idol
-
అనపర్తిలో అధికార పార్టీ నేతల అరాచకం
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: అనపర్తిలో అధికార పార్టీ నేతలు అరాచకానికి తెరతీశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆలయం ప్రారంభించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అనపర్తి కొత్తూరులో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.20 లక్షల వ్యయంతో ఆలయం నిర్మించారు.విగ్రహ ప్రతిష్ట ఇవాళ జరగాల్సి ఉండగా, నోటీసులు అందచేసిన అధికారులు విగ్రహ ప్రతిష్ట నిలుపుదల చేయించారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఆహ్వానం లేకపోవడం వల్లే ఆలయాన్ని ప్రారంభించనివ్వడం లేదని స్థానికులు అంటున్నారు. ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తూరు వద్ద భారీగా మోహరించిన పోలీసులు.. 144 సెక్షన్ విధించారు. -
ఆ ఘటన వెనుక ఉగ్రకోణం.. హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కుమ్మరిగూడ ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం వెనుక ఉగ్ర కోణం ఉందంటూ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. వెలుగులోకి వస్తున్న వాస్తవాలు, నిషిద్ధిత ఉగ్రవాద సంస్థ ఐ సీస్, ఇస్లామిక్ స్టేట్ (ఖురాసాన్ ప్రావిన్స్) అంతర్జాలం ద్వారా భారత్లో తీవ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆగష్టు 17న కేంద్ర గృహ మంత్రిత్వ శాఖకు ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు ఫిర్యాదు చేశారు. మారేడుపల్లి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషన్ వేశారు.సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం ఘటనం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. గత సోమవారం తెల్లవారు జామున ఆలయం వద్దకు వచ్చిన ఓ గుర్తు తెలియని యువకుడు గుడి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లాడు. గర్భగుడిలోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. అనంతరం ఆలయం పైకి ఎక్కి అక్కడ ఉన్న విగ్రహాలను ధ్వంసం చేసేందుకు యత్నించాడు.దీనిని గుర్తించిన ఓ వ్యక్తి అతడిని పట్టుకున్నాడు. అంతలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిని మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. -
దుర్గాదేవి విగ్రహాల తయారీలో 'పుణ్యమట్టి' కథేంటో తెలుసా..!
బొజ్జ గణపయ్య నవరాత్రులు పూర్తైన వెంటనే దసరా సందడి, హడవిడి మొదలైపోతుంది. ఇక శిల్పులంతా దుర్గాదేవి విగ్రహాల తయారీలో తలమునకలై ఉంటారు. అయితే ఈ దుర్గమ్మ విగ్రహాల తయారీలో ఓ ప్రత్యేకత ఉంది. అది అనాదిగా వస్తున్న సంప్రదాయమని చెబుతున్నారు శిల్పకారులు. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వింత చూసి ఎంతైన 'అమ్మ' కదా ఏ బిడ్డను చులకనగా వదిలేయదు కదా..అనిపిస్తుంది. ఇంతకీ ఏంటా ప్రత్యకత అంటే..దుర్గమ్మ విగ్రహాలు తయారు చేయాడానికి నాలుగు విషయాలు అత్యంత కీలకం. తయారీకి శిల్పులు గంగానది ఒడ్డును ఉన్న మట్టి, గోవు పేడ, గో మూత్రం, ఇంకా వేశ్యల ఇంటిలోని మట్టిని ఉపయోగిస్తారు. ఈ మట్టిని ” నిషిద్ధో పల్లిస్ ” అని పిలుస్తారు. ఇందులో ఏది లేకపోయినా విగ్రహం అసంపూర్ణమని వారు భావిస్తారట. అంతేగాదు అందుకోసం ప్రతి శిల్పకారుడు వేశ్య గృహాలకు వెళ్లి వారి ప్రాంగణంలో మట్టి కావాలని అభ్యర్థిస్తారట. తమకు మట్టి లభించేవరకు వాళ్లని ప్రాధేయపతారు. అంతేగాదు దసరా సీజన్ రాగానే వారిని గౌరవంగా, చిరునవ్వుతో పలకరించి మరీ మట్టిని తీసుకునే ప్రయత్నం చేస్తారట శిల్పకారులు. ఈ ఆచారాన్ని బెంగాలీ శిల్పకారులు ఇప్పటికీ పాటిస్తుండటం విశేషం. ఎందుకు ఇలానే అనేందుకు స్పష్టమైన వివరణ లేదు. కానీ కొన్ని కథానాలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆ కారణం ఏంటంటే..దుర్గాదేవి మహిషాసురిడితో తలపడుతున్న సమయంలో ఆమెను తాకే ప్రయత్నం చేశాడట. దీంతో ఆమె కోపంతో తన పరాక్రమాన్ని అంతా ఉపయోగించి ఆ రాక్షసుడిని అంతం చేసిందట. అందుకే ఆ సంప్రదాయమని పండితుల వచనం. మరొక కథనం ప్రకారం..నారీ శక్తికి సూచన దుర్గమ్మ. సమాజంలో ప్రతి మహిళకు గౌరవం దక్కాలనే ఉద్దేశ్యంతో ఈ ఆచారాన్ని తీసుకువచ్చారని చెబుతుంటారు. అంతేగాదు ఇలా వేశ్య ఇంటిలోని మట్టితో దుర్గామాత విగ్రహం తయారు చేస్తే అందులోకి అమ్మవారి కళ వచ్చి శోభాయమానంగా కనిపిస్తుందట. మన పెద్దలు ఈ సంప్రదాయం ఎందుకని పెట్టారో స్పష్టంగా తెలియకపోయినా.. దేవుడి దృష్టిలో అందరూ సమానమే..ఎవ్వరిని కించపరచకూడదు, హేయభావంతో చూడకూడదు అనే చక్కని సందేశాన్ని ఇస్తోంది ఈ ఆచారం..!(చదవండి: Dussehra 2024 సంబరాల దసరా: ఇంత తతంగం ఉంటుంది!) -
గణేష్ విగ్రహ నిమజ్జనంలో గలాటా
లక్నో: యూపీలోని మహోబాలో గణేష్ విగ్రహం నిమజ్జనం సందర్భంగా గలాటా జరిగింది. ఒక ఇంటిపై బాణసంచా పడటంతో రెండు వర్గాల మధ్య గొడవ చోటుచేసుకుంది. అది తోపులాటకు దారితీసింది. చూస్తుండగానే అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కసౌరాటోరి ప్రాంతంలో గణేష్ నిమజ్జనం కోసం రెండు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరాయి. ఇంతలో ఒక వర్గంవారు వెలిగించిన బాణసంచా మరోవర్గం ఇంటిపై పడడంతో వివాదం చెలరేగింది. దీంతో ఇరువర్గాలకు చెందినవారు బకెట్లతో దాడి చేసుకోవడంతోపాటు, రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడివారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఇరువర్గాలవారు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ గణేష్ నిమజ్జనంలో భక్తులపై రాళ్లు రువ్విన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఇరువర్గాలను అతి కష్టంమీద శాంతింపజేసి, నిమజ్జనం సవ్యంగా జరిగేలా చూశారు. ఇది కూడా చదవండి: గణేశ్ లడ్డూల తయారీలో జడేజా భార్య -
జుకర్ బర్గ్... ప్రేమ మార్క్
షాజహాన్కు భార్య పై ఉన్న ప్రేమ పాలరాతి తాజ్మహల్లో ప్రతిఫలించింది. మెటా బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ విషయానికి వస్తే... భార్యపై ఆయనకున్న ప్రేమ ఇంటి పెరట్లోని సుందరమైన నీలిరంగు విగ్రహంలో ప్రతిఫలిస్తోంది. రొమాంటిక్ హావభావాలతో కూడిన భార్య ప్రిస్కిల్లా చాన్ భారీ విగ్రహాన్ని ఇంటి పెరట్లో ఏర్పాటు చేశాడు జుకర్ బర్గ్. ఆ విగ్రహం పక్కన నిలబడి ఫొటో దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ విగ్రహం చిత్రాలు ఇంటర్నెట్ సెన్సేషన్గా మారాయి...ఫేస్బుక్ విజయం గురించి చెప్పుకోవడం కంటే తన ప్రేమ విజయం గురించి చెప్పుకోవడం అంటేనే మార్క్ జుకర్ బర్గ్కు ఇష్టం. ప్రిస్కిల్లా చాన్తో ఎలా పరిచయం అయింది, ఆ పరిచయం ఎలా ప్రేమగా మారింది కథలు కథలుగా చెబుతుంటాడు. అవి ఎప్పుడో జరిగినట్లుగా ఉండవు. నిన్నా మొన్న జరిగినట్లుగానే ఉంటాయి. అది అతడి మాటల చాతుర్యం కాదు. ప్రేమలోని మాధుర్యం!19 మే, 2012 అనేది జుకర్ బర్గ్, చాన్లకు మరచిపోలేని సుదినం. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వారి వివాహం జరిగింది. ఈ ఔట్డోర్ వెడ్డింగ్లోని విశేషం ఏమిటంటే... పెళ్లి నాటి ప్రమాణాలను కాగితాల రూపంలో ఇరువురు ఇచ్చిపుచ్చుకున్నారు.జుకర్బర్గ్ చాన్కు ఇచ్చిన పేపర్లో ఇలా రాసి ఉంది.... ‘ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో... ఎప్పుడూ ఇలాగే’ అదృష్టవశాత్తు ఆ సంతోషం ఇప్పటివరకు వారికి దూరం కాలేదు. ‘మార్క్ అప్పుడు ఎంత ప్రేమతో ఉన్నాడో ఇప్పుడూ అంతే. అప్పుడు ఎలా నవ్వించేవాడో ఇప్పుడూ అంతే’ అంటూ భర్త గురించి మురిపెంగా చెబుతుంటుంది ప్రిస్కిల్లా చాన్.ఏడు అడుగుల సిల్వర్ అండ్ బ్లూ ప్రిస్కిల్లా చాన్ విగ్రహం వారి బలమైన ప్రేమ బంధానికి ప్రతీకలా కనిపిస్తోంది. ప్రవహిస్తున్నట్లుగా కనిపించే వెండి వస్త్రం విగ్రహాన్ని మరింత ఆకర్షణీయం చేసింది. ఈ విగ్రహం కోసం న్యూయార్క్కు చెందిన ఆర్టిస్ట్, అర్కిటెక్చర్, శిల్పి డేనియల్ ఆర్షమ్ను సంప్రదించాడు మార్క్. విగ్రహం ఎలా ఉండాలి? అనే దాని గురించి ఇద్దరి మధ్య ఎన్నోరోజుల పాటు చర్చలు జరిగాయి.చాన్ విగ్రహం పుణ్యమా అని ‘ఎవరీ డేనియల్’ అనే శోధన మొదలైంది. ఈ డేనియల్కు ‘ఇన్స్టాగ్రామ్ శిల్పి’ అని పేరు. డ్యాన్స్, డిజైన్, అర్కిటెక్చర్, ఆర్ట్ను మిక్స్ చేసిన కళాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో పెద్ద ప్రాజెక్ట్లకు పని చేశాడు. ‘భార్య విగ్రహాన్ని నెలకొల్పే రోమన్ సంప్రదాయాన్ని తీసుకువద్దాం’ అని ఇన్స్టాగ్రామ్లో రాశాడు జుకర్ బర్గ్.టీ సేవిస్తూ తన విగ్రహం దగ్గర ఫొటో దిగిన ప్రిస్కిల్లా చాన్ ఆ ఆర్ట్వర్క్ను ‘అద్భుతం’ అని ప్రశంసించింది.ఏడు అడుగుల ప్రిస్కిల్లా చాన్ విగ్రహంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. భార్యపై మార్క్ జుకర్బర్గ్కు ఉన్న ప్రేమను ఎంతోమంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీలిరంగులో ఉన్నందుకు కావచ్చు... కొందరు మాత్రం ఈ విగ్రహాన్ని అవతార్ క్యారెక్టర్లతో పోలుస్తూ జోక్లు పేలుస్తున్నారు. ఎవరి మాట ఎలా ఉన్నా... ప్రిస్కిల్లా చాన్ విగ్రహం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.కన్నీళ్లు తుడిచే విగ్రహం‘భార్య విగ్రహాన్ని నెలకొల్పే రోమన్ సంప్రదాయాన్ని తీసుకువద్దాం’ అని జుకర్ బర్గ్ అంటున్నాడుగానీ మన వాళ్లు ఆ పని ఎప్పుడో చేశారు. చేస్తున్నారు! కోల్కత్తాకు చెందిన 65 సంవత్సరాల తాపస్ అనే రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి 2.5 లక్షలు ఖర్చు చేసి తన భార్య ఇంద్రాణి సిలికాన్ స్టాచ్యూను ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. జీవకళ ఉట్టిపడే ఈ విగ్రహంతో తాపస్ ఎన్నోసార్లు మాట్లాడుతుంటాడు. తన భార్య చనిపోలేదని, విగ్రహం రూపంలో ఇంట్లోనే ఉంది అనుకొని దుఃఖానికి దూరం అయ్యాడు. తాపస్లాంటి భర్తల కథలు మన దేశ నలుమూలలా ఉన్నాయి. -
మరో బాలరాముని విగ్రహాన్ని తయారుచేసిన యోగిరాజ్
ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ బాలరాముని చిన్న నమూనా విగ్రహాన్ని తయారు చేశారు. ఈయన గతంలో అయోధ్య రామాలయానికి రామ్లల్లా విగ్రహాన్ని తయారు చేశారు. యోగిరాజ్ తన ట్విట్టర్ హ్యాండిల్లో బాలరాముని చిన్న నమూనా రూపానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. యోగిరాజ్ ట్విట్టర్లో తాను రాతితో రామ్లల్లా చిన్న విగ్రహాన్ని తయారు చేశానని తెలిపారు. వెండి సుత్తితో, బంగారు ఉలితో రామ్లల్లా కళ్లను చెక్కానని పేర్కొన్నారు. ఈ భూమిపై తాను ఎంతో అదృష్టవంతుడినని, తన పూర్వీకుల ఆశీస్సులు, శ్రీరాముని ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నానని పేర్కొన్నారు. అరుణ్ యోగిరాజ్ 2008 నుంచి శిల్పాలు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియా గేట్ వద్ద 30 అడుగుల సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా యోగిరాజ్ రూపొందించారు. అలాగే కేదార్నాథ్లోని 12 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం, మైసూర్ జిల్లాలోని చుంచన్కట్టేలో 21 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాలను యోగిరాజ్ తీర్చిదిద్దారు. -
బాలరాముని చిత్రపటాలకు ఆదరణ.. కోట్లలో వ్యాపారం!
అయోధ్యలో బాలరాముడు కొలువైనది మొదలు ఆ ప్రాంతపు తీరు తెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అయోధ్య ఆర్థిక వ్యవస్థ ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. అయోధ్యకు ప్రతిరోజూ రెండు నుండి మూడు లక్షల మంది రామభక్తులు తరలివస్తున్నారు. అయోధ్యకు వస్తున్నవారంతా ఎంతో ఉత్సాహంతో శ్రీరామునికి సంబంధించిన వస్తువులను కొనుగులు చేస్తున్నారు. రామాలయంలో దర్శనం ముగించుకున్నాక భక్తులు శ్రీరాముని చిత్రపటాలను కొనుగోలు చేసేందుకు షాపింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్య మార్కెట్లో చిన్న సైజు శ్రీరాముని చిత్రపటం నుంచి పెద్ద సైజు చిత్రపటం వరకూ అన్నీ విరివిగా అమ్ముడవుతున్నాయి. అలాగే రామాలయం నమూనా చిత్రం, కీ చైన్, స్టిక్కర్, మాగ్నెట్ స్టాండ్, లాకెట్, బాలరాముని చిత్రాన్ని ముద్రించిన జెండాతో సహా 20 నుండి 30 రకాల వస్తువులను భక్తులు కొనుగోలు చేస్తున్నారు. అయోధ్యకు చెందిన వ్యాపారి అశ్వనీ గుప్తా మాట్లాడుతూ, రాముని చిత్రాలను భక్తులు ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇది తమ వ్యాపారస్థాయిని విపరీతంగా పెంచుతున్నదన్నారు. ఫలితంగా చాలామందికి ఉపాధి కూడా లభిస్తున్నదన్నారు. అయోధ్యలో భక్తుల రద్దీ పెరగడంతో ఇక్కడి వ్యాపారాలు కూడా బాగా సాగుతున్నాయి. ముఖ్యంగా బాలరాముని చిత్రాలకు గిరాకీ అనూహ్యంగా పెరిగింది. కోట్ల రూపాయల మేరకు బాలరాముని చిత్రాల వ్యాపారం సాగుతోంది. -
‘కృష్ణ’లో బాలరాముని పోలిన శ్రీమహావిష్ణువు!
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని ఒక గ్రామంలో కృష్ణా నదిలో శ్రీమహావిష్ణువు పురాతన విగ్రహం బయల్పడింది. విగ్రహం చుట్టూ దశావతారాలన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ విగ్రహంతో పాటు పురాతన శివలింగం కూడా బయల్పడింది. అయితే నదిలో బయట్పడిన ఈ శ్రీమహావిష్ణువు విగ్రహం ఇటీవల అయోధ్యలోని నూతన రామాలయంలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహాన్ని పోలివుండటం గమనార్హం. ఈ శ్రీ మహావిష్ణువు విగ్రహం గురించి రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్ పద్మజా దేశాయ్ మాట్లాడుతూ కృష్ణానది పరీవాహక ప్రాంతంలో లభించిన ఈ విష్ణుమూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఈ విష్ణువు విగ్రహం చుట్టూ మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి తదితర దశావతారాలు అందంగా మలిచారు. ఈ శ్రీమహా విష్ణువు విగ్రహ విశిష్టతల విషయానికొస్తే విష్ణుమూర్తి నిలువెత్తు భంగిమలో నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. అతని పైరెండు చేతులలో శంఖుచక్రాలు ఉండగా, దిగువ చేతులు (‘కటి హస్త’, ‘వరద హస్త’) ఆశీర్వాదాలను అందిస్తున్నట్లు ఉన్నాయి. ఈ విగ్రహం వేంకటేశ్వరుని కూడా పోలి ఉంది. అయితే ఈ విగ్రహంలో గరుడుడు లేడు. సాధారణంగా శ్రీమహా విష్ణువు విగ్రహాలలో గరుడుడు కనిపిస్తాడు. విష్ణువు అలంకార ప్రియుడు కావడంతో ఈ మందహాసధర విష్ణుమూర్తి విగ్రహంపై పూమాలలు కూడా కనిపిస్తాయి. -
రామ్లల్లా శిల్పికి శ్రీకృష్ణ విగ్రహం ఆర్డర్!
అయోధ్యలో రామ్లల్లా విగ్రహానికి రూపాన్ని ఇచ్చిన కళాకారుడు యోగిరాజ్ ఇప్పుడు కురుక్షేత్రలో శ్రీ కృష్ణుని భారీ విగ్రహాన్ని తయారుచేసేందుకు సిద్ధం అవుతున్నారు. మహాభారత సమయంలో అర్జునునితో సంభాషిస్తున్న శ్రీ కృష్ణుని భారీ రూపాన్ని యోగిరాజ్ తీర్చిదిద్దనున్నారు. శ్రీరాముని విగ్రహం తరహాలోనే ఈ విగ్రహాన్ని కూడా నేపాల్లోని గండకీ నది నుంచి సేకరించిన శాలిగ్రామశిలతో తయారు చేయనున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలో గల బ్రహ్మసరోవర్ ఒడ్డున నిర్మితమవుతున్న 18 అంతస్తుల జ్ఞాన మందిరంలోని గర్భగుడిలో యోగిరాజ్ రూపొందించే శ్రీ కృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మూడు ఎకరాల స్థలంలో 18 అంతస్తుల జ్ఞాన మందిరాన్ని నిర్మిస్తున్నట్లు శ్రీ బ్రహ్మపురి అన్నక్షేత్ర ట్రస్ట్ జ్ఞాన మందిర్ వ్యవస్థాపకులు స్వామి చిరంజీవ్పురి మహారాజ్ తెలిపారు. ఆలయ గర్భగుడిలో అర్జునునికి సందేశం ఇస్తున్న రీతిలో శ్రీ కృష్ణుని భారీ విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఇందుకోసం శిల్పి అరుణ్ యోగిరాజ్తో ఇప్పటికే చర్చలు జరిగాయి. త్వరలోనే శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ ఆలయాన్ని సందర్శించనున్నారు. శిల్పి అరుణ్ యోగిరాజ్.. శ్రీకృష్ణుని విగ్రహ తయారీకి అంగీకరించిన నేపధ్యంలో గండకీ నది నుంచి ప్రత్యేక శాలిగ్రామ రాయిని తీసుకురావడానికి ట్రస్ట్ నేపాల్ను సంప్రదిస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయం నిర్మాణ దశలో ఉంది. 50 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. 18 అంతస్తుల జ్ఞాన మందిరం అనేక ప్రత్యేకతలతో కూడి ఉంటుంది. గీతలోని 18 అధ్యాయాలు, 18 అక్షోహిణి సేన, 18 రోజుల మహాభారత యుద్ధం, కురుక్షేత్రంలో పవిత్ర సరస్వతి నది రూపం కూడా ఈ ఆలయంలో కనిపించనుంది. -
తొలుత ఎంపిక చేసిన విగ్రహం ఇదే..
పుణ్యక్షేత్రమైన అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమయ్యింది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. రామ మందిరంలో కొలువైన బాలరాముడు భక్తులను మైమరపిస్తున్నాడు. రామ్లల్లా విగ్రహంలోని కళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గర్భాలయంలో ప్రతిష్ఠంచేందుకు విగ్రహాల తయారీని తొలుత ముగ్గురు శిల్పకారులకు అప్పగించారు. తరువాత ఆలయంలో ప్రతిష్ఠాపనకు రెండు విగ్రహాలను ఎంపిక చేశారు. అయితే చివరకు మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ నివాసి సత్యనారాయణ పాండే శిల్ప కళాకారునిగా ఎంతో పేరొందారు. తరతరాలుగా వారి కుటుంబం విగ్రహాలను తయారు చేస్తోంది. సత్యనారాయణ పాండే రామ్లల్లా విగ్రహాన్ని తెల్లని మక్రానా పాలరాయితో తీర్చిదిద్దారు. తొలుత ఈ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని ట్రస్ట్ భావించిందట. ఈ విగ్రహం ప్రస్తుతం ట్రస్ట్ ఆధీనంలో ఉంది. దీనిని ఎక్కడ? ఎప్పుడు ప్రతిష్ఠించేదీ ట్రస్ట్ త్వరలో వెల్లడించనుంది. జనవరి 22న అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అనంతరం రామమందిరం తలుపులు సామాన్య భక్తుల కోసం తెరిచారు. ఈ నేపధ్యంలో శ్రీరాముని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. -
అయోధ్య గర్భగుడిలో బాలరాముడి విగ్రహం
-
అయోధ్య రాముడి విగ్రహం రెడీ ఎలా ఉండబోతుందంటే..!
-
అయోధ్య రామమందిరం గర్భగుడిలో బాల రాముడి విగ్రహం
-
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
సూపర్స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్హాసన్ ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ కేడీజీఓ పార్కులో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ కోసం విజయవాడలో ఉన్న కమల్హాసన్.. కృష్ణ–మహేశ్బాబు ఫ్యాన్స్ ఆహ్వానం మేరకు కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు కమల్హాసన్ . ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ–‘‘కళామతల్లికి తనదైన శైలిలో సేవలందించి, ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు కృష్ణగారు. తండ్రి గౌరవాన్ని మహేశ్బాబుగారు నిలబెడుతున్నారు’’ అన్నారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణ కేవలం పదిరోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు సహకరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు’’ అని కృష్ణ అభిమానుల సంఘం పేర్కొంది. ఈ కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కృష్ణ కుటుంబ సభ్యుడు ఘట్టమనేని బాబీ, వైఎస్సార్సీపీ నాయకులు గల్లా పద్మావతి, రాజ్కమల్ పాల్గొన్నారు. గర్వంగా ఉంది: హీరో మహేశ్బాబు ‘‘నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్ గారికి కృతజ్ఞతలు. నాన్నగారు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, వారసత్వానికి ఇదొక నివాళి. నాన్న విగ్రహం ఏర్పాటుకు కారణమైన అందరికీ, ఈ వేడుక ఘనంగా నిర్వహించిన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు మహేశ్ బాబు. -
వినాయకచవితి స్పెషల్.. బన్నీ కూతురు ఏం చేసిందో తెలుసా?
వినాయకచవితి వచ్చిందంటే చాలు ఏ గల్లీలో చూసిన సందడే సందడి. ముఖ్యంగా చిన్నపిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. ఎలాగైనా సరే గణపతి తయారు చేసి మరీ సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు మట్టితో చాలా సరదాగా వినాయక విగ్రహాన్ని తయారు చేయడం మనం చూస్తుంటాం. అలా ఐకాన్ స్టార్ గారాల పట్టి అల్లు అర్హ వినాయకచవితి కోసం బుజ్జి వినాయకుడిని తయారు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: Allu Arha In Devara: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ! ) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ అంటే టాలీవుడ్లో తెలియని వారుండరు. కాగా.. అల్లు అర్హ ఇప్పటికే సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాది సమంత నటించిన శాకుంతలం చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో అర్హ భరతుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంలో అల్లు అర్హ నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జాన్వీ చిన్ననాటి పాత్రలో అర్హ నటించనుందని సమాచారం. ఇప్పటికైతే మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
బుర్రిపాలెంలో సూపర్స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
తెనాలిరూరల్: ప్రముఖ సినీహీరో ‘సూపర్స్టార్’ ఘట్టమనేని కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో శనివారం ఆవిష్కరించారు. వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి మేరుగు నాగార్జున, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని, అల్లుడు సుధీర్బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి తదితరులు పాల్గొని సూపర్స్టార్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో దర్శకుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ అని కొనియాడారు. ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ కృష్ణ తమ స్వగ్రామం బుర్రిపాలెంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని, వాటిని తాము కొనసాగిస్తామని చెప్పారు. కృష్ణ కుమార్తెలు పద్మావతి, మంజుల మాట్లాడుతూ ‘బుర్రిపాలెం బుల్లోడు’గా కోట్లాది మంది ప్రేమను తమ తండ్రి పొందారని, అభిమానులతో కలసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రేయరాగ రాక్స్టార్
ఎక్కడి ఒడిశా? ఎక్కడి కొరియా? అయితే కలలు కనేవారికి దూరభారాలు ఉండవు. పట్టుదలతో దూరాలను కరిగించేస్తారు. కలలను నిజం చేసుకుంటారు. ఒడిశాలోని రూర్కెలాకు చెందిన శ్రేయా లెంక ఈ కోవకు చెందిన ప్రతిభాశాలి.... ఇండియా ఫస్ట్ కె–పాప్ ఐడల్గా శ్రేయా లెంక చరిత్ర సృష్టించింది. పన్నెండు సంవత్సరాల వయసులో డ్యాన్సర్గా శ్రేయ కళాప్రస్థానం మొదలైంది. ఎప్పుడూ పెద్ద కలలే కనేది. ఒక ఫ్రెండ్ ద్వారా శ్రేయకు ‘కె–పాప్’ పరిచయం అయింది. వారి మ్యూజిక్ వీడియోలు తనను బాగా ఆకట్టుకున్నాయి. ‘వీళ్లు ఆర్టిస్టులా? మెరుపు తీగలా?’ అనిపించింది. వారి యూనిక్ స్టైల్, సింగింగ్, డ్యాన్సింగ్ తనకు తెగ నచ్చేశాయి. ఏదో ఒకరోజు వారిలో కలిసి, వారిలో ఒకరిగా కలిసి పనిచేయాలనుకుంది. ‘అది అసాధ్యం’ అని ఎవరు అన్నా సరే శ్రేయ వెనక్కి తగ్గలేదు. ఆమె కల నెరవేరడానికి ఎంతో కాలం పట్టలేదు. ప్రపంచంలోని వందలాది మందితో పోటీ పడి గెలిచింది. ‘కె–పాప్’ మెంబర్గా తన కలను నెరవేర్చుకుంది. దేశం కాని దేశం... సౌత్ కొరియాలోకి అడుగు పెట్టినప్పుడు శ్రేయా లెంకాకు అక్కడి ఆహారం, జీవనవిధానం, భాష...అన్నీ కొత్తగా అనిపించాయి. తాను ఇల్లు విడిచి అంత దూరం వెళ్లడం అదే తొలిసారి. కొత్త విషయాలను ఉత్సాహంగా నేర్చుకుంది. కొత్త జీవనవిధానానికి ఆనందంగా అలవాటు పడింది. చుట్టు పక్కల వాళ్లు కూడా ఎంతో ప్రోత్సాహకంగా ఉండేవాళ్లు. ఇండియాలో అయితే రాత్రి పదిలోపు భోజనం చేసేది. కొరియాలో మాత్రం సాయంత్రం 6–7 మధ్య భోజనం చేస్తారు. మొదట్లో కష్టం అనిపించినా ఆ పద్ధతికి మెల్లగా అలవాటు పడింది. తనలాగే ‘కె–పాప్ ఐడల్’ కావాలనుకునే ఔత్సాహికులకు శ్రేయా లెంకా ఇచ్చే సలహా... ‘మీ కలలను నెరవేర్చుకోవడం విషయంలో రాజీ పడవద్దు. వందసార్లు అపజయం పాలైనా సరే, ఆవగింజంత ఆత్మవిశ్వాసం కూడా కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్లు తప్పకుండా ఒకరోజు గెలుస్తారు’ -
శ్రీ కృష్ణుడి రూప ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు నో!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలోని లకారం చెరువులో శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. గతంలో ఇచ్చిన స్టేను పొడిగిస్తూ తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ విగ్రహావిష్కరణను ఈ నెల 28న నిర్వహించాలని ఇప్పటికే ఖరారు చేశారు. తానా ఈ విగ్రహాన్ని అందిస్తోంది. అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును సవాల్ చేస్తూ భారత యాదవ సమితి, ఆదిభట్ల శ్రీకళా పీఠం, బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ పిటిషన్లు దాఖలు చేశాయి. (చదవండి: ఔటర్ రింగ్రోడ్డు లీజుపై విపక్షాల విషం) -
ఆఫీసులో లాడెన్ పోస్టర్లు కలకలం..దెబ్బకు అధికారిని..
ఉత్తర ప్రదేశ్లోని ఒక వ్యక్తి తన కార్యాలయంలో ఉగ్రవాది ఒసామా డిన్ లాడెన్ పోస్టర్లు ఉంచిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో అధికారులు ఆ వ్యక్తిని విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(యూపీపీసీఎల్) రవీంద్ర ప్రకాష్ గౌతమ్ అనే సబ్ డివిజనల్ అధికారి తన కార్యాలయంలో ఒసామాబిన్ లాడెన్ పోస్టర్లను ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో యూపీపీసీఎల్ చైర్మన్ ఎం దేవరాజ్ సీరియస్ అవ్వడమే గాక సదరు అధికారి గౌతమ్ని విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన 2022 జూన్లో ఫరుఖాబాద్ జిల్లాలోని కయామ్ గంజ్ సబ్డివిజన్ 2కి పోస్టింగ్ పై వచ్చాడు. అప్పుడే ఈ పోస్టర్లు ఉంచినట్లు సమాచారం. ఐతే విచారణలో.. గౌతమ్ లాడెన్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినందువల్లే అతన్ని ఆరాధ్య దైవంగా పూజించేవాడని సహోద్యోగులు చెబుతున్నారు. అతనిపై అభిమానంతో లాడెన్ ఫోటోలు కార్యాలయంలో ఉంచేవాడని చెప్పారు. దీంతో అతన్ని సర్వస్ నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: పూరి జగన్నాథుడి గుడిలో ఎలుకల బెడద.. అవి పెడితే దేవుడి నిద్రకు..) -
అమ్మకు గుడి
ముషీరాబాద్: అమ్మంటే ప్రత్యక్ష దైవంగా భావించారు. కన్నతల్లి కన్నుమూసి ఏడేళ్లయిపోయింది. ఇన్నాళ్లు గుండెల్లో కొలువైన అమ్మకు ఇంట్లోనే గుడి కట్టారు. అమ్మ జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని.. కళ్లముందు విగ్రహ రూపంలో కని పిస్తుండాలని.. ఏకంగా ఇంట్లోనే గుడి కట్టారు ముషీరాబాద్ గంగపుత్ర కాలనీకి చెందిన బాదం గణేష్, శ్రీనివాస్, వేణు, శివప్రసాద్లు. అమ్మ విగ్రహ ఆవిష్కరణోత్సవానికి బంధుమిత్రులను ఆహ్వానించారు. పండుగలా కార్యక్రమం నిర్వహించి అతిథ్యం ఇచ్చి తల్లిపై ప్రేమను చాటుకున్నారు. గణేష్, శ్రీనివాస్, వేణు, శివప్రసాద్ల తల్లి బాదం వెంకటసూర్యకుమారి ఏడేళ్ల క్రితం మరణించా రు. కొంతకాలంగా తల్లి విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేయాలని నలుగురు కొడుకులు ప్ర యత్నిస్తున్నారు. ఇటీవల విగ్రహ ఏర్పాటు కోసం ఇంట్లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. అందులో తల్లి సూర్యకుమారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. -
అద్భుత సృష్టి.. ప్లాస్టిక్ స్పూన్లతో దుర్గామాత విగ్రహం
డిస్పూర్: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు అస్సాంలోని దుబ్రీ జిల్లాకు చెందిన సంజీవ్ బాసక్ అనే వ్యక్తి దుర్గా నవరాత్రులను వేదికగా చేసుకున్నాడు. పరిశ్రమలు, మెడికల్ వ్యర్థాలను ఉపయోగించి వివిధ కళాకృతులతో అవగాహన కల్పిస్తున్నాడు. వ్యర్థాలను తగ్గించాలని చెప్పేందుకు వివిధ ఆకృతులతో దుర్గా మాత విగ్రహాలను తయారు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు బాసక్. 2015 తొలుత థర్మకోల్తో 14 అడుగుల దుర్గమాత విగ్రహాన్ని రూపొందించారు బాసక్. అప్పటి నుంచి ప్రతిఏటా ఇలా వివిధ వ్యర్థ పదార్థాలతో విగ్రహాలు రూపొందిస్తూ అవగాహన కల్పిస్తున్నాడు. అందులో భాగంగానే ఈఏడాది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్లతో దుర్గమాత విగ్రహాన్ని తయారు చేశాడు బాసక్. ప్రస్తుతం ఈ దుర్గామాత విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్పూన్లతో అస్సాంలో రూపొందించిన దుర్గామాత విగ్రహం ఇదీ చదవండి: టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో.. సీఎం గెహ్లాట్కు ఊహించని షాక్! -
వేలాది కాయిన్స్ తో వినాయక ప్రతిమ తయారీ
-
నిధి అంటూ దంపతులకు బురిడీ
యశవంతపుర: నిధి ఆశ చూపి దంపతులకు రూ. 5 లక్షలు మోసం చేసి దొంగస్వామి అదృశ్యమైన ఘటన హాసన్ జిల్లాలో చోటు చేసుకుంది. తాలూకాలోని దొడ్డహళ్లి గ్రామానికి చెందిన గౌడకు గ్రామంలో కొంత భూమి ఉంది. ఆ భూమిలో నిధి ఉందంటూ మంజేగౌడ అనే దొంగస్వామి నమ్మించాడు. దైవశక్తితో బయటకు తీస్తానంటూ ముందుగానే మూడు కేజీల బంగారు పూత పూసిన బంగారు విగ్రహాన్ని పాతి పెట్టాడు. మొదట భూమి యజమాని గౌడ–లీలావతి దంపతులు పూజ చేస్తే బయటకు తీస్తానని చెప్పి వారి భూమిలో పాతి పెట్టిన నకిలీ పసిడి విగ్రహాన్ని బయటకు తీసి దంపతులకు ఇచ్చాడు. విగ్రహానికి రక్తాభిషేకం చేయాలని చెప్పి లీలావతి వేలును కోశాడు. దీంతో వేలు తెగిపోయింది. వారం రోజుల తరువాత గౌడ దంపతులు విగ్రహాన్ని తీసుకుని బంగారు షాపులో పరీక్షించగా అది వెండిదిగా తేలింది. అంతకు ముందే స్వామీజీ రూ. 5 లక్షల తీసుకుని పరారయ్యాడు. వేలు తెగిపోవడంతో లీలావతి ఆస్పత్రి పాలైంది. అయితే ఈ ఘటనపై ఇంత వరకు కేసు నమోదు కాలేదు. (చదవండి: వివాహేతర సంబంధం ఉందనే అనుమానం.. ఫోన్లో మాట్లాడుతుంటే చూసి..) -
భరతమాత కొలువైన గుడి
గౌరిబిదనూరు: దేశంలో ముక్కోటి దేవీ దేవతలకు ఆలయాలు, ప్రఖ్యాత దేవస్థానాలు ఉన్నాయి, కానీ భరతమాత పేరుతో ఉన్న మందిరాలు ఎక్కడా కనిపించవు. దేశమాత విగ్రహ రూపంలో కొలువై పూజలందుకుంటున్న మందిరాన్ని చూడాలంటే గౌరిబిదనూరుకు వెళ్లాల్సిందే. దక్షిణ భారతదేశపు జలియన్ వాలాబాగ్గా ప్రసిద్ధి చెందిన విదురాశ్వత్థానికి సమీపంలో ఉన్న నాగసంద్ర గ్రామంలో 2008లో భారతమాత దేవాలయం వెలిసింది. కృష్ణశిలలో హిందూపురానికి చెందిన శిల్పి నాగరాజు 6 అడుగుల భరతమాత విగ్రహాన్ని చెక్కారు. జాతీయ జెండాను పట్టుకుని జెండా దర్శనమిస్తుంది. జనవరి 26, ఆగస్టు 15కు ప్రత్యేక పూజలు దేవాలయం పై కప్పున దేశ నాయకుల చిత్రాలు, బొమ్మలు స్ఫూర్తిని నింపుతాయి. కిత్తూరు రాణి చన్నమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాస్ చంద్రబోస్ తదితరుల బొమ్మలను చెక్కారు. ఏటా ఆగస్టు 14 అర్ధరాత్రి దేశభక్తియుత ప్రదర్శనలు నిర్వహించడం ఆనవాయితీ. స్థానిక నాయకుడు రవి నారాయణరెడ్డి భరతమాత ట్రస్ట్ ఏర్పరచి ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆలయంలో భరతమాతకు నిత్య పూజలు నిర్వహిస్తూ, గణతంత్ర దినోత్సవం, ఆగస్టు 15న విశేష పూజలు జరుపుతారు. (చదవండి: చిన్నవాణ్ణని వదిలేశారు) -
న్యూయార్క్లో చోళ్ల కాలం నాటి పార్వతి దేవి విగ్రహం
చెన్నై: చోళుల కాలం నాటి పురాతన పార్వతి దేవి విగ్రహం న్యూయార్క్లో ఉన్నట్లు ఐడల్ వింగ్ క్రిమినల్ ఇన్విస్టేగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ) పేర్కొంది. న్యూయార్క్లోని బోన్హామ్స్ వేలం హౌస్లో ఈ విగ్రహాన్ని గుర్తించినట్లు సీఐడీ తెలిపింది. ఈ విగ్రహం విషయమై 1971లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. గానీ 2019లో ఫిబ్రవరి కె వాసు అనే వ్యక్తి ఫిర్యాదు చేసినప్పుడూ కేసు నమోదు చేసి వదిలేశారు. ఐతే ప్రస్తుతం ఐడల్ వింగ్ ఇన్స్పెక్టర్ ఎం చిత్ర ఈ కేసును దర్యాప్తు చేయడంతో వివిధ మ్యూజియంలు, వేలం హౌస్లపై దర్యాప్తు చేయడం ప్రారంభించడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ మేరకు ఆమె బోన్హామ్స్ వేలం హౌస్లో ఈ విగ్రహాన్ని కనుగొన్నారు. ఇది సుమారు 12వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి విగ్రహం. ఈ విగ్రహం ఎత్తు 52 సెం.మీటర్లు ఉంటుంది. పైగా ఈ విగ్రహం విలువ సుమారు ఒకటిన్నర కోట్లు ఉంటుందని చెబుతున్నారు అధికారులు. విగ్రహం నుంచున్న ఆకృతిలో ఉండి కిరీటం, నెక్లెస్లు, ఆర్మ్బ్యాండ్లు, వస్త్రాలతో రూపొందించి ఉంటుంది. వాస్తవానికి ఈ విగ్రహం కుంభకోణంలో తందంతోట్టంలోని నదనపురీశ్వరార్ శివన్ ఆలయంలో అదృశ్యమైన పార్వతి దేవి విగ్రహం ప్రసుతం అధికారులు ఈ విగ్రహాన్ని తీసుకువచ్చేందుకు సంబంధిత పత్రాలను సిద్ధం చేస్తున్నారు. (చదవండి: ముగ్గురు దొంగల చిలిపి పని... భయపడి చస్తున్న నివాసితులు!) -
400 ఏళ్ల నాటి పురాతన రాజ వంశ విగ్రహం కోసం...దొంగలకే టోపీ పెట్టి
చెన్నై: తమిళనాడులోని పురాతన విగ్రహాలను కనిపెట్టే వింగ్(ఐడల్ వింగ్)కి సేతుపతి వంశానికి చెందిన 400 ఏళ్ల నాటి పురాతన విగ్రహం గురించి సమాచారం అందింది. ఈ మేరకు ఐడల్ వింగ్ బృందం అండర్ కవర్ అపరేషన్ చేపట్టి ఆ విగ్రహాన్ని కనిపెట్టారు. ఈ మేరకు అధికారులు తుత్తకుడి నివాసితులైన ఆరుముగరాజ్, కుమార్వేల్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ పురాతన విగ్రహాన్ని విక్రయిస్తున్నారని తెలుసుకున్నారు. దీంతో పోలీసులు తమ సిబ్బందిలోని కొంతమంది ధనవంతులైన వ్యక్తులుగా వారిని కలుసుకుని పరిచయం చేసుకున్నారు. ఈ విధంగా ధనవంతులైన వ్యక్తులుగా ఆ విగ్రహానికి కొనుగోలు చేసే నెపంతో వారి నుంచి స్వాధీనం చేసుకోవాలని వ్యూహం పన్నారు పోలీసులు. ఈ క్రమంలోనే ముస్తఫ్ అనే వ్యక్తి పురాతన విగ్రహాన్ని తిరుచ్చి - మదురై హైవేపై ముందుగా నిర్ణయించిన ప్రదేశానికి తీసుకువచ్చాడు. ఐతే పోలీసులు ఆ విగ్రహాన్ని చూడటానికి కోట్లలలో తమ వద్ద డబ్బు ఉందని నిరూపించుకోవాల్సి వచ్చింది. ఆ స్మగ్లర్లతో బేరసారాలు ఆడుతూ అసలు గుట్టంతా తెలసుకుని ముస్తఫా, ఆరుముగరాజ్, కుమారవేల్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ నిందితులను విచారించగా తమిళనాడులోని శివగంగై జిల్లాకు చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తి నుంచి ఈ విగ్రహాన్ని పొందినట్లు తెలిపాడు. ఐతే సెల్వకుమార్ వద్దే ఈ విగ్రహం 12 ఏళ్లుగా ఉందని, దీన్ని తన తండ్రి నాగరాజన్ ఇచ్చాడని చెప్పాడు. ఈ విగ్రహం సేతుపతి వంశానికి చెందిన పురాతన మహిళ విగ్రహం. ఆ విగ్రహం ఖరీదు వేల కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు . (చదవండి: కస్టమర్కి చేదు అనుభవం... అలా వచ్చాడని టికెట్టు ఇవ్వనన్న మల్టీప్లెక్స్ థియేటర్) -
మానవరూపంలో నంది
సాక్షి, హైదరాబాద్: నంది అనగానే శివాలయంలో శివుడికి ఎదురుగా మంటపంలో జంతు రూపంలో ఉం డటమే మనకు తెలుసు. కానీ.. 11వ శతాబ్దంలో నందికి మానవరూపంతో ఓ దైవ విగ్రహంగా ప్రత్యేక స్థానం ఉండేది. ఇప్పుడు అలాంటి అరుదైన విగ్రహం సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలోని కాసువాగు ఆంజనేయస్వామి ఆలయంలో వెలుగుచూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారని ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఈ నంది విగ్ర హాన్ని అధికార నందిగా పేర్కొంటారు. శివుడి దర్శనానికిగాను భక్తులకు అనుమతి ఇచ్చే అధికారంతో ఉంటుందని, అందుకే అధికార నంది అంటారని ప్రముఖ స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. శివుడి దర్శనానికి ముందు ఈ విగ్రహాన్ని దర్శించేలా చాళుక్యుల కాలంలో సంప్రదాయం ప్రారంభమైందని, వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేసే వారని, ఆ తర్వాత అంతర్ధానమైందని వివరించారు. ఇక కుతుబ్ షాహీల కాలంలో 40 గ్రామాలకు దేశ్ముఖ్గా పనిచేసిన సిద్ధసోమాజీ, తన తల్లి కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించి దీన్ని ప్రతిష్టించారని చెప్పారు. ఈ విగ్రహం వెనక కుడి చేతిలో పరశువు, ఎడమచేతిలో కృష్ణ జింక, ముందరి కుడి చేయి వరద హస్తంగా, ఎడమ చేతిలో అధికార దండం ఉన్నట్టు వెల్లడించారు. -
పూజించారు.. పట్టుకుపోయారు
ఇచ్ఛాపురం రూరల్: గ్రామదేవత అంటే ఆ దొంగలకు భయంతో పాటు భక్తి మెండుగా ఉంది కాబోలు...ప్రత్యేక పూజలు చేసి మరీ అమ్మవారి వెండి ప్రతిమను ఎత్తుకుపోయారు. ఇచ్ఛాపురం మండలం మండపల్లిలో ఇటీవల తొమ్మిది రోజుల పాటు గ్రామస్తులు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు పూజా గది తలుపు తాళాన్ని రంపపు బ్లేడ్తో కట్ చేసి లోపలికి ప్రవేశించారు. సుమారు 42 తులాల విలువైన అమ్మవారి వెండి ప్రతిమను ఎత్తుకు పోయే ముందు అమ్మవారి సన్నిధిలో పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయని పూజారి రమేష్ రౌళో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ డి.వి.వి.సతీష్కుమార్, రూరల్ ఎస్సై బడ్డ హైమావతిలు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్ను రప్పించి పరిశోధించారు. అమ్మవారి అలంకరణ నగలు, హుండీలను ప్రతి రోజూ పూజారి ఇంటికి తీసుకువెళ్తుండటంతో పెద్ద మొత్తంలో నష్టం కలగలేదని గ్రామపెద్దలు తెలిపారు. (చదవండి: మితిమీరి.. దిగజారి) -
మృతి చెందిన భర్తకు ఇంట్లోనే విగ్రహం
సేలం: అకస్మాత్తుగా అనారోగ్యం పాలై మృతి చెందిన భర్తకు ఇంటిలోనే విగ్రహం చేర్పాటు చేసి భార్య పూజలు చేస్తున్న ఘటన సేలంలో చోటు చేసుకుంది. వివరాలు.. సేలంలోని ఏర్కాడు ప్రధాన సాలైలోని, కేంద్ర న్యాయ కళాశాల సమీపంలో ఉన్న అన్నై ఇందిరాగాంధీ నగర్ 3వ అవెన్యూకు చెందిన శశికుమార్. ఇతని భార్య గోమతి. వీరికి కుమారుడు వేల్ కుమార్, కుమార్తె శైలశ్రీ ఉన్నారు. బ్యాంకు మేనేజర్గా పని చేసి శశికుమార్ పదవీ విరమణ పొందారు. తర్వాత సమాజ సేవలో పాల్గొనేవారు. ఈ స్థితిలో గత 2019లో శశికుమార్ అనారోగ్యం కారణంగా ఆకస్మికంగా మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగింది. భర్తను కోల్పోయిన గోమతి, తన భర్త ఇంటి ప్రాంగణంలోనే ఒక మండపాన్ని ఏర్పాటు చేసి, అందులో శశికుమార్ విగ్రహాన్ని ఉంచి.. నిత్యం ఆయనకు పూజలు చేస్తోంది. ఈ పూజలను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. -
శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముస్తాబవుతోన్న శ్రీరామనగరం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ రూరల్: సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముహూర్తం సమీపిస్తోంది. ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం సుందరంగా ముస్తాబవుతోంది. విగ్రహాలకు, ఫౌంటెన్లకు రంగులు అద్ది తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రధాన ఆలయం సహా చుట్టూ ఉన్న ఆలయ గోడలకు, వాటి మెట్లకు, శిలాస్తంభాలకు, ఫ్లోర్స్కు అమర్చిన మార్బుల్స్ను ముస్తాబు చేస్తున్నారు. ఒకవైపు ఫౌంటెన్ సహా సమతామూర్తి విగ్రహం చుట్టూ మిరిమిట్లుగొలిపేలా లైటింగ్ పనులు చేపడుతున్నారు. మరోవైపు అంతర్గత రోడ్లు, ఫ్లోరింగ్, గార్డెన్లో వివిధ రకాల పూల, ఔషధ మొక్కలు నాటుతున్నారు. ఇంకోవైపు యాగశాలల నిర్మాణాలు, ఇందుకు అవసరమైన పిడకలను తయారు చేస్తున్నారు. నిత్యం 500 మంది కూలీలు నిర్విరామంగా పని చేస్తున్నారు. 2 నుంచి 14 వరకు సహస్రాబ్ది సమారోహం.. ► ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. శ్రీరామనగరంలో ప్రతిష్ఠించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. ప్రధాన మందిరంలో 120 కిలోల బంగారంతో రూపొందించిన 54 అంగుళాల రామానుజ నిత్యపూజా మూర్తిని 13న రాష్ట్రపతి రామ్నా«థ్ కోవింద్ తొలి దర్శనంతో ప్రారంభిస్తారు. చదవండి: యూకేలో ఉద్యోగమంటూ.. మాయ మాటలతో బుట్టలో వేసుకొని ► 216 అడుగుల ఎత్తైన రామానుజల మహా విగ్రహం చుట్టూ 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకం కొనసాగుతుంది. శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే.. శ్రీరంగం, తిరుమల, కంచి, అహోబిలం, భద్రీనాథ్, ముక్తినాథ్, అయోధ్య, బృందావనం, కుంభకోణం.. ఇలా మొత్తం 108 ప్రధాన వైష్ణవ గర్భాలయాల ఆకృతిలో ఆలయాలు, దేవతామూర్తులు కొలువుదీరి ఉన్నారు. ఆయా విగ్రహమూర్తులకు రంగులద్ది తుది మెరుగులు దిద్దే పనుల్లో నిమగ్నమయ్యారు. చదవండి: Warangal: ఏపీ ఎక్స్ప్రెస్ ఎస్-6 బోగీలో పొగలు శరవేగంగా రహదారుల విస్తరణ ► ఇటు బెంగళూరు జాతీయ రహదారి నుంచి శ్రీరామనగరం మీదుగా అటు పెద్ద గోల్కొండ సమీపంలోని సంగీగూడ చౌరస్తా వరకు 9 కిలోమీటర్ల మేర 13 మీటర్ల పాటు రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ► ఎన్హెచ్ 44 నుంచి పెద్దషాపూర్ తండా చౌరస్తా– గొల్లూరు– అమీర్పేట్ మీదుగా రూ.17.50 కోట్లతో 8 కి.మీ మేర తొమ్మిది మీటర్ల చొప్పున రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ► ఎన్ 44 మదనపల్లి క్రాస్ రోడ్డు నుంచి ముచ్చింతల్ మీదుగా చిన్న తూప్రాన్ వరకు రూ.15.50 కోట్లతో 5 కి.మీ మేర సీసీ రోడ్డును 10 మీటర్లకు విస్తరించారు. ఇవి కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. అతిథులకు ఆహ్వానం పలుకుతూ రోడ్డు మధ్యలోనే కాకుండా ఇరు వైపులా వివిధ రకాల మొక్కలు నాటుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరా.. తాగునీరు ► రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ట్రాన్స్కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏర్పాట్లు చేస్తున్నా యి. ఇప్పటికే ముచ్చింతల్ సమీపంలో 33/11కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.30 లక్షల అంచనా వ్యయంతో ముచ్చింతల్ ఆవరణలో తాత్కాలిక విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. ► రోజుకు సగటున 15 లక్షల తాగునీరు అందించేలా ముచ్చింతల్ ప్రధాన లైన్ నుంచి సమతామూర్తి కేంద్రంలో ఉన్న సంపులకు మిషన్ భగీరథ అధికారులు కనెక్షన్లు ఇచ్చారు. ఆవుపేడతో పిడకలు సిద్ధం ► హోమకుండలాల్లో వినియోగించేందుకు ఆవు పేడతో ప్రత్యేకంగా తయారు చేసిన పిడకలు వాడనున్నారు. ఇప్పటికే ఇదే ప్రాంగణంలో ప్రత్యేక యంత్రం సహాయంతో వీటిని తయారు చేసి ఎండకు ఆరబెట్టారు. ఎండిన పిడకలను ప్లాస్టిక్ కవర్లో భద్రపరిచి, హోమకుండలాల వద్దకు చేర్చే పనిలో నిమగ్నయయ్యారు. ► పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి హోమకుండలంలో రోజుకు నాలుగు కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించనున్నారు. ఇలా ఒక్కో యాగశాలలోని తొమ్మిది హోమ కుండలాల్లో రోజుకు 72 కేజీల చొప్పున మొత్తం రెండు లక్షల కేజీల ఆవు నెయ్యిని రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని స్వచ్ఛమైన దేశీయ ఆవు పాల నుంచి సేకరించి తీసుకొచ్చారు. పద్మపత్రాలు విచ్చుకునేలా ఫౌంటెన్.. ► సందర్శకులను ఆకర్షించే విధంగా ప్రధాన ద్వారం నుంచి ప్రవేశించగానే సమతామూర్తికి ఎదురుగా 45 అడుగుల ఎత్తుతో ఉండే డైనమిక్ ఫౌంటెన్ స్వాగతం పలుకుతుంది. అష్టదశ పద్మాకృతితో ఉండే ఈ ఫౌంటెన్లో పద్మ పత్రాలు విచ్చుకునేలా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో రామానుజుల కీర్తనలు శ్రావ్యంగా విన్పిస్తుంటాయి. ప్రధాన ఫౌంటెన్ సహా ప్రధాన ఆలయం చుట్టు లేజర్షో, అత్యాధునిక లైటింగ్, సౌండ్ సిస్టం పనులు సైతం తుది దశకు చేరుకున్నాయి. వెదురు బొంగులు.. తాటి కమ్మలతో.. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో 144 యాగశాలలు నిర్మించారు. వీటిని పూర్తిగా తాటి కమ్మలు, వెదురు బొంగులతో ఏర్పాటు చేశారు. యాగశాల నిర్మాణం పనులు ఇప్పటికే 80 శాతం పూర్తయ్యాయి. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఈ క్రతువుకు దేశం నలుమూలల నుంచి 5 వేల మంది రుత్వికులు, వేద పండితులు పాల్గొననున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో రెండు దఫాలుగా యాగాలు కొనసాగుతాయి. ► నాలుగు దిక్కుల్లో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం 144 చోట్ల యాగాలు జరుగుతుంటాయి. మిగిలినవి సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపాలు, రెండు ఇష్టశాలలు ఉన్నాయి. వీటిలో 1035 హోమ కుండాలు నిర్మించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని విన్పిస్తుంటారు. -
అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన సూర్యకిరణాలు
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని సూర్యకిరణాలు తాకాయి. దాదాపు 7 నిమిషాల పాటు భానుడి లేలేత కిరణాలు మూలవిరాట్ను స్పృశించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతి ఏడాది మార్చి 9,10 అలాగే అక్టోబరు 1,2 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి మూలవిరాట్ను తాకడం ఆనవాయితీగా వస్తుందని పురోహితులు తెలిపారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసి భక్తులు పులకరించిపోయారు. చదవండి: TTD: ఈనెల 7 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు -
కుప్పంలో టీడీపీ దౌర్జన్యకాండ: వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
సాక్షి, చిత్తూరు: తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి రెచ్చిపోయారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండ చేశారు. గుడిపల్లి మండలంలోని కొత్తూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గురువారం అర్ధరాత్రి వేళ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వైఎస్సార్ విగ్రహ ధ్వంసంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన చదవండి: సీఎం జగన్ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం -
దేవత విగ్రహంపై నాగుపాము ప్రత్యక్షం
కొణిజర్ల: కొణిజర్ల మండలం సాలెబంజర పంచాయతీ పరిధిలోని జంపాలనగర్ తండాలోని గిరిజన దేవత మంగ్తూసాథ్ దేవాలయంలోనికి శనివారం ఉదయం ఓ పాము వచ్చి దేవత విగ్రహం పై అమర్చిన ఇత్తడి తొడుగుల పైకి చేరింది. అక్కడ పూజలు చేసేందుకు వచ్చిన స్థానికులను చూసి పడగ విప్పి ఆడింది. పూజారి సుమారు గంట పాటుపూజలు చేసి హారతి ఇచ్చినా పాము అక్కడి నుంచి కదలలేదు. దీంతో దేవునిపాము అంటూ స్థానికులు పెద్ద ఎత్తున గుడికి చేరుకుని పసుపు కుంకుమ వేసి హారతులు ఇచ్చి పూజలు చేశారు. -
రైతుకు జరిమానా.. కట్టకపోతే బహిష్కరణ.. ఏం జరిగిందంటే?
ముంబై: మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో అమ్గాన్ గ్రామ పంచాయతీ ఓ రైతుకు రూ. 21,000 జరిమానా విధించింది. పోలీసుల వివరాల ప్రకారం.. జూన్ 12న అమ్గావ్ తహసీల్లోని సీతేపార్ గ్రామానికి చెందిన తికారామ్ ప్రీతమ్ పార్ధి అనే రైతు తన పొలంలో భూమిని చదును చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు స్థానిక దేవత రాతి విగ్రహం దెబ్బతిన్నది తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని పార్ధిని పొలం పనులు ఆపేయాలని బలవంతం చేశారని అన్నారు. తర్వాత పంచాయతీ సమావేశం ఏర్పాటు చేసి, పార్ధి తమ మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించినట్లు పేర్కొన్నారు. ఇందుగాను అతనిపై రూ. 21 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. అయితే ఈ మొత్తం చెల్లించకపోతే సామాజిక బహష్కరణను ఎదుర్కొటామని బెదిరించినట్లు అమ్గావ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విలాస్ నాలే తెలిపారు. ఆ డబ్బు చెల్లించే ఆర్థిక స్తోమత లేదు! కాగా ఈ మొత్తం డబ్బును దెబ్బతిన్న విగ్రహ నిర్మాణానికి, మిగిలిన క్రతువులకు ఉపయోగించుకోనున్నట్లు పంచాయతీలో తీర్పు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కానీ పార్ధి తన ఆర్థిక స్తోమత బాగోలేనందున డబ్బు చెల్లించలేకపోయాడని, అనంతరం పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా గ్రామ సర్పంచ్ గోపాల్ ఫులిచంద్ మెష్రామ్, పోలీసు పాటిల్ (గ్రామస్థాయి పోలీసు అసిస్టెంట్) ఉల్హాస్రావ్ భైయలాల్ బిసెన్, రాజేంద్ర హివర్లాల్ బిసెన్, పురన్ లాల్ బిసెన్, యోగేష్ హిరలాల్ బిసెన్, యాదవరావ్ శ్రీరామ్ బిసెన్, ప్రతాప్ లధాన్ లంచన్లపై మహారాష్ట్ర ప్రొహిబిషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ సోషల్ బాయ్కాట్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) చట్టం, 2016 కింద కేసు నమోదు చేసి, నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు ఇన్స్పెక్టర్ నాలే తెలిపారు. దీనిపై సర్పంచ్ మేష్రామ్ మాట్లాడుతూ.. స్థానిక సాంప్రదాయం ప్రకారం, గ్రామస్తులు విగ్రహాన్ని పూజించడం ద్వారా ప్రతి సంవత్సరం కొత్త పంట కాలం ప్రారంభమవుతుందన్నారు. పార్ధిని చెల్లించమని అడిగిన మొత్తం డబ్బుతో విగ్రహాన్ని మరమ్మతు చేసి, చిన్న ఆలయం నిర్మించడానికి పంచాయతీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. చదవండి: హిజ్రాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ -
ఒకే శరీరం.. త్రిమూర్తుల శిరస్సులు
సాక్షి, హైదరాబాద్: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలు ఒకే విగ్రహంగా ఉన్న అరుదైన శిల్పం వెలుగుచూసింది. చరిత్ర పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి 13వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహాన్ని గుర్తించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలోని శిథిల నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఇది బయటపడింది. ఆ ఆలయాన్ని పదిలం చేసుకునే కసరత్తులో భాగంగా స్థానికులు శుభ్రపరుస్తుండగా ఈ విగ్రహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు శివనాగిరెడ్డి అక్కడికి వెళ్లి దాన్ని పరిశీలించారు. ఒకే శరీరానికి మూడు తలలున్న ఆ విగ్రహం ఎంతో ప్రత్యేకమైందని, ఇప్పటివరకు హరి, హర, పితామహ రూపాలు ఒకే విగ్రహంలో ఉండటం అరుదని అన్నారు. ఈ విషయమై కొత్త తెలంగాణ చరిత్ర బృంద ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్, చరిత్ర పరిశోధకులు జైశెట్టి రమణయ్యలను సంప్రదించగా, గతంలో ఈ రూపంలో విగ్రహం వెలుగుచూసిన దాఖలాలు లేవని వారు పేర్కొన్నట్టు నాగిరెడ్డి వెల్లడించారు. తొలితరం కాకతీయులు జైన ఆరాధకులని, రుద్రదేవుడి నుంచి శైవంపట్ల మొగ్గుచూపారని పేర్కొన్నారు. గణపతిదేవుడి కాలంలో హరిని, హరుడిని విడిగా ఆరాధించేవారి మధ్య ఆధిపత్య పోరు పెరగకుండా ఉండేందుకు, అంతాసమానమనే భావన కల్పించేందుకు ఇలాంటి శిల్పాన్ని ఏర్పాటు చేయించి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామ చివరన ఉన్న పురాతన శివాలయం వద్ద 13వ శతాబ్దానికి చెందిన ఆసీన వీరభద్ర, భద్రకాళి, భైరవ, మహిషాసుర మర్ధిని, అగస్త్య మహాముని విగ్రహాలు వెలుగు చూశాయని ఆయన పేర్కొన్నారు. అరుదైన విగ్రహాలతో కూడిన మందిరాలను పరిరక్షించాలని హెరిటేజ్ తెలంగాణ అధికారులను ఆయన కోరారు. -
నాన్న ఆశీర్వాదం కోసం... రూ. 6 లక్షల విగ్రహం
సాక్షి, చెన్నై: తండ్రిపై సాధారణంగా కుమార్తెలకు ప్రేమ కాస్త ఎక్కువే. ఆడపిల్ల తన జీవితంలోని ప్రతి కీలక దశలో నాన్న తోడుగా ఉండాలని కోరుకుంటుంది. ముఖ్యంగా వివాహ సమయంలో తండ్రిని ఎక్కువగా గుర్తు చేసుకుంటుంది. ఒకవేళ దురదృష్టం కొద్ది తండ్రి.. కుమార్తె వివాహానికి ముందే మరణిస్తే.. ఆ బాధ వర్ణనాతీతం. తమిళనాడుకుచెందిన అక్కాచెల్లెళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. సోదరి వివాహంలో తండ్రి తమతో లేడన్న బాధను మరిచేందుకు ఆయన విగ్రహాన్ని తయారు చేయించారు ఆ అక్కాచెల్లెళ్లు. ఆ విగ్రహం సమక్షంలో తన చిన్న చెల్లెలి వివాహ రిసెప్షన్ వేడుకను జరిపించారు. ఆ వివరాలు.. తమిళనాడు తంజావూరు జిల్లా పట్టుకోట్టైకు చెందిన సెల్వం పెద్ద పారిశ్రామిక వేత్త. ఆయనకు భార్య కళావతి, భువనేశ్వరి, దివ్య, లక్ష్మి ప్రభ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తండ్రి అంటే కుమార్తెలకు ఎనలేని ప్రేమ. ఇందులో చిన్న కుమార్తె లక్ష్మీప్రభ ఆ తండ్రికి గారాల పట్టి. భువనేశ్వరి, దివ్యలకు ఎనిమిదేళ్ల క్రితమే అత్యంత వేడుకగా వివాహాన్ని జరిపించాడు. (చదవండి: ఒకప్పుడు కారడివి.. కానీ ఇప్పుడు..) ఆనందంగా సాగుతున్న వారిపై విధి చిన్న చూపు చూసింది. 2012లో సెల్వం మరణించాడు. తండ్రి మరణం కుమార్తెల్ని కలచి వేసింది. ఈ పరిస్థితుల్లో తండ్రికి గారాల పట్టిగా ఉన్న లక్ష్మీప్రభ వివాహ రిసెప్షన్ సోమవారం రాత్రి పట్టుకోట్టైలోని ఓ వివాహ వేదికలో జరిగింది. ఈ వివాహంలో తండ్రి లేడన్న లోటు లక్ష్మీప్రభకు తెలియకూడదని అక్కయ్య భువనేశ్వరి, బావ కార్తిక్ భావించారు. ఇందుకోసం బెంగళూరులోని ఓ సంస్థ ద్వారా తండ్రి నిలువెత్తు సిలికాన్ విగ్రహాన్ని తయారు చేయించారు. రూ. 6 లక్షలు వెచ్చించి సిలికాన్తో 5 అడుగులు 7 అంగుళాల ఎత్తుతో రూపొందించిన విగ్రహాన్ని కల్యాణ వేదికపైకి తీసుకొచ్చారు. దీంతో తండ్రి తన పెళ్లికి వచ్చి ఆశీర్వదించినంత ఆనందంలో ఉబ్బితబ్బిబ్బు అయిపోయింది. వధూవరులు ఇద్దరు ఆ విగ్రహం సమక్షంలో పూలమాలల్ని మార్చుకున్నారు -
ఒకప్పుడు కారడివి.. కానీ ఇప్పుడు..
ఒకప్పుడు అది కారడవి.. ఎటు చూసినా పెద్ద పెద్ద గుట్టలు.. బండరాళ్లే దర్శనమిచ్చేవి. అటు వైపు ఎవరూ కన్నెత్తి చూసేవారు కూడా కాదు.. ఇదంతా గతం. గుట్టను తొలచారు.. గుడిగా మలచడంతో ఇప్పుడా ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. రాప్తాడు: రాప్తాడు మండలంలోని 44వ జాతీయ రహదారి సమీపంలోని హంపాపురం గుట్టలో వెలసిన మౌనగిరి క్షేత్రం (మౌనగిరి బ్రహ్మ పీఠం) నిరంతరం జై శ్రీరాం.. జై ఆంజనేయ నినాదాలతో మార్మోగుతోంది. 39 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహం నేనున్నానంటూ భక్తులకు అభయమిచ్చేలా దర్శనమిస్తోంది. ఈ ప్రాంతాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విరిగిపోయిన విగ్రహం.. విశ్రాంత ఉపాధ్యాయుడు ఈశ్వరయ్యస్వామి, ఆయన సతీమణి ప్రధానోపాధ్యాయులురాలు వేదవతి వాళ్లకు వచ్చిన సంపాదనతో 1999 సంవత్సరంలో 14 ఎకరాల విస్తీర్ణంలో మౌనగిరి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎకరా విస్తీర్ణంలో అభయాంజనేయస్వామి విగ్రహాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే 2008లో రూ.50 లక్షల వ్యయంతో 27 అడుగుల ఆంజనేయస్వామి భారీ విగ్రహం తయారు చేయించారు. దీనిని మౌనగిరి క్షేత్రంలో ప్రతిష్టిస్తుండగా ప్రమాదవశాత్తూ విగ్రహం కిందపడి విరిగిపోయింది. ఫలితంగా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది మౌనగిరి క్షేత్రం. ఆంజనేయస్వామి భారీ విగ్రహం ముక్కలు కాగానే కార్యక్రమ కార్యనిర్వాహకులు మౌనగిరి క్షేత్రం పీఠాధిపతి ఈశ్వరయ్య స్వామితో పాటు విగ్రహ ప్రతిష్టకు వచ్చిన అశేష భక్త జనం ఆందోళన చెందారు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద విగ్రహం దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 39 అడుగుల ఎత్తు, ఐదు అడుగుల మందం, 12 అడుగుల వెడల్పు, 225 టన్నుల బరువు ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని తయారు చేసేందుకు కర్ణాటకలోని కొయిరా గ్రామం నుంచి ప్రత్యేక రాయిని తెప్పించారు. తమిళనాడులోని మహాబలిపురం నుంచి విశేషానుభవం ఉన్న పలువురు శిల్పులు ఏడాది పాటు నిరంతరం శ్రమించి ఆంజనేయుని విగ్రహాన్ని మలిచారు. దాదాపుగా రూ. 9 కోట్లు వెచ్చించి 39 అడుగుల అభయాంజనేయస్వామి స్వామి విగ్రహ ప్రతిష్టతో పాటు చుట్టూ ఆలయాన్ని నిర్మించారు. అలాగే సీతారాములు, దక్షిణమూర్తి, వినాయకుడు, మహాలక్ష్మి, మృత్యుంజయుడు విగ్రహలతో పాటు ఆలయాలు నిర్మించారు. అలాగే ఆంజనేయస్వామి పాదాల కింద పీఠాన్ని కోలార్ జిల్లా శిలారుపట్నం నుంచి తెప్పించారు. గతంలో గుట్ట ఎక్కాలంటే భక్తులు సగం కొండ ఎక్కడానికే తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రస్తుతం భక్తులు కొండ పైకి ఎక్కడానికి మెట్లు, వాహనాలు వెళ్లేందుకు మట్టి రోడ్డు కూడా ఏర్పాటు చేశారు. వంద మందికి ఆశ్రయం.. కొండపై విశాలమైన ప్రదేశంలో మొక్కలు నాటి పచ్చదనం పెంచారు. దాదాపుగా 100 మంది అనాధ వృద్ధులను చేరదీసి వారికి కొండపైనే ఆశ్రయం కల్పిస్తున్నారు. అలాగే గోశాలను ఏర్పాటు చేసి మూగ ప్రాణులను సంరక్షిస్తున్నారు. మంగళ, శని, ఆదివారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అలాగే భక్తులకు వీరబ్రహ్మం బోధనలు, తత్వాన్ని, కాలజ్ఞానాన్ని తెలియజేస్తున్నారు. ప్రతి ఏటా నవంబర్లో అభయాంజనేయస్వామి జయంత్యుత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. అతి పెద్ద ధ్వజ స్తంభాలు.. మౌనగిరి క్షేత్రంలో ఏ పని చేసినా భిన్నంగా ఉండాలనే ఈశ్వరయ్యస్వామి మూడు దివ్య జ్యోతులు ఎప్పుడూ వెలిగేలా ధ్వజ స్తంభాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మూడు గుట్టలపై 33 అడుగులు ఎత్తున్న ధ్వజ స్తంభాల్లో రామకోటి, శివ, బ్రహ్మ శివ జ్యోతులను వెలిగించారు. జిల్లాలోనే ఏడున్నర అడుగుల అతిపెద్ద వినాయక విగ్రహం ఇక్కడే ఉండటం విశేషం. పర్యటక క్షేత్రంగా .. రాప్తాడు మండలంలోని హంపాపురం గుట్టలో వెలసిన మౌనగిరి క్షేత్రాన్ని దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ దివ్య క్షేత్రం, పర్యటక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రతిష్టించిన 39 అడుగుల అభయాంజనేయ స్వామి భారీ విగ్రహం ఖ్యాతి గడించనుంది. 30 కిలో మీటర్ల వరకు అభయాంజనేయస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల సహకారంతో మరింత అభివృద్ధి ప్రజల్లో భక్తిభవాన్ని పెంపొందించేందుకే ఇక్కడ కొండపై 39 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. మన రాష్ట్రంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. భక్తులు, దాతల సహకారంతో మౌనగిరి క్షేత్రాన్ని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వసతి గృహాలు, ఆలయానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉంది. – ఈశ్వరయ్య స్వామి, మౌనగిరి క్షేత్రం వ్యవస్థాపకులు -
నిందితుల్ని కలిసిన మాజీ మంత్రి తనయుడు
విశాఖ : విగ్రహాల ధ్వంసం దుష్ర్పచారంపై తప్పుడు ప్రచారం చేసిన నిందితులను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కలవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఉన్న ఆయన.. నిందితులను కలవడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కాగా గొలుగొండ ఏటిగైరమ్మపేటలో గణేష్ విగ్రహం ధ్వంసమయ్యిందని కొందరు టీడీపీ నేతలు దుష్ర్పచారం చేశారు. ఏడాది క్రితం విరిగిన విగ్రహం.. ఇప్పుడు ధ్వంసమైనట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేసిన చేసిన నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీరిలో కిలాడి నరేష్, పోలిశెట్టి సంతోషం, పోలిశెట్టి కనకరాజు, కల్యాణరావులు ఉన్నారు. ప్రస్తుతం వీరిని గొలుగొండ పీఎస్లో పోలీసులు విచారిస్తున్నారు. విగ్రహాల ధ్వంసం దుష్ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారిని ఉపేక్షించకూడదు: సచ్చిదానంద స్వామి దైవ ద్రోహానికి పాల్పడితే భగవంతుడు క్షమించడని గణపతి సచ్చిదానందస్వామి అన్నారు. విగ్రహాలను ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని, ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహాల ధ్వంసం దుష్ప్రచారం చేస్తున్న వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు. -
రామతీర్థం కోదండ రాముని విగ్రహం ధ్వంసం
సాక్షి, నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో గుర్తు తెలియని దుండగులు బోడికొండపై ఉన్న కోదండ రామస్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. దేవస్థాన అర్చకుడు ప్రసాద్ ఎప్పటిలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు మంగళవారం ఉదయం పైకి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి తోటి సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి ఆలయ పరిసర ప్రాంతాలను గాలించారు. జిల్లా ఎస్పీ రాజకుమారి విగ్రహాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరో కావాలనే విగ్రహాలను ధ్వంసం చేసినట్లు భావిస్తున్నామని తెలిపారు. ఘటనపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. (చదవండి: వేటకెళ్తూ దారితప్పి.. బంగ్లాదేశ్ జలాల్లోకి) సమాచారం తెలుసుకున్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్బాబు వెంటనే ఆలయాన్ని సందర్శించారు. ఎంపీ బెల్లాన మాట్లాడుతూ కోదండ రాముని విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి జిల్లాకు వస్తున్నారని ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని కొంతమంది కావాలనే ఈ ఘటనకు పాల్ఫడ్డారని మండిపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా రాముడి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా యధావిధిగా ప్రతిష్టింపజేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేని రాజకీయ ఉన్మాదులు, అరాచక శక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జరిగిన సంఘటనపై దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా స్పందించి ఎస్పీ రాజకుమారితో మాట్లాడారు. దేవదాయ శాఖ ఆర్జేసీ డి.భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు. -
ఖైరతాబాద్లో కొలువుదీరిన గణనాధుడు
-
‘ముక్క’మాటానికిపోయి..
ఓ స్కూల్ మాస్టారు.. కారు కొన్నారు. మిగిలిన మాస్టార్లు కారు కొన్నందుకు పార్టీ ఇవ్వాలని పట్టుబట్టారు. ఇంకేముంది.. పాపం సారు.. మొహమాటానికి.. సారీ ‘ముక్క’మాటానికి పోయారు. కక్క, ముక్కలతో మాంసాహారాన్ని వండించారు. అంతేకాదు.. క్యారియర్లతో ఏకంగా స్కూల్కు తీసుకువచ్చేశారు. అయితే తాము చదువు చెబుతున్న పాఠశాల అన్నవరం దేవస్థానానికి చెందిన సంస్కృతోన్నత పాఠశాలని మరిచారో ఏమో!.. కొండపై సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరుగుతున్న వేళ మాంసాహార విందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చివరికి విషయం ఆలయ అధికారులకు తెలియడంతో ఆ మాస్టార్లు చిక్కుల్లో పడ్డారు. సాక్షి, తూర్పుగోదావరి(ప్రత్తిపాడు) : ఒకవైపు సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం రత్నగిరిపై భక్తి శ్రద్ధలతో దేవస్థానం అధికారులు వేడుకలు నిర్వహిస్తుంటే.. కొండదిగువన దేవస్థానం నిర్వహణలో గల సంస్కృతోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు మాంసాహారం భుజించేందుకు ఏర్పాట్లు చేసుకోవడం విమర్శలకు దారి తీసింది. విషయం తెలుసుకున్న ఈఓ ఎంవీ సురేష్ బాబు మధ్యాహ్నం హుటాహుటిన హైస్కూల్కు చేరుకుని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆ మాంసాహారాన్ని ఊరి చివర పారబోయించారు. ఈ మాంసాహార భోజనం హైస్కూల్కు తీసుకువచ్చిన స్కూల్ అసిస్టెంట్ విజయ్కుమార్ను సస్పెండ్ చేయగా, క్యారియర్లను తన గదిలో ఉంచిన పీఈటీ చక్రధరరావుకు షోకాజ్ నోటీసు అందజేశారు. పార్టీ అడిగారని.. అన్నవరం దేవస్థానం 50 ఏళ్లుగా కొండదిగువన, ప్రస్తుత మొదటి ఘాట్రోడ్ పక్కన సంస్కృతోన్నత పాఠశాల నిర్వహిస్తోంది. ఈ స్కూల్లో సంస్కృతం ప్రధాన భాషగా ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు. ఇక్కడ హైస్కూల్ ఉపాధ్యాయులతో పాటు, విద్యార్థులు కూడా పర్వదినాల్లో దేవస్థానంలో పలు రకాలుగా సేవలందిస్తుంటారు. హైస్కూల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ విజయ్కుమార్ ఇటీవల కారు కొనుకొన్నందున ఇతర ఉపాధ్యాయులు ఆయనను పార్టీ అడిగారు. ఆయన మాంసాహారాన్ని వండించి రెండు క్యారియర్లతో హైస్కూల్కు తెచ్చి పీఈటీ గదిలో ఉంచారు. దేవస్థానంలో స్వామివారి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఈఓకు ఈ మేరకు సమాచారం రావడంతో మధ్యాహ్నం 12.30 కు దేవస్థానం హైస్కూల్కు చేరుకుని తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో పీఈటీ గదిలో ఒక పెద్ద క్యారియర్లో బిర్యానీ, మరో క్యారియర్లో మాంసం కూర ఉండడంతో దీనిపై ఆ ఉపాధ్యాయుడిని ప్రశ్నించగా సహచర ఉపాధ్యాయులు పార్టీ అడగడంతో తెచ్చానని తెలిపారు. దీనిపై పీఈటీ చక్రధరరావును ప్రశ్నించగా తన గదిలో ఆ క్యారియర్లను పెట్టమని తాను చెప్పలేదని సమాధానమిచ్చారు. వారిద్దరి స్టేట్మెంట్లతో పాటు ఇతర ఉపాధ్యాయుల స్టేట్మెంట్లు కూడా ఈఓ రికార్డు చేయించారు. అనంతరం స్కూల్ అసిస్టెంట్ విజయ్కుమార్, పీఈటీ ఎం.చక్రధరరావులపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గతంలో కూడా చాలాసార్లు ఇలానే హైస్కూల్లో మాంసాహారం తీసుకున్నట్టు తెలిసింది. -
అయోధ్యలో 221 మీటర్ల రాముడి విగ్రహం!
లక్నో: ఓ వైపు అయోధ్యలో రామమందిర నిర్మాణంపై చర్చ జరుగుతుంటే.. మరోవైపు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం 221 మీటర్ల పొడవైన భారీ రాముడి విగ్రహాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. గుజరాత్లోని నర్మదా జిల్లాలో నిర్మించిన సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ (182 మీటర్లు) ప్రపంచంలోనే పొడవైంది కాగా దీని కంటే పొడవుగా ‘స్టాచ్యూ ఆఫ్ ది మర్యాద పురుషోత్తమ్’ పేరుతో అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు యోగి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాముడి విగ్రహం 151 మీటర్ల పొడవుంటుందని.. దానిపై గొడుగు 20 మీటర్లు, విగ్రహం పునాది మరో 50 మీటర్ల ఎత్తు ఉంటుందని ఆ రాష్ట్ర సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి అవనీశ్ అవస్థి తెలిపారు. విగ్రహం కింద భాగంలో అయోధ్యతోపాటు ‘ఇక్ష్వాకు వంశం’ చరిత్రకు సంబంధించిన విశేషాలతో అధునాతన మ్యూజియం ఏర్పాటుచేస్తామని చెప్పారు. -
టీవీఎస్ బాస్పై సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళనాట పవిత్ర విగ్రహాల మాయం, చోరీ కేసులో కీలక పరిణామం చేసుకుంది. రెండు ప్రధాన ఆలయాల్లో విగ్రహాల మాయంపై హైకోర్టు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో టీవీఎస్ చైర్మన్, ఎండీ వేణు శ్రీనివాసన్ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కేసు నమోదు, అరెస్ట్కు అవకాశం ఉందన్న అంచనాలతో కోర్టులో పిటిషన్ వేశారు. విగ్రహాల చోరీ కేసులకు సంబంధించిన పిటిషన్ను జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ పీడీ అదికేశవులతో కూడిన స్పెషల్ డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించింది. ఆరు వారాలపాటు ఆయనను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అనంతరం, శ్రీనివాసన్ ముందుస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు. ప్రస్తుతానికి శ్రీనివాసన్కు ఊరట లభించింది. మరోవైపు కేవలం కాపాలీశ్వర్ భక్తుడిగా తాను ఆలయ వృద్ది కోసం వ్యక్తిగత నిధులను భారీగా వెచ్చించానని పిటిషన్లో శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఆలయ పెయింటింగ్, ఇతర పునర్నిర్మాణ ఖర్చుల కోసం 70 లక్షల రూపాయలను వెచ్చించినట్టు కోర్టుకు తెలిపారు. అంతకుమించి తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అలాగే శ్రీరంగం ఆలయ పునర్నిర్మాణం కోసం ఆలయ ఛైర్మన్గా వ్యక్తిగతంగా 25 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్టు వెల్లడించారు. అలాగే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో 100 ఆలయాలను పునర్నిర్మాణం పూర్తిచేసినట్టు శ్రీనివాసన్ పేర్కొన్నారు. జూలై 28న మద్రాసు హైకోర్టు సమర్పించిన అఫిడవిట్లో వేణు శ్రీనివాసన్ పేరును ఎలిఫెంట్ రాజేంద్రన్ ప్రస్తావించారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు. తిరుచ్చికి చెందిన రంగజరాన్ నరసింహన్, చెన్నైకి చెందిన ఎలిఫెంట్ రాజేంద్రన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. శ్రీరంగం ఆలయం నుంచి పవిత్రమైన అనేక పురాతన కళాఖండాలు చోరీకి గురయ్యాయనీ, ఆలయంలోని ప్రధాన పెరుమాళ్(విష్ణుమూర్తి) విగ్రహం దెబ్బతిందని ఫిర్యాదుదారులు ఆరోపించారు. అలాగే కపాలీశ్వర్ ఆలయంలో శివుడిని పూజించే నెమలి(పార్వతిదేవి ప్రతిరూపంగా భావించే) ప్రతిమను మార్చివేశారని ఆరోపించారు. 2004లో ఆయన పునరుద్ధరణ కార్యక్రమంలో వీటిని రాత్రికి రాత్రే తారుమారు చేశారనేది పిటిషన్ దారుల ప్రధాన ఆరోపణ. కాగా 2004లో తమిళనాడులోని దేవాలయాలలో కుంభాభిషేకం నిర్వహణకు నియమించిన ప్రభుత్వ కమిటీ(ఆలయ పునరుద్ధరణ కమిటీ)లో వేణు శ్రీనివాసన్ సభ్యుడిగా ఉన్నారు. అలాగే శ్రీరంగం ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్గా కూడా ఆయన ఉన్నారు. ఇక్కడ కుంభాభిషేకం నిర్వహణలో కూడా ఈయన భాగం. తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలు, చెన్నైశివారు ప్రాంతంలో మైలాపూర్లోని కపాలీశ్వర, శ్రీరంగం ఆలయాల విగ్రహాలు, ఇతర పురాతన వస్తులు మాయం కేసులో విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించిన మరోసటి రోజే శ్రీనివాసన్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు టీవీఎస్ ట్రస్ట్ పేరుతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తమిళనాడులోని అనేక పురాతన ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధికి సహాయ సహకారాలందించే శ్రీనివాసన్పై తాజా ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. -
న్యాయస్థానానికి పళణి ఆలయ ఉత్సవ మూరి విగ్రహం
-
వినాయకుడి విగ్రహం ధ్వంసం
కావలిరూరల్: వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన మంగళవారం రాత్రి లక్ష్మీపురం గ్రామంలో జరిగింది. రూరల్ పోలీసులు, లక్షీపురం గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని లక్ష్మీపురం గ్రామం చివరన చెరువు కట్ట సమీపంలో వినాయకుడి విగ్రహం ఉంది. కొన్ని తరాలుగా అక్కడ ఉన్న విగ్రహానికి స్థానికులు పూజలు చేస్తున్నారు. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్తులకు విగ్రహం కనిపించలేదు. దీంతో పరిసరాల్లో వెతకగా చెరువులోని నీటిలో సగం విరిగిన విగ్రహం కనిపించింది. దీంతో ఊర్లో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. పూజలు చేసి.. ఏకశిల విగ్రహమైన వినాయకుడి ప్రతిమను అపహరించి ధ్వంసం చేశారు. చాతి భాగం నుంచి కింది భాగం వరకు తీసుకెళ్లారు. మిగిలిన పైభాగం అక్కడ చెరువులోని నీటిలో పడవేశారు. వినాయక నిమర్జనం సమయంలో చేసే పూజలు ఇక్కడ చేశారు. పూలు, పండ్లు, నవధాన్యాలు నీటిలో వేసి ఉన్నారు. సమీపంలో పూజలకు ఉపయోగించిన నూనె, కర్పూరం అగ్గిపెట్టె ఉన్నాయి. దుండగులు చెరువు వద్ద మద్యం సేవించిన ఆనవాళ్లున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఊరికి అరిష్టం జరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. గుప్తనిధి కోసమేనా? వినాయకుడి విగ్రహం బొజ్జలో బంగారం, వజ్రాలు ఉంటాయని ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. పొరుగునే ఉన్న పేపాలవారిపాలెంలో సుమారు 6 ఏళ్ల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మవారికి మహా అపచారం
సాక్షి, నాగపట్టణం: అమ్మవారి విగ్రహాన్ని సల్వార్ కమీజ్తో అలంకరించిన ఇద్దరు అర్చకులపై వేటు పడింది. తమిళనాడు నాగపట్టణం జిల్లా మయిలాదుతుదైలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మయూర్నాథర్ ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. అమ్మవారి విగ్రహానికి ఆధునిక బట్టలు ఆలయంలోని అభయాంబిగై అమ్మవారిని ప్రతి శుక్రవారం వివిధ రంగుల కాగితాలతో అలంకరిస్తుంటారు. సంప్రదాయానికి భిన్నంగా రాజ్ అనే పురోహితుడు అమ్మవారి విగ్రహానికి ఆధునిక బట్టలు తొడిగారు. పింక్ రంగు సల్వార్ కమీజ్, నీలం రంగు దుపటాతో అమ్మవారిని అలంకరించారు. సీనియర్ అర్చకుడు కళ్యాణమ్ కుమారుడైన రాజ్ను తండ్రికి సహాయంగా ఉంటాడనే ఉద్దేశంతో గతేడాది ఆగస్టులో ఆలయంలో నియమించారు. తండ్రీకొడుకులపై వేటు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఆగమ నియమాలకు విరుద్ధంగా అమ్మవారికి అపచారం జరగడంతో భక్తులు, సీనియర్ అర్చకులు మండిపడ్డారు. దీంతో స్పందించిన దేవస్థానం పాలక మండలి ఇద్దరు అర్చకులను విధుల నుంచి తొలగించింది. చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడంతో వీరిద్దరిపై చర్య తీసుకోవాల్సివచ్చిందని పాలక మండలి ప్రతినిధి ఎస్. గణేశన్ తెలిపారు. తాను ఎటువంటి దురుద్దేశంతోనూ ఈ తప్పు చేయలేదని అర్చకుడు రాజ్ చెప్పారు. ఆలయ ప్రతిష్టను దిగజార్చాలన్న ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. నంది విగ్రహానికి నోట్లతో అలంకరణ ప్రచారం కోసం గతంలోనూ రాజ్ ఇటువంటి పనులు చేశాడని మయిలాదుతుదై ఫొటోజర్నలిస్ట్ ఒకరు చెప్పారు. నంది విగ్రహాన్ని రూ. 15 వేల విలువ చేసే వంద రూపాయల నోట్లతో అలకరించించాడని, అప్పుడు అతడిని అందరూ మెచ్చుకున్నారని వెల్లడించారు. కానీ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడని తెలిపారు. కాగా, అమ్మవారి విగ్రహాన్ని సల్వార్ కమీజ్లో అలంకరించిన ఫొటోలను రాజ్ తన స్నేహితులకు పంపడంతో సామాజిక మాధ్యమాల్లో ఇవి వైరల్గా మారాయి. -
సరయు ఒడ్డున రాముడి భారీ విగ్రహం
లక్నో: ఉత్తరప్రదేశ్లో సరయు నది ఒడ్డున 328 అడుగుల (100 మీటర్ల) రాముడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాముడి జన్మస్థలమైన అయోధ్యకు ప్రచారం కల్పించే ఉద్దేశంతో రూ.330 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి అవనీశ్ అవస్థి తెలిపారు. అయితే విగ్రహ ఏర్పాటుకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ అనుమతి అవసరమని అవస్థి అన్నారు. అలాగే దీపావళి వేడుకల కోసం ప్రత్యేక కార్యక్రమాల్ని చేపట్టనున్నామన్నారు. రాముడు అయోధ్యకు తిరిగొచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఓ యాత్రను చేపట్టినట్లు, దీనిలో భాగంగా సీఎం యోగి పలు పథకాలను ప్రారంభించనున్నట్లు అవస్థి తెలిపారు. ఈ నెల 18న ‘రామ్కీ పైడీ’ పేరుతో 1.75 లక్షల మట్టి ప్రమిదలతో దీపోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ మేరకు గవర్నర్ రామ్నాయక్కు కార్యక్రమాల వివరా లను అందజేశామన్నారు. అలాగే కార్యక్రమాల్లో భాగంగా గవర్నర్తో కలసి సీఎం యోగి సరయు నదికి హారతివ్వనున్నట్లు తెలిపారు. అలాగే లేజర్ షో ఏర్పాటు చేస్తామని.. ఇండోనేసియా, థాయ్లాండ్ కళాకారులతో రామ్లీలా నాటకాన్ని ప్రదర్శించనున్నట్లు తెలిపారు. -
‘బాహుబలి’లో భాగస్వామి కావడం గర్వంగా ఉంది
- ఇండియన్ ఐడల్ విజేత రేవంత్ రావులపాలెం (కొత్తపేట) : తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన బాహుబలి చిత్రంలో గాయకుడిగా తాను కూడా భాగస్వామి కావడం గర్వంగా ఉందని సినీ గాయకుడు, ఇండియన్ ఐడల్ విజేత కేఎల్ రేవంత్ అన్నారు. రావులపాలెంలో బాహుబలి-2 చిత్రం ప్రదర్శిస్తున్న శ్రీ వెంకటేశ్వర థియేటర్ వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా పారిశ్రామిక విభాగం అధ్యక్షుడు మంతెన రవిరాజు ఆధ్వర్యాన గురువారం సాయంత్రం రేవంత్ను ఘనంగా సన్మానించారు. ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన ఆయనకు రవిరాజు, ప్రభాస్ అభిమానులు పూలకిరీటం, పూలమాలలు, జ్ఞాపిక, శాలువాలతో ఘనంగా సన్మానించారు. రేవంత్ మాట్లాడుతూ, తెలుగు ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న తన సన్నిహితులు, అభిమానులు, పెద్దల ఆశీస్సులతోనే తాను ఈ ఘనత సాధించానన్నారు. ఈ కృషిలో తల్లిదండ్రులు, తోటి గాయకుల ప్రోత్సాహం మరువలేనిదన్నారు. ఈ విజయంలో తన కృషితోపాటు ప్రజల ఓటింగ్ కూడా కీలక పాత్ర పోషించాయన్నారు. రవిరాజు తనకు మంచి మిత్రుడని, ఆయన సహకారంతోనే జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించిందన్నారు. ప్రభాస్కు తాను పెద్ద అభిమానినని ప్రభాస్ అభిమానుల సమక్షంలో సత్కారం పొందడం సంతోషంగా ఉందని అన్నారు. సచిన్ టెండూల్కర్, ఎస్ఎస్ రాజమౌళి తనకు స్ఫూర్తి అన్నారు. బాహుబలి సినిమాలోని ప్రతి సన్నివేశం అమోఘంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు ఆయన బాహుబలి-1లో తాను ఆలపించిన ‘మనోహరీ..’ గీతాన్ని ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మరో గాయని గీతామాధురి బాహుబలి-2 చిత్రంలోని ‘దండాలయ్యా’ పాట పాడి అలరించారు. కార్యక్రమంలో గాయకుడు శ్రీకృష్ణ, యాంకర్ అశ్వని, ప్రభాస్ అభిమాన సంఘ నాయకులు వేగిశ్న మణికంఠవర్మ, దాట్ల రాకేష్వర్మ, సయ్యపరాజు నరసింహరాజు, తాడిపూడి బాబు, నడింపల్లి వెంకట సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. -
ట్యాంక్బండ్పై ఐలమ్మ విగ్రహం:నాయిని
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ సాయుధ యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం బాగ్లింగంపల్లిలోని వీఎస్టి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ 31 వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం స్పూర్తిదాయకమని, ఆమె పోరాటం, త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రజకులను గ్రామబహిష్కరణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృత్తులను కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది అసువులు బాసారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను జైల్లోపెట్టి కొట్టిన కాంగ్రెస్ నేతలు నేడు ఓడిపోయారన్నారు. కొండూరు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య, కాలప్ప, జీవన్, శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య భట్, యాదమ్మ, ముదిగొండ మురళి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి
దోమలగూడ: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలని తెలంగాణ రజక ఐక్య వేదిక ఫౌండర్ చైర్మన్ సి.శంకర్, అధ్యక్షుడు అమానపు అప్పారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దోమలగూడలో మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది రజకులు ఉండగా అందులో వృత్తిపై ఆధారపడిన వారు 10 లక్షల మంది వరకు ఉంటారన్నారు. ప్రభుత్వం రజకుల రక్షణకు చట్టం చేయడంలో, సమగ్రాభివృద్ధికి నిధులు విడుదల చేయడంలో, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వీరనారి చాకలి ఐలమ్మకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని, ఆమె విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం హిమాయత్నగర్లోని వెనుకబడిన తరగతుల సాధికారిత సంస్థ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహిస్తున్నామని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. -
వినాయకుడి విగ్రహం చోరీ
నల్లబెల్లి : పురాతన కాలం నాటి వినాయకుడి విగ్రహం చోరీకి గురైన సంఘటన మండలంలోని గుండ్లపహాడ్ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది.పోలీసులు, గ్రా మస్తుల కథనం ప్రకారం.. గుండ్లపహాడ్ గ్రా మానికి చెందిన పడాల పురుషోత్తమరావు ఇం టి వెనుకాల వ్యవసాయ భూమిలో 8 ఏళ్ల క్రి తం వ్యవసాయ పనులు చేస్తుండగా పురాతన కాలం నాటి వినాయక విగ్రహం బయటపడిం ది. గ్రామస్తుల నిర్ణయం మేరకు పురుషోత్తమరావు వ్యవసాయ భూమిలోనే విగ్రహాన్ని ప్రతిషి్ఠంచి స్థానికులతోపాటు పలు గ్రామాల ప్రజలు పూజలు చేస్తున్నారు. నెల రోజుల క్రితం గ్రామస్తులంతా సమావేశమై ఈ విగ్రహాన్ని గ్రామంలోని శివాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పున ప్రతిషా్ఠపన చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా గ్రామంలో ఏర్పాట్లు చేస్తున్నా రు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం పురుషోత్తమరావు వ్యక్తిగత పనులపై హైదరాబాద్ వెళ్లాడు. బుధవారం తిరిగి గుండ్లపహాడ్ చేరుకున్నాడు. బుధవారం పూజలు చేసేందుకు దేవాలయానికి వెళ్లగా వినాయక విగ్రహం కనిపించకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించారు. సర్పం చ్ పడాల భాగ్యశ్రీరమణరావు, గ్రామస్తుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్సై మేరుగు రాజమౌళి తెలిపారు. -
భార్య కాపురానికి రావడం లేదని..
ఇండోర్: కోరికలు తీరాలని దేవున్ని వేడుకునే వాళ్లను, కష్టాలు ఎదురైనపుడు తననే ఎందుకిలా చేస్తున్నాడని తిట్టుకునే వాళ్లని మనం చూస్తుంటాం. కానీ భార్య కాపురానికి రాలేదని దేవుడిని తిట్టడమే కాకుండా విగ్రహాన్ని ధ్వంసం చేసే మనిషిని చూశామా..! అయితే ఇలాంటి ఘటన ఇండోర్ లోని పాండ్లా ప్రాంతంలో చోటుచేసుకుంది. తన భార్య కాపురానికి రానందుకు ఆగ్రహించిన ఓ భర్త దేవుని విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. మనోజ్ బంజారా(37) తన భార్య గత కొంత కాలంగా కాపురానికి రావడం లేదని ఆగ్రహంతో ప్రాచీన దేవాలయంలోని మూల విరాట్ ను ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనోజ్ మానసిక స్ధితి కొంత కాలంగా బాగాలేకపోవడంతో అతని భార్య పుట్టింటికి వెళ్లింది. అమెను కాపురానికి రప్పించడానికి బంజారా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరి ప్రయత్నంగా ఏదైనా అద్భుతం జరిపించి తన భార్యను కాపురానికి రప్పించాలని దేవుడిని వేడుకున్నాడట. అయినప్పటికీ తన భార్య తిరిగి రాక పోవడంతో ఆగ్రహించిన మనోజ్ శనివారం రాత్రి దేవుని విగ్రహాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. దీంతో పాండ్లా ఏరియాలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు అదనపు బలగాలను మెహరించారు. మనోజ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. దీనిపై స్పందించిన ఆర్ఎస్ఎస్ నేత వినోద్ మిశ్రా దేవాలయానికి భద్రత కల్సించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
చోరీసొత్తుతో తండ్రికి వెండి విగ్రహం
సాక్షి, బెంగళూరు: అతనో దొంగ. కుటుంబంలోని ఇతరులు కూడా చోరులే. జనం సొత్తును కొల్లగొట్టే వృత్తిలో మరింతగా రాణించాలని జ్యోతిష్యుడి సూచనమేరకు.. చోరీ సొత్తుతోనే తండ్రికి విగ్రహం చేయించి పూజిస్తున్నాడు. బెంగళూరు పోలీసులు తెలిపిన వివరాలనుబట్టి.. గుజరాత్లోని ఓడెకు చెందిన తలపాడ్ నాగవాన్ అలియాస్ శంకర్ ఓ దొంగ. అతని కుటుంబమంతా చోరవృత్తిలోనే కొనసాగుతోంది. చోరీ సొమ్ముతో శంకర్ తన తండ్రి, అన్నకు ఆలయాలు కట్టించాడు. 100 కిలోల వెండితో తండ్రికి, అరకిలో వెండితో అన్నయ్యది విగ్రహాలను చేయించి పూజలు చేస్తున్నాడు. విషయంకాస్తా పోలీసులకు తెలిసి శంకర్ ను అరెస్టు చేశారు. జోతిష్యుడి సూచన మేరకే తండ్రి, అన్నలకు విగ్రహాలు చేయించానని విచారణలో చెప్పాడా దోంగ. ఇక వాళ్ల దొంగతనాల స్టైల్ ఎలా ఉంటుందంటే.. శంకర్ కుటుంబ సభ్యులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ కొన్ని నెలల పాటు అద్దె గదుల్లో ఉంటారు. అదను చూసి చోరీలు చేసి సొంత రాష్ట్రం గుజరాత్కు వెళ్లిపోతారు. శంకర్ 2007 నుంచి బెంగళూరులోని బనశంకరిలో ఉంటూ నగరవ్యాప్తంగా దొంగతనాలు చేసేవాడు. ఈనెల 3న ఓ ఇంట్లో చోరీ చేస్తూ విజయనగర పోలీసులకు చిక్కాడు. ఒక్క బెంగళూరులోనే రూ.5 కోట్ల విలువచేసే సొత్తు కాజేశానని, చోరీసొమ్ముతోనే తన స్వస్థలంలో ఐదు భవంతులు కూడా కొన్నానని విచారణలో చెప్పాడు. -
సినిమా కథలా విగ్రహాల కేసు...
చెన్నై: సినిమా దర్శకుడిగా ఉండిన ప్రభావమో ఏమో విగ్రహాల చోరీ కేసులో సైతం అదే రేంజ్ లో ట్విస్ట్ లు నెలకొన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.80 కోట్ల విగ్రహాలను విదేశాలకు తరలించే బండారం..... దర్శకుడు శేఖర్ అరెస్ట్తో బట్టబయలు కాగా ఈ కేసు విచారణలో కూడా రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసుల వలలో చిక్కిన దర్శకుడు శేఖర్... వారి వద్ద ఆవిష్కరించిన కథనం ఎంతో ఆసక్తికరంగా మారింది. తమిళనాడులోని పురాతన ఆలయాల్లోని విగ్రహాలకు ఆస్ట్రేలియా తదితర విదేశాల్లో ఉన్న గిరాకీని క్యాష్ చేసుకోవాలని, కొన్ని రోజుల వ్యవధిలోనే కోటీశ్వరులుగా మారాలని నిర్ణయించుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు విగ్రహాల అక్రమ రవాణా నిరోధక పోలీసు విభాగం వారికి అడ్డంగా పట్టుబడ్డారు. నిందితుల నుండి రూ.80 కోట్ల విలువైన ఎనిమిది విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ అయిన విగ్రహాలను విదేశాలకు చేరవేసేందుకు జయకుమార్ అనే వ్యక్తి బ్రోకర్గా వ్యవహరిస్తుంటాడు. సుమా రు రూ.1000 కోట్ల విగ్రహాలను చోరీ చేయాలని జయకుమార్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. జయకుమార్కు సహాయకులుగా కరుణాకరన్, మారీ, మాలతి, ఎస్ఐ రాజేంద్రన్ అనే పిలువబడే వ్యక్తి వ్యవహరించేవారు. వీరంతా కలిసి పు రాతన ఆలయాల్లో విగ్రహాలను ఎలా దొంగలించాలి, ఎలా భద్రం చేయాలి, పోలీసుల కళ్లుకప్పి విదేశాలకు ఎలా తరలించాలనే అంశాలపై ఈ ఏడాది జనవరిలో చర్చించుకున్నారు. అదే సమయంలో మాలతి ఇంటిలోని ఒక క్యాలెండర్లో శ్రీపెరంబూదూర్ సమీపంలోని రామానుజపురం మణికంఠేశ్వర్ ఆలయంలోని శివపార్వతుల విగ్రహాలు వారిని ఆకర్షించాయి. ముందు ఈ విగ్రహాలను చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ పథకంలో భాగంగా దొంగలముఠాకు చెందిన వ్యక్తులు భక్తుల్లా గుడిలోకి వెళ్లి పూజారికి తెలియకుండా సెల్ఫోన్లో విగ్రహాలను ఫోటో తీసారు. ఆ తరువాత ఇంటికి చేరుకుని క్యాలెండర్లో ఉన్న బొమ్మలతో సరిపోల్చుకుని సంతృప్తి చెందారు. ఆ తరువాత విగ్రహాల చోరీపై జయకుమార్ పథక రచన చేశాడు. ఆలయంలో సీసీ కెమెరాలు లేవని ముందుగా నిర్ధారించుకున్నారు. కొందరు ఆలయం వెలుపల కాపలా కాయగా, మరి కొందరు లోనికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. అందరూ కలిసి విగ్రహాలతో చెన్నైకి బయలుదేరారు. మార్గమధ్యంలో వాహనాల తనిఖీ జరుగుతుండగా దొంగల గుంపులోని మాలతి తాను విలేకరినని పరిచయం చేసుకుని గుర్తింపు కార్డును కూడా చూపింది. ఎస్ఐ రాజేంద్రన్గా చలామణి అవుతున్న వ్యక్తి పోలీస్ యూనిఫాంలో విగ్రహాల కారు వెనుకనే అనుసరించి, ఆ కారులో ఏమీ లేదు, తాను తనిఖీ చేశానని చెప్పడంతో పోలీసులు వదిలేశారు. దీంతో విగ్రహాలతో క్షేమంగా చెన్నైకి చేరుకుని జయకుమార్ ఇంటిలో భద్రం చేశారు. అలాగే తిరువణ్నామలై జిల్లా వందవాసిలో పైయూర్ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారు, శ్రీదేవీ విగ్రహాలు ఎత్తుకెళ్లారు. ఇలా రూ.80 కోట్ల విలువైన మొత్తం 8 విగ్రహాలను విదేశాలకు ఎగుమతికి సిద్ధం చేశారు. అన్ని విగ్రహాలను జయకుమార్ ఇంటిలో జాగ్రత్త చేశారు. విగ్రహాల అమ్మకాల ప్రయత్నంలో సరైన ధర పలకక పోవడంతో జాప్యం చోటుచేసుకుంది. ఎక్కువరోజులు ఒకేచోట ఉంచడం మంచిది కాదని జయకుమార్ ఇంటి నుండి దర్శకుడు వీ శేఖర్ ఇంటికి చేర్చారు. విగ్రహాలు తన ఇంటికి వచ్చినప్పటి నుండి ఆర్థిక నష్టాలు వస్తున్నాయని, వేరే చోటికి తరలించాల్సిందిగా జయకుమార్కు శేఖర్ సూచించాడు. ఇలా అనేక చోట్ల మారుస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో నిందితురాలు మాలతి అప్రూవర్గా మారడంతో ఆమె ఇచ్చిన సమాచారంతో ఇతర నిందితుల కోసం తమిళనాడు పోలీసుల బృందం ఆంధ్రప్రదేశ్కు వెళ్లింది. -
విగ్రహాల దొంగల ముఠా అరెస్ట్
తిరుచిరాపల్లి: దేవాలయాలల్లో విగ్రహాలను దొంగలిస్తున్న ముఠాను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురి నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 10 కాంస్య విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. విగ్రహాల స్మగ్లింగ్ నిరోధక వింగ్ ఐజీ పొన్ మాణిక్వేల్ సూచనల మేరకు పోలీసులు వర్తకులు, నిందితులపై నిఘా వేసి ఈ ముఠాను పట్టుకున్నారు. గత మేలో వీటిని దొంగలించినట్టు పోలీసులు తెలిపారు. ఓ మహిళా డాక్టర్ హత్య కేసును ప్రత్యేక బృందం విచారిస్తున్న సమయంలో విగ్రహాల దొంగల ముఠా ఆచూకీ లభ్యమైంది. -
400 ఏళ్ల అమ్మవారి బంగారు విగ్రహం చోరీ
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీ గౌలిపురాలోని మైసమ్మ ఆలయంలో చోరీ జరిగింది. 400ఏళ్ల నాటి అమ్మవారి బంగారు విగ్రహాన్ని దుండగులు అపహరించుకు వెళ్లారు. చోరీ విషయాన్ని గమనించిన ఆలయ నిర్వహకులు శుక్రవారం మొఘల్పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తులపై ఆరా తీస్తున్నారు. -
ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం పూర్తి