ICC Player Of The Month
-
ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో వరుణ్ చక్రవర్తి
జనవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (ఫిబ్రవరి 6) ప్రకటించింది. పురుషుల విభాగంలో ముగ్గురు స్పిన్నర్లు ఈ అవార్డు కోసం నామినేట్ అయ్యారు. పాక్ వెటరన్ స్పిన్నర్ నోమన్ అలీ, విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్, టీమిండియా మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలిచారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ, విండీస్ స్పిన్నర్ కరిష్మ రామ్హరాక్, భారత యువ సంచలనం గొంగడి త్రిష జనవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు.నోమాన్ అలీ: ఈ పాకిస్తానీ వెటరన్ స్పిన్నర్ జనవరి నెలలో టెస్ట్ల్లో అత్యుత్తమంగా రాణించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో నోమాన్ 16 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ 10 వికెట్ల ఘనతతో పాటు హ్యాట్రిక్ ప్రదర్శన ఉంది. నోమాన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ కావడం ఇది రెండోసారి. నోమాన్.. గతేడాది అక్టోబర్లో ఈ అవార్డు గెలుచుకున్నాడు.వరుణ్ చక్రవర్తి: ఈ టీమిండియా మిస్టరీ స్పిన్నర్ టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చాక చెలరేగిపోతున్నాడు. జనవరి నెలలో ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో వరుణ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ నెలలో జరిగిన 4 మ్యాచ్ల్లో వరుణ్ 12 వికెట్లు తీశాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఈ ప్రదర్శనల తర్వాత వరుణ్ టీ20 ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబకాడు.జోమెల్ వార్రికన్: 32 ఏళ్ల ఈ కరీబియన్ స్పిన్నర్ జనవరి నెలలో పాక్తో జరిగిన రెండు టెస్ట్ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సిరీస్లో అతను 19 వికెట్లు తీసి లీడింగ్ వికెట్టేకర్గా నిలిచాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ సిరీస్లో వార్రికన్ బ్యాటింగ్లోనూ పర్వాలేదనిపించాడు. రెండో టెస్ట్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో విండీస్ పాక్ గడ్డపై 34 ఏళ్ల తర్వాత విజయం సాధించింది.బెత్ మూనీ: ఈ ఆసీస్ వికెట్కీపర్ బ్యాటర్ ఇంగ్లండ్తో జరిగిన మల్లీ ఫార్మాట్ యాషెస్ సిరీస్లో సత్తా చాటింది. ఈ సిరీస్లోని టీ20 మ్యాచ్ల్లో మూనీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. టీ20 సిరీస్లోని మూడు మ్యాచ్లో మూనీ 75, 44, 94 నాటౌట్ స్కోర్ల సాయంతో 213 పరుగులు చేసింది. ఫలితంగా ఆసీస్ టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ ప్రదర్శనల అనంతరం మూనీ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్తానానికి ఎగబాకింది.కరిష్మ రామ్హరాక్: ఈ విండీస్ స్పిన్ బౌలర్ బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో సత్తా చాటడంతో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యింది. స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో కరిష్మ రెండు నాలుగు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసింది. కరిష్మ సత్తా చాటడంతో ఈ సిరీస్లో విండీస్ బంగ్లాదేశ్పై 2-1 తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్లో కరిష్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకుంది.గొంగడి త్రిష: ఈ టీమిండియా యువ సంచలనం ఇటీవల ముగిసిన అండర్ 19 టీ20 వరల్డ్కప్లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ టోర్నీలో త్రిష (జనవరిలో) 265 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీసింది. ఈ టోర్నీలో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన త్రిష.. టోర్నీ చరిత్రలో సెంచరీ చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. -
పాకిస్తాన్ క్రికెటర్కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు..
పాకిస్తాన్ స్టార్ స్పిన్నర్ నోమన్ ఆలీకి తొలిసారి ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కింది. ఈ ఏడాది ఆక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను నోమన్ అలీకి ఈ అవార్డు దక్కింది. దాదాపు ఏడాది తర్వాత పాక్ టెస్టు జట్టులోకి తిరిగి వచ్చిన నోమన్.. గత నెలలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. 2 మ్యాచ్ల్లో 20 వికెట్లు పడగొట్టి పాక్ జట్టుకు అద్బుతమైన సిరీస్ విజయాన్ని అందించాడు. బ్యాట్తో కూడా 78 పరుగులు చేశాడు.రబడాను వెనక్కి నెట్టి..కాగా ఈ అవార్డు కోసం నోమన్ అలీతో పాటు ప్రోటీస్ స్టార్ పేసర్ నోమన్ కగిసో, న్యూజిలాండ్ ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్లు పోటీ పడ్డారు. . బంగ్లాదేశ్తో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో రబాడ 14 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్గా రబాడ నిలిచాడు. మరోవైపు భారత్తో జరిగిన టెస్టు సిరీస్లో సాంట్నర్ కూడా అదరగొట్టాడు. 92 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా భారత్ను కివీస్ వైట్వాష్ చేయడంలో సాంట్నర్ కీలక పాత్ర పోషించాడు. అయితే వీరిద్దిరికంటే నోమాన్ వ్యక్తిగత ప్రదర్శన పరంగా ముందుండడంతో ఈ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు.చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్పై వేటు! అతడికి ఛాన్స్? -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
అక్టోబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (నవంబర్ 5) వెల్లడించింది. పురుషుల విభాగంలో పాక్ బౌలర్ నౌమన్ అలీ, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్, సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ ఈ అవార్డుకు నామినేట్ కాగా.. మహిళల విభాగంలో టీ20 వరల్డ్కప్ టాప్ పెర్ఫార్మర్లు అమేలియా కెర్ (న్యూజిలాండ్), డియాండ్రా డొట్టిన్ (వెస్టిండీస్), లారా వోల్వార్డ్ట్ (సౌతాఫ్రికా) నామినేట్ అయ్యారు.నౌమన్ అలీ: ఈ పాక్ వెటరన్ స్పిన్నర్ అక్టోబర్ నెలలో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నౌమన్ ఈ సిరీస్లో రెండు మ్యాచ్లు ఆడి 13.85 సగటున 20 వికెట్లు పడగొట్టాడు.కగిసో రబాడ: ఈ సౌతాఫ్రికన్ సీమర్ గత నెలలో బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్లో వీర లెవెల్లో విజృంభించాడు. ఈ సిరీస్లో రబాడ టెస్ట్ల్లో 300 వికెట్ల మార్కును తాకాడు. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో రబాడ 14 వికెట్లు పడగొట్టి, ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి ఎగబాకాడు. మిచెల్ సాంట్నర్: ఈ న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్టోబర్ నెలలో భారత్తో జరిగిన రెండో టెస్ట్లో శివాలెత్తిపోయాడు. పూణే టెస్ట్లో సాంట్నర్ పూనకం వచ్చినట్లు ఊగిపోయి ఏకంగా 13 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా ఈ మ్యాచ్లో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.డియాండ్రా డొట్టిన్: ఈ విండీస్ ఆల్రౌండర్ గత నెలలో జరిగిన టీ20 వరల్డ్కప్లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఈ మెగా టోర్నీలో డొట్టిన్ స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్పై విజయాల్లో కీలకపాత్ర పోషించింది. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో డొట్టిన్ నాలుగు వికెట్ల ప్రదర్శనతో పాటు కీలకమైన ఇన్నింగ్స్ (33 పరుగులు) ఆడినప్పటికీ.. విండీస్ ఓటమిపాలైంది.అమేలియా కెర్: ఈ న్యూజిలాండ్ ఆల్రౌండర్ గత నెలలో జరిగిన టీ20 వరల్డ్కప్లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ను ఛాంపియన్గా నిలపడంలో కెర్ ముఖ్యపాత్ర పోషించింది. ఈ టోర్నీలో కెర్ 135 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది.లారా వోల్వార్డ్ట్: గత నెలలో జరిగిన టీ20 వరల్డ్కప్లో సౌతాఫ్రికాను ఫైనల్కు చేర్చడంలో లారా కీలకపాత్ర పోషించింది. ఈ మెగా టోర్నీలో లారా లీడింగ్ రన్ స్కోరర్గా (44.60 సగటున 223 పరుగులు) నిలిచింది. వరల్డ్కప్లో వెస్టిండీస్, ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ల్లో లారా కీలక ఇన్నింగ్స్లు ఆడింది. -
చరిత్రపుటల్లోకెక్కిన కమిందు మెండిస్
శ్రీలంక రైజింగ్ స్టార్ కమిందు మెండిస్ చరిత్రపుటల్లోకెక్కాడు. సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అందుకున్న కమిందు.. ఒకే క్యాలెండర్ ఇయర్లో రెండుసార్లు ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కమిందు ఈ ఏడాది మార్చిలో తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు అందుకున్నాడు.మహిళల విభాగానికి వస్తే సెప్టెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు ఇంగ్లండ్కు చెందిన ట్యామీ బేమౌంట్ దక్కించుకుంది. బేమౌంట్కు కూడా ఇది రెండో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు. 2021 ఫిబ్రవరి ఆమె తొలిసారి ఈ అవార్డు దక్కించుకుంది. సెప్టెంబర్ నెలలో కమిందు టెస్ట్ల్లో సత్తా చాటగా.. బేమౌంట్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇరగదీసింది.కమిందు ఈ అవార్డు కోసం సహచరుడు ప్రభాత్ జయసూర్య, ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ నుంచి పోటీ ఎదుర్కొనగా.. బేమౌంట్.. ఐర్లాండ్కు చెందిన ఏమీ మగూర్, యూఏఈకి చెందిన ఎషా ఓజా నుంచి పోటీ ఎదుర్కొంది. కమిందు సెప్టెంబర్ నెలలో ఇంగ్లండ్, న్యూజిలాండ్లపై నాలుగు టెస్ట్లు ఆడి 90.20 సగటున 451 పరుగులు చేయగా.. బేమౌంట్ ఐర్లాండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో 279 పరుగులు చేసింది. ఇందులో ఓ భారీ సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. చదవండి: పాక్తో రెండో టెస్ట్.. ఇంగ్లండ్ కెప్టెన్ రీఎంట్రీ -
ఐసీసీ అవార్డులలో సత్తాచాటిన శ్రీలంక ప్లేయర్స్..
అంతర్జాతీయ క్రికెట్లో ప్రతీ నెలా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పురుష, మహిళ క్రికెటర్లకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ది మంత్' అవార్డులను ఇస్తుంది. తాజాగా ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. ఈ అవార్డులలో శ్రీలంక ప్లేయర్స్ సత్తాచాటారు.పురుషుల, మహిళల విభాగాల్లో రెండు అవార్డులు కూడా శ్రీలంకకే దక్కడం గమనార్హం. మెన్స్ కేటగిరీలో లంక యువ స్పిన్ సంచలనం దునీత్ వెల్లలాగే, మహిళల క్రికెట్ విభాగంలో శ్రీలంక స్టార్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు.అదరగొట్టిన దునీత్..గత నెలలో స్వదేశంలో భారత్తో జరిగిన వన్డే సిరీస్లో వెల్లలాగే కీలక పాత్ర పోషించాడు. లంక సిరీస్ను సొంతం చేసుకోవడంలో వెల్లలాగే కీలక పాత్ర పోషించాడు. ఈ మూడు మ్యాచ్ల సిరీస్లో వెల్లలాగే 133 పరుగులతో పాటు 7 వికెట్లు పడగొట్టాడు. అందులో ఓ ఫైవ్ వికెట్ హాల్ కూడా ఉంది. ఈ క్రమంలోనే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. తద్వారా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డు అందుకున్న ఐదో లంక ఆటగాడిగా దునీత్ నిలిచాడు. ఈ జాబితాలో ఏంజెలో మాథ్యూస్ (మే 2022), ప్రబాత్ జయసూర్య (జూలై 2022), వనిందు హసరంగా (జూన్ 2023), కమిందు మెండిస్ (మార్చి 2024) ఉన్నారు. మరోవైపు లంక మహిళా క్రికెటర్ హర్షిత సమరవిక్రమ ఐర్లాండ్ పర్యటనలో అదరగొట్టింది.చదవండి: కోహ్లిని చూసి నేర్చుకో బాబర్.. లేకుంటే కష్టమే: యూనిస్ ఖాన్ -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
ఆగస్ట్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించింది. పురుషుల విభాగంలో సౌతాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్, శ్రీలంక ఆల్రౌండర్ దునిత్ వెల్లలగే అవార్డు రేసులో ఉండగా.. మహిళల విభాగంలో శ్రీలంకకు చెందిన హర్షిత సమరవిక్రమ, ఐర్లాండ్ ఆల్రౌండర్ ఓర్లా ప్రెండర్గాస్ట్, ఐర్లాండ్ ఓపెనర్ గాబీ లూయిస్ పోటీలో ఉన్నారు.కేశవ్ మహారాజ్: ఈ దక్షిణాఫ్రికా స్పిన్నర్ గత నెలలో వెస్టిండీస్తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్లలో విశేషంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. మహారాజ్ ఈ రెండు మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.జేడెన్ సీల్స్: ఈ విండీస్ ఫాస్ట్ బౌలర్ గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో 12 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్లోని రెండో టెస్ట్లో సీల్స్ ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా అతను ఐసీసీ ర్యాంకింగ్స్లో 13వ స్థానానికి ఎగబాకాడు.దునిత్ వెల్లలగే: ఈ లంక ఆల్రౌండర్ గత నెలలో భారత్తో జరిగిన వన్డే సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. వెల్లలగే తొలి వన్డేలో 67 నాటౌట్, రెండో వన్డేలో 39 మరియు రెండు వికెట్లు, మూడో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. -
సుందర్కు నిరాశ.. ప్లేయర్ ఆఫ్ ద మంత్గా అట్కిన్సన్
జులై నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 12) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్, మహిళల విభాగంలో శ్రీలంక బ్యాటర్ చమారీ ఆటపట్టు ఈ అవార్డులను గెలుచుకున్నారు. పరుషుల విభాగంలో అవార్డు కోసం అట్కిన్సన్కు టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. అంతిమంగా అవార్డు అట్కిన్సన్నే వరించింది. ఈ అవార్డు కోసం అట్కిన్సన్, సుందర్తో పాటు స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాస్సెల్ పోటీపడ్డాడు. మహిళల విభాగంలో చమారీతో పాటు టీమిండియా ప్లేయర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ అవార్డు రేసులో నిలిచారు. జులై నెలలో వివిధ ఫార్మాట్లలో ప్రదర్శన ఆధారంగా విజేతలను ఓటింగ్ ద్వారా నిర్ణయించారు.గస్ అట్కిన్సన్: 26 ఏళ్ల అట్కిన్సన్ జులై నెలలో స్వదేశంలో విండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో అట్కిన్సన్ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు.చార్లీ కాస్సెల్: 25 ఏళ్ల కాస్సెల్ స్కాట్లాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. ఒమన్తో జరిగిన మ్యాచ్లో కాస్సెల్ 5.4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. వన్డే అరంగేట్రంలో ఇవే అత్యుత్తమ గణాంకాలు.వాషింగ్టన్ సుందర్: జులైలో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సుందర్ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్గా నిలిచాడు. ఈ సిరీస్ మూడో టీ20లో సుందర్ సూపర్ ఓవర్లో కేవలం రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.చమారీ అటపట్టు: చమారీ జులైలో జరిగిన ఆసియా కప్లో 101.33 సగటున 204 పరుగులు చేసింది. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంక భారత్పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.స్మృతి మంధన: మంధన జులైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 149 పరుగులు చేసింది. ఆతర్వాత సౌతాఫ్రికాతోనే జరిగిన టీ20 సిరీస్లోనూ (47, 54 నాటౌట్) రాణించింది. ఆసియా కప్లోనూ స్మృతి రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటింది.షఫాలీ వర్మ: షఫాలీ జులై నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగింది. అనంతరం ఆసియా కప్లోనూ సత్తా చాటింది. షఫాలీ నేపాల్తో జరిగిన మ్యాచ్లో 48 బంతుల్లో 81 పరుగులు చేసింది. -
ఐసీసీ అవార్డుకు నామినేట్ అయిన టీమిండియా ప్లేయర్
టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. జులై నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మరో ఇద్దరితో కలిసి సుందర్ ఈ అవార్డు రేసులో నిలిచాడు. సుందర్తో పాటు ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్, స్కాట్లాండ్ బౌలర్ చార్లీ కాస్సెల్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. మహిళల విభాగంలో శ్రీలంక కెప్టెన్ చమారీ ఆటపట్టు, టీమిండియా ప్లేయర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో నిలిచారు. వీరందరు జులై నెలలో వివిధ ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు.Presenting the nominees for the Men's and Women's ICC Player of the Month for July 2024.Whom would you cast your vote for? pic.twitter.com/nAqqtwOBok— CricTracker (@Cricketracker) August 5, 2024గస్ అట్కిన్సన్: 26 ఏళ్ల అట్కిన్సన్ జులై నెలలో స్వదేశంలో విండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో అట్కిన్సన్ ఏకంగా 22 వికెట్లు పడగొట్టాడు.చార్లీ కాస్సెల్: 25 ఏళ్ల కాస్సెల్ స్కాట్లాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో రికార్డు గణాంకాలు నమోదు చేశాడు. ఒమన్తో జరిగిన మ్యాచ్లో కాస్సెల్ 5.4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. వన్డే అరంగేట్రంలో ఇవే అత్యుత్తమ గణాంకాలు.వాషింగ్టన్ సుందర్: జులైలో జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో సుందర్ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ సిరీస్గా నిలిచాడు. ఈ సిరీస్ మూడో టీ20లో సుందర్ సూపర్ ఓవర్లో కేవలం రెండు పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.చమారీ అటపట్టు: చమారీ జులైలో జరిగిన ఆసియా కప్లో 101.33 సగటున 204 పరుగులు చేసింది. ఈ టోర్నీ ఫైనల్లో శ్రీలంక భారత్పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది.స్మృతి మంధన: మంధన జులైలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 149 పరుగులు చేసింది. ఆతర్వాత సౌతాఫ్రికాతోనే జరిగిన టీ20 సిరీస్లోనూ (47, 54 నాటౌట్) రాణించింది. ఆసియా కప్లోనూ స్మృతి రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటింది.షఫాలీ వర్మ: షఫాలీ జులై నెలలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో డబుల్ సెంచరీతో చెలరేగింది. అనంతరం ఆసియా కప్లోనూ సత్తా చాటింది. షఫాలీ నేపాల్తో జరిగిన మ్యాచ్లో 48 బంతుల్లో 81 పరుగులు చేసింది. -
ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న విండీస్ స్పిన్నర్
విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అందుకున్నాడు. 2024 మే నెలకు గానూ మోటీని ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం మోటీతో పాటు పాకిస్తాన్ స్పీడ్స్టర్ షాహిన్ అఫ్రిది, ఐర్లాండ్ వికెట్కీపర్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ పోటీపడ్డారు. ముగ్గురిలో మోటీకే అత్యధిక ఓట్లు రావడంతో ఐసీసీ అతన్ని ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ప్రకటించింది. మోటీ గడిచిన నెలలో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లో అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్లో మోటీ మూడు మ్యాచ్ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను క్లీన్ స్వీప్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరోవైపు షాహిన్ అఫ్రిది గడిచిన నెలలో జరిగిన ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో 14.5 సగటున 10 వికెట్లు (టీ20ల్లో) పడగొట్టాడు. లోర్కాన్ టక్కర్ విషయానికొస్తే.. ఈ ఐరిష్ బ్యాటర్ మే నెలలలో ఆడిన ఆరు ఇన్నింగ్స్ల్లో 37.83 సగటున 227 పరుగులు చేశాడు. ఇందులో ఓ ఫిఫ్టి, నాలుగు 40 ప్లస్ స్కోర్లు ఉన్నాయి.మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ (మే) విషయానికొస్తే.. ఈ అవార్డు కోసం శ్రీలంక స్టార్ బ్యాటర్ చమారీ ఆటపట్టు, ఇంగ్లండ్ సోఫీ ఎక్లెస్టోన్, స్కాట్లాండ్ బౌలర్ కేథరీన్ బ్రైస్ పోటీపడగా.. మే నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ చమారీనే ఈ అవార్డు వరించింది. చమారీ మే నెలలో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో 37.75 సగటున 151 పరుగులు చేసి బౌలింగ్లో ఆరు వికెట్లు పడగొట్టింది. -
ఐసీసీ అవార్డు గెలుచుకున్న శ్రీలంక సంచలన బ్యాటర్
2024, మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుల వివరాలను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 8) ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డును శ్రీలంక సంచలన బ్యాటర్ కమిందు మెండిస్ గెలుచుకోగా.. మహిళల విభాగంలో ఈ అవార్డు ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ మైయా బౌచియర్కు దక్కింది. పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్, న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ పోటీపడగా.. మెజార్టీ మద్దతు శ్రీలంక ఆల్రౌండర్ కమిందు మెండిస్కు లభించింది. Kamindu Mendis and Maia Bouchier have won the ICC Player of the Month awards for March 2024. 🌟 pic.twitter.com/h2QClz51SA — CricTracker (@Cricketracker) April 8, 2024 మహిళల విషయానికివస్తే.. ఈ విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఆష్లే గార్డ్నర్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కెర్ పోటీ పడగా.. మైయా బౌచియర్ను అవార్డు వరించింది. మెండిస్ మార్చిలో బంగ్లాదేశ్తో జరిగిన టీ20, టెస్ట్ సిరీస్లో విశేషంగా రాణించాడు. టీ20ల్లో పర్వాలేదనిపించిన కమిందు.. తొలి టెస్ట్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో అతను రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిందు తన రెండో టెస్ట్ మ్యాచ్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్లో శ్రీలంక 328 పరుగుల తేడాతో విజయం సాధించింది. మైయా బౌచియర్ మార్చిలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో విశేషంగా రాణించింది. ఈ సిరీస్లో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచిన ఆమె 55.75 సగటున 223 పరుగులు చేసింది. నాలుగో టీ20లో బౌచియర్ చేసిన స్కోర్ (91) ఆమె కెరీర్లో అత్యుత్తమ స్కోర్గా నమోదైంది. ఈ సిరీస్ను ఇంగ్లండ్ 4-1 తేడాతో గెలుచుకుంది. -
మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..!
2024, మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 4) ప్రకటించింది. పురుషుల క్రికెట్లో ఈ అవార్డు కోసం ఐర్లాండ్ పేసర్ మార్క్ అదైర్, న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, శ్రీలంక ఆల్రౌండర్ కమిందు మెండిస్ పోటీపడనున్నారు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ ఆష్లే గార్డ్నర్, ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ మైయా బౌచియర్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కెర్ ఈ అవార్డు రేసులో ఉన్నారు. మార్క్ అదైర్: మార్చి నెలలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఆల్ ఫార్మాట్ సిరీస్లలో అదైర్ అద్భుతంగా రాణించాడు. తొలుత జరిగిన ఏకైక టెస్ట్లో 8 వికెట్లతో అదరగొట్టిన అదైర్.. ఆతర్వాత వన్డే సిరీస్లో 3 వికెట్లు, టీ20 సిరీస్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. కమిందు మెండిస్: ఈ శ్రీలంక ఆల్రౌండర్ మార్చిలో బంగ్లాదేశ్తో జరిగిన టీ20, టెస్ట్ సిరీస్లో విశేషంగా రాణించాడు. టీ20ల్లో పర్వాలేదనిపించిన కమిందు.. తొలి టెస్ట్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో అతను రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. కమిందు తన రెండో టెస్ట్ మ్యాచ్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్లో శ్రీలంక 328 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాట్ హెన్రీ: మార్చిలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో హెన్రీ ఆద్భుతంగా రాణించాడు. రెండు మ్యాచ్ల ఈ సిరీస్ను న్యూజిలాండ్ 0-2 తేడాతో కోల్పోయినప్పటికీ హెన్రీ 17 వికెట్లతో సత్తా చాటాడు. ఈ సిరీస్లో బ్యాట్తోనూ పర్వాలేదనిపించిన హెన్రీ 25.25 సగటున 101 పరుగులు చేశాడు. ఆష్లే గార్డ్నర్: మార్చి నెలలో బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో గార్డ్నర్ అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించింది. ఈ సిరీస్లో ఆమె 52 పరుగులు సహా ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును సైతం గెలుచుకుంది. ఈ సిరీస్ను ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. గార్డ్నర్ రికార్డు స్థాయిలో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు గెలుచుకుంది. మైయా బౌచియర్: బౌచియర్ మార్చిలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో విశేషంగా రాణించింది. ఈ సిరీస్లో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచిన ఆమె 55.75 సగటున 223 పరుగులు చేసింది. నాలుగో టీ20లో బౌచియర్ చేసిన స్కోర్ (91) ఆమె కెరీర్లో అత్యుత్తమ స్కోర్గా నమోదైంది. ఈ సిరీస్ను ఇంగ్లండ్ 4-1 తేడాతో గెలుచుకుంది. అమేలియా కెర్: మార్చిలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో కెర్ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకుంది. ఈ సిరీస్లో కెర్ నాలుగు ఇన్నింగ్స్ల్లో 114 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టింది. -
ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వీరే..
2024 ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ వివరాలను ఐసీసీ ఇవాళ (మార్చి 4) వెల్లడించింది. టీమిండియా యంగ్ గన్ యశస్వి జైస్వాల్, న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక గత నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్గా ఎంపికయ్యారు. ఫిబ్రవరి నెలలో వీరి ప్రదర్శనలను పరిగణలోకి తీసుకుని ఐసీసీ వీరి పేర్లను ప్రకటించింది. యశస్వి గత నెలలో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ల్లో 112 సగటున 560 పరుగులు చేశాడు. ఇందులో వరుస డబుల్ సెంచరీలు ఉన్నాయి. కేన్ మామ ఫిబ్రవరిలో ఆడిన 4 ఇన్నింగ్స్ల్లో (సౌతాఫ్రికాతో) వరుస సెంచరీల సాయంతో 403 పరుగులు చేశాడు. నిస్సంక విషయానికొస్తే.. ఈ లంక ఓపెనర్ గత నెలలో ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన 3 వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ, ఓ సెంచరీ సాయంతో 350కిపైగా పరుగులు చేశాడు. మహిళల విభాగంలో యూఏఈకి చెందిన కవిష ఎగోడగే, ఈషా ఓజా, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్ల్యాండ్ ఫిబ్రవరి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్గా ఎంపికయ్యారు. ఈ ముగ్గురు ఆల్రౌండర్లు గత నెలలో జరిగిన మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించారు. స్వతంత్ర ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఓటింగ్ పద్దతిన విజేతలను నిర్ణయిస్తారు. విజేతల పేర్లను వచ్చే వారం ప్రకటిస్తారు. icc-cricket.com/awardsలో పేర్లు నమోదు చేసుకున్న అభిమానులు శనివారం వరకు ఓటింగ్లో పాల్గొనవచ్చు. -
ఐసీసీ అవార్డు రేసులో పేస్ బౌలింగ్ సంచలనం
2024 జనవరి మాసం ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ వివరాలను ఐసీసీ ప్రకటించింది. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల పేర్లను ఐసీసీ వెల్లడించింది. పురుషుల క్రికెట్కు సంబంధించి ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్వుడ్, ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్, విండీస్ సంచలన బౌలర్ షమార్ జోసఫ్ రేసులో ఉండగా.. మహిళల క్రికెట్లో అమీ హంటర్(ఐర్లాండ్), బెత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా) నామినేషన్ దక్కించుకున్నారు. ఓటింగ్ పద్దతిన విజేతను నిర్ణయిస్తారు. ఈ ప్రదర్శనల కారణంగానే నామినేషన్ దక్కింది.. షమార్ జోసఫ్: జనవరి నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విండీస్ యువ పేసర్ షమార్, తన తొలి పర్యటనలోనే సంచలన ప్రదర్శనలు నమోదు చేసి అవార్డు రేసులో నిలిచాడు. ఈ పర్యటనలో ఆసీస్ బ్యాటర్లను గడగడలాడించిన షమార్ రెండు మ్యాచ్ల్లో 13 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. గబ్బా టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్లో షమార్ విశ్వరూపం (7-68) ప్రదర్శించడంతో పర్యాటక విండీస్ 30 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్ట్ విజయాన్ని నమోదు చేసింది. జోష్ హాజిల్వుడ్: జనవరి నెలలో విండీస్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో హాజిల్వుడ్ సైతం విజృంభించాడు. ఈ సిరీస్లో అతను రెండు మ్యాచ్ల్లో 14 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన ఉంది. ఈ ప్రదర్శనలతో పాటు హాజిల్వుడ్ జనవరిలో మొత్తం 19 వికెట్లు పడగొట్టాడు. ఓలీ పోప్: ఈ ఇంగ్లీష్ బ్యాటర్ జనవరిలో ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కారణంగా ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. గత నెలలో టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో (హైదరాబాద్ టెస్ట్) పోప్ సెకెండ్ ఇన్నింగ్స్లో 196 పరుగులు చేసి ఇంగ్లండ్ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. -
2023లో సాధించాల్సినవన్నీ సాధించిన పాట్ కమిన్స్.. తాజాగా..!
ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ గతేడాది (2023) క్రికెట్లో సాధించాల్సిన ఘనతలన్నీ సాధించాడు. ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా నిలబెట్టిన కమిన్స్.. ఆతర్వాత ఇంగ్లండ్పై యాషెస్ సిరీస్ విజయం, వన్డే వరల్డ్కప్ విక్టరీ, ఐపీఎల్ 2024 వేలంలో 20.25 కోట్ల రికార్డు ధర, బాక్సింగ్ డే టెస్ట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, టెస్ట్ల్లో హ్యాట్రిక్ ఐదు వికెట్ల ఘనత.. ఇలా ఫార్మాట్లకతీతంగా గతేడాది అన్ని ఘనతలను సాధించాడు. తాజాగా కమిన్స్ 2023 డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా దక్కించుకుని గతేడాది అత్యధిక సక్సెస్ సాధించిన క్రికెటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. డిసెంబర్ నెల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం బంగ్లాదేశ్ ఆటగాడు తైజుల్ ఇస్లాం, కివీస్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ పోటీ పడినప్పటికీ అంతిమంగా అవార్డు కమిన్స్నే వరించింది. కమిన్స్ డిసెంబర్లో పాకిస్తాన్తో జరిగిన టెస్టు సిరీస్లో నిప్పులు చెరిగాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అతను ఏకంగా 10 వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు తైజుల్ ఇస్లాం, గ్లెన్ ఫిలిప్స్ సైతం గత నెలలో అద్భుతంగా రాణించారు. తైజుల్ న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టులో 6 వికెట్ల ప్రదర్శనతో రాణించి, బంగ్లాకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఇదే సిరీస్లో కివీస్ మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ సైతం అద్భుతంగా ఆడాడు. బౌలింగ్లో 5 వికెట్ల ఘనతతో పాటు బ్యాటింగ్లో 87 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మహిళల విభాగంలో దీప్తి శర్మ.. మహిళల విషయానికొస్తే డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మను వరించింది. ఈ అవార్డు కోసం మరో టీమిండియా ప్లేయర్ జెమీమా రోడ్రిగెజ్, జింబాబ్వే బౌలర్ ప్రీసియస్ మరంగే పోటీపడ్డారు. -
ICC: ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో ఆసీస్ కెప్టెన్..
డిసెంబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్లిస్ట్ చేసింది. ఈ లిస్ట్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్, బంగ్లాదేశ్ పేసర్ తైజుల్ ఇస్లాం ఉన్నారు. వీరిముగ్గురూ డిసెంబర్ నెలలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. ప్యాట్ కమ్మిన్స్ విషయానికి వస్తే.. స్వదేశంలో పాకిస్తాన్తో జరిగిన టెస్టు సిరీస్లో కమ్మిన్స్ నిప్పులు చేరిగాడు. మెల్బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఏకంగా 10 వికెట్లతో కమ్మిన్స్ సత్తాచాటాడు. అదేవిధంగా న్యూజిలాండ్తో డిసెంబర్లో జరిగిన టెస్టు సిరీస్లో బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం నిప్పులు చేరిగాడు. తొలి టెస్టులో 6 వికెట్లు తీసి బంగ్లాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. అదే సిరీస్లో కివీస్ మిడిలార్డర్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్లో 5 వికెట్లతో సత్తాచాటిన అనంతరం బ్యాటింగ్లో కూడా 87 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ముగ్గురిలో అవార్డు ఎవరికి వరిస్తుందో వేచి చూడాలి. ఇక మహిళల విభాగంలో భారత భారత క్రికెటర్లు జెమీమా రోడ్రిగ్స్, స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ నిలిచారు. వీరిద్దరితో పాటు జింబాబ్వే బౌలర్ ప్రీసియస్ మరంగే తొలిసారి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు బరిలో నిలిచింది. చదవండి: AUS vs PAK: 'అతడు ఓపెనర్గా వస్తే.. లారా 400 పరుగుల రికార్డు బద్దలవ్వాల్సిందే' -
CWC 2023: డికాక్, బుమ్రాలను కాదని రచిన్కే దక్కింది..!
2023 అక్టోబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును న్యూజిలాండ్ రైజింగ్ స్టార్ రచిన్ రవీంద్ర దక్కించుకున్నాడు. ఈ అవార్డు కోసం క్వింటన్ డికాక్ (సౌతాఫ్రికా), జస్ప్రీత్ బుమ్రా (భారత్) పోటీపడినప్పటికీ చివరికి రచిన్నే వరించింది. అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను రచిన్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్కప్లో భీకర ఫామ్లో ఉన్న రచిన్ బ్యాట్తో పాటు బంతిలోనూ చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీల సాయంతో 565 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అలాగే 7 వికెట్లు కూడా పడగొట్టాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేసిన రచిన్.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ వరల్డ్కప్ రికార్డును బద్దలు కొట్టాడు. వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో 25 ఏళ్ల వయసులోపు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రచిన్ (565).. సచిన్ రికార్డును (523) తుడిచిపెట్టాడు. లంకతో జరిగిన మ్యాచ్లో రచిన్ రెండు వికెట్లు కూడా పడగొట్టాడు. మొత్తానికి ఈ వరల్డ్కప్ రచిన్కు కలగా మిగిలిపోనుంది. కాగా, శ్రీలంకపై విజయంతో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో ఊహించని అద్భుతం జరిగితే తప్ప కివీస్ సెమీస్ చేరుకుండా ఉండదు. ఈ నెల 15న ముంబైలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరిగే అవకాశం ఉంది. 16న కోల్కతాలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ ఖరారైపోయింది. -
శుభ్మన్ గిల్కు ఐసీసీ అవార్డు.. తొలి భారత ఆటగాడిగా రికార్డు
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్ ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. 2023 సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను గిల్కు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు గెలవడం ద్వారా గిల్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రెండు సార్లు దక్కించుకున్న తొలి భారత క్రికెటర్గా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఏడాది జనవరిలో గిల్ తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ అవార్డును గిల్ ఒకే ఏడాది రెండుసార్లు సాధించడం విశేషం. కాగా, ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును అత్యధిక సార్లు దక్కించుకున్న ఘనత పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్కు దక్కుతుంది. బాబర్ ఇప్పటివరకు ఈ అవార్డును మూడుసార్లు గెలుచుకున్నాడు. బాబర్ తర్వాత ఇద్దరు ఆటగాళ్లు రెండ్రెండు సార్లు ఈ అవార్డును దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ 2021 జులైలొ తొలిసారి, ఈ ఏడాది మార్చిలో రెండోసారి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ 2022 డిసెంబర్లో తొలిసారి, 2023 ఫిబ్రవరిలో రెండోసారి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నాడు. భారత్ నుంచి ఈ అవార్డును రిషబ్ పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి ఒక్కోసారి గెలుచుకున్నారు. 2021 జనవరి నుంచి ఐసీసీ ఈ అవార్డులను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవార్డులను తొలి మూడు నెలలు (పంత్, అశ్విన్, భువీ) భారత ఆటగాళ్లే దక్కించుకోవడం విశేషం. ఇదిలా ఉంటే, ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీమ్ ర్యాంకింగ్స్లోనూ టీమిండియా హవా కొనసాగింది. తాజా ర్యాంకింగ్స్లో భారత్ అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. వరల్డ్కప్లో హ్యాట్రిక్ విజయాల నేపథ్యంలో భారత్ వన్డే ర్యాంకింగ్స్లో మెరుగైన రేటింగ్ పాయింట్లు సాధించింది. -
ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు నామినేట్ అయిన టీమిండియా స్టార్లు
2023 సెప్టెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు, ఓ ఇంగ్లండ్ ప్లేయర్ నామినేట్ అయ్యారు. సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన శుభ్మన్ గిల్, మొహమ్మద్ సిరాజ్, డేవిడ్ మలాన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు బరిలో నిలిచారు. గత నెలలో సూపర్ ఫామ్లో ఉండిన గిల్ 80 సగటున 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీల సాయంతో 480 పరుగులు చేశాడు. ఆసియా కప్లో 2 హాఫ్ సెంచరీలు, బంగ్లాదేశ్పై సెంచరీ చేసిన గిల్ టీమిండియా ఆసియా కప్ సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. అనంతరం అదే ఫామ్ను ఆసీస్తో వన్డే సిరీస్కు కూడా కొనసాగించిన గిల్.. ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో 74, రెండో వన్డేలో 104 పరుగులు సాధించి ఔరా అనిపించాడు. సిరాజ్ విషయానికొస్తే.. ఈ హైదరాబాదీ ఎక్స్ప్రెస్ కూడా గత నెలలో భీకర ఫామ్లో ఉన్నాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై నిప్పులు చెరిగిన సిరాజ్ ఏకంగా 6 వికెట్లు సాధించి, వన్డే ర్యాంకింగ్స్లో సైతం ఒక్కసారిగా భారీ జంప్ కొట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ ప్రదర్శనతో పాటు సెప్టెంబర్ మొత్తంలో అద్భుతంగా రాణించిన సిరాజ్ 17.27 సగటున 11 వికెట్లు పడగొట్టాడు. మలాన్ విషయానికొస్తే.. ఓపెనర్గా కొత్త అవతారమెత్తిన మలాన్ ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయి పరుగుల వరద పారిస్తున్నారు. గత నెల న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో వరుసగా 54, 96, 127 పరుగులు చేసిన మలాన్ 105.72 స్ట్రయిక్రేట్తో పరుగులు సాధించి, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. -
చెన్నై సూపర్ కింగ్స్కు దెబ్బ మీద దెబ్బ.. మరో స్టార్ ప్లేయర్ ఔట్
ఐపీఎల్ 2023 సీజన్లో ఫోర్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా ఇప్పటికే దీపక్ చాహర్, సిమ్రన్జీత్ సింగ్, బెన్ స్టోక్స్, ముకేశ్ చౌదరీ సేవలు కోల్పోయిన (తాత్కాలికంగా) ఆ జట్టుకు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. నిన్న (ఏప్రిల్ 12) రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టార్ పేసర్, సఫారీ భారీ కాయుడు సిసండ మగాలా ఫీల్డింగ్ చేస్తూ కుడి చేతి వేలికి దెబ్బ తగిలించుకున్నాడు. గాయం తీవ్రత అధికంగా ఉండటంతో అతను మరో రెండు వారాలు లీగ్కు దూరంగా ఉంటాడని జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. అసలే అంతంత మాత్రంగా ఉన్న సీఎస్కే పేస్ విభాగం.. మగాలా సేవలు కూడా కోల్పోవడంతో దిక్కుతోచని స్థితికి చేరింది. ఆ జట్టుకు పేస్ విభాగంలో మరో ఆప్షన్ కూడా లేదు. దేశీయ పేసర్లు, అంతగా అనుభవం లేని హంగార్గేకర్, తుషార్ దేశ్ పాండే, ఆకాశ్సింగ్లతో తదుపరి మ్యాచ్ల్లో నెట్టుకురావాల్సి ఉంటుంది. డ్వేన్ ప్రిటోరియస్, మతీష పతిరణ లాంటి విదేశీ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నా జట్టు సమీకరణల దృష్ట్యా వీరికి తుది జట్టులో అవకాశం లభించడం కష్టం. తదుపరి మ్యాచ్ సమయానికంతా బెన్ స్టోక్స్ కోలుకున్నా అతను బౌలింగ్ చేయలేని పరిస్థితి. ఐపీఎల్కు ముందే తాను బౌలింగ్ చేయలేనని, కేవలం బ్యాటర్గా అందుబాటులో ఉంటానని స్టోక్స్ చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో, కేవలం బ్యాటింగ్ వనరుల సాయంతో సీఎస్కే నెగ్గుకురావడం దాదాపుగా అసాధ్యం. గాయాల బారిన పడిన పేసర్లు మరో రెండు వారాల్లో అందుబాటులోకి వచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతే చేసేదేమీ ఉండదు. పేస్ బౌలింగ్ విభాగం విషయంలో సీఎస్కే ఆల్టర్నేట్ ఆప్షన్స్ చూసుకోకపోతే చాలా కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ధోని మోకాలి గాయం ఆ జట్టును మరింత కలవరపెడుతుంది. గాయం పెద్దదేమీ కాదని కోచ్ చెప్తున్నప్పటికీ లోలోపల ఆ జట్టు ఆందోళన చెందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాగా, రాజస్థాన్తో నిన్న జరిగిన మ్యాచ్లో సీఎస్కే 3 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు సాధించగా.. ఛేదనలో చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఆఖర్లో రవీంద్ర జడేజా (15 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు), ధోని (17 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్లు) చెన్నైను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మార్చి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరంటే..?
ICC Player Of The Month: 2023, మార్చి నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐసీసీ ఇవాళ (ఏప్రిల్ 12) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును బంగ్లాదేశ్ వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ గెలుచుకున్నాడు. మార్చి నెలలో వివిధ ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శనకు గాను షకీబ్ను ఈ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, యూఏఈ క్రికెటర్ ఆసిఫ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ ఉండినప్పటికీ, అంతిమంగా జ్యూరీ షకీబ్వైపే మొగ్గుచూపింది. మార్చిలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన షకీబ్.. తన జట్టు 1-2 తేడాతో సిరీస్ కోల్పోయినప్పటికీ తాను మాత్రం ఆ సిరీస్లో టాప్ రన్ స్కోరర్గా (బంగ్లా తరఫున), హూయ్యెస్ట్ వికెట్టేకర్గా నిలిచాడు. ఇదే ఫామ్ను టీ20 సిరీస్లోనూ కొనసాగించిన షకీబ్.. బంగ్లాదేశ్ జగజ్జేత ఇంగ్లండ్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఆతర్వాత ఐర్లాండ్తో జరిగిన సిరీస్లోనూ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన షకీబ్.. మొత్తంగా మార్చి నెలలో 12 మ్యాచ్లు ఆడి 353 పరుగులు తీసి 15 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు గెలవడం ఇది రెండోసారి. 2021 జులైలో షకీబ్ ఈ అవార్డును తొలిసారి గెలుచుకున్నాడు. -
ఫిబ్రవరి నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరంటే..?
ICC Player Of The Month: 2023, ఫిబ్రవరి నెల పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐసీసీ ఇవాళ (మార్చి 13) ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఇంగ్లండ్ అప్కమింగ్ స్టార్ హ్యారీ బ్రూక్ గెలుచుకున్నాడు. 3 నెలల వ్యవధిలో బ్రూక్ ఈ అవార్డును సొంతం చేసుకోవడం ఇది రెండోసారి. 2022 డిసెంబర్లోనూ బ్రూక్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడు బ్రూక్ మాత్రమే కావడం విశేషం. బాబర్ 2021 ఏప్రిల్లో, 2022 మార్చిలో ఈ అవార్డును దక్కించుకున్నాడు. 2023, ఫిబ్రవరిలో బ్రూక్కు పోటీగా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, విండీస్ యువ స్పిన్నర్ గుడకేశ్ మోటీ పోటీపడినప్పటికీ, అంతిమంగా అవార్డు బ్రూక్నే వరించింది. బ్రూక్.. ఫిబ్రవరిలో న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్ట్ల్లో 2 హాఫ్ సెంచరీలు, ఓ భారీ సెంచరీ బాదగా.. జడేజా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్ట్ల్లో రెండు ఫైఫర్లతో పాటు అతి విలువైన ఓ హాఫ్ సెంచరీ చేశాడు. విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ విషయానికొస్తే.. ఇండియన్ ఆరిజిన్ కలిగిన ఈ స్పిన్ బౌలర్ ఫిబ్రవరిలో జింబాబ్వేతో జరిగిన రెండు టెస్ట్ల్లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. జడ్డూ, మోటీలతో పోలిస్తే, బ్రూక్కు ఓటింగ్ శాతం అధికంగా రావడంతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ అవార్డుకు అతన్నే ఎంపిక చేసింది. ఇక మహిళల ప్లేయర్ ఆఫ్ ఫిబ్రవరి మంత్ అవార్డు విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డ్నర్ ఈ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు కోసం దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్ట్, ఇంగ్లండ్ నాట్ సీవర్ బ్రంట్ పోటీపడినప్పటికీ, గార్డ్నర్నే అవార్డు వరించింది. బ్రూక్, బాబర్ తరహాలోనే గార్డ్నర్ కూడా ప్లేయర్ అఫ్ ద మంత్ అవార్డును రెండుసార్లు గెలుచుకుంది. 2022 డిసెంబర్లో తొలిసారి ఈ అవార్డుకు ఎంపికైన గార్డ్నర్, 2023 ఫిబ్రవరిలో రెండో సారి ఐసీసీ అవార్డను గెలుచుకుంది. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్.. రేసులో బ్రూక్తో పాటు ఎవరున్నారంటే..?
ఫిబ్రవరి నెలకు గానూ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు నామినీస్ జాబితాను ఐసీసీ ఇవాళ (మార్చి 7) ప్రకటించింది. ఫిబ్రవరి మాసంలో న్యూజిలాండ్తో జరిగిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ రైజింగ్ స్టార్ హ్యారీ బ్రూక్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 తొలి రెండు టెస్ట్ల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా, జింబాబ్వే పర్యటనలో జరిగిన రెండు టెస్ట్ల్లో అదరగొట్టిన విండీస్ యువ స్పిన్నర్ గుడకేశ్ మోటీ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఫిబ్రవరి మంత్ అవార్డు రేసులో ఉన్నారు. బ్రూక్.. న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్ట్ల్లో 2 హాఫ్ సెంచరీలు, ఓ భారీ సెంచరీ బాదగా.. జడేజా తొలి రెండు టెస్ట్ల్లో రెండు ఫైఫర్లతో పాటు అతి విలువైన ఓ హాఫ్ సెంచరీ చేశాడు. విండీస్ స్పిన్నర్ గుడకేశ్ మోటీ విషయానికొస్తే.. ఇండియన్ ఆరిజిన్ కలిగిన ఈ స్పిన్ బౌలర్ జింబాబ్వేతో జరిగిన రెండు టెస్ట్ల్లో ఏకంగా 19 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. -
ఐపీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. రేసులో గిల్, సిరాజ్
జనవరి నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు పోటీ పడుతున్న క్రికెటర్ల జాబితాను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. పురుషుల విభాగంలో ఈ అవార్డుకు టీమిండియా నుంచి ఇద్దరు క్రికెటర్లు రేసులో ఉన్నారు. ఆ ఇద్దరే శుబ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్. వీరిద్దరితో పాటు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డెవన్ కాన్వే కూడా పోటీ పడుతున్నాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. టీమిండియాకు లభించిన ఆణిముత్యం శుబ్మన్ గిల్. కొన్నాళ్లుగా టెస్టులు మాత్రమే ఆడిన గిల్ తాజాగా వన్డేలు,టి20ల్లో తన హవా కొనసాగిస్తున్నాడు. మొదట శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో అతడు 70, 21, 116 రన్స్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో హైదరాబాద్ లో జరిగిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ బాది తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. కేవలం 149 బాల్స్ లోనే 208 రన్స్ చేయడం విశేషం. అదే సిరీస్ లో తర్వాతి రెండు వన్డేల్లో 40, 112 స్కోర్లు చేశాడు.ఇక న్యూజిలాండ్ తో టి20 సిరీస్లోనూ రెచ్చిపోయాడు. టి20 ఫార్మాట్ కు పనికి రాడన్న విమర్శలకు చెక్ పెడుతూ చివరి మ్యాచ్ లో మెరుపు సెంచరీ సాధించాడు. An outrageous double hundred from Shubman Gill in Hyderabad 💥 A few incredible stats from the knock 👉 https://t.co/JgdSiZfaij#INDvNZ pic.twitter.com/ynfJezRaPX — ICC (@ICC) January 18, 2023 మరోవైపు హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ టీమిండియాలో క్రమంగా ప్రధాన బౌలర్గా ఎదుగుతున్నాడు. బుమ్రా లేని లోటును తీరుస్తున్నాడు. వన్డేల్లో ఇప్పటికే నంబర్ వన్ ర్యాంకు కూడా అందుకున్నాడు.శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో అతడు మొత్తం 9 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత తన హోమ్ గ్రౌండ్ హైదరాబాద్ లో న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్లు తీసుకున్నాడు. రెండో వన్డేలో ఆరు ఓవర్లు వేసి కేవలం 10 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక కొత్త ఏడాదిని డెవన్ కాన్వే అద్భుతంగా ఆరంభించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి జనవరిలో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు బాదిన కాన్వే తన సూపర్ఫామ్ను కంటిన్యూ చేస్తున్నాడు. Devon Conway's match-winning knock earned him the Player of the Match award against Pakistan in Karachi 🏅#NZvPAK pic.twitter.com/zk7sDmUwSw — ICC (@ICC) January 11, 2023 -
డిసెంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరంటే..?
డిసెంబర్ నెల 2022 పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐసీసీ ఇవాళ (జనవరి 10) ప్రకటించింది. భీకర ఫామ్లో ఉన్న ఇంగ్లండ్ మిడిలార్డర్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. 23 ఏళ్ల ఈ ఇంగ్లీష్ యువ బ్యాటర్ ఇటీవల ముగిసిన పాకిస్థాన్ టూర్లో విశేషంగా రాణించి 3 టెస్ట్లో ఏకంగా 468 పరుగులు స్కోర్ చేశాడు. ఫలితంగానే అతన్ని ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు వరించింది. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం బ్రూక్.. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఆసీస్ ఆల్రౌండర్ ట్రవిస్ హెడ్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నప్పటికీ, ఐసీసీ అతడివైపే మొగ్గుచూపింది. డిసెంబర్లో బ్రూక్ ఆడిన 3 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేసి, పాక్ను వారి సొంతగడ్డపై 17 ఏళ్ల తర్వాత మట్టికరిపించడంలో కీలకంగా వ్యవహరించాడు. పాక్తో టెస్ట్ సిరీస్లో బ్రూక్ సహా మిగతా ఇంగ్లీష్ ప్లేయర్లంతా మూకుమ్మడిగా రాణించడంతో ఇంగ్లండ్ 3-0 తేడాతో పాక్ను ఊడ్చేసింది. ఇక మహిళల ప్లేయర్ ఆప్ ద మంత్ అవార్డు విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డ్నర్ ఈ అవార్డును గెలుచుకుంది. డిసెంబర్ నెలలో భారత్తో జరిగిన టీ20 సిరీస్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆష్లే.. ఈ సిరీస్లో 166.66 స్టయిక్ రేట్తో 115 పరుగులు చేసి 18.28 సగటున 7 వికెట్లు పడగొట్టింది. ఈ అవార్డు కోసం ఆష్లే.. న్యూజిలాండ్ సూజీ బేట్స్, ఇంగ్లండ్ చార్లీ డీన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంది. కాగా, పురుషుల ప్లేయర్ ఆఫ్ డిసెంబర్ మంత్ అవార్డు గెలుచుకున్న హ్యారీ బ్రూక్ను ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (నవంబర్) ఎవరంటే..?
Jos Buttler: నవంబర్ నెల ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ ఎగరేసుకుపోయాడు. ఈ అవార్డు కోసం సహచరుడు ఆదిల్ రషీద్, పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిదిల నుంచి పోటీ ఎదుర్కొన్న జోస్.. అత్యధిక శాతం ఓటింగ్తో ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నాడు. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగిన టీ20 వరల్డ్కప్-2022లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఇంగ్లండ్ను జగజ్జేతగా నిలిపిన బట్లర్.. తొలిసారి ఈ ఐసీసీ అవార్డును అందుకున్నాడు. వరల్డ్కప్ సెమీస్లో టీమిండియాపై ఆడిన మెరుపు ఇన్నింగ్స్ను (49 బంతుల్లో 80 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) పరిగణలోకి తీసుకున్న ఐసీసీ ఈ అవార్డుకు జోస్ను ఎంపిక చేసింది. తనకు ఈ అవార్డు లభించడంపై బట్లర్ స్పందించాడు. తనకు ఓటు వేసి గెలిపించిన వారందరికీ అతను ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫిమేల్ అవార్డును పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ సిద్రా అమీన్ గెలుచుకుంది. అమీన్.. నవంబర్లో ఐర్లాండ్లో జరిగిన వన్డే సిరీస్లో విశేషంగా రాణించి ఈ అవార్డుకు ఎంపికైంది. కాగా, ఈ అవార్డుకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూడా పాకిస్తాన్ ఆటగాళ్లు ఎంపిక కావడం విశేషం. సెప్టెంబర్లో పాక్ ఓపెనింగ్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఈ అవార్డును గెలుచుకోగా, అక్టోబర్లో పాక్ మహిళా క్రికెటర్ నిదా దార్ ఈ అవార్డును దక్కించుకుంది. -
POTM: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఇండియా, పాకిస్తాన్ క్రికెటర్లు
ICC Player Of The Month Winners: రికార్డుల రారాజు, టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి మరో ఘనత అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్న ఈ స్టార్ బ్యాటర్.. అక్టోబరు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా నిలిచాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి సోమవారం వెల్లడించింది. పురుషుల క్రికెట్ విభాగంలో డేవిడ్ మిల్లర్, సికందర్ రజాలను వెనక్కి నెట్టి అత్యధిక ఓట్లతో కోహ్లి విజేతగా నిలిచినట్లు తెలిపింది. పాక్ ఆల్రౌండర్ నిదా ఇక మహిళల విభాగంలో వెటరన్ ఆల్రౌండర్ నిదా దర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కించుకుంది. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్కప్-2022లో కోహ్లి హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్టోబరు నెల ముగిసే సరికి 205 పరుగులతో నిలిచాడు కోహ్లి. పాకిస్తాన్, నెదర్లాండ్స్తో మ్యాచ్లలో అద్భుత అర్ధ శతకాలతో మెరిశాడు. ఇక మహిళల ఆసియా కప్-2022 టోర్నీలో రాణించిన నిదా దర్ అక్టోబరు నెలలో 145 పరుగులు సాధించడం సహా ఎనిమిది వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు- అక్టోబరు 2022 విరాట్ కోహ్లి- ఇండియా నిదా దర్- పాకిస్తాన్ చదవండి: ఆసీస్కు అవమానం! టాప్ రన్ స్కోరర్లు, అత్యధిక వికెట్ల వీరులు! కోహ్లి తర్వాత సూర్య మాత్రం కాదు! WC 2022: ఒక్క క్యాచ్తో తారుమారు: సౌతాఫ్రికాలో పుట్టి ఆ జట్టునే దెబ్బకొట్టిన ప్లేయర్లు.. జట్టులో తెలుగు కుర్రాడు కూడా! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు విన్నర్లుగా భారత్, పాక్ ప్లేయర్లు
ICC Player Of The Month For September: సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులను భారత్, పాక్ ప్లేయర్లు గెలుచుకున్నారు. పురుషుల విభాగానికి సంబంధించి ఈ అవార్డును పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ గెలుచుకోగా.. మహిళల విభాగంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ విన్నర్గా నిలిచారు. పురుషుల విభాగంలో రిజ్వాన్కు టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కెమరూన్ గ్రీన్ నుంచి పోటీ ఎదురు కాగా.. మహిళల విభాగంలో హర్మన్.. సహచరి మంధాన, బంగ్లా ప్లేయర్ నిగర్ సుల్తానా నుంచి పోటీ ఎదుర్కొంది. రిజ్వాన్, హర్మన్లు ఆయా విభాగాల్లో ప్రత్యర్ధుల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నప్పటికీ.. సెప్టెంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కారణంగా అవార్డులు వీరినే వరించాయి. సెప్టెంబర్లో వీరి ప్రదర్శన విషయానికొస్తే.. ఈ నెలలో పాక్ ఆటగాడు రిజ్వాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో రిజ్వాన్ పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోయాడు. ఓ పక్క తన సహచరులంతా విఫలమవుతున్నా రిజ్వాన్ ఒక్కడే దాదాపు ప్రతి మ్యాచ్లో రాణించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. గత నెలలో అతనాడిన 10 టీ20ల్లో ఏకంగా 7 అర్ధశతకాలు బాది ఔరా అనిపించాడు. ఇక హర్మన్ విషయానికొస్తే.. ఈ టీమిండియా క్రికెటర్ గత మాసంలో బ్యాటర్గానే కాకుండా కెప్టెన్గానూ భారీ సక్సెస్ సాధించింది. అలాగే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న తొలి భారత మహిళా క్రికెటర్గానూ రికార్డుల్లోకెక్కింది. హర్మన్ నేతృత్వంలో టీమిండియా.. ఇంగ్లండ్ను తొలిసారి వారి స్వదేశంలో 3-0 తేడాతో (వన్డే సిరీస్) చిత్తు చేసింది. ఈ సిరీస్లో ఆమె 103.27 సగటున 221 స్ట్రయిక్ రేట్తో 221 పరుగులు చేసింది. ఇందులో ఓ సెంచరీ (143 నాటౌట్), అర్ధసెంచరీ (74 నాటౌట్) ఉన్నాయి. -
సికిందర్ రజా సరి కొత్త చరిత్ర.. తొలి జింబాబ్వే క్రికెటర్గా
జింబాబ్వే ఆల్రౌండర్ సికిందర్ రజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డును సికిందర్ రజా దక్కించుకున్నాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న తొలి జింబాబ్వే క్రికెటర్గా రజా నిలిచాడు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో రజాకు.. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మెక్గ్రాత్కు ఈ అవార్డు లభించింది. వరుసగా మూడు సెంచరీలు స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్తో వన్డే సిరీస్లో రజా సెంచరీలు మోత మెగించాడు. వరుసగా మూడు అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్పై రెండు సెంచరీలు చేయగా..భారత్పై ఒక సెంచరీని నమోదు చేశాడు. అదే విధంగా బంగ్లాతో వన్డే సిరీస్ను జింబాబ్వే క్లీన్ స్వీప్ చేయడంలో రజా కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా బౌలింగ్లో రజా సత్తా చాటాడు. గత నెలలో ఓవరాల్గా రజా ఏడు వికెట్లు పడగొట్టాడు. రజా ఈ అద్భుతమైన ప్రదర్శనతో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, న్యూజిలాండ్ ఆల్రౌండర్ మిచెల్ సాంట్నర్ను వెనుక్కి నెట్టి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. చదవండి: Veda Krishnamurthy: కర్ణాటక బ్యాటర్తో భారత మహిళా క్రికెటర్ 'ఎంగేజ్మెంట్'.. ఫొటోలు వైరల్ -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్లు వీరే!
ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఈ అవార్డు కోసం ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ షార్ట్లిస్ట్ చేసింది. వారిలో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, జింబాబ్వే స్టార్ ఆల్రౌండర్ సికిందర్ రజా, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ ఉన్నారు. కాగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగుతోన్న టెస్టు సిరీస్లో బెన్ స్టోక్స్ అద్భుతమైన ప్రధర్శన కనబరుస్తున్నాడు. ప్రోటీస్తో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లతో పాటు అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు. ఇక సికిందర్ రజా ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్, భారర్తో జరిగిన సిరీస్లలో రజా అదరగొట్టాడు. ఈ నెలలో అతడు మూడు అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేశాడు. బంగ్లాదేశ్తో వన్డే, టీ20 సిరీస్లను జింబాబ్వే కైవసం చేసుకోవడంలో రజా కీలక పాత్ర పోషించాడు. ఇక మిచిల్ సాంట్నర్ విషయానికి వస్తే.. సాంట్నర్ యూరప్ టూర్లో భాగంగా నెదర్లాండ్స్పై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. నెదర్లాండ్స్తో జరిగిన మూడో వన్డేలో సాంట్నర్ 42 బంతుల్లో 77 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. ఇక మహిళల విభాగం నుంచి ఈ అవార్డుకు.. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీ, భారత మిడిలార్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మెక్గ్రాత్ నామినెట్ అయ్యారు. చదవండి: Ind Vs Pak: అర్ష్దీప్ బంగారం.. అతడిని ఏమీ అనకండి.. నిజంగా ఇది సిగ్గుచేటు: భారత మాజీ క్రికెటర్ -
ICC: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేతలు వీరే!
జూలై నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ది మంత్ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో శ్రీలంక స్పిన్ సంచలనం ప్రబాత్ జయసూర్య, మహిళల క్రికెట్ విభాగంలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ ఎమ్మా లాంబ్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నారు. కాగా జయసూర్య ఆస్ట్రేలియాతో తన అరంగేట్ర టెస్టులోనే 12 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. అనంతరం స్వదేశంలో పాకిస్తాన్తో జరిగిన టెస్టు సిరీస్లోనూ జయసూర్య సత్తాచాటాడు. ఈ సిరీస్లో జయసూర్య 17 వికెట్లు సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో జయసూర్య జూలై నెలకు గాను నామినెట్ అయిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెయిర్ స్టో, ఫ్రెంచ్ సంచలనం గుస్తావ్ మెక్కీన్ను వెనుక్కి నెట్టి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఎమ్మా లాంబ్ సంచలనం దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన వన్డే సిరీస్లో లాంబ్ అదరగొట్టింది. ఈ సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన ఆమె.. 234 పరుగులతో పాటు 3వికెట్లు పడగొట్టింది. దీంతో లాంబ్.. ఇంగ్లండ్ ఆల్రౌండర్ స్వైవర్, భారత్ పేసర్ రేణుకా సింగ్ను అధిగమించి ఈ ప్రతిష్టాత్మక అవార్డును లంబ్ దక్కించుకుంది. చదవండి: ZIM Vs BAN 2nd ODI: బంగ్లాదేశ్కు చుక్కలు చూపించిన జింబాబ్వే.. వన్డే సిరీస్ సొంతం! -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ ఎవరంటే..?
2022 జులై నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ద మంత్ నామినీస్ జాబితాను ఐసీసీ బుధవారం (ఆగస్ట్ 3) ప్రకటించింది. పురుషుల క్రికెట్కు సంబంధించి ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు జానీ బెయిర్స్టో, శ్రీలంక సంచలన స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య, ఫ్రాన్స్ యువ చిచ్చరపిడుగు గుస్తావ్ మెక్కియోన్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మహిళల కేటగిరీలో టీమిండియా యువ బౌలర్ రేణుకా సింగ్, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్లు ఎమ్మా లాంబ్, నతాలీ సీవర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచారు. జూన్ నెల మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా నిలిచిన బెయిర్స్టో తన కెరీర్ బెస్ట్ ఫామ్ను కొనసాగిస్తూ.. జులై నెల నామినీస్ జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. భారత్తో జరిగిన రీషెడ్యూల్ టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకాలు (106, 114*) బాదిన బెయిర్స్టో.. ఆ ప్రదర్శన ఆధారంగానే ఈ జాబితాలో చోటు దక్కించకున్నాడు. అనంతరం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 63 పరుగులు చేసిన అతను.. ఆతర్వాత జరిగిన తొలి టీ20లో 53 బంతుల్లో 90 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. ఇక లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య విషయానికొస్తే.. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ జులై నెలలో తానాడినడిన 3 టెస్ట్ల్లో ఏకంగా 29 వికెట్లు నేలకూల్చి ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచాడు. ఆసీస్పై 6/118, 6/59.. ఆతర్వాత పాక్పై తొలి టెస్ట్లో 5/82, 4/135, రెండో టెస్ట్లో 3/80, 5/117 అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. గుస్తావ్ మెక్కియోన్ విషయానికొస్తే.. ఈ ఫ్రెంచ్ యువ బ్యాటర్ టీ20ల్లో వరుసగా రెండు విధ్వంసకర సెంచరీలతో (109, 101) ప్లేయర్ ఆఫ్ ద మంత్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. మహిళల కేటగిరీలో రేణుకా సింగ్ ఐదు మ్యాచ్ల్లో 12 వికెట్ల ప్రదర్శనతో.. లాంబ్ 3 మ్యాచ్ల్లో 102, 67, 65 అదిరిపోయే ప్రదర్శనతో.. సీవర్ వరుస హాఫ్ సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ద మంత్ రేసులో నిలిచారు. చదవండి: భారత్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. హైదరాబాద్లో మ్యాచ్ ఎప్పుడంటే..? -
ICC POTM: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేతలు వీరే!
ICC Players of the Month- May: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను సోమవారం ప్రకటించింది. పురుషుల క్రికెట్ విభాగంలో మే నెలకుగానూ శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్.. మహిళల విభాగంలో పాకిస్తాన్ స్పిన్ సంచలనం తుబా హసన్ ఈ అవార్డు గెలుచుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఐసీసీ మీడియా ప్రకటన విడుదల చేసింది. తొలి ఆటగాడిగా కాగా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో ఏంజెలో మాథ్యూస్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. శ్రీలంక.. బంగ్లాదేశ్లో పర్యటనలో భాగంగా చట్టోగ్రామ్, మీర్పూర్ టెస్టుల్లో కలిపి అతడు 344(వరుసగా 199, 145) పరుగులు సాధించాడు. తద్వారా లంక సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికై ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా నిలిచిన తొలి శ్రీలంక ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసి మాథ్యూస్.. తనకు మద్దతుగా నిలిచిన సహచర ఆటగాళ్లు, సిబ్బంది.. ఆ దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నానంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. మనపై మనకు నమ్మకం ఉంటే అసాధ్యమన్నది ఏదీ ఉండదని, ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించాడు. అరంగేట్రంలోనే అదరగొట్టి.. ఇక తుబా విషయానికొస్తే.. 21 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ శ్రీలంకతో టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టింది. ఈ సిరీస్లో మొత్తంగా 5 వికెట్లు పడగొట్టిన ఆమె.. పాక్ ఏకపక్ష విజయంలో కీలక పాత్ర పోషించింది. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుంది. ఇప్పుడు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును కూడా సొంతం చేసుకుంది. అరంగేట్రంలోనే అదరగొట్టిన తుబాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చదవండి: Ind Vs SA 3rd T20: వైజాగ్లో గ్రౌండ్ చిన్నది.. అతడిని తప్పక ఆడించండి.. లేదంటే! Joe Root: కుమారుల సెంచరీలు.. తండ్రుల ఆత్మీయ ఆలింగనం.. వీడియో! -
ICC POTM: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ ఏప్రిల్ విజేత ఎవరంటే!
ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో ఏప్రిల్ నెలకు గానూ దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఈ అవార్డును గెలుచుకున్నట్లు వెల్లడించింది. కాగా బంగ్లాదేశ్తో స్వదేశంలో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కేశవ్ మహరాజ్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్లలో కలిపి అతడు మొత్తంగా 16 వికెట్లు తీశాడు. తద్వారా దక్షిణాఫ్రికా సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుపొందాడు. ఇక ఇదే సిరీస్లో దక్షిణాఫ్రికా మరో ఆటగాడు సిమోన్ హార్మర్ కూడా ఆకట్టుకున్నాడు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడు కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్కు నామినేట్ అయ్యాడు. మరోవైపు ఒమన్ ఓపెనర్ జతిందర్ సింగ్ కూడా ఏప్రిల్లో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ లీగ్2లో నాలుగు మ్యాచ్లలో కలిపి 259 పరుగులు చేసి పోటీలో నిలిచాడు. అయితే, వీరందరినీ దాటుకుని కేశవ్ మహరాజ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రొటిస్ మాజీ బ్యాటర్, ప్రస్తుత వోటింగ్ పానెల్ సభ్యుడు జేపీ డుమిని కేశవ్పై ప్రశంసలు కురిపించాడు. అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. చదవండి: Devon Conway: కాన్వే జోరు వెనుక ప్రధాన సూత్రధారి ఎవరంటే? 7️⃣ wickets at Keshav Maharaj's home ground💚 🇿🇦 #SAvBAN #BetwayTestSeries #BePartOfIt | @Betway_za pic.twitter.com/cIcqpKD50Q — Cricket South Africa (@OfficialCSA) April 4, 2022 -
ICC: ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ విజేతలు వీరే!
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను సోమవారం ప్రకటించారు. పురుషుల విభాగంలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. మహిళా క్రికెట్ విభాగంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ రాచెల్ హేన్స్లను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. మార్చి నెలకు గానూ వీరిద్దరిని ఎంపిక చేసినట్లు ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. కాగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో కరాచీ వేదికగా జరిగిన టెస్టు సిరీస్లో బాబర్ ఆజమ్ రాణించాడు. ముఖ్యంగా రెండో టెస్టులో 196 పరుగులు చేసి సత్తా చాటాడు. మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన ఉస్మాన్ ఖవాజా(ఆసీస్ బ్యాటర్), అబ్దుల్లా షఫీక్ తర్వాతి స్థానంలో (టాప్-3 రన్ స్కోరర్) నిలిచాడు. ఈ సిరీస్లో మొత్తంగా ఒక సెంచరీ, రెండు అర్ధ శతకాల సాయంతో 390 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ టెస్టు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్, ఆస్ట్రేలియా టెస్టు సారథి ప్యాట్ కమిన్స్లను వెనక్కి నెట్టి అవార్డు సొంతం చేసుకున్నాడు. The crowd cheers, the lion roars. @babarazam258 owns the day. #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/ndM0RNWPTG — Pakistan Cricket (@TheRealPCB) March 15, 2022 రాచెల్ అద్బుతం! ఇదిలా ఉండగా.. ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్-2022 టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలవడంలో ఆ జట్టు ఓపెనర్ రాచెల్ హేన్స్ పాత్ర కీలకం. మార్చి నెలలో ఆమె సాధంచిన మొత్తం పరుగుల సంఖ్య 429 పరుగులు. ఇంగ్లండ్తో మ్యాచ్లో రాచెల్ చేసిన క్లాసీ సెంచరీ(130 పరుగులు) అన్నింటికంటే హైలైట్గా నిలిచింది. ఈ అద్భుత ప్రదర్శనతో ఆమె మార్చి నెలకు గానూ ఆసీస్ స్టార్ అలిస్సా హేలీని, ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లిస్టోన్, దక్షిణాఫ్రికా ఓపెనర్ లారా వొల్వార్డ్లను వెనక్కి నెట్టి అవార్డు దక్కించుకున్నారు. నిలకడైన ఆట తీరుతో ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీస్ ఎవరంటే..?
2022 మార్చి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు నామినీస్ జాబితాను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఆస్ట్రేలియా టెస్ట్ సారధి పాట్ కమిన్స్, వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ చోటు దక్కించుకున్నారు. గత నెలలో ఆసీస్తో జరిగిన టెస్ట్, వన్డే సిరీస్లలో అద్భుతంగా రాణించిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో ముందుండగా.. రెండున్నర దశాబ్దాల తర్వాత పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించిన ఆసీస్ సారధి పాట్ కమిన్స్, ఇంగ్లండ్పై టెస్ట్ సిరీస్లో సంచలన ప్రదర్శన చేసిన విండీస్ కెప్టెన్ బ్రాత్వైట్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆసీస్తో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 5 ఇన్నింగ్స్ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 78 సగటున 390 పరుగులు చేసిన పాక్ కెప్టెన్.. అనంతరం జరిగిన వన్డే సిరీస్లోనూ రెచ్చిపోయాడు. 3 వన్డేల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాధించి తన జట్టుకు ఒంటిచేత్తో సిరీస్ విజయాన్నందించాడు. సిరీస్లో భాగంగా జరిగిన ఏకైక టీ20లో సైతం చెలరేగిన బాబర్.. మరో హాఫ్ సెంచరీ బాది కెరీర్లో అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్నాడు. ఇదే సిరీస్లో ఆసీస్ స్కిప్పర్ పాట్ కమిన్స్ ఆఖరి టెస్ట్లో 8 వికెట్లు సాధించి, తన జట్టు చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. టెస్ట్ సిరీస్లో మొత్తం 12 వికెట్లు సాధించిన కమిన్స్.. సిరీస్ ఆధ్యాంతం జట్టును అద్భుతంగా ముందుండి నడిపించాడు. మరోవైపు ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో సంచలన ప్రదర్శన చేసిన విండీస్ సారధి బ్రాత్వైట్.. సిరీస్లో భాగంగా జరిగిన 3 టెస్ట్ల్లో సెంచరీ, 2 అర్ధసెంచరీల సాయంతో 85.25 సగటున 341 పరుగులు చేశాడు. బ్రాత్వైట్ సంచలన ప్రదర్శన కారణంగా విండీస్.. పర్యాటక ఇంగ్లండ్ జట్టును ఖంగుతినిపించి టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకుంది. చదవండి: భారత క్రికెటర్లకు శుభవార్త.. బయో బబుల్పై బీసీసీఐ కీలక నిర్ణయం..! -
శ్రీలంకపై దుమ్మురేపాడు..‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా అయ్యర్!
టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికయ్యాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో అయ్యర్ అద్భుత ప్రదర్శన గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ సిరీస్లో అయ్యర్ హ్యాట్-ట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ సిరీస్లో అయ్యర్ 204 పరుగులు చేశాడు. శ్రీలంకపై అద్భుత ప్రదర్శనతో అయ్యర్ ఐసీసీ టీ20 ర్యాకింగ్స్లో ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకున్నాడు. ఇక శ్రీలంకతో జరగుతోన్న టెస్టుల్లోను అయ్యర్ అద్భుతంగా రాణిస్తోన్నాడు. బెంగళూరు వేదికగా జరుగుతోన్న రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్లలోను అయ్యర్ ఆర్ధసెంచరీలు సాధించాడు. మరో వైపు ఫిబ్రవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమీలియా కేర్ ఎంపికైంది. గత నెలలో భారత్తో జరిగిన వన్డే సిరీస్లో కేర్ అద్భుతంగా రాణించింది. చదవండి: IPL 2022: ధోని.. నా ఆలోచనలకు పూర్తి భిన్నంగా చేసేవాడు.. నేనేమీ కోహ్లిని కాదుగా: డు ప్లెసిస్ -
టీమిండియాపై దుమ్మురేపాడు.. ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా
దక్షిణాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సన్ జనవరి నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో పీటర్సన్ అద్భుత ప్రదర్శనకు గాను అతన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ సిరీస్లో పీటర్సన్ 244 పరుగులు చేశాడు. అంతే కాకుండా సిరీస్ను 2-1తో ప్రోటీస్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అదే విధంగా అతను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. మరోవైపు, జనవరి నెల మహిళల ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ ఎంపికైంది. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల యాషెస్ టెస్టులో నైట్ 216 పరుగులు చేసింది. తొ్లి ఇన్నింగ్స్లో 164 పరుగులు సాధించి ఇంగ్లండ్కు భారీ స్కోర్ను అందించింది. అయితే ఆస్ట్రేలియా కూడా పోరడడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చదవండి: IPL 2022 Auction-Tilak Varma: తండ్రి ఫెయిలైన ఎలక్ట్రిషియన్.. తెలుగుతేజం తిలక్వర్మ కథేంటి -
చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే..!
అండర్ 19 ప్రపంచకప్లో ప్రకంపనలు సృష్టించి, బేబీ ఏబీ డివిలియర్స్గా ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికా కుర్రాడు డెవాల్డ్ బ్రెవిస్.. ఓ అరుదైన ఘనత సాధించాడు. సీనియర్ స్థాయిలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్(జనవరి 2022) అవార్డుకు నామినేట్ అయ్యాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి నాన్ సీనియర్ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. బ్రెవిస్తో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్(జనవరి) రేసులో దక్షిణాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సన్, బంగ్లా బౌలర్ ఎబాదత్ హొసేన్ ఉన్నారు. కాగా, ఇటీవల జరిగిన అండర్ 19 ప్రపంచకప్లో బ్రెవిస్ ఆకాశమే హద్దుగా చెలరేగి 84.33 సగటున 506 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అండర్ 19 స్థాయి క్రికెట్లో పలు రికార్డులను నెలకొల్పాడు. సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్(505 పరుగులు) పేరిట ఉన్న రికార్డును ఒక్క పరుగుల తేడాతో బద్ధలు కొట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును సైతం ఎగరేసుకుపోయాడు. ఇదిలా ఉంటే, జూనియర్ స్థాయిలో పరుగుల వరద పారిస్తున్న బేబీ ఏబీడీపై ఐపీఎల్ ఫ్రాంఛైజీలన్నీ కన్నేశాయి. త్వరలో జరగనున్న మెగా వేలంలో అతనికి భారీ ధర దక్కడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చదవండి: IND VS WI: రెండో వన్డేకు ప్రత్యేక అతిథులు.. సీనియర్లను ఉత్సాహపరిచిన జగజ్జేతలు -
టీమిండియా ఓపెనర్కు నిరాశ.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న న్యూజిలాండ్ స్పిన్నర్
Ajaz Patel: టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్కు నిరాశ ఎదురైంది. డిసెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ అవార్డు రేసులో మాయంక్ అగర్వాల్, అజాజ్ పటేల్లతో పాటు ఆస్ట్రేలియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఉన్నప్పటికీ.. అజాజ్నే అవార్డు వరించింది. గతేడాది డిసెంబర్లో ముంబై వేదికగా భారత్తో జరిగిన రెండో టెస్ట్లో ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్ల పడగొట్టిన అజాజ్.. జిమ్లేకర్, అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ టెస్ట్లో మొత్తం 14 వికెట్లు తన ఖాతాలోకి వేసుకున్న అజాజ్.. తన జన్మస్థలమైన ముంబైలో అరుదైన ఫీట్ను సాధించాడు. కాగా, అవార్డు ప్రకటన సందర్భంగా ఐసీసీ ఓటింగ్ కమిటీ మెంబర్ జేపీ డుమిని మాట్లాడుతూ.. క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా జరిగే 10 వికెట్ల ఫీట్ను అందుకున్న అజాజ్కు ఐసీసీ జ్యూరీతో పాటు అభిమానులు భారీ ఎత్తున ఓటింగ్ చేశారని, మరి ముఖ్యంగా భారత అభిమానులు అజాజ్ పటేల్కు భారీ ఎత్తున మద్దతు తెలిపారని పేర్కొన్నాడు. అజాజ్ సాధించిన ఫీట్ చాలా ప్రత్యేకమైందని, చరిత్రలో ఓ మైలురాయిగా మిగిలిపోతుందని డుమిని అన్నాడు. చదవండి: NZ Vs BAN: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదు -
ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా ఓపెనర్.. పది వికెట్ల కివీస్ బౌలర్ కూడా..
2021 డిసెంబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ నామినేట్ అయ్యాడు. అతనితో పాటు న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ కూడా అవార్డు రేసులో నిలిచారు. టీమిండియా రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ గైర్హాజరీలో జట్టులోకి వచ్చిన మయాంక్.. గత నెలలో ఆడిన రెండు టెస్ట్ల్లో (న్యూజిలాండ్తో సిరీస్లో ఒకటి, ప్రస్తుత సౌతాఫ్రికా సిరీస్లో తొలి టెస్ట్) 69 సగటుతో 276 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. An Aussie fast bowler, an in-form India opener and a record-equaling spinner from New Zealand. Who will be your ICC Men's Player of the month? 👀 Details 👉 https://t.co/XsumbkHtzj And VOTE 🗳️ https://t.co/FBb5PMInKI pic.twitter.com/hhZeqJIopf — ICC (@ICC) January 8, 2022 ఇక ఇదే సిరీస్లో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒక ఇన్నింగ్స్లో పది వికెట్ల సాధించి.. జిమ్లేకర్, అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసాడు. ఆ టెస్ట్లో మొత్తం 14 వికెట్లను తన ఖాతాలోకి వేసుకున్న అజాజ్.. మాయంక్తో పాటు అవార్డు రేసులో నిలిచాడు. మరోవైపు ప్రస్తుత యాషెస్ సిరీస్లో సత్తా చాటుతున్న ఆసీస్ ఆటగాడు మిచెల్ స్టార్క్ వీరికి పోటీగా నిలిచాడు. స్టార్క్ డిసెంబర్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో 19.64 సగటుతో 14 వికెట్లు తీశాడు. చదవండి: పాక్ మాజీ కెప్టెన్ ఫిక్సింగ్ చేయమన్నాడు.. షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు