govt school
-
కంగ్టి గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థులతో చాకిరీ
కంగ్టి(నారాయణఖేడ్): విద్యార్థులతో ఎలాంటి పనులు చేయించరాదన్న నిబంధనలున్నా సంబంధిత విద్యాసంస్థల సిబ్బంది యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కంగ్టి మండలం గిరిజన బాలుర రెసిడెన్షియల్ కళాశాల వసతిగృహంలో విద్యార్థులతో అల్పాహారాన్ని వండించిన విషయం గురువారం బయటకు వచ్చింది. దీనిపై ప్రిన్సిపాల్ విజయ్ను వివరణ కోరగా.. అల్పాహారం తయారీలో విద్యార్థుల సహా యం తీసుకొంటామని స్పష్టం చేశారు. ఈ విషయం మీడియా ద్వారా జిల్లా కలెక్టర్కు చేరడంతో.. నారాయణఖేడ్ ఆర్డీవో అశోక్ చక్రవర్తిని విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆర్డీవో కళాశాలను సందర్శించి విద్యార్థులు, సిబ్బందిని అడిగి విషయాలు తెలుసు కున్నారు. నివేదికను కలెక్టర్కు సమర్పించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ నజీమోద్దిన్, డీటీ జుబేర్ అహ్మద్, సీనియర్ అసిస్టెంట్ తాజోద్దిన్ ఉన్నారు. వడ వద్దన్నందుకు చితకబాదాడుకొందుర్గు: కడుపునొప్పిగా ఉందని, వడ తింటే పడటం లేదని చెప్పినా వినకుండా తినాల్సిందేనంటూ ఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థి వీపుపై వాతలు తేలేలా కొట్టారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం అల్పాహారంగా వడ వడ్డించారు. కడుపునొప్పితో బాధపడుతున్న 9వ తరగతి విద్యార్థి సందీప్ వడ తినడానికి ఇష్టపడలేదు. దీంతో వడ వద్దంటావా అంటూ ప్రిన్సిపల్ మహ్మద్ కుర్షీద్ విద్యార్థి వీపుపై వాతలు వచ్చేలా కర్రతో చితకబాదారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో డైనింగ్ హాల్లోకి వెళ్లిన ప్రిన్సిపాల్.. అక్కడ విద్యార్థులు కూరగాయల తొక్కలు కింద పడేయడాన్ని గమనించారు. వాటిని తిరిగి ప్లేట్లలో వేయించి విద్యార్థులతోనే తినిపించారు. కాగా, తమ అబ్బాయిని కొట్టిన విషయం తెలుసుకున్న సందీప్ తల్లిదండ్రులు మహేశ్వరి, యాదయ్య ప్రిన్సిపల్తో గొడవకు దిగారు. దీంతో తప్పయిందని ఆయన అంగీకరించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం ఈ విద్యాసంస్థను తనిఖీ చేసిన మర్నాడే ఈ ఘటన జరగడం గమనార్హం. ఏక్ నిరంజన్ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలంటూ ఉన్నతాధికారులు, ప్రభుత్వం పదేపదే ఆదేశిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అందుకు ఆదిలాబాద్ (Adilabad) రూరల్ మండలంలోని సాలేవాడ ప్రాథమిక పాఠశాలనే నిదర్శనం. ఈ బడిలో మొత్తం 13 మంది విద్యార్థులు ఉండగా ఉదయం 10 గంటలకు పాఠశాలను ‘సాక్షి’ సందర్శించిన సమయంలో కేవలం ఒకే ఒక విద్యార్థి ఉండగా టీచర్ ఆ విద్యార్థికి బోధిస్తుండటం గమనార్హం. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‘పీఎం ఇంటర్న్షిప్’ దరఖాస్తుకు మార్చి 10 గడువుసాక్షి, హైదరాబాద్: భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం (Prime Minister Internship Scheme) కింద మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పరిశ్రమల శాఖ సంచాలకుడు జి.మల్సూర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులకు 12 నెలలకు రూ.6 వేలు ఒకేసారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేయనున్నట్లు వెల్లడించారు.దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయసు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలని, ఈ ఇంటర్న్షిప్కు ఎంపికైన విద్యార్థులకు ఆరు నెలల పాటు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. దరఖాస్తు చేసే విద్యార్థులు పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, డిగ్రీలలో ఏదైనా పూర్తి చేసి ఉండాలని, వారి కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ‘పీఎంఇంటర్న్షిప్.ఎంసీఏ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయి దరఖాస్తును పూరించాలని సూచించారు. -
ఐదు భాషల్లో అనర్గళంగా!
శాంతిపురం: ఒక దీపం అనంత దీపాలను వెలిగించినట్టు.. తపన ఉన్న ఓ ఉపాధ్యాయుడు తలిస్తే వందల, వేల మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా ఎలా తీర్చిదిద్దవచ్చన్నది చిత్తూరు జిల్లా (Chittoor District) శాంతిపురం, శెట్టేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల చాటుతోంది. మారుమూల గ్రామంలో ఉన్న ఈ స్కూలు విద్యార్థులు బహుభాషలపై తమ ప్రత్యేకతను చాటుకొంటున్నారు. పాఠ్యాంశాల్లోని తెలుగు (Telugu), ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు కన్నడం, తమిళం, మలయాళీ (Malayalam) భాషలు ఇక్కడి విద్యార్థులు సులువుగా రాయటం, చదవడం, మాట్లాడడం చేస్తున్నారు. ఒక భాషలోని పద్యాలు, రచనలను మరో భాషలోకి అనువాదం చేయగలుగుతున్నారు. ప్రత్యేక పరీక్షల్లో ఉత్తీర్ణత అధికారుల అనుమతితో ఆయా భాషల్లో ప్రావీణ్యులైన ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి విద్యార్థుల భాషాపరిజ్ఞానంపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. గుడుపల్లి ఏపీ మోడల్ స్కూలు ఉపాధ్యాయుడు షిజో మైకెల్ మలయాళంపై, గుడుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎస్కే.మణి తమిళంపై, కర్ణాటకలోని వేమన విద్యా సంస్థల ఉపాధ్యాయురాలు ఎస్వనజాక్షి కన్నడ భాషపై మొత్తం 94 మంది విద్యార్థుల స్థాయిలను ఇటీవల పరీక్షించారు. వీరిలో కన్నడంలో 93 మంది, మలయాళంలో 45 మంది, తమిళంలో 36 మంది సంతృప్తికర ప్రతిభను చాటుకున్నారు. ప్రధానోపాధ్యాయుని సంకల్పం ఇక్కడ ప్రధానోపాద్యాయుడుగా ఉన్న తీగల వెంకటయ్య భాషల పట్ల ఆసక్తితో రూపకల్పన చేసిన కార్యక్రమం విద్యార్థులను బహుభాషా కోవిదులుగా తయారు చేస్తోంది. తీరిక వేళల్లో హెచ్ఎం ఇస్తున్న తర్ఫీదు, మిగతా ఉపాధ్యాయుల సహకారం అందిపుచ్చుకుని అన్ని బాషల్లోనూ తమ పట్టును పెంచుకొంటున్నారు. మాతృభాష (Mother Tongue) వస్తే మరెన్ని భాషలైనా నేర్వవచ్చనే ఆలోచనతో హెచ్ఎం తీగల వెంకటయ్య ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి తన ప్రత్యేక బోధనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.చదవండి: సోలో లైఫే సో బెటరూ అంటున్న యువతులు! 6, 7, 8, 9 తరగతుల వారికి భాషల గురించి చెప్పి, కేవలం 26 సరళమైన పదాలతో బోధన ప్రారంభించారు. ఎవరైనా ఉపాధ్యాయులు లేని సమయంలో వారి తరగతులను తీసుకుని విద్యార్థులకు దీనిపై పాఠాలు చెప్పారు. విద్యార్థులు కూడా ఇతర భాషలు నేర్చుకోవటంపై ఆసక్తి చూపడంతో సొంత ఖర్చులతో వారికి మలయాళం, తమిళం, కన్నడ పుస్తకాలను కొనిచ్చారు. ఈ ఆసరాను అందిపుచ్చుకున్న పిల్లలు ఆయా భాషలపై సులువుగా పట్టు సాధిస్తున్నారు. నా విశ్వాసం పెరిగింది ప్రైమరీ స్కూలు రోజుల నుంచి భాషలే నాకు ఇబ్బందిగా ఉండేవి. అక్కడ తెలుగు, ఇంగ్లీషు ఉంటే 6వ తరగతిలో చేరగానే వాటికి హిందీ కూడా తోడయ్యి అంతా అయోమయంగా ఉండేది. కానీ సులువుగా భాషలు నేర్చుకునే టెక్నిక్ తెలుసుకున్న తర్వాత తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు కన్నడ, తమిళం కూడా నేర్చుకొంటున్నాను. నాపై నాకు విశ్వాసం పెరిగింది. – బీ.రామాచారి, 8వ తరగతిఎన్ని భాషలైనా నేర్వవచ్చు నేను రూపొందించిన ప్రాజెక్టు నమూనాతో 20–25 రోజుల్లోపు ఏ బాషలైనా నేర్చుకోవచ్చు. అందరు విద్యార్థులకు దక్షిణ భారత భాషలను నేర్పితే వారి నిత్య జీవనంలో అది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది – తీగల వెంకటయ్య, హెచ్ఎం5 భాషలు నేర్చుకొంటున్నా కొత్త భాషలను సులువుగా నేర్చుకోవటం భలే సరదాగా ఉంది. ఏడాది క్రితం వరకూ తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లోని పాఠ్యాంశాలు నేర్చుకోవటానికే కష్ట పడేదాన్ని. కానీ మా హెడ్మాస్టర్ చెప్పిన విధానం పాటించటంతో ఆ భాషలతో పాటు మలయాళం, తమిళం, కన్నడ కూడా సులువుగా నేర్చుకున్నాను. ఇదే ప్రేరణతో భవిష్యత్తులో నేను భాషా పండిట్ అవుతాను. – కె.ధరణి, 9వ తరగతివిస్తరిస్తే బాగుంటుంది వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని, విద్యార్థుల మిగతా పాఠ్యాంశాలకు ఇబ్బంది కలగకుండా మా హెచ్ ఎం చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. విద్యాశాఖ ఉన్నత అధికారులు ఈ నమూనాను పరిశీలించి మిగతా స్కూళ్లకు కూడా విస్తరిస్తే బాగుంటుంది. ఇంగ్లీషు, హిందీలకు అదనంగా పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయుడిని కేటాయించినా కనీసం మరో మూడు భాషలు పిల్లలకు నేర్పవచ్చు. పోటీ ప్రపంచంలో కేవలం భాషలపై అవగాహన లేకపోవటం వల్లే చాలా మంది సరైన ఉద్యోగాలు పొందలేక పోతున్నారు. – నాగభూషణం, ఇంగ్లీష్ టీచర్ -
ఒకే ఒక్క స్టూడెంట్!
-
స్కూల్ చుట్టూ చీరలు.. సంగతేంటంటే?
అది ప్రభుత్వ పాఠశాల.. ప్రహరీ గోడ లేకపోవడంతో పశువులు, పందులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. రహదారికి ఆనుకుని ఉండటంతో దుమ్మూధూళి అధికంగా వస్తోంది. ప్రహరీ నిర్మాణానికి డబ్బులు లేక ఉపాధ్యాయులే పాఠశాల చుట్టూ చీరలు (Sarees) కట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) మండలం జిల్లెలగడ్డ (Jilleligada) గ్రామ ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఇది. దుమ్మూధూళి తరగతి గదులలోపలికి వచ్చి విద్యా బోధనకు ఇబ్బంది కలిగిస్తోందని ఉపాధ్యాయులు తెలిపారు. చేసేదిలేక చీరలను అడ్డుగా కట్టించామన్నారు. కలెక్టర్ స్పందించి ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. – హుస్నాబాద్ రూరల్ చక్కని ఉత్తీర్ణతకు చిరుతిండి.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు టెన్త్ విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. ఇందులో మిల్లెట్స్, పల్లీపట్టీలు, నువ్వుల పట్టీలు, మొలకలు, అరటిపండ్లు, ఉడికించిన పల్లీలు ఉంటున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపెల్లి జెడ్పీ హైసూ్కల్ పదో తరగతి విద్యార్థుల స్టడీఅవర్స్లో స్నాక్స్ అందిస్తూ, పిల్లల సందేహాలు నివృత్తి చేస్తూ.. హెచ్ఎం అన్నపూర్ణ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి రేషన్ కోసం... నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలోని ఒక రేషన్ దుకాణాన్ని తెరవకముందే మధ్యాహ్నం 3 గంటల నుంచి లబ్ధిదారులు బారులు తీరారు. ఇందుకోసం వరుసలో సంచులు, బండరాళ్లను పెట్టి డీలర్ రాక కోసం నిరీక్షించడం కనిపించింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ఎరువు కష్టాలు రైతులకే ఎరుక సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో సహకార సంఘాల ఎదు ట రైతులు బారులు తీరుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారిలా.. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిఆశలు రాలిన చోట కొత్త చిగురుపంట రాని మామిడి చెట్లను కాండం వరకు కొట్టేసినా.. చిగురిస్తోంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రేగులచెలకలో ఏళ్ల క్రితం నాటిన మామిడి తోటలో చెట్లకు కాలం చెల్లింది. పంట రాకపోవడంతో రైతు చెట్లను కాండం వరకు కొట్టేసి అధికారుల సూచనలతో కొన్ని రసాయనాలు పూశాడు. దీంతో ఇటీవల మళ్లీ కాండం పక్క నుంచి కొత్తగా చిగుళ్లు వస్తుండడంతో.. రెండు, మూడేళ్ల తర్వాత పంట మొదలయ్యే అవకాశముందని ఆశిస్తున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సాక్షి, ఖమ్మంవిస్తృతంగా పొగాకు సాగుసూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలో కొందరు రైతులు పొగాకు పంట సాగుపై దృష్టి సారించారు. గతంలో ఒకరిద్దరు రైతులు సాగు చేయగా.. ప్రస్తుతం 50మందికి పైగానే ఈ పంటను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని ఐటీసీ సంస్థ వారు రైతులకు నారు సరఫరా చేస్తున్నారు. రైతులు పంట పండించి ఆ కంపెనీకే దిగుబడిని విక్రయిస్తున్నారు. అర్వపల్లి మండలంలో సుమారు 300 ఎకరాల్లో పొగాకు పంట సాగవుతోంది. ఈ పంటకు కోతులు, అడవి పందుల బెడద లేదు.చదవండి: భద్రాద్రి సీతారామచంద్ర స్వామికి కాసుల పంట -
అక్షరాల గుడి... 150 ఏళ్ల బడి
సాక్షి, రంగారెడ్డిజిల్లా/షాద్నగర్: అక్షర సుమమై వికసించింది.. ఎంతోమంది మేధావులకు అక్షరాలను నేర్పించింది. ఈ చారిత్రక సరస్వతీ నిలయం ప్రత్యేకతను చాటుతూ 150 వసంతాలను పూర్తి చేసుకుంది. అదే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇది స్వాతం్రత్యానికి పూర్వమే ఏర్పాటైంది. శుక్రవారం 150 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అనేకమంది ప్రముఖుల అక్షరాభ్యాసం ఈ బడిలో అనేక మంది ప్రముఖులు అక్షరాభ్యాసం చేశారు. తర్వాత ఉన్నత చదువులు చదువుకుని వివిధ రంగాల్లో దేశవిదేశాల్లో స్థిర పడ్డారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, యూపీ మాజీ గవర్నర్ సత్యనారాయణరెడ్డి, మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీనివాసరావు, ఓయూ మాజీ వీసీ మల్లారెడ్డి, స్వాతంత్య్ర సమరయోధుడు రంగారావు, పౌర హక్కుల సంఘం నేత, ప్రొఫెసర్ హరగోపాల్ సహా అనేక మంది ఇక్కడ అక్షరాలు దిద్దినవారే. గ్రామస్తుల్లో చైతన్యం రగిలించేందుకు.. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన తుర్రెబాజ్ఖాన్ అప్పట్లో వారి నుంచి తప్పించుకుని షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్నగర్ మండలం మొగిలిగిద్దలో ఆశ్రయం పొందినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ విషయం నిజాంకు తెలిసి తుర్రెబాజ్ఖాన్ను అరెస్ట్ చేసి, హైదరాబాద్కు తరలించి ఉరి తీసినట్లు ప్రచారం ఉంది. గ్రామస్తులను విద్యాపరంగా చైతన్యవంతులను చేయాలనే సంకల్పంతో నాటి నిజాం సర్కార్ 1873లో మొగిలిగిద్దలో పాఠశాలను ఏర్పాటు చేసింది. మొదట్లో ఉర్దూ మీడియంలో విద్యాబోధన చేయగా, 1948లో తెలుగు మాధ్యమంలో బోధనను ప్రారంభించారు. నిజానికి పాఠశాల ప్రారంభమై 152 ఏళ్లుపూర్తి కావొస్తున్నా.. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు 150వ వార్షికోత్సవాన్ని (కోవిడ్ కారణంగా రెండేళ్లు ఉత్సవాలు వాయిదా వేశారు) జరుపుకొనేందుకు సంసిద్ధులయ్యారు. ఇక్కడ 500 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన స్వాతం్రత్యానికి ముందే ఇక్కడ పోలీస్స్టేషన్తోపాటు గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ ఠాణా కింద 140 గ్రామాలు ఉండేవి. ఈ పోలీస్స్టేషన్ను 1983లో కొందుర్గ్కు తరలించారు. ఈ చారిత్రక గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ కూడా ఉంది. పాఠశాల వార్షికోత్సవాలను పురస్కరించుకుని సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం మొగిలిగిద్దకు చేరుకోనున్నారు. పాఠశాలలో పలు మౌలిక సదుపాయాల కల్పనకు, గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. -
గవర్నమెంట్ స్కూల్ నే అమ్మకానికి పెట్టేశారు!
-
అలా ఎలా బ్రో..!
-
ఒక స్కూల్లో ఒకే స్టూడెంట్.. ఏడాది 13లక్షల ఖర్చు
-
ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆగ్రహం
-
మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
-
నారాయణపేట జిల్లాలో కలకలం రేపిన ఫుడ్ పాయిజన్ ఘటన
-
ఆ హైస్కూల్లో ఒంటిగంటకే ఫైనల్ బెల్
రాజంపేట: మధ్యాహ్నం ఒంటి గంట అయితే చాలు.. ఆ హైస్కూల్లో ఫైనల్ బెల్ కొట్టేస్తారు. వేసవి సహా కాలం ఏదైనా.. సోమ, మంగళ, బుధ ఏ రోజైనా ఆ స్కూల్కు రోజూ ఒంటిపూట బడే. అన్నమయ్య జిల్లా నందలూరు జిల్లా పరిషత్ హైస్కూల్ ఒంటిపూటే నడిచే ఏకైక హైస్కూల్గా రికార్డులకెక్కింది. 1908లో నందలూరులో బోర్డు హైస్కూల్ ఏర్పాటైంది. 1954లో జిల్లా పరిషత్ హైస్కూల్.. ఆ తర్వాత 1962లో జిల్లా హయ్యర్ సెకండరీ హైస్కూల్గా ఆవిర్భవించింది.ఒకప్పుడు విశాలమైన గదులు, లైబ్రరీ, ల్యాబ్, క్రీడా పరికరాలతో పాటు నాణ్యమైన బోధన, ఉత్తమ ఉపాధ్యాయులతో క్రమశిక్షణకు మారుపేరుగా హైస్కూల్ ఖ్యాతిగాంచింది. ఎందరో ఐఏఎస్లను అందించి చరిత్రలో నిలిచింది. ఇక్కడి హైస్కూల్లో తరగతులు ఉదయం 7.45కు ప్రారంభిస్తారు. మధ్నాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. జూనియర్ కళాశాల రాకతో హైస్కూల్ విద్యకు గ్రహణంనందలూరు బస్టాండు నుంచి సౌమ్యనాథ ఆలయానికి వెళ్లే మార్గంలో విశాలమైన స్థలంలో ఈ హైస్కూల్ ఉంది. భవనాల కొరతతో 1982లో నందలూరులోని జూనియర్ కళాశాలను ఇక్కడికి మార్చారు. సొంతభవనాల నిర్మాణం వరకు అని చెప్పిన ఇంటర్ బోర్డు నేటి వరకు ఇక్కడే కళాశాలను కొనసాగిస్తోంది. ఇక్కడి నుంచి కళాశాలను తరలించాలని జెడ్పీ హైస్కూల్ యాజమాన్యం మొత్తుకున్నా.. కలెక్టర్లు జోక్యం చేసుకున్నా ఫలితం లేదు. 274 మంది విద్యార్థులున్న ఈ హైస్కూల్లో మధ్యాహ్నం వరకు తరగతులు సాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి ఇంటర్ విద్యను కొనసాగిస్తున్నారువ్యతిరేకిస్తున్న అధ్యాపకులుఏదో ఒక పూట వస్తున్నాం..పాఠాలు చెప్పిపోతున్నాం.. అక్కడికి తరలిస్తే రెండు పూటలా కాలేజీకి రావాల్సి వస్తుంది అనుకున్నారో ఏమో. ఇంటర్ కళాశాలను తరలింపును కొందరు అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. మండల కాంప్లెక్స్ సమీపంలోని ఎస్సీ హాస్టల్ భవనాలు దూరమని.. అక్కడికి వెళితే ఇంటర్ బాలికలకు రక్షణ ఉండదని ప్రచారం చేశారు. నిజానికి మండల కాంప్లెక్స్ ఆవరణ ప్రశాంతంగా ఉంటుంది. దశాబ్దాలుగా అక్కడే వందలాదిమంది బాలికలతో బీసీ గురుకుల పాఠశాల కూడా ఉంది.కేవలం తమ స్వార్థం కోసం అధ్యాపకులు చేసిన వ్యవహారం వల్ల తరలింపు ఆగిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్, డీఈవో, ఇంటర్ ఆర్జెడీ ఒకతాటిపైకి వచ్చి హైస్కూల్కు ఒంటిపూట బడి నుంచి విముక్తి కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా...ఐఏఎస్లను.. గొప్ప రాజకీయ నాయకులను దేశానికి అందించిన స్కూల్గా ఈ ఇది ఖ్యాతి గడించింది. -
పాఠాలు పక్కన పెట్టి పనిలో పిల్లలు
-
బడికి పోవాలంటే భయం భయం
-
మాకు రారా కొత్త టీచర్లు?
వాజేడు: చదువుకునేందుకు విద్యార్థులున్నా.. ఉపాధ్యాయులు లేని పాఠశాల అది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని జంగాలపల్లి గిరిజన ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల బదిలీల్లో ఇక్కడ ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు కాచారం, మరొకరు మంగపేట మండలం చుంచుపల్లికి బదిలీ అయ్యారు. ఇక్కడ ఒక ఉపాధ్యాయినిని నియమించగా.. ఆమె బీఈడీ ఓడీలో ఉన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు రోజూ బడికి వచ్చి వెళ్తున్నారు. కాగా, పే సెంటర్ ఇన్చార్జ్ హెచ్ఎం కేశవరావు ఇతర పాఠశాలల ఉపాధ్యాయుల్లో రోజుకొకరిని జంగాలపల్లి పాఠశాలకు పంపిస్తూ నెట్టుకొస్తున్నారు. కొత్త డీఎస్సీలోనూ ఈ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.66 మందికి ఇద్దరే టీచర్లా?అధికారుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం.. పర్వత్పల్లి పాఠశాలకు తాళంబషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పర్వత్పల్లి ప్రాథమిక పాఠశాలకు గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు తాళం వేశారు. పాఠశాలలో ఒకటి నుంచి 5వ తరగతి వరకు 66 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులే ఉన్నారని, అందులో భరత్ అనే ఎస్జీటీ ఉపాధ్యాయుడిని బుధవారం అధికారులు రిలీవ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా కొత్త ఉపాధ్యాయులను నియమిస్తుంటే తమ గ్రామానికి ఎందుకు నియమించలేదని నిలదీశారు. టీచర్లు లేని పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తూ వారి భవిష్యత్ను పాడు చేయలేమని స్పష్టం చేశారు. కొత్తగా ఉపాధ్యాయులను నియమించే వరకు పిల్లలను బడికి పంపేదిలేదంటూ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాఠశాలలో సద్దాం హుస్సేన్, రవీందర్రెడ్డి అనే ఇద్దరు టీచర్లే లిఉన్నారని వీరు ఐదు తరగతులకూ పాఠాలు ఎలా బోధిస్తారో అధికారులే చెప్పాలన్నారు. ఈ సమస్యను ఎమ్మెల్యే మనోహర్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని గ్రామస్తులు చెప్పారు. మరోవైపు త్వరలో కొత్త టీచర్లు వస్తారని, విద్యార్థులను బడికి పంపాలని ఉపాధ్యాయులు, మండల విద్యాధికారి సుధాకర్రెడ్డి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. చూడండి: డీఎస్సీ–2024 ఉపాధ్యాయులు ఉరుకులు.. పరుగులు (ఫొటోలు) -
ప్రభుత్వ స్కూల్లో చదివిన నేను ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిని
-
ఏపీలో చదువులకు చంద్రగ్రహణం
-
ఆ ప్రభుత్వ పాఠశాల ఎందుకంత ఫేమస్ ?
-
కళసాకారం..
ప్రభుత్వ బడులకు పండుగొచ్చింది. స్కూళ్లు పిల్లలతో కళకళలాడుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఎవరూ కలలో కూడా ఊహించనిదీ విప్లవాత్మక మార్పు.మార్పులో మేము సైతం అంటూ పాలుపంచుకుంది హైదరాబాద్ కు చెందిన యువ ఆర్టిస్ట్ విజయ్,స్వాతి జంట. పిల్లల నవ్వులతో మమేకమైంది.. బడి ప్రాంగణాలే కాన్వాసుగా వారి ఆటపాటలే కుంచెలుగా మలచి వర్ణచిత్రాలను ‘రంగ’రించింది. పాఠశాలకు జీవం ఉట్టిపడే చిత్రాలతో కొత్త కళ తెచ్చింది. ఆ యువ ఆర్టిస్టు జంటతో ‘సాక్షి’ ముచ్చటించింది. వారి మాటల్లోనే.. అలా మొదలైంది: మేం ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం వాటితో అనుబంధం ఉంది. గత 2017లో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని మాకు చేతనైన విధంగా రంగులద్దాం. ఆ సమయంలో ఎవరైనా చొరవ తీసుకుని అన్ని స్కూళ్లకు ఇలాగే రంగులద్దితే ఎంత బావుండో అనుకున్నాం. పూజారి కోరిందీ దేవుడు ఇచ్చిందీ ఒకటే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో లార్జ్స్కేల్ ఆర్ట్ వర్క్స్ కోసం మమ్మల్ని చింతూరు ఐటీడీఎ పీవో అప్రోచ్ అయ్యారు. అలా 2020లో జులై నెలలో నాడు–నేడు కోసం మా వర్క్ స్టార్ట్ అయింది. అది కేవలం మా బొమ్మల వరకే కాదనీ, మొత్తం పాఠశాలల రూపు రేఖలే మార్చే కార్యక్రమం అనీ తెలిశాక మా ఆనందం రెట్టింపయింది. మా కల నిజం అవుతోందని సంబరపడ్డాం. ఆర్ట్ వర్క్ కోసం రోజుల తరబడి ఆయా స్కూళ్లలో గడిపాం. పిల్లలు చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు.. హ్యాపీగా ఫీలైన జాయ్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి వాటినే ఆర్ట్ వర్క్స్గా మలిచాం. తద్వారా పిల్లలు మరింతగా వాటితో కనెక్ట్ అయ్యారు. వాళ్లని వాళ్లు 30–30 స్కేల్ ఆర్ట్ వర్క్లో చూసుకుని థ్రిల్ అయ్యేవారు. పదే పదే చూసుకోవడం, పేరెంట్స్కి, ఫ్రెండ్స్కీ చూపించే సమయంలో వాళ్ల ముఖంలో సంతోషం అమూల్యం. మాటల్లో వర్ణించలేం. అలా హెడ్ మాస్టర్, టీచర్లు, స్టాఫ్.. మా స్కూల్కు బెస్ట్ ఆర్ట్ వర్క్ చేయండి అంటూ అడిగి మరీ చేయించుకున్నారు. చాలా వరకూ ట్రైబల్ ఏరియా స్కూల్స్లో చేశాం. ప్రతీ స్కూల్లో వర్క్ ముగించుకుని వచ్చేటప్పుడు చుట్టాలను వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవ విజయంలో మాకు కూడా చిన్న పాత్ర ఉండడం జీవితంలో మేం మర్చిపోలేని మధుర జ్ఞాపకం. – సత్యార్థ్ నాడు అలా.. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే. సర్కారు బడులంటే టాయిలెట్స్ కనిపించవు, పైనా కిందా గచ్చు పెచ్చులూడుతూ ఉంటుంది. వానపడితే పుస్తకాలు బల్లల కింద దాచుకోవాలి. ఫ్యాన్లు శబ్ధాలు చేస్తాయి తప్ప తిరగవు. బాగా పాఠాలు చెప్పే టీచర్లు కరువు. ప్రాంగణం పందులు, పశువులకు ఆలవాలం. అందువల్లే పిల్లలను చేర్చలేని దుస్థితి. నేడు ఇలా.. బెస్ట్ బెంచీలు, గ్రీన్ బోర్డ్స్, ఫ్లోరింగ్, ఫ్యాన్స్, టాయిలెట్స్, క్రీడా పరికరాలతో సహా ప్లే గ్రౌండ్, పుస్తకాలు, బ్యాగ్స్, ట్యాబ్స్.. పూటకో మెనూతో మధ్యాహ్న భోజనం.. ఇలా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా చక్కటి వసతులు సమకూరాయి. పిల్లలు, టీచర్లలో నవోత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే జాయిన్ చేయాలి అనే పరిస్థితి వచ్చింది. -
నైజీరియాలో 287 మంది విద్యార్థుల కిడ్నాప్
అబూజా: ఆఫ్రికా దేశం నైజీరియాలో సాయుధ దుండగులు 287 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. కడునా రాష్ట్రం కురిగా పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను గురువారం ఉదయం దుండగులు చుట్టుముట్టారు. అప్పుడప్పుడే స్కూలుకు చేరుకుంటున్న విద్యార్థులను వారు బలవంతంగా తమ వెంట సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. మొత్తం 287 మంది విద్యార్థులు కనిపించడం లేదని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. ఈ ఘటనకు కారణమంటూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదని అధికారులు చెప్పారు. సాయుధ ముఠాలు విద్యార్థులను కిడ్నాప్ చేయడం, పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం నైజీరియాలో 2014 తర్వాత పెరిగిపోయింది. 2014లో బోర్నో రాష్ట్రంలోని చిబోక్ గ్రామంలోని స్కూలు నుంచి 200 మందికి పైగా బాలికలను ఇస్లామిక్ తీవ్రవాదులు ఎత్తుకుపోవడం అంతర్జాతీయంగా కలకలం రేపడం తెలిసిందే. -
పాఠశాలల్ని గొప్పగా తీర్చిదిద్దిన ఏపీ ప్రభుత్వంపై కోన వెంకట్ ప్రశంసలు
-
మారిన స్కూలు రూపురేఖలు
-
నాడు నేడు పథకంపై ప్రశంసల జల్లు
-
ప్రభుత్వ విద్యార్థులకు నేడు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ
-
అట్టహాసంగా టీటీఏ మొదటి రోజు మెడికల్ క్యాంపు!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ అధ్వర్యంలో మొదటి రోజు సేవా డేస్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్లోని రెడ్ క్రాస్ గవర్నమెంట్ స్కూల్ మసాబ్ టాంక్లో సేవా డేస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపాల్ సుమిత్ర ఆధ్వర్యంలో ఎన్సీసీ బృందంతో టీటీఏ సభ్యులను సాదరంగా “గాడ్ ఆఫ్ ఆనర్” మార్చ్ ఫాస్ట్ ద్వారా స్వాగతం పలికారు. టీటీఏ సభ్యులను వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు. స్కూల్ పిల్లల ఆట పాటలతో కార్యక్రమం ఆహ్లాదకరంగా మారింది. చిన్నారుల పాటలు ఆహుతులను ముఖ్యంగా టీటీఏ సభ్యులను ఆకట్టుకుంది. ఇక ఈ విద్యార్థులకు టీటీఏ నుంచి నగదు బహుమతి అందించారు. జిమ్నాస్టిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిందన చిన్నారికి టీటీఏ ప్రెసిడెంట్ వంశీ రెడ్డి 5వేల నగదు బహుమతి అందించారు. రానున్నరోజుల్లో ఒలింపిక్స్లో ఆడేలా కృషి చేయాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు డెంటల్ చెకప్, డెంటల్ కిట్స్, శానిటరీ పాడ్స్, ఉమన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరికీ ఫ్రూట్స్ అందజేశారు. రేపటి దేశ భవిష్యత్తు ఈ రోజు నవతరమని వారి ఆరోగ్యం పదిలపరచడం మన దేశ భవిష్యత్తు తో ముడి పడి ఉందన్నారు ప్రెసిడెంట్ వంశీరెడ్డి. అందుకే టీటీఏ వారి ఆరోగ్యం పౌష్ఠికాహారం పై దృష్టి సారించింది అని తెలిపారు. ఇక డెంటల్ హెల్త్తో పాటు ఉమన్ హెల్త్, న్యుట్రిషన్ గురించి పిల్లలకు వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా పలువురికి మేమొంటోలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికి పైగా చిన్నారులు పాల్గొన్నారు. (చదవండి: నాగర్ కర్నూల్ జిల్లాలో ఆటా సేవా కార్యక్రమాలు) -
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్యాబ్ లు సిద్ధం
-
అమెరికా పర్యటన ముగించుకొని ఇంటికి చేరుకున్న ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
-
ప్రపంచ బ్యాంక్ మీటింగ్ లో ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
-
పాఠశాల విద్యార్థుల కథలు చరిత్రకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా ఒకేరోజు.. ఒకే సమయానికి 5 లక్షల మంది పాఠశాల విద్యార్థులు ‘మన ఊరు మన చెట్టు’అనే అంశంపై కథలు రాసి నూతన చరిత్రకు శ్రీకారం చుట్టారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. మంగళవారం బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సబిత ‘మన ఊరు మన చెట్టు’పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ తరహా ప్రయత్నం దేశ చరిత్రలోనే తొలిసారి కావడం గొప్ప విషయమని, రాష్ట్ర విద్యార్థులు కలం పట్టి తమ ఊరి ప్రకృతిని అద్భుత కథలుగా మలచి దేశానికే మోడల్గా నిలిచారని కొనియాడారు. 33 జిల్లాలకు చెందిన విద్యార్థులు రాసిన కథలను 33 పుస్తకాలుగా తెలంగాణ సాహిత్య అకాడమీ ముద్రించి విద్యార్థులకు అందించడం అభినందించదగిన విషయమన్నారు. బాల సాహిత్య విస్తృతికి కృషి చేయడమే కాకుండా రాష్ట్రంలో పుస్తక ప్రదర్శనలతో జ్ఞాన తెలంగాణ కోసం కృషి చేస్తున్న సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ను మంత్రి సబిత శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి నామోజు, తెలంగాణ విద్యా మౌలికవసతుల సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి, ప్రొ. నారా కిశోర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆరీ్టయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డి. శ్రీపాల్రెడ్డి, బి. కమలాకర్రావు పాల్గొన్నారు. దసరా నుంచి స్కూల్ విద్యార్థులకు అల్పాహారం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దసరా పండుగ నుంచి ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’అమలు చేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యారి్థనీ విద్యార్థులకు దసరా పండుగ రోజు నుంచి ఉచిత అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పథకం అమలు తీరుతెన్నులపై ఆమె మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. పథకానికి సంబంధించిన మెనూను త్వరగా నిర్ణయించాలని, విధివిధానాలు రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. -
పాల్ ల్యాబ్స్ తో ఆధునిక విద్యాబోధన
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక విద్యాబోధన అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పాల్ ల్యాబ్స్కు శ్రీకారం చుట్టినట్లు పాల్ ల్యాబ్స్ రాష్ట్ర నోడల్ అధికారి విజయభాస్కర్ పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ (పాల్) కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు గుంటూరులోని ఏసీ కళాశాల వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఓరియెంటేషన్ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా నోడల్ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పాల్ ల్యాబ్స్ మంజూరు చేసిన 60 పాఠశాలల పరిధిలోని ప్రధానోపాధ్యాయులతో పాటు గణిత, సైన్స్ ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల మేధస్సుకు మరింత పదును పెట్టాలని చెప్పారు. రాష్ట్ర సమన్వయకర్త కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ పాల్ కార్యక్రమ ఉద్దేశం, ప్రధానోపాధ్యాయుల బాధ్యతలను వివరించారు. -
ఐక్యరాజ్య సమితిలో మెరిసిన ఆంధ్రప్రదేశ్
న్యూయార్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు (సెప్టెంబర్ 15 - 28) పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ విద్యార్థుల బృందాన్ని అమెరికా అధికారులు వరల్డ్ బ్యాంక్, US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ DCలోని వైట్ హౌస్ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పటి వరకు తమ గ్రామాలకు పరిమితమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ చిన్నారులు న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే చారిత్రాత్మక యాక్షన్ ప్యాక్డ్ SDG (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్) సమ్మిట్లో భాగమయ్యే సువర్ణావకాశాన్ని పొందడం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడమే కాకుండా, ఈ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న విద్యా సంస్కరణలను కూడా ఈ సధస్సులో ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ద్విభాషా పాఠ్యపుస్తకాలు, టాబ్లెట్లు, డిజిటల్ క్లాస్రూమ్లు, ఆంగ్ల విద్య, పాఠ్యాంశ సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా విద్యా రంగాన్ని ఎలా మార్చేసిందో పిల్లలు వివరిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టులో అత్యంత అద్భుతమైన భాగం ఏమిటంటే, ఈ పిల్లలు చాలా నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఈ పిల్లల తల్లిదండ్రులు కొందరు దినసరి కూలీలు కాగా మరికొందరు ఆటో డ్రైవర్లుగా, మెకానిక్లుగా, సెక్యూరిటీ గార్డులుగా, లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. "పేదరికం ఎవ్వరికీ నాణ్యమైన విద్యను దూరం చేయకూడదని విశ్వసించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దూరదృష్టి ఉన్న వ్యక్తి వల్లే ఈ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ రోజు అమెరికాలో జరుగుతున్న అత్యున్నత సధస్సులో పాల్గొంటున్నారు. చదవండి: మానవాభివృద్ధినీ మనం అంగీకరించలేమా? ఈ అంతర్జాతీయ పర్యటన ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్లోని ప్రతిభావంతులైన పిల్లలకు వారి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, చర్చించడానికి, వ్యక్తీకరించడానికి, కొత్త ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవడానికి ప్రపంచ వేదికను అందించడమే. ఈ పర్యటన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ సమావేశాల్లో ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా & నమ్మకంతో మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. మంగా వెంకన్న, సాక్షి ఇదీ చదవండి: ప్రపంచ చోదక శక్తి యువతే -
నిరుపేద విద్యార్థులను అమెరికా పంపిన సీఎం వైఎస్ జగన్
-
దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఘనత
-
UNO సదస్సుకు ఎంపికైన ఏపీ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు
-
వరదలపై మురికి మనసులు..బురద పనులు
-
తాత-మనవడు: సీఎం కేసీఆర్ను నిలదీద్దాం, రా.. హిమాన్షు!
నిజామాబాద్ అర్బన్: సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు హైదరాబాద్లోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడంపై తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) వినూత్న రీతిలో స్పందించింది. ఒకే ఫ్లెక్సీలో హిమాన్షును ఒకవైపు అభినందిస్తూ.. మరోవైపు సమస్యలపై సీఎంను నిలదీద్దాం రావాలంట స్వాగతం పలికింది. ‘ఒక్క స్కూల్ కాదు, తెలంగాణలోని అన్ని పాఠశాలలను మారుద్దాం.. టీజీవీపీలోకి స్వాగతం.. కలిసి ఉద్యమిద్దాం.. మీ తాతను నిలదీద్దాం’అని ఫ్లెక్సీలో పేర్కొంది. నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గురువారం టీజీవీపీ నిరసన తెలిపింది. టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పాఠశాలల్లో బెంచీ లు సరిగ్గా లేవని, వర్షాలకు భవనాలపై పెచ్చులు ఊడిపోతున్నాయని, కరెంట్ షాక్, పాము కాటుతో విద్యార్థులు మరణిస్తున్న దుస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హిమాన్షు కార్యక్రమంతో కళ్లు తెరవాలని కోరారు. కార్యక్రమంలో టీజీవీపీ నగర అధ్యక్షుడు అఖిల్, దేవేందర్, నేతలు ప్రశాంత్, సన్నీ, రాహుల్, మాధవ్, ధీరజ్, ఫణీందర్, రాకేష్, రాజేందర్ పాల్గొన్నారు. ఈ అంశంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. ‘సీఎం కేసీఆర్ మనువడు నిజాయితీగా మాట్లాడిండు. శిథిలావస్థకు చేరిన విద్యావస్థపై మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నా. పాఠశాల వ్యవస్థను తెలుసుకోవడానికి హిమాన్సును బీఎస్పీ వాలంటీర్గా చేరమని కోరుతున్నా. తాత. తండ్రి దాచిన ప్రపంచాన్ని నేను చూపిస్తా... హిమాన్షు లాగా చాలమందికి సేవ చేయాలని ఉంటుంది. కాని హిమాన్షుకు వచ్చినంత సీఎస్ అర్ పండ్స్ రావడం లేదు. దాతలు సహకరించడం లేదు.. తాత, తండ్రి చేస్తున్నా స్వార్థ రాజకీయాలు బాబు త్వరలోనే తెలుసుకుంటాడని భావిస్తున్నాను’ అని అన్నారు. చదవండి: షిర్డీ రైలులో చోరి.. లేడీ దొంగలను వదిలేసిన పోలీసులు.. అసలేం జరిగింది! -
‘కేసీఆర్ మనువడిని కదా.. ఏదీ నార్మల్గా చేయను’
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ కొడుకు కల్వకుంట్ల హిమాన్షు అంటే తెలియని వారు ఉండకపోవచ్చు. ఇక, నేడు(బుధవారం) హిమాన్షు పుట్టినరోజు. కాగా, తన బర్త్ డే రోజున తాను దత్తత తీసుకున్న గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. అధునాతన హంగులతో తీర్చిదిద్దిన ఈ పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హిమాన్షు తన తొలి ప్రసంగంలోనే అదరగొట్టాడు. అందరితో శభాష్ అనిపించుకున్నాడు. అయితే, పాఠశాల ప్రారంభ వేడుకలో హిమాన్షు మాట్లాడుతూ.. నాకు పబ్లిక్లో మాట్లాడటం ఇదే మొదటిసారి. కొంచెం నర్వస్గా ఉన్నప్పటికీ.. నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు మాట్లాడుతున్నట్లుంది. ఈ రెండేండ్ల కాలంలో 20 నుంచి 30 సార్లు స్కూల్ను విజిట్ చేశాను. రాత్రి సమయాల్లో వచ్చి కూడా పనులను పర్యవేక్షించాను. 2022లో క్లాస్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ స్కూల్ను మా క్లాస్ కో ఆర్డినేటర్ సూచనతో విజట్ చేశాను. అందరిలా కాకుండా.. ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయాలనుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ మనువడ్ని కదా.. ఏదైనా నార్మల్గా చేసే అలవాటు లేదు. ఫస్ట్ టైమ్ ఈ స్కూల్కు వచ్చినప్పుడు పాఠశాలలో 10వేల మొక్కలు నాటాం. అయినప్పటికీ నాకు ఇంకా ఏదో చేయాలి అనిపించింది. చెట్లు పెట్టే కార్యక్రమం ఎవరైనా చేస్తారు.. మనం కొత్తగా చేయాలని చెప్పాను. స్కూల్కే ఒక పేరు తేవాలనుకున్నాం. క్లాస్ రికార్డులో బెంచ్ మార్క్ సెట్ చేయాలని నిర్ణయించుకున్నాం. స్కూల్ కండీషన్ చూసిన తర్వాత ఆ బాధను మాటల్లో చెప్పుకోలేకపోయాం. కళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. ఆడపిల్లలకు సరైన బాత్రూమ్స్ లేకుండే. రాళ్ల మధ్యలో పిల్లలు ఆడుకుంటున్నారు. హెడ్ మాస్టర్ రూమ్లోనే క్లాస్ రూం, స్టోర్ రూమ్ను చూసి షాకయ్యాను. దీంతో, రూ.40 లక్షలు ఫండ్ వసూలు చేశాం. సీఎస్ఆర్ ఫండ్ కూడా కంట్రిబ్యూట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్పై ప్రశంసలు.. పేదరికాన్ని అరికట్టే ఉపాయం చదువుకున్న సమాజానికి ఉంటుందని మా తాత ఎప్పుడూ చెప్పేవారు. నా చదువులో గ్రేడ్ తగ్గినా.. వంద మందికి మంచి చేసే అవకాశం ఉంటే చేయాలని నాన్న కూడా చెప్పారు. మా తాత ఆశీస్సులు, మా నాన్న ప్రేరణతో ఈ స్కూల్లో చాలా కార్యక్రమాలు చేశాం. ఈ స్కూల్లో చదివే పిల్లలందరూ పేదవారు. కూలీ పనులు చేసుకునే కుటుంబాలకు చెందినవారే. మీరంతా చాలా ఎదగాలని కోరుకుంటున్నాను. మా విజన్ను కంటిన్యూ చేయండి. భవిష్యత్లో కూడా తప్పకుండా అండగా ఉంటాం అని హిమాన్షు స్పష్టం చేశారు. ఈ క్రమంలో మంత్రి సబితకు, ఎమ్మెల్యే గాంధీకి హిమాన్షు ధన్యవాదాలు తెలిపాడు. Happy birthday @TheRealHimanshu ❣️❣️❣️ pic.twitter.com/0gu7iH9L8D — Kalvakuntla Himanshu Rao (@Himanshurao_fp) July 12, 2023 ఇదిలా ఉండగా.. తన పుట్టినరోజు సందర్భంగా హిమాన్షు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద తూప్రా గ్రామంలోని వృద్ధాశ్రమంలో హిమాన్షు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హిమాన్షు వృద్ధులకు పండ్లు, బట్టలు పంపిణీ చేశాడు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: కేటీఆర్ కొడుకు హిమాన్షు పెద్ద మనస్సు.. ప్రశంసల వర్షం -
ప్రభుత్వ స్కూళ్లలో వసతుల గురించి విద్యార్థిని మాటల్లో
-
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు ఆధునికం.. రక్షణ అధమం
యాలాల: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధుని క,మెరుగైన బోధన అందించాలనే లక్ష్యంతో ప్రభు త్వం అందజేసిన సామగ్రి రక్షణ.. గాలిలో దీపంలా మారింది. డిజిటల్ క్లాసుల నిర్వహణ కోసం ఒక్కో పాఠశాలకు రూ.లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను పంపిణీ చేసింది. కానీ వీటి భద్రతపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘మన బడి’లో అభివృద్ధి పనులు మన ఊరు– మన బడి కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఆరు ఉన్నత పాఠశాలలతో పాటు పలు ప్రాథమిక పాఠశాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో పగిడియాల, కోకట్, యాలాల, జుంటుపల్లి, అగ్గనూరు, బెన్నూరు పాఠశాలల్లో హైస్కూల్ విద్యార్థులకు డిజిటల్ క్లాసుల నిర్వాహణకు భారీగా అధునాతన పరికరాలను పంపిణీ చేశారు. వీటిలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ బోర్డు(ఐఎఫ్పీబీ)లు బహిరంగ మార్కెట్లో ఒక్కదానికి సుమారు రూ.3 లక్షల పైచిలుకు ధర ఉన్నాయి. ప్యానెల్ బోర్డుతో పాటు ఆధునిక వసతుల కలిగిన డ్యుయల్ డెస్క్ టేబుళ్లు, గ్రీన్ బోర్డు, ఎలక్ట్రానిక్ ప రికరాలను ఏర్పాటు చేశారు.ఇలా ఒక్కో పాఠశాల కు సుమారు రూ.10లక్షల విలువైన పరికరాలను అందించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి వీ టిని భద్రపరిచే విషయంలో ఆందోళన నెలకొంది. వాచ్మెన్లను కేటాయించాలి.. మండల పరిఽధిలోని చాలా స్కూళ్లను తక్కువ ఎత్తున్న ప్రహరీలు, విరిగిన గేట్లు వెక్కిరిస్తున్నాయి. భద్రత పరంగా సౌకర్యాలతో పాటు ఒక్క పాఠశాలకు నిరంతర నిఘాకు వాచ్మెన్ లేడు. మండలంలోని 10 హైస్కూళ్లతో పాటు 50 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. కాగా ఈ ఏడాది వేసవి సెలవులో నెల రోజుల పాటు మన ఊరు– మన బడి పథకంలో భాగంగా వాచ్మన్ల ఏర్పాటుకు నెల వేతనాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు. నిరంతరం దీన్ని కొనసాగిస్తే బాగుంటుందని టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కరీంనగర్ జిల్లా వేగురుపల్లి ప్రభుత్వ స్కూలు ముందు తల్లిదండ్రుల ధర్నా
-
మా నాన్న ఒక మెకానిక్.. ఈరోజు నాకు 10వ తరగతిలో 594 మార్కులు వచ్చాయి
-
ఈ ప్రభుత్వ పాఠశాల పిల్లల మార్కులను చూస్తే కార్పోరేట్ స్కూళ్లు సిగ్గు పడాల్సిందే
మదనపల్లె సిటీ: కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఇంటర్మీడియట్లో పేద, సామాన్య కుటుంబాల పిల్లలు సగర్వంగా తలెత్తుకునే రీతిలో మార్కులు సాధించారు. ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో చదివే పిల్లలు పాసైతే చాలు అనుకునేవారు. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించి, మౌలిక వసతులు కల్పించడంతో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి అందరి మన్ననలు పొందారు. కార్మికుడి ఇంట.. చదువుల తల్లి మదనపల్లె పట్టణం అవంతి టాకీసు వద్ద నివాసం ఉంటున్న ఖాదర్వలి మెకానిక్. షర్మిల గృహిణి. సామాన్య కుటుంబం. కూతురు మెహర్ చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తోంది. పదో తరగతి స్థానిక హోప్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివింది. పదిలో 590 మార్కులు సాధించింది. ఇంటర్మీడియట్ బాలికల జూనియర్ కాలేజీలో బైపిసి చేరింది. ఇంటర్లో 968 మార్కులు వచ్చాయి. రైతు బిడ్డ ..చదువులో దిట్ట రైతు కుటుంబంలో పుట్టి చదువులో రాణిస్తోంది.సత్యసాయి జిల్లా కొక్కంటిక్రాస్ నల్లంవారిపల్లెకు చెందిన లింగారెడ్డి పద్మావతిల కుమారై కవిత. లింగారెడ్డి రైతు, పద్మావతి గృహిణి. కవిత మదనపల్లె జీఆర్టీ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్లో పదో తరగతి పాసైంది. ఇంటర్ బాలికల జూనియర్ కాలేజీలో బైపీసీ చేరింది. ఇంటర్లో 965 మార్కులు సాధించింది. కాలేజీ హాస్టల్లో ఉంటూ విద్యలో రాణించింది. వాచ్మెన్ కూతురు..ఇంటర్లో టాపర్ తండ్రి వాచ్మెన్. తండ్రి పడుతున్న కష్టాలు చూసి చదువులో రాణించాలనుకుంది ప్రీతిలతాదాల్. మదనపల్లె ఎస్టేట్కు చెందిన దిగంబర్దాల్ ఓ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పని చేస్తున్నారు. ప్రీతి లతాదాల్ ప్రభుత్వ కళాశాలలో చదివి సీఈసీలో 948 మార్కులు సాధించించి అందరి మన్ననలు అందుకుంది. దినకూలి ఇంట సరస్వతి పుత్రుడు తంబళ్లపల్లె: ఓ దినసరి కూలీ ఇంట చదువుల తల్లి సరస్వతి కొలువుదీరింది. ఆ ఇంటిలోని ఓ విద్యార్థి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభచాటి పలువురి మన్ననలు పొందాడు. మండలంలోని కొటాలకు చెందిన అమరావతి కూలీ పనులతో కుంటుంబ పోషణ సాగిస్తోంది. రెండో కుమారుడు ఇ.అశోక్కుమార్ ప్రాథమిక విద్య కొటాల ప్రభుత్వ పాఠశాలలో, గోపిదిన్నె ఉన్నత పాఠశాలలో పదోవ తరగతి పూర్తి చేసి 540 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. అప్పటికే తల్లి పడుతున్న కష్టం చూసి అతనిలో బాగా చదవాలనే పట్టుదల పెరిగింది. తంబళ్లపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చేరాడు. ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 950 మార్కులు సాధించాడు. అతడి తండ్రి ఈశ్వరయ్య కోవిడ్ తో మృతి చెందాడు. ఐఏఎస్ కావాలన్నదే ధ్యేయం సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నదే ధ్యేయం. అందుకే ఇంటర్మీడియట్ సీఈసీ చేరాను. అధ్యాపకులు రెడ్డప్పరెడ్డి సూచనలు,సలహాలతో మంచి మార్కులు సాధించాను. –ప్రీతిలతాదాల్ ఎంబీబీఎస్ చేస్తా ఎంబీబీఎస్ చేయాలని ఉంది. ఇందు కోసం ఎంసెట్,నీట్ ఎంట్రన్స్లకు ప్రిపేర్ అవుతున్నా. అధ్యాపకులు ఇచ్చిన సలహాలు, సూచనలతో ప్రతి రోజు 9 గంటలు చదువుతున్నా. –కవిత రాజుపాళెం : మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల విద్యార్ధినులు ప్రభంజనం సృష్టించారు. జమ్మలమడుగు మండలంలో కన్నెలూరు చెందిన సుబన్న, మేరిల కుమార్తె ప్రియాంక ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ గ్రూపు ఫలితాల్లో 1000 మార్కులకు 976 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. 10వ తరగతి జమ్మలమడుగు గూడెంచెరువులోని కస్తూరిబా పాఠశాలలో చదివి 595 మార్కులు సాధించింది. బాలిక తండ్రి బేల్దారిగా పని చేస్తున్నాడు. భవిష్యత్తులో డాక్టర్ అయి పేదలకు సేవచేస్తానని ప్రియాంక చెప్పింది. ప్రియాంక తండ్రి సుబ్బన్న బేల్దారిగా పనిచేస్తున్నాడు, తల్లి మేరి కూలి పని చేసుకుని జీవిస్తున్నారు. భవిష్యత్తులో డాక్టర్నవుతా నంద్యాల జిల్లా సంజాముల మండలంలోని నొస్సం గ్రామానికి చెందిన బి.నాగేశ్వరరావు కుమార్తె బి.ముని జాహ్నవి ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీగ్రూపులో ఫలితాల్లో 1000 మార్కులకు 976 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. రాజుపాళెం మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల పదదోతరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు చదివింది. బాలిక తండ్రి జూనియర్ లైన్మెన్గా, తల్లి అంగన్వాడీ టీచర్గా పని చేస్తున్నారు. భవిష్యత్తులో డాక్టర్ కావాలని ఉద్ధేశంతో ప్రస్తుతం నీట్కు కోచింగ్ తీసుకుంటున్నట్లు మునిజాహ్నవి తెలిపింది. వ్యవసాయ కూలీ బిడ్డ.. చదువులో దిట్ట రాజుపాళెం మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల విద్యార్థి పామిడి లక్ష్మిదేవి సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని నగళ్లపాడుకు చెందిన వ్యవసాయ కూలి పామిడి శ్రీనివాసులు కుమార్తె లక్ష్మిదేవి సీనియర్ ఇంటర్ బైపీసీ గ్రూపులో 1000 మార్కులకు 966 మార్కులు సాధించింది.. తండ్రి వ్యవసాయ కూలీ కాగా, తల్లి స్వాతి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో నీట్ కోచింగ్ తీసుకుంటున్నానని, భవిష్యత్తులో డాక్టర్నవుతానని తెలిపింది. బి.ఫార్మసీ చేయాలని ఉంది ఎంసెట్, నీట్ ఎంట్రన్స్ రాస్తా. బి.ఫార్మసీ చేయాలని ఉంది.అధ్యాపకులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలతో మంచి మార్కులు సాధించా. –మెహర్, మదనపల్లె ఐఏఎస్ చదవాలన్నదే ఆశయం ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి ఐఏఎస్ కావాలన్నదే తన ఆశయమని అశోక్కుమార్ తెలిపాడు. నేటి ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు పేద పిల్లలకు ఇస్తున్న భరోసా తనకు ఆనందం కలిగిస్తోందన్నారు. -
ఎవరు ముందు వస్తే వారే గోడలకు నీల్లు పట్టాలి
-
'ఐ లవ్ మనీష్ సిసోడియా'! దుమారం రేపుతున్న బ్యానర్!
ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాల గేటు వద్ద శనివారం ఏర్పాటు చేసిన ఐ లవ్ మనీష్ సీసోడియా అనే బ్యానర్ తీవ్ర కలకలం రేపింది. దీన్ని ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) కోఆర్డినేటర్ గజాలా, పాఠశాల ప్రిన్స్పాల్తో కలసి ఏర్పాటు చేశారు. దీంతో స్థానికి నివాసి దివాకర్ పాండే అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు ఫిర్యాదులో పాండే..మార్చి 3 ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలు శాస్త్రి పార్క్లోని ప్రభుత్వ పాఠశాల గేటుకి ఈ బ్యానర్ని కట్టినట్లు తెలిపారు. ఆ బ్యానర్పై ఐ లవ్ యూ సిసోడియా అని రాసి ఉందని, వారు స్కూల్ నుంచి ఒక డెస్క్ తీసుకువచ్చి దానిపై ఎక్కి మరీ ఈ బ్యానర్ని పెట్టారని చెప్పారు. దీనిపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయడమే గాక విద్యా దేవాలయాలను రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ చివాట్లు పెట్టినట్లు తెలిపారు. దీనికి అనుమతి తీసుకున్నారా అని కూడా ప్రశ్నించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అబ్దుల్ రెహమాన్ తాలుకా అని చెప్పారు. దీంతో ఒక వ్యక్తి ఆ ఎమ్మెల్యేని సంప్రదిస్తే..ఔను! అనే సమాధానం ఇచ్చారు. కానీ మాకు తెలుసు ఆయన అబద్ధం చెబుతున్నారని, ఎందుకంటే కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పాఠశాల ఉపయోగించుకునేందుకు అనుమతి ఉండదు. అని అన్నారు. ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో వారు ఆ బ్యానర్ని తొలగించినట్లు పాండే తెలిపారు. పిల్లలు ఇది రాశారని చెప్పేందుకు ఇలా చేశారని, వీటిని మన సంస్కృతి అనుమతించదని చెప్పారు. పిల్లలు బ్రెయిన్ వాష్ చేసేందుకు ఇలాంటి పన్నాగాలకు పాల్పడుతున్నారన్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఐతే ఆయన ఈ విషయం సీరియస్ అవుతుందని ఆ పాఠశాల ప్రిన్స్పాల్ భావించలేదని కూడా చెప్పారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడమే గాక, నిందితులను శిక్షిస్తామని హామీ కూడా ఇచ్చారని పాండే చెప్పారు. కాగా, ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిసోడియాను గత ఆదివారం సీబీఐ అరెస్టు చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో సిసోడియా శుక్రవారం రోస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దేశ రాజధాని ట్రయల్ కోర్టు ముందు సిసోడియా తరుఫున దాఖలు చేసిన తాజా పిటిషన్లో ఈ కేసులో ఇప్పటికే అన్ని రికవరీ జరిగాయి కాబట్టి అతన్ని కస్టడీలో ఉంచడం వల్ల ఎటువంటి ఫలవంతమైన ప్రయోజం ఉండదని పేర్కొంది. అలాగే ఢిల్లీ డిప్యూటీ సీఎం విచారణకు సహకరిస్తున్నారని సిబీఐ కూడా తెలిపింది. ఐతే ఈ కేసులో అరెస్టయిన ఇతర నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరవ్వడం గమనార్హం. (చదవండి: తాగిన మైకంలో మూత్రం పోసిన స్టూడెంట్.. ఆపై క్షమాపణలు! అయినా అరెస్ట్) -
ఏపీలోని విద్యావిధానాలను మెచ్చుకున్నఐక్యరాజ్యసమితి మెంబర్
-
మాస్టారు అవతారం ఎత్తిన కలెక్టర్!
వేలూరు(చెన్నై): వేలూరు కలెక్టర్ కుమరవేల్ పాండియన్ మాస్టారు అవతారం ఎత్తారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. సత్వచ్చారిలోని ప్రభుత్వ పాఠశాలను బుధవారం ఉదయం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అవసరమైన కనీస వసతులపై ఆరా తీశారు. విద్యార్థుల మరుగుదొడ్లు, వంట గదిలో దుర్వాసన రావడంతో టీచర్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్రతి రోజూ పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని తెలిపారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు. పాఠశాలలో విద్యార్థులకు తయారు చేసిన వంటను రుచి చూసి విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం వడ్డించాలని ఆదేశించారు. పాఠశాలకు బెంచ్లు కావాలని విద్యార్థులు కోరగా వెంటనే అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. చదవండి Pawan Khera: విమానం నుంచి దించేసి మరీ అరెస్ట్! -
ఒక స్కూల్.. ఒక స్టూడెంట్... ఒక టీచర్
ఒక గ్రామం మొత్తానికే గాక అక్కడ ఉన్న పాఠశాల్లో కూడా ఒక ఒక్కే విద్యార్థి మాత్రమే ఉన్నాడు. అతని కోసమే ఒక ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నాడు. ఇంకా విచిత్రమేమిటంటే ఉన్నది ఒకే ఒక్క విద్యార్థి అయినా స్కూల్లో రోజువారిగా జరిగే జాతీయ గీతంతో సహా అన్ని జరుగుతాయి. ఈ వింత ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా నుంచి 22 కి.మీ దూరంలో ఉన్న గణేష్పూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషిత్ ప్రాథమిక పాఠశాల అంతటకీ ఒకే ఒక్క విద్యార్థి ఉన్నాడు. ఆ గ్రామంలో కేవలం 150 మంది జనాభా. దీంతో ఆ బాలుడు ఒక్కడే విద్యార్థిగా ఉన్నాడు. ఈ మేరకు ఈ పాఠశాల ఉపాధ్యాయుడు కిషోర్ మాన్కర్ మాట్లాడుతూ...ఈ పాఠశాల్లో తానొక్కడినే ఉపాధ్యాయుడునని చెప్పారు. తాను రెండేళ్లుగా ఆ బాలుడికి పాఠాలు చెప్పేందుకు ఈ గ్రామానికి వస్తున్నట్లు తెలిపారు. ఉన్నది ఒక్క విద్యార్థి అయినా ఉదయం 10.30 గంటలు నుంచి జాతీయ గీతం ఆలపించడంతో సహా అన్ని నియమ నిబంధనాలు పాటిస్తానని చెప్పారు. ఆ విద్యార్థికి అన్ని సబ్జెక్టులు బోధించడమే గాక మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: మహా రాజకీయాల్లో ఊహించని పరిణామం.. అంబేద్కర్ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ కలిసొచ్చేనా?) -
బడిలో ‘కంటి వెలుగు’.. పక్కింట్లో పాఠాలు..
కురవి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు–2 కార్యక్రమా న్ని నిర్వహించడంతో విద్యార్థులకు పక్కింట్లో తరగతులు నిర్వహించారు. పైగా ఈ కార్యక్రమాన్ని జిల్లాకు చెందిన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించడం గమనార్హం. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(జీ) శివారు తాట్య తండాలో గురువారం జరిగింది. తాట్య తండాలోని ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు–2 కార్యక్రమానికి ఆరోగ్య, వైద్య శాఖ సిబ్బంది ఏర్పాట్లు చేయగా, మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. పాఠశాలలో కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేయడంతో ఆ పక్కనే భూక్య భద్రు అనే వ్యక్తి ఇంట్లో ఉపాధ్యాయురాలు పద్మ విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని సైతం అదే ఇంటి ఆవరణలో వడ్డించారు. దీనిపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. కంటివెలుగు కార్యక్రమాన్ని వేరేచోట కాకుండా బడిలో నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును తప్పుపట్టారు. -
కలుషిత ఆహారంతో 29 మంది చిన్నారులకు అస్వస్థత
సిరిసిల్లటౌన్: కలుషిత ఆహారంతో 29 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వీరిలో ఏడుగురు విద్యార్థులు వాంతులు, డీహైడ్రేషన్ బారిన పడ్డారు. బడిలో కొత్తగా నిర్మిస్తున్న సంపులో నింపిన నీటితో మధ్యాహ్న భోజనం వండి పిల్లలకు పెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసిన విద్యార్థుల్లో 2 గంటలకు ఫుడ్పాయిజన్ లక్షణాలు కనిపించాయి. అస్వస్థతకు గురైన విద్యార్థులు ఒకటో తరగతిలో ఐరా, వర్షిణి, రిషిత, రెండో తరగతిలో వర్షిణి, శ్రీజ, లక్కీ, వేదిక, వినతి, వరుణ్, శ్రీలక్ష్మి, మూడో తరగతిలో చెఫాన్, వర్షిణి, రిషి, నాలుగో తరగతిలో సంజన, ధీరజ్, రిషివర్ధన్, నిశాంత్, శివ, చరణ్, గౌతమ్, అభిలాష్, ఐదో తరగతిలో రాంచరణ్, శ్రీజ, రిష్రిత్, లాస్య, శామన్లిల్లి, రిషివర్ధన్, దివ్య, రిషిత్, ఇందు ఉన్నారు. 29 మంది చిన్నారులను 108 వాహనంలో సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా డీఎంహెచ్వో సుమన్ మోహన్రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీధర్రావు ఆధ్వర్యంలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం 25 మందిని డిశ్చార్జి చేయగా.. తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురికి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. సంఘటనపై జిల్లా విద్యాధికారి రాధాకిషన్ విచారణకు ఆదేశాలిచ్చారు. మంత్రి కేటీఆర్ పిల్లల పరిస్థితిని తెలుసుకుని తదుపరి చర్యలకు డీఈవోకు ఆదేశాలు జారీచేశారు. -
పాఠం స్కాన్ చేసేయొచ్చు.. మళ్లీ మళ్లీ వినొచ్చు
సాక్షి, ప్రత్తిపాడు(గుంటూరు జిల్లా): ఒక్క స్కాన్తో పాఠం మళ్లీమళ్లీ వినొచ్చు. దృశ్యరూపంగానూ వీక్షించొచ్చు. అవగతమయ్యే వరకు వినొచ్చు. చూడొచ్చు. అవును ప్రభుత్వం పాఠ్యాంశాల బోధనలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. పాఠ్యపుస్తకాలకు క్యూఆర్ కోడ్ హంగులు అద్దింది. దీనివల్ల పిల్లలు పాఠ్యాంశాలను ఇళ్ల వద్ద కూడా అర్థమయ్యేవరకూ వినొచ్చు. చూడొచ్చు. గతంలో ఎన్నో ఇబ్బందులు గతంలో విద్యార్థులు తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన పాఠం అర్థం కాకపోతే చాలా గందరగోళానికి గురయ్యేవారు. ఏం చేయాలో పాలుపోక లోలోన కుమిలిపోయేవారు. అర్థం కాలేదని అడిగితే టీచర్ ఏమంటారోనని భయపడేవారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం క్యూఆర్ కోడ్తో పాఠ్యపుస్తకాలను రూపొందించింది. ఒక్కో పాఠానికి ఒక్కో కోడ్.. గుంటూరు జిల్లాలో 1,113 పాఠశాలలు ఉండగా 1,35,871 మంది విద్యార్థులు, పల్నాడు జిల్లాలో 1,631 పాఠశాలలు ఉండగా 2,12,025 మంది విద్యార్థులు, బాపట్ల జిల్లాలో 807 పాఠశాలలు ఉండగా 59,099 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికోసం సుమారు 25.56 లక్షలకుపైగా పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం దశలవారీగా అందించింది. గతంలో పాఠ్యపుస్తకం మొత్తానికి కలిపి ఒక్కటే క్యూ ఆర్ కోడ్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి పాఠం వద్ద క్యూ ఆర్ కోడ్ను ముద్రించింది. ఈ కోడ్ను స్మార్ట్ఫోన్తో స్కాన్ చేస్తే ఎంచక్కా డిజిటల్ పాఠాలను వినొచ్చు. చూడొచ్చు. దీక్ష యాప్ లేకున్నా.. తొలుత గణితం, భౌతిక, సాంఘిక శాస్త్రాల పుస్తకాలపైనే క్యూఆర్ కోడ్లు ముద్రించారు. అప్పట్లో దీక్ష యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు అనే ఆప్షన్ ఇచ్చి ఆ తర్వాత క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాఠం వచ్చేది. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాలపైనా కోడ్ను ముద్రించారు. ఇప్పుడు దీక్ష యాప్ లేకున్నా నేరుగా గూగుల్ లెన్స్ ద్వారా కోడ్ స్కాన్ చేసి పాఠ్యాంశాలు వినవచ్చు. ఎంతో ఉపయుక్తం క్యూఆర్ కోడ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. పునశ్చరణ సమయంలో బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. దృశ్యరూపంలో పాఠాలు వినడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి. – సీహెచ్ వెంకటరెడ్డి, ఉపాధ్యాయుడు, బీవీఆర్ జెడ్పీ హైస్కూల్, ప్రత్తిపాడు కొత్తగా.. ఆసక్తిగా ఉంది క్లాస్ రూంలో టీచర్ చెప్పిన పాఠం అర్థం కాని సమయంలో ఈ క్యూర్ కోడ్ను స్కాన్ చేసి మళ్లీ పాఠం వినవచ్చు. ఇది మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. వీడియో రూపంలో పాఠాలు వినడం కొత్తగా, ఆసక్తిగా ఉంది. – గురుగూరి పూజ, 9వ తరగతి విద్యార్థిని, ప్రత్తిపాడు హైస్కూల్ -
బాలికల పాఠశాలలో దారుణం.. రెండు జడలు వేసుకోలేదని 200 గుంజీలు
జడ్చర్ల టౌన్: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం కావేరమ్మపేటలో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థినులు రెండు జడలు వేసుకోలేదని ఆగ్రహించిన పీఈటీ శ్వేత బుధవారం వారితో 120 నుంచి 200 వరకు గుంజీలు (ఉట్బైట్) తీయించింది. దీంతో పిల్లలు నడవలేని స్థితికి చేరుకున్నారు. నొప్పులు తాళలేక రోదిస్తున్నారు. అయితే విషయం బయటకు పొక్కకుండా ఉపాధ్యాయులు తీవ్ర ప్రయత్నం చేశారు. 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికాగా, కొందరికి జ్వరం వచ్చింది. కనీసం వైద్యాధికారులకు సమాచారం ఇవ్వకుండా తమకు తోచినవిధంగా ఉపశమన చర్యలు తీసుకుని సిక్రూంలో తాళం వేసి బంధించారు. గురువారం మధ్యాహ్నం 20 మందికి జ్వరం తీవ్రం కావడంతో అర్బన్హెల్త్ సెంటర్కు తీసుకువెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అయితే నొప్పులు భరించలేక కొందరు పిల్లలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వారు పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. బుధవారం జరిగిన ఈ ఘటన తల్లిదండ్రుల ధర్నాతో గురువారం బయటకు వచ్చింది. అక్కడికి వెళ్లిన విలేకరులను సైతం ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. ఇంత జరిగినా.. సెలవులో ఉన్న ప్రిన్సిపాల్ కల్పనకు గురువారం సాయంత్రం వరకు సమాచారం అందించలేదు. విషయం బయటకు పొక్కగానే ఆమె పాఠశాలకు చేరుకుని చిన్న విషయమే.. అంటూ దాటవేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న గురుకులాల ఆర్ఎల్సీ జమీర్ అహ్మద్ పాఠశాలకు చేరుకున్నారు. ఆయన కూడా ఇది చిన్న విషయమేనని పేర్కొన్నారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న పీఈటీ శ్వేతను విధుల్లోంచి తొలగిస్తున్నట్లు జమీర్ అహ్మద్ తెలిపారు. -
అయ్యో టీచరమ్మ! స్కూల్కు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి..
సంస్థాన్నారాయణపురం/నాంపల్లి: బ్రెయిన్ డెడ్తో ఉపాధ్యాయురాలు మృతిచెందింది. నారాయణపురం మండలానికి చెందిన జక్కిడి విజయలక్ష్మి నాంపల్లి మోడల్ స్కూల్లో పీజీటీగా పని చేస్తూ భర్త నర్సింహారెడ్డితో కలిసి హైదరాబాద్లో ఉంటోంది. ఈనెల 21 పాఠశాలకు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను హయత్నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని చెప్పారు. మెరుగైన చికత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజలక్ష్మి కోమాలోకి వెళ్లింది. శుక్రవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. ఇంటర్లో మళ్లీ వంద శాతం సిలబస్ అవయవాలు జీవన్దాన్ ట్రస్టుకు.. విజయలక్ష్మి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో ఆస్పత్రి వర్గాల ద్వార జీవన్ దాన్ సంస్థకు రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని సంస్థాన్ నారాయణపురానికి తీసుకొచ్చారు. శనివారం దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి మృతికి ఉపాధ్యాయ సంఘం నాయకులు, ప్రజా నాట్య మండలి సభ్యులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఎంఈఓ గురువారావు, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు చిలువేరు నారాయణ, పీఆర్టీయూ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, టీఆర్ఎస్కేవీ నాయకుడు బిరుదోజు దామోదరచారి, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, ఉపాధ్యాయులు సంజీవరావు, విఠల్, కృష్ణారెడ్డి, భారతి, పలువురు నేతలు తదితరులు ఉన్నారు. బంగారు నాణేనికి బదులు బిల్లొచ్చింది! -
సర్కారు వారి సత్తా..
సర్కార్ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభ పది పరీక్షల్లో నిరూపితమైంది. విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన సంస్కరణల ఫలితాలకు కరోనా అడ్డుపడింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తొలి రెండేళ్లు పరీక్షలు లేకుండానే పోయాయి. ఇక ఆ రెండేళ్లు చదువులు సైతం ఆన్లైన్కే పరిమితమైంది. తాజాగా కరోనా పరిస్థితులను అధిగమించి.. నూతన సంస్కరణలతో నిర్వహించిన పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు లభించాయి. ఇది జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సమర్థతకు అద్దం పడుతోంది. కార్పొరేట్ ఫలితాలకు మించి సాధించారు. ప్రకాశం (పీసీపల్లి) : 588/600, 570/600, 569/600.. ఇది పదో తరగతి పరీక్షల్లో మార్కులు. ఈ ఫలితాలు సాధించింది సర్కార్ పాఠశాలల విద్యార్థులు. జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి çమండలం 97.67 శాతం ఉత్తీర్ణతతో ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గంలో 10 ప్రభుత్వ పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మంది విద్యార్థులు 500 మార్కులకుపైగా సాధించి సత్తా చాటారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించి పేద తల్లిదండ్రుల కళ్లలో సంతోషాన్ని నింపారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో 77.77 శాతం ఉత్తీర్ణతతో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ప్రథమ స్థానం దక్కింది. మొత్తం 826 హైస్కూళ్లు ఉండగా 41,341 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందులో 41,061 మంది పరీక్షలకు హాజరయ్యారు. 32,151 మంది ఉత్తీర్ణత సాధించారు. కనిగిరి నియోజకవర్గంలో 52 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 45 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 6 కేజీబీవీ పాఠశాలలు, 1 మోడల్ స్కూల్ ఉన్నాయి. ఇందులో హెచ్ఎంపాడులో 4 పాఠశాలలు, కనిగిరిలో 3 పాఠశాలలు, పీసీపల్లిలో 3 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఉత్తమ ఫలితాలు ఇలా.. ప్రత్యేక తరగతులు, ప్రత్యేక ప్రణాళికలు. పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించడంతోపాటు విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్యాబోధన అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక తరగతులు, పకడ్బందీ ప్రణాళికలతో ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పించింది. ప్రతి రోజూ సాయంత్రం స్టడీ అవర్స్. వారాంతంలో ఆ వారంలో పూర్తయిన సిలబస్పై పరీక్షలు. ఏ సబ్జెక్టులో విద్యార్థులు వెనుకబడ్డారో గుర్తించి దానిపై ప్రత్యేక దృష్టిసారించారు. అలాగే సకాలంలో సిలబస్ను పూర్తి చేశారు. పలు మార్లు రివిజన్ చేశారు. ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విద్యార్థులకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేశారు. దీంతో నూటికి నూరు శాతం ఫలితాలతోపాటు మంచి మార్కులొచ్చాయి. పథకాలతో అండగా.. ► అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, నాడు–నేడు, జగనన్న విద్యా కానుక వంటి పథకాలతో సీఎం జగన్ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ► పిల్లలను బడికి పంపుతున్న తల్లుల ఖాతాల్లో ఏటా జనవరిలో క్రమం తప్పకుండా అమ్మ ఒడి నగదు రూ.15 వేలు జమ చేస్తున్నారు. ► సరైన సౌకర్యాలు లేక పూర్తిగా శిథిలమైపోయిన పాఠశాలలను నాడు–నేడు పేరుతో మరమ్మతులు చేయించి అదనపు సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించారు. ► ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరు ముద్ద పేరుతో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ► ఒక్క తెలుగు మీడియంలోనే విద్యనభ్యసిస్తే భవిష్యత్తులో మంచి ఉన్నత చదువులు చదువుకునేందుకు అడ్డంకి ఏర్పడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా ఇంగ్లిషు మీడియం ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయులకు ముందుగా ఇంగ్లిషు మీడియంలో శిక్షణనిచ్చింది. ప్రత్యేక బస్సు.. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కనిగిరి ఆర్టీసీ డిపో అధికారులు సీఎస్పురం మండలంలో ఒక ప్రత్యేక బస్సును ఏర్పాటు చేశారు. సీఎస్పురం నుంచి ఏకునాపురానికి రెండు హైస్కూళ్ల విద్యార్థులను తీసుకువెళ్తుంది. చెర్లోపల్లి, అరివేముల, జంగంవారి పల్లి, చింతలపాలెం, ముండ్లపాడు, ఏకునాపురం తదితర గ్రామాల్లో చదువుతున్న 70 నుంచి 80 విద్యార్థులను స్కూలుకు సకాలంలో తీసుకువెళ్తుంది. ప్రత్యేక తరగతులు నిర్వహించాం కరోనాతో విద్యకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. పదో తరగతిలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని రాత్రి ప్రత్యేక తరగతులు ఉపాధ్యాయులతో నిర్వహించాం. విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా స్టడీ అవర్స్ నిర్వహించడం వల్లే ఇంతటి మెరుగైన ఫలితాలు సాధించాం. – సుజాత, కేజీబీవీ హెచ్ఎం, పీసీపల్లి నూరుశాతం ఫలితాలు సాధించాం పాఠశాలలో చదువుతున్న 64 మంది పదో తరగతి విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణులయ్యారు. అమ్మ ఒడి పథకంతో విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. 99 శాతం విద్యార్థుల బడికి హాజరవుతున్నారు. 35 మంది బాల బాలికలు 500 పైన మార్కులు సాధించారు. – జీవీ సురేష్బాబు, హెచ్ఎం, హెచ్ఎంపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల అమ్మ, నాన్న సంతోషంగా ఉన్నారు ఉపాధ్యాయుల బోధన, ఇచ్చిన సలహాలు సూచనలు బాగా ఉపయోగపడ్డాయి. ఇంగ్లిషు మీడియంలో కష్టపడి చదివి 588 మార్కులు సాధించాను. అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక పథకాలు బాగా ఆదుకున్నాయి. మంచి మార్కులు వచ్చినందుకు మా అమ్మ, నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. – గంటా నీతీష్రెడ్డి, హనుమంతునిపాడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతోనే ఈ విజయం .. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పించడం వల్ల మేము బాగా చదువుకునేందుకు వీలైంది. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి చదివించారు. వారి సహకారంతోనే 576 మార్కులు సాధించాను. – కే పద్మ, శ్రీరంగా పురం, మోడల్ స్కూల్ కనిగిరి బిడ్డల చదువుకు ఆటంకం లేకుండా చేశారు.. నాకు ఇద్దరు బిడ్డలు. వీరిని చదివించాలంటే మా ఆర్థిక స్థోమత సరిపోక పొలం పనులకు తీసుకెళ్లే దాన్ని. జగన్ సీఎం అయ్యాక మాకు రైతు భరోసా, నా బిడ్డలను చదువుకోవడానికి అమ్మ ఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద, విద్యాకానుక అందిస్తూ నా బిడ్డల చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా చేశారు. – అన్నెబోయిన పద్మ,ఏకునాంపురం, అశ్విని తల్లి బస్సు సౌకర్యం కల్పించారు మా గ్రామం నుంచి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేందుకు దాదాపు 15 కి.మీలు ఉండేది. గతంలో పాఠశాలకు వెళ్లేందుకు సరైన బస్సు సౌకర్యం ఉండేది కాదు. దీంతో వారంలో మూడు రోజులు గైర్హాజరయ్యేదాన్ని. ఇప్పుడు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంతో ప్రతి రోజు బడికి వెళ్లాను. పదో తరగతిలో 554 సాధించాను. – అన్నెబోయిన అశ్విని, ఏకునాంపురం, సీఎస్పురం మండలం ప్రైవేటు స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరా.. గతంలో నేను ప్రైవేటు స్కూల్లో చదువుకున్నాను. తరువాత ప్రభుత్వ పాఠశాలలో చేరాను. మా బడిలో వసతులు బాగున్నాయి. బాగా చదువు చెప్పారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టపడి చదివి 554 మార్కులు తెచ్చుకున్నాను. – మాధవిరెడ్డి, పీసీపల్లి ప్రభుత్వ పాఠశాల -
ఖమ్మంలో వినూత్న కార్యక్రమం, స్కూళ్లకే సర్టిఫికెట్లు.. మంత్రి పువ్వాడ ఏమన్నారంటే..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తోంది. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఎస్సీ విద్యార్థులు పడుతున్న కష్టాలు తీర్చేందుకు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తీసుకున్న చొరవ సత్ఫలితాలిస్తోంది. ఆయా పత్రాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా స్కూళ్లకే వాటిని పంపుతుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సర్టిఫికెట్లను అందించే కార్యక్రమాన్ని శరవేగంగా పూర్తి చేస్తుండటంతో ఎస్సీ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడం సులువవుతోంది. ప్రక్రియ ఇలా... పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థుల జాబితాలను హెచ్ఎంలు సిద్ధం చేశాక.. రెవెన్యూ అధికారులు పాఠశాలలకు వెళ్లి సర్టిఫికెట్లు అవసరమైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే అధికా రులే మీ–సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసి సర్టిఫికెట్లను సిద్ధం చేసి పాఠశాలలకు వెళ్లి నేరుగా విద్యార్థులకు అందజేస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల ఇక్కట్లు తీరడమే కాక సమయం కలిసొస్తోంది. పలు పాఠశాలల్లో సర్టిఫికెట్లు అందజేసిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. ఈ విధానాన్ని రాష్ట్రమంతటా అమలుచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పడం విశేషం. ఇప్పటికే 76 శాతం మందికి.. ఖమ్మం జిల్లాలో 8,446 మంది ఎస్సీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఇందులో 5,070 మంది ఈ–పాస్ వెబ్ పోర్టల్లో నమోద య్యారు. వారిలో ఇప్పటివరకు 6,434 మందికి కుల, 6,467 మందికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందాయి. మొత్తంగా 76 శాతం మంది విద్యార్థుల కు సర్టిఫికెట్లను పాఠశాలల్లోనే అందించగా.. జిల్లావ్యాప్తంగా మిగిలిన విద్యార్థులకు ఆధార్, చిరునామా సరిగ్గా లేకపోవడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోందని చెబుతున్నారు. విద్యార్థులకు ఉపయోగం ఇది ఎంతో మంచి ప్రక్రియ. దీనివల్ల విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింది. ఇప్పుడు వెంటనే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. – పి.శిరీష, హెచ్ఎం, రఘునాథపాలెం పాఠశాలలో సర్టిఫికెట్లు ఇచ్చారు.. మాకు అవసరమైన సర్టిఫికెట్లను బడిలోనే అందుకోవడం ఆనందంగా ఉంది. గతంలోనైతే ఈ సర్టిఫికెట్లు కావాలంటే బడికి వెళ్లలేకపోయే వాళ్లం. – మేక సాత్రిక, 9వ తరగతి విద్యార్థిని మంచి కార్యక్రమం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు కుల, ఆదాయ సర్టిఫికెట్లు అందిస్తున్నారు. ఈ విధానం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. – ఎస్.యాదయ్య, డీఈఓ, ఖమ్మం -
15 వేల స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం రాబోతోంది. వచ్చే విద్యా సంవత్సరంలో (జూన్) ఇంగ్లిష్ మాధ్యమంలో బోధన ప్రారంభించేందుకు విద్యాశాఖ ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందాలంటే ఇంగ్లిష్ మీడియం అవసరమని ఇటీవల సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం తెలుగు మీడియం కొనసాగుతున్న 15,370 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టనుంది. తెలుగుతో సమాంతరంగా ఇంగ్లిష్ మీడియం సెక్షన్లను ప్రారంభించి ఆసక్తి ఉన్న విద్యార్థులు చేరేలా చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే 10,702 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రస్తుతం రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 26,754 పాఠశాలలు ఉన్నాయి. అందులో కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, విద్యాశాఖ గురుకులాలు, ఇతర పాఠశాలలు ఉన్నాయి. అవి పోగా 26,072 తెలుగు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు ఉన్నాయి. అందులో ఇప్పటికే 10,702 స్కూళ్లలో తెలుగుతో పాటు ఇంగ్లిష్ మీడియం కొనసాగుతోంది. మరో 15,370 స్కూళ్లలో పూర్తి స్థాయిలో తెలుగు మీడియం మాత్రమే కొనసాగుతోంది. సీఎం ఆదేశాలతో ఇప్పుడు వాటిన్నింటిలోనూ ఇంగ్లిష్ మీడియంను సమాంతరంగా ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలో 10,16,334 మంది విద్యార్థులు చదువుతుండగా, తెలుగు మీడియంలో 15,44,208 మంది చదువుతున్నారు. ఈ నెల నుంచే ఇంగ్లిష్ భాషాభివృద్ధి కోర్సు ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఎస్జీటీల్లో ఇంగ్లిష్ బోధనా నైపుణ్యం పెంచేలా ఈ నెల నుంచే శిక్షణ ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్సు (ఈఎల్ఈసీ) పేరుతో శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి, అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండు దశల్లో నాలుగు వారాల పాటు ఈ శిక్షణ ఇవ్వబోతోంది. ఆన్లైన్లో నాలుగు వారాల పాటు ఇది కొనసాగనుంది. 43 వేల మందికి పైగా టీచర్లకు శిక్షణ రాష్ట్రంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 1,03,911 మంది టీచర్లు ఉన్నారు. వారిలో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు 60,602 మంది టీచర్లు బోధిస్తున్నారు. తెలుగు మీడియం స్కూళ్లలో మరో 43,309 మంది టీచర్లు బోధిస్తుండగా.. వీరికి ఇంగ్లిష్ మీడియంలో బోధనకు శిక్షణ ఇవ్వనున్నారు. -
కర్ణాటక సర్కారీ స్కూల్లో పిల్లల నమాజ్!
కోలార్ (కర్ణాటక): స్కూలు ఆవరణలో శుక్రవారం రోజు ముస్లిం విద్యార్థులు నమాజ్ చేసుకోవడానికి కర్ణాటక రాష్ట్రం ముల్బగల్ పట్టణంలోని బలెచంగప్ప ప్రభుత్వ పాఠశాల అనుమతివ్వడంపై పిల్లల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. శుక్రవారం రోజు మధ్యాహ్నం ముస్లిం విద్యార్థులు ఓ తరగతి గదిలో నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరలైంది. దీంతో స్కూలు నిర్ణయానికి వ్యతిరేకంగా పిల్లల తల్లిదండ్రులు, హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సీఎం బసవరాజ్ బొమ్మై, కోలార్ ఎంపీ మునిస్వామి, విద్యా శాఖ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశాయి. పిల్లలు నమాజ్ చేసుకోవడానికి ఎందుకు అనుమతిచ్చారని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి నుంచి తనకు శుక్రవారం ఫోన్ వచ్చిందని, తాను త్వరగా వెళ్లి చూడగా పిల్లలు నమాజ్ చేస్తూ కనిపించారని తెలిపారు. -
బడిలో చేరేందుకు బంపర్ ఆఫర్లు..
-
తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం, వారికి ఊరట
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినీ విద్యార్థులకు ఊరటనిచ్చారు. ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కోటా కల్పిస్తూ స్టాలిన్ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది. మరోవైపు ప్రతిపక్ష అన్నాడీఎంకే కూడా ఈ బిల్లును స్వాగతించడం విశేషం. చదవండి: వరుస పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్, 13 మంది మృతి ప్రభుత్వం యూనివర్సిటీల్లో వెటర్నరీ సైన్సెస్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్, లా, ఫిషరీస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో అన్ని కేటగిరీలలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ 7.5శాతం రిజర్వేషన్ ఇవ్వనుంది. ఈ మేరకు రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు ప్రైవేట్ పాఠశాల విద్యార్ధులతో పోటీ పడుతూ సామాజిక-ఆర్థిక అసమానతల కారణంగా వారు కోరుకున్న కోర్సులలో ప్రవేశం పొందలేకపోయారని వ్యాఖ్యానించారు. గ్రామాలకు చెందిన వారు, డబ్బుల్లేని వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతారని, వారికి మంచి అవకాశాలు ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా మన్నారు. చదవండి: తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!? కాగా ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలు అలాగే ప్రభుత్వ-ఎయిడెడ్ కళాశాలల్లో రిజర్వేషన్లపై జస్టిస్ (రిటైర్డ్)డీ మురుగేశన్ కమిటీ సిఫారసుల మేరకు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం గతంలో నిర్ణయించింది. -
చీపుర్లు పట్టిన టీచర్లు
సత్తుపల్లి టౌన్:పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో సత్తుపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. గురువారం ఉదయం వచ్చిన ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు అది చూసి మాకెందుకులే అనుకోలేదు.. చీపుర్లు పట్టి పాఠశాల ప్రాంగణాన్ని ఊడ్చి శుభ్రం చేశారు. దీనిపై పీఆర్టీయూ రాష్ట్ర నేత చిత్తలూరి ప్రసాద్ మాట్లాడుతూ.. చాలా పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు లేకపోవటంతో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. దీంతో ఉపాధ్యాయులే చీపుర్లు పట్టి శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తిందని చెప్పారు. -
విద్యార్థులకు కరోనా: పాఠశాల మూసివేత
చంఢీగఢ్: మహమ్మారి కరోనా వైరస్తో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇప్పుడిప్పుడే విద్యాలయాలు పునఃప్రారంభమవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు తెరచుకున్నాయి. కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు పాటిస్తున్నా విద్యార్థులకు కరోనా సోకుతోంది. తాజాగా పంజాబ్లో 14 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఆ పాఠశాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్లోని షహీద్ భగత్సింగ్ నగర్ జిల్లా నవన్షహర్ పరిధిలోని సలో గ్రామ ప్రభుత్వ పాఠశాలలో కరోనా కల్లోలం సృష్టించింది. మొత్తం 350 మంది విద్యార్థుల్లో 110 మంది విద్యార్థుల నమూనాలు పరీక్షించారు. వారిలో 14 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై ఆ పాఠశాలను మూసివేసింది. ఈ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామని జిల్లా విద్యాధికారి జగ్జీత్ సింగ్ తెలిపారు. అయితే పాఠశాలలో కరోనా ఎలా సోకిందో ఇంకా తెలియలేదు. దీనిపై అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ పాఠశాలలో కరోనా రావడంతో విద్యాలయాల్లో కరోనా జాగ్రత్తలు పక్కాగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్క్లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. -
తండ్రి ఇబ్బందులను అధిగమించే ఆలోచన
సాక్షి, నల్లగొండ : ఆ విద్యార్థిని తన తండ్రి పడుతున్న ఇబ్బంది తొలగించేందుకు హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్చైర్ ఆలోచన చేసింది. ఈ ఆలోచనను రాష్ట్రస్థాయికి పంపగా.. నచ్చడంతో దానికి సంబంధించి ప్రాజెక్టు తయారు చేసేందుకు ఇంక్విలాబ్ ఫౌండేషన్.. తమ ప్రతినిధులు అశోక్, షమీర్ను నల్లగొండకు పంపింది. వారి సూచనల మేరకు జిల్లా సైన్స్ అధికారి, గైడ్ టీచర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టును తయారు చేయిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్కు ఎంపికైంది. రాష్ట్రంనుంచి మొత్తం 25 ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో నల్లగొండ బాలికల పాఠశాల విద్యార్థిని తయారు చేసిన హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్చైర్ ప్రాజెక్టు ఒకటి. ఆ ప్రాజెక్టు ఖర్చు ఇంక్విలాబ్ ఫౌండేషనే భరించనుంది. ఈ ప్రాజెక్టును 19వ తేదీన వీడియో క్లిప్ ద్వారా ఆన్లైన్లో ప్రదర్శించాల్సి ఉంటుంది. జిల్లానుంచి 370 ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వం స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ పేరుతో విద్యార్థుల్లో కలిగే ఆలోచనల మేరకు ప్రాజెక్టుల తయారీకి ఏటా ప్రతిపాదనలు కోరుతోంది. యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయిలో 9వ తరగతి నుంచి విద్యార్థులు వారి ప్రాంతంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సంబంధించిన ఆలోచనను మాత్రమే స్వీకరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కొత్తగా వచ్చే ఆలోచనలు పంపించాలని కోరగా నల్లగొండ నుంచి 280 పాఠశాల నుంచి 370 ఆలోచనలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పంపించారు. తండ్రి పడుతున్న సమస్యతో వచ్చిన ఆలోచన.. నల్లగొండ ప్రభుత్వ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బషీరా తన తండ్రి పక్షవాతం కారణంగా కాలు చేయి పని చేయని పరిస్థితి. దానివల్ల తండ్రి ఇంట్లో ఏమీ తన సొంతంగా చేసుకోలేకపోయేవాడు. దీని పరిష్కారానికి ఆ బాలికకు ఓ ఆలోచన వచ్చింది. హైడ్రాలిక్ లిఫ్టింగ్ చైర్ వీల్ చైర్తో బటన్ నొక్కితే చైర్ ఎత్తులోకి లేవడం పైన ఉన్న వస్తువులను అందుకోవడం, వీల్చైర్తో ఇంట్లో సొంతంగా తిరగ గలగడం, తన పనులు తానే చేసుకోగలుగుతాడని ఆ బాలిక భావించి తన ఆలోచనను పాఠశాలలోని గైడ్ టీచర్ పూర్ణిమకు చెప్పింది. ఆమె వెంటనే ముగ్గురిని టీమ్గా ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టు ఎలా ఉంటుందో తయారు చేసి ఆ ఆలోచన వీడియో రూపంలో రాష్ట్రస్థాయికి పంపారు. అయితే రాష్ట్రంలో 7,093 ఐడియాలు వివిధ సమస్యలపై వచ్చాయి. రౌండ్ల వారీగా ఎంపిక చేయగా.. చివరకు 25 ప్రాజెక్టులను మూడో రౌండ్లో ఎంపిక చేశారు. ఈ 25లో నల్లగొండ విద్యార్థిని ప్రాజెక్టు ఉండడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19న హైదరాబాద్లో ఈ ప్రాజెక్టును ప్రదర్శిస్తారు. 25 ప్రాజెక్టుల్లో 10 ప్రాజెక్టులను గ్రాండ్ ఫినాలేకు ఎంపిక చేయనున్నారు. హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్చైర్ నమూనా రాష్ట్రస్థాయికి ఎంపిక సంతోషకరం నల్లగొండ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినికి వచ్చిన హైడ్రాలిక్ లిఫ్టింగ్ వీల్ చైర్ ఆలోచన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. రాష్ట్రస్థాయికి 7 వేల పైచిలకు ప్రాజెక్టులు పంపితే అందులో 25 ఎంపిక చేస్తే అందులో జిల్లా ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టు తయారు చేసిన విద్యార్థిని, సైన్స్ అధికారి, గైడ్ టీచర్కు అభినందనలు. – భిక్షపతి, డీఈఓ -
లీటరు పాలు..81 మంది విద్యార్థులకు
సోన్భద్ర: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ఎంత దారుణంగా అమలవుతుందో తెలిపే ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లా చోపన్ బ్లాక్లోని కోటా గ్రామ పంచాయతీలో ఈ ఘటన ఇటీవల చోటుచేసుకుంది. సలాయి బన్వా ప్రాథ మిక పాఠశాలలో 81 మంది చిన్నారులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి రోజూ మధ్యాహ్నం గ్లాసు పాలు అందించాల్సి ఉంటుంది. పాఠశాల నిర్వాహకుడు (శిక్షామిత్ర)మాత్రం లీటరు పాలు తెప్పించి, వాటిని బకెట్ నీళ్లలో కలిపి ఒక్కో విద్యార్థికి అరగ్లాసు చొప్పున అందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. స్పందించిన జిల్లా మేజిస్ట్రేట్ రాజలింగన్ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల నుంచి వివరాలను తెలుసుకుని ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడంతోపాటు అతనిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, మిర్జాపూర్ జిల్లా సియూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా ఒక మహిళ రొట్టెలు, మరో మహిళ ఉప్పు పంచుతున్న వీడియో ఒకటి ఆగస్టులో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా అధికారులు అప్పట్లో హడావుడి చేశారు. -
గాంధీజీ ప్రమాదంలో చనిపోయారట!
భువనేశ్వర్: జాతిపిత మహాత్మా గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయారంటూ ఒడిశా విద్యా శాఖ ప్రచురించిన బుక్లెట్ తీవ్ర వివాదాస్పమైంది. దీనిపై రాజకీయ నేతలు, ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ క్షమాపణ చెప్పాలని, తప్పును వెంటనే సరిచేయాలని డిమాండ్ చేశారు. గాంధీజీ హత్యను ప్రమాదంగా ప్రచురించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో ఈ వ్యవహారంపై ఒడిశా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. గాంధీజీ 150వ జయంత్యుత్సవాల నేపథ్యంలో ఆమా బాపూజీ: ఏక్ ఝలకా (మన బాపూజీ: ఒక సంగ్రహ అవలోకనం) పేరిట ప్రచురించిన ఈ రెండు పేజీల బుక్లెట్లో గాంధీకి సంబంధించిన విషయాలు వివరించారు. ఈ క్రమంలో 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్లో గాంధీ ప్రమాదం కారణంగా చనిపోయినట్లు పేర్కొన్నారు. విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ మాట్లాడుతూ ఈ వివాదంపై విచారణకు ఆదేశించామని, ఆ బుక్లెట్లను ఉపసంహరించుకున్నామని తెలిపారు. -
పాఠశాలలో విద్యుత్ వైరు తగిలి విద్యార్థి మృతి
సాక్షి, నిజామాబాద్ : కోటగల్లీ ప్రభుత్వం పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ వైరు తగిలి ఐదో తరగతి చదువుతున్న అయన్ ప్రాణాలు విడిచాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృతి చెందాడని గ్రాహస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. ఘటనపై విచారించేందుకు పాఠశాలకు వచ్చిన జిల్లా విద్యాధికారి (డీఈఓ)ను విద్యార్థి సంఘాలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. సెక్యూరిటీ మధ్య డీఈవోను పోలీసులు బయటకు పంపించారు. -
సర్కారు బడికి.. సర్పంచ్ కుమార్తె..
సాక్షి, అలంపూర్(మహబూబ్నగర్): గ్రామానికి ప్రథమ పౌరురాలు (సర్పంచ్) తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మండలంలోని తిమ్మాపురం గ్రామ సర్పంచ్ నాగేశ్వరి మంగళవారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తన కుమార్తె సాత్వికను మూడో తరగతిలో చేర్పించింది. అలాగే గ్రామానికి చెందిన మరో ఎనిమిది మంది గ్రామ చిన్నారులను చేర్పించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుశిక్షితులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉంటారని, కాబట్టి ప్రభుత్వ పాఠశాలలోనే తమ చిన్నారులను చదివించాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ రాజు, పాఠశాల హెచ్ఎం కృపయ్య, గ్రామ కార్యదర్శి చంద్రకళ, సర్పంచ్ భర్త శివుడు తదితరులు పాల్గొన్నారు. -
టైమ్కు రాని టీచర్లు; 10 మందిపై వేటు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: విధుల్లో సమయపాలన పాటించడం లేదంటూ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్రోస్ పది మంది ఉపాధ్యాయులపై వేటు వేశారు. శనివారం ఉదయం 9.15 గంటలకు జిల్లా కేంద్రంలోని గాంధీరోడ్డు బాలికల ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 16 మంది ఉపాధ్యాయులకు గానూ ముగ్గురు సెలవులో ఉండగా ప్రార్థన సమయానికి కేవలం నలుగురు మాత్రమే పాఠశాలకు హాజరయ్యారు. పిల్లలతో ప్రార్థనలో పాల్గొన్న కలెక్టర్ పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. ప్రార్థన అయిపోయాక కూడా మిగతా ఉపాధ్యాయులు రాకపోవడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ వెళ్లిపోయారు. కాగా, ఆయన పదిమందిపై సస్పెన్షన్ వేటు వేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయంపై డీఈఓ నాంపల్లి రాజేశ్ను వివరణ కోరగా విధులకు హాజరుకాని ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు అందిన విషయం వాస్తవమేనన్నారు. -
పెళ్లయిన 4 నెలలకే ప్రసవం.. టీచర్పై వేటు!
తిరువనంతపురం: ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ మహిళ పెళ్లయిన నాలుగు నెలలకే ప్రసవించి.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసూతి సెలవులనంతరం బడిలో తిరిగి చేరేందుకు ప్రయత్నించగా.. అందుకు ఆ ప్రభుత్వ పాఠశాల నిరాకరించింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన కేరళలోని కొట్టక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రసూతి సెలవుల అనంతరంలో మళ్లీ విధుల్లో చేరుందుకు బడికి వెళ్లిన తనను పెరెంట్స్-టీచర్స్ అసోసియేషన్ సమావేశంలో తీవ్రంగా దూషించారని, అంతేకాకుండా తిరిగి విధుల్లో చేరేందుకు అనుమతించలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొట్టక్కల్ పోలీసుల ఆమె ఫిర్యాదును స్వీకరించి.. దర్యాప్తు జరుపుతున్నారు. ఇక్కడి ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఐదేళ్లుగా టీచర్గా పనిచేస్తున్నట్టు బాధితురాలు(35) తన ఫిర్యాదులో తెలిపారు. మొదటి భర్తతో ఇబ్బందుల కారణంగా ఆమె విడాకులు తీసుకున్నారు. అనంతరం రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే, మొదటి భర్త నుంచి వేరయినా.. విడాకుల ప్రక్రియ ఆలస్యం కావడంతో ఆమె రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తితో సహజీవనం చేయడం ప్రారంభించారు. చట్టబద్ధంగా విడాకులు వచ్చిన తర్వాత 2018లో సహజీవనం చేస్తున్న వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లయ్యే నాటికే గర్భవతిగా ఉన్న ఆమె పెళ్లయిన నాలుగు నెలలకు బిడ్డను ప్రసవించారు. అయితే, ప్రసూతి సెలవులు ముగిసిన అనంతరం గత జనవరిలో పాఠశాలలో తిరిగి చేరేందుకు ప్రయత్నించగా.. అధికారులు అందుకు అంగీకరించలేదు. దీంతో తన ఉద్యోగం కోసం ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. -
వసతి లేని గృహాలు !
ఖమ్మంమయూరిసెంటర్: రెండు రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచే ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను సైతం ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. రెండు నెలలుగా విద్యార్థులు లేక మూసి ఉన్న హాస్టళ్లను శుభ్రం చేయడంతో పాటు వసతిగృహాల్లో నెలకొన్న ఇతర సమస్యలను పరిష్కరించాలి. అయితే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. వాటి పరిష్కారానికి అధికారులు చేపడుతున్న చర్యలు శూన్యం. ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను గుర్తించి, మరమ్మతులకు అంచనాలు రూపొందించాలని ఆ శాఖ అధికారులు ఇంజనీరింగ్ శాఖకు లేఖలు రాసి, తమ పని అయిపోయిందన్నట్టుగా చేతులు దులుపుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యా గుర్తించలేదు. బీసీ వసతిగృహాల్లోనూ సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. గతంలో ‘సాక్షి’ నిర్వహించిన హాస్టళ్ల సందర్శనలో బీసీ వసతి గృహాల్లో.. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలోని వసతిగృహాల్లోనే అత్యధిక సమస్యలు దర్శనమిచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రతిపాదనలు చేస్తున్నామని అధికారులు చెపుతున్నా.. ఇప్పటి వరకు ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు పనులు చేపట్టినప్పటికీ కొన్ని కూడా పూర్తి కాలేదు. హాస్టళ్ల కిటికీలకు తలుపులు కూడా లేవు. మరో రెండు రోజుల్లో విద్యార్థులు వసతిగృహాలకు వస్తున్నా.. పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో సమస్యలు పరిష్కారమవుతాయా అనే ప్రశ్న విద్యార్థి సంఘాల్లో తలెత్తుతోంది. ప్రారంభం కాని మరమ్మతులు.. విద్యా సంవత్సరం ప్రారంభానికి రెండు రోజులే సమయం ఉండడం, వేసవి సెలవులు ముగించుకొని నూతనోత్సాహంతో ఇంటి నుంచి వసతిగృహాలకు వచ్చే విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలుకనున్నాయి. ప్రతి ఏడాది వేసవిలోనే హాస్టళ్లలో సమస్యలను గుర్తించి, మరమ్మతుల కోసం ఆయా శాఖల అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపించి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఎస్సీ వసతిగృహాల్లో సమస్యలను గుర్తించాలని ఇంజనీరింగ్ అధికారులకు లేఖలు పెట్టినా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేకపోవడంతో వసతిగృహాల్లో సమస్యలు తప్పేలా లేవు. బీసీ హాస్టళ్లలో సమస్యలను గుర్తించినా.. ఇంతవరకు మరమ్మతు చర్యలేమీ చేపట్టలేదు. ఇక గిరిజన వసతిగృహాల్లో సైతం సమస్యలకు కొదవలేదు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించినప్పటికీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ మూడు శాఖల వసతిగృçహాలు, ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య ప్రధానంగా ఉంది. అద్దె భవనాల్లో ఉన్న వసతిగృహాల పరిస్థితి మరీ దారుణంగా ఉందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయా శాఖల సంక్షేమాధికారులు శ్రద్ధ చూపించకపోవడంతో మరమ్మతుల ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం పొడిగించినా ఫలితం లేదు.. 2019 – 20 విద్యా సంవత్సరం జూన్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రభుత్వం ఈనెల 12న పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వసతిగృహాల్లో సమస్యల పరిష్కారానికి కొద్ది సమయం దొరికిందని అధికారులు భావించినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వసతిగృహాల్లో సమస్యలివే.. వసతిగృహాల ప్రారంభంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యల్లో మొదటిది మరుగుదొడ్ల శుభ్రత. వసతిగృహాలు ప్రతి రోజు నిర్వహించే సమయంలోనే వీటిని శుభ్రం చేసే వారు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రెండు నెలలు మూసి ఉంచిన అనంతరం తెరుస్తుండడంతో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మరో ప్రధాన సమస్య తాగునీరు. గత్యంతరం లేని స్థితిలో విద్యార్థులు స్నానాలకు ఉపయోగించే నీటినే తాగిన విషయం గతంలో అనేక సార్లు బహిర్గతం అయింది. ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఈ సమస్య మళ్లీ ఉత్పన్నమయ్యేలా ఉంది. ఇక వాడుకునే నీరు సైతం అపరిశుభ్రంగానే ఉంది. జిల్లాలో వసతిగృహాల సంఖ్య ఇలా.. జిల్లాలో ఎస్సీ వసతిగృహాలు 50 ఉండగా వాటిలో కళాశాల స్థాయి 11 ఉన్నాయి. ఇందులో బాలురు 6, బాలికలకు 5 ఉన్నాయి. పాఠశాల స్థాయి వసతిగృహాలు 39 ఉండగా వీటిలో బాలురకు 25, బాలికలకు 14 కేటాయించారు. ఇందులో నేలకొండపల్లి బారుల వసతి గృహం ప్రైవేటు భవనంలో కొనసాగుతోంది. బీసీ వసతిగృహాలు 33 ఉండగా కళాశాల స్థాయి 10 ఉన్నాయి. ఇందులో బాలురవి 5, బాలికలవి 5. పాఠశాల స్థాయి వసతిగృహాలు 23 ఉండగా బాలురకు 18, బాలికలకు 5 కేటాయించారు. ఇందులో 10 హాస్టళ్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 19 వసతిగృహాలు ఉండగా కళాశాల స్థాయి 12 ఉన్నాయి. వీటిలో బాలురకు 6, బాలికలకు 6 కేటాయించారు. పాఠశాల స్థాయిలో 7 ఉండగా బాలురకు 5, బాలికలకు 2 ఉన్నాయి. ఇక ఆశ్రమ పాఠశాలలు 11 ఉండగా బాలురకు 4, బాలికలకు 7 కేటాయించారు. వీటిలో 4 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సమస్యలు గుర్తించడంలో నిర్లక్ష్యం.. వసతిగృహాల్లో సమస్యలను గుర్తించడంలో సంక్షేమశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యా సంవత్సరం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏ వసతిగృహంలో చూసినా ఏదో ఒక సమస్య విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. గత కొన్ని రోజులుగా అధికారులకు వినతిపత్రం అందించినా పట్టించుకోవడం లేదు. – ఎన్.ఆజాద్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి సమస్యలు గుర్తించినా మరమ్మతులు లేవు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వసతిగృహాల సందర్శన నిర్వహించి సమస్యలను గుర్తించాం. వాటిని నివేదిక రూపంలో తయారు చేసి ఆయా శాఖల అధికారులకు అందించాం. సమస్యలను వారికి విన్నవించినా పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారు. గుర్తించిన సమస్యలను మరమ్మతులు చేసి పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. – టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
ఆ పాఠశాలకు వెళ్తే.. ప్రాణాలు అరచేతిలో..
సాక్షి, కరీంనగర్రూరల్: ఒకవైపు శిథిలావస్థకు చేరిన భవనం.. మరోవైపు పైకప్పు పెచ్చులూడుతోంది. ఎప్పుడు పెచ్చులు పైన పడుతాయోనంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉపాధ్యాయులు, విద్యార్థులు కాలం గడుపుతున్నారు. పాఠశా ల భవనం శిథిలావస్ధకు చేరిందని, మరమ్మతులు చేయించాలంటూ విద్యాశాఖాధికారులకు పలు మార్లు నివేదికలు పంపించినప్పటికీ నిధుల కొరత సాకుతో పట్టించుకోవడం లేదు. తెలుగు మీడియంతో విద్యార్థుల సంఖ్య పడిపోయి పాఠశాల మూతపడే సమయంలో మూడేళ్లక్రితం ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియంతో విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరిగింది. శిథిలావస్థలో గదులు.. కరీంనగర్ మండలం గోపాల్పూర్లో ప్రాథమిక పాఠశాల భవనాన్ని 1979లో అప్పటి కలెక్టర్ కేఎస్ శర్మ ప్రారంభించారు. దాదాపు మూడు దశాబ్ధాల క్రితం నిర్మించిన ఈ భవనంలో మొత్తం ఆరు తరగతి గదులుండగా వీటిలో 5 శిథిలావస్ధకు చేరాయి. రెండు గదుల్లో గోడలకు పగుళ్లు ఏ ర్పడ్డాయి. ప్రధానోపాధ్యాయురాలు గదితోపా టు మరో రెండు గదుల్లో పైకప్పు పెచ్చులూడిపోయి ఇనుప సలాకాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు పైకప్పు నుంచి పెచ్చూలూడి పైన పడుతాయో తెలియక ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రాణాల ను అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. భవనం శిథిలావస్థకు చేరిందని మరమ్మతులు చేయించాలని పలుమార్లు విద్యాశాఖాధికారులకు ప్రధానోపాధ్యాయులు నివేదికలు పంపించినప్పటికీ నిధుల కొరత కారణంతో పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల భవనానికి మరమ్మతు చేయించినట్లయితే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఇంగ్లిష్ మీడియంతో ఆదరణ.. మొదట 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులతో కళకళలాడిన ఈపాఠశాల ప్రైవేట్ పాఠశాలల రాకతో 2010 సంవత్సరం నుంచి క్రమేపీ విద్యార్థుల సంఖ్యపడిపోయింది. విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోవడంతో ఉపాధ్యాయులను వేరే పాఠశాలలకు డిప్యూటేషన్పై బదిలీ చేశారు. 2014లో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కేవలం 15 మంది విద్యార్థులతో పాఠశాల మూసివేత దిశలో ఉండగా ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టింది. దీంతో అనూహ్యరీతిలో సమీప గ్రామాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు చేరడంతో 100కు చేరింది. అయితే ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథ కం వర్తింపచేయకపోవడంతో విద్యార్ధుల సంఖ్య క్రమేపీ తగ్గిపోయింది. మూడేళ్ల నుంచి 1వ తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో బోధన తరగతులు నిర్వహిస్తుండటంతో వి ద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో ప్ర స్తుతం 46 మంది విద్యార్థులున్నారు. అంతేకాకుం డా పలు స్వచ్ఛందసంస్థలు, దాతల సహాయంతో విద్యార్థులకు స్కూల్ బూట్లు, నోట్బుక్స్, పరీక్షా ప్యాడ్లు అందించారు. దూరప్రాంతాల విద్యార్థుల కోసం పాఠశాల ఆధ్వర్యంలో ఆటోసౌకర్యం కూడా కల్పించారు. ఇంగ్లిష్ మీడియంతో ప్రయోజనం.. ఒకప్పుడు విద్యార్థులు లేక మూతపడే పరిస్థితిలో ఉన్న పాఠశాల ఇప్పుడిప్పుడే కో లుకుంటుంది. ప్రైవేట్ కా న్వెంట్ స్కూళ్లకు చెందిన వ్యాన్లు గ్రామంలోకి రావడంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడంలేదు. మూడేళ్లక్రితం ప్రభుత్వం ఇంగ్లిష్మీడియం ప్రవేశపెట్టడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దాతల సాయంతో విద్యార్థులకవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. రాబో యే విద్యాసంవత్సరంలో స్ధానిక ప్రజాప్రతినిధులు, యువకులతో కలిసి విద్యార్థులను చేర్పి ంచేందుకు ప్రచార కార్యక్రమం చేపడుతాం. – వి.కరుణశ్రీ, ప్రధానోపాధ్యాయురాలు మరమ్మతు చేయించాలి శిథిలావస్ధకు చేరిన పాఠశాల భవనానికి మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం వెంటనే నిధులు మం జూరు చేయాలి. ప్రభుత్వం పట్టించుకో కుంటే దాతలు, స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో తాత్కాలిక మరమ్మతు చేయించేందుకు విరాళాలను సేకరిస్తాం. – తుమ్మ అంజయ్య, ఎస్ఎంసీ చైర్మన్ -
దాహం..దాహం!
సాక్షి, మక్తల్: వేసవికాలం ప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో మంచినీళ్లు కరువయ్యాయి. ప్రతి రోజు పాఠశాలల్లో విద్యార్థులు మంచినీళ్లు లభించక దాహార్తితో అలమటిస్తున్నారు. మరోవైపు మధ్యాహ్న భోజన ఏజెన్సీలు వంటలు చేయడానికి నానా ఇక్కట్లు పడుతున్నారు. పాఠశాలల్లో మంచినీటి సౌకర్యం కల్పించకపోవడం గమనార్హం. కొన్ని సంవత్సరాల నుంచి పాఠశాలల్లో మంచినీటి ఎద్దడి నెలకొన్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం. మక్తల్ మండలంలో మొత్తం 56 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 36 పీఎస్లు, 14 యూపీఎస్లు, 6 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మండలంలో మొత్తం దాదాపు 27 పాఠశాలల్లో మంచినీటి సమస్య ఏర్పడి విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా కనీసం పాఠశాల విద్యార్థులకు మంచినీళ్లు కూడా అందించలేని దుస్థితి దాపురించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు అక్కడ తాగడానికి కూడా మంచినీళ్లు లేకపోవడం మధ్యాహ్న భోజన సమయంలో భోజనం చేసిన విద్యార్థులకు కనీసం చేతులు కడుక్కోవడానికి కూడా నీళ్లు కరువైపోయాయి. ఈ పరిస్థితిలో విద్యార్థులు ప్రతి రోజు ఆయా పాఠశాలల్లో మంచినీళ్ల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బం దులు వర్ణనాతీతం. కొందరు విద్యార్థులు బాటిళ్లలో నీళ్లు తెచ్చుకొని తోటి విద్యార్థులతో కలిసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలోని పంచదేవ్పహాడ్, పస్పుల, జక్లేర్, బొందల్కుంట, మక్తల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కర్ని, రామసముద్రం, జౌలపురం, ఉపర్పల్లి, సోమేశ్వర్బండ తదితర పాఠశాలల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడింది. గతంలో అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆయా పాఠశాలల్లో మంచినీటి సమస్యను పరిష్కరించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని వారు కోరారు. -
చెట్ల కింద చదువులు
సాక్షి,డీ.హీరేహాళ్: కార్పొరేట్ పాఠశాల్లో చదువు చెప్పించే స్థోమత లేని చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో కనీస వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. అన్నీ సమస్యలే మండలంలోని పూలకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 6 నుండి 10 వతరగతి వరకు 228 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. వీరికి ఒక్కో తరగతికి ఒక్కో తరగతి గది ఉండాలి కానీ కేవలం మూడు గదులు మాత్రమే ఉండడంతో చెట్ల కింద, వరండాలో చదువులు చెప్పిస్తున్నారు. 8 గదులకు గాను 3 గదులు ఉండడంతో వారి చదువులు చెట్ల కిందనే కొనసాగుతున్నాయి. విద్యార్థులకు అనుగుణంగా పది మంది ఉపాద్యాయులు ఉండాల్సిన చోట ఆరుమంది మాత్రమే ఉన్నారు. పాఠశాల మైదానం కూడా గుంతలమయం కావడంతో ఆటలు ఆడుకోవాడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంటగది లేకపోవడంతో పాఠశాల పక్కనే తడికేలతో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్డులోనే వంట చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు పొగ బాధ తప్పడం లేదు. విద్యుత్ ఉన్నప్పుడే నీరు అరకోరగానే వస్తాయి. విద్యుత్ లేకపోతే విద్యార్థులు నీటి కోసం పొలాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. మరుగు దొడ్లులు కూడా మూడు యూనిట్లు ఉండాల్సి ఉన్నా ఒకే మరుగు దోడ్డి ఉండడంతో బాలికలు, మహిళా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. గదుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి కాలవ శ్రీనివాసులుకు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా నేటికీ గదుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. -
సార్ మీ ప్రవర్తన మార్చుకో..
కొండపాక(గజ్వేల్): విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, దూషిస్తున్న ఉపాధ్యాయుడితో బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక యువకులు వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. ఈ సంఘటన కొండపాక మండలంలోని కుకునూరుపల్లి హైస్కూల్లో గురువారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గడీల సుధాకర్రెడ్డి అనే ఆంగ్ల ఉపాధ్యాయుడు మూడు నెలల క్రితం బదిలీపై కుకునూరుపల్లి హైస్కూల్కు వచ్చాడు. నాటి నుంచి 9వ తరగతి విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, దూషిస్తున్నాడని బాధిత చిన్నారులు ఆరోపిస్తున్నారు. పాఠ్యాంశాల్లో అర్థం కాని విషయాలను అడిగితే ఛీదరించుకుంటూ, అవహేళనగా మాట్లాడుతుంటారని చెబుతున్నారు. ఈ విషయాన్ని వారు తమ కుటుంబీకులతో చెప్పడంతో స్థానిక యువకులతో కలిసి విషయం తెలసుకునేందుకు గురువారం పాఠశాలకు వెళ్లారు. అక్కడ విద్యార్థుల కుటుంబీకులకు, యువకులకు, ఉపాధ్యాయుడు సుధాకర్రెడ్డి నడుమ మాటా మాటా పెరగడంతో విషయం దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. విషయం తెలుసుకున్న ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి కుకునూరుపల్లి హైస్కూల్కు చేరుకొని విద్యార్థుల కుటుంబీకులను, యువకులను, ఉపాధ్యాయుడిని సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు ఇలాంటి ఘటన పునరావృత్తం కాకుండా చర్యలు తీసకుంటామని హామీ ఇచ్చారు. హెచ్ఎం గజ్జెల కనుకరాజు వైఖరిపై సైతం యువకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు సుధాకర్ రెడ్డిని ఎంఈఓ శ్రీనివాస్రెడ్డి మందలించారు. విద్యార్థులతో సరైన రీతిలో మెదగాలని సూచించారు. ఈ విషయమై ప్రధానోపాద్యాయుడు కనుకరాజుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. -
బహుమతి కోసం వచ్చి విద్యార్థిని మృతి
ఖిల్లా ఘనపురం (వనపర్తి): స్వాతంత్య్ర దిన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కొద్ది సేపట్లో బహుమతి తీసుకోవాల్సిన ఓ బాలిక అకస్మాత్తుగా చనిపోయింది. బుధవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం సోళీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోళీపురం గ్రామానికి చెందిన మచ్చని వెంకటయ్య–చెన్నమ్మ రెండో కుమార్తె భవ్య(13) గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఇటీవల నిర్వహించిన క్రీడాపోటీల్లో ఆమె షాట్పుట్లో ప్రథమ స్థానంలో నిలవగా స్వాతంత్య్ర వేడుకల్లో బహుమతి అందుకోవాల్సి ఉంది. బహుమతికోసం ఆమె పేరు పిలవగానే స్టేజీ దగ్గరకు వెళ్లిన భవ్య ఒక్కసారిగా కుప్పకూలింది. పరీక్షించిన వైద్యులు భవ్య అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. -
ప్రభుత్వ విద్యార్థులకు జేఎన్టీయూ నోట్బుక్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఉచిత నోటుబుక్స్ ను జేఎన్టీయూహెచ్ (జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్) పంపిణీ చేయనుంది. తమ ఎన్ఎస్ఎస్ విభాగం ద్వారా సుమారు లక్ష నోట్బుక్స్ పంపిణీకి ఏర్పాట్లు చేసింది. వర్సిటీ నిర్వహించే సెమిస్టర్ పరీక్షలకు హాజరైన వారి జవాబు పత్రాలు, గైర్హాజరైన వారి జవాబు పత్రాలను మూల్యాంకనం తర్వాత ధ్వంసం చేసేవారు. ఈ ఏడాది అందుకు భిన్నంగా జవాబు పత్రాలు వృథా కాకూడదనే ఉద్ధేశంతో వర్సిటీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. మూడేళ్లుగా గైర్హాజరైన వారి జవాబు పత్రాలతో తయారు చేసిన లక్ష నోటు పుస్తకాలను ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ర్థులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పుస్తకాల్లో టెన్త్ తర్వాత విద్యార్థులకు దిశానిర్దేశం చేసే సమాచారం, వర్సిటీ నిర్వహిస్తోన్న సాంకేతిక విద్యా విభాగాల సమాచారం పొందుపరిచినట్లు జేఎన్టీయూహెచ్ తెలిపింది. రెండేళ్ల నిబంధనను పట్టించుకోవటం లేదు సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బోధన సిబ్బం ది బదిలీల్లో ఉన్నతాధికారులు ‘రెండేళ్ల’ నిబంధనలను పట్టించుకోవటం లేదని టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలల సొసైటీ పరిధిలో టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభమైంది. సోమవారం జోన్ 5, జోన్ 6 పరిధిలోని ప్రిన్సిపాళ్ల ట్రాన్స్ఫర్ కౌన్సెలింగ్ నిర్వహించగా... మంగళవారం జోన్ 5 పరిధిలోని టీచర్లకు బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రిన్సిపా ళ్లు, టీచర్లకు మాత్రమే అవకాశం కల్పించారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగి బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొన్నా, ఎస్సీ గురుకుల సొసైటీలో ఐదేళ్లు నిండిన వారికే అవకాశం కల్పించారని వారు ఆరోపిస్తున్నారు. గురువారం జోన్ 6 పరిధిలోని టీచర్లకు కౌన్సెలింగ్ జరుగనుంది. -
చదువుల తల్లులకు అండగా నిలిచిన పోసాని
-
జామకాయ.. ఆయువు తీసింది
సాక్షి, అన్నానగర్: జామకాయ.. పిల్లలకు ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన తమిళనాడులోని ఆనైమలైలో జరిగింది. స్థానిక మొయిదిన్ఖాన్ వీధికి చెందిన సిరాకోవిన్ కుమారుడు అన్సాద్ (14) ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తూ క్లాసులో తినేందుకు జామకాయతోపాటు చిన్న కత్తిని వెంట తీసుకెళ్లాడు. ఉదయం 10.15 గంటలకు మొదటి క్లాస్ ముగియగానే ఉపాధ్యాయిని తరగతి నుండి బయటకు వెళ్లింది. ఆ విరామ సమయంలో అన్సాద్ తాను తెచ్చిన జామకాయను తొడమీద ఉంచుకుని కత్తితో చిన్నముక్కలుగా చేస్తున్నాడు. ఇంతలో కత్తి హఠాత్తుగా ఎడమ తొడను చీల్చింది. దీంతో తొడ నుండి గుండెకు వెళ్లే ముఖ్యమైన నరం తెగిపోగా అతడు రక్తపుమడుగులో స్పృహతప్పి పడిపోయాడు. ఇది గమనించిన ఉపాధ్యాయులు వెంటనే అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షించి అన్సాద్ మార్గం మధ్యలోనే మృతిచెందాడని నిర్ధారించారు. సమాచారం అందుకున్న జాయింట్ పోలీసు సూపరింటెండెంట్ సుబ్రమణ్యం, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి తోటి విద్యార్థులను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సర్కార్ బడి సక్సెస్..మూతపడ్డ ప్రైవేట్ స్కూల్స్
-
ఉన్నతాధికారి పిల్లలైనా సర్కార్ బడిలోనే చదువులు
-
నీకు చదువెందుకురా..పెళ్లి చేసుకో!
సత్తుపల్లి రూరల్: ‘ప్రైవేట్ పాఠశాలలు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలు ముద్దు..’ అని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తోంది.. అయితే, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం జిల్లా పరిషత్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న వికలాంగ విద్యార్థి సంపంగి చిలకల ముత్యాలరాజుకు ఎదురైన అనుభవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. సోమవారం ఆ విద్యార్థి పాఠశాలకు వెళ్లగా.. కొందరు ఉపాధ్యాయులు నీవు వికలాంగుడివి.. నీకు చదువెందుకురా? నిన్ను స్కూల్లో నుంచి తీసివేశాం.. నీవు ఇంటికి వెళ్లు.. అని పంపించారని విలేకరులకు తెలిపాడు. అంతేకాకుండా నీ వయసుకు పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండు.. నీకు వచ్చే వికలాంగ పింఛన్లతో నీవు, నీ భార్య బతకండి.. అని హేళనగా మాట్లాడారని వాపోయాడు. విషయాన్ని మంగళవారం తన తండ్రి వాసుకు చెప్పాడు. తండ్రి వాసు విలేకరులతో మాట్లాడుతూ.. తన సోదరుడి కొడుకును కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారని, అతడు ఇప్పుడు పాఠశాలకు వెళ్లకుండా మామిడి తోటలు నరికే పనికి వెళ్తున్నాడని.. ఇలా ఉపాధ్యాయులు పేద పిల్లలను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించాడు. తమ పిల్లలను అవమానపరిచేలా మాట్లాడిన ఆ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సత్తుపల్లి ఎంఈవో, డీఈవో, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. ఈ విషయమై ఎంఈవో బి.రాములును వివరణ కోరగా.. విద్యార్థి తండ్రి వాసు ఎంఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేశాడని.. ఈ విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. -
ఆ స్కూల్లో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా లేడు