Industrial production
-
నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: మైనింగ్, తయారీ రంగాల పేలవ పనితీరుతో డిసెంబర్లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి మందగించింది. ఐఐపీ (పారిశ్రామికోత్పత్తి సూచీ) 3 నెలల కనిష్ట స్థాయిలో 3.2 శాతానికి పరిమితమైంది. 2023 డిసెంబర్లో ఇది 4.4 శాతంగా నమోదైంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. ఈ సందర్భంగా గతేడాది నవంబర్ గణాంకాలను 5.2 శాతం నుంచి 5 శాతానికి సవరించింది. అటు ఐఐపీ వృద్ధి సెప్టెంబర్లో 3.2 శాతంగా, అక్టోబర్లో 3.7 శాతంగా నమోదైంది.డిసెంబర్లో తయారీ రంగ ఉత్పత్తి 4.6 శాతం నుంచి 3 శాతానికి నెమ్మదించింది. అలాగే మైనింగ్ ఉత్పత్తి సైతం 5.2 శాతం నుంచి 2.6 శాతానికి పడిపోయింది.విద్యుదుత్పత్తి 1.2 శాతం నుంచి 6.2 శాతానికి, కన్జూమర్ డ్యూరబుల్స్ 5.2 శాతం నుంచి 8.3 శాతానికి పెరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్/నిర్మాణ రంగ ఉత్పత్తుల తయారీ 5.5 శాతం నుంచి 6.3 శాతానికి వృద్ధి చెందింది. ఇదీ చదవండి: ఓఎన్జీపీఎల్ చేతికి అయానా రెన్యూవబుల్ఐఐటీ–మద్రాస్తో ఎస్ఈఐఎల్ ఒప్పందంహైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో అతిపెద్ద స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులలో ఒకటైన ఎస్ఈఐఎల్ ఎనర్జీ తాజాగా ఐఐటీ మద్రాస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కార్బన్ క్యాప్చర్ (బొగ్గు పులుసు వాయువును సంగ్రహించే) సాంకేతికతను అభివృద్ధి చేస్తారు. కార్బన్ క్యాప్చర్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే పేటెంట్ కలిగిన కీమోజెల్ అనే నానోపారి్టకల్ ఆధారిత ద్రావకాన్ని ఐఐటీ మద్రాస్ ఇప్పటికే సృష్టించింది. ఇప్పుడు క్షేత్ర స్ధాయిలో ఈ ద్రావకం పనితీరును పరీక్షించేందుకు ఒక పైలట్ ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టారు. ఈ విప్లవాత్మక పరిశోధనకు మద్దతుగా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.71 లక్షల నిధులు సమకూరుస్తున్నట్టు ఎస్ఈఐఎల్ సీఈవో రాఘవ్ త్రివేది తెలిపారు. -
నవంబర్లో ‘మౌలికం’ నెమ్మది
న్యూఢిల్లీ: ఎనిమిది ప్రధాన మౌలిక రంగాల గ్రూప్ ఉత్పత్తి వృద్ధి రేటు నవంబర్లో 4.3 శాతంగా నమోదయ్యింది. గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 7.9 శాతం వృద్ధితో పోలిస్తే ఈ రేటు తగ్గుదల నమోదుకావడం గమనార్హం. అయితే 2024 అక్టోబర్ 3.7 శాతం వృద్ధితో పోలిస్తే ఇది మెరుగైన ఫలితం. సిమెంట్ మినహా (13 శాతం వృద్ధి), బొగ్గు (7.5 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (2.9 శాతం), ఎరువులు (2.0 శాతం), ఉక్కు (4.8 శాతం), విద్యుత్ (3.8 శాతం) రంగాలు 2023 నవంబర్తో పోల్చితే వృద్ధి రేట్లు తగ్గాయి. చమురు, సహజవాయువు రంగాల్లో వృద్ధి లేకపోగా క్షీణరేట్లు నమోదయ్యాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య.. ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో (2024 ఏప్రిల్–నవంబర్) మౌలిక రంగం గ్రూప్ వృద్ది రేటు 4.2 శాతంగా నమోదయ్యింది. 2023 ఇదే కాలంతో పోల్చితే (8.7 శాతం) వృద్ధి రేటు సగానికిపైగా పడిపోవడం గమనార్హం. మొత్తం పారిశ్రామిక ఉత్పతిసూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది రంగాల వాటా 40.27 శాతం కావడం గమనార్హం. -
పరిశ్రమ పరుగులు
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్లో 3.1 శాతం వృద్ధిని (2023 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఆగస్టు సూచీలో వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. తయారీ, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు సూచీని సమీక్షా నెల్లో వృద్ధి బాటన నిలబెట్టాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం... మైనింగ్ రంగం 0.2 శాతం పురోగమించింది. మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం 3.9 శాతం వృద్ధిని సాధించింది.విద్యుత్ ఉత్పత్తి 0.5 శాతం ఎగసింది. ఆగస్టులో మైనింగ్ రంగం ఉత్పత్తి 4.3 శాతం, విద్యుత్ ఉత్పత్తి 3.7 శాతం క్షీణించగా, తయారీ రంగం కేవలం 1.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. కాగా తాజా సమీక్షా నెల్లో భారీ యంత్ర పరికరాల డిమాండ్కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 2.8 శాతంగా ఉంది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్లో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదయ్యింది. ఆరు నెలల్లో 4 శాతం వృద్ధి ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఐఐపీ 4 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 6.2 శాతం. -
పరిశ్రమలు రివర్స్గేర్!
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు రెండేళ్ల విరామం తర్వాత ఆగస్టు నెలలో ప్రతికూలానికి పడిపోయింది. మైనస్ 0.1 శాతంగా నమోదైంది. పరిశ్రమల ఉత్పత్తిని ప్రతిబింబించే పారిశ్రామిక ఉత్పాదక సూచీ (ఐఐపీ) వృద్ధి జూలై నెలకు 4.7 శాతంగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది ఆగస్టు నెలలోనూ ఐఐపీ 10.9 వృద్ధిని నమోదు చేసింది. ప్రధానంగా మైనింగ్, విద్యుదుత్పత్తి రంగంలో క్షీణత ఐఐపీ పడిపోవడంలో కీలకంగా పనిచేసింది. అదే సమయంలో తయారీ రంగంలోనూ ఉత్పాదకత పుంజుకోలేదు. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ఈ వివరాలను విడుదల చేసింది. ఇక ప్రస్తుత ఆరి్థక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు (ఐదు నెలల్లో) ఐఐపీ వృద్ధి 4.2 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలానికి నమోదైన 6.2 శాతం కంటే తక్కువ. వృద్ధి రేటు మైనింగ్ రంగంలో మైనస్ 4.3 శాతానికి పడిపోయింది. విద్యుదుత్పత్తి రంగంలో మైనస్ 3.7 శాతంగా నమోదైంది. తయారీలో 0.1 శాతంగా ఉంది. ఆగస్ట్ నెలలో అధిక వర్షాలు మైనింగ్ రంగంలో వృద్ధి క్షీణతకు కారణమని ఎన్ఎస్వో తెలిపింది. చివరిగా 2022 అక్టోబర్ నెలలో ఐఐపీ వృద్ధి ప్రతికూలంగా నమోదు కావడం గమనార్హం. -
ద్రవ్యోల్బణం దారికి...పరిశ్రమ పక్కకు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి మంగళవారం మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ కీలక రెపో రేటు (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 5.09 శాతంగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న వాస్తవిక లక్ష్యానికి (ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతం) ఇంకా అధికంగా ఉన్నప్పటికీ.. నాలుగు నెలల కనిష్టానికి సూచీ దిగిరావడం గమనార్హం. అలాగే గరిష్ట లక్ష్యానికన్నా (6 శాతం) దిగువన ఉండడం హర్షణీయ పరిణామం. కాగా, జనవరిలో 8.3 శాతంగా ఉన్న ఫుడ్ బాస్కెట్ ధర, సమీక్షా నెల ఫిబ్రవరిలో 8.66 శాతానికి ఎగసింది. ఇక పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సూచీ (ఐఐపీ) వృద్ధి 2024 జనవరిలో 3.8 శాతానికి మందగించింది. 2023 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 5.8 శాతంగా ఉంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70 శాతం వెయిటేజ్ ఉన్న తయారీసహా మైనింగ్, విద్యుత్ రంగాలు పేలవ పనితనాన్ని ప్రదర్శించినట్లు గణాంకాలు ,కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కలు తెలిపాయి. 2023 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి రేటు 4.2 శాతంకాగా, నవంబర్లో 2.4 శాతం. -
మందగించిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: తయారీ రంగ పేలవ పనితీరు కారణంగా దేశీయంగా 2023 నవంబర్లో పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) వృద్ధి మందగించింది. 8 నెలల కనిష్ట స్థాయి 2.4 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇదే తక్కువ స్థాయి వృద్ధి. చివరిసారిగా 2023 మార్చిలో అత్యంత తక్కువగా 1.9% స్థాయిలో ఐఐపీ వృద్ధి నమోదైంది. గతేడాది నవంబర్లో ఇది 7.6%. 2023–24 ఏప్రిల్–నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి 6.4%. అంతక్రితం ఆర్థిక సంవత్సరం అదే వ్యవధిలో వృద్ధి 5.6%. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తయారీ రంగం వృద్ధి 1.2 శాతానికి పరిమితమైంది. అంతక్రితం నవంబర్లో ఇది 6.7%గా ఉంది. విద్యుదుత్పత్తి వృద్ధి కూడా 12.7% నుంచి 5.8 శాతానికి నెమ్మదించింది. మైనింగ్ రంగ ఉత్పత్తి వృద్ధి 9.7% నుంచి 6.8 శాతానికి తగ్గింది. కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి 5.4% మేర క్షీణించింది. అంతక్రితం నవంబర్లో 5% వృద్ధి నమోదైంది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి 3.6 శాతం క్షీణించింది. గత నవంబర్లో 10% వృద్ధి నమోదైంది. మౌలిక సదుపాయాలు/నిర్మాణ రంగ ఉత్పత్తుల విభాగం స్వల్పంగా 1.5% వృద్ధి చెందింది. -
నవంబర్లో ‘మౌలికం’ పురోగతి 7.8 %
న్యూఢిల్లీ: ఎనిమిది పరిశ్రమల మౌలిక రంగం గ్రూప్ నవంబర్లో 7.8 శాతం పురోగతి సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం క్రూడ్ ఆయిల్, సిమెంట్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు మంచి పనితీరును కనబరిచాయి. బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాలూ ఈ గ్రూప్లో భాగంగా ఉన్నాయి. ఇక 2023–24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది రంగాల పురోగతి 8.6 శాతం. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 8.1%. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ గ్రూప్ వాటా దాదాపు 42 శాతం. -
నెమ్మదించిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి నెలవారీగా చూస్తే సెపె్టంబర్లో మందగించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 5.8 శాతానికి పరిమితమైంది. ఆగస్టులో ఇది 10.3 శాతంగా ఉంది. గతేడాది సెపె్టంబర్లో ఐఐపీ 3.3 శాతంగా నమోదైంది. తాజాగా తయారీ, మైనింగ్ రంగాలు మెరుగుపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే సమీక్షాకాలంలో ఐఐపీ 6 శాతానికి పరిమితమైంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) విడుదల చేసిన ఐఐపీ గణాంకాల ప్రకారం.. ► తయారీ రంగ వృద్ధి 4.5 శాతంగా (గత సెప్టెంబర్లో రెండు శాతం) నమోదైంది. ► విద్యుదుత్పత్తి వృద్ధి గత సెపె్టంబర్లో 11.6 %గా ఉండగా ఈసారి 9.9%కి పరిమితమైంది. ► మైనింగ్ ఉత్పత్తి గతేడాది సెపె్టంబర్లో మైనస్ 5.2 శాతంగా ఉండగా ఈ ఏడాది సెపె్టంబర్లో 11.5 శాతం పెరిగింది. ► క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్ వృద్ధి 7.4 శాతంగా (గత సెపె్టంబర్లో 11.4 శాతం) నమోదైంది. కన్జూమర్ డ్యూరబుల్స్ వృద్ధి గత సెపె్టంబర్లో మైనస్ 5.5 శాతంగా ఉండగా ఈసారి ఒక్క శాతం మేర నమోదైంది. కన్జూమర్ నాన్–డ్యూరబుల్ గూడ్స్ ఉత్పత్తి మైనస్ 5.7 శాతం నుంచి 2.7 శాతానికి చేరింది. ► మౌలిక/నిర్మాణ రంగ ఉత్పత్తుల వృద్ధి 7.5% గా ఉంది. గత సెపె్టంబర్లో ఇది 8.2 శాతం. -
ఎకానమీ శుభ సంకేతాలు!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీకి సంబంధించి వెలువడిన తాజా గణాంకాలు ఆశాజనక పరిస్థితిని సృష్టించాయి. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధికి సంబంధించి సూచీ– ఐఐపీ 2022 నవంబర్లో (2021 నవంబర్తో పోల్చి) ఐదు నెలల గరిష్ట స్థాయి 7.1 శాతంగా నమోదయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక పాలసీ రేటు నిర్ణయానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి పడిపోయింది. ఈ సూచీ వరుసగా రెండవనెల ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువన 5.72 శాతంగా నమోదయ్యింది. 2022 అక్టోబర్లో ఐఐపీలో అసలు వృద్ధి లేకపోగా 4.2 శాతం క్షీణించింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గురువారం ఈ గణాంకాల ముఖ్యాంశాలు... కీలక రంగాల పురోగతి ► తయారీ: సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న ఈ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు నవంబర్లో 6.1 శాతంగా నమోదయ్యింది. ► మైనింగ్: ఈ రంగంలో 9.7 శాతం పురోగతి ఉంది. ► విద్యుత్: విద్యుత్ ఉత్పత్తి వృద్ధి భారీగా 12.7 శాతం నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉ త్పత్తి, డిమాండ్ను సూచించే ఈ విభాగం ఏకంగా 20.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► డ్యూరబుల్స్: ఏసీలు, రిఫ్రిజిరేటర్ల ఉత్పత్తికి సంబంధించి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 5.1 శాతం వృద్ధి నమోదుకాగా, సబ్సులు, పెర్ఫ్యూమ్స్ వంటి ఎఫ్ఎంసీజీ విభాగానికి సంబంధించిన కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 8.9 శాతంగా ఉంది. ► ఇన్ఫ్రా, నిర్మాణం: వృద్ధి 12.8 శాతంగా నమోదయ్యింది. ► తొమ్మిది నెలల్లో..: ఇక ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి రేటు 5.5 శాతంగా ఉంది. తగ్గిన ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ డిసెంబర్లో ఫుడ్ బాస్కెట్ తగ్గడం మొత్త రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన ఉండాల్సి ఉండగా, 2022 అక్టోబర్ వరకూ వరుసగా 10 నెలలు ఆ పైన కొనసాగింది. నవంబర్లో 5.88 శాతంగా నమోదుకాగా, మరుసటి నెల డిసెంబర్లో మరింత తగ్గి 5.72 శాతానికి (2021 డిసెంబర్తో పోల్చి) చేరడం ఎకానమీకి ఊరటనిచ్చే అంశం. ఎన్ఎస్ఓ గణాంకాల ప్రకారం, ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ నవంబర్లో 4.67 శాతం ఉండగా, డిసెంబర్లో మరింత తగ్గి 4.19 శాతానికి చేరింది. కూరగాయల ధరల స్పీడ్ వార్షికంగా 15 శాతానికి పైగా పడిపోయింది. పండ్ల ధరల స్పీడ్ 2 శాతంగా ఉంది. అయితే సుగంధ ద్రవ్యాల ధరలు మాత్రం 20 శాతం పెరిగాయి. తృణ ధాన్యాల ధరలు 14 శాతం ఎగశాయి. ఫ్యూయల్ అండ్ లైట్ విభాగంలో ధరల పెరుగుదల రేటు 11 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా 2022 మే తర్వాత ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోన 2.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 6.25 శాతానికి చేరింది. కొన్ని కమోడిటీల ఎగుమతుల నిషేధంసహా ధరల కట్టడికి కేంద్రం కూడా పలు చర్యలు తీసుకుంటోంది. -
నష్టాల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు
బ్యాంకాక్: ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ విక్రయ గణాంకాలు నిరాశపరచడంతో సోమవారం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. చైనా ఎక్సే్చంజీ షాంఘై సూచీ ఒక పాయింటు స్వల్ప నష్టపోయి 3,276 వద్ద ఫ్లాటుగా ముగిసింది. సింగపూర్, ఇండోనేషియా మార్కెట్లు సైతం 0.50–0.20% మధ్య నష్టపోయాయి. తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్ అతి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. కాగా జపాన్ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ నికాయ్ ఒకశాతం లాభపడి ఏడు నెలల గరిష్టం 28,871 స్థాయి వద్ద స్థిరపడింది. కోవిడ్ ఆంక్షల సడలింపుతో రెండో క్వార్టర్ నుంచి తమ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అక్కడి అధికార వర్గాల ప్రకటన మార్కెట్ ర్యాలీకి కారణమైంది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నట్లు సంకేతాలు రావడంతో యూరప్ మార్కెట్లు సైతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫ్రాన్స్, జర్మన్ దేశాల స్టాక్ సూచీలు 0.14–0.16 % మధ్య నష్టపోయాయి. బ్రిటన్ ఇండెక్స్ ఎఫ్టీయస్సీ పావుశాతం పతమైంది. ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లు ఈ వారం నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. క్రూడాయిల్ ధరల పతనం, ఆర్థిక మాంద్య భయాలతో పాటు నాలుగు వారాల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. -
పరిశ్రమలు.. పరుగు..పారిశ్రామిక ఉత్పత్తిలో కొత్త జోష్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి విషయంలో మే నెలకు సంబంధించి సూచీ ఎకానమీకి ఊరటనిచ్చింది. 2022లో 19.6 శాతం పురోగతిని (2021 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. తయారీ, విద్యుత్, మైనింగ్ రంగాలు మే పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి పురోగతికి ఊతం ఇచ్చినట్లు మంగళవారం వెలువడిన ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం వివిధ రంగాల పనితీరును పరిశీలిస్తే... ♦ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగం భారీగా 20.6 శాతం పురోగతి సాధించింది. ♦ విద్యుత్ రంగం ఉత్పత్తి 23.5 శాతం పెరిగింది. ♦ మైనింగ్ రంగంలో పురోగతి 10.9 శాతం, ♦ పెట్టుబడులకు, భారీ యంత్రసామగ్రి డిమాండ్కు ప్రాతిపదిక అయిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు ఏకంగా 54%గా నమోదైంది. ♦ రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మెషీన్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 58.5 శాతం వృద్ధి నమోదయ్యింది. ♦ మరోవైపు 2022 ఏప్రిల్ ఐఐపీ తొలి అంచనాను 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించినట్లు అధికారిక ప్రకటన పేర్కొంది. తొలి రెండు నెలల్లో ఇలా..: 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి 2 నెలలు.. ఏప్రిల్, మేలో ఐఐపీ వృద్ధి రేటు 12.9%గా నమోదైంది. రూపాయి : 79.59 ముంబై: సెంట్రల్ బ్యాంక్ పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆయా విధాన నిర్ణయాలు డాలర్ మారకంలో రూపాయి పతనాన్ని నిలువరించలేకపోతున్నాయి. మంగళవారం రూపాయి డాలర్ మారకంలో మరో కొత్త చరిత్రాత్మక కనిష్ట స్థాయిని చూసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 14పైసలు పతనమై, 79.59కి రూపాయి బలహీనపడింది. ఇంట్రాడేలో ఒక దశలో 79.66కు కూడా పడిపోయింది. -
పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్లో రయ్!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో చక్కటి పనితనాన్ని ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 7.1 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఏప్రిల్ నెలతో పోల్చితే తాజా సమీక్షా నెల్లో ఉత్పత్తి 7.1 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఎనిమిది నెలల్లో (2021 ఆగస్టులో 13 శాతం పెరుగుదల తర్వాత) ఈ స్థాయి వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. విద్యుత్, మైనింగ్ రంగాలు మంచి ఫలితాలను అందించినట్లు శుక్రవారం జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన లెక్కలు వెల్లడించాయి. కొన్ని ముఖ్య విభాగాలను పరిశీలిస్తే... ► తయారీ: ఐఐపీలో దాదాపు 70 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో 6.3 శాతం పురోగతి నమోదయ్యింది. ► విద్యుత్: ఈ రంగం 11.8 % వృద్ధి సాధించింది. ► మైనింగ్: మైనింగ్లో 7.8% వృద్ధి నమోదయ్యింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ పెట్టుబడులు, డిమాండ్కు ప్రతిబింబమైన ఈ విభాగంలో భారీగా 14.7% వృద్ధి నమోదుకావడం హర్షణీయం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేట్లర్ల వంటి దీర్ఘకాల వినియోగ వస్తువులకు సంబంధించిన ఈ విభాగంలో వృద్ధి 8.5 శాతంగా ఉంది. ► నాన్–కన్జూమర్ గూడ్స్: ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ)కి సంబంధించిన నాన్–కన్జూమర్ గూడ్స్ విభాగంలో స్వల్పంగా 0.3 శాతం వృద్ధి నమోదయ్యింది. ► ప్రైమరీ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (నిర్మాణ) గూడ్స్ ఉత్పత్తి వృద్ధి రేట్లు వరుసగా 10.1 శాతం, 7.6 శాతం, 3.8 శాతాలుగా ఉన్నాయి. -
ఆరు నెలల తర్వాత వృద్ధిబాటకు పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆరు నెలల క్షీణత తర్వాత తిరిగి వృద్ధిబాటకు మళ్లింది. 2020 సెప్టెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 0.2 శాతం స్వల్ప స్థాయి వృద్ధిని చూసింది (2019 సెపెంబర్ గణాంకాలతో పోల్చి). మైనింగ్, విద్యుత్ రంగాల్లో అధికోత్పత్తి దీనికి కారణమని గురువారం కేంద్రం వెలువరించిన గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... తయారీ: మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 77.63 శాతం వాటా కలిగిన ఈ విభాగం ఇంకా క్షీణతలోనే ఉంది. సెప్టెంబర్లో 0.6 శాతం క్షీణత నమోదయ్యింది. మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి 1.4 శాతంగా ఉంది. విద్యుత్: 4.9 శాతం వృద్ధిరేటు వచ్చింది. క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికాల ఉత్పత్తి, డిమాండ్కు సంకేతమైన క్యాపిటల్ గూడ్స్లో ఉత్పత్తి సెప్టెంబర్లో 3.3 శాతం క్షీణతలో ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీ షనర్లు వంటి దీర్ఘకాల కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 2.8% వృద్ధి నమోదవడం కీలకాంశం. ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక సానుకూల అంశం. కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, టూత్పేస్టులు వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ డ్యూరబుల్స్ (ఎఫ్ఎంసీజీ) విషయంలో ఉత్పత్తి భారీగా 4.1 శాతంగా నమోదయ్యింది. ఆరు నెలల్లో క్షీణతే... కాగా, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఐఐపీ భారీగా 21.1 శాతం క్షీణతలోనే ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 1.3 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. తక్కువ బేస్రేటే కారణమా? పారిశ్రామిక ఉత్పత్తిలో తాజాగా వృద్ధి రేటు కనబడ్డానికి తక్కువ బేస్రేటే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. 2019 సెప్టెంబర్లో ఐఐపీ భారీ క్షీణతలో మైనస్ 4.6 శాతంగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 5.2 శాతంగా నమోదయ్యింది. అటు తర్వాత మార్చి (–18.7 శాతం), ఏప్రిల్ (–57.3 శాతం), మే (–33.4 శాతం), జూన్ (–16.6 శాతం), జూలై (–10.8 శాతం) ఆగస్టులో (–8 శాతం) క్షీణ రేటు నమోదయ్యింది. అయితే కఠిన లాక్డౌన్ నెల ఏప్రిల్లో భారీ క్షీణత తర్వాత మైనస్రేట్లు క్రమంగా తగ్గుతుండడం పరిగణనలోకి తీసుకోవాల్సిన సానుకూల అంశం. 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) లాక్డౌన్ జరిగింది. లాక్డౌన్ నిబంధనల సడలింపుల వల్ల వివిధ రంగాల్లో క్రమంగా ఆర్థిక కార్యకలాపాలు పునరుత్తేజం అవుతున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. -
పట్టాలెక్కని ‘పరిశ్రమ’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మూలంగా రాష్ట్రం లో పారిశ్రామిక వృద్ధిరేటు గణనీయంగా తగ్గిపోయినట్లు రాష్ట్ర అర్థ గణాంక విభాగం నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా మాన్యుఫాక్చరింగ్, మైనింగ్, క్వారీ విభాగాల్లో ఉత్పత్తి తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో సిబ్బంది, కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడవుతోంది. వ్యవసాయ, సేవా రంగాల తర్వాత పారిశ్రామిక రంగం ఎక్కువ మందికి (సుమారు 18 శా తం) ఉపాధి కల్పిస్తుండగా, కోవిడ్ మూలం గా పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50– 60 శాతమే ఉత్పత్తి రాష్ట్రంలోని పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే కేవలం 50 నుంచి 60 శాతం మేర మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని పారిశ్రామిక వర్గాలు చెప్తున్నాయి. ఫార్మా, లైఫ్ సైన్సెస్తో పాటు ఆటోమొబైల్, మైన్స్, మినరల్స్, టెక్స్టైల్స్, స్టీలు, సిమెంట్ తదితర పరిశ్రమలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి. కోవిడ్ పరిస్థితుల్లో ఫార్మా, బల్క్ డ్రగ్ మినహా ఇతర కేటగిరీలకు చెందిన పరిశ్రమలు అన్నీ తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అన్లాక్ ప్రక్రియ తొలి విడతలోనే పరిశ్రమలకు నిబంధనలు సడలింపు ఇచ్చినా వివిధ కారణాలతో పారిశ్రామిక ఉత్పత్తి పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కడం లేదు. ముడిసరుకుల కొరత, రవాణా, మార్కెటింగ్ సమస్యలతో పాటు కొన్ని కేటగిరీలకు చెందిన పరిశ్రమల్లో కార్మికుల కొరత వల్ల పరిశ్రమలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయడం లేదు. సిబ్బంది, కార్మికుల ఉపాధికి దెబ్బ లాక్డౌన్ మూలంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లో అరకొర వేతనాలు చెల్లించిన పరిశ్రమల యాజమాన్యాలు ఆ తర్వాత ఉత్పత్తి తగ్గడాన్ని కారణంగా చూపిస్తూ సిబ్బంది, కార్మికుల సంఖ్యను తగ్గించాయి. ప్రతి ఏటా ఏప్రిల్లో కాంట్రాక్టు కార్మికులను రెన్యువల్ చేస్తూ వచ్చిన పరిశ్రమలు కోవిడ్ మూలంగా రెన్యువల్ ఊసెత్తకపోవడంతో పలువురు ఉపాధి కోల్పోయారు. వీరిలో అవసరమైన వారిని మాత్రమే తాత్కాలికంగా విధుల్లోకి తీసుకుంటుండగా, మరికొందరి వేతనాల్లో భారీగా కోత విధించారు. రూ.15వేల కంటే తక్కువ వేతనం ఉన్న వారిని మినహాయించి, ఇతర కేటగిరీలకు చెందిన కార్మికులు, సిబ్బంది వేతనాల్లో పరిశ్రమలు కోత విధిస్తున్నాయి. వేతన ఒప్పందాల్లో ‘డిఫర్మెంట్’ మూడేళ్లకు ఒకసారి వేతన ఒప్పందం జరగా ల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మరో రెండేళ్లపాటు నూతన ఒప్పందాలు వాయిదా వేస్తామని యాజమాన్యాలు సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికే అమల్లో ఉన్న ఒప్పందాల్లోనూ డిఫర్మెంట్ను కోరుతూ కార్మిక సంఘాలు, సిబ్బందికి యాజమాన్యా లు లేఖలు రాస్తున్నాయి. ఒప్పందం మేరకు సిబ్బందిని పర్మినెంట్ చేయాల్సి ఉండగా వేచి చూడాలని చెప్తున్నాయి. తిరిగి వస్తున్న వలసకార్మికులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, చత్తీస్గఢ్ రాష్ట్రాల కార్మికులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. లాక్డౌన్ పరిస్థితుల్లో సుమారు లక్షన్నర మందిని రాష్ట్ర ప్రభుత్వం స్వస్థలాలకు తరలించింది. ప్రస్తుతం పరిస్థితులు కొంత మేర కుదుటపడటంతో వీరు తిరిగి గతంలో తాము పనిచేసిన ప్రదేశాలకు చేరకుంటున్నారు. లోహ, ఫ్యాబ్రికేషన్, వాటి అనుబంధ పరిశ్రమల్లో వలస కార్మికులను రప్పించేందుకు యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో ఆరు నెలల్లో సాధారణ పరిస్థితి పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారం భించేందుకు మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. వలస కార్మికులు తిరిగి ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఇటీవలి వర్షాలతో పారిశ్రామిక ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోనస్ డిఫర్మెంట్ కోసం యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. పరిశ్రమలు మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటేనే కార్మికులు, సిబ్బందికి పూర్తిస్థాయిలో వేతనాలు, బోనస్ ఇవ్వడం సాధ్యమవుతుంది. – కె. సుధీర్రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అసంఘటిత కార్మికులకు భద్రతలేదు అసంఘటిత కార్మికుల ఉపాధి, ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిం ది. ఉత్పత్తి తగ్గడా న్ని కారణంగా చూపుతూ వేతన ఒప్పందాలు మొదలుకుని, అన్ని రకాలైన డిఫర్మెంట్లకు యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. ఉద్యోగులను తొలగించొద్దని ప్రభుత్వం చెప్తున్నా పరిస్థితి భిన్నంగా ఉంది. –బి.మల్లేశం, అధ్యక్షులు, సీఐటీయూ, సంగారెడ్డి జిల్లా -
6వ నెలా... మైనస్లోనే మౌలిక రంగం
న్యూఢిల్లీ: మౌలిక రంగంలో కీలక ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వరుసగా ఆరవనెల కూడా క్షీణతలోనే కొనసాగింది. ఆగస్టులో మైనస్ 8.5 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది. అంటే 2019 ఆగస్టులో జరిగిన ఉత్పత్తితో పోల్చిచూస్తే, 2020 ఆగస్టులో ఈ రంగాల ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 8.5 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 40.27 శాతం వెయిటేజ్ ఉన్న ఎనిమిది రంగాల పనితీరును వేర్వేరుగా పరిశీలిస్తే.... ► బొగ్గు (3.6 శాతం), ఎరువులు (7.3 శాతం) వృద్ధి బాటన నిలిచాయి. ► క్రూడ్ ఆయిల్ (–6.3%), సహజ వాయువులు (–9.5 %), రిఫైనరీ ప్రొడక్టులు (19.1%), స్టీల్ (–6.3 %), సిమెంట్ (–14.6 శాతం) విద్యుత్ (–2.7 శాతం) క్షీణతలో ఉన్నాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ...: కాగా ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో చూస్తే, ఈ గ్రూప్ ఉత్పత్తి 17.8 శాతం క్షీణతలోనే ఉంది. గత ఏడాది ఇదే కాలంలో కనీసం 2.5 శాతం వృద్ధి నమోదయ్యింది. అప్పట్లో అంత తక్కువ వృద్ధి తీరుకు ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం ప్రధాన కారణం. 2019 ఆగస్టులో ఎనిమిది పరిశ్రమల గ్రూప్ 0.2 శాతం క్షీణతలో ఉండడం గమనార్హం. -
పరిశ్రమలు మైనస్లోనే..
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జూలైలోనూ క్షీణతలోనే కొనసాగింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ప్రకారం జూలైలో మైనస్ 10.4 క్షీణత నమోదయ్యింది. అంటే 2019 జూలైతో పోల్చితే వృద్ధిలేకపోగా, భారీ క్షీణత నమోదయ్యిందన్నమాట. అయితే జూన్తో పోల్చితే ( మైనస్ 15.77 శాతం క్షీణత) జూన్ నెలలో క్షీణ రేటు తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. కీలక విభాగాలూ నేలచూపే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన తయారీ రంగం మైనస్ 11.1 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. మైనింగ్: భారీగా 13 శాతం క్షీణతను చవిచూసింది. విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి మైనస్ 2.5 శాతం పడిపోయింది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల ఉత్పత్తి, పెట్టుబడులకు సంబంధించిన ఈ విభాగం భారీగా మైనస్ 22.8 శాతం క్షీణించింది. ► డ్యూరబుల్స్ గూడ్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషన్ల వంటి దీర్ఘకాలం వినియోగ వస్తువులకు సంబంధించి ఈ విభాగంలో క్షీణ రేటు 23.6 శాతంగా నమోదయ్యింది. ► నాన్–డ్యూరబుల్స్ గూడ్స్: ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్కు సంబంధించి ఈ విభాగంలో మాత్రం 6.7 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం. నెలవారీగా మెరుగుపడిన ఇండెక్స్ ఉత్పత్తిలో క్షీణ రేట్లు కనబడినా, నెలవారీగా సూచీ గణాంకాలు కొంత మెరుగుపడ్డం ఊరటనిచ్చే అంశం. ఏప్రిల్లో 53.6 వద్ద ఉన్న సూచీ, మేలో 89.5కు ఎగసింది. జూన్లో మరింతగా పెరిగి 107.8కి ఎగసింది. తాజా సమీక్షా నెల– జూలైలో 118.1కి చేరింది. నాలుగు నెలల్లో... కాగా పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో చూస్తే, 29.2 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే కాలంలో 3.5 శాతం వృద్ధి నమోదయ్యింది. పోల్చిచూడ్డం సరికాదు: గణాంకాల శాఖ సాంప్రదాయకంగా గణాంకాలను వార్షికంగా పోల్చి చూసినా, కోవిడ్–19 ప్రభావిత నెలల లెక్కలను అంతక్రితం లెక్కలతో పోల్చడం అంత సబబుకాదని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పేర్కొనడం గమనార్హం. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటికీ పలు విభాగాలు సరిగా పనిచేయని పరిస్థితులు, గణాంకాలు తగిన విధంగా అందని వాతావరణం ఉందని శుక్రవారం విడుదల చేసిన గణాంకాల సందర్భంగా తెలిపింది. మౌలిక రంగం 9.6 శాతం క్షీణత ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం– మొత్తం ఐఐపీలో దాదాపు 44 శాతం వాటా ఉన్న మౌలిక పరిశ్రమల గ్రూప్ వరుసగా ఐదవ నెల– జూలైలోనూ అసలు వృద్ధిలేకపోగా 9.6 శాతం క్షీణతనే నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎరువులు (6.9 శాతం వృద్ధి రేటు) మినహా మిగిలిన ఏడు రంగాలు– స్టీల్ (–16.5 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–13.9 శాతం), సిమెంట్ (–13.5 శాతం), సహజ వాయువు (–10.2 శాతం), బొగ్గు (–5.7 శాతం), క్రూడ్ ఆయిల్ (–4.9 శాతం), విద్యుత్ (–2.3 శాతం) క్షీణరేటును నమోదుచేసుకున్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలాన్ని చూస్తే, ఎనిమిది రంగాల ఉత్పత్తి మైనస్ 20.5 శాతం క్షీణ రేటు నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలల్లో ఈ విభాగంలో వృద్ధి రేటు 3.2 శాతం. -
క్యూ4 ఫలితాలే దిక్సూచి
ముంబై: కోవిడ్–19పై యుద్ధంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఆదివారం లాక్డౌన్ 4.0ను ప్రకటించింది. మే 31 వరకూ లాక్డౌన్ను పొడిగిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ అంశాలకు తోడు అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ఈవారం మార్కెట్ గమనం ఉండనుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్థార్ధఖేమ్కా విశ్లేషించారు. మంగళవారం జపాన్ పారిశ్రామికోత్పత్తి వెల్లడికానుండగా.. గురువారం అమెరికా తయారీ, సేవల రంగాల పీఎంఐ వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ పరిణామాలు మార్కెట్ను నడిపించనున్నాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ అన్నారు. ఈవారంలోనే 80 కంపెనీల ఫలితాలు.. భారతి ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, యూపీఎల్, బాష్, అల్ట్రాటెక్ సిమెంట్, అవెన్యూ సూపర్మార్ట్స్ (డి–మార్ట్), జూబిలెంట్ ఫుడ్వర్క్స్, టాటా పవర్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, కోల్గేట్ పామోలివ్, బజాజ్ ఫిన్సర్వ్, అపోలో టైర్స్, టొరంట్ పవర్ ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఫార్మా రంగంలో డాక్టర్ రెడ్డీస్, అలెంబిక్ ఫార్మా, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, గ్లాక్సో స్మిత్క్లైన్ ఫార్మా, ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, డీసీబీ బ్యాంక్ ఫలితాలు వెల్లడికానున్నాయి. -
పరిశ్రమలు వెనక్కి.. ధరలు పైపైకి!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితుల నుంచి బయట పడలేదనడానికి స్పష్టమైన గణాంకాలు బుధవారం వెలువడ్డాయి. పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబర్లో మైనస్లోకి జారిపోతే... రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టానికి చేరింది. పారిశ్రామిక ప్రగతి శూన్యం... పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్లో కొంచెం పుంజుకుందనుకుంటే, డిసెంబర్లో మళ్లీ నీరసించిపోయింది. ఉత్పత్తి సూచీ (ఐఐపీ) –0.3 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 డిసెంబర్తో పోల్చిచూస్తే, 2019 డిసెంబర్లో అసలు వృద్ధిలేకపోగా –0.3 శాతం క్షీణతలోకి జారిందన్నమాట. తయారీ, విద్యుత్ రంగాలూ క్షీణబాటలోనే నిలిచాయి. ఐఐపీ గతేడాది వరుసగా మూడు నెలల పాటు క్షీణ బాటలోనే ఉన్నప్పటికీ (ఆగస్టులో –1.4 శాతం, సెప్టెంబర్లో – 4.6 శాతం, అక్టోబర్లో –4 శాతం) నవంబర్లో కాస్త పుంజుకుని 1.8 శాతంగా నమోదైంది. కానీ ఆ తర్వాత నెల డిసెంబర్లో మళ్లీ క్షీణించడం గమనార్హం. 2018 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి రేటు 2.5 శాతం. కీలక రంగాలను చూస్తే... ► తయారీ: 2019 డిసెంబర్లో తయారీ రంగ ఉత్పాదకత క్షీణించి మైనస్ 1.2 శాతానికి పరిమితమైంది. 2018 డిసెంబర్లో ఇది 2.9 శాతం వృద్ధిలో ఉంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ చూస్తే, 0.5 శాతం వృద్ధిలో ఉన్నా... ఇది 2018 ఇదే కాలంతో పోల్చిచూస్తే (4.7 శాతం) తక్కువకావడం గమనార్హం. ► విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి 4.5% వృద్ధి నుంచి నుంచి –0.1%కి పడింది. ► మైనింగ్: 5.4 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది డిసెంబర్లో ఇది మైనస్ 1 శాతంగా నమోదైంది.అయితే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ ఈ రేటు 3.1 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, భారీ యంత్ర సామాగ్రి కొనుగోలుకు కొలమానంగా నిల్చే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో రేటు ఏకంగా – 18.2 శాతం క్షీణించింది. 2018 డిసెంబర్లో ఇది 4.2 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఎయిర్కండీషనర్ల వంటి ఉత్పత్తికి సంబంధించిన ఈ విభాగంలో ఉత్పత్తి మైనస్ 6.7 శాతం. తొమ్మిది నెలల్లో ఇలా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి 0.5 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 4.7 శాతం. నిత్యావసర ధరల మంట ఇక వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం చూస్తే, 2020 జనవరిలో భారీగా 7.59 శాతం పెరిగింది. అంటే 2019 జనవరితో పోల్చితే నిత్యావసర వస్తువుల బాస్కెట్ రిటైల్ ధర భారీగా 7.59 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఆరేళ్లలో (2014 మేలో 8.33 శాతం) ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. కట్టుదాటి...! రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయికి దూరంగా నవంబర్ (4.62 శాతం), డిసెంబర్ (7.35 శాతం), జనవరి (7.59 శాతం)ల్లో జరుగుతూ వచ్చింది. 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని డిసెంబర్లో తాకింది. ఆర్బీఐ పాలసీ విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. 2019 ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని ఈ నెల మొదటి వారంలో జరిగిన ఏడు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి రెండుసార్లు మినహా అంతకుముందు వరుసగా ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు–రెపోను 135 బేసిస్ పాయింట్లమేర ఆర్బీఐ తగ్గిం చింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపు లో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయాలు తీసుకోగలిగిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి రెండు సమావేశాల్లో ఈ దిశలో నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఆందోళనకరం... గత నెల దాకా పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్న దాఖలాలు కనిపించినప్పటికీ డిసెంబర్లో గణాంకాలు ఆందోళన రేకెత్తించేవిగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలతో అన్ని పరిశ్రమలకు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఎకానమీకి ఇది అంత మంచిది కాదు. – రుమ్కీ మజుందార్, డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త -
దారుణంగా పడిపోయిన పారిశ్రామికోత్పత్తి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వృద్దిపై మరింత ఆందోళన రేపుతున్నాయి తాజా ఐఐపీ గణాంకాలు. ఉత్పత్తి రంగంలో నెలకొన్న సంక్షోభంతో పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబరులో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) 0.3 శాతానికి పడిపోయింది. 2018 డిసెంబర్లో ఇది 2.5 శాతం. ప్రధానంగా చైనాలో వ్యాపించిన కోవిడ్-2019 (కరోనా వైరస్) బాగా ప్రభావం చూసినట్టు ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రభుత్వం ఐఐపీ గణాంకాలను బుధవారం విడదుల చేసింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) గణాంకాల ప్రకారం, ఏడాది క్రితం ఇదే నెలలో 2.9 శాతం వృద్ధితో పోలిస్తే ఉత్పాదక రంగాల ఉత్పత్తి 1.2 శాతం క్షీణించింది. విద్యుత్ ఉత్పత్తి కూడా 0.1 శాతం తగ్గింది. 2018 డిసెంబర్లో 4.5 శాతం వృద్ధిని సాధించింది. అయితే మైనింగ్ రంగ ఉత్పత్తి 5.4 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో ఐఐపి వృద్ధి 0.5 శాతానికి క్షీణించింది. 2018-19 ఇదే కాలంలో 4.7 శాతం పెరిగింది. చదవండి : ధరల మంట: రీటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టం కోవిడ్-19 : ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మూత -
మౌలిక రంగం డౌన్
న్యూఢిల్లీ: మౌలిక రంగంలోని ఎనిమిది కీలక పరిశ్రమల ఉత్పత్తి వరుసగా నాలుగో నెలా క్షీణించింది. 2019 నవంబర్లో వృద్ధి 1.5 శాతం తగ్గింది. 2018 నవంబర్లో ఈ ఎనిమిది పరిశ్రమలు 3.3 శాతం వృద్ధి నమోదు చేశాయి. తాజాగా ఎనిమిదింట అయిదు పరిశ్రమలు ప్రతికూల వృద్ధి నమోదు చేయడంతో మొత్తం గ్రూప్ వృద్ధి మందగించింది. నవంబర్లో బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు, ఉక్కు, విద్యుత్ ఉత్పత్తి క్షీణించింది. 2018 నవంబర్లో సిమెంటు ఉత్పత్తి వృద్ధి 8.8 శాతంగా ఉండగా.. 2019 నవంబర్లో 4.1 శాతానికి పరిమితమైంది. రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పత్తి 3.1 శాతం, ఎరువుల ఉత్పత్తి 13.6 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో మౌలిక పరిశ్రమలు అంతక్రితం ఏడాది ఇదే వ్యవధి స్థాయిలోనే 5.1 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఇన్ఫ్రా గ్రూప్ వృద్ధి ఆగస్టు నుంచి మందగిస్తూనే ఉంది. -
పరిశ్రమలు మళ్లీ మైనస్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా –3.8 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 ఇదే నెలకన్నా తక్కువ పారిశ్రామిక ఉత్పత్తి నమోదయ్యిందన్నమాట. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో మెజారిటీ వాటా కలిగిన తయారీరంగంసహా విద్యుత్, మైనింగ్ వంటి కీలక రంగాలన్నింటిలో క్షీణరేటే నమోదయ్యింది. 2018 ఇదే నెల్లో పారిశ్రామిక ఉత్పత్తి 8.4 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. గురువారం విడుదలైన గణాంకాల్లో కీలక విభాగాలను చూస్తే... తయారీ రంగం: సూచీలో దాదాపు 60 శాతంపైగా వెయిటేజ్ ఉన్న ఈ రంగంలో –2.1 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 అక్టోబర్లో ఈ విభాగం 8.2 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది. ఆరి్థక సంవత్సరం (ఏప్రిల్ నుంచి)లో అక్టోబర్ వరకూ చూస్తే, వృద్ధి రేటు 5.8% నుంచి 0.5%కి పడింది. విద్యుత్: ఈ విభాగం కూడా 10.8 శాతం వృద్ధి బాట నుంచి (2018 అక్టోబర్లో) –12.2 శాతం క్షీణతలోకి జారింది. ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో వృద్ధి 6.8 శాతం నుంచి 1.6 శాతానికి పడిపోయింది. మైనింగ్: ఈ విభాగంలో 7.3 శాతం వృద్ధి రేటు – 8 శాతం క్షీణత (2019 అక్టోబర్)లోకి పడింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ తీసుకున్నా ఈ విభాగం 3.9 శాతం వృద్ధిబాట నుంచి –0.4 శాతం క్షీణతలోకి జారింది. క్యాపిటల్ గూడ్స్: ఇక భారీ యంత్రసామాగ్రి ఉత్పత్తికి, డిమాండ్కు ప్రతిబింబమైన ఈ రంగంలో భారీగా –21.9% క్షీణించింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రంగం భారీగా 16.9 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. రసాయనాలు: 31.8% వృద్ధి నమోదయ్యింది. ఏడు నెలల్లో... ఏప్రిల్తో ప్రారంభం నుంచీ అక్టోబర్ వరకూ ఏడు నెలల కాలాన్ని చూస్తే, వృద్ధి రేటు 5.7 శాతం నుంచి (2018 ఇదే కాలంలో) 0.5 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జూలైలో వృద్ధి రేటు 4.9 శాతంగా నమోదయ్యింది. అదుపు తప్పిన ధరలు ►నవంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతం ►మూడేళ్ల గరిష్ట స్థాయి ఇది... న్యూఢిల్లీ: రిటైల్ ధరలు అదుపుతప్పాయి. ఈ సూచీ నవంబర్లో మూడేళ్ల గరిష్టం 5.54 శాతానికి చేరింది. అంటే 2018 నవంబర్తో పోలి్చచూస్తే, 2019 నవంబర్లో నిత్యావసరాల వినియోగ వస్తువుల బాస్కెట్ ధర మొత్తంగా 5.54 శాతం పెరిగిందన్నమాట. 2016 జూలై (6.07 శాతం) తరువాత ధరల పెరుగుదల తీవ్రత ఇంత స్థాయిలో నమోదుకావడం ఇదే తొలిసారి. 2018 నవంబర్లో ధరల పెరుగుదల రేటు 2.33 శాతం. అక్టోబర్లో కూడా రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా 4.62 శాతం నమోదయ్యింది. -
పరిశ్రమలు.. కకావికలం!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టులో దారుణ పతనాన్ని నమోదు చేసుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా –1.1 శాతం క్షీణత నమోదయ్యింది. ఉత్పత్తి క్షీణతలోకి జారడం రెండేళ్ల తరువాత ఇదేకాగా, అదీ ఇంత స్థాయిలో క్షీణత నమోదుకావడం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి. 2012 నవంబర్లో ఐఐపీ –1.7 శాతాన్ని నమోదుచేసుకున్న తరువాత, ఇదే స్థాయి తీవ్ర ప్రతికూలత తాజా సమీక్షా నెల (2019 ఆగస్టు)లో చోటుచేసుకుంది. 2018 ఆగస్టులో ఐఐపీ వృద్ధిరేటు 4.8 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను రంగాల వారీగా చూస్తే... ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో అసలు వృద్ధి నమోదుకాలేదు. –1.2 శాతం క్షీణత నెలకొంది. ఈ కీలక విభాగంలో ఇలాంటి ఫలితం చూడ్డం ఐదేళ్ల తరువాత (2014 అక్టోబర్లో –1.8 శాతం క్షీణత) తొలిసారి. 2018 ఆగస్టులో తయారీ విభాగంలో 5.2 శాతం వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల ఫలితాలను నమోదు చేసుకున్నాయి. ► విద్యుత్: ఈ రంగంలో కూడా అసలు వృద్ధిలేకపోగా –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఆగస్టులో ఈ రంగం ఏకంగా 7.6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ► మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి రేటు యథాతథంగా 0.1 శాతంగా ఉంది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్లను సూచించే ఈ విభాగం ఉత్పత్తిలో కూడా అసలు వృద్ధిలేకపోగా భారీగా –21 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఆగస్టులో ఈ విభాగంలో ఉత్పత్తి వృద్ధిరేటు 10.3 శాతంగా ఉంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి దీర్ఘకాలం మన్నే ఉత్పత్తులకు సంబంధించి ఈ విభాగం కూడా –9.1 శాతం క్షీణత నమోదుచేసుకుంది. 2018 ఇదే నెల్లో ఈ విభాగంలో వృద్ధిరేటు 5.5 శాతంగా ఉంది. ► ఇన్ఫ్రా/నిర్మాణం: పేలవ పనితనాన్ని ప్రదర్శించిన రంగాల్లో ఇది ఒకటి. ఈ విభాగంలో 8 శాతం వృద్ధి (2018 ఆగస్టు) రేటు –4.5 శాతం క్షీణత (2019 ఆగస్టు)లోకి జారింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, సిగరెట్ల ఉత్పత్తి వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్కు సంబంధించిన ఈ విభాగంలో మాత్రం వృద్ధి 4.1 శాతంగా ఉంది. అయితే 2018 ఆగస్టులో ఈ విభాగంలో వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంది. ► ఐదు నెలల్లోనూ డౌన్: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు ఏప్రిల్–ఆగస్టు మధ్య 2.4%గా ఉంది. 2018 ఇదే కాలంలో ఈ వృద్దిరేటు 5.3 శాతం. రెండవ త్రైమాసికంపై నీలినీడలు... ‘ఏప్రిల్–జూన్ క్వార్టర్లో వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 5%కి పyì ంది. రెండో క్వార్టర్లో వృద్ధి మెరుగుపడకపోవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి’ అని ఆర్థికవేత్త అదితి నయ్యర్ పేర్కొన్నారు. -
జీడీపీ వృద్ధి రేటు కోత!
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ మంగళవారం తగ్గించింది. ఇంతక్రితం అంచనా 7.5 శాతంకాగా, దీనిని 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.3 శాతానికి కుదించింది. సాధారణంకన్నా తక్కువ వర్షపాతం నమోదు, పారిశ్రామిక ఉత్పత్తి భారీ వృద్ధిపై అనుమానాలు వంటి అంశాలు తమ వృద్ధిరేటు కోత అంచనాలకు కారణమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ గ్రూప్ విభాగం అయిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ►పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ, విద్యుత్ రంగాల పనితీరు పేలవంగా ఉంది. ►దివాలా చట్టం 2016 కింద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు నివేదిస్తున్న కేసుల విచారణ మందగమనంలో ఉంది. ఒకచోటు నిరర్థకంగా ఉండిపోయిన మూలధనాన్ని తిరిగి ఉత్పత్తి ప్రక్రియలోకి తీసుకురావడం కష్టంగా మారుతున్న తరుణంలో ఈ అంశం కూడా వృద్ధితీరుపై ప్రభావం చూపే వీలుంది. ►పెట్టుబడుల వ్యయ వృద్ధి రేటు అంచనాలను 10.3% నుంచి 9.2%కి తగ్గించింది. ►వ్యవసాయ రంగం వృద్ధి అంచనాను 3 శాతం నుంచి 2.5 శాతానికి కుదించింది. 2018–19లో ఈ రేటు 2.7 శాతం. ►సేవల రంగం కొంత మెరుగైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. -
ఎన్నికల ముందస్తు ర్యాలీకి చాన్స్!
ముంబై: దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ ఆరోరా స్పష్టం చేశారు. మార్కెట్ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముందుస్తు ర్యాలీకి అవకాశం మెండుగా ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ హెడ్ (పీసీజీ, కాపిటల్ మార్కెట్స్ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ అన్నారు. ‘షెడ్యూల్ ఖరారు కావడం వల్ల మార్కెట్లో అనిశ్చితి ముగింపు దశకు చేరకుందని భావిస్తున్నాం. అయితే, ఇదే సమయంలో భౌగోళిక రాజకీయ అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాం’ అని అన్నారయన. నేటి నుంచే మార్కెట్లో సాధారణ ఎన్నికల వేడి మొదలుకానుండగా.. ప్రీ–పోల్ సర్వేలు, తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నాయనే ప్రధాన అంశాలు మార్కెట్కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఒపీనియన్స్ పోల్స్ సర్వే ఆధారంగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ వార్తలు సంస్కరణల కొనసాగింపునకు ఊతం ఇచ్చేవి అయినందున మార్కెట్ ప్రీ ఎలక్షన్ ర్యాలీకి సహకరిస్తాయని అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థలైన యూబీఎస్, సీఎల్ఎస్ఏ భావిస్తున్నాయి. ఇక ఎవరు సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా.. సంస్కరణల కొనసాగింపు ఉంటుందనే అంచనాలతో ర్యాలీకి అవకాశం ఉందని ప్రభుదాస్ లీలాధర్ సీఈఓ అజయ్ బోడ్కే అన్నారు. గణాంకాలపై దృష్టి.. మంగళవారం(12న) జనవరి పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. గతేడాది డిసెంబర్ ఐఐపీ 2.4%గా నమోదైంది. ఇక ఈఏడాది జనవరిలో ఈ రేటు ఏవిధంగా ఉండనుందనే అంశంతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశించనున్నాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘సీపీఐ, ఐఐపీ డేటాపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక అంశాల్లో.. సోమవారం వెల్లడికానున్న అమెరికా రిటైల్ అమ్మకాలు, చైనా పారిశ్రామిక ఉత్పత్తి మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి’ అని కాపిటల్ ఎయిమ్ పరిశోధనా విభాగం హెడ్ దేబబ్రత భట్టాచార్జీ విశ్లేషించారు. ఇక బ్రెగ్జిట్ విషయంలో యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు మరో అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధాని థెరెసా మే విజ్ఞప్తి చేశారు. మంగళవారం జరిగే ఓటింగ్లో బ్రెగ్జిట్ బిల్లు తిరస్కరణకు గురైతే సంక్షోభం నెలకొంటుందని హెచ్చరించారు. ఈ అంశంతో పాటు అమెరికా–చైనా వాణిజ్య చర్చల అంశంపై కూడా మార్కెట్లు నిశితంగా పరిశీలిస్తున్నాయి. 10,900–11,300 శ్రేణిలో నిఫ్టీ.. సాధారణ ఎన్నికలు, డాలరుతో రూపాయి మార కం విలువ కదలికలు, పలు ఎంపికచేసిన షేర్లలో ర్యాలీ మార్కెట్ దిశను నిర్ధేశించనున్నాయని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్స్ చైర్మన్ డీకే అగర్వాల్ అన్నారు. నిఫ్టీ శ్రేణి 10,900–11,300 పాయింట్ల మధ్యలో ఉండవచ్చని అంచనావేసిన ఆయన.. బ్యాంక్ నిఫ్టీ 27,500–28,000 పాయింట్ల స్థాయి లో కదలాడవచ్చని అంచనావేశారు. ఒకసారి నిఫ్టీ బ్రాడ్ రేంజ్ని అధిగమిస్తే.. అక్కడ నుంచి మేజర్ ట్రెండ్ను నమోదుచేస్తుందని ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ విశ్లేషించారు. ఇక 11,009–10,998 పాయింట్ల శ్రేణి కీలక మద్దతుగానూ.. 11,094–11,118 శ్రేణి కీలక నిరోధంగానూ పనిచేయనున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటై ల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని అభిప్రాయపడ్డారు. ముడిచమురు ధరలు సానుకూలం.. వారాంతాన క్రూడ్ ధర దిగొచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించవచ్చంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో శుక్రవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఒక శాతం నష్టాన్ని నమోదుచేశాయి. ఉత్పత్తి కోత నిర్ణయాలకు ఒపెక్ తలవంచే అవకాశాలు ఉన్నందున ముడిచమురు ధరలు శాంతించే సూచనలు కనిపిస్తున్నాయని కమోడిటీ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంశం మార్కెట్లకు సానుకూలంగా ఉండనుందని భావిస్తున్నారు. -
పారిశ్రామిక ఉత్పత్తి ఉసూరు!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సెప్టెంబర్లో అంతంతమాత్రంగానే నమోదయ్యింది. వృద్ధి రేటు కేవలం 4.5 శాతంగా తాజా గణాంకాలు వెల్లడించాయి. అంటే 2017 సెప్టెంబర్తో పోల్చితే 2018 సెప్టెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 4.5 శాతం పెరిగిందన్నమాట. అంతక్రితం గడచిన నాలుగు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో వృద్ధిరేటు నమోదుకావడం ఇదే తొలిసారి. మైనింగ్ రంగం, అలాగే భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్కు ప్రతిబింబమైన క్యాపిటల్ గూడ్స్ రంగాల పేలవ పనితీరు సెప్టెంబర్లో మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపింది. కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ 2017 సెప్టెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి 4.1 శాతం. ఆగస్టులో ఈ రేటు 4.6 శాతం. జూన్లో ఈ రేటు 6.9 శాతంకాగా, జూలైలో 6.5 శాతం. ఈ ఏడాది మేలో వృద్ధి రేటు 3.8 శాతం. ♦ సెప్టెంబర్లో మైనింగ్ రంగంలో అసలు వృద్ధిలేకపోగా –0.2 శాతం క్షీణించింది. 2017 ఇదే నెలలో ఈ రంగం 7.6% వృద్ధి రేటును నమోదుచేసుకుంది. ♦ అలాగే క్యాపిటల్స్ గూడ్స్ విషయంలోనూ ఇదే జరిగింది. సమీక్షా నెలలో 8.7 శాతం వృద్ధి రేటు–5.8 శాతం క్షీణ బాటకు మళ్లింది. మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో వృద్ధి రేటు మాత్రం 3.8 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 17 సానుకూలంగా ముగిశాయి. ప్రత్యేకించి ‘ఫర్నిచర్’ విభాగంలో వృద్ధి భారీగా 32.8 శాతం నమోదయ్యింది. 20.9 శాతంతో తదుపరి స్థానంలో దుస్తుల విభాగం ఉంది. అయితే ప్రింటింగ్ అండ్ రీప్రొడక్షన్ ఆప్ రికార్డెడ్ మీడియా విభాగంలో వృద్ధి భారీగా –12.9 శాతం క్షీణించింది. పొగాకు ఉత్పత్తుల విభాగంలో క్షీణత –7.3 శాతంగా ఉంది. ♦ విద్యుత్ ఉత్పత్తి సైతం 3.4 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది. ♦ కన్జూమర్ డ్యూరబుల్స్, కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్ వృద్ధిరేట్లు వరుసగా 5.2 శాతం, 6.1 శాతంగా నమోదయ్యాయి. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఫర్వాలేదు... కాగా ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– సెప్టెంబర్ మధ్య (గత ఏడాది ఇదే కాలంతో పోల్చి) ఐఐపీ వృద్ధి రేటు 2.6 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది. మౌలికరంగం నెమ్మది! మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో (ఐఐపీ) దాదాపు 40.27 శాతం వాటా ఉన్న ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక రంగం వృద్ధి సెప్టెంబర్లో మందగించింది. 4.3 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 4.7 శాతం. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి. క్రూడ్ ఆయిల్, సహజ వాయువు ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోవడం మొత్తం గ్రూప్పై ప్రభావం చూపింది. ఈ నెల ప్రారంభంలో వచ్చిన ఈ గణాంకాల అనంతరం విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే తాజా సెప్టెంబర్ ఐఐపీ ఫలితాలు వచ్చాయి. మొత్తం ఎనిమిది మౌలిక పారిశ్రామిక విభాగాల్లో ఎరువులు (2.5 శాతం), సిమెంట్ (11.8 శాతం), విద్యుత్ (8.2 శాతం), బొగ్గు (6.4 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (2.5 శాతం), స్టీల్ (3.2 శాతం), క్రూడ్ ఆయిల్ (–4.2 శాతం), సహజవాయువు (–1.8 శాతం) ఉన్నాయి. అయితే ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఈ రంగాల వృద్ధి రేటు 3.2 శాతం నుంచి 5.5 శాతానికి పెరగడం గమనార్హం. అక్టోబర్లో రిటైల్ ధరలు... కూల్! 3.31 శాతంగా నమోదు ఏడాది కనిష్ట స్థాయి న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 3.31 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 అక్టోబర్తో పోల్చితే 2018 అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.31 శాతం పెరిగిందన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం గడచిన ఏడాది కాలంలో ఇదే తొలిసారి. కొన్ని నిత్యావసరాలు, పండ్లు, ప్రొటీన్ రిచ్ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండడం దీనికి కారణం. సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాలను క్లుప్తంగాచూస్తే... ♦ 2018 సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.7 శాతం. 2017 అక్టోబర్లో ఈ రేటు 3.58%. ♦ తాజా సమీక్షా నెలలో ఫుడ్ బాస్కెట్ ధర పెరక్కపోగా 0.86% క్షీణించింది. సెప్టెంబర్లో 0.51% పెరుగుదల నమోదయ్యింది. ♦ కూరగాయల ధరలు సెప్టెంబర్లో 4.15% పెరిగితే, అక్టోబర్లో – 8.06% తగ్గాయి. ♦ ఫ్రూట్ బాస్కెట్ ధర సెప్టెంబర్లో 1.12 శాతం పెరిగితే, అక్టోబర్లో –0.35 శాతానికి తగ్గింది. ♦ గుడ్లు, పాలు సంబంధిత ప్రొటీన్ రిచ్ ఉత్పత్తుల ధరలూ తగ్గాయి. ♦ ఇక ఫ్యూయల్, లైట్ విభాగానికి వస్తే, సెప్టెంబర్లో ఈ ద్రవ్యోల్బణం 8.47 శాతం ఉంటే, అక్టోబర్లో 8.55 శాతానికి పెరిగాయి. -
పారిశ్రామికం నేల చూపు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం– ఐఐపీ (పారిశ్రామిక ఉత్పత్తి సూచీ) మే నెలలో పేలవ పనితీరును ప్రదర్శించింది. కేవలం 3.2 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేసుకుంది. ఇంత తక్కువ స్థాయి వృద్ధి ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి. గత ఏడాది మే నెలలో వృద్ధి 2.9 శాతమే కావడం గమనార్హం. తయారీ, విద్యుత్ రంగాల పేలవ పనితీరును ప్రదర్శించాయి. కాగా ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలను చూస్తే (ఏప్రిల్, మే) పారిశ్రామిక రంగం వృద్ధి 3.1 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగింది. కేంద్ర గణాంకాల కార్యాలయం గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొన్ని కీలక రంగాలను చూస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం వృద్ధి రేటు మే నెలలో స్వల్పంగా మాత్రమే పెరిగింది. 2017 మే నెలలో 2.6 శాతం వృద్ధి రేటు ఉంటే ఇది 2018 మే నెలలో 2.8 శాతంగా మాత్రమే నమోదయ్యింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ఈ వృద్ధి 2.8 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. విద్యుత్: నెలవారీగా వృద్ధి 8.3 శాతం నుంచి 4.2 శాతానికి పడిపోగా, ఏప్రిల్, మే నెలలను కలిపిచూస్తే, ఈ రేటు 6.9 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గింది. మైనింగ్: మేలో వృద్ధి రేటు 0.3 శాతం నుంచి భారీగా 5.7 శాతానికి ఎగిసింది. రెండు నెలలను కలిపిచూస్తే, రేటు 1.6 శాతం నుంచి 4.9 శాతానికి చేరింది. ఎఫ్ఎంసీజీ: అసలు వృద్ధిలేకపోగా – 2.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2017 మే నెలలో ఈ రంగం వృద్ధి రేటు 9.7 శాతం. కన్జూమర్ గూడ్స్: కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగంలో 4.3 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధిలేకపోగా –2.6 క్షీణత నెలకొంది. -
ఐదు నెలల దిగువకు పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధిరేటు మార్చిలో 4.4 శాతంగా నమోదయ్యింది. గడచిన ఐదు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి నమోదుకాలేదు. క్యాపిటల్ గూడ్స్, మైనింగ్ పనులు తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. ఏప్రిల్లో ఈ రేటు 4.4 శాతంకాగా, గత ఏడాది ఇదే నెల్లో 4.4%ఉండటం గమనార్హం. ముఖ్యాంశాలివీ... ♦ సూచీలో దాదాపు 77 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి రేటు మార్చిలో 3.3 శాతం నుంచి 4.4 శాతానికి పెరిగింది. ♦ ఇదే నెలలో మైనింగ్ రంగం వృద్ధి రేటు 10.1% నుంచి 2.8 శాతానికి పతనమైంది. ♦ ఇక విద్యుత్ రంగంలో వృద్ధి 6.2 శాతం నుంచి 5.9 శాతానికి పడిపోయింది. ♦ భారీ ఉత్పత్తుల తయారీ, డిమాండ్కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 9.4% నుంచి 1.8 శాతానికి పడింది. ♦ ఫ్రిజ్లు, టీవీల వంటి కన్జూమర్ డ్యూరబు ల్స్ వృద్ధి 0.6% నుంచి 2.9%కి పెరిగింది. ♦ సబ్బులు, టూత్పేస్టుల వంటి ఎఫ్ఎంసీజీ విభాగంలో వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 10.9 శాతానికి పెరిగింది. ఆర్థిక సంవత్సరంలోనూ తగ్గిన వృద్ధి 2017–18 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే, పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 4.6 శాతం (2016–17) నుంచి 4.3 శాతానికి పడిపోయింది. 2017–18 మొత్తంగా చూస్తే, తయారీ రంగం వృద్ధి రేటు 4.4 శాతం నుంచి 4.5 శాతానికి పెరిగింది. మైనింగ్ రంగంలో వృద్ధిరేటు 5.3% నుంచి 2.3 శాతానికి తగ్గింది. -
పరిశ్రమలకు ‘తయారీ’ దన్ను!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి (ఐఐపీ) ఫిబ్రవరిలో 7.1 శాతంగా నమోదయ్యింది. అంటే 2017 ఫిబ్రవరితో పారిశ్రామిక ఉత్పత్తి విలువతో పోల్చితే, 2018 ఫిబ్రవరిలో ఈ విలువ 7.1 శాతం పెరిగిందన్నమాట. 2017 ఫిబ్రవరిలో ఈ రేటు కేవలం 0.8 శాతం. అయితే 2018 జనవరితో (7.4 శాతం వృద్ధి) పోల్చితే ఐఐపీ వృద్ధి రేటు తగ్గడం గమనార్హం. తాజా వృద్ధిలో తయారీ రంగానికి కీలకపాత్ర అని గురువారం విడుదలైన కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) లెక్కలు తెలిపాయి. ముఖ్య విభాగాలను చూస్తే... తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 77 శాతం ఉన్న ఈ రంగం వృద్ధి రేటు ఫిబ్రవరిలో 0.7 శాతం నుంచి 8.7 శాతానికి పెరిగింది. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య చూస్తే ఈ వృద్ధి రేటు 4.4 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. ఈ విభాగంలోని 23 రంగాల్లో 15 సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకున్నాయి. మైనింగ్: ఫిబ్రవరిలో అసలు వృద్ధిలేకపోగా –0.3 శాతం క్షీణించింది. 2017 ఫిబ్రవరిలో ఈ రంగం వృద్ధి రేటు 4.6 శాతం. ఆర్థిక సంవత్సరం 11 నెలల కాలంలో ఈ రేటు 4.8 శాతం నుంచి 2.3 శాతానికి తగ్గింది. విద్యుత్: ఫిబ్రవరిలో వృద్ధి రేటు 1.2 శాతం నుంచి 4.5 శాతానికి పెరగ్గా, 11 నెలల కాలంలో 5.9 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గింది. క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాలు, డిమాండ్కు సంబంధించిన ఈ విభాగంలో ఫిబ్రవరిలో వృద్ధి రేటు భారీగా 20 శాతం పెరిగింది. 2017 ఫిబ్రవరిలో ఇది –2.4 శాతం క్షీణతలో ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్: వృద్ధి రేటు 4.6 శాతం నుంచి 7.9 శాతానికి చేరింది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్: వృద్ధి 7.4 శాతం నమోదయ్యింది. 11 నెలల కాలంలో నిరాశే... ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య 11 నెలల కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 4.7 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గడం గమనార్హం. -
పండగ వేళ ధరల షాక్
సాక్షి, న్యూఢిల్లీ : పండగ వేళ ఏం కొనాలన్నావినియోగదారులకు కొండెక్కిన ధరలు చుక్కలు చూపుతున్నాయి. ధరల పెరుగుదలతో రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ట స్ధాయిలో 5.2 శాతానికి ఎగబాకింది. గత మూడు నెలలుగా వరుసగా ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది. ఆర్బీఐ అంచనాలను మించి ద్రవ్యోల్బణం పరుగులు పెడుతుండటంతో వడ్డీరేట్లను ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధరల భారం సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరోవైపు నవంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి 2.2 శాతం నుంచి ఏకంగా 8.4 శాతానికి పెరగడం కొంత ఊరట ఇస్తోంది. పారిశ్రామిక ఉత్పాదకత 4 శాతంగా ఉంటుందన్న విశ్లేషకుల అంచనాలను తారుమారు చేస్తూ భారీగా పెరగడం గమనార్హం. ఇక తయారీ రంగం సైతం 10 శాతం పైగా వృద్ధిని నమోదు చేయడం ఉత్సాహం నింపుతోంది. అయితే ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. -
ధరలు పైకి.. పరిశ్రమలు డీలా!
ఆర్థిక గణాంకాలు నిరుత్సాహం ► జూలైలో పారిశ్రామిక వృద్ధి 1.2 శాతం ► ఆగస్టులో ఐదు నెలల గరిష్టానికి రిటైల్ ధరలు... న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక గణాంకాలు ఇంకా నిరుత్సాహంగానే కొనసాగుతున్నట్లు మంగళవారం వెలువడిన గణాంకాలు స్పష్టంచేశాయి. 2017 జూలై పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు కేవలం 1.2 శాతంగా నమోదయింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 4.5 శాతం. ఇక ఏప్రిల్–జూలై మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6.5 శాతం నుంచి 1.7 శాతానికి పడిపోయింది. మరోవైపు ఆగస్టు నెల్లో రిటైల్ ధరల స్పీడ్ 3.36 శాతంగా (గత ఏడాది ఇదే నెలలో ధరలతో పోల్చి) నమోదయింది. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. తయారీ పేలవ పనితీరు... మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో దాదాపు 77 శాతంగా ఉన్న తయారీ రంగం జూలైలో పేలవ పనితీరును ప్రదర్శించింది. 2016 జూలైలో తయారీ రంగం 5.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటే, 2017 జూలైలో అసలు వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణించింది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య నెలలను చూస్తే వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 1.3 శాతానికి పడింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో ఎనిమిది మాత్రమే వృద్ధిని నమోదుచేసుకున్నాయి. ♦ క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర ఉత్పత్తి, డిమాండ్ వృద్ధికి ప్రతిబింబమైన ఈ విభాగంలోనూ 8.8 శాతం వృద్ధి రేటు (2016 జూలై) –1 శాతం క్షీణతలోకి జారింది. ♦ కన్జూమర్ డ్యూరబుల్స్: ఈ విభాగంలో 0.2 శాతం వృద్ధి ఈ దఫా ఏకంగా –1.3 శాతం క్షీణతలోకి జారింది. అయితే కన్జూమర్–నాన్–డ్యూరబుల్స్ విషయంలో వృద్ధి రేటు 3.4 శాతానికి ఎగసింది. ♦ విద్యుత్: ఈ రంగం మాత్రం చక్కని పనితీరును ప్రదర్శించింది. వృద్ధిరేటు 2.1% నుంచి 6.5%కి చేరింది. అయితే ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల కాలంలో మాత్రం ఈ రేటు 7.9% నుంచి 5.6%కి తగ్గింది. ♦ మైనింగ్: ఈ రంగం కూడా సానుకూల రీతిలో 0.9 శాతం వృద్ధిరేటు 4.8 శాతానికి పెరిగింది. అయితే ఏప్రిల్ నుంచి జూలై మధ్య నెలల్లో చూస్తే వృద్ధి రేటు 5.8 శాతం నుంచి 2.1 శాతానికి పడింది. ♦ మరోవైపు జూన్లో వృద్ధి లేకపోగా – 0.2 శాతం క్షీణత నమోదయ్యిందని సవరించిన గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్ర స్థాయిల్లో సంస్కరణలు: ఫిక్కీ పారిశ్రామిక ఉత్పత్తి పేలవ పనితీరుపై పారిశ్రామిక ప్రాతినిధ్య మండలి ఫిక్కీ సెక్రటరీ జనరల్ సంజయ్ బారు మాట్లాడుతూ, దేశంలో పెట్టుబడుల పునరుద్ధరణ తక్షణం అవసరమన్నారు. ఇందుకు వడ్డీరేట్ల తగ్గింపు, ఈ ప్రయోజనం పెట్టుబడిదారులకు అందేలా చేయడం కీలకమని వివరించారు. దీనితోపాటు రాష్ట్రస్థాయిలో సంస్కరణలూ ముఖ్యమని వివరించారు. కాగా, భారత్ 9 నుంచి 10 శాతం భారీ వృద్ధిని సాధించడానికి తొలుత తయారీ రంగం పురోగమించాల్సి ఉందని అసోచామ్–ఈవై నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. తయారీ రంగం వచ్చే 30 సంవత్సరాలూ స్థిరంగా 14 నుంచి 15 శాతం మేర సగటు వార్షిక వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని వివరించింది. పెరుగుతున్న రిటైల్ ధరలు మరోవైపు రిటైల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నుంచి తగ్గుతూ జూన్ నాటికి 1.46 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం స్పీడ్ మళ్లీ పెరుగుతూ జూలైలో 2.36 శాతానికి చేరింది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం ఇది ఆగస్టు నెలలో 3.36 శాతం. అంటే 2016 రిటైల్ బాస్కెట్ ధరతో పోల్చితే ప్రస్తుత ఏడాది ఆగస్టు రిటైల్ బాస్కెట్ ధర 3.36 శాతం పెరిగిందన్నమాట. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. పండ్లు, కూరగాయల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. నిత్యావసరాలు ఇలా: ధరలు పెరిగిన జాబితాలో కూరగాయలు (6.16 శాతం), పండ్లు (5.29 శాతం), చక్కెర (7.35 శాతం), పాలు, పాలపదార్థాలు (3.58 శాతం) ప్రెపేర్డ్ మీల్స్ (5.23%), మాంసం చేపలు (3 శాతం) వంటివి ఉన్నాయి. -
ఆర్బీఐపై రేట్ల కోత ఒత్తిడి
♦ ద్రవ్యోల్బణం భారీగా తగ్గడం, ♦ వృద్ధి మందగమనమే కారణం ♦ నిపుణుల అభిప్రాయం న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం రికార్డు కనిష్టానికి దిగిరావడం, మరోపక్క పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 2 శాతం కిందికి పడిపోయిన నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించాలంటూ ఆర్బీఐపై ఒత్తిడి పెరిగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. వచ్చే నెలలో(ఆగస్ట్ 2న) జరిగే పాలసీ సమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లలో కోత విధించాలని ఆర్థికవేత్తలు, బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. గత నెలలో జరిగిన పరపతి విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును యథాతథంగా (6.25 శాతం) కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం రిస్కులను చూపుతూ ఆర్బీఐ వరుసగా నాలుగు సమీక్షల్లోనూ రెపో రేటులో ఎలాంటి మార్పులూ చేయలేదు. కాగా, జూన్ సమీక్షలో ఆర్బీఐ ద్రవ్యోల్బణం అంచనాలను భారీగా తగ్గించడం, తాజాగా రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణం మరింత తగ్గిన నేపథ్యంలో పాలసీ రేట్ల కోతకు ఆస్కారం లభిస్తోందని కోటక్ మహీంద్రా బ్యాంక్ నివేదిక పేర్కొంది. ఆగస్ట్ సమావేశంలో పావు శాతం రెపో రేటు కోతకు అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిల్ లించ్(బీఓఎఫ్ఏ–ఎంఎల్) గ్లోబల్ రీసెర్చ్ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం రిస్కులు చాలా వరకూ దిగొచ్చాయని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలోనూ 2 శాతం దిగువనే ఉండొచ్చని... ఆగస్టు–సెప్టెంబర్లలో 3 శాతం దిగువన, అక్టోబర్–నవంబర్లలో 4 శాతం దిగువన, డిసెంబర్–మార్చి మధ్య 4–4.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు కనిష్ట స్థాయి అయిన 1.54 శాతానికి, టోకు ధరల(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 0.9 శాతానికి(8 నెలల కనిష్టం) దిగిరావడం తెలిసిందే. డిమాండ్ను పెంచాలంటే వచ్చే పాలసీ సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును అర శాతం తగ్గించాల్సిందేనని సీఐఐ కోరుతోంది. -
ధరలు దిగివచ్చాయ్... పరిశ్రమలు మందగించాయ్!
♦ ఏప్రిల్లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 3.1 శాతం ♦ గత ఏడాది ఇదే నెల ఈ రేటు 6.5 శాతం ♦ 2017 మార్చి నెలలో 3.75 శాతం స్పీడ్ ♦ మే రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాల ఊరట ♦ పెరుగుదల కేవలం 2.18 శాతం న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు ఆర్థిక సంవత్సరం మొదటి నెల– ఏప్రిల్లో నిరుత్సాహపరచగా, మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఊరటనిచ్చాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారంనాడు విడుదల చేసిన గణాంకాల వివరాలను క్లుప్తంగా చూస్తే... ఏప్రిల్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు 3.1 శాతంగా (2016 ఇదే నెల ఉత్పత్తితో పోల్చిచూస్తే) నమోదయ్యింది. 2016 నెలలో ఈ రేటు 6.5 శాతం. ఇక 2017 మార్చి నెలలో సైతం వృద్ధి రేటు 3.75 శాతంగా నమోదయ్యింది. గత నెల్లో ప్రకటించిన తొలి అంచనాల కన్నా (2.7 శాతం) ఇది అధికం కావడం గమనార్హం. ఇక మే నెలలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2.18 శాతంగా నమోదయ్యింది. ప్రధాన విభాగాలు నేలచూపు..! ♦ మొత్తం సూచీలో దాదాపు 78 శాతం వాటా కలిగిన తయారీసహా మైనింగ్, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్ రంగాల్లో పెద్ద పురోగతి కనిపించలేదు. ♦ తయారీ: ఈ రంగంలో వృద్ధి రేటు 5.5 శాతం నుంచి 2.6 శాతానికి పడిపోయింది. తయారీ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 14 సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి. ఫార్మా, మెడిసినల్ కెమికల్, బొటానికల్ ప్రొడక్ట్స్లో అత్యధికంగా 29.1 శాతం వృద్ధి నమోదయ్యింది. తరువాత 17.5 శాతంతో పొగాకు ఉత్పత్తులు నిలవగా, 9.5 శాతంతో మిషనరీ అండ్ పరికరాల తయారీ నిలిచింది. శీతల పానీయాల ఉత్పత్తి భారీగా 19.2 శాతం (మైనస్) క్షీణించింది. మోటార్ వెహికల్స్, ట్రైలర్స్, సెమీ– ట్రైలర్స్ ఉత్పత్తి 15.6 శాతం క్షీణించింది. ఎలక్ట్రికల్ పరికరాల తయారీలో 14.4 శాతం క్షీణత నమోదయ్యింది. ♦ మైనింగ్: వృద్ధి రేటు 6.7 శాతం నుంచి 4.2 శాతానికి పడింది. ♦ విద్యుత్: ఈ రంగంలో రేటు 14.4 శాతం నుంచి 5.4 శాతానికి దిగింది. ♦ క్యాపిటల్ గూడ్స్: డిమాండ్కు, భారీ వస్తు ఉత్పత్తికి సూచిక అయిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి భారీగా 8.1 శాతం నుంచి 1.3 శాతానికి జారింది. ♦ వినిమయ వస్తువులు: ఈ విభాగంలో ఉత్పత్తి వృద్ధి 5.8 శాతంగా నమోదయ్యింది. ఇందులో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ల వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ (వైట్ గూడ్స్) ఉత్పత్తి వృద్ధి 13.8 శాతం నుంచి 6 శాతానికి పడిపోయింది. నాన్–డ్యూరబుల్స్ విభాగంలో మాత్రం వృద్ధి 8.3 శాతంగా నమోదయ్యింది. రేటు తగ్గించడానికి సమయమిది: పరిశ్రమలు ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి తగ్గడం, పారిశ్రామిక పేలవ ఉత్పత్తి నేపథ్యంలో... రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే రేటు– ప్రస్తుతం 6.25 శాతం) తగ్గింపు డిమాండ్ మళ్లీ పరిశ్రమల నుంచి వినిపించింది. జూన్ 7న జరిగిన పాలసీ సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే. రేటు తగ్గించి పెట్టుబడులకు తగిన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. కూరగాయలు... పప్పుల ధరల ఊరట ఇక మే నెల గణాంకాలను చూస్తే... ప్రధానంగా కూరగాయలు, పప్పుల ధరలు తగ్గాయి. (2016 మే నెలతో పోల్చి చూస్తే...) దీనితో రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో 2.18 శాతానికి పడిపోయింది. 2017 ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.99 శాతం కాగా, 2016 మే నెలలో ఈ రేటు 5.75 శాతంగా ఉంది. ఒక్క ఆహార ఉత్పత్తుల విభాగాన్ని చూస్తే ధరలు మే నెలలో అసలు పెరక్కపోగా (2016 మే నెలతో పోల్చి) –1.05 శాతం క్షీణించాయి. 2012 జనవరి తరువాత ఈ తరహా సానుకూల ఫలితం ఇదే తొలిసారి. కూరగాయల ధరలు 13.44 శాతం క్షీణించాయి. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 19.45 శాతం పడ్డాయి. పండ్ల ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. కాగా దుస్తులు, హౌసింగ్, ఫ్యూయెల్, లైట్ విభాగాల్లో కూడా ధరలు తగ్గాయి. -
పారిశ్రామిక ఉత్పత్తిపై తయారీ దెబ్బ
► ఫిబ్రవరిలో అసలు వృద్ధిలేకపోగా మైనస్ 1.2 శాతం క్షీణత ► నాలుగు నెలల కనిష్ట స్థాయి ►తయారీ రంగం ఉత్పత్తి మైనస్ 2 శాతం పతనం న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఫిబ్రవరిలో పేలవ పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు పెరుగుదల లేకపోగా –1.2 శాతం (2016 ఫిబ్రవరితో పోలిస్తే) క్షీణించింది. నాలుగు నెలల్లో ఇలాంటి ఫలితం రావడం ఇదే తొలిసారి. తాజా ఫలితానికి మొత్తం సూచీలో దాదాపు 75 శాతంగా ఉన్న తయారీ రంగం ప్రతికూలతే కారణం. ఈ విభాగంలో సైతం అసలు వృద్ధిలేకపోగా –2 శాతం క్షీణత నమోదయ్యింది. తయారీ రంగంలోని 22 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల వృద్ధిరేటును నమోదుచేసుకున్నాయి. క్యాపిటల్ గూడ్స్, వినియోగ విభాగాల్లో ఉత్పత్తుల ధోరణి కూడా నిరాశే. 2016 ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధిరేటు 1.99 శాతం గాకా, ఈ ఏడాది జనవరిలో 3.27 శాతంగా నమోదయ్యింది. బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను చూస్తే... క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్కు సూచికయిన ఈ విభాగం 2016 ఫిబ్రవరిలో భారీగా –9.3 శాతం క్షీణత నమోదుచేస్తే, 2017లో ఈ క్షీణ రేటు –3.4 శాతంగా ఉంది. వినియోగ ఉత్పత్తులు: వార్షికంగా 0.6 శాతం వృద్ధి 5.6 శాతం క్షీణతకు పడిపోయింది. ఇందులో ఒక భాగమైన నాన్–డ్యూరబుల్ కన్జూమర్ గూడ్స్ – 4.9 శాతం క్షీణత నుంచి మరింతగా –8.6 క్షీణ రేటుకు జారిపోయింది. డ్యూరబుల్ సెగ్మెంట్ విషయంలో 10.4% వృద్ధి –0.9% క్షీణతకు జారింది. 11 నెలల్లో... గడచిన ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకూ 11 నెలల కాలంలో (2016 ఏప్రిల్–2017 ఫిబ్రవరి) పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 0.4 శాతంగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఈ రంగం వృద్ధి 2.6 శాతం. కాగా తాజా పారిశ్రామిక ఉత్పత్తి ఫలితాల నేపథ్యంలో తిరిగి పారిశ్రామిక వర్గాల నుంచి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.25 శాతం) కోత డిమాండ్ ప్రకటనలు వెలువడుతున్నాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 15 శాతంగా ఉన్న పారిశ్రామిక రంగం పునరుత్తేజానికి రేటు కోత తప్పదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. రిటైల్ ధరల సెగ మార్చిలో 3.81 శాతం అప్ ఐదు నెలల గరిష్టం న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2017 మార్చిలో 3.81 శాతంగా నమోదయ్యింది. అంటే రిటైల్ ధరల బాస్కెట్ మొత్తంగా 2016 మార్చితో పోల్చితే 2017 మార్చిలో 3.81 శాతం పెరిగాయన్నమాట. మార్చికి ముందు గడచిన ఐదు నెలల కాలంలో రిటైల్ ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. ఫిబ్రవరిలో ఈ రేటు 3.65 శాతంగా ఉంది. గత ఏడాది మార్చి రేటు 4.83 శాతం. బుధవారంనాడు విడుదల చేసిన మార్చి గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు.. ► ఆహార ఉత్పత్తుల విషయానికి వస్తే– పాల ధరలు 4.69 శాతం పెరిగితే, పాల ఉత్పత్తుల ధరలు 3.21 శాతం ఎగశాయి. ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్, స్వీట్స్ ధరలు 5.65 శాతం ఎగశాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం అసలు పెరక్కపోగా – 7.24 శాతం క్షీణించాయి. ► ఇంధనం, లైట్ కేటగిరీలో ద్రవ్యోల్బ ణం 5.56 శాతంగా ఉంది. ► కాగా గ్రామీణ ప్రాంతంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 3.74 శాతంగా ఉంటే, పట్టణ ప్రాంతంలో 3.88 శాతంగా నమోదయ్యింది. -
మళ్లీ పరిశ్రమల పడక
• అక్టోబర్లో తిరోగమనం.. • వృద్ధిలేకపోగా -1.9 శాతం క్షీణత • క్షీణతతో పారిశ్రామిక రంగం దిగాలు • రేటు కోత డిమాండ్ న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి 2016 అక్టోబర్లో మళ్లీ నిరాశను మిగిల్చింది. 2015 అక్టోబర్ నెలతో (9.9 శాతం వృద్ధి) పోల్చితే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా -1.9 శాతం క్షీణించింది. జూలై నెలలో సూచీ - 2.5 శాతం క్షీణతను నమోదచేసుకుంది. తరువాతి నెల ఆగస్టులో కూడా -0.7 శాతం క్షీణత నమోదరుు్యంది. అరుుతే సెప్టెంబర్లో మాత్రం ఈ క్షీణ ధోరణి నుంచి బయటపడి, 0.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. నెల తిరిగే సరికి తన క్రితం క్షీణ ధోరణికి మారింది. పెద్ద నోట్ల రద్దు పరిస్థితులు, డిమాండ్పై ప్రభావం వంటి అంశాల నేపథ్యంలో నవంబర్ నుంచీ మరికొన్ని నెలలూ ఐఐపీ క్షీణతనే కొనసాగే వీలుందన్న విశ్లేషణలు వస్తున్నారుు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక ఉత్పత్తి ఊపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు తగ్గింపు అవసరమన్న డిమాండ్ ఆయా వర్గాల నుంచి వినిపిస్తోంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన పారిశ్రామిక ఉత్పత్తి లెక్కలను ఒకసారి చూస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 75 శాతం ఉన్న ఈ విభాగంలో వృద్ధి అసలు లేకపోగా -2.4 శాతం క్షీణత నమోదరుు్యంది. 2015 అక్టోబర్లో ఈ విభాగం వృద్ధి 10.6 శాతం. తయారీ రంగంలోని మొత్తం 22 గ్రూపుల్లో సగం ప్రతికూలతను నమోదుచేసుకున్నారుు. ఇక ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 5.1 శాతం వృద్ధి నుంచి -1.0% క్షీణతలోకి జారింది. మైనింగ్: 3.5 శాతం వృద్ధి -3.1 శాతం క్షీణతలోకి మళ్లింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో కూడా ఈ రేటు 2.2 శాతం వృద్ధి నుంచి -0.2 శాతం క్షీణతలోకి చేరింది. విద్యుత్: 2015 అక్టోబర్ నెలలో 5.3 శాతం వృద్ధి తాజా నెలలో 1.1% పడిపోరుుంది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఈ రేటు 5.2% నుంచి 4.6 శాతానికి తగ్గింది. క్యాపిటల్ గూడ్స్: వ్యవస్థలో డిమాండ్ను ప్రతిబింబించే భారీ పరికరాల ఉత్పత్తులకు సంబంధించిన ఈ విభాగం ఏకంగా - 25.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. వినియోగ వస్తువులు: మొత్తంగా వినియోగ వస్తువుల ఉత్పత్తి 18.3 శాతం వృద్ధి నుంచి -1.6 శాతం క్షీణతలోకి పడిపోరుుంది. ఏడు నెలల్లో: ఇక ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఏడు నెలల కాలంలో 2015 ఇదే కాలంతో పోల్చితే 4.8 శాతం వృద్ధి -0.3 శాతం క్షీణతలోకి జారింది. -
తయారీ, మైనింగ్ రంగాలు పేలవం
• సెప్టెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి • స్వల్పంగా 0.7 శాతం వృద్ధి • ఏప్రిల్ నుంచీ చూస్తే 0.1 శాతం క్షీణత న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్లో పేలవంగా కనిపించింది. కేవలం 0.7 శాతం వృద్ధి నమోదరుు్యంది. గత ఏడాది ఇదే నెలలో ఈ వృద్ధి 3.7 శాతం. అరుుతే ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా -0.7 శాతం క్షీణత నమోదరుు్యంది. అంటే నెలవారీగా కొంత బెటరన్నమాట. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే అసలు వృద్ధి లేకపోగా -0.1 శాతం క్షీణత నమోదరుు్యంది. గత ఏడాది ఇదే నెలల్లో వృద్ధి 4 శాతంగా ఉంది. ఇక ప్రత్యేకించి గడచిన సెప్టెంబర్ను చూస్తే... మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం, దీనితోపాటు మైనింగ్, భారీ యంత్ర పరికరాలకు సంబంధించి క్యాపిటల్ గూడ్స రంగాలు తీవ్ర ప్రతికూల ఫలితాలను నమోదుచేసుకున్నారుు. కేంద్ర గణాంకాల కార్యాలయం విడుదల చేసిన లెక్కలను చూస్తే.. తయారీ: 2015 ఇదే నెలతో పోల్చిచూస్తే వృద్ధి 2.7 శాతం నుంచి 0.9 శాతానికి పడిపోరుుంది. ఈ విభాగంలోని 22 గ్రూపుల్లో 12 సానుకూల వృద్ధిని నమోదుచేసుకున్నారుు. కాగా ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ఈ రంగం 4.2% వృద్ధి 0.8% క్షీణతలోకి పడిపోరుుంది. క్యాపిటల్ గూడ్స: డిమాండ్కు ప్రతిబింబమైన 10.1 శాతం వృద్ధి రేటు - 21.6 శాతం క్షీణతలోకి జారిపోరుుంది. ఆరు నెలల కాలంలో 7.8 శాతం వృద్ధి 21.4 శాతం క్షీణతలోకి చేరింది. మైనింగ్: వృద్ధి 3.5 శాతం నుంచి - 3.1 శాతం క్షీణతలో పడిపోరుుంది. ఆరు నెలల కాలంలో వృద్ధి లేకుండా అక్కడక్కడే ఉంది. గత ఏడాది ఇదే కాలంలో వృద్ధి 0.7 శాతం. విద్యుత్: వృద్ధి రేటు 11.4 శాతం నుంచి 2.4 శాతానికి చేరింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే వృద్ధి 4.5 శాతం నుంచి 5.1 శాతానికి ఎగసింది. వినియోగ వస్తువులు: ఉత్పత్తి వృద్ధి 1.2 శాతం నుంచి 6 శాతానికి ఎగసింది. -
పరిశ్రమలు.. మైనస్లోనే!
• ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి 0.7 శాతం క్షీణత • జూలైలో ఉత్పాదకత మైనస్ 2.49 శాతం • తయారీ, మైనింగ్, యంత్రపరికరాల • రంగాల పేలవ పనితీరు ప్రభావం... న్యూఢిల్లీ: పరిశ్రమల తిరోగమనం కొనసాగుతోంది. వరుసగా రెండో నెలలోనూ మైనస్లోనే నిలిచాయి. ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 0.7% క్షీణించింది. ప్రధానంగా తయారీ, మైనింగ్, యంత్రపరికరాల రంగాల ఉత్పాదక పేలవంగా ఉండటమే దీనికి కారణం. జూలైలో ఐఐపీ మైనస్ 2.49%గా(సవరించిన గణాంకాలు) నమోదైంది. ఇది 8 నెలల కనిష్టస్థాయి. రంగాలవారీగా చూస్తే... తయారీ: ఆగస్టులో ఈ రంగం ఉత్పాదకత 0.3 శాతం క్షీణించింది. క్రితం ఏడాది ఇదే నెలలో 6.6 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం ఐఐపీలో తయారీ రంగం వాటా 75 శాతం కావడం గమనార్హం. యంత్రపరికరాలు: ఉత్పాదకత ఆగస్టులో అత్యంత ఘోరంగా 22.9% క్షీణించింది. క్రితం ఏడాది ఇదే నెలలో 21.3 శాతంగా నమోదైంది. మైనింగ్: 4.5% వృద్ధి నుంచి 5.6 శాతం క్షీణతలోకి జారిపోయింది. విద్యుత్: ఉత్పాదకత వృద్ధి 5.6 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గింది. కన్జూమర్ గూడ్స్: ఈ రంగంలో ఉత్పాదకత వృద్ధి 6 శాతం నుంచి 1.1 శాతానికి పడిపోయింది. ఇందులో విభాగాలైన కన్జూమర్ డ్యూరబుల్స్ 2.3 శాతం వృద్ధి చెందగా.. మొత్తం తయారీ రంగంలోని 22 పరిశ్రమ గ్రూపులలో 7 గ్రూప్ల ఉత్పాదకత ఆగస్టులో మైనస్లోనే ఉండటం గమనార్హం. ఏప్రిల్-ఆగస్టులో ఇలా...: ఈ ఆర్థిక సంవత్సరం(2016-17) తొలి 5 నెలలకు(ఏప్రిల్-ఆగస్ట్) చూస్తే... పారిశ్రామికోత్పత్తి ఉత్పాదకత మైనస్లోనే ఉంది. 0.3% క్షీణించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఐఐపీ 4.1% వృద్ధి చెందింది. ప్రోత్సాహకాలు కావాలి...: కార్పొరేట్లు వినిమయ ఆధారిత డిమాండ్ను పెంచడంద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలంటే ప్రభుత్వం పరిశ్రమలకు పోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కార్పొరేట్ ఇండియా కోరింది. ఐఐపీ వరుసగా రెండో నెలలోనూ క్షీణించిన నేపథ్యంలో పారిశ్రామిక వర్గాలు తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేశాయి. యంత్రపరికరాల రంగం ఉత్పాదకత ఘోరంగా క్షీణించడాన్ని చూస్తే.. పెట్టుబడులు నిలిచిపోయిన బలమైన సంకేతాలకు నిదర్శనమని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. తయారీ రంగం తిరోగమనం, విద్యుదుత్పత్తి వృద్ధి తగ్గడం కూడా ఆందోళనకలిగించే అంశమేనని.. 7.6 శాతం జీడీపీ వృద్ధి లక్ష్యానికి ఇది పెనుసవాలుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. వినిమమ డిమాండ్ను పెంచడానికి కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. దీనివల్ల కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంటుందన్నారు. కాగా, ఖరీఫ్ పంట దిగుబడులు రికార్డు స్థాయిల్లో నమోదవుతాయన్న అంచనాల నేపథ్యంలో రానున్న నెలల్లో డిమాండ్ భారీగా పుంజుకోవచ్చని భావిస్తున్నట్లు ఇక్రా వైస్ ప్రెసిడెంట్, సీనియర్ ఎకనమిస్ట్ అదితి నాయర్ పేర్కొన్నారు. -
కట్టు తప్పిన ధరలు - ఊపునివ్వని పరిశ్రమలు
జూలై రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతం రెండేళ్ల గరిష్ట స్థాయి ఇక జూన్ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 2.1 శాతం న్యూఢిల్లీ: స్థూల ఆర్థికాంశాల్లో ప్రధానమైన- రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి తాజా గణాంకాలు నిరాశపరిచాయి. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం కట్టు తప్పి ఏకంగా 6.07 శాతానికి ఎగసింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి. ఇందుకు సంబంధించి ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలను చూస్తే, సామాన్యునికి భారంగా ఏకంగా 8 శాతం పెరిగాయి. ఇక జూన్లో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధిరేటు 2.1 శాతంగా నమోదయ్యింది. 2015 ఇదే కాలంలో ఈ రేటు 4.2 శాతంగా ఉంది. అయితే 2016 మే నెలతో పోల్చితే మాత్రం ఈ ఫలితం కొంత ఊరటనిచ్చింది. మేలో ఈ రేటు 1.1 శాతంగా నమోదయ్యింది. కాగా ఏప్రిల్ నుంచి జూన్ వరకూ క్యూ1లో 3.3 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. కీలక పారిశ్రామిక విభాగాలను చూస్తే తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో వృద్ధి రేటు వార్షికంగా 5.2 శాతం నుంచి 0.9 శాతానికి పడిపోయింది. ఈ విభాగంలోని 22 పరిశ్రమల్లో 18 సానుకూల వృద్ధి రేటును నమోదుచేసుకున్నాయి. ఏప్రిల్-జూన్ నెలల కాలంలో ఈ రేటు 3.7 శాతం వృద్ధి నుంచి -0.7 శాతం క్షీణతలోకి జారిపోయింది. మైనింగ్: ఈ రంగం మంచి ఫలితాన్ని అందించింది. -0.4 శాతం క్షీణత నుంచి 4.7 శాతం వృద్ధికి మళ్లింది. త్రైమాసికంలో సైతం ఈ రేటు 0.4 శాతం నుంచి 2.3 శాతానికి పెరిగింది. 4 నెలల నుంచీ ‘రిటైల్ ధరలు’ అప్ నాలుగు నెలల నుంచీ పెరుగుతూ వస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణం... జూలైలో ఏకంగా రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇది వచ్చే ఐదేళ్లలో 4 శాతం (ప్లస్ 2 లేదా మైసస్ 2) ఉండాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న నేపథ్యంలోనే ఇందుకు విరుద్దంగా తాజా గణాంకాలు రావడం గమనార్హం. కొన్ని నిత్యావసర ధరలను చూస్తే- పప్పు దినుసుల ధరలు వార్షికంగా జూలైలో భారీగా 28 శాతం ఎగశాయి. చక్కెర ధరలు 22 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 14 శాతం ఎగశాయి. గుడ్ల ధరలు 9 శాతం పెరిగాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 5 శాతం పెరిగాయి. -
మళ్లీ ప్లస్లోకి పరిశ్రమలు!
♦ మేలో పారిశ్రామికోత్పత్తి 1.2% వృద్ధి ♦ వినియోగ వస్తువుల ఉత్పత్తి దన్ను ♦ ఏప్రిల్లో వృద్ధిలేకపోగా -1.3 శాతం క్షీణత న్యూఢిల్లీ : పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో మళ్లీ వెలుగు వెలిగింది. వార్షికంగా చూస్తే, ఏప్రిల్లో అసలు వృద్ధిలేకపోగా -1.3 శాతం క్షీణించిన (2015 ఏప్రిల్ ఉత్పత్తి విలువతో పోల్చి), మేలో తిరిగి వార్షికంగా 1.2 శాతం పారిశ్రామిక ఉత్పత్తి నమోదయ్యింది. టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్ల వంటి వినియోగ ఉత్పత్తుల్లో వృద్ధి దీనికి ప్రధాన కారణం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) మంగళవారం విడుదల చేసిన మే నెల గణాంకాల ప్రకారం ముఖ్య రంగాలను చూస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉన్న ఈ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 2.1% నుంచి 0.7%కి తగ్గింది. ఏప్రిల్-మే నెలల్లో అసలు వృద్ధిలేకపోగా -1.5% క్షీణించింది. 2015 ఇదే కాలంలో ఈ రేటు 3 శాతం. తయారీ రంగంలోని 22 పారిశ్రామిక గ్రూపుల్లో 14 గ్రూపులు వృద్ధిలో నిలిచాయి. మైనింగ్: ఉత్పత్తి వృద్ధి 2.1% నుంచి 1.3 శాతానికి పడింది. ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో రేటు 0.7 శాతం నుంచి 1.2 శాతానికి పెరిగింది. విద్యుత్: మేలో ఉత్పత్తి వృద్ధి రేటు 6 శాతం నుంచి 4.7 శాతానికి తగ్గింది. అయితే తొలి రెండు నెలల్లో వృద్ధి రేటు 2.8% నుంచి 9.4 శాతానికి ఎగసింది. వినియోగ డ్యూరబుల్స్: టెలివిజన్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి వైట్ గూడ్స్ ఉత్పత్తుల్లో 2015 మేలో అసలు వృద్ధి లేకపోగా - 3.9 శాతం క్షీణిస్తే, ఈ 2016 మేలో 6% వృద్ధి నమోదయ్యింది. నాన్-డ్యూరబుల్స్ గూడ్స్ ఉత్పత్తుల్లో మాత్రం వృద్ధి లేకపోగా, 2.2 శాతం క్షీణత నమోదయ్యింది. రెండూ కలిపి ఈ విభాగంలో 1.1 శాతం వృద్ధి చోటుచేసుకుంది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్కు ప్రతిబింబమైన భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సంబంధించిన ఈ విభాగంలో సైతం వృద్ధి నమోదుకాకపోగా, -12.4 శాతం క్షీణత నమోదయ్యింది. రెండు నెలల్లో... కాగా ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్-మే) అసలు వృద్ధిలేకపోగా -0.1 శాతం క్షీణతలో ఉంది. 2015 ఇదే కాలంలో వృద్ధి 2.8 శాతం. గడచిన ఆరు నెలల్లో మూడు నెలలు పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో అసలు వృద్ధిలేకపోగా, క్షీణతను నమోదు చేసుకుంది. -
పరిశ్రమల నత్తనడక...
♦ మార్చిలో కేవలం 0.1 శాతం వృద్ధి ♦ తయారీ, మైనింగ్ ఉత్పత్తుల క్షీణత ♦ గడచిన ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రేటు 2.4 శాతం న్యూఢిల్లీ: పరిశ్రమల ఉత్పత్తి గడచిన ఆర్థిక సంవత్సరం (2015-16, ఏప్రిల్-మార్చి) నత్తనడకన సాగింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 2.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2014-15లో ఈ రేటు 2.8 శాతం. గురువారం మార్చి గణాంకాలు వెళ్లడి కావడంతో... ఆర్థిక సంవత్సరం మొత్తం పనితీరు స్పష్టమైంది. ఒక్క మార్చిని చూస్తే... వృద్ధి రేటు కేవలం 0.1 శాతంగా నమోదయ్యింది. మూడు నెలలుగా క్షీణతలో ఉన్న వృద్ధి రేటు- ఫిబ్రవరిలో 2 శాతం వృద్ధికి మారి కొంత ఉత్సాహాన్ని ఇచ్చినా... మరుసటి నెలే ఈ ఉత్సాహం నీరుగారిపోయేలా ఫలితం నమోదు కావడం గమనార్హం. మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉన్న తయారీ రంగంతోపాటు మైనింగ్, భారీ పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ రంగాలు మార్చిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించాయి. 2015 మార్చిలో ఐఐపీ వృద్ధి రేటు 2.5 శాతం. మార్చిలో కీలక రంగాల పనితీరును వేర్వేరుగా చూస్తే... తయారీ: ఈ రంగంలో అసలు వృద్ధిరేటు నమోదుకాలేదు. 2015 మార్చిలో 2.7% ఉన్న వృద్ధిరేటు 2016లో మార్చిలో అసలు వృద్ధి లేకపోగా -1.2 శాతం క్షీణతలోకి జారిపోయింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 2.3 శాతం నుంచి 2 శాతానికి తగ్గింది. మైనింగ్: నెలలో ఈ రంగం కూడా 1.2 శాతం నుంచి వృద్ధి నుంచి -0.1 శాతం క్షీణతలోకి పడింది. అయితే వార్షికంగా వృద్ధి రేటు 1.4 శాతం నుంచి 2.2 శాతానికి ఎగసింది. విద్యుత్: మార్చిలో వృద్ధిరేటు 2 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగింది. అయితే వార్షికంగా మాత్రం ఈ రేటు 8.4 శాతం నుంచి 5.6 శాతానికి తగ్గింది. కేపిటల్ గూడ్స్: ఈ రంగం 2015 మార్చిలో 9.1 శాతం వృద్ధి సాధిస్తే.. 2016 మార్చిలో 15.4 శాతానికి పడింది. వార్షికంగాసైతం వృద్ధిరేటు 6.3 శాతం నుంచి 2.9 శాతానికి తగ్గింది. వినియోగ వస్తువులు: ఈ రంగం కొంచెం ఊరటనిచ్చింది. -0.6 శాతం క్షీణత నుంచి 0.4 శాతం వృద్ధికి మళ్లింది. వార్షికంగా వృద్ధి రేటు 3.5 శాతం నుంచి 3 శాతానికి పడింది. మళ్లీ రిటైల్ ద్రవ్యోల్బణం పైకి.. న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో మళ్లీ మూడు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది. 5.39 శాతంగా నమోదయ్యింది. జనవరిలో 5.69%గా ఉన్న ఈ రేటు అటు తర్వాత రెండు నెలల్లో 5.18%, 4.83%గా నమోదయ్యింది. ఆహార ధరలు పెరగడం తాజా సమీక్ష నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణం. నిత్యావసరారాల్లో పప్పుదినుసుల ధరలు భారీగా 34 శాతం ఎగశాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 10% పెరిగాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. పారిశ్రామిక ఉత్పత్తి తగ్గినా, ఆర్బీఐ తదుపరి రేట్ల కోతకు అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఇంకా తగ్గిన మార్కెట్
ఇంట్రాడేలో 7,500 పాయింట్ల దిగువకు నిఫ్టీ... ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడి(మార్కెట్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడ్డాయి) నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించడంతో స్టాక్ మార్కెట్లో మంగళవారం నష్టాలు తప్పలేదు. ఇంట్రాడేలో నిఫ్టీ కీలకమైన 7,500 పాయింట్ల దిగువకు పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 143 పాయింట్లు క్షీణించి 24,682 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 7,510 పాయింట్ల వద్ద ముగిశాయి సెన్సెక్స్కు ఇది 19 నెలల్లో అత్యంత కనిష్ట ముగింపు. చైనా వృద్ధిపై ఆందోళన, ముడి చమురు 12 ఏళ్ల కనిష్ట ధర అయిన 31 డాలర్ల దిగువకు పడిపోవడం వంటి ప్రతికూలాంశాల కారణంగా సెంటిమెంట్ బలహీనమైందని నిపుణులంటున్నారు. బ్యాంక్, రియల్టీ, లోహ, మౌలిక, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్యూ, ఐటీ రంగాల షేర్లు బాగా దెబ్బతిన్నాయి. ‘మోదీ’ లాభాలన్నీ హుష్కాకి: మంగళవారం క్షీణతతో కొత్త(నరేంద్ర మోదీ) ప్రభుత్వం కొలువుదీరిన (2014, మే 26) తర్వాత సెన్సెక్స్కు వచ్చిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. కాగా ఏడాది కాలంలో సెన్సెక్స్ 5,000 పాయింట్లు నష్టపోయింది. ఈ పతనంలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ వంటి ఆర్థిక కంపెనీల షేర్లు, ఎల్ అండ్ టీ, భెల్ వంటి క్యాపిటల్ గూడ్స్ షేర్ల వాటా సగానికి పైగా (2,804 పాయింట్లు) ఉంది. టీసీఎస్... ఎడాది కనిష్ట స్థాయికి: ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ ఏడాది కనిష్ట స్థాయి(రూ.2,301)కి పడిపోయింది. చివరకు 1.7 శాతం నష్టంతో రూ. 2324 వద్ద ముగిసింది. -
పడిపోయిన పారిశ్రామికోత్పత్తి
♦ నవంబర్లో మైనస్ 3.2% క్షీణత ♦ రికవరీ ఆశలపై నీళ్లు ♦ తయారీ, భారీ వస్తు ఉత్పత్తి విభాగాల పేలవ పనితీరు... న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి తీవ్ర నిరాశను మిగుల్చుతోంది. 2015 నవంబర్ నెలలో అసలు ఉత్పత్తిలో వృద్ధి లేకపోగా (2014 నవంబర్తో పోల్చిచూస్తే...) -3.2 శాతం క్షీణత నమోదయ్యింది. 2014 నవంబర్లో ఉత్పత్తి వృద్ధి 5.2 శాతంగా నమోదయ్యింది. ఇంతటి పేలవ పనితీరు గడచిన నాలుగేళ్లలో ఇదే తొలిసారి. అప్పట్లో అంటే అక్టోబర్ 2011లో ఐఐపీ క్షీణతలో -4.7 శాతంగా నమోదయ్యింది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం, అలాగే డిమాండ్కు ప్రతిబింబమైన భారీ వస్తు ఉత్పత్తులకు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ రంగం పేలవ పనితనం తాజా సమీక్ష నెల మొత్తం ఫలితాన్ని ప్రధానంగా ప్రభావితం చేసింది. కాగా ఆర్థిక సంవత్సరం నవంబర్ వరకూ గడచిన ఎనిమిది నెలల కాలంలో ఉత్పత్తి వృద్ధి రేటు 2.5 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగింది. కేంద్ర గణాంకాల కార్యాలయం మంగళవారం నాడు విడుదల చేసిన వివరాల ప్రకారం ముఖ్య రంగాలను చూస్తే... తయారీ: అసలు వృద్ధిలేకపోగా -4.4% క్షీణత నమోదయ్యింది. అయితే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మాత్రం రేటు 1.5% నుంచి 3.9%కి పెరిగింది. మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 17 గ్రూపులు క్షీణించాయి. మైనింగ్: ఉత్పత్తి 4 శాతం నుంచి 2.3 శాతానికి పడింది. ఎనిమిది నెలల కాలంలో కూడా వృద్ధి రేటు 2.5 శాతం నుంచి 2.1 శాతానికి తగ్గింది. విద్యుత్: నవంబర్లో వృద్ధి రేటు 10 శాతం నుంచి 0.7 శాతానికి పడగా, ఎనిమిది నెలల కాలంలో రేటు 10.7 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది. క్యాపిటల్ గూడ్స్: 2014 ఇదే నెలలో 7 శాతం వృద్ధి చెందగా, తాజా నెలలో 24.4% క్షీణించింది. వినియోగ వస్తువులు: ఈ రంగం మాత్రం -1.6 శాతం నుంచి తేరుకుని 1.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అయితే కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తులు 12.5 శాతం పెరిగితే, నాన్-డ్యూరబుల్స్ ఉత్పత్తి - 4.7 శాతం క్షీణించింది. పరిశ్రమ ఆందోళన తాజా ఫలితం పట్ల పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగాలను చూస్తే... పారిశ్రామిక ఉత్పత్తి రికవరీ రానున్న రోజుల్లో సవాలేనన్న విషయం స్పష్టమవుతోందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. పన్ను వ్యవస్థలో సరళీకరణలు, ప్రోత్సాహకాలు, వడ్డీరేట్ల తగ్గింపు ద్వారానే వృద్ధి అవకాశాలు మెరుగుపడతాయని పీహెచ్డీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ మహేశ్ గుప్తా పేర్కొన్నారు. -
ఇబ్బందుల్లోనే ఆర్థిక వ్యవస్థ
4 నెలల కనిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి * సెప్టెంబర్లో వృద్ధి రేటు 3.6 శాతం * అక్టోబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 5% న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు తొలగిపోలేదని గురువారం విడుదలైన తాజా పారిశ్రామిక ఉత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు పేర్కొంటున్నాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 5 శాతంగా నమోదయ్యింది. ఇక సెప్టెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 3.6 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేసుకుంది. తయారీ రంగంతోపాటు, కాస్మొటిక్స్ వంటి నాన్-డ్యూరబుల్స్ వినియోగ వస్తువుల విభాగం పేలవ పనితీరు ఐఐపీ గణాంకాలు అంతంతమాత్రంగా నమోదుకావడానికి కారణం. గడచిన నాలుగు నెలల్లో ఇంత దిగువస్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. ఆగస్టు నెలలో ఈ వృద్ధి రేటు 6.2 శాతం. కాగా గత ఏడాది సెప్టెంబర్లో మాత్రం ఈ రేటు 2.6 శాతంగా ఉంది. ఇదిలావుంటే... ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) చూస్తే... ఈ రేటు 2.9 శాతం నుంచి 4 శాతానికి పెరిగింది. జూన్ (4.2 శాతం), జూలై (4.1 శాతం), ఆగస్టు (6.2 శాతం) ఫలితాలు దీనికి కారణం. కీలక విభాగాల ఉత్పత్తి ఇలా... తయారీ: వార్షిక ప్రాతిపదికన సెప్టెంబర్లో వృద్ధి రేటు 2.7 శాతం నుంచి 2.6 శాతానికి పడింది. మొత్తం సూచీలో 75 శాతం వాటా ఉన్న ఈ రంగంలోని మొత్తం 22 గ్రూపుల్లో సగం మాత్రమే సెప్టెంబర్లో వృద్ధి రేటును నమోదుచేసుకున్నాయి. కాగా ఆరు నెలల్లో ఈ రేటు 2.2 శాతం నుంచి 4.2 శాతానికి ఎగసింది. మైనింగ్: ఈ రంగంలో వృద్ధి రేటు 0.1% నుంచి 3%కి ఎగసింది. ఆరు నెలల్లో మాత్రం ఈ రేటు 1.7 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది. విద్యుత్: సెప్టెంబర్లో ఈ రేటు 3.9 శాతం నుంచి 11.4 శాతానికి పెరిగింది. అయితే ఆరు నెలల్లో మాత్రం ఈ రేటు 10.4 శాతం నుంచి 4.5 శాతానికి దిగింది. కేపిటల్ గూడ్స్: పెట్టుబడులకు, డిమాండ్కు సూచికగా ఉన్న ఈ భారీ ఉత్పత్తుల విభాగంలో వృద్ధి 12.3 శాతం నుంచి 10.5 శాతానికి పడింది. ఆరు నెలల్లో వృద్ధి మాత్రం 6% నుంచి 7.9%కి పెరిగింది. వినియోగ వస్తువులు: మొత్తంగా వినియోగ వస్తువుల విభాగం - 4.0 శాతం క్షీణత నుంచి 0.6 శాతం వృద్ధికి మళ్లింది. ఇందులో ఒక విభాగమైన కన్జూమర్ డ్యూరబుల్స్లో వృద్ధి కూడా -11.1% క్షీణత నుంచి 8.4 శాతం వృద్ధి బాటకు మళ్లింది. కాగా కన్జూమర్ నాన్ డ్యూరబుల్ గూడ్స్ విభాగంలో అసలు వృద్ధి నమోదుకాకపోగా -4.6 శాతం క్షీణత నమోదయ్యింది. 2014 సెప్టెంబర్లో ఈ విభాగం వృద్ధి 1.3 శాతం. ఈ మూడు విభాగాలనూ ఆరు నెలల్లో చూస్తే... మొత్తం వినియోగ వస్తువుల విభాగం -2.4 శాతం క్షీణత నుంచి 2.4 శాతం వృద్ధికి మళ్లింది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం -12.5 శాతం క్షీణత నుంచి 7.6 శాతం వృద్ధికి మారింది. నాన్-డ్యూరబుల్స్ విభాగం 1.9 శాతం వృద్ధి నుంచి -0.9 శాతం క్షీణతకు పడిపోయింది. స్థూల ఆర్థిక రంగానికి సంబంధించి కఠిన సవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. పరిస్థితిని ఎదుర్కొనడానికి కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. సామాన్యుడిపై ధరల భారం అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5% పెరగ్గా, ఆగస్టులో ఇది 4.41 శాతం. తాజాగా ముగిసిన నెలలో ఆహార ఉత్పత్తులు, పానీ యాల విభాగంలో ధరల పెరుగుదల స్పీడ్ (రేటు) గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 5.34 శాతం పెరిగింది. పప్పు దినుసుల ధరలు మాత్రం భారీగా 42.20 శాతం ఎగశాయి. 4 శాతం పైన పెరిగిన ఆహార ఉత్పత్తులను చూస్తే... సుగంధ ద్రవ్యాలు (10 శాతం), ప్రిపేర్డ్ మీల్స్ (7 శాతం), మాంసం, చేపలు (5 శాతం), పాలు, పాల ఉత్పత్తులు (5 శాతం), చమురు, వెన్న పదార్థాలు (5 శాతం), ఆల్కాహాలేతర పానీయాలు (4 శాతం) ఉన్నాయి. కూరగాయల ధరలు 2.5 శాతం ఎగశాయి. చక్కెర, తత్సంబంధ ఉత్పత్తుల ధరలు మాత్రం 10 శాతం పైగా తగ్గాయి. సీపీఐలో మిగిలిన విభాగాలు చూస్తే... పాన్, పొగాకు ఇతర మత్తు ప్రేరిత ఉత్పత్తుల ధరలు 10 శాతం పెరిగాయి. దుస్తులు, పాదరక్షల ధరలు 5.62 శాతం, హౌసింగ్ 5 శాతం పెరగ్గా, ఇంధన, విద్యుత్ విభాగంలో రేటు 5 శాతం పైగా ఎగసింది. 2016 జనవరి నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 5.8 శాతం. -
వృద్ధి రికవరీ సంకేతాలివిగో..!
భారత ఆర్థిక రంగానికి సంబంధించి తాజాగా వెలువడిన గణాంకాలు ‘వ్యవస్థలో రికవరీ’ని సూచిస్తున్నాయి. ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి మూడేళ్ల గరిష్టస్థాయిని నమోదుచేసుకుంటే... సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.41 శాతంగా ఉంది. అయితే ఈ రేటు ఆగస్టులో 3.74 శాతం. పండుగల సీజన్, వ్యవస్థలో వినియోగ వస్తువులకు డిమాండ్ పెరగడం వంటి అంశాలు రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్ప పెరుగుదలకు దారితీసినా... ఈ రేటు రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత స్థాయిలో ఉండడం హర్షణీయమని నిపుణులు పేర్కొంటున్నారు. 2016 జనవరి నాటికి 5.8 శాతం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ అంచనావేస్తోంది. ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి జోరు.. * 6.4 శాతం వృద్ధి రేటు * మూడేళ్ల గరిష్ట స్థాయి * తయారీ, మైనింగ్, కేపిటల్ గూడ్స్ చక్కటి పనితీరు * ఆర్బీఐ అంచనా స్థాయిలో రిటైల్ ద్రవ్యోల్బణం పరిశ్రమలు హ్యాపీ... పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టులో మంచి పురోగతి సాధించింది. 2014 ఆగస్టు నెల విలువతో పోల్చిచూస్తే... 2015 ఆగస్టులో ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 6.4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2014 ఆగస్టులో ఈ రేటు కేవలం 0.5 శాతం. 2012 అక్టోబర్ తరువాత (అప్పట్లో 8.4 శాతం) ఇంత స్థాయిలో (ప్రస్తుత 6.4 శాతం) వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం, అలాగే మైనింగ్, డిమాండ్కు ప్రతిబింబమైన భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి విభాగం కేపిటల్ గూడ్స్ రంగాలు చక్కటి పనితనాన్ని ప్రదర్శించడం మొత్తం ఉత్పత్తికి మంచి ఊపును ఇచ్చింది. కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారం విడుదల చేసిన గణాంకాలను కీలక రంగాల వారీగా పరిశీలిస్తే... తయారీ: వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదయ్యింది. 2014 ఆగస్టులో ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా -1.1 శాతం క్షీణతలో ఉంది. ఇక ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఈ రంగం వృద్ధి రేటు 2.0 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. కేపిటల్ గూడ్స్: పెట్టుబడులకు సంకేతమయిన ఈ రంగంలో వృద్ధి రేటు భారీగా 21.8 శాతంగా నమోదయ్యింది. 2014లో ఈ రంగం అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా 10 శాతం క్షీణతలో ఉంది. ఆర్థిక సంవత్సరం గడచిన ఐదు నెలల్లో ఈ రేటు 4.8 శాతం నుంచి 7.4 శాతానికి ఎగసింది. మైనింగ్: వృద్ధి రేటు 1.2% నుంచి 3.8 శాతానికి ఎగసింది. ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లో ఈ రేటు 2% నుంచి 1.2%కి పడింది. విద్యుత్: ఈ రంగంలో ఉత్పత్తి నిరాశ కలిగిస్తోంది. ఈ రేటు ఆగస్టులో 12.9 శాతం నుంచి 5.6 శాతానికి పడిపోతే ఐదు నెలల్లో 11.7 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గింది. కన్జూమర్ గూడ్స్: ఆగస్టులో 6.2 శాతం క్షీణ (మైనస్) బాట నుంచి 6.8 శాతం వృద్ధి బాటకు మళ్లింది. ఇందులో డ్యూరబుల్స్ గూడ్స్ విభాగం కూడా 15 శాతం క్షీణ(-) బాట నుంచి 17 శాతం వృద్ధి బాట పట్టింది. నాన్-డ్యూరబుల్స్ విభాగంలో యథాయథంగా 0.4 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. ఈ మూడు కేటగిరీలనూ ఐదు నెలల కాలంలో చూస్తే... కన్జూమర్ గూడ్స్ 4.3 శాతం క్షీణత నుంచి 3 శాతం వృద్ధికి మళ్లింది. డ్యూరబుల్స్12.8 శాతం క్షీణత నుంచి 7.7 శాతం వృద్ధికి చేరింది. నాన్-డ్యూరబుల్స్ కేటగిరీలో మాత్రం వృద్ధి రేటు 1.9 శాతం నుంచి 0.1 శాతానికి తగ్గింది. ఐదు నెలల్లో... కాగా ఐఐపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో 3% నుంచి 4.1%కి పెరిగింది. చర్యలు సత్ఫలితాలు: పరిశ్రమలు ప్రభుత్వ చర్యలతో తయారీ రంగం వేగం పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయని, రానున్న కాలంలో ఈ వేగం మరింత పుంజుకునే అవకాశం ఉందని ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఏ దిదార్ సింగ్ తెలిపారు. అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థకు శుభవార్తలు: కేంద్రం ఆర్థిక వ్యవస్థకు శుభవార్తలు అందుతున్నట్లు తాజా గణాంకాలపై చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. భారీగా పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి, తగిన స్థాయిలో ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, 36 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. రిటైల్ ద్రవ్యోల్బణం 4.41 శాతం సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.41 శాతంగా నమోదయ్యింది. ఆగస్టు రేటు కన్నా పెరగడానికి పానీయాలు, పప్పు దినుసుల ధరలు పెరగడం ప్రధాన కారణం. అయితే 2014 ఆగస్టు రేటు కన్నా (5.63 శాతం) 2015 ఆగస్టు రేటు తక్కువ కావడం గమనార్హం. పప్పు ధాన్యాల ధరలు వార్షికంగా చూస్తే... 30 శాతం ఎగశాయి. విభాగాల వారీగా చూస్తే... ఆహారం- పానీయాల ద్రవ్యోల్బణం రేటు 4.29 శాతం ఎగసింది. ఈ విభాగంలో ప్రత్యేకించి కూరగాయల ధరలు అసలు పెరగలేదు. దుస్తులు-పాదరక్షల విభాగంలో రేటు 6 శాతంగా ఉంది. గృహ వ్యయాలకు సంబంధించి ద్రవ్యోల్బణం 4.74 శాతంగా ఉంది. ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 5.42 శాతం. -
తయారీ రంగం జోరు..
జూన్లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.8 శాతం ♦ నాలుగు నెలల గరిష్ట స్థాయి ♦ తయారీ, వినియోగ వస్తువుల విభాగం దన్ను ♦ మిగిలిన పరిశ్రమలు అన్నీ నిరాశే! న్యూఢిల్లీ : పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) జూన్లో ఫర్వాలేదనిపించింది. ఉత్పత్తి వృద్ధి రేటు 3.8 శాతంగా నమోదయ్యింది. గడచిన 4 నెలల్లో ఈ స్థాయిలో ఉత్పత్తి వృద్ధి రేటు నమోదుకాలేదు. తయారీ రంగం పురోగతి మొత్తం సూచీపై సానుకూల ప్రభావాన్ని చూపించింది. అయితే మిగిలిన రంగాలు పెద్దగా పురోగతి సాధించకపోవడం గమనార్హం. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... తయారీ : మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం ఉత్పత్తి 2014 జూన్ నెలతో పోల్చితే 2015 జూన్లో 4.6 శాతం ఎగసింది. 2014 జూన్ నెలలో ఈ రేటు 2.9 శాతం. కాగా ఈ విభాగంలోని మొత్తం 22 రంగాల్లో 16 సానుకూల ఫలితాలను అందజేశాయి మైనింగ్ : ఈ రంగంలో వృద్ధి అసలు లేకపోగా, - 0.3 శాతం క్షీణించింది. గత ఏడాది జూన్లో ఈ రేటు 4.8 శాతం విద్యుత్ : వృద్ధి రేటు 15.7 శాతం నుంచి 1.3 శాతానికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ : డిమాండ్, పెట్టుబడులకు ప్రతిబింబమైన భారీ యంత్రపరికరాల తయారీకి సంబంధించి క్యాపిటల్ గూడ్స్ విభాగంలో కూడా అసలు వృద్ధి లేకపోగా -3.6 శాతం క్షీణించింది. 2014 జూన్లో ఈ రంగం వృద్ధి రేటు 23.3 శాతం. వినియోగ వస్తువులు : ఉత్పత్తి క్షీణ బాట నుంచి వృద్ధికి మారింది. -8.8 శాతం క్షీణత నుంచి 6.6 శాతం వృద్ధికి ఎగసింది. త్రైమాసికంగా చూస్తే... క్యూ1లో ఐఐపీ 4.5% నుంచి 3.2%కి తగ్గింది. విభాగాల వారీగా చూస్తే... తయారీ రంగం వృద్ధి రేటు 3.9% నుంచి 3.6 శాతానికి పడింది. మైనిం గ్లో ఈ రేటు 2.9 శాతం నుంచి 0.7 శాతానికి పడింది. విద్యుత్ ఉత్పత్తి 11.3%నుంచి 2.3 శాతానికి దిగింది. క్యాపిటల్ గూడ్స్ విభాగం వృద్ధి 13.7% నుంచి 1.5%కి పడిపోయింది. -
ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతపై ఉత్కంఠ!
- నేడు ఆర్బీఐ పాలసీ సమీక్ష న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం మూడవ త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరపనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో నిర్దేశిత 5.4 శాతం స్థాయిలో ఉండడం.. టోకు ద్రవ్యోల్బణం కొన్ని నెలలుగా అసలు పెరక్కపోగా..క్షీణతలో కొనసాగుతుండడం, పారిశ్రామిక ఉత్పత్తి మందగమన ధోరణి, బ్యాంకింగ్లో రుణ వృద్ధి రేటు తగిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో మరోసారి రెపో రేటును ఆర్బీఐ తగ్గించాలన్న డిమాండ్ తీవ్రంగా ఉంది. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఈ రేటు 7.25 శాతంగా ఉంది. ఈ ఏడాది 75 బేసిస్ పాయింట్లను ఆర్బీఐ తగ్గిస్తే... ఇందులో సగం ప్రయోజనాన్ని పలు బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాయి. కాగా మంగళవారం ఆర్బీఐ ‘రెపో’ రేటుపై తీసుకునే నిర్ణయంపై మార్కెట్ విశ్లేషకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తగ్గకపోవచ్చు... బీఓఎఫ్ఏ-ఎంఎల్: 4వ తేదీన ఆర్బీఐ రెపో రేటును మరింత తగ్గించకపోవచ్చు. దేశంలోని నెలకొన్న వర్షాభావ పరిస్థితులు.. దీనితో ద్రవ్యోల్బణం కట్టు తప్పే అవకాశాలు మా అంచనాలకు కారణం. అయితే 2016 తొలి నెలల్లో రెపో రేటును బ్యాంక్ అరశాతం తగ్గించే అవకాశం ఉందని పేర్కొంది. డీబీఎస్: డాలర్ విలువ బలపడుతుండటం, అమెరికా వడ్డీరేట్ల పెంపు అవకాశాల వంటివి ఆర్బీఐ నిర్ణయంపై ప్రభావితం చూపే అవకాశం ఉంది. మరోపక్క, వర్షాభావ పరిస్థితులూ దేశంలో పొంచి ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో ఆర్బీఐ ఆగస్టు 4 పాలసీ సమీక్ష సందర్భంగా రెపో రేటును తగ్గించకపోవచ్చు. కోతకు అవకాశం... ఇక్రా: బ్యాంకులు మరింతగా రుణరేటు తగ్గించాలంటే... ఆర్బీఐ కూడా మరింతగా రెపోరేటును తగ్గించాల్సి ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టడి నేపథ్యంలో ఆర్బీఐ రుణ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉంది. హెచ్డీఎఫ్సీ: ఆర్బీఐ రేపటి సమావేశంలో రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకుంటుందో లేదో చెప్పలేము. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో రేట్లు 25-50 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం వుంది. మూడీస్: ఇంకా వర్షాకాలం ముగిసిపోలేదు. సగటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కమోడిటీ ధరలు తక్కువగానే ఉన్నాయి. దీంతో మంగళవారం రెపో రేటు తగ్గింపునకు అనుకూలంగానే ఆర్బీఐ నిర్ణయం తీసుకునే వీలుంది. -
తయారీ రంగం దన్ను!
భారత్ పారిశ్రామిక ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో ఊరటనిచ్చింది. పారి శ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారిత కర్మాగారాల ఉత్పత్తి వృద్ధి రేటు ఏప్రిల్లో 4.1 శాతంగా నమోదయ్యింది. ఇది రెండు నెలల గరిష్ట స్థాయి. మొత్తం సూచీలో దాదాపు 75 శాతంగా ఉన్న తయారీ రంగం పురోగతి మొత్తం సూచీని తగిన స్థాయిలో ఉంచింది. అయితే డిమాండ్కు సూచిక అయిన భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి విభాగం వృద్ధి వేగం తగ్గింది. ఇదిలావుండగా, 2014 ఏప్రిల్లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 3.7 శాతం. 2015 మార్చికి సంబంధించి తొలి గణాంకం 2.1 శాతాన్ని 2.5 శాతానికి కేంద్ర గణాంకాల కార్యాలయం సవరించింది. తయారీ రంగం ఏప్రిల్లో 5.1 శాతం వృద్ధి రేటును సాధించింది. 2014 ఇదే నెలలో ఈ రేటు 3%. తయారీ రంగానికి సంబంధించి మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానూకూల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. -
తయారీ రంగం దన్ను!
- ఏప్రిల్లో పారిశ్రామిక ఉత్పత్తి ఊరట - వృద్ధి రేటు 4.1 శాతం న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో ఊరటనిచ్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారిత కర్మాగారాల ఉత్పత్తి వృద్ధి రేటు ఏప్రిల్లో 4.1 శాతంగా నమోదయ్యింది. ఇది రెండు నెలల గరిష్ట స్థాయి. మొత్తం సూచీలో దాదాపు 75 శాతంగా ఉన్న తయారీ రంగం పురోగతి మొత్తం సూచీని తగిన స్థాయిలో ఉంచింది. అయితే డిమాండ్కు సూచిక అయిన భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి విభాగం వృద్ధి వేగం తగ్గింది. ఇదిలావుండగా, 2014 ఏప్రిల్లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 3.7%. 2015 మార్చికి సంబంధించి తొలి గణాంకం 2.1 శాతాన్ని 2.5 శాతానికి కేంద్రం సవరించింది. ప్రభుత్వం శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ► తయారీ రంగం ఏప్రిల్లో 5.1 శాతం వృద్ధి రేటును సాధించింది. 2014 ఇదే నెలలో ఈ రేటు 3 శాతం. తయారీ రంగానికి సంబంధించి మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 16 సానూకూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. ► డిమాండ్, ఆర్థిక క్రియాశీలతకు ప్రధాన సూచిక అయిన భారీ యంత్రపరికరాల ఉత్పత్తికి సంబంధించి క్యాపిటల్ గూడ్స్ రంగం వృద్ధి రేటు 13.4 శాతం నుంచి 11.1 శాతానికి తగ్గింది. ► మైనింగ్ రంగం వృద్ధి రేటు కూడా 1.7 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► కాగా విద్యుత్ విభాగం మాత్రం 11.9 శాతం వృద్ధి బాట నుంచి 0.5 శాతం క్షీణతలోకి జారింది. ► మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ 20.6% వృద్ధిని నమోదు. ► కలప, తత్సంబంధ ఉత్పత్తుల వృద్ధి 16.2 శాతం పురోగతి. ► ఆఫీస్, అకౌంటింగ్, కంప్యూటింగ్ మిషనరీ భారీగా 36.5 శాతం క్షీణించింది. ► రేడియో, టీవీ, కమ్యూనికేషన్ పరికరాల ఉత్పత్తిలో కూడా అసలు వృద్ధిలేకపోగా 24 శాతం క్షీణించింది. ► పొగాకు ఉత్పత్తులు 26.7 శాతం క్షీణించాయి. ► వినియోగ వస్తువుల రంగం వృద్ధి కేవలం 1.3 శాతం.. ఇంకా మంచిరోజులు రావాలి: పరిశ్రమలు పరిశ్రమల ఉత్పత్తి వృద్ధి రేటు 4.1 శాతంగా నమోదుకావడం హర్షనీయ పరిణామమేనని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే పూర్తి స్థాయిలో మంచిరోజులు ఇంకా రావాల్సి ఉందని కూడా వారు వ్యాఖ్యానించారు. ఎవరేమన్నారంటే... అంచనాలకన్నా బాగున్నాయి మార్కెట్ అంచనాలకన్నా అధికంగానే ఈ గణాంకాలు ఉన్నాయి. పటిష్ట రికవరీ జరుగుతోందనడానికి ఇది సంకేతమే. ప్రభుత్వం తీసుకుంటున్న చొరవల వల్ల రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఆశాజనకంగా మారుతుందని విశ్వసిస్తున్నాం. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్ మరింత పటిష్టం కావాలి... ఆర్బీఐ కఠిన పరపతి విధాన సరళీకరణ వృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలప్రదానికి మరింత దోహదపడతాయని భావిస్తున్నా. ప్రస్తుతానికి వాస్తవరీతిన మంచి రోజులు ఇంకా రాలేదన్నది మా అభిప్రాయం. - రాణా కపూర్, అసోచామ్ -
పారిశ్రామిక ఉత్పత్తి... జోరు
ఫిబ్రవరిలో ఐఐపీ 5 శాతం వృద్ధి 9 నెలల గరిష్ట స్థాయి తయారీ, మైనింగ్ , కేపిటల్ గూడ్స్ దన్ను పారిశ్రామిక పునరుత్తేజానికి సంకేతం! న్యూఢిల్లీ: ఆర్థిక వేత్తలు, విధాన నిర్ణేతలకు ఉత్సాహాన్నిస్తూ ఫిబ్రవరి పారిశ్రామిక ఉత్పత్తి జోరందుకుంది. 2014 ఫిబ్రవరితో పోల్చితే 2015 ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి 5 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఇది తొమ్మిది నెలల గరిష్ట స్థాయి. ఈ నెలలో తయారీ, మైనింగ్, కేపిటల్ గూడ్స్ రంగాలు మంచి పనితీరు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిపై సానుకూల ప్రభావం చూపింది. ఫిబ్రవరి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసింది. 2014 ఫిబ్రవరిలో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా (అంతక్రితం ఏడాది అంటే 2013 ఫిబ్రవరితో పోల్చితే) 2 శాతం క్షీణత (మైనస్)లో ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 5 శాతం వృద్ధి కనపర్చడం విశేషం. జనవరి వృద్ధి పెంపు... మరోవైపు 2015 జనవరి ఐఐపీ 2.6 శాతం ప్రాథమిక వృద్ధి గణాంకాలను 2.77 శాతానికి పెంచారు. కీలక రంగాల తీరు... తయారీ: మొత్తం సూచీలో 75 శాతం వాటా కలిగిన ఈ రంగం వృద్ధి రేటు ఫిబ్రవరిలో 5.2 శాతంగా ఉంది. 2014 ఇదే నెలలో ఈ రంగంలో అసలు వృద్ధి లేకపోగా 3.9 శాతం క్షీణించింది. 11నెలల కాలంలో చూసినా ఈ రంగం 0.7 శాతం క్షీణత నుంచి 2.2 శాతం వృద్ధి బాటకు మళ్లింది. తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక విభాగాల్లో.... 16 ఫిబ్రవరిలో సానుకూల వృద్ధి రేటును నమోదుచేసుకున్నాయి. మైనింగ్: ఫిబ్రవరిలో ఈ రంగం వృద్ధి రేటు 2.3 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగింది. 11 నెలల కాలంలో 0.7 శాతం క్షీణ రేటు నుంచి 1.5 శాతం వృద్ధి బాటకు ఎగసింది. ► కేపిటల్ గూడ్స్: డిమాండ్ బాగుందనడానికి సంకేతంగా, భారీ వస్తువుల ఉత్పత్తికి సూచికగా ఉన్న ఈ రంగం అత్యధికంగా 8.8 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. 2014 ఇదే నెలలో ఈ రంగం భారీగా 17.6 శాతం క్షీణతలో ఉంది. 11 నెలల కాలంలో సైతం ఈ రంగం 2.6 శాతం క్షీణ రేటు నుంచి 6 శాతం వృద్ధి రేటుకు మారింది. ► విద్యుత్: ఇక కీలకమైన విద్యుత్ (ఉత్పత్తి) రంగం వృద్ధి రేటు ఫిబ్రవరిలో 11.5 % నుంచి 5.9 శాతానికి తగ్గింది. 11 నెలల్లో మాత్రం విద్యుత్ ఉత్పత్తి వృద్ధి రేటు 6.2% నుంచి 9.1 శాతానికి ఎగసింది. ► వినియోగ వస్తువులు: ఈ విభాగంలో నెలవారీగా వృద్ధి రేటు 5.2 శాతం క్షీణ రేటు నుంచి 5.2 శాతం వృద్ధికి మారింది. 11 నెలల కాలంలో చూస్తే మాత్రం ఈ విభాగం క్షీణతలోనే ఉంది. పైగా ఈ మైనస్ రేటు 2.9 శాతం నుంచి 3.7 శాతానికి పెరిగింది. ► దీర్ఘకాలం వినియోగానికి ఉద్దేశించిన వినియోగ వస్తువుల ఉత్పత్తి ఫిబ్రవరిలో క్షీణతలోనే ఉంది. అయితే క్షీణత (మైనస్) రేటు 9.8 శాతం నుంచి 3.4 శాతానికి తగ్గింది. మొత్తంగా ఈ విభాగం ఇంకా విధాన నిర్ణేతలకు నిరాశ కలిగించే అంశం. ►ఇదే నెలలో స్వల్పకాల వినియోగానికి ఉద్ధేశించిన ఉత్పత్తుల వృద్ధి రేటు మాత్రం భారీగా 10.7 శాతం పెరిగింది. 2014 ఇదే నెలలో ఈ రేటు మైనస్లో 2 శాతంగా (క్షీణత) ఉంది. 11 నెలల్లో... 2014-15 ఆర్థిక సంవత్సరం 11 నెలల కాలంలో (ఏప్రిల్-ఫిబ్రవరి) ఐఐపీ వృద్ధి 2.8 శాతంగా ఉంది. 2013-14 ఇదే కాలంలో అసలు వృద్ధి లేకపోగా 0.1 శాతం క్షీణత (మైనస్)లో ఉంది. పెట్టుబడులు పెరుగుతున్నాయ్... డిమాండ్కు సంకేతమైన కేపిటల్ గూడ్స్ మంచి పనితీరు పారిశ్రామిక రంగం మెరుగుపడిందనడానికి సంకేతం. కొత్త వ్యాపారం, విదేశీ ఆర్డర్ల ప్రోత్సాహకర ధోరణికి ఇది సంకేతం - సుమిత్ మజుందార్, సీఐఐ దేశాభివృద్ధికి బాట... వ్యాపార వాతావరణం మెరుగుపడుతోందనడానికి ఈ గణాంకాలు చక్కటి ఉదాహరణ. ప్రత్యేకించి కేపిటల్ రంగాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. ఈ క్రమం దేశాభివృద్ధికి సైతం దోహదపడుతుంది - అలోక్ శ్రీరామ్, పీహెచ్డీ చాంబర్ విశ్వాసం ఇంకా కుదరాలి... గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వృద్ధి పునరుత్తేజం అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే వినియోగ వస్తువుల విభాగంలో ఇంకా నిరాశ నెలకొంది. ఈ రంగం పూర్తిగా పుంజుకుంటేనే వృద్ధిపై పూర్తి విశ్వాసం - రాణా కపూర్, అసోచామ్ రుణ రేట్లు తగ్గితేనే..! వృద్ధి క్రమం, పురోగతి సాధించడానికి, పెట్టుబడులు పెరగడానికి, డిమాండ్ మెరుగుపడ్డానికి వడ్డీరేట్లు మరింత తగ్గాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో వృద్ధిని పరుగులు పెట్టించడానికి తగిన చర్యలను తీసుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టాలి - దిదార్ సింగ్, ఫిక్కీ -
పరిశ్రమలు కుదేల్!
⇒ అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి 4.2% క్షీణత ⇒తయారీ, క్యాపిటల్ గూడ్స్,వినియోగ ఉత్పత్తుల రంగాలు పేలవం ⇒రేట్ల కోత తప్పదంటున్న పారిశ్రామిక రంగం న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్లో దారుణ ఫలితాన్ని నమోదుచేసుకుంది. 2013 అక్టోబర్లో నమోదయిన విలువతో పోల్చి, 2014 అక్టోబర్ విలువను చూస్తే, అసలు వృద్ధి లేకపోగా క్షీణత నమోదు చేసుకుంది. ఈ క్షీణత రేటు -4.2 శాతంగా ఉంది. ఇది రెండేళ్ల కనిష్ట స్థాయి. ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారిత గణాంకాలను విడుదల చేసింది. వడ్డీరేట్ల కోతకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం ఇక తప్పదని, తద్వారానే పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి సాధ్యమవుతుందని ఆయా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతంగా ఉన్న ఐఐపీ సెప్టెంబర్లో కనీసం 2.8 శాతం వృద్ధినైనా సాధించింది. అయితే ఆ మరుసటి నెలలోనే ఏకంగా క్షీణతలోకి జారిపోవడం పారిశ్రామిక, పాలనా వర్గాలను నిరాశకు గురిచేసింది. అక్టోబర్లో తయారీ రంగంసహా, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సంబంధించి క్యాపిటల్ గూడ్స్, వినియోగ ఉత్పత్తుల విభాగం పేలవ పనితీరును నమోదుచేసుకున్నాయి. ఆయా రంగాల పనితీరును పరిశీలిస్తే... ⇒మొత్తం ఐఐపీ సూచీలో 75 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో అక్టోబర్లో అసలు వృద్ధి లేకపోగా -7.6 క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఈ క్షీణత 1.3 శాతమే. ఈ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక గ్రూపుల్లో 16 అక్టోబర్లో ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి. కాగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 7 నెలల కాలంలో చూస్తే మాత్రం వృద్ధి రేటు కొంత మెరుగుదలతో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే - 0.1 శాతం క్షీణత నుంచి 0.7 శాతం వృద్ధికి చేరింది. ⇒క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి గత ఏడాది అక్టోబర్లో కనీసం 2.5 శాతం వృద్ధిని సాధిస్తే, ఈ ఏడాది ఇదే నెలలో ఈ రేటు ఏకంగా -2.3 క్షీణతలోకి జారిపోయింది. అయితే 7 నెలల కాలంలో ఈ రంగం 0.2 శాతం క్షీణత నుంచి 4.8 శాతం వృద్ధికి మళ్లింది. ⇒ వినియోగ వస్తువుల ఉత్పత్తిలో క్షీణత - 5 శాతం నుంచి మరింతగా -18.6 శాతానికి జారింది. ఏడు నెలల కాలంలో కూడా ఈ క్షీణత రేటు -1.7 శాతం నుంచి -6.3 శాతానికి దిగింది. ⇒విద్యుత్ ఉత్పత్తి మాత్రం మంచి పురోగతి సాధించింది. వృద్ధి రేటు 1.3 శాతం నుంచి ఈ రంగం 13.3 శాతం వృద్ధికి పురోగమించింది. ఏడు నెలల కాలంలో సైతం ఈ రేటు 5.3 శాతం నుంచి 10.7 శాతానికి ఎగసింది. ⇒మైనింగ్ రంగంలో కూడా మంచి పనితీరుతో -2.9 శాతం క్షీణత నుంచి 5.2 శాతం వృద్ధి బాటకు మళ్లింది. ఏడు నెలల్లో కూడా -2.6 క్షీణత రేటు 2.4 శాతం వృద్ధికి మళ్లింది. 7 నెలల్లో...: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు 0.2 శాతం నుంచి 1.9 శాతానికి మెరుగ్గా ఉంది. అయితే రానున్న నెలల గణాంకాల్లో తాజా క్షీణ ధోరణే పునరావృతం అయితే ఈ స్వల్ప వృద్ధి రేటు సైతం కరిగిపోయే అవకాశం ఉంది. -
కీలక పరిశ్రమల జోరు..
అక్టోబర్లో 6.3% వృద్ధి 4 నెలల గరిష్టం న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ అక్టోబర్లో మంచి పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదయ్యింది. బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ రంగాల సానుకూల తీరు మొత్తం గ్రూప్ను 4 నెలల గరిష్ట స్థాయిలో నిలబెట్టింది. గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ అసలు వృద్ధినే నమోదుచేసుకోకపోగా (2012 అక్టోబర్తో పోల్చితే) క్షీణతలో -0.1 శాతంగా ఉంది. 2014 సెప్టెంబర్ నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 1.9 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది పరిశ్రమల వాటా 38 శాతం. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాలు 2013 అక్టోబర్తో పోల్చితే ఇలా ఉన్నాయి... బొగ్గు: 3.5 క్షీణత (-) నుంచి 16.2 శాతం వృద్ధి బాటకు చేరింది. ముడి చమురు: ఈ రంగం కూడా -0.6% క్షీణత నుంచి 1% వృద్ధికి మళ్లింది. రిఫైనరీ ఉత్పత్తులు: ఈ రంగం -5% క్షీణత నుంచి 4.2% వృద్ధి రేటుకు చేరింది. విద్యుత్: వృద్ధి రేటు 1.3 శాతం నుంచి 13.2 శాతానికి ఎగసింది. ఉక్కు: ఈ రంగం వృద్ధిలోనే ఉన్నా, ఈ రేటు 5.8% నుంచి 2.3%కి పడింది. సహజ వాయువు: క్షీణత -13.5 శాతం నుంచి -4.2 శాతానికి తగ్గింది. ఎరువులు: 4.1 శాతం వృద్ధి బాట నుంచి -7 శాతం క్షీణతలోకి జారిపోయింది. సిమెంట్: ఈ పరిశ్రమ కూడా 0.9 శాతం వృద్ధి నుంచి -1.0 క్షీణతలోని దిగింది. 7 నెలల్లో వ్యవధికి ఇలా... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2014-15) ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఎనిమిది పరిశ్రమల వృద్ధి రేటు స్వల్పంగా పెరిగింది. 2013-14 ఇదే కాలంతో పోల్చితే 4.2 శాతం నుంచి 4.3 శాతానికి చేరింది. -
స్పీడ్లేని పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి 2014 ఆగస్టులో నిరాశపరిచింది. 2013 ఆగస్టుతో పోల్చితే కేవలం 0.4 శాతం వృద్ధి నమోదయ్యింది. 2012 ఆగస్టుతో పోల్చి 2013 ఆగస్టులో కూడా ఇదే స్థాయిలో వృద్ధి నమోదుకావడం విశేషం. తాజా వృద్ధి రేటు ఐదు నెలల కనిష్ట స్థాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలను విడుదల చేసింది. పటిష్ట సంస్కరణలతోనే పారిశ్రామిక రంగానికి, డిమాండ్కు పునరుత్తేజం సాధ్యమని, తక్షణం ఈ దిశలో కేంద్ర చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు డిమాండ్ చేశాయి. తయారీ, వినియోగ వస్తువుల విభాగాల్లో అసలు వృద్ధి లేకపోగా క్షీణత (మైనెస్) నమోదుకావడం మొత్తం సూచీపై ప్రతికూలత చూపింది. కాగా 2014 జూలైలో వృద్ధి 0.5 శాతమని తొలుత అంచనా వేసినప్పటికీ దీనిని సైతం 0.41 శాతంగా తగ్గించడం మరో నిరాశాపూరిత అంశం. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు నెలల కాలంలో (2014-15, ఏప్రిల్-ఆగస్టు) ఐఐపీ వృద్ధి రేటు 2.8 శాతం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో సైతం వృద్ధి రేటు ఇదే విధంగా ఉంది. మొత్తం సూచీలో 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం ఆగస్టులో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా 1.4 శాతం క్షీణించింది. ఈ క్షీణత 2013 కన్నా తీవ్రంగా ఉండడం (-0.2 శాతం) విచారకరం. ప్రాజెక్టుల అమలు వేగం పెరగాలి ఆమోదిత ప్రాజెక్టుల అమలు వేగం పెరగాలి. బొగ్గు, మైనింగ్ రంగాల్లో పోటీ పూర్వక మార్కెట్ నెలకొనాలి. మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల్లో విధాన ప్రకటనలు, కార్మిక సంస్కరణలు వృద్ధిని మెరుగు పరుస్తాయని భావిస్తున్నాం. - చంద్రజిత్ బెనర్జీ, సెక్రటరీ జనరల్, సీఐఐ ‘తయారీ’కి కష్టకాలం పోలేదు తయారీ రంగానికి కష్టకాలం తొలగిపోలేదన్న విషయాన్ని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇది చాలా విచారకరం. దీనితోపాటు వినియోగ వస్తువుల రంగం, క్యాపిటల్ గూడ్స్ప్రతికూలతలోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా రంగాల స్పీడ్కు పటిష్ట సంస్కరణలు అవసరం. - ఏ దిదార్ సింగ్, సెక్రటరీ జనరల్, ఫిక్కీ -
పరిశ్రమలు మైనస్
ఆర్థిక వ్యవస్థకు కష్టకాలం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ఒకేరోజు విడుదలైన రెండు కీలక గణాంకాలు దీనికి అద్దం పడుతున్నాయి. మార్చి నెలలో ఎగుమతులు క్షీణించడంతో పాటు 2013-14 పూర్తి ఏడాదికి ప్రభుత్వం నిర్ధేశించుకున్న ఎగుమతుల లక్ష్యాన్ని చేరకపోవడం, ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి రంగం మళ్లీ తిరోగమనంలోకి జారిపోవడం మందగమనం తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగం తీవ్ర ఆటుపోట్లతో కుదేలవుతోంది. మినుకుమినుకుమంటూ కొద్దిగా ఆశలు రేపడం... అంతలోనే తిరోగమనంలోకి జారిపోతుండటంతో పారిశ్రామిక వర్గాలకు ఏంచేయాలో పాలుపోని పరిస్థితి. ఈ ఏడాది జనవరిలో వృద్ధిబాటలోకి వచ్చిన పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ).. ఫిబ్రవరిలో మళ్లీ మైనస్లోకి కుంగిపోయింది. 1.9 శాతం క్షీణించింది. ప్రధానంగా తయారీ, యంత్ర పరికరాల రంగాలు అత్యంత పేలవ పనితీరు పారిశ్రామికోత్పత్తిని తూట్లుపొడుస్తోంది. క్రితం ఏడాది ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి 0.6 శాతంగా నమోదైంది. కేంద్రీయ గణాంకాల సంస్థ(సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలను వెల్లడించింది. మళ్లీ ఉసూరుమనిపించింది... గతేడాది అక్టోబర్ నుంచి పారిశ్రామికోత్పత్తి తిరోగమనం(మైనస్)లోకి జారిపోవడం మొదలైంది. అక్టోబర్లో 1.2% కుంగిన ఐఐపీ.. డిసెంబర్ వరకూ మైనస్లోనే కొనసాగింది. తిరిగి జనవరిలో కాస్త వృద్ధిలోకి వచ్చినట్లే వచ్చి.... మళ్లీ ఈ ఫిబ్రవరిలో భారీగా క్షీణించడం(మైనస్ 1.9 %) గమానార్హం. పరిశ్రమల వెనుకబాటుకు అధిక వడ్డీరేట్లు కూడా ప్రధాన కారణమేనంటూ గగ్గోలుపెడుతున్న కార్పొరేట్లు... తక్షణం వడ్డీరేట్లు తగ్గించి ఆర్బీఐ చేయూతనందించాలని డిమాండ్ చేశారు. తయారీ తుస్... మొత్తం ఐఐపీలో 75% మేర వాటా కలిగిన తయారీ రంగం ఘోరంగా చతికిలపడింది. గతేడాది ఫిబ్రవరిలో 2.1% వృద్ధి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.7 శాతం క్షీణతలోకి దిగజారిపోయింది. ఇక 2013-14 ఏప్రిల్-ఫిబ్రవరి కాలంలోనూ ఈ రంగం ఉత్పాదకత 0.7% కుంగింది. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధికి 1 శాతం వృద్ధి నమోదైంది. యంత్ర పరికరాల రంగం ఉత్పాదకత ఫిబ్రవరిలో ఏకంగా 17.4% కుంగిపోయింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ రంగం 9.1% వృ ద్ధి సాధించింది. తయారీ రంగంలోనూ 22 పారిశ్రామిక విభాగాలకుగాను 13 విభాగాలు ఈ ఫిబ్రవరిలో మైనస్లోనే కొనసాగడం దుర్భర పరిస్థితికి నిదర్శనం. ఇతర రంగాల పరిస్థితి ఇదీ... కన్జూమర్ గూడ్స్ ఉత్పాదకత ఫిబ్రవరిలో 4.5% కుంగింది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగం ఉత్పాదకత క్షీణత 2.6% నుంచి 9.3 శాతానికి చేరింది. కన్జూమర్ నాన్డ్యూరబుల్స్ విభాగం ఉత్పాదకత కూడా ఫిబ్రవరిలో 3.2 శాతం వృద్ధి నుంచి 1.2 % క్షీణతలోకి జారింది. ఇక విద్యుత్ రంగం ఉత్పాదకత ఫిబ్రవరిలో 11.5 % పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ రంగం 3.2 శాతం క్షీణతను నమోదుచేసింది. మైనింగ్ రంగం క్రితం ఏడాది ఫిబ్రవరిలో 7.7 శాతం క్షీణించగా.. ఈ ఏడాది ఇదే నెలలో 1.4 శాతం వృద్ధిరేటును సాధించింది. -
గణాంకాలవైపు చూపు..!
12న ఐఐపీ, సీపీఐ వివరాలు 14న డబ్ల్యూపీఐ గణాంకాలు ఎఫ్ఐఐల పెట్టుబడులకూ ప్రాధాన్యం స్టాక్ మార్కెట్లపై నిపుణుల అంచనాలు న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలతోపాటు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు ఈ వారం స్టాక్ మార్కెట్ల నడకను నిర్దేశిస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలకుతోడు, సంస్కరణల అమలు వేగవంతం కావచ్చునన్న ఆశలు ఎఫ్ఐఐలకు జోష్నిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇటీవల దేశీ స్టాక్స్లో పెట్టుబడులను పెంచారని వెరసి మార్కెట్లు గత వారం కొత్త చరిత్రను లిఖించాయని వివరించారు. గడిచిన వారంలో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లు జమ చేసుకుని కొత్త చరిత్రాత్మక గరిష్టమైన 21,920 వద్ద ముగియగా, 250 పాయింట్లు జంప్ చేసిన నిఫ్టీ 6,527 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. ఇక వారాంతం రోజున ఇంట్రాడేలో సెన్సెక్స్ 21,961ను తాకగా, నిఫ్టీ 6,538ను చేరుకోవడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పాయి కూడా! డిసెంబర్ క్వార్టర్లో కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 0.9%కు దిగిరావడానికితోడు, ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉపశమిస్తుండటంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న సంకేతాలు బలపడుతున్నాయని నిపుణులు విశ్లేషించారు. యూఎస్ ఉద్యోగాల ఎఫెక్ట్ దేశీ మార్కెట్లు ముగిశాక గడిచిన శుక్రవారం విడుదలైన అమెరికా ఉద్యోగ గణాంకాలు ఈ సోమవారం(10న) సెంటిమెంట్ను ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలకు అంచనాలను మించుతూ వ్యవసాయేతర కొలువులు(పేరోల్స్) 1,75,000కు పుంజుకోవడంతో తొలుత ఆసియా మార్కెట్లపై ఆ ప్రభావం కనిపించనుందని విశ్లేషించారు. పేరోల్స్ పెరగడంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలలో మరింత కోత పడే అవకాశముందన్న అంచనాలు బలపడ్డాయని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాటలో పెట్టేందుకు వీలుగా నెలకు 80 బిలియన్ డాలర్లతో అమలు చేస్తున్న సహాయక ప్యాకేజీలో ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే 20 బిలియన్ డాలర్లమేర కోతను విధించింది. కాగా, ఉద్యోగ గణాంకాలు అనూహ్యంగా పుంజుకోవడంతో ప్యాకేజీని మరింత తగ్గించే అవకాశమున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. వరుస గణాంకాలు...: జనవరి నెలకు ఐఐపీ డేటాతోపాటు, ఫిబ్రవరి నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు బుధవారం(12న) వెలువడనున్నాయి. ఇక టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు శుక్రవారం(14న) వెల్లడికానున్నాయి. ఈ అంశాల ఆధారంగా వచ్చే నెల మొదట్లో (ఏప్రిల్1న) నిర్వహించనున్న పాలసీ సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ అంచనాలు సమీప కాలంలో మార్కెట్ల ట్రెండ్ను నిర్ణయిస్తాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక గత వారంలో రూ. 5,045 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు కూడా మార్కెట్లపై తగిన ప్రభావాన్ని చూపగలరని తెలిపారు. రాజకీయ పరిణామాలు... ఆర్థిక గణాంకాలు, విదేశీ సంకేతాలు, ఎఫ్ఐఐల పెట్టుబడులేకాకుండా దేశ రాజకీయ పరిణామాలు కూడా మార్కెట్లను నిర్దేశిస్తాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రయివేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ వైస్ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే వ్యాఖ్యానించారు. కంపెనీల తదుపరి దశ ఆర్థిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశాన్ని కార్పొరేట్ల ముందస్తు పన్ను చెల్లింపులు వెల్లడిస్తాయని ట్రేడర్లు అభిప్రాయపడ్డారు. ఆపై వచ్చే రెండు నెలల్లో జరగనున్న సాధారణ ఎన్నికల ఫలితాలు మార్కెట్ల ట్రెండ్ను నిర్దేశిస్తాయని తెలిపారు. -
పరిశ్రమలు పాతాళంలో..
న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి అక్టోబర్లో అసలు వృద్ధి నమోదు కాలేదు. పైగా క్షీణత బాటలో మైనస్ (-) 1.8 శాతంలోకి జారిపోయింది. అంటే వార్షిక ప్రాతిపదికన చూస్తే సంబంధిత సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధి లేకపోగా, క్షీణించిందన్నమాట. వరుసగా రెండు నెలల క్షీణబాట వీడి జూలై నుంచీ వరుసగా మూడు నెలల పాటు 2012 ఇదే నెలతో పోల్చితే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ కొద్దోగొప్పో వృద్ధి సాధిస్తూ వస్తోంది (జూలైలో 2.8 శాతం, ఆగస్టులో 0.4 శాతం, సెప్టెంబర్లో 2 శాతం). అయితే తిరిగి అక్టోబర్లో క్షీణతలోకి జారిపోయింది. గురువారం ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2012 అక్టోబర్లో ఐఐపీ వృద్ధి 8.4 శాతం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సైతం ఐఐపీలో అసలు వృద్ధి నమోదు కాలేదు. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 1.2 శాతం. కీలక రంగాలు ఇలా... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం అక్టోబర్లో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 9.9 శాతం వృద్ధి నుంచి 2.0 క్షీణతలోకి జారిపోయింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సైతం 1.1 శాతం వృద్ధి నుంచి -0.3 శాతం క్షీణతలోకి జారింది. తయారీ రంగంలోని మొత్తం 22 గ్రూప్లలో 10 గ్రూపులు అక్టోబర్లో ప్రతికూలతను నమోదు చేసుకున్నాయి. మైనింగ్: ఐఐపీలో 14 శాతం వాటా కలిగిన ఈ రంగం క్షీణత మరింత పెరిగింది. ఇది -0.2 శాతం నుంచి -3.5 శాతానికి పడిపోయింది. 2013-14 మొదటి ఏడు నెలల కాలంలో ఈ రేటు -1 శాతం నుంచి -2.7 శాతానికి పడిపోయింది. విద్యుత్: విద్యుత్ రంగంలో వృద్ధి సైతం 5.5 శాతం నుంచి 1.3 శాతానికి పడిపోయింది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య మాత్రం ఈ రేటు 4.7 శాతం నుంచి 5.3 శాతానికి ఎగసింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్ను ప్రతిబింబించే ఈ రంగంలో వృద్ధిరేటు 7 శాతం నుంచి 2.3శాతానికి పడిపోయింది. ఏడు నెలల కాలంలో చూస్తే క్షీణత కొంత తగ్గడం కొంతలోకొంత ఊరట. ఈ కాలంలో ఈ రేటు -11.6 శాతం నుంచి -0.2 శాతానికి తగ్గింది. వినియోగ వస్తువులు: ఈ విభాగం అక్టోబర్లో అసలు వృద్ధిని నమోదుచేసుకోలేదు. గత ఏడాది ఇదే నెలలో వృద్ధి 13.8 శాతంకాగా, 2013 ఇదే నెలలో ఈ రేటు -5.1 శాతంగా ఉంది. ఇక ఏడు నెలల కాలంలో 4.2 శాతం వృద్ధి రేటు -1.8 శాతంలోకి జారిపోయింది. ఈ విభాగంలో భాగమైన కన్సూమర్ డ్యూరబుల్స్ మొత్తంగా కూడా క్షీణతలోకి జారింది. 16.7 శాతం వృద్ధి నుంచి భారీగా 12 శాతం క్షీణతలోకి పడిపోయింది. ఏడు నెలల కాలంలో 5.7 శాతం వృద్ధి రేటు సైతం -11.2 క్షీణతలోకి జారిపోయింది. ఇక ఈ విభాగంలో మరో భాగమైన నాన్-డ్యూరబుల్స్ విభాగం వృద్ధి 11.2 శాతం నుంచి 1.8 శాతానికి పడిపోయింది. ఏడు నెలల కాలంలో ఈ రేటు వృద్ధి 2.8 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగింది. వడ్డీ రేట్లు తగ్గించాల్సిందే...: పారిశ్రామిక వర్గాలు అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. తయారీ రంగంసహా పారిశ్రామిక రంగం పునరుత్తేజానికి రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించాల్సిందేనని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనా లాల్ కిద్వాయ్ పేర్కొన్నారు. వడ్డీరేట్ల కోత జరగనిదే సమీప భవిష్యత్తులో పారిశ్రామికోత్పత్తి మెరుగుదలను చూడలేమని ఆమె అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రస్తుత స్థాయికన్నా తక్కువకు పడబోదని, పారిశ్రామిక క్రియాశీలత తిరిగి మెరుగవుతుందని ఇటీవల నెలకొన్న ఆశలపై ఈ గణాంకాలు నీళ్లుజల్లాయని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. పరిస్థితి మెరుగుపడాలంటే పటిష్ట, నిర్ణయాత్మకమైన పాలసీ నిర్ణయాలు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు.