Hurun India Rich List
-
మార్కెట్ ‘కింగ్’ రిలయన్స్
ముంబై: దేశీయంగా అత్యధిక మార్కెట్ వేల్యుయేషన్తో పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానంలో కొనసాగింది. రూ. 17.5 లక్షల కోట్ల విలువతో బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా టాప్ 500 కంపెనీల లిస్టులో నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. అటు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ (టీసీఎస్) రూ. 16.1 లక్షల కోట్ల మార్కెట్ వేల్యుయేషన్తో రెండో స్థానంలో, రూ. 14.22 లక్షల కోట్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడో స్థానంలో నిల్చాయి.మరోవైపు, ఐపీవోకి సన్నాహాలు చేసుకుంటున్న స్టాక్ ఎక్స్ఛేంజీ ఎన్ఎస్ఈ సంస్థ రూ. 4.7 లక్షల కోట్ల వేల్యుయేషన్తో.. అన్లిస్టెడ్ కంపెనీల విభాగంలో అగ్రస్థానంలో ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయాలు 28 శాతం పెరిగి రూ. 16,352 కోట్లకు, లాభాలు 51 శాతం ఎగిసి రూ. 8,306 కోట్లకు చేరాయి. ఈ విభాగంలో రూ. 77,860 కోట్ల వేల్యుయేషన్తో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా అయిదో స్థానంలో ఉంది. బైటి నుంచి నిధులు సమీకరించకుండా సొంతంగా ఎదిగిన బూట్స్ట్రాప్డ్ సంస్థల లిస్టులో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. గ్రూప్లవారీగా చూస్తే టాటా సన్స్ వేల్యుయేషన్ 2024లో 37 శాతం ఎగిసి రూ. 32.27 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో రిలయన్స్ గ్రూప్ మొత్తం వేల్యుయేషన్ రూ. 19.71 లక్షల కోట్లుగా, అదానీ గ్రూప్ విలువ రూ. 13.40 లక్షల కోట్లుగా ఉంది. తొలిసారిగా లిస్టులోని కంపెనీలన్నీ 1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ ఉన్నవేనని హురున్ చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. దేశవ్యాప్తంగా పరిశ్రమ నిపుణులు, జర్నలిస్టులు, బ్యాంకర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలు, బహిరంగంగా అందుబాటలో ఉన్న గణాంకాల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు వివరించారు. దీనికి డిసెంబర్ 13 కటాఫ్ తేదీగా నిర్ణయించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఇందులో పరిగణనలోకి తీసుకోలేదు. మరిన్ని వివరాలు .. ⇒ టాప్ 500లోకి చోటు దక్కించుకునేందుకు ఈసారి కనిష్ట వేల్యుయేషన్ పరిమితిని 43% అధికంగా రూ. 9,580 కోట్లకు పెంచారు. 2023లో ఇది రూ. 6,700 కోట్లుగా ఉంది. ⇒ లిస్టులోని మొత్తం కంపెనీల విలువ 40 శాతం ఎగిసి 3.8 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ. 324 లక్షల కోట్లు) చేరింది. ఇది దాదాపు 3.5 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న దేశ జీడీపీ కన్నా అధికం కావడం గమనార్హం. మోతీలాల్ ఓస్వాల్, ఐనాక్స్ విండ్, జెప్టో, డిక్సన్ వంటి సంస్థల వేల్యుయేషన్ అత్యధికంగా పెరిగింది. ⇒ మొత్తం సుమారు రూ. 86 లక్షల కోట్ల పైగా ఆదాయం ఉన్న ఈ 500 కంపెనీలు దాదాపు రూ. 8 లక్షల కోట్ల లాభాలు ఆర్జించగా, రూ. 2.2 లక్షల కోట్ల మొత్తాన్ని పన్నుల కింద చెల్లించాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలపై రూ. 11,000 కోట్లు వెచ్చించాయి. సుమారు 85 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ⇒టాప్ కంపెనీల సంఖ్యాపరంగా చూస్తే రూ. 10.11 లక్షల కోట్ల విలువ చేసే 35 సంస్థలతో హైదరాబాద్ అయిదో స్థానంలో నిలి్చంది. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణ ఏడో ర్యాంకులో ఉంది. -
స్వయంకృషితో ఎదిగిన టాప్ 10 కంపెనీలు
-
స్వయంకృషితో ఎదిగిన తెలుగు వ్యాపారవేత్తలు
స్వయం కృషితో అవతరించిన దిగ్గజ పారిశ్రామికవేత్తల జాబితాను ఐడీఎఫ్సీ ఫస్ట్ ప్రైవేట్, హరూన్ ఇండియా సంయుక్తంగా విడుదల చేశాయి. 2,000 సంవత్సరం తర్వాత స్వయం కృషితో ఎదిగిన వ్యాపారవేత్తలు, వారు ఏర్పాటు చేసిన 200 కంపెనీ వివరాలను తెలియజేశాయి. అందులో దేశవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలుగా పేరున్న డీమార్ట్, జొమాటో, స్విగ్గీ, మేక్ మై ట్రిప్, మ్యాక్స్ హెల్త్కేర్, డ్రీమ్11..వంటి సంస్థలున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలు కూడా ఆ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.స్విగ్గీర్యాంకు: 3వ్యవస్థాపకులు: నందన్రెడ్డి, శ్రీహార్ష మాజేటి కంపెనీ విలువ: రూ.1,01,300 కోట్లు. ఈ సంస్థను 2013లో ఏర్పాటు చేశారు.దెక్కన్ ఫైన్ కెమికల్స్ర్యాంకు: 25వ్యవస్థాపకులు: వంశీ గోకరాజు, జీఎస్ రాజు.కంపెనీ విలువ: రూ.31,600 కోట్లుఈ సంస్థను 2006లో స్థాపించారు.ఎంఎస్ఎన్ లేబోరేటరీస్ర్యాంకు: 31వ్యవస్థాపకులు: సత్యనారాయణ రెడ్డికంపెనీ విలువ: రూ.26,200 కోట్లుఈ సంస్థను 2003లో స్థాపించారు.లారస్ ల్యాబ్స్ర్యాంకు: 34వ్యవస్థాపకులు: సత్యనారాయణ చావకంపెనీ విలువ: రూ.24,900 కోట్లుఈ సంస్థను 2005లో స్థాపించారు.కిమ్స్ర్యాంకు: 40వ్యవస్థాపకులు: భాస్కర్రావుకంపెనీ విలువ: రూ.21,900 కోట్లుఈ సంస్థను 2000లో స్థాపించారు.ర్యాపిడోర్యాంకు: 98వ్యవస్థాపకులు: అరవింద్ సంకా, పవన్ గుంటుపల్లికంపెనీ విలువ: రూ.9,200 కోట్లుఈ సంస్థను 2015లో స్థాపించారు.ఇదీ చదవండి: ఏఐకి సవాళ్లు.. హ్యాకింగ్ రిస్కులు!మెడ్ప్లస్ర్యాంకు: 119వ్యవస్థాపకులు: మధుకర్ గంగిడికంపెనీ విలువ: రూ.8,200 కోట్లుఈ సంస్థను 2006లో స్థాపించారు.బొండాడ ఇంజినీరింగ్ర్యాంకు: 142వ్యవస్థాపకులు: రాఘవేంద్ర రావుకంపెనీ విలువ: రూ.6,400 కోట్లుఈ సంస్థను 2012లో స్థాపించారు.జాగిల్ ప్రీపెయిడ్ర్యాంకు: 160వ్యవస్థాపకులు: రాజ్ఫణికంపెనీ విలువ: రూ.5,300 కోట్లుఈ సంస్థను 2011లో స్థాపించారు.టీమ్లీజ్ సర్వీసెస్ర్యాంకు: 162వ్యవస్థాపకులు: అశోక్ రెడ్డికంపెనీ విలువ: రూ.5,200 కోట్లుఈ సంస్థను 2000లో స్థాపించారు. -
నారాయణ మూర్తిని మించిన సేనాపతి
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నారాయణ మూర్తిని సంపద పరంగా అదే సంస్థకు చెందిన మరో సహవ్యవస్థాపకులు సేనాపతి గోపాలకృష్ణన్ మించిపోయారు. ఇటీవల వెలువడిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం భారత్లో 334 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ సంఖ్య గతేడాది కంటే 75 ఎక్కువ. వారి సామూహిక సంపద రూ.159 లక్షల కోట్లకు చేరింది. ఈ లిస్ట్లో ఈసారి నారాయణ మూర్తి(సందప రూ.36,600 కోట్లు)ని సేనాపతి గోపాలకృష్ణన్ అధిగమించారు. రూ.38,500 కోట్ల నికర సంపదతో ఈ ఘనత దక్కించుకున్నారు.ఇన్ఫోసిస్ను 1981లో నారాయణ మూర్తి, ఎన్ఎస్ రాఘవన్, అశోక్ అరోరా, నందన్ నీలేకని, ఎస్డీ శిబులాల్, కే.దినేష్, సేనాపతి గోపాలకృష్ణన్ కలిసి స్థాపించారు. ఇది తరువాతి కాలంలో ఇన్ఫోసిస్ భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఐటీ సంస్థల్లో ఒకటిగా మారింది. 2023లో 18.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,51,762 కోట్లు ) ఆదాయాన్ని ఆర్జించింది.ఇదీ చదవండి: యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలుసేనాపతి గోపాలకృష్ణన్సేనాపతి గోపాలకృష్ణన్(69) ఇన్ఫోసిస్ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అతను 2007 నుంచి 2011 వరకు కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. కంపెనీ విస్తరణ, ఆవిష్కరణల్లో ఇన్ఫోసిస్ను ముందుండి నడిపించారు. గోపాలకృష్ణన్ 2011 నుండి 2014 వరకు సంస్థకు వైస్ ఛైర్మన్గా కూడా పనిచేశారు. ఇన్ఫోసిస్లో తన కార్యకలాపాల నుంచి వైదొలిగిన తర్వాత గోపాలకృష్ణన్ కొత్త వ్యాపారాలపై దృష్టి సారించారు. అతను ప్రస్తుతం యాక్సిలర్ వెంచర్స్ ఛైర్మన్గా ఉన్నారు. యాక్సిలర్ వెంచర్స్ గుడ్హోమ్, కాగాజ్, ఎన్కాష్ వంటి స్టార్టప్లలో పెట్టుబడి పెట్టింది. -
38 ఏళ్ల వయసు.. 120 కోట్ల విరాళం: ఎవరో తెలుసా?
హురున్ ఇండియా విడుదల చేసిన 2024 దాతృత్వ జాబితాలో.. టెక్ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు 'శివ్ నాడార్' రూ. 2153 కోట్లు విరాళమిచ్చి అగ్రగామిగా నిలిచారు. ఆ తరువాత ముకేశ్ అంబానీ, బజాజ్ ఫ్యామిలీ, కుమారమంగళం బిర్లా.. వంటి వారు ఉన్నారు. అయితే ఈ కథనంలో పిన్న వయసులో ఎక్కువ విరాళమిచ్చిన వ్యక్తిని గురించి తెలుసుకుందాం.38 ఏళ్ల నిఖిల్ కామత్ రెయిన్మాటర్ ఫౌండేషన్ ద్వారా వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు రూ. 120 కోట్లను విరాళంగా ఇచ్చినట్లు హురున్ ఇండియా జాబితా ద్వారా తెలిసింది. దీంతో భారతదేశంలో చిన్న వయసులో ఎక్కువ డబ్బును దాతృత్వ కార్యక్రాలకు వెచ్చించిన వ్యక్తిగా నిఖిల్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. రూ. 100 కోట్లకు పైగా విరాళాలు అందించిన వారిలో ఈయన 15వ స్థానంలో నిలిచారు.ఇదీ చదవండి: ఏఐ డిటెక్టర్ ప్రమాదం!.. పాక్ మహిళ పోస్ట్ వైరల్నిఖిల్ కామత్ తరువాత.. జాబితాలో ఎక్కువ విరాళాలు అందించిన ఇతర యువ పరోపకారులలో వివేక్ వకీల్, మాధవకృష్ణ సింఘానియా, సరందర్ సింగ్, వరుణ్ అమర్ వాకిల్, రాఘవపత్ సింఘానియా కూడా వున్నారు. అయితే నిఖిల్ కామత్ ఈ జాబితాలో 15వ స్థానంలో ఉన్నారు. యువ వ్యాపారవేత్తలు దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. -
దానగుణంలో హెచ్సీఎల్ నాడార్ టాప్..
ముంబై: టెక్ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ దాతృత్వంలో అంబానీ, అదానీని కూడా మించిపోయారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 2,153 కోట్లు విరాళమిచ్చారు. క్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇది 5 శాతం అధికం. దీంతో ఎడెల్గివ్–హురున్ వితరణశీలుర లిస్టులో శివ్ నాడార్ అగ్రస్థానంలో నిల్చారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ. 407 కోట్లతో రెండో స్థానంలో, వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ రూ. 330 కోట్లతో అయిదో స్థానంలో ఉన్నారు. జాబితా ప్రకారం మొత్తం మీద 203 మంది రూ. 5 కోట్లకన్నా అధికంగా విరాళమిచ్చారు. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం రూ. 1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న మొత్తం 1,539 మంది వ్యక్తుల సంపద 46 శాతం పెరిగింది. 203 మంది ఇచి్చన సగటు విరాళం పరిమాణం రూ. 71 కోట్ల నుంచి రూ. 43 కోట్లకు తగ్గింది. వితరణకు సంబంధించి మహిళల జాబితాలో రోహిణి నీలేకని రూ. 154 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, రూ. 90 కోట్లతో సుస్మితా బాగ్చీ రెండో స్థానంలో ఉన్నారు. రంగాలవారీగా చూస్తే విద్యారంగానికి అత్యధికంగా రూ. 3,680 కోట్లు, హెల్త్కేర్కి రూ. 626 కోట్లు లభించాయి. రిచ్ లిస్ట్లో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో అదానీ అగ్రస్థానంలో, రూ. 10.14 లక్షల కోట్లతో అంబానీ రెండో స్థానంలో ఉండగా రూ. 3.14 లక్షల కోట్ల సంపదతో శివ్ నాడార్ మూడో స్థానంలో ఉన్నారు. రిచ్ లిస్టులోని ప్రమోటర్ల సారథ్యంలో ఉన్న తొమ్మిది కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద నిర్దేశిత 2 శాతానికి మించి ఖర్చు చేశాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 900 కోట్లు, యార్డీ సాఫ్ట్వేర్ ఇండియా రూ. 25 కోట్లు చొప్పున ఖర్చు చేశాయి.ధనవంతులైన టాప్ 10 పరోపకారుల జాబితా▸శివ్ నాడార్ & కుటుంబం: రూ. 2,153 కోట్లు▸ముకేశ్ అంబానీ & కుటుంబం: రూ. 407 కోట్లు▸బజాజ్ కుటుంబం: రూ. 352 కోట్లు▸కుమార మంగళం బిర్లా & కుటుంబం: రూ. 334 కోట్లు▸గౌతమ్ అదానీ & కుటుంబం: రూ. 330 కోట్లు▸నందన్ నీలేకని: రూ. 307 కోట్లు▸కృష్ణ చివుకుల: రూ. 228 కోట్లు▸అనిల్ అగర్వాల్ & కుటుంబం: రూ. 181 కోట్లు▸సుస్మిత & సుబ్రోతో బాగ్చి: రూ. 179 కోట్లు ▸రోహిణి నీలేకని: రూ. 154 కోట్లుWho are the top 10 impact leaders in the 2024 EdelGive Foundation HURUN INDIA Philanthropy List?Shiv Nadar tops the 2024 EdelGive Foundation HURUN INDIA Philanthropy List, followed by Mukesh Ambani and his family and the Bajaj family. These philanthropic leaders continue to… pic.twitter.com/EsnrO831Hd— HURUN INDIA (@HurunReportInd) November 7, 2024 -
దేశంలో అధిక ధనవంతులు గల రాష్ట్రాలు(ఫొటోలు)
-
ధనవంతులు ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాలు: తెలంగాణ ఎక్కడుందంటే..
2024లో దేశంలో ఎక్కువ మంది ధనవంతులున్న రాష్ట్రాల జాబితాను హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఇందులో ఏ రాష్ట్రంలో ఎంతమంది ధనవంతులనున్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించింది. 2020తో పోలిస్తే ధనవంతుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లో గణనీయంగా పెరిగింది. ఇది ఆ రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను మాత్రమే కాకుండా.. సంపద సృష్టిని ప్రతిబింబిస్తుంది. ● భారతదేశంలో ఎక్కువమంది ధనవంతులున్న రాష్ట్రాల జాబితాలో అగ్రగామిగా మహారాష్ట్ర ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో మొత్తం 470 మంది ధనవంతులున్నట్లు సమాచారం. 2020తో (247 మంది) పోలిస్తే ఈ సంఖ్య 222 పెరిగినట్లు తెలుస్తోంది. ● 2020లో 128 మంది ధనవంతులతో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ.. ఇప్పుడు 213మందితో మళ్ళీ అదే స్థానంలో నిలిచింది. ● గుజరాత్ రాష్ట్రంలో 129 మంది, తమిళనాడులో 119 ధనవంతులున్నట్లు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది. ఈ రాష్ట్రాల్లో 2020లో వరుసగా 60, 65 మంది ధనవంతులు ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే గుజరాత్, తమిళనాడులో కూడా ధనవంతుల సంఖ్య భారీగా పెరిగిందని స్పష్టమవుతోంది. ● తెలంగాణాలో 109 మంది ధనవంతులు, కర్ణాటకలో 108 మంది ధనవంతులున్నట్లు నివేదికలో వెల్లడైంది. 2020లో ఈ రెండు రాష్ట్రాల్లో 54, 72 మంది ధనవంతులున్నారు. తెలంగాణ ఇప్పుడు ఎక్కువమంది ధనవంతులున్న రాష్ట్రాల్లో కర్ణాటకకు అధిగమించింది. ● పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వరుసగా 70, 40, 36, 28 మంది ధనవంతులున్నారు. 2020లో ఈ రాష్ట్రాల్లో ఉన్న ధనవంతుల సంఖ్య వరుసగా 32, 16, 9, 9 మాత్రమే. 2024లో ఈ రాష్ట్రాల్లో కుబేరుల సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.2020లో ధనవంతుల జాబితాలో ముందు వరుసలో ఉన్న తమిళనాడు, కర్ణాటక ఈ సారి కొంత వెనుకబడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద 2024లో మన దేశంలో ఉన్న ధనవంతుల సంఖ్య 1,322 మంది. 2020లో ఈ సంఖ్య 693 మాత్రమే. దీని ప్రకారం 2024లో 629 మంది ధనవంతులు కొత్తగా జాబితాలోకి చేరినట్లు తెలుస్తోంది. -
చైనా కుబేరుడి కంటే అంబానీ సంపద రెండింతలు!
చైనాలోని అత్యంత ధనవంతుల జాబితాను ‘హురున్ చైనా రిచ్ లిస్ట్’ పేరుతో విడుదల చేశారు. అందులో బైట్డ్యాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు జాంగ్ యిమింగ్ మొదటిస్థానంలో నిలిచారు. ఈయన సంపద దాదాపు 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు)గా ఉందని హురున్ నివేదించింది. అయితే తన సంపద గతంలో కంటే పెరిగినప్పటికీ భారత్లో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీను మాత్రం మించలేకపోయారు.చైనాలో కుబేరుల పెరుగుదల తగ్గిపోతుందని హురున్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఇటీవల భారీగా తగ్గిన చైనా ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్ల ప్రభావంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది. ప్రస్తుతం చైనా కుబేరుల మొత్తం సంపద మూడు ట్రిలియన్ డాలర్లు(రూ.250 లక్షల కోట్లు)గా ఉంది. అయితే ఇది గతంలోకంటే 10 శాతం తగ్గినట్లు హురున్ నివేదిక ఛైర్మన్ రూపెర్ట్ తెలిపారు.చైనా కంటే భారత్లో పెరుగుదలచైనాలో బిలియనీర్ల జాబితా తగ్గిపోతుంది. అందుకు భిన్నంగా భారత్లో మాత్రం వారి సంఖ్య పెరుగుతోంది. ఆగస్టులో విడుదల చేసిన హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం..భారత్ గతంలో కంటే 29 శాతం బిలియనీర్ల సంఖ్యను పెంచుకుంది. ఇది రికార్డు స్థాయిలో 334కు చేరుకుంది. అయితే, మొత్తం బిలియనీర్ల సంఖ్య విషయానికి వస్తే భారతదేశం ఇప్పటికీ చైనా కంటే వెనుకబడే ఉంది. చైనాలో 753 మంది బిలియనీర్లు ఉన్నారు.ఇదీ చదవండి: కొత్త అప్డేట్..యాపిల్లో అదిరిపోయే ఫీచర్!చైనా కుబేరుడు జాంగ్ యిమింగ్హురున్ నివేదిక ప్రకారం జాంగ్ యిమింగ్(41) సంపద నికర విలువ 49.3 బిలియన్ డాలర్లు(రూ.4.11 లక్షల కోట్లు). ఆన్లైన్ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్లు డౌయిన్, టిక్టాక్ మాతృ సంస్థ బైట్డాన్స్ సంస్థ వ్యవస్థాపకుడు యిమింగ్. కాగా, భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ సంపద నికర విలువ 102 బిలియన్ డాలర్ల(రూ.8.5 లక్షల కోట్లు)కు చేరుకుంది. అంబానీ సంపద గతేడాది కంటే 25 శాతం పెరిగింది. -
ఇషా అంబానీ సరికొత్త రికార్డ్!.. జాబితాలో ఆకాష్ కూడా..
హురున్ ఇండియా అండర్ 35 జాబితా విడుదల చేసింది. ఇందులో దేశంలోని అత్యంత విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తలను వెల్లడించింది. ఈ లిస్టులో అంబానీ పిల్లలు ఇషా, ఆకాష్ ఉన్నారు. ఈ జాబితాలో మొత్తం 150 మంది 35 ఏళ్లలోపు వయసున్న పారిశ్రామిక వేత్తలు ఉన్నారు.ఓ వైపు ఆసియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ ఒకరుగా ఉన్నారు. ఇప్పుడు అంబానీ కుమార్తె ఇషా 2024 హురున్ ఇండియా అండర్ 35 జాబితాలో అతి పిన్న వయస్కురాలైన మహిళా పారిశ్రామికవేత్తగా నిలిచారు. ఈ జాబితాలో అంబానీ కుమారుడు ఆకాష్ కూడా ఉన్నారు.ముకేశ్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ 'రిలయన్స్ రిటైల్' మేనేజింగ్ డైరెక్టర్. ముంబైలో పుట్టి పెరిగిన ఇషా ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్లోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని పొందింది.ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్ చరిత్రలో గూగుల్ శకం.. అనన్య సామాన్యంహురున్ ఇండియా అండర్-35 జాబితాలో ఇతరులు2024 హురున్ ఇండియా అండర్-35 జాబితాలో అనెరి పటేల్, అనీషా తివారీ, అంజలి మర్చంట్తో సహా మరో ఏడుగురు మహిళా వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. వీరి వయసు 33, 34 మధ్య ఉంది. వీరందరూ కుటుంబ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఈ జాబితాలో షేర్చాట్ కో ఫౌండర్ అంకుష్ సచ్దేవా అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. మామా ఎర్త్ సీఈఓ 35 సంవత్సరాల వయస్సు గల గజల్ అలగ్ కూడా ఉన్నారు. -
Juhi Chawla: సిరిలో బెస్ట్
‘ఖయామత్ సే ఖయామత్ తక్’ సినిమాతో దేశానికి పరిచయం అయిన జూహీ చావ్లా మన దేశంలో అత్యంత సిరి గల మహిళల్లో ఒకరిగా నిలిచింది.తాజాగా విడుదలైన ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024’ ప్రకారం మనదేశంలో అత్యధిక సంపద కలిగిన మొదటి పదిమంది స్త్రీలలో జూహీ 6 వస్థానంలో ఉంది. సినిమా, క్రికెట్ వంటి రంగాల్లో పెట్టిన పెట్టుబడి ఆమెను ఈ స్థానానికి చేర్చింది. ఆమె పరిచయం, మిగిలిన స్థానాల్లో ఉన్న ఇతరుల గురించి కథనం.సంపద మగవాడి సొత్తు అనుకునే రోజుల నుంచి సంపద సృష్టించే మహిళా ΄ారిశ్రామికవేత్తల వరకూ కాలం మారింది. మారిందనడానికి వివిధ సూచికలు సాక్ష్యం పలుకుతున్నాయి. మన దేశంలో సంపన్నుల జాబితాను ఏ ఏటికా ఏడు వెల్లడి చేసే ‘హురున్ ఇండియా’ సంస్థ 2024కు గాను విడుదల చేసిన సంపన్నుల జాబితాలో స్త్రీలు పెద్ద సంఖ్యలో ఉండటం సంతోషం కలిగించే సంగతి. పురుషుల్లో అదానీ 1,161,800 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే అంబాని 1,014,700 కోట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. అయితే స్త్రీలలో జోహొ గ్రూప్కు చెందిన రాధా వెంబు 47,500 కోట్లతో మొదటి స్థానంలో ఉంటే, నైకా గ్రూప్కు చెందిన ఫాల్గుణి నాయక్ 32,200 కోట్లతో రెండోస్థానంలో ఉంది. పురుషులతో ΄ోల్చితే స్త్రీల దగ్గర సగం సంపదే ఉన్నా స్త్రీలు ఆ స్థాయిలో వ్యా΄ార సంపదను సృష్టించడం పెద్ద ఘనత. మరో ఆసక్తి కలిగించే అంశం ఏమిటంటే సంపద ఎక్కువ కలిగిన స్త్రీలలో జూహి చావ్లా 4,600 కోట్లతో ఆరవ స్థానంలో నిలవడం.సినిమా రంగంలో 2వ స్థానం‘హురున్ ఇండియా రిచ్లిస్ట్ 2024’ వివిధ కేటగిరీలలో సంపద కలిగిన వారి ర్యాంకులను ఇచ్చింది. సినిమా రంగానికి సంబంధించి షారుక్ ఖాన్ 7,300 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా జూహి చావ్లా రెండో స్థానంలో ఉండటం విశేషం. మూడో స్థానంలో హృతిక్ రోషన్ (2000 కోట్లు), ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ (1200 కోట్లు), కరణ్ జోహార్ (1400 కోట్లు) ఉన్నారు. జూహి చావ్లా దాదాపుగా సినిమాలలో నటించక΄ోయినా బాలీవుడ్లో భారీ ΄ారితోషికం తీసుకునే నటీమణులు ప్రస్తుతం ఉన్నా ఆమె సంపద భారీగా కలిగి ఉండటం ఆమెలోని ఆర్థిక దృష్టికి నిదర్శనం.ఇన్కమ్టాక్స్ ఆఫీసర్ కూతురుజూహీ చావ్లా అంబాలా (హర్యాణా)లో పుట్టి ముంబైలో పెరిగింది. తండ్రి ఇన్కంటాక్స్ ఆఫీసరు. తల్లి గృహిణి. బాల్యంలో నటి ముంతాజ్, తర్వాత శ్రీదేవిలను చూసి సినిమాల్లోకి రావాలనుకున్న జూహీ మోడల్గా పని చేసింది. 1984లో ‘మిస్ ఇండియా’ కిరీటం సాధించడంతో ఆమెను బాలీవుడ్ గుర్తించింది. అదే సంవత్సరం ఆమె నటించిన మొదటి సినిమా ‘సల్తనత్’ భారీ అపజయం మూటగట్టుకుంటే వేషాలు లేని జూహి దక్షిణాదికి వచ్చి కన్నడ సినిమా ‘ప్రేమలోక’ (1987) చేసింది. ఆ సినిమాతో ఆమె పేరు మార్మోగింది. 1988లో ‘ఖయామత్ సే ఖయామత్ తక్’లో నటించాక ఆమె వెనక్కు తిరిగి చూసే పని లేకుండా΄ోయింది.షారూక్ ఖాన్తో ్ర΄÷డక్షన్ హౌస్‘రాజూ బన్గయా జంటిల్మెన్’ సినిమాలో షారూక్, జూహీ చావ్లా స్నేహం మొదలయ్యింది. ఆ స్నేహం బలపడి నేటికీ కొనసాగుతూ ఉంది. మొదట అతనితో కలిసి ‘డ్రీమ్స్ అన్లిమిటెడ్’ అనే ్ర΄÷డక్షన్ సంస్థ స్థాపించి ‘ఫిర్ భీ దిల్ హై హిందూస్థానీ’, ‘అశోక’, ‘చల్తే చల్తే’ సినిమాలు తీసింది జూహీ. ఆ తర్వాత షారూక్ స్థాపించిన రెడ్ చిల్లిస్ సంస్థలో భాగస్వామి అయ్యింది. ఐíపీఎల్ మొదలయ్యాక షారూక్తో కలిసి కోల్కటా నైట్రైడర్స్కు సహ భాగస్వామి అయ్యింది.వ్యా΄ారవేత్తతో వివాహంజూహీ చావ్లా ‘మెహతా గ్రూప్’ అధినేత జయ్ మెహతాను 1995లో వివాహం చేసుకుంది. జయ్ మెహతా మొదటి భార్య సుజాతా బిర్లా విమాన ప్రమాదంలో మరణించడంతో జయ్ మెహత్ ఈమెను వివాహం చేసుకున్నాడు. ఆఫ్రికా దేశాలలో సిమెంట్, ΄్లాస్టిక్ తదితర పరిశ్రమలు ఉన్న జయ్ మెహతా వ్యా΄ారాల్లో కూడా జూహీ భాగస్వామి కావడంతో ఆమె సంపద మెల్ల మెల్లగా పెరుగుతూ ΄ోయింది. అయితే ఈ క్రమంలో ఆమె ఎన్నో ఆటు΄ోట్లు ఎదుర్కొంది. సొంత అన్న, చెల్లి ఇద్దరూ మరణించారు. ఒక దశలో మాధురి దీక్షిత్ వంటి స్టార్ల హవా వల్ల సినిమాలు లేని స్థితి. ‘అయినా నీ లోపల ఉన్న ఆత్మిక శక్తిని ఉద్దీపనం చేయగలిగితే నువ్వు ముందుకు ΄ోగలవు’ అంటుంది జూహీ.మన దేశ మహిళా శ్రీమంతులురాధా వెంబు (మొదటి స్థానం – 47,500 కోట్లు): సోదరులు శ్రీధర్ వెంబు, శేఖర్ వెంబుతో కలిసి రాధా వెంబు స్థాపించిన ‘జోహో’ సంస్థ భారీ విజయాలు సాధిస్తుండటంతో ఆమె సంపద పెరిగింది. జోహో అందరికంటే ఎక్కువ వాటా ఉన్న రాధాకే. చెన్నైలో పుట్టి పెరిగిన రాధ ఐఐటీ మద్రాసులో చదువుకుంది. పబ్లిసిటీకి దూరంగా ఉండటాన్ని ఇష్టపడుతుంది. ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు.ఫాల్గుణి నాయర్ (రెండవ స్థానం – 32,200 కోట్లు): ఆన్లైన్ బ్యూటీ బ్రాండ్కు ఏమాత్రం అనుకూలత లేని కాలంలో ‘నైకా’ స్థాపించి ఘన విజయం సాధించింది ఫాల్గుణి నాయర్. నైకా ్ర΄ారంభించేనాటికి ఆమెకు 50 ఏళ్లు. ఐ.ఐ.ఎం. అహ్మదాబాద్లో చదవడం వల్ల ఆమెకు వ్యా΄ారసూత్రాల మీద పట్టు వచ్చింది. సౌందర్య సాధనాల పట్ల ఉన్న ఆసక్తి వినియోగదారులకు ఎలాంటివి కావాలో తెలిసేలా చేసింది. ఫాల్గుణి అమ్మే ఉత్పత్తులు ఆమెకు సంపద తెచ్చిపెడుతున్నాయి.జయశ్రీ ఉల్లాల్ (మూడవ స్థానం – 32,100 కోట్లు): లండన్ లో పుట్టి ఢిల్లీలో చదువుకుని అమెరికాలో స్థిరపడిన జయశ్రీ ఉల్లాల్ ఇం/టనీరింగ్లో ఎం.ఎస్ చేసి ‘అరిస్టా’ అనే క్లౌడ్ నెట్వర్కింగ్ కంపెనీని స్థాపించి బిలియనీర్గా ఎదిగింది.కిరణ్ మజుందార్ (నాలుగో స్థానం – 29,000 కోట్లు): తన బ్యాంకు ఖాతాలో ఉన్న పది వేల రూ΄ాయల పెట్టుబడితో ఒక కారుషెడ్డులో మొదలైన బయోకాన్ ఇండియా సంస్థ కిరణ్ మజుందార్ను ఇవాళ ప్రపంచవ్యాప్త గుర్తింపుతో, సంపదతో నిలబెట్టింది. నాడు మహిళలు ఎవరూ చదవని విభాగం ‘ఫర్మంటేషన్’లో పి.జి చేసిన కిరణ్ తొలత ఎంజైమ్స్ తయారు చేస్తూ నేడు మానవాళికి మేలు చేసే జీవ రక్షకాల తయారీ వరకూ చేరుకుంది. కిరణ్ ఎప్పుడూ అపర కుబేరుల టాప్ లిస్ట్లో ఉంటూనే ఉంటుంది.నేహా నార్ఖెడె (ఐదో స్థానం – 4,900 కోట్లు): కాన్ఫ్లుయెంట్ అనే క్లౌడ్ కంపెనీకి కో ఫౌండర్గా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఉన్న నేహా నార్ఖెడె ఇందిరా గాంధీ, కిరణ్ బేడీ వంటి మహిళల నుంచి స్ఫూర్తి ΄÷ంది జీవితంలో ఏదైనా సాధించాలనుకుంది. పూణె నుంచి అమెరికా వెళ్లి చదువుకుని 2014లో కాన్ఫ్లుయెంట్ను స్థాపించింది. -
తెలుగు కుబేరులు! (ఫొటోలు)
-
సచిన్, కోహ్లి కాదు!.. అత్యంత సంపన్న భారత క్రికెటర్ ఇతడే!
భారత్లో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల్లో క్రికెటర్లే అగ్రస్థానంలో ఉంటారు. వారిలోనూ టీమిండియా లెజెండరీ ఆటగాడు, వంద సెంచరీల వీరుడు సచిన్ టెండుల్కర్, దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రన్మెషీన్ విరాట్ కోహ్లి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. అటు ఆట ద్వారా.. ఇటు పలు ప్రఖ్యాత బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించడం ద్వారా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ ముగ్గురు స్టార్లు ఒక్కొక్కొరు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టారని వినికిడి. మరి వీరికంటే ధనవంతుడైన భారత క్రికెటర్ మరొకరు ఉన్నారు. అతడి ఒక్కడి సంపాదనే వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. లక్షల కో ట్ల సంపదకు అతడు వారసుడు. బిజినెస్ టైకూన్ కుమారుడుదేశంలోనే.. కాదు కాదు.. బహుశా ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటర్ అయిన అతడు మరెవరో కాదు ఆర్యమన్ విక్రమ్ బిర్లా. దిగ్గజ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు. జూలై 9, 1997లో ముంబైలో జన్మించాడు. పుట్టుకతోనే రిచ్కిడ్ అయిన ఆర్యమన్.. క్రికెటర్గా తొలి అడుగులు వేశాడు. మధ్యప్రదేశ్ తరఫున 2017- 18లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. లెఫ్టాండ్ బ్యాటర్ అయిన ఆర్యమన్.. లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 9 మ్యాచ్లు ఆడి 414 పరుగులు సాధించాడు ఆర్యమన్ బిర్లా. రూ. 30 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్స్ఇందులో ఓ శతకం, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో నాలుగు మ్యాచ్లు ఆడిన అతడు 36 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఆర్యమన్ బిర్లా.. 2018 ఐపీఎల్ వేలంలోకి రాగా.. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా 2019లోనే క్రికెట్కు కూడా దూరమయ్యాడు ఆర్యమన్. కుటుంబ వ్యాపారాలతో బిజీ అయ్యాడు. తన సోదరి అనన్య బిర్లాతో కలిసి ఆదిత్య బిర్లా గ్రూప్నకు చెందిన ఓ కంపెనీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. సొంతంగా ముంబైలో ఓ క్లబ్ కూడా కలిగి ఉన్న ఆర్యమన్.. పెంపుడు జంతువు ఓ స్టోర్ కూడా నడుపుతున్నాడు.రెండు లక్షల కోట్లకు పైగా సంపదహురున్ విడుదల చేసిన దేశీయ అత్యంత ధనవంతులు జాబితాలో కుమార్ మంగళం బిర్లా చోటు దక్కించుకోవడంతో.. ఆర్యమన్ బిర్లా పేరు మరోసారి ఇలా తెరపైకి వచ్చింది. ఇక హురున్ రిచ్ లిస్టులో గౌతమ్ అదానీ 11.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ముకేశ్ అంబానీ 10.14 లక్షల కోట్ల నికర ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఆరోస్థానంలో ఉన్న కుమార్ మంగళం బిర్లా 2,35,200 కోట్ల నికర సంపద కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఆర్యమన్ నెట్వర్త్ డెబ్బై వేల కోట్లకు పైగానే ఉంటుందని వ్యాపారవర్గాలు అంటున్నాయి.చదవండి: క్రికెటర్ సంచలన నిర్ణయం.. 26 ఏళ్లకే ఆటకు వీడ్కోలు! -
‘ధన రాశి’ ఇదే.. అత్యధిక సంపన్నులు వీళ్లే..
దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను హరున్ ఇండియా ఇటీవల విడుదల చేసింది. జులై 31 నాటికి రూ.1000 కోట్లు, అంతకుమించిన సంపద కలిగిన వారితో రూపొందించిన ఈ జాబితా ప్రకారం.. కర్కాటక రాశిలో జన్మించినవారి సంపదే ఈ ఏడాది అత్యధికంగా వృద్ధి చెందింది. ఇక మిగిలిన రాశుల స్థితిగతులేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి...తాజా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం.. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఇది ఉత్తమ సంవత్సరం. తరువాత మిథునం, సింహ రాశి ఉన్నాయి. కర్కాటక రాశి వ్యక్తుల సంచిత సంపదలో 84 శాతం పెరుగుదలను చూసింది. మిథున రాశి వారి సంపద 77 శాతం వృద్ధితో రెండో స్థానంలో ఉంది. మూడవ స్థానంలో సింహరాశి ఉంది. వీరి సంచిత సంపద 68 శాతం పెరిగింది.అదే విధంగా 64 శాతం సంపద పెంపుతో ధనుస్సు రాశి, 61 శాతం వృద్ధితో తులారాశి నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఇక మకరం సంచిత సంపదలో 58 శాతం పెరుగుదలను చూసింది. తరువాత మీన రాశి 46 శాతం వృద్ధిని సాధించింది. కుంభం, కన్య రాశులు 39 శాతం సంపద వృద్ధితో ఎనిమిదవ స్థానాన్ని పంచుకున్నాయి. ఇక మేషం, వృశ్చికం, వృషభ రాశులు వరుసగా 34 శాతం, 33 శాతం, 32 శాతం సంపద వృద్ధితో చివరి స్థానాలకు పరిమితమయ్యాయి.మిథునం ఇలా అగ్రస్థానంమొత్తం మీద, సంపద వృద్ధి పరంగా కర్కాటక రాశి ముందంజలో ఉంది. కానీ సంపన్నుల సంఖ్య విషయంలో మిథునం అగ్రస్థానంలో ఉంది. జాబితాలోని ధనవంతులలో 9.9 శాతం మంది ఈ రాశి వారే. వీరిలో కుమార్ మంగళం బిర్లా, ఎల్ఎన్ మిట్టల్ వంటి ప్రముఖులు ఉన్నారు.(Disclaimer: వ్యక్తుల విజయం, సంపాదన రాశుల బట్టి కాక, వారి కృషిని బట్టి ఉంటాయి. దీర్ఘకాలిక లక్ష్యం, అంకితభావంతో కృషి చేసేవారు తమ రంగంలో తప్పక విజయం సాధిస్తారు.) -
పెచ్చురిల్లుతున్న ఆర్థిక అంతరాలు!
ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటోంది. యూఎస్, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ఇండియా జీడీపీ దూసుకుపోతోంది. కానీ ప్రజల ఆదాయాలు, వారి సంపద మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ఇటీవల హురున్ ఇండియా దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది. జులై 31 నాటికి రూ.1,000 కోట్ల సంపద కలిగిన వారిని పరిగణనలోకి తీసుకుని దీన్ని రూపొందించారు. దాని ప్రకారం ఈ ఏడాది దేశంలోని కుబేరుల సంఖ్య 220 పెరిగి 1,539కు చేరింది. వీరి వద్ద రూ.159 లక్షల కోట్ల సంపద మూలుగుతుంది. ఏడాది ప్రాతిపదికన వీరి ఆస్తులు 46 శాతం వృద్ధి చెందాయి. దేశంలో దాదాపు 140 కోట్ల జనాభా ఉంది. కేవలం 1539 మంది వద్దే ఇన్ని కోట్ల రూపాయలు పోగవ్వడం సామాజిక అంశాతికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెరుగుతున్న ఆర్థిక అసమానతలు బ్రిటిష్ కాలంలో కంటే ఇప్పుడు ఎక్కువయ్యాయి. కొన్ని నివేదికల ప్రకారం దేశంలోని ఒక శాతం జనాభా చేతుల్లోకి 40.1 శాతం సంపద చేరుతుంది. వివిధ వర్గాల ఆదాయ సంపదల్లో అసమానతలు ఉన్నప్పటికీ, అందరి వాస్తవ ఆదాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ప్రజల ఆదాయాలతో పాటే వాటి మధ్య అంతరాలు అధికమవుతున్నాయి. అందుకు 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలే కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని అమలు చేయకముందు వరకు దేశ జీడీపీ మూడు శాతం వద్దే ఆగిపోయింది. ఈ సంస్కరణల తర్వాత జీడీపీ 6-8 శాతం పెరిగింది. అయినా గరిష్ఠ సంపద తక్కువ మంది చేతుల్లోకే వెళుతుంది.భారత్తోపాటు అనేక దేశాల్లో ఈ ఆర్థిక అసమానతలకు సంబంధించిన సమస్యలు ఎక్కవవుతున్నాయి. ఇవి మరింత పెరిగితే సామాజిక అశాంతి నెలకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ అంతరాలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అత్యంత ధనవంతులపై విధించే పన్నులు పెంచాలని చెబుతున్నారు. కుబేరులకు వారసత్వంగా వచ్చే సంపదపై పన్ను విధించాలంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు.. ఇందుకు సహకరించాలని కోరుతున్నారు.ఇదీ చదవండి: అంబానీను దాటేసిన అదానీ..దురదృష్టవశాత్తు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలను పరోక్షంగా నడిపించేది ధనవంతులే. దాంతో చట్ట సభల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ధైర్యం చేయడానికి ప్రజా ప్రతినిధులు సహకరించడం లేదు. కానీ ఆర్థిక అసమానతల వల్ల భవిష్యత్తులో రాబోయే సామాజిక అశాంతిని దృష్టిలో ఉంచుకుని ఈమేరకు పటిష్ట చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
Hurun Rich List 2024: అంబానీని మళ్లీ దాటేసిన అదానీ
న్యూఢిల్లీ: హిండెన్బర్గ్ రీసెర్చ్ దెబ్బ నుంచి వేగంగా కోలుకున్న పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ (62) దేశీయంగా అత్యంత సంపన్నుల జాబితాలో మరోసారి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీని (67) అధిగమించి అగ్రస్థానం దక్కించుకున్నారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద ఏకంగా 95 శాతం ఎగిసి రూ. 11.6 లక్షల కోట్లకు చేరింది. హురున్ గురువారం విడుదల చేసిన సంపన్నుల జాబితా– 2024లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023 నివేదికలో అదానీ సంపద 57 శాతం క్షీణించి రూ. 4.74 లక్షల కోట్లకు పడిపోయింది.అప్పుడు అంబానీ సంపద రూ. 8.08 లక్షల కోట్లుగా నమోదైంది. తాజాగా అంబానీ మొత్తం సంపద 25 శాతం పెరిగి రూ. 10.14 లక్షల కోట్లకు చేరడంతో ఆయన రెండో స్థానంలో నిల్చారు. తాజా జాబితాలో జూలై 31 నాటి వరకు రూ. 1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న భారతీయ సంపన్నులను పరిగణనలోకి తీసుకున్నారు. ఈసారి కుబేరుల సంఖ్య 220 మేర పెరిగి 1,539కి చేరింది. మొత్తం సంపద 46 శాతం వృద్ధి ెచంది రూ. 159 లక్షల కోట్లకు చేరింది. ఇది సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్ దేశాల సంయుక్త జీడీపీ కన్నా అధికం కాగా భారతదేశ జీడీపీలో సగానికన్నా అధికం కావడం గమనార్హం. భారత్లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీరు నమోదయ్యారు. మరిన్ని విశేషాలు.. ⇒ హురున్ టాప్–5 జాబితాలో హెచ్సీఎల్ అధిపతి శివ్ నాడార్ (రూ. 3.14 లక్షల కోట్లు) మూడో స్థానంలో, సీరమ్ ఇనిస్టిట్యూట్కి చెందిన సైరస్ పూనావాలా (రూ. 2.89 లక్షల కోట్లు) ఒక స్థానం తగ్గి నాలుగో స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి రూ. 2.50 లక్షల కోట్ల సంపదతో ఆరు స్థానం నుంచి అయిదో స్థానానికి చేరారు. ⇒ 7,300 కోట్ల సంపదతో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తొలిసారిగా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు.టాప్–3లో హైదరాబాద్.. 17 మంది కొత్త కుబేరులు జత కావడంతో హైదరాబాద్ తొలిసారిగా బెంగళూరును అధిగమించింది. 104 మంది సంపన్నులతో సంఖ్యాపరంగా మూడో స్థానంలో నిలి్చంది. తెలంగాణలో 109 మంది, ఆంధ్రప్రదేశ్లో 9 మంది అత్యంత సంపన్నులు ఉన్నారు. 396 మంది కుబేరులతో ముంబై అగ్రస్థానంలో, 217 మందితో న్యూఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అత్యంత సంపన్న తెలుగువారిలో మురళి దివి (దివీస్), సి.వెంకటేశ్వర రెడ్డి –ఎస్.సుబ్రహ్మణ్యం రెడ్డి (అపర్ణ కన్స్ట్రక్షన్స్), జీఎం రావు–కుటుంబం (జీఎంఆర్), హర్షా రెడ్డి పొంగులేటి (రాఘవ కన్స్ట్రక్షన్స్), పి.పి.రెడ్డి–పీవీ కృష్ణా రెడ్డి (ఎంఈఐఎల్), బి.పార్థసారథి రెడ్డి–కుటుంబం (హెటిరో ల్యాబ్స్), ప్రతాప్ రెడ్డి–కుటుంబం (అపోలో హెల్త్కేర్), పీవీ రామ్ప్రసాద్ రెడ్డి (అరబిందో ఫార్మా) తదితరులు ఉన్నారు. -
అంబానీను దాటేసిన అదానీ.. హురున్ రిచ్ లిస్ట్ విడుదల
దేశంలో అత్యంత సంపన్నుల జాబితాను హురున్ ఇండియా విడుదల చేసింది. అందులో గౌతమ్ అదానీ(62) మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ముఖేశ్ అంబానీ రెండో స్థానానికి చేరారు. ఆ లిస్ట్లో బాలివుడ్ స్టార్ షారుఖ్ఖాన్కు తొలిసారి చోటు దక్కింది.ఈ సందర్భంగా హురున్ ఇండియా వ్యవస్థాపకులు అనస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ..‘రూ.11.6 లక్షల కోట్ల సంపదతో గౌతమ్ అదానీ(62) తన కుటుంబం హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024లో టాప్లో నిలిచింది. గత ఏడాది భారత్లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త బిలియనీర్ తయారయ్యాడు. చైనా బిలియనీర్ల సంఖ్య 25 శాతం పడిపోయింది. భారత్లో వీరి సంఖ్య 29% పెరిగింది. దాంతో దేశంలో రికార్డు స్థాయిలో బిలియనీర్ల సంఖ్య 334కు చేరింది. ఆసియా సంపద సృష్టిలో భారత వాటా అధికమవుతోంది’ అని తెలిపారు.హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 నివేదిక ప్రకారం..1. గౌతమ్ అదానీ, కుటుంబం: రూ.11.6 లక్షల కోట్లు2. ముఖేష్ అంబానీ, కుటుంబం: రూ.10.1 లక్షల కోట్లు 3. శివ్ నాడార్, కుటుంబం: రూ.3.1 లక్షల కోట్లు4. సైరస్ పునావాలా, కుటుంబం: రూ.2.89 లక్షల కోట్లు5. దిలిప్ సింఘ్వీ: రూ.2.49 లక్షల కోట్లు.6. కుమార్ మంగళం బిర్లా: రూ.2.35 లక్షల కోట్లు.7. గోపిచంద్ హిందుజా, కుటుంబం: రూ.1.92 లక్షల కోట్లు.8. రాధాకృష్ణ దమాని, కుటుంబం: రూ.1.90,900 కోట్లు.9. అజిమ్ ప్రేమ్జీ, కుటుంబం: రూ.1.90,700 కోట్లు.10. నిరజ్ బజాజ్, కుటుంబం: రూ.1.62 లక్షల కోట్లు2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో తక్కువ వయసు ఉన్న వారిగా జెప్టో క్విక్ కామర్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు కైవల్య వోహ్రా(21) నిలిచారు.షారుఖ్ ఖాన్కు చోటుమొదటిసారిగా బాలివుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో చోటు సంపాదించారు. ఐపీఎల్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్లో తాను వాటాలు కలిగి ఉండడంతో వాటి విలువ పెరిగింది. దాంతో మొత్తంగా రూ.7,300 కోట్లతో ఈ లిస్ట్లో స్థానం సంపాదించారు. -
బార్ల్కేస్ హురున్ లిస్ట్.. బిజినెస్లో ఈ ఫ్యామిలీలదే హవా
దేశంలోని వ్యాపార కుటుంబాల్లో అంబానీ ఫ్యామిలీ హవా చాటింది. 2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యూబుల్ ఫ్యామిలీ బిజినెస్ల జాబితా ప్రారంభ ఎడిషన్లో అగ్రస్థానాన్ని పొందింది. అంబానీ కుటుంబం విలువ 309 బిలియన్ డాలర్లు (రూ.25.75 లక్షల కోట్లు). ఇది భారతదేశ జీడీపీలో దాదాపు 10 శాతానికి సమానం.బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్, హురున్ ఇండియా 2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాను విడుదల చేశాయి. ఈ లిస్ట్ విలువ పరంగా దేశంలోని అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాలకు ర్యాంక్ ఇచ్చింది. వ్యవస్థాపక కుటుంబం నుంచి తదుపరి తరం సభ్యులు వ్యాపార నిర్వహణలో లేదా దాని బోర్డులో ఉంటున్న కుటుంబ వ్యాపారాలను మాత్రమే ఈ జాబితాలోకి తీసుకున్నారు. 2024 మార్చి 20 నాటికి ఈ విలువలను లెక్కించారు.ఈ జాబితాలో బజాజ్ కుటుంబం మొత్తం రూ.7.13 లక్షల కోట్ల వ్యాపార విలువతో రెండో స్థానాంలో ఉండగా బిర్లా కుటుంబం రూ.5.39 లక్షల కోట్ల విలువతో మూడవ స్థానాన్ని ఆక్రమించింది. ఇక మొదటి తరం వ్యవస్థాపక కుటుంబాల ప్రత్యేక కేటగిరీలో అదానీ కుటుంబం రూ.15.45 లక్షల కోట్ల విలువతో ముందంజలో ఉంది. ఆ తర్వాత రూ.2.37 లక్షల కోట్ల విలువతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహణలో పేరుగాంచిన పూనావాలా కుటుంబం ఉంది.2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యూయబుల్ ఫ్యామిలీ బిజినెస్ల ఉమ్మడి విలువ రూ.130 లక్షల కోట్లు. ఇది స్విట్జర్లాండ్, యూఏఈ వంటి దేశాల జీడీపీ కంటే అధికం. ఈ లిస్ట్లో మొదటి మూడు కుటుంబ వ్యాపారాల విలువ మాత్రమే రూ.46 లక్షల కోట్లు. ఇది సింగపూర్ జీడీపీకి సమానం. -
30 ఏళ్ల వయసున్న టాప్ వ్యాపారస్థులు వీరే..
ముప్పై ఏళ్లలోపు యువతకు ఎక్కువగా స్నేహితులతో గడపాలని, మంచి బైక్పై చక్కర్లు కొట్టాలని, మంచి దుస్తులు కొనాలని.. ఉంటుంది. చాలా కొద్దిమంది మాత్రం సమయం వృథా చేయకుండా జీవితంలో స్థిరపడాలనుకుంటారు. అయితే అది అంత సులభమైన విషయమేమీ కాదు. కానీ, ఆ వయసులోనే సొంతంగా ఒక కంపెనీ పెట్టి విజయవంతంగా నడుపుతూ వందల కోట్లకు అధిపతి కావడం అనేది అనూహ్యమైన విజయం. తాజాగా హురున్ ఇండియా అలాంటి 100 మంది యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితా విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 5 మంది ఉన్నారు. ‘హురున్ ఇండియా టాప్ 100 అండర్ 30 ఎంటర్ప్రెన్యూర్స్ వాచ్ లిస్ట్ 2023’ పేరుతో విడుదల చేసిన ఈ జాబితాలో ముంబయికి చెందిన జెప్టో క్విక్ కామర్స్ సంస్థ వ్యవస్థాపకులైన కైవల్య వోహ్రా (21 ఏళ్లు), ఆదిత్ పలిఛ (22 ఏళ్లు)లకు అగ్రస్థానం దక్కింది. హైదరాబాద్కు చెందిన ఎడ్టెక్ సంస్థ, భాంజు వ్యవస్థాపకుడు నీలకంఠ భాను ప్రకాష్ (24 ఏళ్లు) ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ జాబితాలో మొత్తం అయిదుగురు మహిళలు ఉండగా.. ‘స్కిల్మ్యాటిక్స్’కు చెందిన దేవాన్షి కేజ్రీవాల్ (27 ఏళ్లు) అందరి కంటే చిన్నవారు. 8 మంది యువ వ్యాపారవేత్తలు స్పేస్టెక్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జాబితాలో అధికంగా సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) కంపెనీల వ్యవస్థాపకులు 19 మంది ఉన్నారు. ఫిన్టెక్, ఎడ్టెక్ రంగాలకు చెందిన 11 కంపెనీల ప్రతినిధులకు ఇందులో చోటు దొరికింది. బెంగళూరుకు చెందిన కంపెనీలు/ వ్యవస్థాపకుల సంఖ్య ఈ జాబితాలో అధికంగా ఉంది. తదుపరి స్థానాల్లో ముంబయి, దిల్లీకి చెందిన వారు ఉన్నారు. బెంగళూరు నుంచి 10 మంది, ముంబయి నుంచి 9 మంది, దిల్లీ నుంచి 8 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఉన్నారు. ఈ జాబితాలో స్థానం సంపాదించిన యువ వ్యాపారవేత్తల్లో ఐఐటీ-రూర్కీ పట్టభద్రులైన 8 మంది ఉండటం గమనార్హం. ఐఐటీ- కాన్పూర్ నుంచి ఏడుగురు, ఐఐటీ- దిల్లీ నుంచి ఆరుగురు, ఐఐటీ- బాంబే, మద్రాస్ నుంచి అయిదుగురు చొప్పున ఉన్నారు. మనదేశంలోని యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల శక్తి, సామర్థ్యాలను ‘హురున్ ఇండియా టాప్ 100 అండర్ 30 ఎంటర్ప్రెన్యూర్స్ వాచ్ లిస్ట్ 2023’ ప్రతిబింబిస్తోందని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనస్ రహమాన్ జునాయిద్ వివరించారు. ప్రస్తుత వ్యాపార ప్రపంచంలో వినూత్న వ్యాపార వ్యూహాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించగల సామర్థ్యం ఉన్న యువ వ్యాపారవేత్తల అవసరాలు ఎంతో అధికంగా ఉన్నట్లు తెలిపారు. పెట్టుబడిదారులు, ప్రభుత్వాలు, బహుళజాతి వ్యాపార సంస్థలు ఇటువంటి సత్తా ఉన్న యువ వ్యాపారవేత్తలు, సంస్థల కోసం అన్వేషిస్తున్నట్లు విశ్లేషించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అయిదుగురు ఔత్సాహిక వ్యాపారవేత్తలు పిన్న వయసు లోనే మంచి విజయాలు నమోదు చేసి హురున్ జాబితాలో స్థానం సంపాదించారు. హైదరాబాద్ నుంచి నీలకంఠ భాను ప్రకాష్ (24 ఏళ్లు, భాంజు, ఎడ్యుటెక్ కంపెనీ)తో పాటు, శశాంక్ రెడ్డి గుజ్జుల (27 సంవత్సరాలు, నెక్ట్స్వేవ్, ఎడ్యుటెక్ కంపెనీ), రాకేష్ మున్ననూరు (29 ఏళ్లు, విజిల్డ్రైవ్, సాస్ కంపెనీ), అనురాగ్ మాలెంపాటి (30 ఏళ్లు, లీప్ ఇండియా ఫుడ్, లాజిస్టిక్స్ సేవల కంపెనీ) ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలానికి చెందిన అనుపమ్ పెడర్ల (29 ఏళ్లు, నెక్ట్స్వేవ్, ఎడ్టెక్ కంపెనీ)కు సైతం ఈ జాబితాలో స్థానం దక్కింది. ఇదీ చదవండి: డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే.. -
దాతృత్వంలో శివ్ నాడార్ టాప్
ముంబై: విరాళాలివ్వడంలో ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివ్ నాడార్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. 2023లో ఏకంగా రూ. 2,042 కోట్లు విరాళమిచ్చి ఎడెల్గివ్ హురున్ ఇండియా 2023 జాబితాలో అగ్రస్థానంలో నిల్చారు. గతేడాది ఇచి్చన రూ. 1,161 కోట్లతో పోలిస్తే ఇది 76 శాతం అధికం. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ రూ. 1,774 కోట్లతో (గతేడాదితో పోలిస్తే 267 శాతం అధికం) రెండో స్థానంలోనూ, రూ. 376 కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ మూడో స్థానంలో ఉన్నారు. అంబానీ విరాళాలు గతేడాదితో పోలిస్తే 8 శాతం తగ్గాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార మంగళం బిర్లా రూ. 287 కోట్లతో నాలుగో స్థానంలో, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రూ. 285 కోట్లతో (50 శాతం అధికం) ఈ జాబితాలో అయిదో స్థానంలో ఉన్నారు. ఇటీవలి హురున్ కుబేరుల జాబితా ప్రకారం అంబానీ సంపద రూ. 8.08 లక్షల కోట్లుగాను, అదానీది రూ. 4.74 లక్షల కోట్లు, నాడార్ సంపద రూ. 2.28 లక్షల కోట్లుగాను ఉంది. సంపద పెరిగే కొద్దీ సంపన్న కుటుంబాలు .. అట్టడుగు వర్గాల వారి కోసం ఆహారం, దుస్తులు, ఉపకార వేతనాలు మొదలైన దాతృత్వ కార్యకలాపాలకు విరాళాలిచ్చే ధోరణి పెరుగుతోందని హురున్ ఇండియా చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. లిస్టులో మొత్తం 119 మంది వ్యక్తులు, కుటుంబాలు ఉన్నాయి. మరిన్ని వివరాలు.. ► బజాజ్ కుటుంబంతో పాటు సైరస్ ఎస్ పూనావాలా, అదార్ పూనావాలా, రోహిణి నీలెకని వంటి వారు టాప్ 10లో నిల్చారు. మహిళల్లో నీలెకనితో పాటు అను ఆగా (థర్మాక్స్), లీనా గాంధీ తివారీ (యూఎస్వీ) కూడా ఉన్నారు. ► డిస్కౌంటు బ్రోకరేజీ జిరోధా సహ–వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఈ జాబితాలో అత్యంత పిన్న వయసు్కడు. కామత్ సోదరులు రూ. 110 కోట్లు విరాళమిచ్చారు. ► రూ. 150 కోట్ల విరాళంతో ఎల్అండ్టీ గౌరవ చైర్మన్ ఏఎం నాయక్ .. ప్రొఫెషనల్స్ జాబితాలో అగ్రస్థానంలో, ఓవరాల్ లిస్టులో 11వ స్థానంలో ఉన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు ఎవరంటే..
Hurun India Rich List: దేశవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాను 360 వన్ వెల్త్ అండ్ హురూన్ ఇండియా విడుదల చేసింది. దేశంలో అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ నిలిచారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఇందులో చోటు సంపాదించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గతేడాది టాప్లో నిలిచిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానంలోకి చేరారు. ఆగస్టు చివరి నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా భారత్లోని 138 నగరాల నుంచి మొత్తం 1319 మంది హురూన్ లిస్ట్లో చోటు దక్కించుకున్నారు. వీటిల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఉన్నారు. వీరిలో అయిదుగురు మహిళలకు స్థానం దక్కింది. మొత్తం అందరి సంపద విలువ ఏకంగా రూ.5.25 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే వీరి సంపద ఏకంగా 33 శాతం పెరగడం విశేషం. ఈ 105 మందిలో 87 మంది హైదరాబాద్ వారే కావడం గమనార్హం. కొత్తగా 33 మంది ఇందులో చోటు సంపాదించారు. వీరి ద్వారానే మొత్తం రూ.76 వేల కోట్లు జమైనట్లు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది బిలియనీర్లు ఉన్నారు. దివీస్ మురళి రూ. 55,700 కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్కు చెందిన పిచ్చి రెడ్డి రూ.37,300 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. మేధా సర్వో డ్రైవ్స్ నుంచి అయిదుగురు ఈ లిస్ట్లో ఉన్నారు. హెటెరో ల్యాబ్స్ జి.పార్థసారధి రెడ్డి కుటుంబం రూ.21,900 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. అరబిందో ఫార్మా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ రామ్ప్రసాద్ రెడ్డి రూ. 21,000 కోట్ల సంపద, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి కుటుంబం రూ.20,900 కోట్లు, మైహోం ఇండస్ట్రీస్ జూపల్లి రామేశ్వరరావు సంపద రూ.17,500 కోట్లుతో తరువాత స్థానాల్లో నిలిచారు. మహిళల్లో మహిమా దాట్ల మొదటి స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.5700 కోట్లు. -
భారత్ కుబేరుల్లో అంబానీ టాప్
ముంబై: పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా 360 వన్ వెల్త్ హురున్ ఇండియా సంపన్నుల జాబితా 2023లో అగ్రస్థానంలో నిల్చారు. రూ. 8.08 లక్షల కోట్ల సంపదతో ఆయన టాప్ ర్యాంకు దక్కించుకున్నారు. గత ఏడాది వ్యవధిలో అంబానీ సంపద స్వల్పంగా రెండు శాతం పెరిగింది. అటు మరో దిగ్గజం గౌతమ్ అదానీ రూ. 4.74 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానం దక్కించుకున్నారు. ఆయన సంపద 57 శాతం కరిగిపోయింది. అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాలు, షేర్లలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయంటూ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల దెబ్బతో అదానీ సంస్థల షేర్లు కుదేలవడం ఇందుకు కారణమని హురున్ ఎండీ, చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. ఆగస్టు 30 తేదీ ప్రాతిపదికగా హురున్ ఈ జాబితాను రూపొందించింది. ఈసారి లిస్టులో 138 నగరాలకు చెందిన 1,319 మంది కుబేరులకు చోటు దక్కింది. రూ. 2.78 లక్షల కోట్ల సంపదతో (36 శాతం వృద్ధి) సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా మూడో స్థానంలో, రూ. 2.28 లక్షల కోట్లతో (23 శాతం వృద్ధి) హెచ్సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివ్ నాడార్ ఆ తర్వాత ర్యాంకులో ఉన్నారు. గత ఏడాది వ్యవధిలో భారత్లో ప్రతి మూడు వారాలకు కొత్తగా ఇద్దరు బిలియనీర్లుగా ఎదిగారు. ప్రస్తుతం 259 మంది బిలియనీర్లు ఉన్నారు. గత 12 ఏళ్లలో వారి సంఖ్య 4.4 రెట్లు పెరిగింది. మరిన్ని విశేషాలు.. ►గోపిచంద్ హిందుజా (5), దిలీప్ సంఘ్వి (6), ఎల్ఎన్ మిట్టల్ (7), కుమార మంగళం బిర్లా (9), నీరజ్ బజాజ్ (10) టాప్ టెన్లో ఉన్నారు. ►డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ సంపద 18 శాతం క్షీణించి రూ. 1.43 లక్షల కోట్లకు పడిపోవడంతో ఆయన 8వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ►అసమానతలు పెరిగిపోతుండటంపై ఆందోళన నేపథ్యంలో ఏడాది వ్యవధిలో 51 మంది కుబేరుల సంపద రెట్టింపయ్యింది. అంతక్రితం ఏడాది వ్యవధిలో ఈ సంఖ్య 24గా నమోదైంది. ►నగరాలవారీగా చూస్తే 328 బిలియనీర్లతో ముంబై అగ్రస్థానంలో ఉంది. న్యూఢిల్లీ (199), బెంగళూరు (100), హైదరాబాద్ (87) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తొలిసారిగా టాప్ 20 నగరాల్లో తిరుప్పూర్ చోటు దక్కించుకుంది. ►ప్రైవేట్ ఈక్విటీ రంగం నుంచి తొలిసారిగా కేదార క్యాపిటల్కు చెందిన మనీష్ కేజ్రివాల్ చోటు దక్కించుకున్నారు. ఆయన సంపద రూ. 3,000 కోట్లు. ► ప్రెసిషన్ వైర్స్కు చెందిన మహేంద్ర రాఠిలాల్ మెహతా 94 ఏళ్ల వయస్సులో లిస్టులో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలా... టాప్ 100లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రూ. 55,700 కోట్ల సంపదతో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి 23వ ర్యాంకులో నిల్చారు. 196% సంపద వృద్ధితో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాకు చెందిన పీవీ పిచ్చిరెడ్డి (రూ. 37,300 కోట్లు), పీవీ కృష్ణారెడ్డి (రూ. 35,800 కోట్లు) వరుసగా 37, 41వ ర్యాంకుల్లో ఉన్నారు. హెటిరో గ్రూప్ చైర్మన్ బి. పార్థసారథి రెడ్డి కుటుంబం రూ. 21,900 కోట్ల సంపదతో 93వ స్థానంలో, అరబిందో ఫార్మా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ రామ్ప్రసాద్ రెడ్డి రూ. 21,000 కోట్ల సంపదతో 98వ స్థానంలో, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి కుటుంబం రూ.20,900 కోట్లతో 99వ ర్యాంకులో ఉన్నాయి. -
హురున్ రిచ్ లిస్ట్ 2023: రేఖా ఝున్ఝున్వాలా ఎంట్రీ!సూపర్!
సాక్షి,ముంబై: ప్రముఖ స్టాక్మార్కెట్ పెట్టుబడిదారుడు బిలియనీర్, దివంగత రాకేష్ ఝున్ఝున్వాలా భార్య రేఖా ఝున్ఝున్వాలా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2023 హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో ఎంట్రీ ఇచ్చారు. 2023 M3M హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్లో 18 పరిశ్రమలు,99 నగరాల నుండి 176 మంది కొత్త ముఖాలు చోటు సంపాదించు కోగా రేఖా కుటుంబం జాబితాలోకి కొత్తగా ప్రవేశించిన 16 మంది సంపన్నుల జాబితాలో టాప్లో ఉంది. వీరి కంపెనీ రేర్ ఎంటర్ప్రైజెస్ ఈ లిస్ట్లోచేరింది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం 69 మంది బిలియనీర్లతో ఈ జాబితాలో కొత్తగా చేరిన వారిలో చైనా అగ్రస్థానంలో ఉండగా, 26 మందితో అమెరికా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 8 శాతం తగ్గినప్పటికీ, ఇండియా 16 మంది కొత్త బిలియనీర్లతో మూడో స్థానాన్ని ఆక్రమించింది. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరైన రేఖా నెలకు సుమారుగా రూ.650 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. ఆమె తన దివంగత భర్త నుండి భారీ సంపదను వారసత్వంగా పొందింది. టాటా గ్రూప్ టైటన్ టాప్లోఉండగా, మెట్రో బ్రాండ్స్ ,స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్ , క్రిసిల్ రేఖ టాప్ పిక్స్గా చెప్పుకోవచ్చు. ట్రెండ్లైన్ డేటా ప్రకారం, దివంగత రాకేష్ ఝున్ఝున్వాలా పోర్ట్ఫోలియో ఇప్పుడు రేఖ నిర్వహిస్తున్నారు.మార్చి 22, 2023 నాటికి నికర విలువ రూ.32,059.54 కోట్లతో 29 స్టాక్లు రేఖ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. రేఖ ఝున్ఝున్వాలా ఎవరు? బిగ్బుల్గా పాపులర్ అయిన రాకేష్ ఝున్ఝున్వాలా భార్య రేఖ. రాకేష్ను 1987లో వివాహం చేసుకున్నారు రేఖా. వీరి అసెట్ కంపెనీ రేర్ ఎంటర్ప్రైజెస్ లో రాకేష్ 3.85 శాతం వాటా ఉండగా, రేఖకు 1.69 శాతం వాటా ఉంది. ఉమ్మడి బలం ఇప్పుడు 5 శాతానికి పైగా మాటే. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు: నిష్ఠ, ఆర్యమాన్ ., ఆర్యవీర్. తొలి కుమార్తె 2004లో జన్మించగా వారి కవల కుమారులు 2009లో జన్మించారు. కాగా అందుబాటు ధరల్లో విమాన ప్రయాణాన్ని అందించాలన్న ఆలోచనతో ఆకాశ ఎయిర్ ప్రారంభించిన వారానికే (ఆగస్టు 2022) ఆయన కన్నుమూయడం విషాదాన్ని నింపింది. ఇపుడు పలు సర్వీసులతో విమానయాన రంగంలో స్పెషల్గా నిలుస్తోంది. అలాగే భర్త, 'వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా' పేరును నిలబెట్టేలా రేఖా కూడా సంపదలో దూసుకు పోతున్నారు. రాకేష్ ఝున్ఝున్వాలాకు పద్మశ్రీ మరోవైపు దివంగత బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలాకు వాణిజ్యం, పరిశ్రమల రంగంలో చేసిన సేవలకు గాను ఉగాది ( 2023 మార్చి 22) మరణానంతరం పద్మశ్రీని ప్రదానం చేశారు. ఈ వేడుకకు హాజరైన రేఖ కుటుంబం ఆయన తరపున అవార్డును స్వీకరించింది. -
రిచెస్ట్ ఎన్ఆర్ఐ వినోద్ అదానీ: తగ్గేదేలే అంటున్న అదానీ బ్రదర్స్
సాక్షి,ముంబై: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 10,94,400 కోట్ల సంపదతో టాప్ ప్లేస్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ కూడా తగ్గేదేలా అంటున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ (సెప్టెంబర్ 22, గురువారం) తాజా లిస్ట్ ప్రకారం దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త వినోద్ అదానీ రూ.1,69,000 కోట్లతో అత్యంత ధనవంతులైన ఎన్ఆర్ఐ, ఆరో సంపన్న భారతీయుడుగా నిలిచారు. 1976లో ముంబయిలో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించి సింగపూర్దాకా విస్తరించారు. జకార్తాలో వ్యాపార వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. గత సంవత్సరంలో వినోద్ అదానీ సంపద 28 శాతం లేదా 37,400 కోట్లు పెరిగింది. అలా టాప్ 10 సంపన్న వ్యక్తుల జాబితాలో ఆరోస్థానం కోసం రెండు ర్యాంకులు ఎగబాకినట్టు నివేదించింది. గత ఐదేళ్లలో వినోద్ అదానీ సంపద ఏకంగా 850 శాతం లేదా 1,51,200 కోట్లు పెరిగింది. నివేదిక ప్రకారం, 2018లో 49వ స్థానం నుంచి ఈ ఏడాది ఆరో స్థానానికి చేరారు. వినోద్ రోజువారీ ప్రాతిపదికన రూ. 102 కోట్లు. వార్షిక ప్రాతిపదికన నాలుగో అతిపెద్ద గెయినర్.అంతేకాదు ఇద్దరు అదానీల సంపద మొత్తం రూ. 12,63,400 కోట్లుగా ఉంది. అంటే హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లోని తొలి పదిమంది వ్యక్తుల సంపదలో దాదాపు 40 శాతం అన్న మాట. ఈ ఏడాది 94 మంది ఎన్నారైలు భారతీయ సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
హురూన్ జాబితాలో 19 ఏళ్ల వ్యాపారవేత్త
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2022లో రూ.10,94,400 కోట్ల సంపదతో గౌతమ్ అదానీ, కుటుంబం తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. రూ.7,94,700 కోట్లతో ముకేశ్ అంబానీ, కుటుంబం రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాలను వరుసగా రూ.2,05,400 కోట్లతో సైరస్ ఎస్ పూనావాలా కుటుంబం (సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా), రూ.1,85,800 కోట్లతో శివ్ నాడార్ కుటుంబం (హెచ్సీఎల్), రూ.1,75,100 కోట్లతో రాధాకిషన్ దమానీ, కుటుంబం (అవెన్యూ సూపర్మార్ట్స్) దక్కించుకుంది. రూ.1,000 కోట్లకుపైగా సంపద కలిగిన వ్యాపారవేత్తలతో ఈ జాబితా తయారైంది. ఇందులో దేశవ్యాప్తంగా 1,103 మంది చోటు సంపాదించారు. గతేడాదితో పోలిస్తే 96 మంది కొత్తగా చేరారు. లిస్ట్లో స్థానం పొందిన వ్యాపారవేత్తల మొత్తం సంపద రూ.100 లక్షల కోట్లకు చేరుకుంది. 19 ఏళ్ల యువ వ్యాపారవేత్త, జెప్టో ఫౌండర్ కైవల్య వోరా జాబితాలో ఉన్నవారిలో పిన్న వయస్కుడు. తెలుగు రాష్ట్రాల నుంచి.. జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 78 మంది చోటు సంపాదించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. రూ.56,200 కోట్ల సంపదతో మురళి దివీ, కుటుంబం (దివీస్ ల్యాబొరేటరీస్) మొదటి స్థానంలో ఉంది. రూ.39,200 కోట్లతో బి.పార్థ సారధి రెడ్డి, కుటుంబం (హెటిరో ల్యాబ్స్) రెండవ స్థానం కైవసం చేసుకుంది. రూ.16,000 కోట్లతో ఎం.సత్యనారాయణ రెడ్డి కుటుంబం (ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్), రూ.15,000 కోట్లతో జి.అమరేందర్ రెడ్డి, కుటుంబం (జీఏఆర్), రూ.13,300 కోట్లతో రామేశ్వర్రావు జూపల్లి కుటుంబం (మై హోమ్ ఇండస్ట్రీస్) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రూ.12,600 కోట్లతో పి.పిచ్చిరెడ్డి (మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్) ఆరవ స్థానం, రూ.12,100 కోట్లతో పి.వి.కృష్ణారెడ్డి (మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్) ఏడవ స్థానం, రూ.11,300 కోట్లతో కె.సతీష్ రెడ్డి, కుటుంబం (డాక్టర్ రెడ్డీస్) ఎనిమిదవ స్థానం, రూ.9,000 కోట్లతో వెంకటేశ్వర్లు జాస్తిని కుటుంబం (సువెన్ ఫార్మా) తొమ్మిదవ స్థానం, రూ.8,700 కోట్లతో మహిమ దాట్ల కుటుంబం (బయాలాజికల్–ఇ) 10వ స్థానంలో నిలిచారు. -
డీమార్ట్ రాధాకిషన్ దమానీ హవా, సంపద ఎంత పెరిగిందో తెలిస్తే!
న్యూఢిల్లీ: పెట్టుబడిదారుడి నుండి వ్యాపారవేత్త వరకు ఎదిగిన డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ మరోసారి తన హవాను చాటుకున్నారు. ఐఎఫ్ఎల్ వెల్త్ భాగస్వామ్యంతో పరిశోధనా సంస్థ హురున్ ఇండియా విడుదల చేసిన ర్యాంకింగ్లో 12 మంది వ్యాపారవేత్తలు ట్రిలియనీర్లుగా అవతరించారు. ముఖ్యంగా ప్రముఖ పెట్టుబడిదారుడు అవెన్యూ సూపర్మార్కెట్ (డీమార్ట్) వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ సంపద ఏకంగా 280 శాతం లేదా 1,28,800 కోట్లు రూపాయలు పెరిగింది. ఇదీ చదవండి: Hurun India Rich List 2022: అదానీ రోజు సంపాదన ఎంతో తెలుసా? గత ఐదేళ్లలో డీమార్ట్ లాభాలతో దమానీ సంపద 1.75 లక్షల కోట్లకు పెరిగింది. తద్వారా హురున్ ఇండియా రిచెస్ట్ జాబితాలో ఐదో ప్లేస్లో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే రెండు స్థానాలు పైకి ఎగబాగారు. దమానీ రోజువారీ సంపాదన 57 కోట్ల రూపాయలని ఈ నివేదిక తేల్చింది. అంటే గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 13 శాతం జంప్ చేసింది. ఈ జాబితాలో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ టాప్లోఉండగా, రెండో ప్లేస్లో రిలయన్స్అధినేత ముఖేశ్ అంబానీ, మూడు, నాలుగు స్థానాల్లో సీరం అధినేత సైరస్ పూనావల్లా, శివ్ నాడార్ నిలిచారు. కిరాణామొదలు ఆహారం, దుస్తుల విక్రయంతో భారతదేశం అంతటా 200కు పైగా డీమార్ట్ స్టోర్లతో వినియోగదారులను బాగా ఆకట్టుకుంటోంది. డీమార్ట్ రిటైల్ స్టోర్ల విస్తరణ నేపథ్యంలో దమానీ సంపద వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. స్టాక్మార్కెట్ పెట్టుబడులతో వందల మిలియన్ల డాలర్లు సంపాదించిన దమానీ 2002లో డీమార్ట్ స్టోర్లను ప్రారంభించడం ద్వారా వ్యాపారవేత్తగా అవతరించిన సంగతి తెలిసిందే. -
12 మంది కుబేరులు: అదానీ రోజు సంపాదన 1600 కోట్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభం తరువాత సంపదలో భారతీయ కుబేరులు గ్లోబల్ బిలియనీర్లనుదాటి ట్రిలియనీర్లుగా దూసుకు పోతున్నారు. దేశంలో 12 మంది అపర కుబేరుల నికర విలువ రూ. ఒక ట్రిలియన్ కంటే ఎక్కువేనని తాజా నివేదిక తేల్చింది. ఇందులో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ అగ్రస్థానంలో ఉండటంలో ఆశ్చర్యమేమీలేదు. ఎందుకంటే అదానీ గత ఏడాది రోజుకు 1,600 కోట్ల రూపాయలు ఆర్జించారు. ప్రస్తుతం గౌతమ్ అదానీ రూ. 10.9 ట్రిలియన్లకు పైగా నికర విలువతో దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా, ప్రపంచంలో మూడో ధనవంతుడిగా ఉన్నారు. ఇటీవల అదానీ ప్రపంచంలో రెండో రిచెస్ట్పర్సన్గా నిలిచిన తొలి ఆసియా వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. ప్రస్తుతం అదానీ, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ , బెర్నార్డ్ ఆర్నాల్ట్ తర్వాత భూమిపై మూడో అత్యంత ధనవంతుడు. అంబానీకి షాకిచ్చిన అదానీ సంపద నిర్వహణ సంస్థ ఐఐఎఫ్ఎల్ వెల్త్ భాగస్వామ్యంతో పరిశోధనా సంస్థ హురున్ ఇండియా విడుదల చేసిన ర్యాంకింగ్ల ప్రకారం బిలియనీర్ గౌతమ్ అదానీ రూ. 10,94,400 కోట్ల నికర విలువతో సంపన్న భారతీయుల జాబితాలో టాప్లో ఉన్నారు. తద్వారా గతేడాది జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీని వెనక్కి నెట్టేశారు. అంబానీ రూ. 7,94,700 కోట్ల నికర సంపదతో రెండో స్థానంలో నిలిచారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 జాబితా బుధవారం వెల్లడైంది. 12 మంది భారతీయుల నికర విలువ రూ. 1 ట్రిలియన్ కంటే ఎక్కువగా ఉందని నివేదించింది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ, సైరస్ పూనావల్లా, శివ్ నాడార్, రాధాకిషన్ దమానీ పేర్లు ఉన్నాయి. 2022లో బొగ్గు-పోర్ట్-టు-ఎనర్జీ సంస్థ అదానీ గ్రూపు సంపద అప్రతిహతంగా ఎగిసింది. లక్ష కోట్ల మార్కెట్ క్యాప్తో ఒకటి కాదు, ఏకంగా ఏడు కంపెనీలను నిర్మించిన ఏకైక కంపెనీ అదానీ అని హురున్ ఇండియా ఎండీ, ముఖ్య పరిశోధకుడు అనస్ రెహమాన్ జునైద్ పేర్కొన్నారు. అంతేకాదు రూ. 1.6 ట్రిలియన్ల నికర విలువతో అదానీ తమ్ముడు వినోద్ అదానీ కూడా ఆరో స్థానంలో ఉన్నారు. ఇక ఈ జాబితాలో సీరం వ్యవస్థాపకుడు సైరస్ పూనావల్లా ,హెచ్సీఎల్ శివ్ నాడార్ ఉన్నారు. వీరి సంపద వరుసగా రూ. 2 ట్రిలియన్లు, రూ. 1.85 ట్రిలియన్లుగా ఉంది. అలాగే ట్రిలియనీర్ల జాబితాలో రాధాకిషన్ దమానీ, ఎస్పీ హిందుజా, ఎల్ఎన్ మిట్టల్, దిలీప్ షాంఘ్వీ, ఉదయ్ కోటక్, కుమార్ మంగళం బిర్లా , నీరాజ్ బజాజ్ ఉన్నారు. వీరితో పాటు షాంఘ్వీ ,కోటక్ ఈ జాబితాలోకి కొత్తగా ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. జాబితాలో క్విక్ డెలివరీ ప్లాట్ఫారమ్ జెప్టో వ్యవస్థాపకురాలు అతి పిన్న వయస్కురాలు 19 ఏళ్ల కైవల్య వోహ్రా, మరొక స్టార్టప్ వ్యవస్థాపకురాలు నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్ ఉన్నారు. వీరిద్దరూ బయోకాన్ ఎండీ కిరణ్ మంజుందార్-షాను అధిగమించి మరీ " రిచెస్ట్సెల్ఫ్ మేడ్ ఇండియన్ విమెన్" గా నిలిచారు. వేదాంత్ ఫ్యాషన్ వ్యవస్థాపకుడు రవి మోడీ నికర విలువలో 376 శాతం జంప్తో జాబితాలో అత్యధికంగా సాధించిన వారిగా నిలిచారు. సంపన్నుల జాబితాలో 283 మంది వ్యక్తులతో ముంబై టాప్లో ఉంది. ఆ తరువాత న్యూ ఢిల్లీలో 185 మంది , బెంగళూరు 89 మంది రూ. 1,000 కోట్లకు పైగా నికర విలువను కలిగి ఉన్నారని నివేదిక తేల్చింది. 100 మంది స్టార్టప్ వ్యవస్థాపకుల నికర విలువ 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉందని నివేదిక చూపింది. -
‘గేమ్’ చేంజర్: స్థానిక భాషల్లో కంటెంట్.. సూపర్ హిట్! సౌమ్య విజయ రహస్యం ఇదే!
మనస్తత్వశాస్త్రంలోని ఒక మంచిమాట... ‘నువ్వు సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తే... సమస్యలు మాత్రమే కనిపిస్తాయి. పరిష్కారాల గురించి ఆలోచిస్తే... ఎన్నో పరిష్కారాలు నిన్ను వెదుక్కుంటూ వస్తాయి’.. మనస్తత్వశాస్త్రంలో పట్టా పుచ్చుకున్న సౌమ్యసింగ్ రాథోడ్ సమస్యల కంటే ఎక్కువగా పరిష్కారాల గురించి ఆలోచించింది. అందుకే గేమింగ్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయ్యింది. తాజాగా దేశంలోని మహిళా సంపన్నుల జాబితా (హురున్ పవర్–లీడింగ్ వెల్దీ ఉమెన్ 2021)లో చోటు సాధించింది... ‘ది యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్’లో మనస్తత్వశాస్త్రం చదువుకున్న సౌమ్య సింగ్ రాథోడ్ ఆ తరువాత ‘జో రూమ్స్’ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఉద్యోగంలోనే ఉండి ఉంటే ఏం జరిగేదో తెలియదుగానీ, ఆ ఉద్యోగాన్ని వదిలి కొత్త అడుగు వేయడం ఆమె జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పింది. భారత్ గేమింగ్ ఆన్లైన్ మార్కెట్లో తనదైన ముద్ర వేసేలా చేసింది. నాలుగు సంవత్సరాల క్రితం... పవన్ నందాతో కలిసి దిల్లీ కేంద్రంగా ‘విన్ జో’ పేరుతో సోషల్ గేమింగ్ యాప్ మొదలుపెట్టినప్పుడు విజయాల కంటే సమస్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎంతో ఉత్సాహంతో మొదలైన గేమింగ్ యాప్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. ఆ సమయంలో చిన్నపాటి పరిశోధన మొదలుపెట్టింది సౌమ్య. ఏ వయసు వాళ్లు ఎక్కువగా గేమ్స్ ఆడుతున్నారు? ఏ జానర్ను ఇష్టపడుతున్నారు? పట్టణవర్గాల వారు మాత్రమే ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? ... ఇలా కొన్ని ప్రశ్నలు సిద్ధం చేసుకొని సమాధానాలు తెలుసుకుంది. ‘యూజర్స్ లో 80 శాతం నాన్–ఇంగ్లీష్ స్పీకర్స్ ఉన్నారు’ అనే వాస్తవం తెలుసుకున్నాక స్థానిక భాషల్లో కంటెంట్ను తీసుకువచ్చింది. ఇది బాగా హిట్ అయింది. ఒకప్పుడు ‘యువతరం ఈ జానర్ మాత్రమే ఇష్టపడుతుంది’ అనే సూత్రీకరణ ఉండేది. అయితే ఇది తప్పు అని, ఎప్పటికప్పుడూ కొత్త జానర్స్ని ఇష్టపడుతున్నారని తన అధ్యయనంలో తెలుసుకుంది. ‘క్విక్ ఎంటర్టైన్మెంట్’ లక్ష్యంతో రకరకాల జానర్స్లో యూత్ను ఆకట్టుకునే గేమ్స్ రూపొందించింది. స్మార్ట్ఫోన్ అనేది సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాక ‘విన్ జో’ జోరు పెరిగింది. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అలా అని ‘లాభాలే ప్రధానం’ అనుకోలేదు సౌమ్య. ‘రెస్పాన్సిబిలిటీ గేమింగ్’కు ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా ప్లాట్ఫామ్లో రకరకాల చెక్ పాయింట్స్ను ఏర్పాటు చేశారు. రెండు గంటల కంటే ఎక్కువ సమయం కేటాయిస్తే ప్లేయర్ను హెచ్చరిస్తారు. ప్లేయర్ వరుసగా గేమ్స్ లాస్ అవుతుంటే, తిరిగి ఆడడానికి అనుమతించకుండా ఉచిత ట్యూటోరియల్స్లో అవకాశం కల్పిస్తారు. విన్ జో’ద్వారా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు 25,000 మంది మైక్రో–ఇన్ఫ్లూయెన్సర్లతో కలిసి పనిచేసింది విన్ జో. ఇప్పుడు వారి సంఖ్య లక్షకు చేరింది. ఈ సంఖ్య రాబోయే సంవత్సర కాలంలో రెట్టింపు చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ‘మన విజయానికి సామాజిక బాధ్యత తోడుకావాలి’ అని నమ్మడమే కాదు ఆచరించి చూపిస్తోంది సౌమ్య సింగ్ రాథోడ్. చదవండి: Shweta Gaonkar: కొబ్బరి కల్లు గీసే శ్వేత.. ఏడాదికి మూడున్నర లక్షల ఆదాయం! బీటెక్ వద్దనుకుని.. -
భారత్లో అత్యంత సంపన్న మహిళ.. 'రోష్ని నాడార్' ఆస్తి ఎంతో తెలుసా?
ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా - హురున్ ఇండియా సంస్థలు సంయుక్తంగా భారత్లోనే అత్యంత సంపన్నులైన 100 మంది మహిళల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో రోష్ని నాడార్, ఫల్గుణి నాయర్లు వరుస స్థానాల్ని దక్కించుకున్నారు. ♦ సంపన్నుల జాబితాలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా నికర సంపద 54 శాతం పెరిగి రూ.84,330కోట్లతో తొలిస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ♦ బ్యాంకింగ్ రంగం నుంచి అనూహ్యంగా నైకా పేరుతో కాస్మోటిక్స్ రంగంలో రాణిస్తున్న ఫల్గుణి నాయర్ రూ.57,520 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఏడాదిలో ఆమె వెల్త్ 963 శాతం పెరిగినట్లు విడుదలైన నివేదిక పేర్కొంది. ♦ బయోకాన్ ఛైర్ పర్సన్ కిరణ్ మంజుదార్ షా వెల్త్ 21శాతం తగ్గి రూ.29,030 కోట్లతో మూడవ స్థానంలో నిలిచారు. హైదరాబాద్లో 12మంది మహిళలు మహిళా సంపన్నుల జాబితాలో అత్యధికంగా ఢిల్లీ నుంచి 25 మంది, ముంబై నుంచి 21మంది ,హైదరాబాద్ నుంచి 12 మంది ఉన్నారు. భారతదేశంలోని టాప్ - 100 మంది ధనవంతులైన మహిళలలో ఫార్మాస్యూటికల్స్ రంగం నుంచి 12 మంది, హెల్త్కేర్ నుంచి 11 మంది, కన్స్యూమర్ గూడ్స్ రంగం నుంచి 9 మంది మహిళలున్నారు. హైదరాబాద్లో దివీస్ లాబోరేటరీస్ డైరక్టర్ నీలిమా రూ.28,180కోట్లతో తొలిస్థానంలో నిలిచారు. ఆ తర్వాత రూ.5,530కోట్లతో బయోలాజికల్ ఇ.లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల, రూ.2,740కోట్లతో శోభన కామినేని తర్వాతి స్థానాల్లో ఉన్నారు. చివరిగా భోపాల్ జెట్సెట్గోకు చెందిన 33ఏళ్ల కనికా తెక్రివాల్ 50 శాతం సంపదతో రూ.420 కోట్లతో జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారు. సంస్థల్లో ఉన్నత స్థాయిలో.. సంపన్నుల జాబితాలో ఆయా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో విధులు నిర్వహించిన మహిళలు సైతం ఉన్నారు. వారిలో మాజీ పెప్సికో సీఈవో ఇంద్రా నూయి రూ. 5,040 కోట్లు, హెచ్డీఎఫ్సీ మేనేజింగ్ డైరెక్టర్గా రేణు సుద్ కర్నాడ్ రూ. 870 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్ శాంతి ఏకాంబరం రూ.320 కోట్లతో వరుస స్థానాల్ని కైవసం చేసుకున్నారు. -
సంపద సృష్టిలో అదానీ రికార్డ్!
ముంబై: అదానీ గ్రూపు తన విలువను అత్యంత వేగంగా పెంచుకుంది. 2020 ఏప్రిల్ వరకు ఆరు నెలల కాలంలో (2021 నవంబర్–2022 ఏప్రిల్) అదానీ గ్రూపు విలువ 88 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరింది. ‘బర్గుండీ ప్రైవేట్ హరూన్ ఇండియా 500’ జాబితా బుధవారం విడుదలైంది. రూ.18.87 లక్షల కోట్లతో అదానీ గ్రూపు కంటే ఈ జాబితాలో ముందున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ అదే కాలంలో 13.4 శాతమే పెరిగింది. మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, రెండో స్థానంలో అదానీ గ్రూపు ఉండగా, రూ.12.97 లక్షల కోట్లతో టీసీఎస్ మూడో స్థానంలో ఉంది. 2022 ఏప్రిల్ వరకు ఆరు నెలల్లో టీసీఎస్ విలువ 0.9% తగ్గినా కానీ, మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ ఉన్నాయి. ► అదానీ గ్రూపు కంపెనీల్లో అదానీ గ్రీన్ ఎనర్జీ విలువ ఆరు నెలల్లో 139 శాతం పెరిగి 2022 ఏప్రిల్ నాటికి రూ.4.50 లక్షల కోట్లకు చేరింది. గ్రూపు కంపెనీల్లో అత్యంత వేగంగా ఎక్కువ విలువను పెంచుకున్న కంపెనీ ఇది. దీంతో జాబితాలో ఆరో స్థానానికి ఎగబాకింది. అంతకుముందు ఆరు నెలల క్రితం నాటి జాబితాలో ఇది 16వ స్థానంలో ఉండడం గమనార్హం ► అదానీ విల్మార్ ఇదే కాలంలో 190 శాతం వృద్ధి చెంది రూ.66,427 కోట్లకు ఎగసింది. అదానీ పవర్ 158 శాతం పెరిగి రూ.66,185 కోట్లకు చేరింది. ► అదానీ గ్రూపులో తొమ్మిది కంపెనీల విలువ ఉమ్మడిగా 88.1 శాతం పెరిగి రూ.17.6 లక్షల కోట్లకు చేరింది. టాప్–500 కంపెనీల మొత్తం విలువలో అదానీ గ్రూపు కంపెనీల విలువ 7.6 శాతంగా ఉంది. ► 2020 ఏప్రిల్ నాటికి 6 నెలల్లో భారత్లోని టాప్–500 కంపెనీల మార్కెట్ విలువ సగటున కేవలం 2% పెరగ్గా.. అదానీ గ్రూపు కంపెనీల విలువ 88% పెరగడం విశేషం. ► 2021 అక్టోబర్ 30 నాటికి భారత్లో టాప్–500 కంపెనీల మార్కెట్ విలువ రూ.231 లక్షల కోట్లుగా ఉంటే, 2022 ఏప్రిల్ నాటికి రూ.232 లక్షల కోట్లకు చేరింది. ► వీటి మార్కెట్ విలువ కొద్దిగానే పెరిగినా.. బీఎస్ఈ 30 షేర్ల కంటే మెరుగ్గానే ఉంది. ఇదే కాలంలో సెన్సెక్స్ 4 శాతం క్షీణించగా, నాస్డాక్ ఏకంగా 17% పతనాన్ని ఎదుర్కొన్నది. ► మార్కెట్ విలువలో క్షీణత చూసినవీ ఉన్నాయి. రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద్ విలువ ఇదే కాలంలో 17.9 శాతం పడిపోయి రూ.23,000 కోట్లుగా ఉంది. అన్లిస్టెడ్ కంపెనీలు.. ► అన్లిస్టెడ్ కంపెనీల్లో ఎన్ఎస్ఈ మార్కెట్ విలువ 2022 ఏప్రిల్ వరకు ఆరు నెలల్లో 35.6 శాతం పెరిగి రూ.2.28 లక్షల కోట్లకు చేరింది. ► సీరమ్ ఇన్స్టిట్యూట్ విలువ 4.6 శాతం పెరిగి రూ.1.75 లక్షల కోట్లకు చేరగా, బైజూస్ విలువ 24.7 శాతం వృద్ధి చెంది రూ.1.68 లక్షల కోట్లుగా ఉంది. ► శాతం వారీగా చూస్తే వేదంత్ ఫ్యాషన్స్ విలువ 320 శాతం పెరగ్గా, అదానీ విల్మార్, బిల్ డెస్క్ 173 శాతం మేర (విడిగా) వృద్ధి చెందాయి. -
దేశంలోనే అత్యంత సంపన్నులు! తెలుగులో రియల్ ఎస్టేట్ కింగ్లు ఎవరంటే!
న్యూఢిల్లీ: డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. రూ.61,220 కోట్ల సంపద ఆయనకు ఉన్నట్టు ‘గ్రోహ్ హరూన్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్’ ఐదో ఎడిషన్ తెలిపింది. మాక్రోటెక్ డెవలపర్స్ (లోధా) ప్రమోటర్ ఎంపీ లోధా రూ.52,970 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. రియల్టీలోని టాప్ 100 సంపన్నుల వివరాలతో ఈ నివేదిక రూపొందించింది. రియల్టీ వ్యాపారాల్లో వాటాల ఆధారంగా 2021 డిసెంబర్ 31 నాటికి ఉన్న వివరాలను పరిగణనలోకి తీసుకుంది. టాప్ –10లో వీరు.. ►డీఎల్ఎఫ్ రాజీవ్ సింగ్ సంపద 2021లో 68% పెరిగింది. ► ఎంపీ లోధా, ఆయన కుటుంబ సభ్యుల సంపద 20 శాతం పెరిగింది. ► కే రహేజా కార్ప్నకు చెందిన చంద్రు రహేజా, ఆయన కుటుంబ సభ్యుల సంపద రూ.26,290 కోట్లుగా ఉంది. వీరు 3వ స్థానంలో ఉన్నారు. ► ఎంబసీ గ్రూపు ప్రమోటర్ జితేంద్ర విర్వాణి రూ.23,620 కోట్లతో 4వ స్థానంలో నిలిచారు. ►ఒబెరాయ్ రియల్టీ అధినేత వికాస్ ఒబెరాయ్ రూ.22,780 కోట్లు, నిరంజన్ హిరనందాని (హిరనందన్ కమ్యూనిటీస్) రూ.22,250 కోట్లు, బసంత్ బన్సాల్ అండ్ ఫ్యామిలీ (ఎం3ఎం ఇండియా) రూ.17,250 కోట్లతో వరుసగా తర్వాతి స్థానాలో ఉన్నారు. ►రాజా బగ్మానే (బగ్మానే డెవలపర్స్) రూ.16,730 కోట్లు, జి.అమరేందర్ రెడ్డి, ఆయన కుటుంబం రూ.15,000 కోట్లు, రున్వా ల్ డెవలపర్స్కు చెందిన సుభాష్ రున్వాల్ అండ్ ఫ్యామిలీ రూ.11,400 కోట్లతో ఈ జాబితాలో టాప్–10లో చోటు సంపాదించుకున్నారు. ►14 పట్టణాల నుంచి 71 కంపెనీలకు చెందిన 100 మంది ఈ జాబితాలో ఉన్నారు. ►జాబితాలోని 81 శాతం మంది సంపద 2021లో పెరిగింది. 13% మంది సంపద తగ్గింది. కొత్తగా 13 మంది జాబితాలోకి వచ్చారు. తెలుగులో రియల్టీ కుబేరులు ఎవరంటే -
భారత్కు బైబై!! సర్వేలో ఆసక్తికర విషయాలు!
మనదేశంలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే? ముఖేష్ అంబానీ అనే సమాధానం ఠక్కున వినిపిస్తుంది. ఆయన ఆస్తి లక్షల కోట్లలో ఉంటే..అంబానీ తరువాత సంపన్నులుగా ఎవరెవరు ఉన్నారు. వాళ్ల ఆస్తుల విలువ ఎంత? రానున్న రోజుల్లో భారత్లో సంపన్నుల సంఖ్య పెరుగుతుందా? ధనవంతులు వారి పిల్లల్ని ఎక్కడ చదివించాలని అనుకుంటున్నారు. వాళ్లు ఏ బ్రాండ్ కార్లను వినియోగిస్తున్నారు. ఇలా ధనవంతుల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది చైనాకు చెందిన హురున్ ఇనిస్టిట్యూట్. అందుకు సంబంధించి రిపోర్ట్లను విడుదల చేస్తుంది. తాజాగా హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ - 2021 పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. హురున్ నిర్వహించిన ఓ సర్వేలో పాల్గొన్న 70శాతం మంది ధనవంతులు తమ పిల్లల్ని విదేశాల్లో చదివించేందుకు ఇష్టపడుతున్నట్లు తేలింది. హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ 350 మంది భారతీయ మిలియనీర్లపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ఒక్కో భారతీయ ధనవంతుడి వ్యక్తిగత సంపద రూ.7 కోట్లకు సమానంగా ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. వారిలో 12శాతంతో 42మంది అత్యంత ధనవంతులుగా ఉండగా వారి నికర ఆస్తుల విలువ రూ.100 కోట్లు. వారి సగటు వయస్సు 35 సంవత్సరాలు. ఇక వారి పిల్లల్ని విదేశాల్లో చదివించాలని భావిస్తున్నట్లు హురున్ రిపోర్ట్లో పేర్కొంది. అందులో యూఎస్(29 శాతం), యునైటెడ్ కింగ్డమ్ (19 శాతం), న్యూజిలాండ్ (12 శాతం), జర్మనీ (11%) మంది పిల్లల్ని పంపేందుకు ఇష్టపడుతున్నారు. ధనవంతులు వినియోగించే కార్లలో నాలుగింట ఒక వంతు మంది మూడేళ్లలోపు కార్లను మార్చారు. మెర్సిడెస్ బెంజ్ అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ బ్రాండ్. తర్వాత రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్ ఉన్నాయి. లంబోర్ఘిని అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ స్పోర్ట్స్ కార్లను వినియోగిస్తున్నట్లు తేల్చింది. -
సంపద పెరిగింది.. సంతోషం తగ్గింది!
ముంబై: దేశీయంగా డాలర్ మిలియనీర్ల (రూ. 7 కోట్ల పైగా వ్యక్తిగత సంపద ఉన్న వారు) సంఖ్య 2021లో 4.58 లక్షల కుటుంబాల స్థాయికి చేరింది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. హురున్ రిపోర్ట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2026 నాటికి భారత్లో డాలర్ మిలియనీర్ల సంఖ్య 30 శాతం పెరిగి 6 లక్షల కుటుంబాల స్థాయికి చేరనుంది. ముంబైలో అత్యధికంగా 20,300 కుటుంబాలు, ఢిల్లీలో 17,400, కోల్కతాలో 10,500 కుటుంబాలు డాలర్ మిలియనీర్ల కేటగిరీలో ఉన్నాయి. మరోవైపు, ఇటు వ్యక్తిగత అటు వృత్తిగత జీవితాల్లో సంతోషంగా ఉన్న వారి సంఖ్య మాత్రం 72 శాతం నుంచి 66 శాతానికి తగ్గింది. ఈ అంశానికి సంబంధించి హురున్ నిర్వహించిన సర్వేలో 350 మంది డాలర్ మిలియనీర్లు పాల్గొన్నారు. ‘భారత మార్కెట్లో అడుగు పెట్టడానికి లేదా ఇప్పటికే ఉన్న తమ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడానికి లగ్జరీ బ్రాండ్లు, సర్వీస్ ప్రొవైడర్లకు వచ్చే దశాబ్ద కాలంలో ఎన్నో అర్థవంతమైన అవకాశాలు లభించగలవు‘ అని హురున్ ఇండియా ఎండీ, చీఫ్ రిసర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ చెప్పారు. 130 కోట్ల పైగా జనాభా గల దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో కుబేరులపై హురున్ నివేదికలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వచ్ఛంద సంస్థ ఆక్స్ఫామ్ ఇటీవలి నివేదిక ప్రకారం భారత్లోని టాప్ 100 మంది సంపన్నుల సంపద ఏకంగా 775 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021లో ప్రపంచం మొత్తం మీద కడు పేదరికంలోకి జారిపోయే వారి సంఖ్యలో దాదాపు సగభాగం (4.6 కోట్ల మంది) భారత్లోనే ఉంటారని ఆక్స్ఫామ్ అంచనా వేసింది. సర్వేలోని ఇతర విశేషాలు.. ► పన్నులు చెల్లించడమనేది తమ సామాజిక బాధ్యతకు నిదర్శనంగా భావించే వారి సంఖ్య.. సర్వేలో పాల్గొన్న వారిలో మూడో వంతుకన్నా తక్కువే ఉంది. ► సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అభిప్రాయపడిన వారి సంఖ్య కేవలం 19 శాతమే. ► మూడింట రెండొంతుల మంది తమ సంతానాన్ని ఉన్నత విద్య కోసం విదేశాలు పంపించేందుకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఫేవరెట్ గమ్యంగా అమెరికా ఉండగా, బ్రిటన్, న్యూజిలాండ్, జర్మనీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ► ఇక వినియోగంపరమైన అంశాల విషయానికొస్తే.. నాలుగో వంతు మంది తమ కార్లను ప్రతి మూడేళ్లకోసారి మార్చేస్తున్నారు. చాలా మందికి మెర్సిడెస్ బెంజ్ కార్లు ఫేవరెట్గా ఉంటున్నాయి. ఇంకా మిలియనీర్లకు అత్యంత ఇష్టమైన హాబీల్లో.. వాచీల కలెక్షన్ కూడా ఉంది. సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల మంది.. తమ దగ్గర కనీసం నాలుగు వాచీలైనా ఉన్నట్లుగా తెలిపారు. మళ్లీ వీటిలో రోలెక్స్ అత్యంత ఇష్టమైన బ్రాండ్గా ఉంది. ► ఆతిథ్యానికి సంబంధించి అత్యధిక శాతం మంది ఇష్టపడే హోటల్గా ఇండియన్ హోటల్స్కి చెందిన తాజ్, ఫేవరెట్ ఆభరణాల రిటైలర్గా తనిష్క్ (రెండూ టాటా గ్రూప్నకు చెందివే) అగ్రస్థానంలో ఉన్నాయి. లగ్జరీ ఉత్పత్తుల బ్రాండ్ లూయి విటన్, ప్రైవేట్ జెట్ బ్రాండ్ గల్ఫ్స్ట్రీమ్.. అత్యధిక శాతం మంది డాలర్ మిలియనీర్లకు ఫేవరెట్గా ఉన్నాయి. ► చెల్లింపుల కోసం యూపీఐని ఉపయోగిస్తున్న డాలర్ మిలియనీర్ల సంఖ్య 2021లో రెట్టింపై 36 శాతానికి చేరింది. -
40 ఏళ్లకే తరగనంత సంపద
న్యూఢిల్లీ: వయసులో ఉన్నప్పుడే వేలాది కోట్లు కూడబెట్టుకోవడం ఎలాగో.. ‘ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా 40, అండర్ సెల్ఫ్మేడ్ రిచ్లిస్ట్ 2021’ను పరిశీలిస్తే తెలుస్తుంది. 40 ఏళ్లలోపే రూ.1,000 కోట్లకు పైగా సంపదను సమకూర్చుకున్న వ్యాపార విజేతలతో ఈ జాబితాను హురూన్ ఇండియా బుధవారం విడుదల చేసింది. భారత్లో జని్మంచిన వ్యాపారవేత్త, మీడియా డాట్ నెట్ వ్యవస్థాపకుడు, 39 ఏళ్ల దివ్యాంక్ తురాఖియా రూ.12,500 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత బ్రౌజర్స్టాక్ సహ వ్యవస్థాపకులు నకుల్అగర్వాల్(38), రితేష్ అరోరా(37), చెరో రూ.12,400 కోట్ల విలువతో రెండో ర్యాంక్ను సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో మొత్తం 45 వ్యాపారవేత్తలకు స్థానం లభించింది. ఇందులో 42 మంది భారత్లో నివసిస్తున్నారు. జాబితాలో 31 మంది కొత్తవారే ఉన్నారు. ఇందులోనూ 30 మంది స్టార్టప్లతో సంపద సృష్టించుకున్నారు. బెంగళూరు ఎక్కువ మందికి ఆశ్రయమిచి్చంది. జాబితాలో 15 మంది ఈ నగరంలోనే నివసిస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీ 8 మంది, ముంబై 5, గురుగ్రామ్ 3, థానె ఇద్దరికి చొప్పున నివాస కేంద్రంగా ఉంది. సాఫ్ట్వేర్ అండ్ సేవలు (12 మంది), రవాణా అండ్ లాజిస్టిక్స్ (5 మంది), రిటైల్ (5 మంది), ఎంటర్టైన్మెంట్ (5 మంది), ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం నుంచి 5 మంది చొప్పున ఇందులో ఉన్నారు. డిస్కౌంట్ బ్రోకరేజీలో దిగ్గజంగా ఉన్న జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచారు. ఆయన సంపద రూ.11,100 కోట్లుగా ఉంది. భారత్ మొత్తం మీద సంపన్నుల్లో చూస్తే కామత్ కుటుంబం 63వ స్థానంలో ఉంది. 2021 సెపె్టంబర్ 15 నాటి గణాంకాలను ఈ జాబితా రూపకల్పనలో పరిగణనలోకి తీసుకున్నారు. ఈకేఐ ఎనర్జీ వ్యవస్థాపకుడికీ చోటు.. ఇటీవలే ఐపీవోను విజయవంతంగా ముగించుకున్న ఈజ్మైట్రిప్ వ్యవస్థాపకులు రికాంత్ పిట్టి (33), నిశాంత్ పిట్టి (35), ప్రశాంత్ పిట్టి (37) జాబితాలోకి చేరారు. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయిన ఈకేఐ ఎనర్జీ వ్యవస్థాపకుడు మనీష్ కుమార్ దబ్కర (37) కూడా ఇందులో ఉన్నారు. ఈ జాబితాలోని సంపన్నులు అందరూ ఉమ్మడిగా రూ.1,65,600 కోట్లు కూడబెట్టుకున్నారు. గతేడాది జాబితాలో నిలిచిన వారి సంపదతో పోల్చి చూస్తే 286 శాతం వృద్ధి కనిపిస్తోంది. భారత్పేకు చెందిన 23 ఏళ్ల శశ్వత్ నక్రాని జాబితాలో అత్యంత పిన్న వయసు్కడిగా నిలవడం గమనార్హం. -
నలభైలలో 'శ్రీమంతుల' జోరు ఇంకా తగ్గ లేదు
విద్యార్ధిగా ఉన్నత చదువులు పూర్తి చేసుకొని చాలా మంది ఉపాధి వేటలో పడతున్నారు. అయితే వారిలో ప్రతి ఒక్కరికీ వ్యాపారం చేసి మరో నలుగురికి ఉపాధి కల్పించాలని ఉంటుంది. కానీ సరైన ఐడియా లేక, లేదంటే ఆర్ధిక ఇబ్బందులు, నష్ట భయంతోనో బిజినెస్ కాన్సెప్ట్ను పక్కన పెట్టి జాబ్ చేస్తుంటారు. 30ఏళ్లకు జాబ్లో సెటిలై, ఉద్యోగం చేయగా వచ్చిన జీతాన్ని పొదుపుగా వాడుకుంటూ 40ఏళ్లకు ఇల్లు కట్టుకుంటుంటారు. వారిలో మరికొందరు అందుకు భిన్నంగా ఆలోచిస్తుంటారు. రోజూవారీ జీవితంలో తమకు ఎదురయ్యే సమస్యల్ని గుర్తించి వాటికి పరిష్కారం చూపిస్తారు. ఆ పరిష్కారమే నలుగురికి ఉపయోగపడేలా రేయింబవళ్లు కష్టపడి వ్యాపార సామ్రజ్యాన్ని విస్తరిస్తుంటారు. దీంతో 35 ఏళ్లు లేదంటే 40ఏళ్లలోపు వేలకోట్లు సంపాదించి ఆదర్శప్రాయంగా నిలుస్తుంటారు. అలాంటి వారిలో ఈ పదిమంది ప్రత్యేకమనే చెప్పుకోవాలి. 27ఏళ్ల నుంచి 40ఏళ్లలోపే రూ.1000కోట్ల లేదంటే అంతకంటే ఎక్కువగా సంపాదించి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా 40 ఏళ్లలోపు సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ -2021 జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు. 'ఉద్యోగం అయితే జీవితం ఒక్కడిది. అదే వ్యాపారం అయితే జీవితం నలుగురిది' అని అనుకున్నారు. అందుకే వీళ్లు ఇప్పుడు భారత్లోనే సెల్ఫ్ మేడ్ బిలినియర్లుగా ఎదిగారు. ఇటీవల ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా 40 ఏళ్లలోపు సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ -2021 రిపోర్ట్ను విడుదల చేసింది.ఆ రిపోర్ట్ ప్రకారం రూ.1000 కోట్ల సంపాదించిన వారిలో ఈ 10మంది 'శ్రీమంతులు' ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం ► మీడియా.నెట్ అధినేత దివ్యాంక్ తురాఖియా 39ఏళ్ల వయస్సులో రూ.12,500 కోట్లు సంపాదించి హురూన్ జాబితాలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. ► బ్రౌజర్ స్టాక్స్ కో ఫౌండర్ నకుల్ అగర్వాల్ రూ.12,400 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ► బ్రౌజర్ స్టాక్స్ మరో కో-ఫౌండర్ రితేష్ అరోరా రూ.12,400 కోట్లతో 3 స్థానాన్ని దక్కించుకున్నారు. ► నేహా నార్ఖేడ్ అండ్ ఫ్యామిలీ - నేహా నార్ఖేడ్ కో-ఫౌండర్ నేహా నార్ఖేడ్ రూ.12,200 కోట్లతో 4 స్థానంలో ఉన్నారు. ► జెరోధా- 35ఏళ్ల నిఖిల్ కామత్ జెరోధా కో- ఫౌండర్గా దేశంలోనే అతిపెద్ద ట్రేడింగ్ నెట్ వర్క్ను నిర్వహిస్తున్నారు. రూ. 11,100 కోట్లతో 5 స్థానంలో ఉన్నారు. ► థింక్ అండ్ లెర్న్ స్లోగన్ పేరుతో బైజూస్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్థను ప్రారంభించిన రిజు రవీంద్రన్ రూ.8,100 కోట్లతో 6స్థానంలో ఉన్నారు. ► ప్రముఖ దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కో-ఫౌండర్ బిన్నీ బన్సాల్ రూ.8వేల కోట్లతో 7స్థానాన్ని దక్కించుకున్నారు. ► ఫ్లిప్ కార్ట్ మరో కో-ఫౌండర్ సచిన్ బన్సాల్ రూ. 7,800 కోట్లతో 8వ స్థానంలో నిలిచారు. ► ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ అధినేత భువీష్ అగర్వాల్ (36) రూ.7,500 కోట్లతో 9వ స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా, ఓలా ఎలక్ట్రిక్ బైక్ అమ్మకాలతో ఈ ఏడాది ఆయన ఆస్థి 114శాతం పెరిగింది. ► వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021లో 27ఏళ్లతో అతి పిన్న వయస్కుడిగా ఉన్న ఓయో రూమ్ రితీష్ అగర్వాల్ రూ.6,300 ఆస్తుల్ని కలిగి ఉన్నారు. ఈ ఏడాది ఆయన ఆస్తులు 40శాతం పెరిగాయి. -
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలు ఈమే..!
హైదరాబాద్: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 విడుదల చేసిన జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీమంతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉండటం విశేషం. వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం.. బయోలాజికల్ ఈ. లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మాహిమా దట్లా రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ధనిక మహిళగా అవతరించింది. ఆమె నికర సంపద విలువ రూ.7,700 కోట్లు. మొత్తం భారతదేశంలోని సంపన్నుల జాబితాలో మహిమ 231వ ర్యాంకు సాధించారు. లండన్లోని వెబ్ స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ మెంట్లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన 44 ఏళ్ల మాహిమా 2001 నుంచి బయోలాజికల్ ఈ భాద్యతలు చేపట్టారు. ఆమె తాతలు 1948లో స్థాపించిన బయోలాజికల్ ప్రొడక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి హెపారిన్ అనే ఔషధాన్ని తయారు చేస్తుంది. ఈ ఇండియా రిచ్ లిస్ట్ జాబితాలో ఉన్న మరో మహిళ ఎన్ ఏసీఎల్ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె లక్ష్మీరాజు రూ.1,000 కోట్ల సంపద కలిగి ఉన్నారు.(చదవండి: 10 నిమిషాల్లో 850 కోట్లు సంపాదించిన ఇండియన్ బిగ్ బుల్) తెలుగు రాష్ట్రాల్లో ధనికుల జాబితాలో ఆమె 41వ స్థానంలో ఉండగా.. దాట్లా & కుటుంబం 15 స్థానాల్లో ఉన్నారు. భారతదేశంలోని సంపన్నుల జాబితాలో లక్ష్మీ రాజు 956వ ర్యాంకు సాధించారు. ఈ ఏడాది హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 69 మంది వ్యక్తులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న వారి మొత్తం సంపద తెలుగు రాష్ట్రాల నుంచి రూ.3,79,200 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 54 శాతం పెరిగింది. -
‘హురూన్’ సంపన్నుల్లో మనోళ్లు 69 మంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా సంపన్నుల జాబితా–2021లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 69 మంది చోటు సంపాదించారు. వీరందరి సంపాదన రూ.3,79,200 కోట్లు. గతేడాదితో పోలిస్తే ఇది 54 శాతం వృద్ధి. కొత్తగా 13 మంది ఈ లిస్ట్లో చేరారు. మొత్తం జాబితాలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ఔషధ తయారీ రంగం నుంచే 21 మంది ఉండడం విశేషం. రూ.1,000 కోట్లు, ఆపైన సంపద కలిగిన వ్యక్తులతో ఈ జాబితాను రూపొందించారు. వీరిలో హైదరాబాద్ నుంచి 56 మంది, రంగారెడ్డి నుంచి నలుగురు, విశాఖపట్నం నుంచి ముగ్గురు ఉన్నారు. సెపె్టంబర్ 15 నాటికి బిలియన్ డాలర్లకుపైగా సంపద కలిగిన వారి సంఖ్య ఏడాదిలో 9 నుంచి 15కు చేరింది. రూ.79,000 కోట్లతో దివీస్ ల్యా»ొరేటరీస్ వ్యవస్థాపకులు మురళి దివి, ఆయన కుటుంబం తొలి స్థానంలో నిలిచింది. పదేళ్ల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ లిస్ట్లో ముగ్గురు మాత్రమే నమోదయ్యారు. ఈ ఏడాది జాబితాలో పేరు దక్కించుకున్న వారిలో మొదటి అయిదు స్థానాల్లో జి.అమరేందర్రెడ్డి, కుటుంబం, వెంకటేశ్వర్లు జాస్తి, కుటుంబం, ఏ.ప్రతాప్ రెడ్డి (బాలాజీ అమైన్స్), దాసరి ఉదయ్కుమార్ రెడ్డి (తాన్లా ప్లాట్ఫామ్స్), అనిల్ కుమార్ చలమలశెట్టి (గ్రీన్కో), మహేశ్ కొల్లి(గ్రీన్కో) ఉన్నారు. -
అతని ఆలోచనలతో ఆనంద్ మహీంద్రా లాంటి పారిశ్రామిక వేత్తలే వెనుకడుగు..!
IIFL Wealth Hurun India 2021: కరోనా కల్లోలంలోనూ సంపద వృద్ధి కొనసాగుతూనే ఉంది. 2021గాను హరూన్ ఇండియా-ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక భారత సంపన్నుల నివేదికను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 2021లో భారత్లో కొత్తగా 179 మంది అత్యంత సంపన్నులుగా మారిపోయారని హరూన్ ఇండియా–ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక తెలియజేసింది. అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సంపద సృష్టిలో రికార్డులు సృష్టించారు. ప్రతి రోజూ రూ.1,000 కోట్ల మేర సంపద పెంచుకున్నారు. ఏడాది కాలంలో ఆయన (కుటుంబ సభ్యులతో కలిపి) సంపద ఏకంగా రూ.3,65,700 కోట్ల మేర పెరిగింది. ఆనంద్ మహీంద్రా లాంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వెనకబడ్డారు..! ఇదిలా ఉండగా హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం ప్రముఖ స్టార్టప్ బైజూస్ రవీంద్రన్ రికార్డు సృష్టించాడు. రాకేశ్ జున్జున్వాలా, నందన్ నీలేకని, భారతీ మిట్టల్, ఆనంద్ మహీంద్రా ఇతర సంపన్నుల కంటే రవీంద్రన్ ముందునిలిచాడు. బైజూస్ రాకతో విద్యారంగంలో గణనీయమైన మార్పులకు ఒక్కింతా రవీంద్రన్ కారణమయ్యాడు అనడంలో సందేహమే లేదు. 2015లో స్థాపించిన బైజూస్కు ఇప్పటివరకు 40 మిలియన్ల యూజర్లు ఉన్నారు. అందులో 2.8 మిలియన్ల మంది పెయిడ్ సబ్స్క్రైబర్స్. బైజుస్ రవీంద్రన్ కుటుంబ నికర ఆస్తుల విలువ రూ .24,300 కోట్లు. ఇది గత ఏడాది కంటే 19 శాతం ఎక్కువ. రాకేశ్ జున్జున్వాలా కుటుంబ సంపద విలువ రూ. 22,300 కోట్లు, ఆనంద్ మహీంద్రా కుటుంబ సంపద విలువ రూ. 22,000 కోట్లు, నందన్ నీలేకని కుటుంబ విలువ రూ. 20,900 కోట్లు, రాజన్ భారతి మిట్టల్ కుటుంబ ఆస్తుల విలువ రూ. 20,500 కోట్లు. ఈ ఏడాది బైజుస్ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, సింగపూర్ ఆధారిత డిజిటల్ రీడింగ్ ప్లాట్ఫాం, గ్రేట్ లెర్నింగ్, కాలిఫోర్నియాకు చెందిన ఎపిక్ను కూడా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ డీల్స్తో రవీంద్రన్ భారత్లో 67వ ధనవంతుడిగా నిలిచేందుకు సహాయ పడింది. ఈ ఏడాది పలు సంస్థలను కొనుగోలు చేయడానికే సుమారు రూ. 15 వేల కోట్లకు పైగా బైజూస్ ఖర్చు చేసింది. ఐదేళ్ల వ్యవధిలో, రవీంద్రన్ 504 ర్యాంకులను అధిగమించాడు. స్టార్టప్స్ దూకుడు...! భారత్లో యూనికార్న్ స్టార్టప్స్ గణనీయమై సంపదును సృష్టిస్తున్నాయి. హురూన్ జాబితా ప్రకారం.. సంపన్నులు లిస్ట్లో 46 మంది యునికార్న్స్ స్టార్టప్ వ్యవస్థాపకులుగా ఉన్నారు స్టార్టప్ విప్లవం భారత్లో ఊపందకుంది. పలు స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులు చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతున్నారు. -
భాగ్యనగరంలో అత్యంత ఆస్తిపరులు వీళ్లే
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ సంస్థలు ప్రకటించిన దేశంలోని టాప్ 100 ధనవంతుల జాబితాలో ముగ్గురు హైదరాబాదీలు చోటు దక్కించుకున్నారు. అంతేకాదు గతేడాదితో పోల్చితే హైదరాబాద్లో ధనవంతుల సంఖ్య పెరుగుతున్నట్టు కూడా ఈ నివేదిక వెల్లడించింది. ఫార్మా కంపెనీ వారే.. బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఇండియా హబ్గా పేరు తెచ్చుకుంది హైదరాబాద్. ఈ పేరుకు తగ్గట్టే ఐఐఎఫ్ వెల్త్, హురున్ ఇండియా రిచ్ టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్న ధనవంతుల్లో ముగ్గురు ఫార్మా రంగానికి చెందినవారే కావడం గమనార్హం. దివీస్ మురళీ, హెరిటో గ్రూప్ పార్థసారథిరెడ్డి, ఆరబిందో ఫార్మా పీవీ రామ్ప్రసాద్ రెడ్డిలు హురున్ ఇండియా రిచ్ లిస్ట్ టాప్ 100లో ఉన్నారు. దివీస్ మురళీ ఆస్తులు ఐఐఎఫ్ఎల్, హురున్ ఇండియా 2021 ఏడాదికి గాను ప్రకటించిన వంద మంది ఐశ్వర్యవంతుల జాబితాలో దివీస్ ల్యాబ్స్ యజమాని దివి మురళి 14వ స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ. 79,000 కోట్లుగా హురున్ జాబితా తెలిపింది. గతేడాదికి సంబంధించిన జాబితాలో ఆయన రూ. 49,200 కోట్ల రూపాయలతో 17వ స్థానంలో నిలవగా, ఈసారి మరింత మెరుగైన స్థానంలో నిలవడం విశేషం.. ఏడాది కాలంలో ఆయన ఆస్తులు 61 శాతం పెరిగాయి. దీంతో మూడు స్థానాలు పైకి చేరుకున్నారు. హెటిరో, అరబిందో గతేడాది హురున్ ప్రకటించిన టాప్ 100 జాబితాలో రూ, 13,900 కోట్ల రూపాయల ఆస్తులతో హెటిరో సంస్థ ప్రమోటర్ పార్థసారథిరెడ్డి 88వ స్థానంలో నిలిచారు. ఈసారి ఆయన ఆస్తుల విలువ రూ. 26,100 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో టాప్ 100 లిస్టులో ఆయన 23 స్థానాలు మెరుగుపరుచుకుని 58వ స్థానంలో నిలిచారు. ఇక అరబిందో గ్రూపు ప్రమోటర్ పీవీ రామ్ప్రసాద్రెడ్డి రూ. 19,000 కోట్ల ఆస్తులతో 86వ స్థానంలో నిలిచారు. వెయ్యి కోట్లకు పైన ఫార్మా, ఐటీ తదితర పరిశ్రమలతో విరాజిల్లుతున్న హైదరాబాద్ నగరంలో సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. మానవ వనరులు, మౌలిక సదుపాయలు మెరుగ్గా ఉండటంతో ఇక్కడ వ్యాపారాలు లాభసాటిగా సాగుతున్నాయి. వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్న వారు హైదరాబాద్లో 1007 మంది ఉన్నట్టు హురున్ వెల్లడించింది. దేశంలో అత్యధిక మంది ఐశ్వర్యవంతులు ఉన్న నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. వీళ్లు కూడా లారస్ ల్యాబ్స్ ఫౌండర్ సీ సత్యనారాయణ ఆస్తులు రూ. 8400 కోట్లు, సువెన్ ఫార్మాస్యూటికల్ ప్రమోటర్ జాస్తి వెంకటేశ్వర్లు ఫ్యామిలీ ఆస్తులు రూ. 9,700 కోట్లు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి జీఏఆర్ గ్రూప్ ప్రమోటర్ జీ అమరేందర్రెడ్డి ఆస్తుల విలువ రూ. 12,000 కోట్లు ఉన్నట్టు హురున్ ప్రకటించింది. చదవండి : అదానీ సంపద.. రోజుకు 1,000 కోట్లు! -
అదానీ సంపద.. రోజుకు 1,000 కోట్లు!
ముంబై: కరోనా కల్లోలంలోనూ సంపద వృద్ధి కొనసాగుతూనే ఉంది. 2021లో భారత్లో కొత్తగా 179 మంది అత్యంత సంపన్నులుగా మారిపోయారని హరూన్ ఇండియా–ఐఐఎఫ్ఎల్ వెల్త్ నివేదిక తెలియజేసింది. అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ సంపద సృష్టిలో రికార్డులు సృష్టించారు. ప్రతి రోజూ రూ.1,000 కోట్ల మేర సంపద పెంచుకున్నారు. ఏడాది కాలంలో ఆయన (కుటుంబ సభ్యులతో కలిపి) సంపద ఏకంగా రూ.3,65,700 కోట్ల మేర పెరిగింది. దేశీయంగా ఇంత స్వల్ప కాలంలో భారీగా సంపదను కూడబెట్టుకున్న ఘనత అదానికే సొంతం. మొత్తం మీద దేశీయంగా అత్యంత సంపదపరుల సంఖ్య 1,007కు చేరుకుంది. ఒకవైపు కరోనా కారణంగా వేలాది మందికి ఉపాధి లేకుండా పోగా.. ఈ 1,007 మంది ఆస్తుల విలువ సగటున 25 శాతం చొప్పున పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. 10వ హరూన్ ఇండియా ఐఐఎఫ్ఎల్ రిచ్ లిస్ట్ నివేదిక గురువారం విడుదలైంది. రూ.1,000 కోట్లకుపైన సంపద కలిగిన వారిని ఈ జాబితాలోకి తీసుకున్నారు. 1,007 మందిలోలో 894 మంది సంపదను పెంచుకోగా.. 113 మంది సంపద గడిచిన ఏడాదిలో క్షీణించింది. ముకేశ్ నంబర్ 1 1007 మందిలో 13 మంది రూ.లక్ష కోట్లకంటే ఎక్కువే సంపద కలిగి ఉన్నారు. వరుసగా పదో ఏడాది ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రథమ స్థానంలో ఉన్నారు. 2020 నాటి నివేదికతో పోలిస్తే ముకేశ్ సంపద 9 శాతం పెరిగి రూ.7,18,000 కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత రూ.5,05,900 కోట్లతో గౌతమ్ అదానీ కుటుంబం రెండో స్థానంలో ఉంది. 2020లో ఉన్న రూ.1,40,200 కోట్ల నుంచి అదానీ సంపద ఏకంగా 261 శాతం పెరిగింది. ఆసియాలోనూ రెండో అత్యంత సంపన్నుడిగా ముకేశ్ తర్వాతి స్థానానికి అదానీ చేరుకున్నారు. హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రమోటర్ అయిన శివ్నాడార్ ఆయన కుటుంబం రూ.2,36,600 కోట్లతో మూడో స్థానంలో ఉంది. ఏడాది కాలంలో వీరి సంపద 67 శాతం వృద్ధి చెందింది. ఎస్పీ హిందుజా, ఆయన కుటుంబం రూ.2,20,000 కోట్లతో (ఏడాదిలో 53 శాతం వృద్ధి) నాలుగో స్థానంలో, ఎల్ఎన్ మిట్టల్ ఆయన కుటుంబం రూ.1,74,400 కోట్లతో (ఏడాదిలో 187 శాతం పెరుగుదల) ఐదో స్థానంలో, సైరస్ పూనవాలా, ఆయన కుటుంబం రూ.1,63,700 కోట్లతో (ఏడాదిలో 74 శాతం వృద్ధి) ఆరో స్థానంలో ఉన్నారు. డీమార్ట్ (అవెన్యూ సూపర్మార్ట్) అధినేత రాధాకిషన్ దమానీ, ఆయన కుటుంబం రూ.1,54,300 కోట్లతో (ఏడాదిలో77 శాతం వృద్ధి) ఏడో స్థానంలో ఉంది. వినోద్ శాంతిలాల్ అదానీ, ఆయన కుటుంబం రూ.1,31,600 కోట్లతో, కుమార మంగళం బిర్లా, ఆయన కుటుంబం రూ.1,22,200 కోట్లతో, జయ్చౌదరి (జెడ్స్కేలర్ కంపెనీ అధినేత) రూ.1,21,600 కోట్లతో టాప్–10లో నిలిచారు. జెరోదా నితిన్కామత్ ఆయన కుటుంబం రూ.25,600 కోట్లతో 63వ స్థానంలో, బడా ఇన్వెస్టర్ రాకేశ్ జున్జున్వాలా, ఆయన కుటుంబం రూ.22,300 కోట్లతో 72వ స్థానం సంపాదించుకున్నారు. ఐదేళ్లలో 3,000కు..: 2021 సెపె్టంబర్ 15 నాటికి ఉన్న వివరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు హరూన్ ఇండియా ఎండీ అనాస్ రెహా్మన్ జునైద్ తెలిపారు. గత దశాబ్ద కాలంలో అత్యంత సంపన్నులు పది రెట్లు పెరిగినట్టు.. 2011 నాటికి 100లోపున్న వీరి సంఖ్య 1007కు చేరుకుందని చెప్పారు. ఈ ప్రకారం వచ్చే ఐదేళ్లలో వీరి సంఖ్య 3,000కు చేరుకోవచ్చన్న అంచనాను వ్యక్తం చేశారు. డాలర్ బిలియనీర్ల పరంగా రానున్న ఐదేళ్లలో 250 మంది పెరగొచ్చని చెప్పారు. మహిళామణులు.. ఈ జాబితాలోనూ మహిళా సంపన్నులను పరిశీలించినట్టయితే.. గోద్రేజ్ కుటుంబం నుంచి స్మితా వి సృష్ణ కనిపిస్తారు. ఆమె సంపద రూ.31,300 కోట్లుగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో 3 శాతం మేర ఆమె సంపద విలువ క్షీణించింది. బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా సంపద విలువ రూ.28,200 కోట్లుగా ఉంది. ఏడాది కాలంలో ఆమె సంపద సైతం 11 శాతం క్షీణించింది. ముంబై టాప్ 1007 మంది అత్యంత సంపన్నుల్లో 255 మంది ముంబైకి చెందినవారే కావడం గమనార్హం. ఢిల్లీ 167 మంది, బెంగళూరులో 85 మందికి నివాస కేంద్రంగా ఉంది. 1,007 మందిలో డాలర్ బిలియనీర్లు 237 మంది ఉన్నారు. ఫార్మా నుంచి 40 మంది ఈ జాబితాలో నిలిచారు. ఆ తర్వాత కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ నుంచి 27 మంది, సాఫ్ట్వేర్ రంగం నుంచి 22 మంది ఉన్నారు. 100 మంది అత్యంత సంపన్నుల్లో 13 మంది 1990ల్లో జన్మించిన వారు కాగా.. వీరంతా కూడా సొంత సామర్థ్యాలతోనే ఈ స్థాయికి చేరినట్టు (వారసత్వంగా వచి్చంది కాకుండా) నివేదిక పేర్కొంది. -
ముకేష్ అంబానీ: నేనే నెంబర్ 1
న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక బిలియనీర్లు (బిలియన్ డాలర్లు/రూ.7,300 కోట్లు అంతకుమించిన సంపద కలిగిన వారు) రోజురోజుకీ మరింత బలపడుతున్నారు. ఏటేటా వీరి సంఖ్య కూడా పెరుగుతూ వెళుతోంది. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రూ.7,18,000 కోట్ల సంపదతో వరుసగా 10వ సంవత్సరం భారతదేశపు అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది గౌతమ్ అదానీ & కుటుంబం రెండు స్థానాలు పైకి ఎగబాకి రూ. 5,05,900 కోట్లతో రెండవ స్థానానికి చేరుకున్నారు. ముకేశ్ అంబానీతో పాటుగా ఎల్ఎన్ మిట్టల్, కుమార మంగళం బిర్లా, శివ నాడార్ పదేళ్లుగా ఇండియా కుబేరుల జాబితాలో టాప్ 10లో ఉన్నారు. కాగా, ఈ ఏడాది ఇండియా టాప్ 10 కుబేరుల జాబితాలో నలుగురు కొత్తగా చేరారు. గౌతమ్ అదానీ & కుటుంబం కేవలం ఒక రోజులో దాదాపు రూ.1,002 కోట్లు సంపాదించారు. 15 సెప్టెంబర్ 2021 నాటికి ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ రిచ్ లిస్ట్లో దేశ వ్యాప్తంగా ఉన్న 119 నగరాల నుంచి 1,007 వ్యక్తుల నికర సంపద ₹1,000 కోట్లుగా ఉంది. వీరి సంపద సగటున 25%పెరిగింది. 894 మంది వ్యక్తులు తమ సంపద పెరగడం లేదా అలాగే ఉంది. ఇందులో 229 కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. అలాగే 113 మంది సంపద ఈ ఏడాది కాలంలో పడిపోయింది. భారతదేశంలో 2021నాటికి 237 మంది బిలియనీర్లు ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 58 మంది పెరిగారు.(చదవండి: ఓర్నీ.. మీరెక్కడ తయారయ్యార్రా బాబూ) -
కుబేరులు డబ్బుల్!
దేశంలో పారిశ్రామిక బిలియనీర్లు (బిలియన్ డాలర్లు/రూ.7,300 కోట్లు అంతకుమించిన సంపద కలిగిన వారు) రోజురోజుకీ మరింత బలపడుతున్నారు. ఏటేటా వీరి సంఖ్య కూడా పెరుగుతూ వెళుతోంది. దేశంలో అగ్రగామి 15 రంగాలకు చెందిన బిలియనీర్ల ఉమ్మడి సంపద గత ఐదేళ్లలో ఏకంగా 60 శాతం పుంజుకుని 2020 డిసెంబర్ చివరికి రూ.37.39 లక్షల కోట్లకు చేరుకున్నట్టు హురూన్ ఇండియా నివేదిక తెలిపింది. 2016లో ఈ 15 పరిశ్రమల్లోని బిలియనీర్ల ఉమ్మడి సంపద విలువ రూ.23.26 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2016లో టాప్–15 రంగాల్లో 269 మంది బిలియనీర్లు ఉంటే 2020 నాటికి ఈ సంఖ్య 613కు విస్తరించింది. ముఖ్యంగా ఫార్మా రంగం అత్యధిక సంపద పరులతో ఈ జాబితాలో ముందుంది. 2020లో దేశవ్యాప్త లాక్డౌన్ను అమలు చేసిన కాలంలోనూ ఫార్మా రంగం ఎటువంటి ఆటంకాల్లేకుండా పనిచేసిన విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. తిరుగులేని ఫార్మా... దేశీయంగా సంపదపరుల జాబితాలో ఫార్మా రంగం 2016 ఏడాది నుంచి ఏటా మొదటి స్థానంలోనే ఉంటూ వస్తోంది. 2016 నాటికి ఈ రంగంలో 39 మంది బిలియనీర్లు ఉండగా.. 2020 చివరికి వచ్చేసరికి ఈ సంఖ్య 121కు వృద్ధి చెందింది. అలాగే, 2016 నాటికి ఉన్న ఉమ్మడి సంపద రూ.5,20,800 కోట్ల నుంచి రూ.8,12,800 కోట్లకు విస్తరించింది. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగంలోని 55 మంది బిలియనీర్ల ఉమ్మడి సంపద రూ.3.43 లక్షల కోట్లుగా ఉంది. ఎక్కువ మంది బిలియనీర్లతో 2016లో రెండో స్థానంలో ఉన్న ఎఫ్ఎంసీజీ రంగం.. ఐదేళ్లు తిరిగేసరికి 11వ స్థానానికి పడిపోయింది. సంఖ్యా పరంగా దిగువకు వచ్చినప్పటికీ.. ఈ రంగంలోని బిలియనీర్ల సంపద రూ.2.45 లక్షల కోట్ల నుంచి రూ.3.55 లక్షల కోట్లకు పెరిగింది. టెక్నాలజీయే ముందుకు తీసుకెళ్లేది.. ‘‘భారత కంపెనీలు దేశ చరిత్రలో అత్యంత వేగంగా విలువను వృద్ధి చేసుకున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. టెక్నాలజీ ఆధారిత సంపద సృష్టి పూర్తి సామర్థ్యాన్ని అందుకుంటే అప్పుడు బిలియనీర్ల విషయంలో అమెరికాను భారత్ వెనక్కి నెట్టేస్తుంది’’ అని హురూన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనాస్ రెహమాన్ పేర్కొన్నారు. 2020 చివరికి సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ రంగం 50 మంది బిలియనీర్లను కలిగి ఉండగా, వీరి ఉమ్మడి సంపద రూ.5,70,300 కోట్లుగా ఉంది. 2016లో ఈ రంగం 21 మంది బిలియనీర్లతో, రూ.2,42,800 కోట్లతో మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఐదేళ్ల తర్వాత కూడా ఈ రంగం అత్యధిక బిలియనీర్ల పరంగానూ అదే స్థానాన్ని కాపాడుకుంది. ముంబైలో బిలియనీర్ల సంఖ్య 217కు చేరుకుంది. ఇదే నగరంలో 2016 చివరికి 104 బిలియనీర్లు ఉన్నారు. 129 మందితో ఢిల్లీ రెండో స్థానంలోనూ, 67 మంది బిలియనీర్లతో బెంగళూరు, 50 మంది బిలియనీర్లతో హైదరాబాద్, 38 మంది బిలియనీర్లతో అహ్మదాబాద్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బిలియనీర్ల సంఖ్య విషయంలో ఈ ఐదు నగరాలు గత ఐదేళ్లలోనూ టాప్–5లోనే కొనసాగాయి. చెన్నైలో 37 మంది, కోల్కతాలో 32 మంది బిలియనీర్లు ఉన్నారు. -
రియల్టీ కింగ్ ఎంపీ లోధా
ముంబై: కరోనాతో రియల్ ఎస్టేట్ మార్కెట్లో విక్రయాలు గణనీయంగా పడిపోయిన 2020లోనూ కొందరు రియల్ ఎస్టేట్ డెవలపర్లు సంపద గడించారు. హరూన్ ఇండియా టాప్ 100 సంపన్న రియల్టర్ల జాబితా 2020లోకి కొత్తగా ఎనిమిది మంది వచ్చి చేరారు. ముఖ్యంగా దేశంలో అత్యంత సంపన్న రియల్టర్గా లోధా డెవలపర్స్ అధినేత (మాక్రోటెక్), బీజేపీ నేత మంగళ్ ప్రభాత్ లోధా(ఎంపీ లోధా) నిలిచారు. ఈ జాబితాలో వరుసగా నాలుగో ఏడాది మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. హరూన్ ఇండియా రియల్ ఎస్టేట్ సంపన్నుల జాబితా 2020 మంగళవారం విడుదలైంది. దేశంలోని టాప్ 100 రియల్టర్ల సంపద 2019తో పోలిస్తే గతేడాది (2020) 26 శాతం పెరిగి రూ.3,48,660 కోట్లకు చేరుకుంది. సగటున చూస్తే ఒక్కొక్కరి తలసరి సంపద రూ.3,487 కోట్లు. 6,000 కంపెనీలను ఈ జాబితాలోకి హరూన్ పరిగణనలోకి తీసుకుంది. ఆదాయం, నికర విలువ ఆధారంగా టాప్-100 మంది సంపన్న రియల్టర్ల జాబితాను రూపొందించింది. దేశంలోని 15 పట్టణాల నుంచి 71 కంపెనీలకు చెందిన 100 మంది ఈ జాబితాలో ఉన్నారు. విడిగా చూస్తే.. 65 ఏళ్ల ఎంపీ లోధా, ఆయన కుటుంబ ఆస్తి ఏడాది కాలంలో 39 శాతం పెరిగి రూ.44,270 కోట్లకు విస్తరించింది. 2014 నుంచి 2020 మధ్య విక్రయాల పరంగా చూస్తే దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా లోధా డెవలపర్స్ నిలిచింది. స్థల విస్తీర్ణం పరంగా చూస్తే రెండో స్థానంలో ఉంది. డీఎల్ఎఫ్ (61) అధినేత రాజీవ్షా రూ.36,430 కోట్లతో జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. డీఎల్ఎఫ్ షేరు ర్యాలీ చేయడంతో ఆయన సంపద 45 శాతం వృద్ధి సాధించింది. చంద్రు రహేజా (80), కే రహేజా కుటుంబ సంపద 70 శాతం పెరిగి రూ.26,260 కోట్లకు చేరుకుంది. రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో స్థానంలో నిలిచారు. ఎంబïసీ ఆఫీస్ పార్క్స్కు చెందిన జితేంద్ర వీర్వాణి రూ.23,220 కోట్ల సంపదతతో నాలుగో స్థానంలో ఉన్నారు. నిరంజన్ హిరనందాని రూ.20,600 కోట్లు (హిరనందాని కమ్యూనిటీస్), ఒబెరాయ్ రియాల్టీకి చెందిన వికాస్ ఒబెరాయ్ (రూ.15,770 కోట్లు), రాజా బగ్మానే రూ.15,590 కోట్లు, రున్వాల్ డెవలపర్స్ సుభాష్ రున్వాల్ (రూ.11,450 కోట్లు), పిరమల్ రియల్టీ అధినేత అజయ్ పిరమల్ (రూ.5,560 కోట్లు), ఫోనిక్స్ మిల్స్ అధినేత అతుల్ రుయా రూ.6,340 కోట్లతో వరుసగా 10 స్థానాల్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఐదుగురు హరూన్ సంపన్న రియల్ ఎస్టేట్ డెవలపర్ల జాబితా 2020లో హైదరాబాద్ నుంచి ఐదుగురు కూడా ఉన్నారు. అపర్ణ కన్స్ట్రక్షన్స్ అధినేతలు సీ వెంకటేశ్వర రెడ్డి రూ.5,230 కోట్లు, ఎస్ సుబ్రమణ్యం రెడ్డి రూ.5,180 కోట్ల సంపదతో అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో టాప్ డెవలపర్లుగా జాబితాలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మైహోమ్ కన్స్ట్రక్షన్స్కు చెందిన జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుటుంబ సంపద రూ.4,957 కోట్లుగా ఉంది. జాబితాలో జూపల్లి రామేశ్వరరావు 11వ స్థానంలో నిలిచారు. మధ్య స్థాయి ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లను నిర్మించే సంస్థల్లో మైహోమ్ కన్స్ట్రక్షన్స్ నంబర్1గా నిలిచింది. 12, 13వ స్థానాల్లో వరుసగా వెంకటేశ్వరరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి ఉన్నారు. ఎస్ఏఎస్ ఇన్ఫ్రాకు చెందిన జీవీరావు, ఆయన కుటుంబం రూ.1,010 కోట్ల నికర విలువతో 49వ స్థానంలో ఉండగా.. తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ అధినేత జీవీకే రెడ్డి, ఆయన కుటుంబం రూ.460 కోట్లతో 72వ ర్యాంకును దక్కించుకున్నారు. చదవండి: ఏప్రిల్లో బ్యాంకులకు 12 రోజులు సెలవు -
ప్రపంచ తొలి 10 మంది కుబేరుల్లో అంబానీ
-
ప్రపంచ తొలి 10 మంది కుబేరుల్లో అంబానీ!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల ‘హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021’ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 ధనవంతుల జాబితా నేడు విడుదల చేశారు. ముఖేష్ అంబానీ మొత్తం సంపద గత ఏడాది కాలంలో 24 శాతం పెరిగి 83 బిలియన్ డాలర్లకు(సుమారు రూ .6.09 లక్షల కోట్లు) చేరుకున్నట్లు నివేదిక తెలిపింది. ఇటీవల, చైనా జాంగ్ షాన్షాన్ ఈ వారంలో 22 బిలియన్ డాలర్లను కోల్పోయిన తర్వాత ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత ధనవంతుడు అయ్యాడు. ముకేష్ అంబానీతో పాటు అనేక ఇతర భారతీయ బిలియనీర్లు కూడా ‘హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021’ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారు గౌతమ్ అదానీ కుటుంబం రూ.2.34 లక్షల కోట్ల సంపదతో 48వ స్థానం, శివ నాడర్ కుటుంబం రూ.1.94 లక్షల కోట్ల సంపదతో 58వ స్థానం, లక్ష్మి ఎన్ మిట్టల్ రూ.1.40 లక్షల కోట్ల సంపదతో 104వ స్థానం, సీరం ఇన్స్టిట్యూట్ అధిపతి సైరస్ పూనావాలా రూ.1.35 లక్షల కోట్లతో సంపదతో 113వ స్థానంలో నిలిచారు. హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ప్రకారం భారత్లో మొత్తం 209 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 177 మంది ప్రస్తుతం భారత్లో నివసిస్తున్నారు. ‘హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్’ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ నిలిచారు. గత ఏడాది కాలంలో ఆయన సంపద 328 శాతం పెరిగి 197 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క సంవత్సర కాలంలో ఆయన సంపద ఏకంగా 151 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. అమెజాన్.కామ్ ఇంక్ అధినేత జెఫ్ బెజోస్ 189 బిలియన్ డాలర్ల నికర విలువతో రెండవ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద లగ్జరీ-వస్తువుల తయారీ సంస్థ ఎల్విఎంహెచ్ మోయిట్ హెన్నెస్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 114 బిలియన్ డాలర్ల నికర విలువతో 3వ స్థానంలో, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 110 బిలియన్ డాలర్లతో 4వ స్థానంలో, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ 101 బిలియన్ డాలర్ల సంపదతో 5వ స్థానంలో ఉన్నారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 10వ ఎడిషన్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఏడాది వ్యవధిలో 50 బిలియన్ డాలర్లకు పైగా సంపద పోగేసిన వారు కేవలం ముగ్గురే ముగ్గురు కావడం విశేషం. వీరిలో ఒకరు ఎలన్ మస్క్(151 బిలియన్ డాలర్లు) కాగా.. జెఫ్ బెజోస్(50 బిలియన్ డాలర్లు), పిన్డ్యువోడ్యువో అధినేత కొలిన్ హువాంగ్(50 బిలియన్ డాలర్లు) ఉన్నారు. "బిలియనీర్లు గత సంవత్సరంలో జర్మనీ యొక్క స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)తో సమానంగా 3.5 ట్రిలియన్ డాలర్ల సంపదను" సృష్టించారు. గత ఏడాది కాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన బిలియనీర్ల విషయంలో అగ్రరాజ్యం అమెరికాతో భారత్ పోటీ పడింది. అమెరికాలో మొత్తం 69 మంది కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరగా.. భారత్ నుంచి ఆ సంఖ్య 40గా నమోదైంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 జాబితాను ప్రపంచంలో 68దేశాలలో ఉన్న 2,402 కంపెనీలు, 3228 బిలియనీర్లను పరిగణలోకి తీసుకోని విడుదల చేశారు. చదవండి: భారీగా పడిపోయిన బంగారం ధరలు కోవిన్ 2.0 రెడీ.. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోండిలా! -
హరూన్ ఇండియా జాబితాలో బెజవాడ కుర్రోడు
చిన్న వయసులోనే దండిగా సంపాదించడం కొందరికే సాధ్యమవుతుంది. ఉన్నత విద్య తర్వాత సాదా సీదా ఉద్యోగంతో సంతుష్టి పడక.. సొంతంగా స్టార్టప్ ఆరంభించి తన లాంటి వందల మందికి ఉపాధి కల్పించడంలో సంతప్తిని వెతుక్కునే వారు పెరిగిపోతున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్, హరూన్ ఇండియా సంపన్నుల జాబితాను పరిశీలిస్తే ఇటువంటి విజయవంతమైన వ్యాపారవేత్తలు తారసపడతారు. అత్యంత చౌక రేట్లకు బ్రోకరేజీ సేవలను అందిస్తూ బ్రోకరేజీ పరిశ్రమలోనే అత్యధిక కస్టమర్లను సంపాదించుకున్న ‘జెరోదా’ వ్యవస్థాపకుడు నితిన్ కామత్, నిఖిల్ కామత్ రూ.24,000 కోట్ల సంపదతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. మరీ ముఖ్యంగా మన బెజవాడ కుర్రోడు, శ్రీహర్ష మాజేటి రూ.1,400 కోట్ల సంపదతతో ఈ జాబితాలో 15వ స్థానంలో నిలిచి అందరి దష్టిని మరోసారి ఆకర్షించారు. టైర్2 పట్టణం నుంచి చోటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి కూడా ఇతడే. బిట్స్ పిలానీ పూర్వవిద్యార్థి అయిన శ్రీహర్ష, నందన్ రెడ్డితో కలసి 2013లో బండ్ఎల్ టెక్నాలజీస్ ను ఏర్పాటు చేశారు. స్విగ్గీ హోల్డింగ్ కంపెనీ ఇది. స్విగ్గీలో దిగ్గజ ఇన్వెెస్ట్ మెంట్ సంస్థలు టెన్సెంట్ హోల్డింగ్స్, నాస్పర్స్ లిమిటెడ్, డీఎస్ టీ గ్లోబల్ తదితర సంస్థలు వాటాదారులుగా ఉన్నాయి. స్విగ్గీ మార్కెట్ విలువ 3 బిలియన్ డాలర్లుగా (రూ.22వేల కోట్లు) ఉంటుంది. ఇంటర్నెట్ వేదికగా విస్తరణ 40 ఏళ్ల వయసు అంతకంటే తక్కువ వయసున్న వ్యాపావేత్తలు 16 మంది వద్ద ఉమ్మడిగా రూ.44,900 కోట్ల సంపద ఉన్నట్టు ‘ఐఐఎఫ్ఎల్ వెల్త్ అండ్ హరూన్ ఇండియా సెల్ఫ్ మేడ్ రిచ్ లిస్ట్ 2020 ఆఫ్ ఎంటర్ ప్రెన్యుర్స్ అండర్ 40’ నివేదిక తెలియజేసింది. కనీసం రూ.1,000 కోట్ల నెట్ వర్త్ (నికర సంపద విలువ)ను జాబితాకు ప్రామాణికంగా తీసుకున్నారు. వీరిలో అధికులు ఇంటర్నెట్ వేదికగా స్టార్టప్ పెట్టి జాక్ పాట్ కొట్టినవారే. కరోనా కాలంలోనూ వీరిలో కొద్ది మందిని మినహాయిస్తే మిగిలిన వారి సంపద వద్ధి చెందడం గమనార్హం. నివేదికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జెరోదా వ్యవస్థాపకులు తమ సంపదను ఈ ఏడాది ఏకంగా 58 శాతం పెంచుకున్నారు. నివేదికలో తొమ్మిదో స్థానంలో ఉన్న ‘ఓయో’ రితేష్ అగర్వాల్ సంపద 40 శాతం ఈ ఏడాది పడిపోయింది. కరోనాతో పర్యాటక, ఆతిథ్య రంగాలు కుదేలవడం రితేష్ సంపదకు చిల్లుపెట్టింది. జాబితాలో పిన్నవయస్కుడు రితేషే. వీయూ టెక్నాలజీస్ (వూ బ్రాండ్) దేవిత సరాఫ్ సంపద కూడా 33 శాతం తగ్గింది. 16 మందితో కూడిన జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా వ్యాపారవేత్త దేవిత సరాఫ్. ‘‘కొందరు తమ స్టార్టప్ ల నుంచి పూర్తిగా వైదొలిగితే, కొందరు పాక్షికంగా తప్పుకుని ఇన్వెస్ట్ మెంట్ ఫండ్స్ ను ప్రారంభించారు. అలాగే, యువ వ్యాపారవేత్తలకు వెన్నుదన్నుగా నిలిచారు. ఇది భారత ఔత్సాహిక వ్యాపారవేత్తల ఎదుగుదలపై ఎన్నోరెట్ల ప్రభావం చూపించింది’’అని హరూన్ ఇండియా ఎండీ అనాస్ రెహమాన్ పేర్కొన్నారు. -
హరూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 విడుదల
-
ఒక్క గంటకు అంబానీ సంపాదన ఎంతో తెలుసా?
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (63) సంపద పరుగులు పెడుతోంది. ఈ ఏడాది అంబానీ సంపద 73 శాతం పెరిగి రూ.6.58 లక్షల కోట్లకు చేరినట్టు సోమవారం విడుదలైన ‘హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2020’ పేర్కొంది. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదో ఏట తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ సంస్థతో కలసి హరూన్ ఈ నివేదికను రూపొందించింది. రిలయన్స్ జియో, రిటైల్ విభాగాల్లో వాటాల విక్రయాల కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఈ ఏడాది గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో అంబానీ ప్రపంచంలోనే టాప్-5 స్థానంలో నిలిచినట్టు హురూన్ నివేదిక తెలిపింది. ఈ ఏడాది మార్చి నుంచి లాక్డౌన్ కాలంలో ప్రతి గంటకు 90 కోట్ల రూపాయలు సంపాదించారని హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2020 వెల్లడించింది. కరోనా వైరస్ కోట్లాది మంది జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తూ, అసమానతలు పెరిగిన తరుణంలో హురూన్ భారత సంపన్నుల జాబితా వెలువడడం గమనార్హం. 19 మంది సంపద రెట్టింపు ఆగస్ట్ 31 నాటికి రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన 828 మందిని హురూన్ నివేదిక గుర్తించి సంపన్నుల జాబితా 2020లో చేర్చింది. ఉమ్మడిగా వీరి సంపద ఈ ఏడాది 20 శాతం పెరిగినట్టు çహురూన్ ప్రకటించింది. 2020లో 19 మంది సంపద రెట్టింపు కాగా, ఇందులో ఆరుగురు ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు చెందిన వారే. రిటైల్ పరిశ్రమకు చెందిన ముగ్గురున్నారు. కరోనా మహమ్మారి ఫార్మా పరిశ్రమపై కనక వర్షం కురిపించగా, రియల్ ఎస్టేట్ రంగంపై గట్టి ప్రభావం చూపించినట్టు çహురూన్ నివేదిక పేర్కొంది. ఫార్మా రంగం నుంచి కొత్తగా ఈ జాబితాలో 27 మంది వచ్చి చేరారు. కెమికల్స్, పెట్రో కెమికల్స్ నుంచి 20 మంది, సాఫ్ట్వేర్ రంగం నుంచి 15 మంది కొత్తగా జాబితాలో చోటు సంపాదించుకున్నారు. మొత్తం మీద ఫార్మా పరిశ్రమ నుంచి 122 మంది, కెమికల్స్, పెట్రో కెమికల్స్ రంగాలకు సంబంధించి 55 మంది, సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ నుంచి 50 మందికి చోటు లభించింది. హిందుజా సోదరులు రూ.1.43 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు. హెచ్సీఎల్ టెక్నాలజీస్ శివ్నాడార్, ఆయన కుటుంబం సంపద 34 శాతం పెరిగి రూ.1.41 లక్షల కోట్లుగా ఉంది. జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు. అదానీ గ్రూపు సారథి గౌతం అదానీ సంపద ఈ ఏడాది 48 శాతం పెరిగి రూ.1.40 లక్షల కోట్లకు చేరింది. రెండు స్థానాలు ఎగబాకి అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో నాలుగో స్థానానికి చేరారు. రూ.1.14 లక్షల కోట్లతో విప్రో అజీమ్ ప్రేమ్జీ మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి జారిపోయారు. సిరమ్ ఇనిస్టిట్యూట్ సైరస్ పూనవాలా సంపద 6% పెరిగి రూ.94,300 కోట్లకు చేరుకోవడంతో ఆయన 6వ స్థానంలో నిలిచారు. డీమార్ట్ ప్రమోటర్ రాధాకిషన్ దమానీ, ఆయన కుటుంబం సంపద 56 శాతం పెరగడంతో టాప్ 10లోకి చేరారు. వారి సంపద రూ.87,200 కోట్లకు చేరింది. కోటక్ మహీంద్రా బ్యాంకు ప్రమోటర్ ఉదయ్ కోటక్ సంపద 8 శాతం తగ్గి రూ.87,000 కోట్లుగా ఉండడంతో ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 62 మంది ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్–2020లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 62 మంది పారిశ్రామికవేత్తలు చోటు దక్కించుకున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి జాబితాలో చోటు సంపాదించిన వ్యక్తులందరి సంపద రూ.2,45,800 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది 34 శాతం అధికం. తెలుగు రాష్ట్రాల నుంచి రూ.7,500 కోట్లు, ఆపైన సంపద కలిగిన వారి సంఖ్య గతేడాది 5 కాగా, ఈ సంవత్సరం ఇది 9కి చేరింది. రూ.49,200 కోట్లతో దివిస్ ల్యాబొరేటరీస్కు చెందిన మురళి దివి, కుటుంబం తెలుగు రాష్ట్రాల్లో తొలి స్థానంలో నిలిచింది. హెటిరో డ్రగ్స్కు చెందిన బి.పార్థసారథి రెడ్డి, కుటుంబం రూ.13,900 కోట్ల సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి ఐఐఎఫ్ఎల్ జాబితాలో కొత్తగా 9 మంది స్థానం దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల జాబితాలో బయాలాజికల్–ఈ ఎండీ మహిమ దాట్ల ఒక్కరే మహిళ కావడం విశేషం. టాప్ 10 జాబితా చూస్తే... టాప్–10లో.. 1.మురళి దివి, కుటుంబం (దివిస్ ల్యాబొరేటరీస్). 2.బి.పార్థసారథి రెడ్డి, కుటుంబం (హెటిరో డ్రగ్స్). 3.కె.సతీశ్రెడ్డి, కుటుంబం (డాక్టర్ రెడ్డీస్). 4.పి.పిచ్చి రెడ్డి (మేఘా ఇంజనీరింగ్). 5.పి.వి.కృష్ణారెడ్డి (మేఘా ఇంజనీరింగ్). 6.జి.వి.ప్రసాద్, జి.అనురాధ (డాక్టర్ రెడ్డీస్). 7. రామేశ్వర్ రావు జూపల్లి, కుటుంబం (మై హోం). 8.ఎం.సత్యనారాయణ రెడ్డి, కుటుంబం (ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్). 9.వి.సి.నన్నపనేని (నాట్కో ఫార్మా). 10.సి.విశ్వేశ్వర రావు, కుటుంబం (నవయుగ) ఉన్నారు. రంగాల వారీగా అధిక సంపద కలిగిన వారిలో మురళి దివి, కుటుంబం (ఫార్మా), అల్లూరి ఇంద్ర కుమార్ (ఫుడ్ ప్రాసెసింగ్), పి.పిచ్చిరెడ్డి (కన్స్ట్రక్షన్), యుగంధర్ రెడ్డి, కుటుంబం (క్యాపిటల్ గూడ్స్), చల్లా రాజేంద్ర ప్రసాద్ (ఫుడ్, బెవరేజెస్) చోటు సాధించారు. ఫార్మా నుంచి∙అత్యధికంగా 20 మంది ఉన్నారు. -
దాతృత్వంలో మేటి.. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ
ముంబై: దాతృత్వంలో బిల్గేట్స్ అంతటి స్థాయిలో కాకపోయినా దేశీ కార్పొరేట్లు కూడా వందలు, వేల కోట్ల రూపాయల విరాళాలిస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. రూ. 8వేల కోట్లు విరాళమిచ్చి ఈ జాబితాలో విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ అగ్రస్థానంలో ఉండగా.. మన తెలుగువారైన జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎంరావు రూ. 740 కోట్ల విరాళంతో మూడో స్థానంలో ఉన్నారు. చైనాకు చెందిన హురున్ రిపోర్ట్ 2013కి సంబంధించి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గత ఏడాది కాలంలో అజీం ప్రేమ్జీ రూ.8,000 కోట్లు విరాళమిచ్చారు. హెచ్సీఎల్ గ్రూప్ చైర్మన్ శివ నాడార్ రూ.3,000 కోట్లతో రెండో స్థానంలో నిల్చారు. వెనుకబడిన బాలల విద్యాభ్యాసానికి తోడ్పాటం దించేందుకు జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా జీఎం రావు రూ.740 కోట్లు విరాళమిచ్చా రు. రూ. 530 కోట్ల విరాళంతో నందన్ నీలేకని, రోహిణి నీలేకని దంపతులు 4వ స్థానంలో ఉండగా, స్వదేశ్ ఫౌండేషన్ ద్వారా గ్రామీణాభివృద్ధికి రూ.470 కోట్లు వెచ్చించి రోనీ స్క్రూవాలా అయిదో స్థానం దక్కించుకున్నారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చ్ 31లోగా రూ. 10 కోట్లకు మించి నగదు, తత్సమాన విరాళాలు ఇచ్చిన 31 మంది భారతీయులతో హురున్ ఇండియా ఈ జాబితా రూపొందించింది.