరించి మూడునెలలైనా అర్హుల జాబితా ఇంతవరకు ఖరారుకాలేదు. కలెక్టర్ చైర్మన్గా ప్రత్యేకకమిటీ లబ్ధిదారులను ఎంపికచేస్తుంది. మండలస్థాయిలో ఆ బాధ్యతను ఎంపీడీఓలకు కట్టబెట్టారు. గ్రామస్థాయిలో వచ్చిన దరఖాస్తులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్న నిబంధనలకు స్వస్తి పలికారు. స్థానిక అధికార పార్టీ నాయకుల సిఫార్సులు, సర్పంచ్ల జాబితా మేరకు ఎంపీడీఓలు లబ్ధిదారుల తుదిజాబితా రూపకల్పనలో జాప్యం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జిల్లా అధికార యంత్రాంగానికి జాబితా చేరలేదు. గ్రామాల నుంచి వచ్చిన వాటిని ఆధార్ ప్రామాణికంగా డేటాఎంట్రీ పూర్తిచేసి జిల్లా పౌరసరఫరాల కార్యాలయానికి పంపించాల్సి ఉంది. జిల్లాలో ఏ మండలంలో కూడా జాబితా రూపకల్పన మొదలుపెట్టకపోగా గ్రామసభల ద్వారా ఎంపికచేసిన జాబితా కూడా చేరలేదని తెలుస్తోంది. కొలిక్కిరాని పంపిణీ ప్రక్రియ జిల్లాలో సమగ్రకుటుంబ సర్వే ప్రకారం 9.85లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందులో 5.21లక్షల గ్యాస్కనెక్షన్లు ఉండగా 4.64లక్షల కుటుంబాలకు కనెక్షన్లు లేవని తేలింది. ప్రభుత్వం మంజూరుచేసిన 70వేల కనెక్షన్లకు 1.80లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో మహిళా సంఘాలకు ప్రాధాన్యమిస్తూ 25శాతం ఎస్సీలు, 16శాతం ఎస్టీలు, మైనార్టీలకు గ్యాస్కనెక్షన్ అందించాలని నిర్ణయించారు. సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము ఒక్కో కనెక్షన్కు రూ.1600చొప్పున మొత్తం 70వేల కనెక్షన్లకు రూ.11.20కోట్లు అందజేసింది. మే నెలలో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ నిర్ణీత గడువు దాటినా పంపిణీ ఓ కొలిక్కిరాలేదు. లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్కనెక్షన్లు జారీచేసి ఖాళీ సిలిండర్తో పాటు రెగ్యులేటర్ ఇస్తారు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గతంలో ప్రభుత్వం నుంచి దీపం పథకం ద్వారా లబ్ధిపొందని వారు, గ్యాస్కనెక్షన్ తీసుకునేందుకు డబ్బు వెచ్చించలేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులు. గ్రామసభల ద్వారా ఎంపికచేసిన లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ ఆమోదించి ఆ తరువాత జిల్లా మంత్రికి నివేదించిన తరువాతే కనె క్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం మేల్కోవాల్సి ఉంది. ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మండలస్థాయిలో కొనసాగుతోంది. మండలాల వారీగా తుది జాబితాను జిల్లాకు పంపుతారు. వాటిని జిల్లా కమిటీ ద్వారా స్క్రీనింగ్ చేసి అర్హులకు గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు చర్యలు చేపడతాం. - లక్ష్మినారాయణ, ఇన్చార్జి, డీఎస్ఓ -
సబ్సిడీ కిరోసిన్కు మంగళం!
పేదలకు అందుబాటులో వంటగ్యాస్ దశలవారీగా కిరోసిన్ కోటా కట్ ‘దీపం’ కింద ఈ నెలాఖరులో 70వేల మందికి గ్యాస్ కనెక్షన్లు జిల్లాలో కుటుంబాలు: 12 లక్షలు నెలనెలా కిరోసిన్ పంపిణీ: 2004 కిలోలీటర్లు ఈ నెలాఖరు వరకు ఇవ్వనున్న ‘దీపం’ కనెక్షన్లు: 70వేలు రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు పంపిణీ చేస్తున్న కిరోసిన్ను ఎత్తివేయాలని కేంద్ర సర్కారు భావిస్తోంది. ప్రతి కుటుంబానికి వంట గ్యాస్ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సబ్సిడీ కిరోసిన్కు మంగళం పాడాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే పేదలకు విరివిగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే తాజాగా ‘దీపం’ పథకం కింద జిల్లాకు 70వేల గ్యాస్ కనెక్షన్లను జారీచేసింది. నియోజకవర్గానికి ఐదు వేల మంది లబ్ధిదారులకు వీటిని జారీ చేయాలని నిర్ణయించిన జిల్లా యంత్రాంగం... ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో ప్రస్తుతం 12 లక్షల కుటుంబాలకు 2004 కిలోలీటర్ల కిరోసిన్ను పంపిణీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ కుటుంబాలకు గ్యాస్ను సమకూర్చడం ద్వారా కిరోసిన్ కోటాను రద్దు చేయాలని యోచిస్తోంది. కుటుంబాలకంటే కనెక్షన్లు ఎక్కువ! మన జిల్లాలో కుటుంబాలకంటే అధికంగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయంటే నమ్ముతారా? ఔను.. ఇది నిజం. చమురు కంపెనీలు ఇటీవల తేల్చిన లెక్కల ప్రకారం జిల్లాలో కుటుంబాలను మంచి గ్యాస్ కనెక్షన్లు జారీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ గ్యాస్ ముఖం చూడని కుటుంబాలెన్నో ఉండగా, గ్యాస్కనెక్షన్లు మాత్రం 121 శాతం నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 12,84,755 లక్షల కుటుంబాలు ఉండగా, 15,59,312 లక్షల గ్యాస్ క నెక్షన్లు ఉన్నట్లు ఆయిల్ సంస్థలు నివేదించాయి. జిల్లా అధికారులు మాత్రం ఆయిల్ కంపెనీల వాదనతో విబేధిస్తున్నారు. 2011 జనగణన ప్రకారం జిల్లాలో 12.35లక్షలున్న కుటుంబాలు కాస్తా.. గతేడాది నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నాటికి 16.54 లక్షలు ఉన్నట్టు తేలినందున.. ఇందులో ఆశ్చర్చపడాల్సిన అవసరమేమీలేదని కొట్టిపారేస్తున్నారు. కుటుంబాల సంఖ్య వృద్ధికి అనుగుణంగానే గ్యాస్ కనెక్షన్లు పెరిగాయని అంటున్నారు. కొన్ని కుటుంబాలు ఒక కనెక్షన్కంటే అదనంగా కలిగి ఉండే అవకాశమున్నందున.. కనెక్షన్ల సంఖ్య కుటుంబాలను దాటి ఉండే వీలులేకపోలేదని చెబుతున్నారు. -
ఎడతెగని నిరీక్షణ
కొత్త సర్కార్ వచ్చాక కొత్త రేషన్ కార్డులు, కొత్త దీపం గ్యాస్ కనెక్షన్లు వస్తాయని ఎంతోమంది ఆశపడ్డారు. కొత్త కార్డుల కోసం ఎంతో ఆశతో దరఖాస్తు చేశారు. నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయినా ఫలితం సున్నా. ఇప్పటివరకూ జిల్లాలో కొత్తగా ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో కూడా వారికి రేషన్ కార్డులు దక్కే అవకాశం లేకుండా పోయింది. మరోపక్క దీపం కనెక్షన్లు మంజూరైనా లబ్ధిదారుల జాబితాకు మోక్షం కలగడంలేదు. దీంతో వారికి ఎడతెగని నిరీక్షణ తప్పడంలేదు. - సాక్షి ప్రతినిధి, కాకినాడ సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో కొత్త రేషన్ కార్డులకోసం వేలాదిమంది దరఖాస్తు చేసుకుని నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. వారిలో అర్హులను అధికారులు పక్కాగా గుర్తించి, ప్రతిపాదనలు పంపించినా.. ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకు లేదు. గత అక్టోబర్లో జరిగిన జన్మభూమిలోను, కలెక్టరేట్ గ్రీవెన్స్సెల్లోను జిల్లా నలుమూలల నుంచి రేషన్ కార్డుల కోసం 1,61,410 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై గ్రామస్థాయిలో పక్కాగా సర్వే చేసిన పౌర సరఫరాల అధికారులు 1,48,520 మంది కొత్త కార్డులకు అర్హులని తేల్చారు. 12,890 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. అర్హులుగా జిల్లా యంత్రాంగం గుర్తించిన వారంతా గత తొమ్మిది నెలలుగా కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఎటూ పాలుపోని అధికారులు రేపు మాపు అంటూ ఇంతకాలం వారికి చెబుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో బుధవారం నుంచి రెండో విడత జన్మభూమి - మా ఊరు కార్యక్రమం ప్రారంభమవుతోంది. కనీసం ఇందులోనైనా కార్డులు వస్తాయని అంతా ఆశించారు. ఇప్పుడు ఆ ఆశలు కూడా అడియాసలు అవుతున్నాయి. ఎందుకంటే ఈసారి జన్మభూమి కార్యక్రమంలో ప్రభుత్వం అసలు రేషన్కార్డుల ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో కొత్త కార్డులు వస్తాయని ఆశిస్తున్న వారంతా ప్రభుత్వ తీరుపై ఆవేదన చెందుతున్నారు. గాలిలో ‘దీపం’ దీపం గ్యాస్ కనెక్షన్ల మంజూరులోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 2014-15 సంవత్సరానికిగానూ జిల్లాకు ప్రభుత్వం 29 వేల దీపం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. వీటిని జిల్లాలోని 64 మండలాలకు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయించారు. కాకినాడ డివిజన్కు 6,301, రాజమండ్రి డివిజన్కు 5,518, రామచంద్రపురానికి 3,597, అమలాపురం డివిజన్కు 6,588, పెద్దాపురానికి 5,077, రంపచోడవరం డివిజన్కు 1,917 కనెక్షన్లను కేటాయించారు. ఇవి మంజూరై మూడు నెలలు దాటినా లబ్ధిదారుల జాబితాకు ఇంతవరకూ గ్రీన్సిగ్నల్ లభించలేదు. మండలాలవారీగా కేటాయించిన గ్యాస్ కనెక్షన్లకు లబ్ధిదారుల జాబితాను మండల స్థాయిలో తయారు చేసినప్పటికీ ఆన్లైన్లో పరిశీలన జరగాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 9,42,472 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో హెచ్పీ 6,63,846, ఇండేన్ 1,40,018, భారత్ గ్యాస్ 1,38,608 కనెక్షన్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఒక్క గ్యాస్ కనెక్షన్కు కూడా ఆమోదం లభించకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆధారుణంగా రద్దు!
పేదల కడుపు కొడుతున్న సర్కార్ ఈ-పాస్తో దూరమవుతున్న ఆహార భద్రత నగదు బదిలీతో గ్యాస్ కనెక్షన్లకు కోత నిరుపేద జిల్లాలో పేదలకు ఆహార భద్రత కరువవుతోంది. పట్టెడన్నం లేక అర్ధాకలితో అన్నమోరామ‘చంద్రా’ అంటూ అలమటిస్తున్న కుటుంబాలు జిల్లాలో అధికంగా ఉన్నాయి . వారిని ఆదుకోవలసిన ప్రభుత్వం... ఉన్న ఒక్క ఆధారమైన రేషన్ కార్డును కూడా రద్దుచేసి, వారి నోటికాడ కూడు లాక్కొంటోంది. గత ఏడాదిగా ఒక్క కొత్తరేషన్కార్డు ఇవ్వకపోగా, వేల కార్డులను రద్దు చేసింది. ఆధార్ సీడింగ్, ఈ పాస్ పేరుతో పేదలతో ఆటలాడుకుంటోంది. గంటల తరబడి క్యూలో నిలుచున్నా రేషన్ అందుతుందనే నమ్మకం లేకుండా పోయింది. ఏ నెల ఏ నెపంతో రేషన్ నిలిపివేస్తారో తెలియక పేదలు నిత్యం ఆందోళనకు గురవుతున్నారు. రద్దయిన కార్డులను పునరుద్ధరించుకునేందుకు పనులు మానుకుని అధికారులు, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ఊరిస్తోంది తప్ప, మంజూరు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. మరో వైపు నగదు బదిలీ పేరుతో పేదలను ఇక్కట్లకు గురిచేస్తోంది. విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని 34 మండలాల్లో ఉన్న అన్ని పంచాయతీల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కొత్తగా వివాహాలు చేసుకున్న వారు వేరు కాపురం ఉంటున్నప్పుడు వారి పాత రేషన్ కార్డుల్లోని సభ్యుల జాబితానుంచి తొలగిస్తున్న అధికారులు వారు కొత్తగా దరఖాస్తు చేసుకున్నప్పుడు మాత్రం మంజూరు చేయడం లేదు. దీని వల్ల వేలాది కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తీసుకున్న దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాల్సి ఉండగా అలా జరగడం లేదు. దర ఖాస్తుల ఆన్లైన్ కేవలం 30 శాతం మాత్రమే జరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకూ వచ్చిన దరఖాస్తుల్లో 12,323 దరఖాస్తులకు విచారణ పూర్తి చేసినట్టు చెబుతున్న అధికారులు ఇందులో 9,387 దరఖాస్తులు మాత్రమే అర్హత కలిగి ఉన్నాయని నివేదించారు. ఇందులో కేవలం 5,561 దరఖాస్తులను మాత్రమే అప్లోడ్ చేశారు. అదేవిధంగా అంత్యోదయ అన్నయోజన కోసం 6,191 దరఖాస్తులు వచ్చాయి. అన్నపూర్ణ పథకానికి సంబంధించిన రేషన్ కార్డు దరఖాస్తులు మరో 177 రాగా అవి కూడా మూలన పడి ఉన్నాయి. మరో పక్క ఆధార్ అనుసంధానం ప్రహసనంలో 24,236 రేషన్ కార్డులు ఇన్ఏక్టివ్లోకి వెళ్లిపోయాయి. వీటిలో 12,348 కార్డులను ఏక్టివ్ చేసిన అధికారులు మిగతా కార్డులను వదిలేశారు. దీని వల్ల ఆయా కుటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం రేషన్ కార్డులు లేని వారితో పాటు ఉన్న వారికి వస్తున్న ఇబ్బందులను పరిష్కరించాలనే ఉద్దేశం ప్రభుత్వంలో కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గ్యాస్ కనెక్షన్లదీ అదేదారి జిల్లాలో గ్యాస్ కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు 86,190 ఉన్నాయి. గతంలో 75వేల మంది సీఎస్ఆర్, దీపం పథకాలకు దరఖాస్తు చేసుకోగా అంతకు ముందు 11,190 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో మొత్తం 86,190 మంది గ్యాస్ కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తం గ్రామ సభలు నిర్వహించి కనెక్షన్లు ఇవ్వాలని నిబంధనలు చెబుతుండగా అలా జరగడం లేదు. అయితే జన్మభూమి కమిటీలకు ఇవ్వాలన్న విషయమై స్పష్టత లేకపోవడంతో ఈ కనెక్షన్లను పెండింగ్లో ఉంచేశారు. గత ఏడాది సెప్టెంబర్లో 16,200 గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. వాటి కోసం మండలాల వారీగా దరఖాస్తులు చేసుకున్నారు. అదేవిధంగా సీఎస్ఆర్ పేరిట ఉచిత గ్యాస్ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని కోరగా వేలాది మంది మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. వాటికి ఇప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం లక్ష్యం నిర్ణయించలేదు. ఎంత మంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికీ ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆ కనెక్షన్లు ఇవ్వలేదు. మొత్తం 69,990 మంది ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోగా అందులో 55,228 మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు అర్హత ఉందని అధికారులు ప్రకటించారు. కానీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వలేదు. అలాగే డోర్లాక్, ఆధార్సీడింగ్ కారణాలతో 81వేల గ్యాస్ కనెక్షన్లు రద్దు చేశారు. వారంతా కూడా ఎదురుచూస్తున్నారు. -
గ్యాస్ కనెక్షన్ల మంజూరులో నిర్లక్ష్యం
విజయనగరం కంటోన్మెంట్ : జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల మహిళలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 75 వేల మంది దరఖాస్తు చేసుకోగా, కేవలం 1653 కనెక్షన్లు మాత్రమే అందించారు. దీపం, సీఎస్ఆర్ వంటి కనెక్షన్లు ఇవ్వడానికి కేటాయింపులు అధికంగానే ఉన్నప్పటికీ వాటిని లబ్ధిదారులకు అందించడంలో యంత్రాంగం చొరవ చూపడం లేదు. జిల్లాకు గతంలో 16 వేల దీపం కనెక్షన్లు మంజూరయ్యాయి. వాటిని ఎవరికీ అందజేయలేదు. ఆ తరువాత సీఎస్ఆర్ పేరుతో ఉచిత గ్యాస్ కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చారు. దీంతో జిల్లాలో 69, 990 మంది దరఖాస్త్తు చేసుకున్నారు. వీటిని కాచి వడపోసిన అధికారులు 55,125 మందిని అర్హులుగా తేల్చారు. అయితే ఐఓసీ, హెచ్పీసీలు ఒక్క గ్యాస్ కనెక్షన్ కూడా ఇవ్వకపోగా బీపీసీ కంపెనీ ఏజెన్సీలు 1653 కనెక్షన్లు మాత్రే ఇచ్చాయి. గతంలో దీపం పథకం కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా కనెక్షన్లు రాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సీఎస్ఆర్ పేరుతో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటికీ కనెక్షన్లు రిలీజ్ చేయలేదు. రాజకీయ ప్రాబల్యం పెంచుకునేందుకు అధికార పార్టీ నాయకులు తాము చెప్పిన వారికే ఇవ్వాలని మెలిక పెట్టడంతో కనెక్షన్ మంజూరులో జాప్యం జరుగుతోందని సమాచారం. ఆ మూడు నియోజకవర్గాలకు మరో 5 వేల కనెక్షన్లు జిల్లాలో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ల పంపిణీ పెండింగ్లో ఉంటే జిల్లాకు మరో 5 వేల కనెక్షన్లు మంజూరయ్యాయి. చీపురుపల్లి, ఎస్. కోట, విజయనగరం నియోజకవర్గాల్లో ఈ కనెక్షన్లు ఇచ్చేందుకు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యే, మంత్రులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. చీపురుపల్లికి రెండు వేల కనెక్షన్లు, ఎస్. కోట, విజయనగరం నియోజకవర్గాలకు 1500 చొప్పున గ్యాస్ కనెక్షన్లు మంజూ ర య్యాయి. వీటిని త్వరలో పంపిణీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా కనెక్షన్లు పెండింగ్లో ఉండడంతో ప్రస్తుతం మంజూరైన అదనపు గ్యాస్ కనెక్షన్లు మరింత జాప్యం అవుతాయా ? లేక వెంటనే పంపిణీ చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే!. -
గ్యాస్ కనెక్షన్ల జాతర
♦ ఎంపికలోనూ మారని తీరు ♦ జన్మభూమి కమిటీలదే పెత్తనం ♦ నెలాఖరులోగా ఎంపిక ప్రక్రియ పూర్తి ఒకవైపు ఉచితం..మరొక వైపు దీపం..జిల్లాకు గ్యాస్ కనెక్షన్లు భారీ సంఖ్యలో మంజూరయ్యాయి. అదేస్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. కానీ వీటి ఎంపికలో మాత్రం ఒక వైపు జన్మభూమి కమిటీలు పెత్తనం చెలాయిస్తుంటే..మరొక వైపు అధికారులు, కమిటీలు చేతివాటం ప్రదర్శిస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం : జిల్లాకు సామాజిక బాధ్యత పథకం(సీఎస్ఆర్) కింద 1.2లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం సంకల్పించింది. ఉచిత కనెక్షన్ల కోసం ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే చేపట్టారు. వీటికోసం 1,31,518 దరఖాస్తులు వచ్చాయి. జీవీఎంసీ,ఇతర మున్సిపాల్టీలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన 1,17,171 దరఖాస్తులను ఏఎస్వో, సీఎస్డీటీలు పరిశీలించారు. ఇంకా 54,210 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. 1132 దరఖాస్తులను తిరస్కరించారు. ఏజెన్సీ పరిధిలో 42,910 దరఖాస్తులకు15,735 దరఖాస్తులను ఆమోదించారు. సాంకేతికకారణాలతో ఉన్నతాధికారులకు సిఫారసు చేసిన దరఖాస్తులు 14,347 ఉన్నాయి. ఏఎస్వో, సీఎస్డీటీలు అప్రూవ్ చేసిన 59,376 దరఖాస్తుదారులకు ఇప్పటికే వారి సెల్ఫోన్ నంబర్లకు మెసేజ్లు కూడా పంపుతున్నారు. వారికి ఏ ఏజెన్సీ పరిధిలో గ్యాస్కనెక్షన్ మంజూరైంది..ఎప్పటిలోగా తీసుకోవాలన్నది తెలియజేస్తూ ఈ మెసేజ్లు వస్తున్నాయి. వీటి విషయంలో జా యింట్ కలెక్టర్ జనార్దనన్ నివాస్ ప్ర త్యేక శ్రద్ధతో 60శాతం ఎంపిక పారదర్శకంగానే సాగింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు స్థానిక అధికారులు ఆన్లైన్లో వారే స్వయంగా దరఖాస్తులను అప్లోడ్ చేసి ఆమోదించారన్న వాదన ఉంది. గ్యాస్కనెక్షన్లేకపోవడం..తెలుపుకార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండడం దీనికి ప్రామాణికంగా పెట్టారు. జిల్లాలో కార్డులు...వాటి పరిధిలో ఉన్న యూనిట్ల సంఖ్యను బట్టి చూస్తే మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతితో పాటు ఉన్నత వర్గాలకు చెందిన వేలాది మందికితెలుపుకార్డులున్నాయి. దీంతో పలువురు అధికారుల అండదండలతో ఉచిత కనెక్షన్లు పొందినట్టు తెలుస్తోంది. ఇలా సుమారు 30 శాతం పక్కదారి పట్టే పరిస్థితి చోటుచేసుకుంది. నెలాఖరులోగా ఉచితగ్యాస్ కనెక్షన్ల కోసం ఎంపికతో పాటుమంజూరు ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం జిల్లాకు 25వేల దీపం కనెక్షన్లను మంజూరు చేసింది. నర్సీపట్నానికి 3,500, అనకాపల్లి, చోడవరానికి 1500 చొప్పున, యలమంచలి, గాజువాక, పెందుర్తి నియోజక వర్గాలకు వెయ్యేసి చొప్పున అదనంగా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉచిత కనెక్షన్ల జారీ కొంత వరకు పారదర్శకంగా జరిగిన ప్పటికీ దీపం కనెక్షన్ల లబ్ధిదారుల ఎంపిక మాత్రం అంతాలోపభూయిష్టంగా సాగుతోంది. ఇది తెలుగుతమ్ముళ్లకు వరంగా మారింది. పేరుకు ఏఎస్వో,రెవెన్యూఅధికారులకు ఎంపిక బాధ్యత ఇచ్చినప్పటికీ జన్మభూమి కమిటీల ఆమోదంతోనే ఎంపిక చేయాలన్న మెలికతో పెత్తనమంతా వారి చేతిలో పెట్టినట్టయింది. మార్చి నెలాఖరులోగానే వీటి ఎంపిక పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో ఎంపికలో చోటు చేసుకుంటున్న రాజకీయాల వల్ల తీవ్ర జాప్యంజరుగుతోంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాలకు జన్మభూమికమిటీలు ఆమోద ముద్ర వేస్తుండడంతో అధికారుల ఎంపిక చేసిన జాబితాలు బుట్టదాఖలవుతున్నాయి. జన్మభూమి కమిటీల మితిమీరిన జోక్యం వల్ల అధికారులుతీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అర్హత ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే చెప్పారు.. చేయాల్సిందే దోరణిలో ఈ కమిటీలు పెత్తనంతో ఎంపికలో అధికారులు మిన్నకుండిపోవాల్సి వస్తుంది. ఈ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తిచేయాలన్న పట్టుదలతో అధికారులు పనిచేస్తున్నప్పటికీ కమిటీలు గంటకో జాబితాతో గందరగోళానికి గురిచేస్తున్నారు. ఇదే అదనుగా కొందరు అధికారులు ఎంపికలో చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అన్నింటా వారిదే పెత్తనం!
జన్మభూమి కమిటీలకే అధికారం డమ్మీలుగా మారుతున్న అధికారులు స్మార్ట్కార్డు తరహాలో రేషన్కార్డులు మార్గదర్శకాలు జారీ మొన్న రుణాలు.. నిన్న గ్యాస్ కనెక్షన్లు.. నేడు పింఛన్లు.. రేపు రేషన్ కార్డులు.. ఇలా ప్రతి పథకంలో జన్మభూమి కమిటీలకే పెత్తనం కట్టబెడుతుండడంపై అధికార వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నెలలో మంజూరు చేయనున్న కొత్తరేషన్ కార్డుల కోసం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఏఎస్వో, తహశీల్దార్లకు అప్పగించినా, చివరకు ఆ జాబితాలను జన్మభూమి కమిటీలు ఆమోదముద్ర వేశాకే కొత్తకార్డులివ్వాలని సర్కార్ మెలిక పెట్టడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. విశాఖపట్నం: ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక బాధ్యత అంతా గతంలో అధికారులే చేపట్టేవారు. 50 శాతం వరకు ప్రజాప్రతినిధుల సిఫార్సులకు తలలూపినా.. మరో 50 శాతమైనా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు దక్కేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ముందెన్నడూ లేని వింత సంస్కృతికి టీడీపీ సర్కార్ తెరలేపింది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో అధికారులను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తూ పెత్తనం పూర్తిగా జన్మభూమి కమిటీలకు అప్పగించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సిఫార్సుల మేరకు జాబితాలు తయారుచేస్తూ వసూళ్లలో వారివాటాలను వారికి ముట్టజెబుతూ ఈ కమిటీలు అందినకాడకి దండుకుంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 10,45,838 తెలుపు, 75,889 ఏఏవై, 1035 అన్నపూర్ణ కార్డులున్నాయి. మరో 2,10,378 గుబాబీ కార్డులున్నాయి. కొత్త కార్డుల జారీ కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరు మార్గదర్శకాలను జారీచేసింది. తెల్లకార్డుల కోసం దారిద్య్ర రేఖకు దిగువనున్న వారిని గుర్తించేందుకు నిర్దేశించిన అర్హతలు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఈ నిబంధనలను ఇప్పటికే మనుగడలో ఉన్న కార్డులకు కూడా దశలవారీగా వర్తింపచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదే కనుక జరిగితే భారీ సంఖ్యలో తెలుపుకార్డులపై కోతపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మండలాల్లో కొత్తకార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హులను గుర్తించి అప్లోడ్ చేసే బాధ్యతను రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులకు అప్పగించారు. కొత్తగా మంజూరు చేయనున్న రేషన్కార్డులను స్మార్ట్ కార్డుల తరహాలో జారీ చేయాలని నిర్ణయించారు. కొత్తకార్డుల కోసం 64 వేల మంది ఎదురుచూపు గతేడాది అక్టోబర్-నవంబర్లలో రెండు విడతల్లో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీల్లో అత్యధికం పింఛన్లు.. ఆ తర్వాత రేషన్కార్డుల కోసమే వచ్చాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 39,638 మంది, జీవీఎంసీతో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో 25,007 చొప్పున మొత్తం 64,645దరఖాస్తులొచ్చాయి. ప్రాథమికంగా వీటి అర్హతను నిర్ధారించే బాధ్యతను అసిస్టెంట్ సివిల్ సప్లయిస్ అధికారులు, తహశీల్దార్లకు అప్పగించారు. వయసు నిర్ధారణ, రెసిడెన్సీ, ఆధార్ కార్డులను ఈ దరఖాస్తులతో అప్లోడ్ చేసి అర్హత ఉందా లేదా అని వీరిద్దరూ నిర్ణయిస్తారు. ఎక్సల్షీట్లో అ ర్హులైన వారి జాబితాలను తయారు చేసి జన్మభూమి కమిటీలకు అప్పగిస్తారు. వారు క్షేత్ర స్థాయిలో పరిశీలించి స్థానిక ప్రజాప్రతినిధుల సిఫార్సు మేరకు అర్హులైన వారితో తుదిజాబితాను తయారుచేసి ప్రభుత్వానికి పంపిస్తారు. అర్హుల జాబితాను అధికారులు తయారుచేసిన తర్వాత వాటిపై జన్మభూమి కమిటీ ఆమోదం ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. అలాంటప్పుడు మాతో ఎందుకు పరిశీలన చేయిస్తున్నారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శకాల ప్రకారం అర్హతలివే.. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు. వితంతువులకు,మహిళాధారిత కుటుంబాలు.మానసిక శారీరక వైకల్యం ఉన్న కుటుంబాలు. సొంత ఇల్లు, వ్యవసాయ భూమి లేని కుటుంబాలు. ఉపాధి హామీ పథకంలో చురుగ్గా పనిచేసిన జాబ్కార్డుదారులు. ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీల్లో నివసించే వారు అర్హులు వీరు అనర్హులు.. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న కుటుంబాలకు వర్తించదు. ఇంటి విద్యుత్ బిల్లు రూ.500 కంటే ఎక్కువగా చెల్లిస్తే అనర్హులు. 2.5 ఎకరాల మగాణీ లేదా 5 ఎకరాల పైబడి మెట్ట భూములుంటే అనర్హులు. పట్టణ ప్రాంతాల్లో.. 500 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉన్న ఇంటిలో నివసించాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. నెలకు చెల్లించే విద్యుత్ బిల్లు రూ. వెయ్యి లోపు ఉండాలి. వితంతు, మహిళాధారిత, శారీరక, మానసిక వికలాంగులు ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యం అనర్హులెవరంటే..? ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాలు. క్రెడిట్కార్డులున్న కుటుంబాలు. 100 సీసీ కంటే అధిక సామర్థ్యం ఉన్న ద్విచక్రవాహనాలున్న కుటుంబాలు. 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో సొంత గృహం ఉన్న కుటుంబాలు. -
రంగారెడ్డి జిల్లాకు 70వేల వంటగ్యాస్ కనెక్షన్లు!
సాక్షి, రంగారెడ్డి: దీపం పథకం కింద రంగారెడ్డి జిల్లాకు 70 వేల వంటగ్యాస్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి నియోజకవర్గానికి 5 వేల కనెక్షన్లను కేటాయించింది. ప్రస్తుతం ఎన్నికల నియామవళి అమలులో ఉన్నందున ఏప్రిల్ మొదటి వారంలో అబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలకు ఈ పథకం కింద వంటగ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయనున్నారు. అయితే, వీటిని మరొకరికి అమ్మడానికి, బదిలీ చేయడానికి అవకాశం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, గతంలో ఎంపిక చేసిన 22 వేల మంది జాబితాను తాజాగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు జిల్లా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. -
‘దీపం’ తమ్ముళ్లకే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దీపం పథకాన్ని తమ్ముళ్లు సొంతం చేసుకుంటున్నారు. నిరుపేదలకు ప్రభుత్వం మంజూరుచేసిన గ్యాస్ కనెక్షన్లను కొందరు టీడీపీ నాయకులు పంచుకుంటున్నారు. ఎన్నికల్లో పనిచేసిన వారికి.., కార్యకర్తలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అర్హులకు అందాల్సిన దీపం కనెక్షన్లను తమ్ముళ్లు దారిమళ్లించడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. ప్రభుత్వం జిల్లాకు దీపం పథకం కింద 26 వేల గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసింది. వాటిని మండలాల వారీగా కేటాయించారు. గ్యాస్ కనెక్షన్లు కొనుగోలు చేసుకునే స్తోమత లేనివారిని గుర్తించి వారికి ఇవ్వాలనేది నిబంధన. అందుకు అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు గ్రామసభలు నిర్వహించి అర్హులను గుర్తించాల్సి ఉంది. ఆ మేరకు అధికారులు ఈనెల 20 నుంచి గ్రామసభలు నిర్వహిస్తున్నారు. అయితే అనేకచోట్ల గ్రామసభలు నిర్వహించకనే జన్మభూమి కమిటీలోని టీడీపీ నాయకులు చెప్పిన వారిని ఎంపిక చేస్తున్నారు. దగదర్తి మండలం పరిధిలో టీడీపీ నాయకులు కొందరు కేవలం పార్టీ కార్యకర్తలు, నాయకుల పేర్లు జాబితాలో చేర్పిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మండలానికి 230 గ్యాస్ కనెక్షన్లు మంజూరైతే.. ఎక్కువ శాతం టీడీపీ నేతలు, వారి అనుచరులనే ఎంపిక చేసుకుంటున్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వెంకటగిరి, ఉదయగిరి, కోవూరు, సూళ్లూరుపేట, కావలి తదితర నియోజకవర్గాల పరిధిలో లబ్ధిదారుల ఎంపిక అంతా టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనెక్షన్.. కలెక్షన్ లబ్ధిదారుల ఎంపికే లోపభూయిష్టంగా జరుగుతుందనే విమర్శలు వినిపిస్తుంటే.. ఎంపిక చేసిన లబ్ధిదారుల నుంచి కనెక్షన్లకు పెద్దఎత్తున వసూళ్లకు దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం దీపం పథకం కింద మంజూరు చేసిన గ్యాస్ కనెక్షన్లను నిరుపేదలు, వికలాంగులు, వితంతువులకు ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. గ్యాస్ తీసుకున్న లబ్ధిదారుడు రూ.450 చెల్లిస్తే రెగ్యులేటర్, వైరు, లైటరు ఇస్తారు. అయితే టీడీపీ నేతలు కొందరు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. వెంకటగిరి పరిధిలో సుమతి, లక్ష్మీదేవి, కుమారి, భారతమ్మ, విజయలక్ష్మి తదితరుల నుంచి టీడీపీ నేతలు కొందరు రూ.1,500 చొప్పున వసూలు చేసుకున్నట్లు తెలిపారు. ఇలా జిల్లావ్యాప్తంగా స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొందరు గ్యాస్ కనెక్షన్ల పేరుతో కలెక్షన్ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బడా నాయకులు సైతం బినామీ పేర్లతో గ్యాస్ కనెక్షన్లను సొంతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారని రెవెన్యూ అధికారి ఒకరు స్పష్టం చేశారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తామంతా నోరెత్తలేని పరిస్థితి అని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలకు కొందరు ఐకేపీ సిబ్బంది పూర్తి సహకారం అందిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టిసారించి నిరుపేదల కోసం మంజూరు చేసిన దీపం పథకాన్ని లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
దారి దోపిడీ!
సాక్షి, కర్నూలు : ప్రజల ఆకలి తీర్చడం కనీస బాధ్యతన్న యోచనతో ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం, రాయితీపై చౌక దుకాణాల ద్వారా నీలి కిరోసిన్ పంపిణీ చేస్తోంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. బియ్యం, కిరోసిన్ అక్రమార్కుల పరమవుతోంది. చౌక బియ్యాన్ని మరింత పాలిష్ పట్టించి రూపాయికి పదింతల అక్రమార్జనకు పాల్పడుతూ పేదల కడుపుకొడుతున్నా.. డీలరు, దళారి ఒక్కటై అసలు కార్డుదారులకు కిరోసిన్ ఇవ్వకుండా కాజేస్తున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అక్రమానికి బీజం.. జిల్లాలో రాయితీపై ఇచ్చే కిరోసిన్ 24 లక్షల లీటర్లు కాగా, అందులో సగం పక్కదారి పడుతోంది. ఎలా అంటే కిరోసిన్ పొందుతున్న వారిలో అధికశాతం మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పేరుకు తెల్లకార్డులు ఉన్నా.. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కిరోసిన్ తెచ్చుకునేవారి సంఖ్య తక్కువ. ఇక పట్టణ ప్రాంతాల్లో కొందరు ధనవంతులకు తెల్లకార్డులు ఉన్నాయి. ఇలాంటి వారు తమ బిడ్డల ఫీజు రీయింబర్స్మెంట్కు, వైద్య సేవలకు మాత్రమే తెల్లకార్డును వినియోగించుకుంటున్నారు. కిరోసిన్ను తెచ్చుకోవడంలేదు. ఈ పరిస్థితే డీలర్లకు కలిసొస్తోంది. ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురు డబ్బులిచ్చి నోళ్లు మూయించడం.. అధికారులు దాడి చేస్తే రాజకీయ సిఫారసులతో వారి చేతులు కట్టేయడం జరుగుతోంది. బ్లాక్ మార్కెట్లో లీటర్ కిరోసిన్ రూ. 45 జిల్లాలోని డీలర్లు ప్రతి నెలా 14, 15 తేదీల్లో కిరోసిన్కు డీడీలు కడతారు. తర్వాత హోల్సేల్ డీలరు 15వ తేదీ నుంచి చౌక దుకాణాలకు కిరోసిన్ చేరవేయాలి. దానిని డీలరు 20వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ కార్డుదారులకు పంపిణీ చేయాలి. గ్యాస్ కనెక్షన్ ఉన్న కార్డుదారుడికి లీటరు, లేనివారికి రెండు లీటర్ల చొప్పున ఇస్తారు. ప్రభుత్వం డీలరుకు లీటరు రూ. 14.75కు సరఫరా చేస్తే, లబ్ధిదారుడికి రూ. 15కు అందజేస్తారు. అయితే డీలరు పూర్తి స్థాయిలో కేటాయింపులకు డీడీలు తీయకుండా.. సగానికి తీసి, మిగతాది పూర్తి కిరోసిన్ అందించే సమయంలో కడతామంటూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బోగస్ కార్డులు, బినామీ కార్డులు, కిరోసిన్ వాడని కార్డుల ద్వారా మిగుల్చుకున్న కిరోసిన్ను బ్లాక్మార్కెట్లో రూ. 45కు అమ్ముకుంటున్నారు. అదీ కొందరు హోల్సేల్ డీలర్లకే. ఇటీవల.. పట్టుపడడం పరిస్థితికి అద్దం పడుతోంది. కొందరు కార్డుదారుల కక్కుర్తి.. కర్నూలు నగరంతోపాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో ధనవంతులకూ తెల్లకార్డులు ఉన్నాయి. వాటిని వైద్యానికి, బోధనా చెల్లింపులకు వినియోగించుకుంటూ కిరోసిన్ను డీలరుకే రూ. 25కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా బ్లాక్మార్కెట్కు తరలించిన కిరోసిన్ను కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ బంకుల్లో కలిపి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. దారి మళ్లుతున్న బియ్యం.. ప్రజా పంపిణీ వ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోంది. పౌరసరఫరాల శాఖలో పర్యవేక్షణ కొరవడడంతో ఎవరిష్టం వారిదన్నట్లు ఇష్టారాజ్యంగా రూపాయి బియ్యంను దారి మళ్లిస్తున్నారు. జిల్లాలో 17 ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి నెలకు 17 వేల టన్నుల బియ్యం 2,411 చౌక దుకాణాలకు తరలిస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఆ తర్వాత బియ్యం దారి మళ్లుతున్నాయి. నంద్యాల, నందికొట్కూరు, ఆదోని, కర్నూలు, ఆలూరు ప్రాంతాల నుంచి అలా అక్రమంగా తరిలించిన బియ్యానికి కల్లూరు, కర్నూలు శివారులు అనధికారిక గోదాములుగా మారాయి. ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా సేకరించిన బియ్యానికి కర్నూలుకు చెందిన కొందరు వ్యాపారులు కల్లూరు శివారు ప్రాంతాల్లోని రోడ్డు వెంట కొన్ని ప్రాంతాల్లో, కల్లూరులోని కొన్ని గోదాముల్లో నిల్వ ఉంచుతారు. ఈ బియ్యంను వ్యాపారులు డీలరు నుంచి రూ. ఐదుకు కొనుగోలు చేసి, ఇతరులకు రూ. 10కి విక్రయిస్తారు. వాటిని లారీల్లో కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు తరలిస్తారు. ఒక్క కర్నూలు, నందికొట్కూరు, ఆదోని, కల్లూరు ప్రాంతాల్లోనే ఇలా వ్యాపారులు చేసే వారు 50 మంది ఉండగా.. ఒక్క కర్నూలు ప్రాంతంలోనే చౌక బియ్యం వ్యాపారం చేసే దళారులు 20 మంది వరకూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తాజాగా అన్లైన్ ప్రజాపంపిణీకి అధికారులు శ్రీకారం చుడతామంటున్నారు. అప్పుడైనా ప్రజా పంపిణీలో అవకతవకలకు తావుండదా అన్నది వేచి చూడాల్సిందే. రూట్ అధికారి లేకుండానే.. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి చౌక దుకాణానికి బియ్యం, కిరోసిన్ తీసుకెళ్లే సమయంలో వాహనం వెంట ఓ రూట్ అధికారి ఉండాలి. ఈ ప్రక్రియ పకడ్బందీగా అమలు జరగడం లేదు. దాంతో డీలరు, అక్రమ వ్యాపారులు, అధికారులకు ఈ వ్యాపారం భారీగానే జేబులు నింపుతోంది. ఇప్పటికైనా అక్రమ వ్యాపరులపై కన్నేసీ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసే అక్రమార్కుల భరతం పట్టాల్సిన అవసరం ఉంది. ఏడాదిలో 150కుపైగా 6ఏ కేసులు.. ప్రస్తుతం ఏ పట్టణంలో, ఏ మండలంలో చూసినా హోటళ్లలో దోసెలు, ఇడ్లీలకు వినియోగించేది కిలో రూపాయి బియ్యమే. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆలూరు, డోన్, నందికొట్కూరు ప్రాంతాల్లో అల్పాహార దుకాణాల వద్ద అడిగితే రేషన్ బియ్యమేనని బహిరంగంగా చెప్పేస్తారు. ఏడాదిలో జిల్లాలో 150కుపైగా 6ఏ కేసులు నమోదయ్యాయి. మాటలతో సరి.. జిల్లా పౌరసరఫరాల అధికారి కిరోసిన్.. కిలో రూపాయి బియ్యంను అడ్డదారిన బ్లాక్మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఏడాది చౌక బియ్యం, కిరోసిన్కు సంబంధించి 6ఏ కేసులు 150 వరకూ పెట్టామని చెప్పారు. కానీ.. అక్రమార్కులు యథేచ్ఛగా తమ పనిని తాము కానిచ్చేస్తున్నారు. -
అంతా గ్యాస్
ఒంగోలు: ప్రతిపక్షంలో ఉండగా ఆధార్ వద్దు....రాయితీనే ముద్దు అంటూ ధర్నాలు, ఆందోళనలు నిర్వహించిన టీడీపీ, బీజేపీలు సీటు ఎక్కగానే నిస్సిగ్గుగా ఆ బాటనే పడుతున్నాయి. రాయితీ గ్యాస్కూ ఆధార్ తప్పనిసరిచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్యాస్ వినియోగదారులను బెంబేలెత్తించేలా చేస్తోంది. ఏతావాతా ఏడాదికి కనీసంగా రూ.27.14 కోట్లు భారం తప్పనిసరిగా మారనుంది. ఈ నేపథ్యంలో ‘కట్టె పొయ్యిలు వద్దు... గ్యాస్ వాడకమే ముద్దు’ అనే సామాజిక లక్ష్యం అర్థమే మారిపోతోంది. జిల్లాలో మొత్తం 5.79 లక్షల గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీటిలో 5.22 లక్షలమంది వినియోగదారులు ఆధార్ను అనుసంధానం చేసుకున్నట్లు అధికారిక సమాచారం. దీని ప్రకారం ఇంకా ఆధార్ అనుసంధానం చేసుకోని వారి సంఖ్య 57 వేలపైమాటే. అంటే 5.79 లక్షల మంది గ్యాస్ను బుక్చేసుకుంటే వారికి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. ఆధార్తో సంబంధం లేకుండా ఇచ్చే సిలిండర్ ధర రూ.449. ఒంగోలులో ఎల్పీజీ హెచ్పీ కంపెనీ సిలిండర్ ధర రూ.449లు . ఆధార్ లేని వారికి రాబోయే మూడు నెలలపాటు ఇదే ధరకు సిలిండర్ను సరఫరా చేస్తారు. ఆ తరువాత మూడు నెలలు మాత్రం బహిరంగ రేటుకు కొనుగోలుచేసుకోవాలి. అయితే మే 15వ తేదీలోపు ఆధార్ అనుసంధానం చేసుకోవాలి. అప్పటివరకు అంటే మూడు నెలల్లోగా బుక్ చేసుకున్న సిలిండర్లకు సంబంధించి రాయితీ వారి బ్యాంకు ఖాతాకు జమవుతుందన్నమాట. ఏటా భారం రూ.27.14 కోట్లు ఒక్కో కనెక్షన్కు సంబంధించి ఏడాదికి 12 సిలిండర్లను రాయితీపై ఇస్తారు. మరీ పేద వర్గాలకు వినియోగం తక్కువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సగటున ప్రతి కనెక్షన్కు ఏడాదికి 9 సిలిండర్ల చొప్పున కొనుగోలు జరిగాయని భావిస్తే అమ్ముడైన మొత్తం సిలిండర్ల సంఖ్య 46.98 లక్షలుగా ఉంటుంది. ప్రస్తుతం గ్యాస్ కంపెనీలు ఒక్కో సిలిండర్పై పాతిక రూపాయల భారం మాత్రమే పడుతుందని చెబుతున్నప్పటికీ వాస్తవంగా అంతకంటే ఎక్కువే భారం పడుతుందని గత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2013 డిసెంబర్ 12వ తేదీన ఒంగోలు మార్కెట్లో సబ్సిడీ సిలిండర్ ధర రూ.420.50. కానీ ఆధార్ సీడింగ్ అయిన వారికి అంటే నగదు బదిలీ పథకానికి అర్హులైనవారికి విక్రయించిన సిలిండర్ ధర రూ.1111.50. అంటే రెండింటి మధ్య వ్యత్యాసం రూ.691. కానీ బ్యాంకు ఖాతాలలో జమ పడిన మొత్తం మాత్రం రూ.633.50. అంటే ప్రభుత్వం రాయితీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటూ ప్రకటించి రూ.57.64 అదనపు భారం ప్రజానీకం మీదరుద్దింది. ఇది ఎల్పీజీకి సంబంధించి వ్యాట్ భారం అన్నమాట. అంటే కంపెనీ ఇచ్చే మొత్తానికి, రాయితీ మొత్తానికి వ్యాట్ భారం మాత్రం ప్రజలపైనే రద్దడం ద్వారా కొంతమేర భారాన్ని ప్రభుత్వాలు తగ్గించుకుంటూ ఆ మొత్తాన్ని వినియోగదారులపైనే నెత్తేయడం గమనించవచ్చు. ఆ ప్రకారమే సాగితే ప్రతి ఏటా జిల్లా వినియోగదారులపై ఏటా రూ.27.14 కోట్లు అదనపు భారం పడనుంది. ముందుగా బుక్చేసుకున్నా డీబీటీ పరిధిలోకే... గ్యాస్ కోసం ఓ వ్యక్తి ఈ నెల 9వ తేదీన బుక్చేసుకున్నాడనుకుందాం. ఇది ఆన్లైన్ కావడంతో బుక్చేసుకోగానే అతని సెల్కు రిఫరెన్స్ నెంబర్ అంటూ ఇండేన్ గ్యాస్ కంపెనీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అయితే గతంలో ఆన్లైన్ సిస్టం అందుబాటులోకి తెచ్చిన కొత్తలో హెచ్పీ కంపెనీ మాత్రం సిలిండర్ ఎప్పుడు డెలివరీ ఇచ్చేది కూడా తెలియజేసేది. కానీ ప్రస్తుతం ఇండేన్గ్యాస్ను బుక్చేసుకుంటే బుక్ చేసుకున్నట్లుగా ఒక మెసేజ్ను మాత్రమే పంపిస్తుంది. దానికి రిఫరెన్స్ అంటూ ఇస్తుంది. దాని ప్రకారం ఈ నెల 9వ తేదీ బుక్ చేసుకున్న వినియోగదారుడి రిఫరెన్స్ నెంబర్ 233638. అయితే ఈనెల 17వ తేదీవరకు కూడా సిలిండర్ అందలేదు. సరికదా ...డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీము అందుబాటులోకి రావడంతో తనకు రాయితీ సిలిండర్ ఇస్తారా...లేక డీబీటీ కింద డబ్బులు చెల్లించాలా అనే సందేహంతో టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్చేస్తే వారు చెప్పిన సమాధానం విని షాక్ తినడం వినియోగదారుడి వంతైంది. ఈ నెల 15వ తేదీనుంచి డీబీటీ అమలులోకి వచ్చినందున మీరు మరోమారు మీ రీఫిల్ను బుక్చేసుకోండి...అప్పటికి రాకుంటే మీ ఫిర్యాదును స్వీకరిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఒక పక్క సిలిండర్ ఖాళీ అయిపోవస్తుంటే మరో మారు బుక్చేసుకోవాలంటూ వచ్చిన ఉచిత సలహా మరింత ఆందోళనకు గురిచేస్తుంది. దీంతో మరో మారు బుక్ చేసుకునేందుకు ఫోన్చేయడం ఆలస్యం....మీరు రీఫిల్ను బుక్చేసుకున్న తేదీ ఈ నెల 15వ తేదీ అంటూ ప్రకటించడం ఆశ్చర్యకరం. అంటే ఈనెల 14వ తేదీవరకు బుక్చేసుకున్న వినియోగదారులకు గ్యాస్ను సరఫరా చేయకుండా ...ఈ నెల 15వ తేదీన బుక్ చేసుకున్నట్లుగా వారికి వారే మార్చేసుకున్నారు. కొరవడనున్న సామాజిక లక్ష్యం: సాధారణంగా గృహిణికి వంటింటి బాధలు తప్పించడంలో ఎల్పీజీ గ్యాస్ సక్సెస్ అయిందని చెప్పవచ్చు. తొలుత వాటి వినియోగం కేవలం చాలా కొద్దిమందికే పరిమితమైనా రాను...రాను ప్రభుత్వం తీసుకువచ్చిన చైతన్యంతో నేడు నిరుపేదల ఇళ్ళల్లోను గ్యాస్ పొయ్యిలు ప్రత్యక్షమయ్యాయి. అయితే గత ఏడాది నగదు బదిలీ అమలులో ఉన్న సమయంలో ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్లను తీసుకువెళ్లినా గ్రామంలో తమ వద్ద అంత మొత్తం లేదంటూ తిప్పి పంపిన సందర్భాలు అధికమవుతున్నాయి. దీంతో పల్లెటూర్లకు వాహనాల ద్వారా డెలివరీ ఇవ్వాలంటేనే గ్యాస్ ఏజెన్సీలు తటపటాయించే పరిస్థితి ఏర్పడింది. దీంతో జనం తిరిగి కట్టెల పొయ్యిలకు ఆలవాటు పడబోతున్న తరుణంలో నగదు బదిలీ పథకాన్ని నిలిపివేయడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా మళ్లీ ప్రారంభించడంతో జనంలో అలజడి ప్రారంభమైంది. -
గ్యాస్కు మళ్లీ ఆధార్
ఒంగోలు: గ్యాస్కు ఆధార్ అనుసంధానం మళ్లీ మొదలు కానుంది. ఈనెల 15వ తేదీ నుంచి ఆధార్ను అనుసంధానం చేయనున్నట్లు కేంద్ర చమురు, సహజ వాయు మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో గ్యాస్ కంపెనీలకు స్పష్టం చేసింది. దీంతో మళ్లీ ఆధార్ రగడ ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా 54 వేల మంది వినియోగదారులకు ఈ వ్యవహారం శరాఘాతంగా మారే అవకాశాలున్నాయి. జిల్లాలో ఐవోసీ పరిధిలో 3.35 లక్షల కనెక్షన్లు ఉండగా ఇప్పటి వరకు 2.91 లక్షల కనెక్షన్లకు ఆధార్ అనుసంధానం పూర్తయింది. భారత్ గ్యాస్ పరిధిలో 1.29 లక్షల కనెక్షన్లకు గాను 1.28 లక్షల కనెక్షన్లు ఆధార్కు అనుసంధానం అయ్యాయి. హెచ్పీసీఎల్ పరిధిలో 1.14 లక్షల కనెక్షన్లకుగాను 1.03 లక్షల కనెక్షన్ల వినియోగదారులు ఆధార్ను అనుసంధానం చేసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 5.79 లక్షల కనెక్షన్లకుగాను 5.22 లక్షల కనెక్షన్ల వినియోగదారులు ఆధార్ను అనుసంధానించుకున్నట్లయింది. హెచ్పీసీఎల్ పరిధిలో 9 వేల మంది, ఐవోసీ పరిధిలో 44 వేల మంది ఆధార్ అనుసంధానించుకోవాల్సి ఉంది. బీపీసీఎల్ పరిధిలో దాదాపు 900 మంది మాత్రమే ఆధార్ను అనుసంధానం చేసుకోలేదు. గత సమస్యలకు పరిష్కారం చూపకుండానే: గతంలో యూపీఏ ప్రభుత్వం గ్యాస్కు ఆధార్ను అనుసంధానం చేసింది. అప్పట్లో వినియోగదారులకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఆధార్ అనుసంధానం చేసుకున్నా..గ్యాస్ తీసుకున్న వారికి సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాల్లో పడలేదంటూ చాలా మంది పౌరసరఫరాల శాఖ అధికారులు, తహశీల్దార్లు, బ్యాంకర్లు, గ్యాస్ కంపెనీల చుట్టూ తిరగలేక తీవ్ర అవస్థలు పడ్డారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్కు ఆధార్ను అనుసంధానించే ప్రక్రియను నిలిపివేసింది. ఆధార్ ఉన్నా లేకపోయినా ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లను రాయితీపై ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్లో ప్రతిపక్ష పాత్ర పోషించిన టీడీపీ, బీజేపీలు ఆధార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు మారాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు నేడు అధికారంలోకి వచ్చాయి. జన్థన్ ద్వారా ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్కు గ్యాస్ను అనుసంధానించే ప్రక్రియ మళ్లీ చేపట్టింది. మంత్రిత్వ శాఖ గ్యాస్ కంపెనీలకు ఈ మేరకు ప్రకటన వెలువరించింది. దీని ప్రకారం ఆధార్ను గతంలో అనుసంధానం చేసుకున్నవారు మళ్లీ ఇవ్వాల్సిన లేదు. అలా కాకుండా ఇప్పటి వరకు ఆధార్ ఇవ్వని వారు తమ గ్యాస్ ఏజెన్సీల వద్ద, బ్యాంకుల్లో ఆధార్ను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఆధార్ను అనుసంధానం చేసుకుంటేనే వారికి గ్యాస్ను పొందిన అనంతరం సబ్సిడీ మొత్తం వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. లేకుంటే రాయితీ మొత్తం జమకాదు. -
గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా ...
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలో గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది. పట్టణాలు, పల్లెల నుంచి సిలిండర్లు నల్లబజారుకు తరలుతున్నాయి. గృహావసరాలకు ఉపయోగించే రాయితీ సిలిండర్లను వ్యాపారం కోసం వినియోగిస్తున్నారు. పట్టణాల్లో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తదితరాల్లో గృహావసారాలకు వినియోగించే సిలిండర్లను వాడుతున్నారు. అధికారులు తనిఖీలు చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకుంటున్నా అక్రమార్కులు దందాను కొనసాగిస్తున్నారు. కేసులు నమోదు చేయాల్సిన పౌర సరఫరాల అధికారులు మామూలుగా తీసుకుంటున్నారు. 688 సిలిండర్లు.. 374 కేసులు.. జిల్లాలో అధికారులు 2010 నుంచి ఐదేళ్లుగా పలుమార్లు దాడులు నిర్వహించి 688 గృహావసర సిలిండర్లు స్వాధీనం చేసుకున్నా రు. అక్రమంగా గ్యాస్ వినియోగిస్తున్న 374 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 5న ఆదిలాబాద్, నిర్మల్లలో దాడులు నిర్వహించి 45 గృహావసర సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. 21 కేసులు నమోదు చేశారు. వినియోగదారుడికి ఏడాదికి పన్నెండు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు రాయితీ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు చోట్ల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల అండతో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ‘ఆధార్’తో ఆగని దందా జిల్లాలో ప్రస్తుతం 3,30,747 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు సుమారుగా 1,29,600 ఉన్నాయి. ఒక్కో వినియోగదారునికి ఏడాదికి పన్నెండు రాయితీ గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలి. గతేడాది ఇదే మాసంలో గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాను అనుసంధానం చేశారు. దీంతో కొన్ని అక్రమ కనెక్షన్లు బయటపడ్డాయి. రాయితీ సొమ్మును ప్రభుత్వం నేరుగా వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఆ సమయంలో అర్హులై ఉన్న గ్యాస్ తీసుకునేందుకు వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. ఆధార్ వల్ల రాయితీ గ్యాస్ సిలిం డర్ల అక్రమ వ్యాపారం అరికట్టవచ్చునని ప్రభుత్వ భావించినా.. దానిలోని లోపాలను వెతికి అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారు. ఈ విషయంలో అప్పట్లో ప్రభుత్వంపై పలు విమర్శలకు దారితీసింది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం గ్యాస్కు ఆధార్ లింకును తీసేయడంతో మళ్లీ మొదటికొచ్చింది. దీన్ని ఆసరగా చేసుకుంటున్న అక్రమార్కులు అక్ర మ గ్యాస్ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే 2013 జూలై నెలలో జిల్లాలో 4.15 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. బ్యాంకు ఖాతా, ఆధార్ నం బర్ అనుసంధానం చేయడం వల్ల సుమారు 75 వేలకుపైగా బోగస్ గ్యాస్ కనెక్షన్లు గుర్తించబడ్డాయి. ఇందులో దీపం కనెక్షన్లు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో దీపం కనెక్షన్ కింద మంజూరు చేయబడిన వారు గృహావసరాలకు వినియోగించకుండా వేరే వ్యక్తులకు అమ్ముకున్నారు. దీనికితోడు ఒకరి పేరు మీదా గ్యాస్ కనెక్షన్ మంజూరైతే మరోకరికి గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. దీంతో ఆ గ్యాస్ కనెక్షన్లు బోగస్ కింద గుర్తించి తొలగించారు. -
ఏమన్నారు బాబూ!
నాడు ‘ఆధార్’ను తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ గ్యాస్తో అనుసంధానంపై ఆందోళనలు చేశారు నేడు అన్నిటికీ ఆధారమే మార్గమంటున్నారు ‘ఆడబిడ్డలు పొయ్యిల దగ్గర కూర్చుని కష్టపడ్డారు. వంట కోసం కట్టెలకు తిప్పలుపడ్డారు. అందుకే దీపం పథకం పెట్టి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను. ఇప్పుడేమో ఆధార్తో గ్యాస్ను అనుసంధానం చేశారు. పైగా నగదు బదిలీ పెట్టారు.ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది. మహిళల కష్టాలు తీరుస్తాను. - ప్రతిపక్ష నేత హోదాలో పలు సందర్భాల్లో బాబు చెప్పిన మాటలు ‘ఆధార్ న మోదు తప్పనిసరి. అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ను అనుసంధానం చేస్తాం. మార్చిలోపు అందరికీ ఆధార్ కార్డు ఉండేలా చూస్తాం.’ - సీఎం చంద్రబాబు సాక్షి, చిత్తూరు: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆధార్కార్డుకు ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకించి ఆందోళనలు చేసిన టీడీపీ ఇప్పుడు ఆధారమే మార్గమంటూ నడుస్తోంది. ప్రభుత్వ పథకానికి ‘ఆధార్’ నమోదు తప్పనిసరి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సీఎం ప్రకటనపై ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నాడు రోడ్డెక్కిన టీడీపీ ప్రభుత్వ పథకాలు ఏవె నా లబ్ధిదారులకు ఆధార్ తప్పనిసరి అవుతోంది. మూడేళ్ల కిందట ఆధార్రూ. ప్రక్రియ ప్రారంభమైంది. కొందరికి కార్డులు వచ్చాయి. వాటిల్లో కొన్నింట తప్పులు దొర్లాయి. కొందరికి ఇప్పటికీ కార్డులు అందలేదు. ఇలా ఆధార్రూ.లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లకు నగదుబదిలీని అమలు చేసింది. లబ్ధిదారులకు సరిగా డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులుపడ్డారు. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థారులో ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తారు. గ్యాస్కు ఆధార్తో లింకుపెట్టి మహిళలను వేధిస్తున్నారని టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. గ్యాస్ సిలిండర్లను నెత్తిన పెట్టుకుని ధర్నాలు చేశారు. ప్రభుత్వ పథకాలకు, ఆధార్తో ముడిపెట్టొద్దని డిమాండ్ చేశారు. తర్వాత ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఆధార్రూ. లింకుకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఇప్పుడు అన్నిటికీ ఆధార్రూ. తప్పనిసరి : అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే చంద్రబాబు గతం మరిచిపోయూరు. తాజాగా ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్రూ. తప్పనిసరి అని లబ్ధిదారుల గుండెల్లో గుబులు పుట్టించారు. రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు...విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్తో పాటు మెడికల్బిల్లులు, ఉపాధికూలీ, సామాజిక పింఛన్లు, ఉపకారవేతనాలు, ఐకేపీ రుణాలు, ఇళ్లు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్, బ్యాంకులు...ఇలా ప్రతీ అంశానికి ఆధార్రూ.తో ముడిపెట్టనున్నారు. ప్రస్తుతం ఆధార్ మంజూరు ప్రక్రియ పూర్తికాలేదు. వచ్చిన కార్డుల్లో బోలెడు తప్పులు దొర్లాయి. ఇలాంటి క్రమంలో ప్రతి పథకానికి ఆధార్ ముడిపెడితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ప్రభుత్వం కూడా కొన్ని పథకాలకే ఆధార్ను ముడిపెట్టి, ఆపై వాటికీ తొలగించిందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పథకాలన్నిటికీ ఆధార్ను ముడిపెట్టడం సరికాదని చెబుతున్నారు. జిల్లాలో ఆధార్రూ. పరిస్థితి ఇది : జిల్లా వ్యాప్తంగా 37,85,828 ఆధార్కార్డులు బెంగళూరు ఆధార్ ప్రింటింగ్ స్టేషన్లో నమోదయ్యాయి. ఇందులో 34,76,812 మందికి కార్డులు జారీ అయ్యాయి. తక్కినవి పంపిణీ చేయాల్సి ఉంది. నమోదైనవాటిలో 78వేల కార్డుల్లో తప్పులు దొర్లాయి. ఇవి కాకుండా మరో 4-5లక్షల మందికి ఆధార్ నమోదు చేయాలి. ప్రస్తుతం ఆధార్ నమోదుకు బ్రేక్ పడింది. 87శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయింది ఆధార్కార్డుల నమోదు 87శాతం పూర్తయింది. ప్రస్తుతం తప్పులు దొర్లినవాటిని సరిచేస్తున్నాం. మొత్తం 34.76లక్షల కార్డుల్లో 29.45,835 యూనిట్లు రేషన్కార్డులతో అనుసంధానం అయ్యాయి. ప్రతి మీసేవా సెంటర్లో ఆధార్ నమోదు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ ఆధార్కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే ! - విజయరాణి, డీఎస్ఓ -
సర్వే.. సందేహాలు
ఎలాంటి అపోహలకు గురికావద్దు సామాజిక ఆర్థిక సర్వే మాదిరిగానే సమగ్ర కుటుంబ సర్వే సర్వే అంశాల్లో పలుమార్పులు నీలగిరి : సమగ్ర కుటుంబ సర్వే పట్ల ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలో పేర్కొన్న అంశాలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఈ సర్వే కారణంగా రేషన్కార్డులు తొలగిస్తారా.. పెన్షన్లు రాకుండా పోతాయా.. ఒక ఇంటిలో ఒకే పొయ్యి ఉంటే వంట గదిని ప్రామాణికంగా తీసుకుని సర్వే చేస్తే గ్యాస్ కనెక్షన్లు రద్దు చేస్తారా..వంటి అనేక సందేహాలు ప్రజలను వెంటాడుతున్నాయి. సర్వేలో ఎన్యుమరేటర్ అడిగిన వివరాలన్నింటిని చెప్పకుండా రహస్యంగా ఉంచితే జరిగే నష్టం ఏమిటి..? లాంటి చర్చ కూడా ప్రజల్లో జరుగుతోంది. అయితే ఇలాంటి అపోహలు, అనుమానాలకు తెరదించుతూ ప్రభుత్వం సర్వే ముఖ్య ఉద్దేశాన్ని సవివరంగా పేర్కొంది. జిల్లా ప్రణాళిక విభాగం నిర్వహించే సామాజిక ఆర్థిక సర్వే తరహాలోనే సమగ్ర కుటుంబ సర్వే ఉంటుందని తేల్చిచెప్పింది. దీనివల్ల రేషన్ కార్డులు తీసేయడం.. పెన్షన్లు రద్దు చేయడం..ఇతర సంక్షేమ పథకాల ఫలాలు అందకుండా పోతాయోమని ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ శుక్రవారం జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించేందుకుగాను ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనర్హులకు కాకుండా అర్హులకు అందేలా ఈ సర్వే దోహదపడుతుంది. మార్పులు.. చేర్పులు... తొలుత జారీచేసిన నమూనాలో స్థానికత దృష్టిలో పెట్టుకుని పొరుగు రాష్ట్రానికి చెందిన వారి వివరాలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిర నివాసం ఉంటున్నారనే అంశాలను చేర్చారు. కానీ తాజా సవరణలో ఆ కాలాన్ని పూర్తిగా తొలగించారు. దీంతోపాటు కుటుంబ వివరాల్లో సామాజిక వర్గంతోపాటు కులాన్ని తె లియజేయాలి. అదే విధంగా మాతృభాష కూడా తెలపాలి. ఇతర ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులను మినహాయిస్తే మిగతా కుటుంబ సభ్యుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అయితే విద్యార్థులు చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు వివరాలను మాత్రం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగులు తాము పనిచేస్తున్న ప్రాంతాల్లోనే వివరాలను నమోదు చేసుకోవచ్చు. తాత్కాలికంగా ఉపాధి కోసం వలస వెళ్లిన వారు మాత్రం సర్వే రోజున సొంత గ్రామానికి రావాల్సి ఉంటుంది. ఎన్యుమరేటర్ మీ వద్దకు వచ్చే సమయానికి మీ వద్ద దిగువ పేర్కొన్న సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నంబర్లు రేషన్కార్డు (తెలుపు/పింక్/అన్నపూర్ణ/అంత్యోదయ) బ్యాంకు ఖాతా నంబరు మొబైల్ నంబరు గ్యాస్ కనెక్షన్ వివరాలు, నంబరు పెన్షన్ పుస్తకం (వృద్ధాప్య/వితంతువు/వికలాంగులు/చేనేత/కల్లుగీత కార్మికులు) వయసు ధ్రువీకరణ పత్రాలు (పిల్లలు చదువుకున్న వారయితే) ఓటరు ఐడీ నంబర్లు వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు (సదరమ్ సర్టిఫికెట్ కలిగి ఉంటే) వ్యవసాయ భూమి వివరాలు (పాస్ బుక్/టైటిల్ డీడీ) పశుసంపద వివరాలు సొంత స్థిర, చరాస్తుల వివరాలు దీర్ఘకాలిక వ్యాధుల వివరాలు కరెంటు మీటరు నంబర్ భూమి, వాహన వివరాలు కచ్చితంగా నమోదు చేయించుకోవాలి. భవిష్యత్తులో ఆ.. ఆస్తులను వారసులకు ఇవ్వాలన్నా లేదా అమ్మాలన్నా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. -
ఆరిన ‘దీపం’
పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు సర్కారు మరో షాకిచ్చింది. ఇప్పటికే డ్వాక్రా రుణాల మాఫీ హామీని అటకెక్కించి, స్త్రీ నిధి రుణాలపై వడ్డీ పెంచి వారిపై పెనుభారాన్ని మోపిన బాబు..తాజాగా మంజూరైన దీపం గ్యాస్ కనెక్షన్లు రద్దు చేయడం పేదవారి వంటింట్లో అలజడి రేపుతోంది. సాక్షి, ఒంగోలు: మేలు చేస్తుందనే ఆశతో ఓటేసి అధికారంలోకి తెచ్చిన టీడీపీ.. మిహిళలకు షాకుల మీద షాకులిస్తోంది. బ్యాంకు రుణాలు చెల్లించొద్దంటూ నమ్మబలికి రుణాల మాఫీ చేయని టీడీపీ సర్కారుపై డ్వాక్రా మహిళలు ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నారు. బిడ్డల చదువులకు అక్కరకొస్తాయని దాచుకున్న పొదుపు సొమ్మునూ.. బ్యాంకర్లు రికవరీ పేరుతో జమ చేసుకోవడంతో బాధితుల కడుపు రగిలిపోతోంది. పుండు మీద కారం చల్లినట్లు ‘దీపం’ గ్యాస్ కనెక్షన్ల రద్దు వ్యవహారంతో వారిలో ఆగ్రహం పెళ్లుబుకుతోంది. అటు రైతులను, ఇటు మహిళలనూ పనిగట్టుకుని చంద్రబాబు సర్కారు ఇబ్బందులకు గురిచేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో 7,874 దీపం గ్యాస్ కనెక్షన్లు రద్దయ్యాయి. జిల్లాకు ప్రభుత్వం 2012-13 ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా మొత్తం 28,494 గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేసింది. అయితే, వాటిని అధికారులు సకాలంలో అర్హులకు అందజేయలేకపోయారు. మండల పరిషత్ అధికారులు గ్రామసభలు నిర్వహించి అర్హతలను బట్టి లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉండగా, అప్పట్లో వారు నిర్లక్ష్యం ప్రదర్శించారు. మంజూరైన కనెక్షన్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికీ పూర్తి చేయలేదు. వాస్తవానికి, వాటి ల్లో ఇప్పటికి 7,135 కనెక్షన్లు గ్రౌండింగ్ చేయాల్సి ఉంది. మిగిలిన వాటినైనా లబ్ధిదారులకు అందించారా..? అంటే అదీ జరగలేదు. సగం కనెక్షన్లు మాత్రమే గ్రౌండింగ్ పూర్తయి లబ్ధిదారుల చేతికి సిలిండర్లు అందాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ఆ గ్యాస్ కనెక్షన్లన్నీ రద్దయ్యాయి. మరలా అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులు పెట్టుకోవడం... అధికారులు విచారణ చేసి అర్హతలను ధ్రువీకరించడం.. ఆ తర్వాత కొత్తప్రభుత్వం దీపం కనెక్షన్లు మంజూరు చేస్తుందో.. లేదో చూడాల్సి ఉంది. ఇక, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 10,300 కనెక్షన్లను ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేయగా, వాటిల్లో ఇంకా 735 గ్రౌండింగ్ చేయాల్సి ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. గుర్తింపునకు తాపత్రయం: ‘దీపం’ పథకం 1999 నుంచి రాష్ట్రంలో అమలవుతోంది. అప్పటి నుంచి ఏటా వేలాది కనెక్షన్లు ఈ పథకం కింద జిల్లాకు మంజూరవుతున్నాయి. అయితే, రాజకీయ నాయకుల జోక్యం.. అధికారుల నిర్లక్ష్యం కలిసి ఎంపికకు తూట్లు పొడుస్తున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో లబ్ధిదారులను ఎంపిక చేయకుండా నిర్లక్ష్యం వహించడం ఒక కారణమైతే.. అధికారులు పంపిన జాబి తాల్లో అనర్హుల పేర్లు చోటుచేసుకోవడం అర్హులకు శాపమవుతోంది. అయితే, పాత జాబితాలను రద్దు చేసి.త. మరలా కొత్తగా అర్హులను గుర్తించి ప్రతిపాదనలు పంపితే మంజూరు చేస్తామనడంపై డ్వాక్రా మహిళలు విస్తుపోతున్నారు. కేవలం, అధికార టీడీపీ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోందని.. గ్రామీణ మహిళల ఇబ్బందులు ఆలకించినట్లైతే మంజూరైన కనెక్షన్లను రద్దు చేయదంటున్నారు. -
అర్హులకు పొగ.. తమ్ముళ్లకు ‘దీపం’!
విజయవాడ సిటీ : ‘దీపం’ ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు తెలుగుదేశం పార్టీ నేతలు. అర్హులకు పొగబెట్టి తమ అనుచరులకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ధారాదత్తం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా తమ పార్టీ కార్యకర్తలకు మంజూరు చేసిన కనెక్షన్లును రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కిరణ్ సర్కారు ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల దీపం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసింది. వాటిలో కృష్ణాజిల్లాకు 68,017 కనెక్షన్లు మంజూరయ్యాయి. కాంగ్రెస్ నాయకులు చమురు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి జిల్లా వ్యాప్తంగా 46,814 మంది తమ అనుచరులకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయించారు. ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో 21,203 కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ కనెక్షన్లను రద్దు చేస్తున్నట్లు గురువారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ప్రకటించారు. త్వరలోనే కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకే పాత జాబితాను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే నెలలో కొత్త జాబితాలు తయారు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. తమ పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియక గతంలో మంజూరైన వేలాది మంది లబ్ధిదారులు గ్యాస్ కనెక్షన్ల కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై నిరసన ప్రభుత్వ నిర్ణయంపై లబ్ధిదారులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలకు దీపం కనెక్షన్లు కట్టబెట్టేందుకు తమకు పొగబెట్టిందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత కొద్ది నెలలుగా కనెక్షన్ల కోసం తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చే దీపం పథకంపై రాజకీయ జోక్యం తగదని పలువురు పేర్కొంటున్నారు. చమురు కంపెనీలకు రూ.కోట్లలో బకాయిలు దీపం పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చమురు కంపెనీలకు కోట్లాది రుపాయలు బకాయి ఉన్నట్లు సమాచారం. దీపం పథకం కింద కనెక్షన్ పొందిన వారు రూ.600 చొప్పున చెల్లించాలి. ప్రభుత్వం రూ.1,600 చొప్పున జమచేయాల్సి ఉంటుంది. గత ఆరు నెలలుగా ప్రభుత్వం చమురు కంపెనీలకు దీపం బకాయిలు చెల్లించటం లేదని తెలిసింది. దీంతో చమురు కంపెనీలు కూడా దీపం కనెక్షన్లు మంజూరుకు వెనకాడుతున్నట్లు సమాచారం. -
వెలగని దీపం
- ఉన్నవారికే మళ్లీ మంజూరు - ఎన్నికల ముందు ప్రతిపాదనలు రద్దు ? - ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపు నల్లగొండ : దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరై ఏడాది కావస్తున్నా పంపిణీకి నోచుకోలేదు. మంజూరైన గ్యాస్కనెక్షన్లకు సరిపడా లబ్ధిదారులను సైతం అధికారులు ఎంపిక చేయలేదు. ఎన్నికల ముందు ప్రజాప్రతినిధుల వత్తిడిమేరకు హడావుడిగా కొన్ని గ్యాస్కనెక్షన్లను మాత్రమే పంపిణీ చేశారు. అయితే ఇప్పటికే కనెక్షన్ ఉన్నవారికే తిరిగి మంజూరయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇవి కూడా గత అధికార పార్టీకి చెందిన పార్టీ కార్యకర్తలకే ఇప్పించారని ప్రస్తుత ప్రభుత్వం భావి స్తోంది. అందుకే లబ్ధిదారుల జాబితాను మరోసారి పరిశీలించడంతో పాటు అవసరమైతే రద్దు చేయాలని కూడా అనుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రస్తుతం అన్ని గ్యాస్ కంపెనీలకు కలుపుకుని 4,46,547 కనెక్షన్లు ఉన్నాయి. అయితే జిల్లాలో 2013-14 సంవత్సరానికి గాను దీపం పథకం కింద 76, 064 గ్యాస్ కనెక్షన్లు మంజూరు కాగా 45,400 మంది లబ్ధిదారులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారు. అయితే ఎన్నికల ముందే ప్రజాప్రతినిధుల వత్తిడి మేరకు వీటిలో 18,547 కనెక్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇంకా 26,853 కనెక్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇంకా 30,664 గ్యాస్ కనెక్షన్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికే తిరిగి మంజూరైనట్లు సమాచారం. నాయకులకు, కార్యకర్తలకు కనెక్షన్లు ఇప్పించారని.. సార్వత్రిక ఎన్నికలకు ముందు దీపం గ్యాస్ కనెక్షన్లు గతంలో ఉన్న పాలకులు రాజకీయావసరాలకు వినియోగించుకున్నట్లు సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ముందు అప్పటి అధికార పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు చోటా నాయకులు వారి పార్టీ కార్యకర్తలకే ఇప్పించారని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తోంది. దాంతో గతంలో దీపం గ్యాస్ కనెక్షన్లకుఎంపికైన లబ్ధిదారుల జాబితాలను మరో సారి పరిశీలించాలని అవసరమైతే రద్దు చేయాలని కూడా సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసమే దీపం గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారుల ఎంపిక ఎన్నికలకు ముందే కొంతవరకు పూర్తయినా పంపిణీకి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదు. లబ్ధిదారుల ఎంపిక పూర్తికాలేదు - నాగేశ్వర్రావు, డీఎస్ఓ నల్లగొండ దీపం పథకం గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. జిల్లాకు మంజూరైన కోటాలో కొంతమందిని లబ్ధిదారులను ఎంపిక చేశాం. ఇంకా లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. గత ంలో ఎన్నికలకు ముందు కొన్ని గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారు ల ఎంపిక, గ్యాస్ కనెక్షన్ల పంపిణీ విషయాలపై నూతన ప్రభుత్వం ఆదేశా లు జారీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం. -
మూడున్నర లక్షల దీపం కనెక్షన్లు రద్దు
* రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం * రాయలసీమ జిల్లాల్లోనే 1,63,981 మంది తొలగింపు * కొత్త లబ్ధిదారుల ఎంపికకు ఆదేశాలు * రేషన్ డీలర్ పోస్టుల భర్తీపై పాత మార్గదర్శకాలు రద్దు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలో దీపం పథకం కింద మంజూరైన వాటిలో 3.50 లక్షల గ్యాస్ కనెక్షన్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి స్థానంలో కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆ మేరకు వెంటనే జాబితాను తయారు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధ్దిదారుల ఎంపికలో అవకతవకల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షల దీపం కనెక్షన్లు రద్దు చేస్తుండగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనే 1,63,981 మంది లబ్ధిదారులను ఆ పథకం నుంచి తొలగించనున్నారు. మంత్రి ఇటీవల రాయలసీమ జిల్లాల్లో నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితి, గతంలో దీపం పథకం కింద మంజూరైన గ్యాస్ కనెక్షన్లు తదితర వాటిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కిరణ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీపం పథకం కింద చిత్తూరు జిల్లాకు 1,39,646 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయగా వాటిలో 88,882 కనెక్షన్లను రద్దు చేయనున్నారు. కర్నూలు జిల్లాకు మంజూరైన 57,667 కనెక్షన్లలో 35,137, అనంతపురం జిల్లాకు మంజూరైన 72,270 కనెక్షన్లలో 26,679, కడప జిల్లాకు మంజూరైన 53,333 కనెక్షన్లలో 13,283 కనెక్షన్లు రద్దు చేసి కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించినట్లు సమాచారం. మిగతా కనెక్షన్లకు సంబంధించి కూడా ప్రాంతాల వారీగా అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహించి అక్కడికక్కడే రద్దు ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. వంద రోజుల ప్రణాళికలో భాగంగా దీపం పథకం కింద కొత్తగా మంజూరు చేసిన లక్ష దీపం కనెక్షన్లకు సంబంధించిన లబ్ధ్దిదారుల జాబితా కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించా రు. రాష్ట్రంలో 1999 నుంచి ప్రభుత్వం దీపం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద కనెక్షన్ పొందే లబ్ధిదారులు రూ. 1600 డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది. అందుకే వీటికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. ఇలావుండగా రాయలసీమ జిల్లాలైన చిత్తూరులో 277, కడపలో 360, అనంతపురంలో 589, కర్నూలులో 187 చౌక దుకాణాల డీలర్ పోస్టులు అధికారికంగా ఖాళీగా ఉన్నాయి. వీరి నియామకానికి సంబంధించి ప్రస్తుతం వున్న మార్గదర్శకాలను రద్దు చేసి కొత్త మార్గదర్శకాలు తయారు చేసి వెంటనే నియామకాలు చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు ఆశించిన స్థాయిలో స్పందించని అధికారులను బదిలీ చేసే విషయమై మంత్రి సునీత.. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
స్టౌలు సరే... గ్యాస్ కనెక్షన్లేవీ ?
- పొగచూరుతున్న అంగన్వాడీ కేంద్రాలు - సక్రమంగా అమలుకాని 'అమృతహస్తం' పథకం చిత్తూరు(టౌన్): జిల్లాలో అమలవుతున్న 'అమృతహస్తం' పథకం పొగచూరుతోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసినా అంగన్వాడీలకు ఇంతవరకు గ్యాస్ కనెక్షన్లు అందలేదు. ఈ పథకం అమలవుతున్న అన్ని కేంద్రాల్లో కట్టెల పొయ్యిలపైనే ఆధారపడి వంట చేస్తున్నారు. కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో అంగన్వాడీ కేం ద్రాలు మసిబారుతున్నాయి. గర్భిణు లు, బాలింతల సంక్షేమం కోసం కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2013 నుంచి 'అమృతహస్తం' అనే పథకాన్ని రెండు విడతలుగా అమలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 2,629 అంగన్వాడీల్లో ఈ పథకం అమలవుతోంది. గ్రామాల్లో గర్భిణులు, బాలిం తలను గుర్తించి వారికి అంగన్వాడీల నుంచి పౌష్టికాహారాన్ని అందించడమే ఈ పథక ఉద్దేశం. లబ్ధిదారులకు నెలలో 16 కోడిగుడ్లు, రోజూ మధ్యాహ్నం పూట 200 గ్రాముల పాలు, కూరగాయలు, ఆకు కూరలు, పప్పు తో భోజనం అందిస్తారు. భోజనాన్ని లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రాలకే వచ్చి తినేసి వెళ్లాలి. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 30, 344 మంది లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అక్కడికక్కడే వండి అందించాలనే ప్రభుత్వ నిబంధన ఉన్నా ఒక్క కేంద్రానికి కూడా గ్యాస్ కనెక్షన్ లేదు. ఒకవేళ ఉన్నా అది సంబంధిత అంగన్వాడీ హెల్పర్ ఇంటి వద్ద నుంచో, వారి సొంత డబ్బులతోనో తెచ్చుకున్నదే. రెండేళ్లకు ముందే 1,100 గ్యాస్ స్టౌలను ఐసీడీఎస్ అధికారులు టెండర్ల ద్వారా కొనుగోలు చేశారు. గ్యాస్ కనెక్షన్ల మంజూరు గురించి మాత్రం పట్టించుకోలేదు. నెల రోజుల కిందట అన్ని కేంద్రాలకు ఒక్కో కనెక్షన్కు రూ. 5 వేలు చొప్పున చెక్కులను అందజేశారు. అయితే ఇది కార్యరూపం దాల్చడంలో ఆలస్యమవుతోంది. ఆధిపత్యపోరు లబ్ధిదారుల పౌష్టికాహారానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం వీవో (గ్రామసమాఖ్యలు)ల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తోంది. అయితే తాము ఖర్చుపెట్టి పౌష్టికాహారాన్ని అందిస్తుంటే వీవోల ఖాతాల్లోకి జమచేయడం ఏంటంటూ అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లు వాది స్తున్నారు. ప్రభుత్వ నిబందనల ప్రకా రం వంటవండి వడ్డించడం హెల్పర్ల వంతయితే, వండడానికి అవసరమైన వస్తువులు వీవోలే కొనివ్వాలి. అందు కు వారి ఖాతాల్లోకే డబ్బులు పడుతున్నాయి. కానీ పలుచోట్ల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఖర్చుపెట్టి వండిన తర్వాత వడ్డించే సమయంలో వీవోలు ప్రత్యక్షమై పెత్తనం చెలాయిస్తున్నారు. దీన్ని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంగా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో విభేధాలు ఉన్నాయి. దీని ప్రభావం పథకంపై పడుతోంది. లబ్ధిదారులకు పాలు, ఆకుకూరలు, కూరగాయలు లే ని చప్పిడి భోజనం అందుతోంది. ని ధులు ఖర్చయిపోతున్నారుు. ప్రభుత్వ ఆశయం మాత్రం నీరుగారిపోతోంది. సేఫ్టీ మెజర్స్ తర్వాత వాడకం అమృతహస్తం అమలయ్యే అన్ని కేంద్రాలకు గ్యాస్ కనెక్షన్ల కోసం చెక్కులిచ్చాం. కొన్నింటికి కనెక్షన్లు వచ్చాయి. చాలావాటికి గ్యాస్ కంపెనీల నుంచి అనుమతులు రావడంలో ఆలస్యమవుతోంది. మంజూరైన వాటికి సేఫ్టీ మెజర్స్పై శిక్షణ ఇచ్చిన తర్వాత వాడకాన్ని చేపడతారు. అంతవరకు కొంత ఇబ్బంది తప్పదు. -
వెలగని ‘దీపం’..?
నల్లగొండ :రాజకీయ నేతల ఆర్భాటం సామాన్యలను నట్టేట ముంచింది. దీపం కనెక్షన్లు ఎప్పటికై నా వస్తాయని ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. రాజకీయ పైరవీలతో ఎంపిక చేసిన లబ్ధిదారులతో పాటు, అర్హులైన సామాన్యులు సైతం ఇక్కట్లు పడక తప్పట్లేదు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు నాటి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా శాసన సభ్యులకు ప్రత్యేకంగా దీపం కనెక్షన్లు కేటాయించింది. వీటితో పాటు గతంలో మిగిలిన కొన్ని కనెక్షన్లు కూడా తోడయ్యాయి. అయితే ఈ మొత్తం కనెక్షన్లకు సంబంధించిన డిపాజిట్లను లబ్ధిదారుల తరఫున ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కనెక్షన్కు రూ.1400 చెల్లించాలి. కానీ ప్రభుత్వం ఆ మొత్తాన్ని ఆయిల్ కంపెన్లీకు ఇవ్వలేదు. దీంతో కంపెనీలు కనెక్షన్లు మంజూరు చేయకుండా నిలిపేశాయి. ఎదురుచూపులు... అర్హులైన లబ్ధిదారులను ఎంపిక పూర్తయి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు మంజూరు కాలేదు. జిల్లాలో గడిచిన రెండేళ్లలో 6,604 కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవిగాక ఎన్నికల ముందు శాసన సభ్యుల కోటా పేరుతో కొత్తగా 31వేల కనెక్షన్లు మంజూరు చేశారు. ఎప్పుడూ జిల్లా కోటాతోనే మంజూరవుతూ వస్తున్న దీపం కనెక్షన్లు.. ఈ సారి ఎన్నికలు రావడంతో శాసనసభ్యులకు లబ్ధిచేకూరాలనే ఉద్దేశంతో ప్రత్యేక కేటాయింపులు చేశారు. దీంతో అప్పటి ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వ్యక్తులను ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. దీనిపై అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వారికి కేటాయించిన కోటాలో 10వేల కనెక్షన్లు అప్పటికే గ్రౌండింగ్ కూడా పూర్తి చేశారు. ఇంకా 21వేల కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. పథకం మార్చే యోచన... కొత్త రాష్ట్రంలో కొత్త సర్కారు పాలనలో లబ్ధిదారుల ఎంపిక మళ్లీ మొదటికి వస్తోందేమోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. ఎమ్మెల్యేల కోటా విషయంలోనే ఈ ప్రస్తావన ప్రధానంగా వినిపిస్తోంది. దీంతో పాటు పథకం అమలు సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కూడా నివేదికలు కోరుతోంది. దీపం పథకాన్ని అసలు అమలు చేయాలా.. ? లేదా?, పథకంలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనే అంశాలపై జిల్లా అధికారుల నుంచి సమాచారం సేకరిస్తోంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దీపం కనెక్షన్లు పొందాలంటే లబ్ధిదారులు కళ్లల్లో వత్తులు వేసుకుని మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు. దీపం గ్యాస్ కనెక్షన్ల గ్రౌండింగ్ వివరాలు సంవత్సరం మంజూరైనవి లబ్ధిదారుల ఎంపిక జరిగినవి పెండింగ్లో ఉన్నవి 2009-10 24,871 24,871 24,467 404 2011-12 14,000 14,000 7,800 6,200 ఎమ్మెల్యేలకు కేటాయింపు 31,000 31,000 10,000 21,000 -
ఆధార్ సీడింగ్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్ కనెక్షన్ల విషయంలో ఆధార్కార్డు నిబంధనపై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసినా.., ఆధార్తో సంక్షేమ పథకాలను అనుసంధానం చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మాత్రం ససేమిరా అంటోంది. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరికీ ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేసింది. కూలీలకు ఉన్న ఆధార్ కార్డుల నంబర్లను విధిగా అనుసంధానం చేయాలని స్పష్టం చేసింది. అందులో భాగంగా పైలట్ ప్రాజె క్టు కింద దేశంలో 252 జిల్లాలను గుర్తిస్తే.. మన రాష్ట్రంలో 22 జిల్లాలను ఎంపిక చేశారు. ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యం లేని గ్రామాల్లోని కూలీల ఆధార్ నంబర్ల సీడింగ్ కోసం ఏకంగా ఆయా గ్రామాల్లోని గ్రామీణ్ రోజ్గార్ సహాయక్ (జీఆర్ ఎస్)లకు టాబ్లెట్ పీసీలను సరఫరా చేయనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. నెట్ సౌకర్యం లేని గ్రామాల జాబితాను ఈనెల 24వ తేదీలోపు పంపించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రెడ్డి సుబ్రమణ్యం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 252 జిల్లాల కోసం పదివేల టాబ్లెట్స్ను పంపిణీ చేయడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) సంస్థ నిధులు సమకూర్చడానికి అంగీకరించినట్లు ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఒక్కో టాబ్లెట్ పీసీకి పదివేల రూపాయలు ఖర్చు చేస్తారు. లేదా అంతకంటే తక్కువ రేటుతో టాబ్లెట్ కొనుగోలు చేస్తే.. ఆ మొత్తాన్ని చెల్లిస్తామని వెల్లడించారు. పదివేల కంటే ఎక్కువ గ్రామాలకు ఈ టాబ్లెట్లు కావాలన్న డిమాండ్ వస్తే..మొదట దరఖాస్తు చేసుకున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత క్రమంలో వీటిని పంపిణీ చేస్తామన్నారు. టాబ్లెట్లకు సిమ్ ఆధారంగా జీపీఆర్ఎస్ సౌకర్యం ఉండాలని, ఆయా గ్రామాల నుంచి ఉపాధి కూలీల జాబ్కార్డుతోపాటు, వారి ఆధార్ నంబర్లను అనుసంధానం చేసి, కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్ఈజీఎస్ సాఫ్ట్వేర్కు నేరుగా పంపించాల్సి ఉంటుందని వివరించారు. నెట్ కనెక్షన్ లేనిచోట మొబైల్ సౌకర్యం ఉన్న గ్రామాలను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. కేంద్రం అనుమతించిన తరువాత..ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కొనుగోలు చేస్తే.. ఆ మొత్తాన్ని కేంద్రం రీయింబర్స్ చేస్తుందని లేఖలో తెలిపారు. -
ఆరిపోతున్న దీపం
శ్రీకాకుళం, న్యూస్లైన్: వంట చెరకు వినియోగం తగ్గించడం, కాలుష్యం నుంచి పచ్చని పల్లెలను రక్షించడం అన్న లక్ష్యాలతో ప్రభుత్వం వెలిగించిన దీపం పథకం ఇప్పుడు అదే ప్రభుత్వ నిర్ణయాలతో ఆరిపోయే స్థితికి చేరుకుంది. నగదు బదిలీ పథకం పేరిట ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానానికి దీపం లబ్ధిదారులకూ వర్తింపజేయడమే దీనికి కారణం. ఈ నిర్ణయంతో ఇప్పుడున్న దీపం లబ్ధిదారులకు తోడు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికీ గ్యాస్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ కష్టాలు పడలేక పలువురు లబ్ధిదారులు గ్యాస్ వినియోగాన్ని మానివేశారు. జిల్లాలో 1.3 లక్షల దీపం కనెక్షన్లు ఉండగా, ఇప్పటికే 47వేల మంది గ్యాస్ను విడిపించుకోవడం మానేశారు. కొందరు వలస వెళ్లడం, ఇంకొందరు ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఇతరులకు అమ్మేయడం వల్ల ఈ కనెక్షన్లు వినియోగంలో లేవు. తాజాగా మరో 30వేలకుపైగా వినియోగదారులు గ్యాస్ మానేసి కట్టెల పొయ్యిలనే వాడుతున్నారు. ఆధార్ అనుసంధానాన్ని నిర్బంధం చేయడమే దీనికి ప్రధాన కారణం. గ్రామాల్లో చాలా మందికి ఇంకా ఆధార్ కార్డులు అందలేదు. ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకున్న వారిలోనూ కొందరికి బ్యాంకు ఖాతాలు లేవు. ఆధార్ కార్డు పొందడం మాటెలా ఉన్నా నగదు బదిలీ కోసం బ్యాంకు ఖాతా తప్పనిసరి కావడం ఇబ్బందికరంగా మారింది. ఎక్కడో దూరప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు వెళ్లి ఖాతా తెరవడం ఒక సమస్య కాగా, ప్రతి నెలా అదే పనిగా బ్యాంకుకు వెళ్లి లావాదేవీలు నిర్వహించడం గ్రామీణ ప్రజలకు కష్టసాధ్యం. బ్యాంకుకు వెళ్లాలంటే ఒకరోజు పని మానుకోవాలి. దాంతో ఆ రోజు కూలి కోల్పోవలసి వస్తుంది. దానికి తోడు బ్యాంకుకు వెళ్లి రావడానికి ఖర్చులు ఉంటాయి. ఇదంతా ఆర్థిక భారంతో కూడకున్న వ్యవహారమని గ్రామీణులు భావిస్తున్నారు. అలాగే ఇటీవలి వరకు రూ.415కే గ్యాస్ సిలెండర్ ఇచ్చేవారు. ఇప్పుడు దానికోసం ఏకంగా రూ.1300కు పైగా మదుపు పెట్టాల్సి వస్తోంది. సబ్సిడీ తర్వాత వచ్చినా ముందు అంత పెద్ద మొత్తం సమకూర్చుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఆ తర్వాత కూడా సబ్సిడీ మొత్తం కోసం వ్యయ ప్రయాసలతో బ్యాంకుకు వెళ్లడానికి పేదలైన దీపం లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. కొత్త దరఖాస్తుదారులకు అనుమానమే ఇదిలా ఉంటే దీపం కనెక్షన్కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 60వేల మందికి అవి మంజూరయ్యే పరిస్థితి లేదు. దరఖాస్తు చేసుకున్నవారంతా బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డును జత చేస్తేనే కనెక్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించడమే దీనికి కారణం. కాగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు కూడా గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. వీరు కూడా రూ.1300కే గ్యాస్ కొనుగోలు చేస్తుండగా, బిల్లులు మాత్రం సకాలంలో చెల్లించడం లేదు. దీంతో ఆర్థిక భారం పెరుగుతోందని వాపోతున్నారు. అందువల్ల గ్యాస్ను పక్కన పెట్టి కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. -
గ్యాస్ కనెక్షన్ వచ్చిందంటూ మోసం
పిఠాపురం, న్యూస్లైన్ : కొత్తపల్లి మండలం వాకతిప్పలో మంగళవారం సాయంత్రం ఓ కారులో వచ్చిన ముగ్గురు అగంతకులు గ్యాస్ కనెక్షన్లు వచ్చాయంటూ స్థానికులను నమ్మించి డబ్బు, బంగారంతో ఉడాయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వాకతిప్పకు చెందిన పి.దుర్గ సెల్కు ఫోన్ చేసి ‘మీకు గ్యాస్ కనెక్షన్ వచ్చింది.. వెంటనే డబ్బుకట్టి తీసుకుంటే బహుమతులు కూడా ఉన్నాయ’ని నమ్మబలికి కారులో ఆమె ఇంటికి వెళ్లారు. రూ.8 వేలు చెల్లిస్తే కనెక్షన్తో పాటు మిక్సర్ కమ్ గ్రైండర్ ఉచితంగా ఇస్తామని చెప్పడంతో ఆమె రూ.8వేలు తెచ్చి వారికిచ్చింది. ఇంకా ఎవరికైనా కనెక్షన్ కావాలంటే ఇస్తామని వారు చెప్పారు. తన అత్తగారికి గ్యాస్ కనెక్షన్ కావాలని, తన పుస్తెలతాడు తాకట్టు పెట్టి డబ్బు తెస్తానని చెప్పి బయటకు వెళ్లింది. ఎవరూ డబ్బు ఇవ్వకపోవడంతో వచ్చేసింది. ‘ఆ పుస్తెలతాడు ఇచ్చి మీ భర్తను మాతో పంపితే పిఠాపురంలో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాం. గ్యాస్ కనెక్షన్, బహుమతులు ఇచ్చి పంపిస్తామ’ని నమ్మించారు. బంగారు తాడును భర్త సత్తిబాబుకు ఇచ్చి వారి కూడా పంపించింది. కొంత దూరం వెళ్లాక కారులో చోటు సరిపోవడం లేదని, ఆటోలో రావాలంటూ సత్తిబాబుకు రూ.100 ఇచ్చి దింపేశారు. తాము ముందువెళ్లి పుస్తెలతాడు తాకట్టు పెడతామని నమ్మి ంచారు. పిఠాపురం వెళ్లిన సత్తిబాబుకు అక్కడ ఎవ్వరూ కనిపించకపోవడంతో మోసపోయామని గుర్తించిన సత్తిబాబు లబోదిబోమంటూ కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాగే నెల కిందట మూలపేటలో 10 మంది వద్ద నుంచి కొందరు రూ.60 వేలు దండుకుని ఉడాయించారని చెబుతున్నారు. -
గ్యాస్ దందా
జగిత్యాల, న్యూస్లైన్ : సబ్సిడీ గ్యాస్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా.. అక్రమార్కుల ఎత్తుల ముందు చిత్తవుతున్నాయి. సిలిండర్ల సరఫరాను కఠినతం చేసినప్పటికీ.. యథేచ్ఛగా పక్కదారిపడుతూనే ఉన్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతున్న ఈ అక్రమ దందాలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులదే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. దళారుల సహకారంతో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్గా అమ్ముకుంటూ భారీగా ఆర్జిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు ఇటీవల గ్యాస్ సరఫరాపై అనేక ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఒక పేరుపై ఒకటికంటే ఎక్కువ కనెక్షన్లు ఉంటే వాటిని కట్ చేసింది. ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి తొమ్మిది సిలిండర్లు మాత్రమే సరఫరా చేస్తోంది. నగదు బదిలీ అమలులో భాగంగా ఆధార్తో గ్యాస్ కనెక్షన్కు లింక్ పెట్టింది. ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత జిల్లాలో సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని అందరూ ఆశించారు. కానీ వినియోగదారులను నిబంధనల పేరుతో ముప్పుతిప్పలు పెడుతున్న ఏజెన్సీలు అవే నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని సబ్సిడీ గ్యాస్ను పక్కదారిపట్టిస్తున్నాయి. ఉదాహరణకు జగిత్యాల పట్టణంలో రెండు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటి పరిధిలో దీపం పథకం కింద రెండు వేల కనెక్షన్లతోపాటు మరో లక్ష డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి గ్యాస్ వినియోగదారునికి ప్రతి సంవత్సరం తొమ్మిది సబ్సిడీ సిలిండర్లు పొందే అవకాశం ఉంది. కానీ సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఏడాదికి 3-5 సిలిండర్లు మాత్రమే వినియోగిస్తున్నాయి. మిగిలిన సిలిండర్లను గ్యాస్ ఏజెన్సీలు దళారులకు అమ్ముకుంటున్నాయి. సబ్సిడీపై రూ.450కి వచ్చే సిలిండర్ను దళారులకు రూ.650కి అమ్ముతున్నారు. దళారులు డిమాండ్ను బట్టి ఒక్కో సిలిండర్ను రూ.800 వరకు విక్రయిస్తున్నారు. వీటిని హోటల్ నిర్వాహకులు, వాహన వినియోగదారులు కొనుక్కొని వాడుకుంటున్నారు. చిన్న గ్యాస్ సిలిండర్లు అమ్మే దుకాణాల్లోను, గ్యాస్ మరమ్మతుల చేసే దుకాణాల్లో, రీఫిల్లింగ్ దుకాణాల్లో పెద్ద సిలిండర్లను కొని కమర్షియల్గానీ, ఇతర అవసరాలకు వినియోగించే వారికి గాని కిలోకు రూ.80-100 వరకు అమ్ముతున్నారు. ఇలా ఒక్కో సబ్సిడీ సిలిండర్పై చివరి వినియోగదారునికి చేరుకునే సరికి రూ.1200 పైగా ధర పలుకుతోంది. అంటే మిగిలిన రూ.750తో మధ్యలో ఉన్న దళారులు లబ్దిపొందుతున్నారు. ఈ రకంగా జగిత్యాల పట్టణంలో 70 మంది ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాలు, అన్ని పట్టణాల్లోనూ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కమర్షియల్ సిలిండర్లలో చేతివాటం జగిత్యాలలో కమర్షియల్ సిలిండర్లు మూడు వేలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. ఈ సిలిండర్లు 21 కిలోల బరువు ఉంటాయి. వీటి ధర రూ.1900. గ్యాస్ ఏజెన్సీ యజమానులు కమర్షియల్ సిలిండర్ల అమ్మకం జరగకపోవడంతో వాటిని దళారులకు రూ.200 తగ్గించి రూ.1700లకు అమ్మకాలు జరుపుతుంటారు. వారు కిలోకు రూ.100 చొప్పున వ్యాపారులకు అమ్మకాలు జరుపుతున్నారు. ఈ రకమైన సబ్సిడీ మాయను కొంతకాలంగా భారీగా జరుగుతున్నా ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. ఇలా ఒక్క జగిత్యాలలోనే నెలకు రూ.60-70 లక్షలు గోల్మాల్ జరుగుతున్నట్లు అంచనా. -
బండడు కష్టాలు
ఆధార్ అనుసంధానం, బుకింగ్ ఇబ్బందులతో గ్యాస్ వినియోగదారుల బెంబేలు ధర పెరగడంతో సగం మంది వెనకడుగు పల్లెలవైపు వెళ్లేందుకు జంకుతున్న ఏజెన్సీలు ఒంగోలు, న్యూస్లైన్: గ్యాస్ ఏజెన్సీలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గ్యాస్ బుక్ చేసుకునే దగ్గర నుంచి డెలివరీ వరకు...వినియోగదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లాలో గ్యాస్ వినియోగదారులు పడుతున్న ఇబ్బందులను ‘న్యూస్లైన్’ బృందం గురువారం పరిశీలించింది. గ్యాస్ సబ్సిడీ పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డులు అనుసంధానం చేయాలని, బ్యాంకు అకౌంట్లకు కూడా ఆధార్ను అనుసంధానం చేయాలని ఏజెన్సీలు పట్టుబట్టాయి. దీంతో వినియోగదారులు నానా అవస్థలు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల్లో, బ్యాంకుల్లో ఆధార్ నమోదు చేసుకున్నా.. కొందరికి సబ్సిడీ నగదు అకౌంట్లలో జమ కావడం లేదు. దీంతో వారు ఏజెన్సీల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కొందరు ఏజెన్సీల నిర్వాహకులు ఆధార్ నంబరు అనుసంధానమైతేనే గ్యాస్ బుక్ చేసుకుంటామని తేల్చి చెబుతున్నారు. ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకోవాలనుకునే వారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదు. నేరుగా ఫోన్ చేసి బుక్ చేసుకుందామన్నా.. ఏజెన్సీల్లో ఓ పట్టాన ఫోన్ ఎత్తకపోవడంతో మళ్లీ కార్యాలయాలకు రావాల్సిన పరిస్థితి. ఆధార్తో బెంబేలు... జిల్లాలో మొత్తం 5.67 లక్షల గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లున్నాయి. వీరిలో ఇప్పటివరకు 3.20 లక్షల మంది ఆధార్ను గ్యాస్ కంపెనీల వద్ద అనుసంధానం చేసుకున్నారు. అంటే దాదాపు 56.43 శాతం మాత్రమే ఏజెన్సీల వద్ద వినియోగదారుల ఆధార్ నంబర్లు కనెక్ట్ అయ్యాయి. 43.57 శాతం మంది ఇంత వరకు ఆధార్ నమోదు చేసుకోలేదు. ప్రస్తుతం ఆధార్ నమోదు చేసుకోని వారు ఏకంగా సిలిండర్ రూ. 1327.50ల చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే జిల్లాలో 2.47 లక్షల మంది ఆధార్ ప్రక్రియ పూర్తిచేసుకునేంత వరకు అదనపు భారం భరించక తప్పని పరిస్థితి నెలకొంది. = ఆధార్ నమోదు చేసుకున్న వారిలో కూడా 2.40 లక్షల మంది మాత్రమే బ్యాంకుల్లో అకౌంట్కు అనుసంధానం అయ్యారు. బ్యాంకుల్లో కూడా అనుసంధానం అయితేనే వారికి గ్యాస్ సబ్సిడీపై వస్తుంది. అంటే 2.47 లక్షలకు అదనంగా మరో 73 వేల మందికి సబ్సిడీ ప్రస్తుతం అందే అవకాశం లేదు. = జిల్లాలో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలకు నూతన సాఫ్ట్వేర్ ముంబై నుంచి లోడ్ చేస్తుండడంతో చాలా ఏజెన్సీలు పనిచేయలేదు. పెరిగిన ధరతో బెంబేలు.. సిలిండర్లు, బిల్లులు తీసుకొని మార్కెట్లోకి వెళితే డెలివరీ తీసుకోవడానికి జనం ముందుకు రావడంలేదు. గ్యాస్ ధర పెరిగిందని డెలివరీ బాయిస్ చెబుతున్నా అంత రేటా.. అయితే మాకొద్దు అంటూ ఒంగోలు నగర పరిధిలోని శివారు కాలనీల్లోని జనం తిప్పి పంపారు. కొంతమంది అయితే తరువాత పడే డబ్బుల సంగతేమో కానీ అంత పెద్ద మొత్తం మా దగ్గర లేదంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో సగం సిలిండర్లు తిరిగి గ్యాస్ కంపెనీలకే చేరాయి. = ఆధార్తో అనుసంధానం కాని గ్యాస్ కనెక్షన్ల వారు సిలిండర్లు తీసుకుంటారో లేదో అర్థంకాక డెలివరీ ఇవ్వడం లేదు. తమకు ఫోన్చేసి సిలిండర్ తెమ్మంటేనే పంపుతామని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సిలిండర్లు డెలివరీ చేయడానికి ఏజెన్సీల వారు సైతం జంకుతున్నారు. = జిల్లాలో యర్రగొండపాలెం, టంగుటూరు, వెలిగండ్ల, దొనకొండ, సంతనూతలపాడు, తాళ్లూరుల్లోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలు, కనిగిరి, కొండపి హెచ్పీ ఏజెన్సీలు, కొనకనమిట్ల, ముండ్లమూరు భారత్ గ్యాస్ ఏజెన్సీల్లో 50 శాతం కంటే తక్కువగా గ్యాస్ బుక్ చేసుకున్నారు. = జిల్లాలోని దాదాపు 20 గ్యాస్ ఏజెన్సీలు ఫోన్చేసినా ఎత్తకపోతుండడంతో దూరాభారమైనా గ్యాస్ కోసం ఏజెన్సీల వద్దకు జనం వస్తున్నారు. -
‘ఆధార్’ తెచ్చిన తంటా
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుగా తయారైంది ‘తెల్ల’దొరల పరిస్థితి. తలసరి ఆదాయం అధికంగా ఉన్నా నిరుపేదలమని డిక్లరేషన్ ఇచ్చి పలువురు ప్రముఖులు తెల్ల రేషన్కార్డులు పొందారు. వీరిలో కొందరు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందారు. మరి కొందరు ఇతర రూపాల్లో గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నారు. నగదు బదిలీ రూపంలో గ్యాస్ రాయితీని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే వ్యవహారంపై ఐటీ(ఆదాయపు పన్ను శాఖ) విభాగం కన్నేసింది. 1532 మంది తెల్లకార్డు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.పది లక్షలకుపైగా నగదు నిల్వ ఉన్నట్లు గుర్తించింది. వారందరికీ పన్ను చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తోండడంతో ‘తెల్ల’దొరలు బెంబేలెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్యాస్పై ప్రభుత్వం ఇచ్చే రాయితీని నగదు బదిలీ పథకం కింద నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమానికి జూన్ ఒకటిన సర్కారు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. నగదు బదిలీ పథకం కింద గ్యాస్ కనెక్షన్ నెంబర్, లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా నెంబరు.. ఆధార్కార్డు నెంబర్ను సెంట్రల్ సర్వర్తో అనుసంధానం చేస్తున్నారు. జిల్లాలో దీపం పథకంతోపాటు వివిధ చమురు సంస్థల నుంచి 5,69,958 మంది లబ్ధిదారులు గ్యాస్ కనెక్షన్లను పొందారు. ఇందులో 4,91,687 మంది లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లను గ్యాస్ డీలర్లు, బ్యాంకు అధికారులు, పౌరసరఫరాల శాఖ అధికారులు సేకరించా రు. వాటిలో 4,23,102 మంది వినియోగదారుల గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఆధార్ కార్డు నెంబరుతో.. బ్యాంకు ఖాతా నెంబరును అను సంధానం చేశా రు. ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబ ర్లు ఇచ్చిన 68,585 మందికి గ్యాస్ కనెక్షన్లను అనుసంధానం చేయనట్లు స్పష్టమవుతోంది. ఇక ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబర్లు సేకరించని వినియోగదారులు 78,271 మంది ఉన్నా రు. అంటే.. ఇప్పటికీ 1,46,856 మందికి సంబంధించిన ఆధార్ కార్డులు, గ్యాస్ కనెక్షన్ నెంబరు, బ్యాంకు ఖాతా నెంబర్లను అనుసంధానం చేయనట్లు స్పష్టమవుతోంది. గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ కోసం లబ్ధిదారుడు బుక్ చేసుకున్న రెండు రోజుల్లోగానే అడ్వాన్స్ కింద రాయితీ మొత్తం జమ అవుతుంది. గత ఆర్నెల్ల కాలంలో 3.23 లక్షల మంది లబ్ధిదారులు రీఫిల్లింగ్కు బుక్ చేసిన సమయంలో.. రాయితీని నగదు బదిలీ రూపంలో జమ చేసినట్లు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఐటీ విభాగం అధికారులు డేగ కన్ను వేశారు. ఎవరెవరి ఖాతాలో ఎంత మొత్తం నిల్వ ఉందన్న అంశాన్ని లోతుగా పరిశీలించారు. ఇప్పటిదాకా ఐటీ విభాగం చేసిన పరిశీలనలో 1532 మంది తెల్ల రేషన్కార్డు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.పది లక్షలకన్నా ఎక్కువ మొత్తం నిల్వ ఉన్నట్లు గుర్తించారు. తలసరి ఆదాయం రూ.రెండు లక్షలకన్నా అధిక మొత్తం ఉన్న వారి నుంచి ఆదాయపు పన్ను శాఖ పన్ను వసూలు చేస్తోంది. సాధారణంగా బ్యాంకు ఖాతాల్లో ఎవరైనా రూ.పది లక్షలకు మించి నిల్వ చేసి ఉంటే.. ఆ సమాచారాన్ని బ్యాంకు అధికారులు తక్షణమే రిజర్వు బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. రిజర్వు బ్యాంకు ద్వారా ఐటీ విభాగం సమాచారం సేకరించి.. సంబంధిత వ్యక్తుల నుంచి పన్ను వసూలు చేస్తారు. ఐటీ విభాగం కన్ను కప్పడం కోసం బడా బాబులు అనేక బ్యాంకుల్లో ఖాతాలను తెరుస్తున్నారు. ఈ క్రమంలో పన్ను చెల్లించే సమయంలో ఆదాయపు పన్ను శాఖకు ఓ బ్యాంకు ఖాతా నెంబరు.. గ్యాస్ నగదు బదిలీ కోసం పౌరసరఫరాలశాఖ అధికారులకు మరొక బ్యాంకు ఖాతా నెంబరు ఇచ్చారు. ఇప్పుడు తమకు ఇచ్చిన బ్యాంకు ఖాతా నెంబరుతోపాటూ పౌరసరఫరాల శాఖకు ఇచ్చిన బ్యాంకు ఖాతాలో నిల్వ చేసిన మొత్తాలను ఐటీ విభాగం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. ఈ పరిశీలనలో ఇప్పటిదాకా 1532 మంది లబ్ధిదారులు రూ.పది లక్షలకన్నా ఎక్కువ మొత్తం బ్యాంకుల్లో నిల్వ చేసినట్లు గుర్తించింది. వారందరికీ తెల్ల రేషన్కార్డులు ఉన్నట్లు కూడా తేలింది. పన్ను ఎగ్గొట్టిన తెల్ల‘దొర’లకు ఐటీ విభాగం నోటీసులు జారీ చేస్తోంది. తక్షణమే పన్ను చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోండటంతో వారు బెంబేలెత్తుతున్నారు. కాగా ఈ 1532 మంది తెల్లకార్డులను రద్దు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు ఐటీ విభాగం లేఖ రాసినట్లు సమాచారం. -
గందరగోళంగానగదు బదిలీ
విశాఖ రూరల్, న్యూస్లైన్: నగదు బదిలీకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది. గ్యాస్ కనెక్షన్తో ఆధార్ అనుసంధాన ప్రక్రియపై సందిగ్ధం నెలకొంది. పథకాలను ఆధార్తో అనుసంధానం తప్పనిసరి చేయడం సరికాదంటూ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో నగదు బదిలీ పథకం గందరగోళంగా మారింది. సుప్రీం తీర్పు వచ్చినా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో పథకం వర్తింపుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం నుంచి గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకం వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆధార్తో బ్యాంకు అకౌంట్, గ్యాస్ కనెక్షన్ వివరాల నమోదును వేగవంతంగా చేపడుతున్నారు. ఆధార్తో అనుసంధానం చేయకపోతే సబ్సిడీ గ్యాస్ రాదనే భయంతో చాలా మంది గ్యాస్ డీలర్ల వద్ద క్యూలు కడుతున్నారు. హెచ్పీసీఎల్, ఐఓసీ, బీపీసీలకు సంబంధించి విశాఖలో 38 మంది డీలర్లు ఉన్నారు. వీరి పరిధిలో 6,41,368 కనెక్షన్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో 3,03,326 ఉన్నాయి. వీరందరికీ నగదు బదిలీ పథకాన్ని వర్తింప చేయడానికి ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆధార్తో గ్యాస్ కనెక్షన్ను అనుసంధానం చేసుకున్న వారి ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ డబ్బు జమవుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ప్రక్రియకు బ్రేక్ పడినట్టు అధికారులు చెబుతున్నారు. 22 శాతం అనుసంధానం జిల్లాలో నగదు బదిలీ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 22 శాతం మంది ఆధార్తో గ్యాస్ కనెక్షన్ను అనుసంధానం చేసుకున్నారు. ఇప్పటికీ చాలా మంది బ్యాంకు అకౌంట్లు లేని వారు, ఆధార్ లేని వారు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఆధార్, అకౌంట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం ఆధార్ నమోదు 93 శాతం పూర్తయింది. జిల్లాలో జనాభా 42,88,113 కాగా, ఇందులో 39,99,142 మందికి ఆధార్ నమోదు పూర్తయింది. 2,90,888 తిరస్కరణకు గురయ్యాయి. 29,72,127 మంది కార్డులు సిద్ధం కాగా, 8,36,132 మందికి సంబంధించి ఇంకా తయారు కావాల్సి ఉంది. ఇంకా 4,52,949 మంది వివరాలు నమోదు చేయాల్సి ఉంది. జిల్లాలో నగదు బదిలీ పథకం అమలు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆధార్ కార్డుల జారీ కూడా వేగవంతంగా జరుగుతోంది. వారంలోగా స్పష్టత నగదు బదిలీ పథకంపై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిర్ణయం మేరకు తుది చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు. కానీ యథావిధిగా ఆధార్తో అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వినియోగదారులకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆధార్పై కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. త్వరలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, అప్పుడు దీనిపై స్పష్టత వస్తుందన్నారు. -
అధికారుల్లో గుబులు
సాక్షి, విశాఖపట్నం : ఏసీబీ వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఎవరు వలలో చిక్కుతారోనన్న గుబులు పట్టుకుంది. ఈ నెల 4న ఆదాయానికి మించి అదనంగా రూ.కోటి లక్షా 98 వేల ఆస్తులున్నాయన్న అభియోగంపై వుడా డీఎఫ్ఓ శంబంగి రామ్మోహన్ పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం రూ.3 లక్షలు లంచం తీసుకుని నగర పౌరసరఫరాల శాఖ అధికారి జ్వాలా ప్రకాష్ ఏసీబీకి చిక్కారు. ఒకే నెలలో ఇద్దరు జిల్లా అధికారులు ఏసీబీకి పట్టుబడడంతో మిగతా అవినీతి అధికారులు ఉలిక్కి పడుతున్నారు. ఏసీబీ అధికారులు కూడా అవినీతి తిమింగలాలపైనే దృష్టి సారిం చినట్టు తెలిసింది. అర్బన్ డీఎస్ఓ జ్వాలా ప్రకాష్పై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. గ్యాస్ కనెక్షన్ల పేరు మార్పిడి కేసులను పట్టుకోవడంలో ఆయన దిట్ట అనే పేరుంది. ఇప్పుడా కేసే ఏసీబీ అధికారులకు పట్టిచ్చింది. దీనికి సంబంధించి ఫిర్యాది మామిడి కన్నారావు, డీఎస్పీ ఎం.నర్సింహారావు చెప్పిన వివరాలివి. ఆరిలోవకు చెందిన పద్మ అనే మహిళ పేరున ఉన్న దీపం కనెక్షన్ను రూ.2,500 లంచం తీసుకుని సింహాచలం అనే మహిళ పేరున మార్చారని ఈ నెల 25న సాయిరామ్ గ్యాస్ ఏజెన్సీ డీలర్ మామిడి కన్నారావుపై అర్బన్ డీఎస్ఓ జ్వాలా ప్రకాష్ కేసు నమోదు చేశారు. కన్నారావు మాత్రం తాను గ్యాస్ కనెక్షన్ పేరు మార్చలేదని, రూ.2,500 తీసుకుని కొత్త కనెక్షన్ మాత్రమే ఇచ్చానని చెబుతున్నారు. ఇలా వేర్వేరు వాదనలు ఉన్న నేపథ్యంలో కేసులు నమోదైతే గ్యాస్ ఏజెన్సీ రద్దయిపోతుం దని డీఎస్ఓ హెచ్చరించారు. దీంతో స్థానిక సింగ్ హోటల్ జంక్షన్లోని నవోదయ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ డీలర్, తన సోదరుడు మామిడి అప్పలకొండకు ఈ విషయాన్ని కన్నారావు చెప్పాడు. తనపై కూడా ఇదే తరహాలో కేసు నమోదు చేశారని, రూ.2 లక్షలు ఇస్తే మాఫీ చేస్తానని చెప్పారని, ఈ కేసుపై కూడా మాట్లాడతానని, భయపడాల్సిన అవసరం లేదని సోదరుడికి అప్పలకొండ ధైర్యం చెప్పారు. ఆ మేరకు ఆయన డీఎస్ఓతో మాట్లాడారు. రూ.5 లక్షలు లంచం ఇస్తే కేసు రద్దు చేస్తానని డీఎస్ఓ చెప్పారు. ఆదివారంలోగా కన్నారావు, సోమవారంలోగా అప్పలకొండ లంచం ఇచ్చేం దుకు ఒప్పందం కుదిరింది. కానీ అంత మొత్తం ఇచ్చుకోలేక కన్నారావు ఆదివారం ఉదయం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ ఎం.నర్సింహారావు పథక రచన చేశారు. రూ.5 లక్షలు ఇవ్వలేనని, రూ.3 లక్షలు ఇవ్వగలన ని చెప్పమని డీఎస్ఓ ఇంటికి కన్నారావును పంపించారు. వారి సూచన మేరకు పాండురంగాపురంలో ఉంటున్న డీఎస్ఓను ఫిర్యాది కలిశారు. రూ.3 లక్షలు మాత్రమే ఇవ్వగలనని డీఎస్ఓతో సంప్రదింపులు జరిపారు. దానికి ఆయన అంగీకరిస్తూ మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా ఇంటికి తెచ్చివ్వాలని చెప్పారు. దీంతో కన్నారావు పథకం ప్రకారం రూ.3 లక్షల నగదును డీఎస్ఓకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలో సీఐలు రామకృష్ణ, రాఘవరావు, రమణారావు పట్టుకున్నారు. చిక్కడమే తరువాయి ఏకకాలంలో ఇంట్లో సోదాలు ప్రారంభించారు. కీలకమైన డాక్యుమెంట్లు దొరకడంతో రాత్రంతా సోదాలు చేయాలని అధికారులు నిర్ణయించారు. -
శరవేగంగా నగదు బదిలీ
విశాఖ రూరల్, న్యూస్లైన్: జిల్లాలో నగదు బదిలీ పథకం అమలుకు అధికారులు శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. సోమవారం జేసీ తన చాంబర్లో విలేకర్లతో మాట్లాడుతూ ఆధార్ కార్డుల అనుసంధాన ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందన్నారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వంట గ్యాస్ వినియోగదారులకు నగదు బదిలీ పథకం వర్తించనుండడంతో ఈ నెలాఖరులోగా ఆధార్తో బ్యాంకు అకౌంట్లు, గ్యాస్ కనెక్షన్లను 70 శాతం వరకు అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 9,44,694 మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారని, అక్టోబర్ ఒకటో తేదీ నుంచి వీరందరికీ నగదు బదిలీ పథకం వర్తించనుందని తెలిపారు. గ్యాస్ సబ్సిడీ డబ్బులు నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోనే ఒక నెల అడ్వాన్సుగా జమవుతాయన్నారు. 93 శాతం ఆధార్ పూర్తి : జిల్లాలో మొత్తం 42,88,113 మంది జనాభా ఉండగా, వీరిలో 37,08,259 మందికి కార్డులు మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 60 శాతం మందికి కార్డుల పంపిణీ జరిగిందన్నారు. ఇంకా 5,79,854 మంది ఆధార్ తీసుకోవాల్సి ఉందన్నారు. వచ్చే నెల ఒకటో తేదీలోగా ఆధార్ కోసం వివరాలను నమోదు చేసుకోవాలని, లేకుంటే సబ్సిడీ గ్యాస్ లభించే అవకాశం ఉండదన్నారు. నాన్సబ్సిడీలో రూ.992కు సిలిండర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆధార్కార్డులు వచ్చిన వారందరి బ్యాంకు, గ్యాస్ కనెక్షన్ల వివరాలను ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఆధార్కార్డులు ఉన్న వారు వెంటనే బ్యాంకు అకౌంట్లు తీసుకోవాలని, ప్రస్తుతం అన్ని జాతీయ బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇస్తున్నారని తెలిపారు. అవసరమైతే కొత్తగా ఆధార్ కేంద్రాలు : జిల్లాలో కొన్ని రేషన్దుకాణాల పరిధిలో 60 శాతం వరకు మాత్రమే ఆధార్ నమోదు జరిగినట్టు తెలుస్తోందన్నారు. దీనిపై ఇటీవలే డీలర్లతో సమావేశం నిర్వహించామన్నారు. కార్డుదారులు ఎవరైనా ఆధార్ తీసుకోని పక్షంలో ఎంత మంది ఉన్నారో గుర్తిస్తే వారి కోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్పీఆర్ తప్పనిసరి : నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ(ఎన్పీఆర్) బయోమెట్రిక్ను జిల్లా ప్రజలు తప్పనిసరిగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్కుమార్ సూచించారు. ముంబయిలో జరిగిన దాడులను దృష్టిలో పెట్టుకొని దేశంలో అన్ని కోస్తా ప్రాంతాల్లో ఈ ఎన్పీఆర్ను కేంద్రం చేపడుతోందన్నారు. రక్షణపరంగా ఇది అత్యవసరమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సర్టిఫికెట్లు : ప్రసుత్తం తహశీల్దార్లు అందరూ సమైక్యాంధ్ర కోసం సమ్మెలో ఉండడంతో ఆయా కార్యాలయాల్లో పూర్తి సేవలు స్తంభించాయని జేసీ చెప్పారు. దీంతో ధ్రువపత్రాల కోసం విద్యార్థులు, ఉద్యోగులు కొంత ఇబ్బందులు పడుతున్నారన్నారు. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగ, ఉన్నతస్థాయి విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఒక ధ్రువపత్రాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. సమ్మె అనంతరం వీరికి పూర్తి స్థాయి పత్రాలు మంజూరు చేస్తామని చెప్పారు. -
ఒకటి నుంచి ‘నగదు బదిలీ’
విశాఖ రూరల్, న్యూస్లైన్ : నగదు బదిలీ పథకం అమలుకు జిల్లాలో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. వంట గ్యాస్తో ఈ పథకానికి కేంద్రం శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో మెదక్, నెల్లూరు జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలో కూడా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో 9,44,694 మంది వంట గ్యాస్ వినియోగదారులకు ఈ నగదు బదిలీ పథకం వర్తించనుంది. ఫలితంగా గ్యాస్ సబ్సిడీ డబ్బులు నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోకే జమకానున్నాయి. ఈ పథకం వర్తించాలంటే ఆధార్ కార్డు తప్పని సరి. లేనిపక్షంలో నాన్ సబ్సిడీలో రూ.992కు గ్యాస్ సిలిండర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఆదేశాల మేరకు డీఎస్ఓ జ్వాలాప్రకాష్ ఈ పథకం అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 93 శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 42,88,113 మంది జనాభా ఉండగా, వీరిలో 39,99,142 మంది ఆధార్ కోసం వివరాలు నమోదు చేసుకున్నారు. ఇందులో వివిధ కారణాల వల్ల 2,90,883 మందివి తిరస్కరించారు. ఇప్పటికే 28,72,127 మందికి సంబంధించి బెంగళూరు యూఐడీఏఐ నుంచి కార్డులు మంజూరు కాగా, ఇంకా 8,36,132 మందివి మంజూరు కావాల్సి ఉంది. ఇవి పోస్టు ద్వారా సంబంధిత వ్యక్తులకు అందడానికి కొంత సమయం పడుతుంది. జనాభా గణాంకాల ప్రకారం ఇంకా 5,79,854 మంది ఆధార్ తీసుకోవాల్సి ఉంది. వీరు అక్టోబర్ ఒకటో తేదీలోగా ఆధార్ కోసం వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆధార్ నమోదు చేసుకున్నప్పటికీ కార్డులు రానివారు దగ్గరలో ఉన్న మీసేవా కేంద్రానికి వెళ్లి నిర్ణీత రుసుము చెల్లిస్తే కార్డు వివరాలు తెలియజేస్తారు. ఇంటర్నెట్ ద్వారా ఠీఠీఠీ.ఠజీఛ్చీజీ.జౌఠి.జీ వెబ్సైట్లో ఆధార్ కార్డు స్థితిగతులను తెలుసుకోవచ్చు. కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
‘ఆధార్’ లేకుంటే గ్యాస్ భారమే!
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్లైన్: జిల్లాలో ఆధార్కార్డులు లేని వారికి గ్యాస్ కష్టాలు తప్పేట్టు లేవు. కొందరు ఆధార్ నమోదులో పాల్గొన్నా కార్డులు ఇప్పటికీ చేరలేదు. జిల్లాలో అక్టోబర్ నుంచి నగదు బదిలీ పథకం అమలుకానుంది. ఇప్పటికే మొదటి విడతలో ఐదు జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమలు అవుతోంది. రెండో విడతలో పొరుగున్న ఉన్న ప్రకాశం జిల్లాలో సెప్టెంబర్ నుంచి ఈ పథకం అమలుకానుంది. అధిక సంఖ్యలో ప్రజలు అధార్ నమోదు ప్రక్రియలో భాగస్వాములు కాలేదని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 29.74 లక్షల జనాభా ఉండగా వీరిలో 25 లక్షల మంది ఆధార్ నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 20.60 లక్షల మందికి మాత్రమే ఆధార్నంబర్లు ‘జనరేట్’ అయ్యాయి. గ్యాస్ ఏజెన్సీలకు వివరాలు అందించింది 1.90 లక్షల మంది జిల్లాలో మొత్తం 5,35,137 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆధార్, బ్యాంక్ ఖాతాలకు సంబంధించి కేవలం లక్షా 90 వేల మంది మాత్రమే వివరాలు అందించారు. నగదు బదిలీ పథకం అమలైతే వీరంతా అర్హులు అవుతారు. మిగిలిన లబ్ధిదారులంతా గ్యాస్ సిలిండర్ను రూ.990కి కొనుగోలు చేయకతప్పదు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమలు అవుతోంది. ఆయా ప్రాంతాల్లో వినియోగదారులు వివరాలు అందచేయకపోవడంతో గ్యాస్ను రూ.990కి కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. 15 రోజుల్లో వివరాలు అందించాలి : జేసీ 15 రోజుల్లోగా ఆయా గ్యాస్ ఏజెన్సీలకు ఆధార్, బ్యాంక్ ఖాతా, కుటుంబసభ్యుల వివరాలు తప్పనిసరిగా అందించాలి. ఆధార్కార్డులు అందని వారు ‘యూఐడీ, ఈఐడీ నంబర్లను అందచేయవచ్చు. త్వరలో గ్యాస్ వినియోగదారుల వివరాలను బ్యాంక్ ఖాతా నంబర్లతో అనుసంధాన ప్రక్రియ జరగనుంది. వినియోగదారులంతా త్వరితగతిన వివరాలందించాలి. అలాగే రేషన్కార్డుదారులు కూడా, బ్యాంక్ ఖాతా వివరాలను రేషన్దుకాణాల్లో అందజేయాలి.