iphone 14
-
ఐఫోన్ చవగ్గా కావాలా?
మీకు ఐఫోన్ అంటే ఇష్టమా? చవగ్గా తక్కువ ధరకు యాపిల్ ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. యాపిల్ తాజా మోడళ్ల ఐఫోన్ కొనుగోలు చేయలేని ఐఫోన్ (iPhone) ప్రియుల కోసం ముఖేష్ అంబానీకి చెందిన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ రిలయన్స్ డిజిటల్ (Reliance Digital) ఓ మంచి డీల్ తీసుకొచ్చింది. ఐఫోన్ 14 (iPhone 14)పై భారీ తగ్గింపును అందిస్తోంది.యాపిల్ 2022లో లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ ఐఫోన్ 14 ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్లో అందుబాటులో ఉంది. దీని అసలు రిటైల్ ధర రూ. 54,900 కాగా రిలయన్స్ డిజిటల్ దీనిపై రూ.6,500 తగ్గింపు అందిస్తోంది. ఫ్లాట్ రూ. 6,500 తగ్గింపుతో పాటు కొనుగోలుదారులు బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఆఫర్ల ద్వారా ఐఫోన్ 14 రూ. 47,400 లకే పొందవచ్చు. హెచ్ఎస్బీసీ (HSBC) క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 2,000 వరకు అదనంగా 5% తగ్గింపును పొందవచ్చు. దీంతో తుది ధర రూ. 46,400కి తగ్గుతుంది. అంటే మొత్తంగా రూ. 8,500 తగ్గింపు.ఐఫోన్ 14 ఫీచర్లు2022 అక్టోబర్లో రూ. 79,900 బేస్ ధరతో యాపిల్ ఐఫోన్ 14 లాంచ్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్లలో ముఖ్యంగా సేల్ ఈవెంట్ల సమయంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మొబైల్ ఫోన్లలో ఐఫోన్ 14 ఒకటి. ఐఫోన్ 14లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. వెనుకవైపు 12MP డ్యూయల్-కెమెరా, సెల్ఫీ ప్రియుల కోసం డ్రాప్ నాచ్ 12MP ఫ్రంట్ షూటర్ కెమరా ఇందులో ఉన్నాయి.ఇదిలా ఉండగా యాపిల్కు చెందిన తాజా సిరీస్ ఐఫోన్ 16 (iPhone 16). గత ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 16 సిరీస్ను యాపిల్ భారత్లో లాంచ్ చేసింది. సెప్టెంబర్ 20 నుంచి విక్రయాలు ప్రారంభం కాగా ఊహించినట్లుగానే ఐఫోన్ 16 సిరీస్కు భారత్లో భారీ స్పందన లభించింది. మొదటి రోజే రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. బేస్ మోడల్కు ఐఫోన్ 16 ధరలు రూ.79,900 కాగా ఐఫోన్ 16 ప్రో ధర రూ. 144,900 వరకు ఉంది. -
ఈ ఐఫోన్ వాడుతుంటే.. మీకే ఈ అలర్ట్!
ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) వినియోగదారులకు యాపిల్ ముఖ్యమైన అలర్ట్ను జారీ చేసింది. కొన్ని నెలల క్రితం తయారైన ఐఫోన్ 14 ప్లస్ యూనిట్లలో తలెత్తిన రియర్ కెమెరా సమస్య కోసం యాపిల్ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ప్రభావితమైన ఫోన్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అధీకృత యాపిల్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద సర్వీసింగ్ పొందవచ్చని కంపెనీ ప్రకటించింది.రియర్ కెమెరా సమస్య తమ హ్యాండ్సెట్పై ప్రభావం చూపిందో లేదో కస్టమర్లు తమ క్రమ సంఖ్యను కంపెనీకి అందించడం ద్వారా ధ్రువీకరించుకోవచ్చు. ఐఫోన్ 14 ప్లస్లో రియర్ కెమెరాకు మరమ్మతుల కోసం ఇప్పటికే డబ్బు చెల్లించినవారు ఆ మొత్తాన్ని రీఫండ్ పొందవచ్చు.సమస్య ఇదే..ఐఫోన్ 14 ప్లస్లో రియర్ కెమెరా సమస్య మరమ్మతు కోసం యాపిల్ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇందుకోసం సపోర్ట్ పేజీని ఏర్పాటు చేసింది. అసలేంటి సమస్య అంటే.. రియర్ కెమెరాతో ఫొటో తీసినప్పుడు ప్రివ్యూ చూపించడం లేదు. అయితే ఈ చాలా తక్కువ ఫోన్లలోనే ఉత్పన్నమైనట్లు కంపెనీ పేర్కొంది. ఇవి 2023 ఏప్రిల్ 10 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 28 మధ్య తయారైనవి.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అదిరిపోయే ప్రయోజనాలు!అయితే తమ ఫోన్లలో ఇలా సమస్య ఉంటే కంపెనీ ఉచిత సర్వీసింగ్ ప్రోగ్రామ్ పొందడానికి అర్హత ఉందా.. లేదా అన్న విషయాన్ని యాపిల్ ఏర్పాటు చేసిన సపోర్ట్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నంబర్ నమోదు చేస్తే మీ ఫోన్కి ఫ్రీ సర్వీసింగ్ వస్తుందో రాదో తెలుస్తుంది. యాపిల్ సర్వీస్ ప్రోగ్రామ్ ఫోన్ కొనుగోలు తేది నుంచి మూడేళ్లపాటు వర్తిస్తుంది. -
ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్
ఐఫోన్ 16 సిరీస్ను ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల చేయడానికి యాపిల్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 మోడల్ ధర భారీగా తగ్గింది. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్తో లభిస్తోంది.యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 14 ప్లస్ ధర రూ. 79,600 లుగా ఉంది. దీన్ని ఫ్లిప్కార్ట్లో కొంటే రూ. 56,000 కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 14 ప్లస్ బేస్ వేరియంట్ రూ. 56,499కి అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్ కొనుగోలుపై కొనుగోలుదారులు రూ.23,101 ఆదా చేసుకోవచ్చు. దీంతో పాటు, యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 1,000 అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. అంటే ఐఫోన్ 14 ప్లస్ రూ.55,499కే లభిస్తుందన్న మాట.ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్స్» 1200 నిట్స్ బ్రైట్నెస్తో పెద్ద » 6.7-అంగుళాల స్క్రీన్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే» డిస్ప్లే దెబ్బతినకుండా సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్» A15 బయోనిక్ చిప్సెట్» 12-మెగాపిక్సెల్ రియర్ డ్యూయల్ కెమెరా» 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా -
ఐఫోన్ లవర్స్కి గుడ్న్యూస్
యాపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త. త్వరలో మార్కెట్కి పరిచయం కానున్న ఐఫోన్ 16 తయారీ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 15 విడుదలైన మరుక్షణం నుంచి ఐఫోన్ 16 ఇలా ఉండబోతుందంటూ రకరకాల డిజైన్లను ప్రస్తావిస్తూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తయారీ ప్రారంభంతో ఆ ఫోన్ డిజైన్పై స్పష్టత రానుంది.ఐ ఫోన్ డిస్ప్లే అనలిస్ట్ రాస్ యంగ్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చే నెల నుంచి తయారీ ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు. ఐఫోన్ 16 మోడళ్లను హై-ఎండ్ వేరియంట్ల కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చని తెలుస్తోంది. కాగా, గత ఏడాది ఐఫోన్ 15 సిరీస్ తయారీ ఆగస్ట్ నెలలో ప్రారంభం కాగా.. ఈ లేటెస్ట్ వెర్షన్ అంతకంటే ముందే మ్యానిఫ్యాక్చరింగ్కు సిద్ధమైంది. ఐఫోన్ 16 భారత్లో తయారవుతుందా? మరి యాపిల్ సంస్థ ఐఫోన్ 16ను భారత్లో తయారు చేస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రానప్పటికీ ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15లు మాత్రం దేశీయంగా తయారయ్యాయి.ఐఫోన్ 15 సిరీస్ ధరెంతంటేగతేడాది విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్ ధర రూ.1,34,900 నుండి ప్రారంభమవుతుండగా.. ప్రో మాక్స్ ధర రూ. 1,59,900. 128జీబీ స్టోరేజ్ ఐఫోన్ 15మోడల్ ధర భారత్లో రూ. 79,900, ప్లస్ మోడల్ రూ. 89,900కే మార్కెట్లో లభ్యమవుతుంది. ఐఫోన్ 16 సిరీస్.. చాలా కాస్ట్ గురూ..!అయితే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఎందుకంటే ఇటీవలి నిక్కీ ఆసియా మ్యాగిజైన్ ఇంటర్వ్యూలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తయారీకి 558 డాలర్ల ఖర్చవుతుందని యాపిల్ తెలిపింది. విడి భాగాల ధరలు పెరుగుదల కారణంగా ఐఫోన్ 16 ధరలు 12 శాతం పెరిగే అవకాశం ఉందని వెలుగులులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
కొంపముంచిన డేటింగ్ యాప్: ‘ఐస్’తో కిలాడీ నిలువు దోపిడీ
డేటింగ్ యాప్ పరిచయం ఓ యువకుడి కొంప ముంచింది. బంబుల్యాప్లో పరిచయమైన గురుగ్రామ్కు చెందిన యువకుడికి మత్తుమందు ఇచ్చి మరీ మహిళ నిలువునా దోచేసింది. బంగారం, నగదు, లగ్జరీ ఐఫోన్తో పాటు, బ్యాంకు ఖాతాని ఖాళీ చేసేసింది. విషయం తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. హర్యానాలోని గురుగ్రామ్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. గురుగ్రామ్ వ్యక్తికి బంబుల్ డేటింగ్ యాప్లో సాక్షి అలియాస్ పాయల్ అనే ఆ మహిళతో పరిచయం ఏర్పడిందని బాధితుడు రోహిత్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు ప్రకారం తాను ఢిల్లీకి చెందిన దాన్ననీ, అయితే గురుగ్రామ్లో తన అత్తతో నివసిస్తున్నాననిపాయల్ చెప్పింది. గత వారం పాయిల్కు ఫోన్ చేసి, కలుద్దామని రోహిత్ను కన్విన్స్ చేసింది. అనుకున్న ప్రకారం రోహిత్ వాళ్ల ఇంట్లో కలుసుకున్నారు. ఆ తరువాత దగ్గర్లోని దుకాణంలో మద్యం కొనుక్కుని ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత ఐస్ తీసుకురమ్మనే నెపంతో అతడి దృష్టి మళ్లించింది. అతడలా ఐస్ కోసం వెళ్లగానే డ్రింక్లో ఏ మత్తుమందు తెలిపిందో తెలియదు గానీ అది తాగిన వెంటనే రోహిత్ స్పృహ కోల్పోయాడు. ఆ మత్తు ఎంత ప్రభావితం చేసిందంటే...అక్టోబర్ ఒకటోతేదీ రాత్రి స్పృహ కోల్పోతే..అక్టోబర్ 3వ తేదీ ఉదయం నిద్రలేచేంత.కళ్లు తెరిచి చూసే సరికి ఆమె ఇంట్లో లేదు. బంగారు గొలుసు, ఖరీదైన ఐఫోన్ 14 ప్రో, రూ. 10వేల నగదు, క్రెడిట్,డెబిట్ కార్డులు మాయం. ఇంతలో తన బ్యాంకు అకౌంట్నుంచి రూ. 1.78 లక్షలు విత్డ్రా అయినట్లు కూడా గుర్తించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. -
ఐఫోన్ కావాలంటే కొనుక్కోవాలికానీ కొరికితే ఎలా? వింత చోరీ వీడియో వైరల్!
iPhone theft: యాపిల్ ఐఫోన్ (Apple iPhone)15 త్వరలో లాంచ్ కాబోతోంది. యమా క్రేజ్ ఉండే ఐఫోన్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటున్నాయి. అయితే ఇది అప్డేట్లకు సంబంధించినది కాదు.. ఐఫోన్ చోరీకి సంబంధించినది. ఖరీదైన ఐఫోన్ల చోరీల గురించి తరచూ వింటుంటాం. ఈమధ్య ఈ ఫోన్ల దొంగతనాలు సృజనాత్మకంగా మారాయి. అలాంటిదే చైనాలో ఒకటి తాజాగా జరిగింది. ఆ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనాలోని ఓ యాపిల్ స్టోర్లో సుమారు రూ. 80,000 విలువ చేసే ఐఫోన్ 14 ఫ్లస్ (iPhone 14 Plus)ని చాకచక్యంగా దొంగిలించింది ఓ మహిళ. స్టోర్లో డిస్ప్లేకు ఉంచిన ఫోన్ను యాంటీ-థెఫ్ట్ కేబుల్ను కొరికేసి తన బ్యాగులో వేసుకుంది. అలారం స్టోర్ సిబ్బంది గుర్తించలేకపోయారు. చోరీ జరిగిన అరగంట తర్వాత చూసుకున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ మహిళను అరెస్ట్ చేశారు. VIDEO: MUJER SE ROBA UN IPHONE A MORDIDAS Una cámara de seguridad captó el momento en que mujer roba un #iPhone de exhibición a mordidas en una Apple Store en #China. En las imágenes se puede apreciar a la fémina acercándose de manera disimulada a la mesa donde se encontraban… pic.twitter.com/eC7E6poeUy — El Dato Noticias Morelos (@eldatomx) September 2, 2023 -
యాపిల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో ఆఫర్!
Apple Mega Sale:యాపిల్ ఐఫోన్ లవర్స్కు బంపర్ ఆఫర్ ఆందిస్తోంది. త్వరలోనే కొత్త ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ కానున్న నేపథ్యంలో పాపులర్ ఐఫోన్లు భారీ డిస్కౌంట్లో ధరలో లభ్యం. ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 , ఐఫోన్ 13,ఐఫోన్ 1, ఐఫోన్ తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ అప్గ్రేడ్ చేసుకోవడానికి లేదా కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ ముఖ్యంగా ఐఫోన్ 14 ప్లస్పై భారీ ఆఫర్ అందుబాటులోఉంది. దీన్ని రూ. 72,999 వద్దే దీన్ని సొంతం చేసుకోవచ్చు. దీని లాంచింగ్ ప్రైస్ రూ.89,990. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద నిబంధనల ప్రకారం రూ. 48,999 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే HDFC కార్డుద్వారా జరిపే కొనుగోళ్లపై 128 జీబీ వేరియంట్పై అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. 6.7-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, ఏ15 బయోనిక్ చిప్సెట్ , 12ఎంపీ డ్యుయల్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (ఇక జాబిల్లిపై కోట్లాది భారతీయుల కొత్త కలలు: ఆనంద్ మహీంద్ర) ఐఫోన్ 14 ఐఫోన్ 14 పై అసలు ధరలో 14శాతందాకా తగ్గింపు. అంటే ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 67,999కి అందుబాటులో ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికివస్తే 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఆకట్టుకునే బ్యాటరీ సామర్థ్యం ప్రత్యేకం.. ఐఫోన్ 13, ఐఫోన్ 12 ఈ సేల్లో ఐఫోన్ 13ను రూ. 59,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 12 ను డిస్కౌంట్ తరువాత రూ. 51,999 కొనుగోలు చేయ వచ్చు. ఇక ఐఫోన్ 11 64GB వేరియంట్ను కేవలం రూ. 41,999 వద్ద అందుబాటులో ఉంది. -
రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా?
Apple iPhone 14 యాపిల్ ఐఫోన్ మరోసారి తగ్గింపు ధరలోఅందుబాటులోకివచ్చింది. ప్రస్తుతం యాపిల్ లైనప్లో చౌక ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 14. త్వరలోనే ఐఫోన్ 15ను లాంచ్ చేయనున్న తరుణంలో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ కానున్న నేపథ్యంలో ఈ తగ్గింపు అందుబాటులోకి రావడం గమనార్హం. దాదాపు రూ. 43,600 వరకు తగ్గింపుతో రూ. 26,399కే ఐఫోన్ 14ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అధికారిక స్టోర్లో రూ. 10,901 తగ్గింపుతో రూ. 68,999 వద్ద లిస్ట్ అయింది. దీనితో పాటు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 4000 తగ్గింపును పొందవచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్, ఇతర ఆఫర్లతో కలిపి ఫ్లిప్కార్ట్ సేల్ కంటే ముందుగా యాపిల్ ఐఫోన్ 14ని కేవలం 26,399 రూపాయలకే పొందవచ్చు. కాగా ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆగస్టు 4-9 వ తేదీవరకు కొనసాగనుంది. సేల్ ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యుల కోసం రేపటి నుండే ప్రారంభం. కాగా యాపిల్ ఐఫోన్14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, యాపిల్ 14 ప్రో మాక్స్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 15 ఈ ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) -
యాపిల్ ఐఫోన్ 14 పై భారీ డిస్కౌంట్
యాపిల్ ఐఫోన్ 14 లవర్స్కు గుడ్న్యూస్. ఈ లగ్జరీస్మార్ట్ఫోన్ ఇపుడు భారీ తగ్గింపులో అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్లో రూ. 42,600 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అంటే దీని ధర రూ. 30,000 కంటే తక్కువన్నమాట. డిస్కౌంట్లు, బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫరలు కలిపి ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 14పై ఈ భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఇదీ చదవండి : ట్యూటర్లకు షాక్: ఏఐ చాట్బాట్పై బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు ఐఫోన్ 14 తగ్గింపు ఆఫర్ ఐఫోన్ 14 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్కార్ట్లో డిస్కౌంట్ధర రూ. 69,999 వద్ద లిస్ట్ చేసింది. దీని లాంచింగ్ ప్రైస్. రూ.79,900. ప్రస్తుతం రూ. 9901 తగ్గింపు అందుబాటులో ఉంది. దీంతో పాటు, బ్యాంక్ మరియు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లతో మరింత దిగి వచ్చింది. ముఖ్యంగా తమ స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్గా (ఫోన్ పరిస్థితి మోడల్పై ఆధారపడి) రూ. 38,600 వరకు ఆఫర్ చేసే ఎక్స్ఛేంజ్ డీల్ లభ్యం. (యోగా గురు రామ్దేవ్ లగ్జరీ కార్ల కలెక్షన్: దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు) అలాగే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 4,000 వరకు బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ కార్డ్తో లావాదేవీలపై 5శాతం క్యాష్బ్యాక్ కూడా పొందవచ్చు. ఇవన్నీ వర్తించిన తరువాత యాపిల్ ఐఫోన్ 14 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ. 27,399కే కొనుగోలు చేయవచ్చు. -
బాబోయ్ ఈ స్మార్ట్ఫోన్ ఖరీదు అన్ని కోట్లా? లగ్జరీ లంబోర్ఘినికే ఝలకా?
అతి ఖరీదైన ఫోన్లు అనగానే యాపిల్ ఐఫోన్లు గుర్తొస్తాయి. ముఖ్యంగా ప్రస్తుతం రూ. 1,27,999 ధర పలుకుతున్న ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ అత్యంత ఖరీదైన ఫోన్గా భావిస్తాం. దీని లేటెస్ట్ వెర్షన్ ధర కళ్లు చెదిరే ధర పలుకుతోంది. డైమండ్ స్నోఫ్లేక్ వేరియంట్, కేవియర్ ద్వారా కస్టమైజ్ చేసిన ఐఫోన్ ధర సుమారు రూ. 5 కోట్లు (616,000 డాలర్లు) పలుకుతోంది. ఐఫోన్ 14 ప్రో మాక్స్ స్నోఫ్లేక్ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటంటే బ్రిటీష్ జ్యువెలరీ బ్రాండ్ గ్రాఫ్ సహకారంతో రూపొందించారు. డైమండ్ మోడల్ బ్యాక్ప్లేట్కు లాకెట్టు అమర్చారు. దీన్ని అతి ఖరీదైన ప్లాటినం, వైట్ గోల్డ్తో రూపొందించారు. ఈ రౌండ్ అండ్ మార్క్యూస్-కట్ డైమండ్స్తో తయారు చేసిన లాకెట్టు ధర ఒక్కటే దాదాపు రూ. 62 లక్షలు. దీనికి అదనంగా,18 కేరట్ల వైట్ గోల్డ్ బ్యాక్ప్లేట్ను కూడా అమర్చారు. దీనికి 570 వజ్రాలను అమర్చారట. ప్రస్తుతానికి మూడు యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంచినట్టుతెలుస్తోంది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రూ.3.7 కోట్లకు లభ్యమవుతున్న లంబోర్గిని హురాకాన్ ఎవో సూపర్కార్ ధర కంటే ఎక్కువ కదా బాసూ అంటే కమెంట్ చేస్తున్నారు. కాగా 1,39,900 రూపాయల వద్ద భారతీయ మార్కెట్లో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. -
గుడ్ న్యూస్.. ఐఫోన్ లవర్స్కి ఇదే మంచి సమయం
Amazon Apple Sale Days: భారతదేశంలో ఐఫోన్కు ఉన్న క్రేజు అంతా .. ఇంతా.. కాదు. యువతరం మొత్తం ఐఫోన్ అంటే పడి సచ్చిపోతారు. అలాంటి వారి కోసం అమెజాన్ కొత్త యాపిల్ డేస్ సేల్స్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఐఫోన్లపై మీద భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ అవకాశం కేవలం వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరకు ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకునే వారు జూన్ 17లోపు కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం బ్యాంకు కార్డుల మీద తగ్గింపులను అందించడం మాత్రమే కాకుండా.. ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ మీద అమెజాన్ అందించే ఆఫర్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యాపిల్ సంస్థ గతేడాది ఐఫోన్ 14 సిరీస్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇందులో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 14 (iPhone 14) దేశీయ మార్కెట్లో ఐఫోన్ 14 128జీబీ మోడల్ ధర రూ. 79,999. ఆఫర్ కింద 15 శాతం తగ్గింపుతో దీనిని రూ. 67,999 కే సొంతం చేసుకోవచ్చు. అదే సమయంలో 256 జీబీ వేరియంట్ని (రూ. 89,900) 13 శాతం తగ్గింపుతో రూ. 77,999కే.. 512 జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900 కాగా 11 శాతం తగ్గింపుతో రూ. 97,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) యాపిల్ సేల్ డేస్ ఆఫర్ సమయంలో ఐఫోన్ 14 ప్లస్ కొనుగోలు చేయాలనుకునే వారు దీనిని రూ. 76,999కి కొనుగోలు చేయవచ్చు. మంచి బ్యాటరీ కెపాసిటీ కలిగి పెద్ద స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 89,900. ఆఫర్ సమయంలో 14 శాతం తగ్గింపు లభిస్తుంది. కావున ఇది రూ. 76,999కే లభిస్తుంది. ఇక 256GB వేరియంట్ ధర రూ. 99,900 కాగా.. అమెజాన్ ఆపిల్ డే సేల్ సమయంలో 13 శాతం తగ్గుదలతో రూ. 86,999కి లభిస్తుంది. (ఇదీ చదవండి: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో) ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్తో సహా ఐఫోన్ 14 సిరీస్ హై-ఎండ్ మోడల్లు కూడా ప్రస్తుతం సుమారు 9 శాతం తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్నాయి. 128జీబీ స్టోరేజ్ అండ్ 256జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 14 ప్రో అసలు ధరలు వరుసగా రూ. 1,29,900 & రూ. 1,39,900 కాగా.. ఆఫర్ కింద ఇవి రూ. 1,19,999 అండ్ రూ. 1,34,990 ధర వద్ద అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: వేలంలో కోట్లు పలికిన చెక్కతో తయారైన కారు - దీని ప్రత్యేకత ఏమిటంటే?) ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max) ఆపిల్ సెల్ డేస్ ఆఫర్ కింద ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కొనాలనుకునే వారు సాధారణ ధరకంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 14 ప్రో మ్యాక్స్ 128జీబీ ధర రూ. 1,39,900, అదే సమయంలో 256జీబీ వేరియంట్ ధర రూ. 1,49,900. ఆఫర్ కింద వీటిని వరుసగా రూ. 1,27,999 అండ్ రూ. 1,43,990 కే సొంతం చేసుకోవచ్చు. -ఎన్.కుమార్ -
స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు..
Flipkart Big Bachat Dhamaal Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ డమాల్ సేల్ మళ్లీ వచ్చేసింది. స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు నడుస్తున్నాయి. ఈ సేల్ మే 19న ప్రారంభమైంది. మే 21 వరకు కొనసాగుతుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a), ఐఫోన్ 14 (iPhone 14)తో పాటు కొత్తగా లాంచ్ అయిన మరికొన్ని స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి ఇది మంచి అవకాశం. స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్స్, ఇయర్ఫోన్లు, స్మార్ట్వాచ్లు, ఇతర గాడ్జెట్లపై సూపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన ప్రముఖ స్మార్ట్ ఫోన్లపై ఈ సేల్లో ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయో ఓ లుక్కేయండి.. ఇదీ చదవండి: Redmi A2 Series: రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ గూగుల్ పిక్సెల్ 7ఏ కొత్తగా లాంచ్ అయిన గూగుల్ పిక్సెల్ 7ఏ (Google Pixel 7a) ధర రూ. 43,999లుగా ఉంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్చేంజ్ ద్వారా రూ. 34,000 వరకు తగ్గింపు లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 7ఏ 6.1అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఫింగర్ప్రింట్ స్కానర్ ఉంది. Tensor G2 SoC చిప్తో జోడించారు. ఐఫోన్ 14 యాపిల్ ఐఫోన్ 14 (Apple iPhone 14) 128 GB వేరియంట్ రూ. 69,999 వద్ద లభిస్తుంది . హెచ్డిఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇక పాత స్మార్ట్ఫోన్ల ఎక్స్ఛేంజ్పై రూ. 33,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఐఫోన్ 14లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే ఉంది . Apple A15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. ఒప్పో రెనో 8 ప్రో 5G ఒప్పో రెనో (OPPO Reno) 8 Pro 5G (12 జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్) ఫోన్ను రూ. 45,999లకే కొనుక్కోవచ్చు. అంతే కాకుండా కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని వాడుకుంటే 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Mediatek డైమెన్సిటీ 8100 మాక్స్ ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్ 6.7 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. వివో T1X వివో (Vivo) T1X ఫోన్ 4GB ర్యామ్, 128GB రోమ్ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ ఆఫర్ సేల్లో రూ. 12,999 కే లభిస్తుంది. మరోవైపు కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐని ఎంచుకుంటే అదనంగా మరో 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక పాత ఫోన్ల ఎక్స్చేంజ్పై గరిష్టంగా రూ. 12,450 లభిస్తుంది. పోకో F5 5G ప్రస్తుత ఫ్లిప్కార్ట్ సేల్లో పోకో (Poco) F5 5G ఫోన్ 8GB వేరియంట్ రూ. 29,999లకు లభిస్తోంది. కోటక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లో 6.67 అంగుళాల డిస్ప్లే, Qualcomm Snapdragon 7+ Gen2 చిప్సెట్ ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన స్మార్ట్ఫోన్లు, ఇతర గాడ్జెట్లు, వాటిపై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి తెలుసుకునేందుకు సాక్షి బిజినెస్ పేజీని చూడండి -
ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు మరో సంస్థలోనూ..
యాపిల్ ఐఫోన్14 (Apple iPhone 14)పై ఈ-కామర్స్ సంస్థలు వరుసకట్టి ఆఫర్లు ప్రకటించాయి. పోటీ పడి డిస్కౌంట్లు అందిస్తున్నాయి. యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఐఫోన్14 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.79,900 ఉంది. అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు విజయ్ సేల్స్ అనే మరో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈ ఫోన్పై భారీ తగ్గింపులు, ఆఫర్లు అందిస్తున్నాయి. తక్కువ ధరకే ఐఫోన్ 14 కొనుక్కోవాలనుకుంటున్నవారికి ఇప్పుడే సరైన సమయం. ఇదీ చదవండి: Amazon Great Summer Sale: ఆఫర్ల జాతరకు సిద్ధమైన అమెజాన్.. ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు! ఫ్లిప్కార్ట్లో అత్యధిక డిస్కౌంట్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ 128జీబీ వేరియంట్ ఐఫోన్14పై అత్యధికంగా 12 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్పై ఐదు శాతం క్యాష్బ్యాక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్లపై రూ.4,000 తగ్గింపు పొందవచ్చు. అదనంగా ఫ్లిప్కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.40,749 కంటే తక్కువ ధరకే ఐఫోన్14 మీ సొంతం అవుతుంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీ పాత స్మార్ట్ఫోన్కు కండీషన్ను బట్టీ గరిష్టంగా రూ.29,250 వరకు లభిస్తుంది. అమెజాన్ ఆఫర్లు ఐఫోన్14ని అమెజాన్ 10 శాతం తగ్గింపుతో రూ.71,999లకు విక్రయిస్తోంది. అలాగే వివిధ క్రెడిట్, డెబిట్ కార్డ్లపై రూ. 4,000 వరకు ఆఫర్లను కూడా అందిస్తోంది. అదనంగా ట్రేడ్-ఇన్ ఆఫర్ను ఉపయోగించుకుంటే చాలా తక్కువ ధరకే ఐఫోన్14 లభిస్తుంది. ఈ ఆఫర్ కింద రూ.19,700 వరకు తగ్గింపు ఉంటుంది. తద్వారా రూ. 52,299 కంటే తక్కువకే ఐఫోన్14ను కొనుక్కోవచ్చు. విజయ్ సేల్స్లో యాపిల్ డేస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్తోపాటు విజయ్ సేల్స్ కూడా ఐఫోన్14పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇందులో కొనసాగుతున్న యాపిల్ డేస్లో భాగంగా కేవలం రూ.70,999లకే ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్14పై ఈ సంస్థ 11 శాతం తగ్గింపుతో పాటు హెచ్డీఎఫ్సీ కార్డ్లపై రూ.4,000 క్యాష్బ్యాక్, యస్ బ్యాంక్ కార్డ్లపై రూ.2,000 వరకు తక్షణ తగ్గింపు వంటి ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు -
ఐఫోన్14 ప్లస్పై అద్భుతమైన ఆఫర్.. ఫ్లిప్కార్ట్లో భారీ తగ్గింపు!
యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ (Apple iPhone 14 Plus)పై ఫ్లిప్కార్ట్లో భారీ తగ్గింపుతో అద్భుతమైన ఆఫర్ నడుస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ భారతదేశంలో రూ. 89,999 ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ దీనిపై రూ.12,000 ఫ్లాట్ తగ్గింపు అందిస్తోంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అదనం. యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ 89,999 ఉండగా ఫ్లిప్కార్ట్లో ఇది ఇప్పుడు భారీ తగ్గింపుతో రూ.77,999లకే అందుబాటులో ఉంది. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్లపై రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ల విషయానికొస్తే, పాత మోడల్ ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కస్టమర్లు గరిష్టంగా రూ. 29,500 వరకు పొందవచ్చు. ఇదీ చదవండి: ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్.. విండోస్ కంప్యూటర్కు కనెక్ట్ చేసుకోవచ్చు! ఇక రూ. 99,900 ఉన్న 256GB వేరియంట్ ఫోన్ రూ. 87,999లకే కొనుక్కోవచ్చు. రూ. 1,19,900 ధర ఉన్న 512GB వేరియంట్ రూ. 1,07,900లకే అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 14 ప్లస్ పర్పుల్, స్టార్లైట్, మిడ్నైట్, బ్లూ, ప్రొడక్ట్ (రెడ్), ఎల్లో కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్14పైనా తగ్గింపు రూ. 79,999 ధరతో ప్రారంభమైన యాపిల్ ఐఫోన్ 14 ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ. 71,999లకే అందుబాటులో ఉంది. అంటే రూ. 8,000 డిస్కౌంట్. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్లపై రూ.4,000 తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు పరిమాణం మినహా యాపిల్ ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 దాదాపు ఒకే విధమైన స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి. రెండూ A15 బయోనిక్ చిప్సెట్తో 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్తో ఉన్నాయి. కెమెరా పరంగా ఐఫోన్14, ఐఫోన్14 ప్లస్ 12MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ను కలిగి ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇదీ చదవండి: ఊరిస్తున్న కార్లు వచ్చేస్తున్నాయి.. మే నెలలో లాంచ్ అయ్యే కార్లు ఇవే.. -
ఐఫోన్ 14పై అక్షయ తృతీయ ఆఫర్.. ఏకంగా రూ.21 వేలు తగ్గింపు!
ప్రత్యేకంగా యాపిల్ ప్రీమియమ్ ఉత్పత్తులను విక్రయించే దేశంలోని ప్రముఖ రీసెల్లర్ కంపెనీ మాపుల్ (Maple) అక్షయ తృతీయ సందర్భంగా ఐఫోన్ 14 (iPhone 14)పై ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. మాపుల్ స్టోర్ లేదా ఆన్లైన్లో ఐఫోన్ 14 కొంటే రూ.21,000 తగ్గింపు పొందవచ్చు. లేదా నెలకు రూ.2,996 చొప్పున 24 నెలల నో కాస్ట్ ఈఎంఐపై జీరో డౌన్ పేమెంట్తో ఐఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు. ఇదీ చదవండి: అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు! ప్రస్తుతం ఐఫోన్ 14 512 GB ధర రూ. 1,09,900 ఉంది. కానీ మాపుల్లో రూ.11,000 తగ్గింపుతో పాటు హెడ్ఎఫ్సీ క్యాష్బ్యాక్ రూ. 4,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 6,000 మొత్తంగా రూ. 21,000 తగ్గింపు లభిస్తోంది. ఐఫోన్ 14 128జీబీ, 256 జీబీ వేరియంట్లపైనా కూడా 10 శాతం మాపుల్ డిస్కౌంట్, హెచ్డీఎఫ్సీ క్యాష్బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్లను పొందవచ్చు. ఇదీ చదవండి: నెట్ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్స్క్రిప్షన్ చార్జీలు ఇక ఈఎంఐపై ఫోన్ కొనాలనుకుంటున్నవారి కోసం కూడా ప్రత్యేక ఆఫర్ను మాపుల్ కల్పిస్తోంది. బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్తో కలిసి నెలకు రూ.2,996 చొప్పున 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐపై జీరో డౌన్ పేమెంట్తో ఐఫోన్ 14ను అందిస్తోంది. ముంబై, మంగళూరులో స్టోర్లను కలిగి ఉన్న మాపుల్ దేశమంతటా ఈ-కామర్స్ సేవలు అందిస్తోంది. 5 లక్షల మందికిపైగా కస్టమర్లను కలిగి ఉంది. లేటెస్ట్ ఐఫోన్లు, మాక్బుక్లు, ఐపాడ్లు, యాపిల్ వాచ్లపై ఆఫర్ల గురించి మరింత తెలుసుకోవడానికి సమీపంలోని మాపుల్ స్టోర్ లేదా ఆన్లైన్లో maplestore.in ని సందర్శించవచ్చు. ఇదీ చదవండి: Apple Retail Store In Delhi: రెండో యాపిల్ స్టోర్ను ప్రారంభించిన టిమ్కుక్ -
ఐఫోన్ 14పై స్టీవ్ జాబ్స్ కూతురు.. ఇది కూడా ఎగతాళేనా?
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్..గత ఏడాది జరిగిన 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్'లో ఐఫోన్ 14 సిరీస్తో పాటు సిరీస్ 8, ఎయిర్పాడ్స్ ప్రో, వాచీ ఎస్ఈ2 లను విడుదల చేసింది. ఈ సందర్భంగా యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ ఐఫోన్ 13తో పోలిస్తే కొత్త ఐఫోన్ 14 పెద్దగా అప్డేట్ ఏమీ లేదంటూ ఓ సెటైరికల్ మీమ్ను షేర్ చేశారు. అయితే త్వరలో ఐఫోన్ 15 సిరీస్ విడుదల కానున్న తరుణంలో ఈవ్ జాబ్స్ ఐఫోన్ 14 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐఫోన్ 14 లేకుండా జీవించలేనని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు టెక్ వరల్డ్ చర్చనీయాంశంగా మారాయి. ఐఫోన్ 14 లేకపోతే జీవించలేను న్యూయార్స్ మ్యాగజైన్ ‘ది స్ట్రాటజిస్ట్’తో జరిగిన ఇంటర్వ్యూలో ఏ వస్తువులు మీ దగ్గర లేకపోతే జీవించలేరన్న ఇంటర్వ్యూర్ ప్రశ్నకు ఈవ్ జాబ్స్ స్పందించారు. తాను 9 వస్తువులు లేకపోతే జీవించలేనని ఆవేంటో చెప్పారు. వాటిల్లో ఐఫోన్ 14కూడా ఉంది. నిజం చెబుతున్నారా? దీంతో ఇంటర్వ్యూ చేసే యాంకర్ గతంలో ఐఫోన్ 14పై వేసిన సెటైర్ల గురించి ప్రస్తావించారు. అందుకు ఆమె ‘ఇది క్రియేటివ్స్ కోసం సృష్టించిన టూల్ అని, దాని డిజైన్ మాస్టర్ పీస్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. మనుషుల జీవన విధానాల్ని సమూలంగా మార్చిన ఐఫోన్ 14 జీనియస్ అని అన్నారు. కొందరు ఈ విషయంపై ఈవ్ జాబ్స్ నిజం చెబుతున్నారా? లేదంటే సెటైర్లు వేస్తున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ధరించిన చొక్కాలాంటిదే మరోటి కొనుక్కోవడం సాధారణంగా యాపిల్ విడుదల చేసే ఐఫోన్లన్నీ దాదాపు ఒకే తరహాలో ఉంటాయి. టెక్నాలజీ పరంగా ఫోన్లలో మార్పులు చేస్తుందే తప్పా డిజైన్లో పెద్దగా మార్పులుండవు. ఈవ్ జాబ్స్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఐఫోన్ 14 విడుదల సమయాలో ఓ మీమ్ను నెటిజన్లతో పంచుకున్నారు. ‘ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 14కు మారడం అంటే ప్రస్తుతం ధరించిన చొక్కాలాంటిదే మరోటి కొనుక్కోవడం లాంటిది’ అని చెప్పే మీమ్ను తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. గుర్రపుస్వారీలో నిష్టాతురాలు స్టీవ్ జాబ్స్ నలుగురు పిల్లలలో ఈవ్ జాబ్స్ చిన్న. ఆమె స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్, సైన్స్, టెక్నాలజీలో ప్రావీణ్యం సంపాదించింది. మోడల్, గుర్రపుస్వారీలో నిష్టాతురాలు కూడా. చదవండి👉 ‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్ -
అబ్బా ..ఇది కదా ఆఫర్ అంటే, ఐఫోన్ 14ను తక్కువ ధరకే సొంతం చేసుకోండి!
యాపిల్ ఐఫోన్ లవర్స్కు గుడ్న్యూస్. ఐఫోన్ 14 ఫోన్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో 128 జీబీ ఐఫోన్ 14 ధర రూ.71,999గా ఉంది. అయితే అదే ఫోన్ను ఎక్ఛేంజ్, బ్యాంక్ డిస్కౌంట్తో తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం దొరికింది. ఫ్లిప్కార్ట్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.30 వేల వరకు ఎక్ఛేంజ్ ఆఫర్లు అందిస్తుంది. ఈ ఎక్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే మీరు వినియోగిస్తున్న ఫోన్ కండీషన్ బాగుండాలి. పనితీరు ఆధారంగా ఎక్ఛేంజ్ ఆఫర్ ఎంత మొత్తం ఇవ్వాలనేది ఫ్లిప్కార్ట్ నిర్ణయం ఇస్తుంది. దీంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్తో కొనుగోలు చేస్తే మరో రూ.4వేల వరకు తగ్గుతుంది. ఐఫోన్ 14 ఫీచర్లు ఐఫోన్ 14 ఫీచర్ల విషయానికి వస్తే ఈ హాట్ డివైజ్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్, ప్రైమరీ 12ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సర్, సెకండరీ 12ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్తో పాటు వీడియో రికార్డింగ్ కోసం డాల్బీ విజన్ సపోర్ట్ కలిగిఉంది. 16 కోర్ ఎన్పీయూ, 5 కోర్ గ్రాఫిక్స్ ప్రాసెసర్తో కూడిన ఏ15 బయోనిక్ చిప్ను కలిగిఉంది. ఐఫోన్ 14 లేటెస్ట్ స్టేబుల్ ఐఓఎస్ 16 వెర్షన్పై రన్ అవుతుంది. చదవండి👉‘నో సిమ్ కార్డ్ ట్రేస్’.. ఐఫోన్ 15 సిరీస్పై ఆసక్తికర కథనాలు -
ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్: ఐఫోన్ 14 పై రూ. 44వేల భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: యాపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది.ఈ రోజు (మార్చి 31) ప్రారంభమయ్యే ఫ్లిప్కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్లో అనేక ఉత్పత్తులపై స్మార్ట్డీల్స్ అందిస్తోంది. ముఖ్యంగా ఖరీదైన ఐఫోన్ 14 స్మార్ట్ఫోన్ను సొంతం చేసుకోవాలనుకుంటున్న వారికి బంపర్ ఆఫర్. దాదాపు రూ. 44,901 తగ్గింపు తర్వాత కేవలం రూ. 34,999కి అందుబాటులో ఉంది. (సంక్షోభ సమయంలో హెచ్సీఎల్ టెక్ గుడ్న్యూస్) మార్చి 31 నుండి ఏప్రిల్ 3 వరకు జరిగే బిగ్ బచత్ ధమాల్ సేల్ సందర్భంగా ఫ్లిప్కార్ట్ మొబైల్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ.10,901 తగ్గింపుతో రూ.68,999కి విక్రయిస్తోంది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.4000 తక్షణ తగ్గింపు, స్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్లో రూ. 30,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అలా రూ. 44,901 తగ్గింపు తర్వాత యాపిల్ 14 ఫ్లిప్కార్ట్లో రూ. 34,999కి లభించనుంది. (ఇదీ చదవండి: హయ్యస్ట్ సాలరీతో మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టేసిన అవని మల్హోత్రా) యాపిల్ ఐఫోన్ 14లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే 12 ఎంపీ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా,12 ఎంపీ సెల్ఫీ కెమెరా లాంటి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (అచ్చం యాపిల్ స్మార్ట్వాచ్ అల్ట్రాలానే : ధర మాత్రం రూ. 1999లే!) -
‘నో సిమ్ కార్డ్ ట్రేస్’.. ఐఫోన్ 15 సిరీస్పై ఆసక్తికర కథనాలు
ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది. దీంతో ఐఫోన్ 15 మీద టెక్ లవర్స్ దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 15పై అనేక రూమర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్నాలజీ బ్లాగ్ మాక్ జనరేషన్ ఐఫోన్ 15 సిరీస్పై ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అందులో యాపిల్ సంస్థ సిమ్ కార్డ్ ట్రేస్ లేకుండా ఈ ఏడాది ఫ్రాన్స్లో ఐఫోన్ 15 అమ్మకాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. యాపిల్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంటే సిమ్ కార్డ్ ట్రేస్ లేని ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. ఫ్రాన్స్లో విక్రయాలు జరిగితే మిగిలిన ప్రపంచ దేశాల్లో సైతం ఐఫోన్లలో సిమ్ ట్రేస్ కనుమరుగు కానున్నాయి. ఐఫోన్ 15లో సిమ్ ట్రేస్ను తొలగిస్తే.. మొబైల్ నెట్ వర్క్ సాయంతో యాపిల్ ఫోన్లు ఈ - సిమ్ కార్డ్లతో పనిచేస్తాయి. ఫిజికల్ సిమ్ కార్డ్ లేకుండా మొబైల్ నెట్ వర్క్తో మొబైల్స్ పనిచేసేలా ఈ-సిమ్స్ వినియోగదారులను అనుమతిస్తుంది. ఐఫోన్ 14లో ఈ - సిమ్ ఐఫోన్ 14 విడుల సమయంలో యాపిల్ సంస్థ ఈ - సిమ్ల వినియోగాన్ని ప్రోత్సహిచింది. ఎందుకంటే ఫిజికల్ సిమ్కార్డ్లతో పోలిస్తే ఇది మరింత సురక్షితమైనదని భావించింది. వీటిని విరగొట్టుచ్చు లేదా దొంగిలించవచ్చు. 2022లో యూఎస్లో విక్రయించబడిన ఐఫోన్ 14 సిరీస్లో యాపిల్ సిమ్ కార్డ్ ట్రేని తొలగించి విక్రయాలు నిర్వహించింది. ప్రస్తుతం, ఐఫోన్ 13, కొత్త ఐఫోన్ ఉత్పత్తులలో ఒకేసారి రెండు ఈ సిమ్లు పనిచేసే సౌకర్యం ఉంది. సిమ్ కార్డ్ ట్రేలు లేకుండా యాపిల్ ఐఫోన్ 15 మోడళ్లను భారత్లో విడుదల చేస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. -
ఐఫోన్ ఎల్లో వేరియంట్పై భలే డిస్కౌంట్!
మనలో చాలా మందికి ఐఫోన్లంటే బాగా క్రేజ్. ప్రతి ఒక్కరూ ఐఫోన్ కొనాలని కలలు కంటారు. కానీ వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో కొనలేకపోతుంటారు. అయితే పలు ఐఫోన్ మోడళ్లపై ఇటీవల భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వీటిని గరిష్టంగా ఉపయోగించుకుంటే తక్కువ ధరకే కలల ఫోన్ను సొంతం చేసుకోవచ్చు. ఇదీ చదవండి: Realme C33 2023: తక్కువ ధరలో రియల్మీ ఫోన్లు... కిర్రాక్ ఫీచర్లు! ఐఫోన్ 14 సిరీస్లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ఫోన్లు గతేదాది ఐదు రంగుల్లో విడుదలైంది. మళ్లీ ఈ మధ్య మరో కలర్ వేరియంట్ను యాపిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే ఎల్లో వేరియంట్. యాపిల్ డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన రెడింగ్టన్ ఐఫోన్ 14 సిరీస్ ఎల్లో వేరియంట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లపై రూ.15,000 వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది. స్టోర్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, పాత ఐఫోన్ల ఎక్సేంజ్ ద్వారా ఈ తగ్గింపు లభిస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా కూడా ఈ తగ్గింపులు పొందవచ్చు. ఇదీ చదవండి: 100 సీసీ హోండా షైన్ వచ్చేసింది! ధర దాని కంటే తక్కువే.. ఈ ఐఫోన్ 14 ఎల్లో వేరియంట్ మార్చి 10 నుంచి ప్రీ ఆర్డర్ కోసం అందుబాటులోకి వచ్చింది. మార్చి 14 నుంచి రిటైల్ స్టోర్లలో విక్రయిస్తున్నారు. ఐఫోన్ 14 ఎల్లో వేరియంట్ ధర రూ. 79,990. ఐఫోన్ 14 ఎల్లో వేరియంట్ ప్లస్ ప్రారంభ ధర రూ. 89,990. అయితే ఇందులో రంగు తప్ప ఎటువంటి అప్డేట్లు ఇవ్వలేదు. 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే, A15 బయోనిక్ చిప్సెట్తో వస్తుంది. ఇక ఐఫోన్ 14 ప్లస్లో 6.7 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. ఇందులో మూడు వేరియంట్లు 128జీబీ స్టోరేజ్ 6జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ 6జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ 6జీబీ ర్యామ్ అందుబాటులో ఉన్నాయి. ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్? భారీగా పతనమైన షేర్లు.. -
నయా కలర్ ఆప్షన్.. ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్!
మార్కెట్లో 'ఐఫోన్స్'కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఇందులో కస్టమర్లు ఆధునిక ఫీచర్స్ ఉన్న వాటిని మాత్రమే కాకుండా, లేటెస్ట్ కలర్ ఆప్షన్ కూడా ఎంపిక చేసుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఇప్పుడు ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మొబైళ్లను కొత్త ఎల్లో కలర్ ఆప్షన్లో తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు పింక్, వైట్, గ్రే మొదలైన కలర్స్లో అందుబాటులో ఉన్న ఐఫోన్స్ రానున్న రోజుల్లో 'ఎల్లో' ఆప్షన్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్లో విడుదలైన ఐఫోన్ 14 సిరీస్ నయా కలర్ పొందుతున్నట్లు జపాన్కు చెందిన బ్లాగ్ మ్యాక్ఒటాకర వెల్లడించింది. (ఇదీ చదవండి: సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్: కేవలం 300 మందికి మాత్రమే!) గతంలో ఎల్లో కలర్ అనేది ఐఫోన్ 11 సిరీస్లో ఉండేది. అయితే నాలుగేళ్ల తరువాత కంపెనీ మళ్ళీ ఐఫోన్ 14లో ఈ కలర్ తీసుకురావాలని సంకల్పించింది. అయితే ఈ కొత్త కలర్ ప్రొడక్ట్ ప్లానింగ్ వచ్చే వారంలో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఐఫోన్ 13కి గ్రీన్ కలర్ అందించింది. నిజానికి యాపిల్ కంపెనీ సెప్టెంబర్ నెలలో కొత్త సిరీస్ మొబైల్స్ లాంచ్ చేస్తుంది. ఆ తరువాత సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఆ సిరీస్లో కొత్త కలర్ వేరియంట్లను ప్రవేశపెడుతుంటుంది. 2022 మార్చిలో కంపెనీ ఐఫోన్ 13 సిరీస్కు గ్రీన్ కలర్, ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ ఫోన్లకు 2021 ఏప్రిల్లో పర్పుల్ కలర్ ఆప్షన్ అందించింది. కొనుగోలుదారులను ఆకర్శించడానికి కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కలర్స్ విడుదల చేస్తుంది. -
ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపరాఫర్!..మరీ ఇంత డిస్కౌంటా?
హోలీ సందర్భంగా కొనసాగుతున్న బిగ్ బచత్ ధమాల్ సేల్లో ఐఫోన్ 13,ఐఫోన్ 14 ఫోన్లపై ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక సేల్లో దాదాపు 1000 కి పైగా బ్రాండ్స్కి చెందిన దాదాపు లక్షకుపైగా ప్రోడక్ట్స్పై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. వీటితో పాటు పాపులర్ స్మార్ట్ఫోన్లైన ఐఫోన్ 13,ఐఫోన్ 14 మోడళ్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లకే అందిస్తున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆఫర్లో భాగంగా ఐఫోన్ 13 ధర రూ.61,999 ఉండగా..రూ.59,999కే కొనుగోలు చేయొచ్చు. ఫోన్పై ఎక్ఛేంజ్ ఆఫర్ సౌకర్యం ఉంటే ఆ ధర కాస్త రూ.23,000 వరకు తగ్గుతుంది. అదే సమయంలో ఐఫోన్ 14 ధర రూ.71,999 ఉండగా..సేల్లో రూ.67,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక స్మార్ట్ఫోన్లు కాకుండా గృహోపకరణాలు, వంటగదిలో వినియోగించే వస్తువులు,హోమ్ అప్లయెన్సెస్ పై 70శాతం, రిఫ్రిజిరేటర్లపై 60శాతం డిస్కౌంట్స్, ల్యాప్ట్యాప్స్పై 45శాతం డిస్కౌంట్ పొందవచ్చు. -
ఐఫోన్ 15 సిరీస్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. కలర్స్పై ఓ లుక్కేయండి!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ గత ఏడాది సెప్టెంబర్లో ఐఫోన్ 14 సిరీస్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫోన్ విడుదలై కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఐఫోన్ 14 కంటే తదుపరి సిరీస్ ఐఫోన్ 15లో లేటెస్ట్ టెక్నాలజీ జోడించడంతో పాటు వివిధ రకాలైన కలర్స్తో మార్కెట్కు పరిచయం చేయాలని యాపిల్ సంస్థ భావిస్తోంది. ఈ తరుణంలో ఐఫోన్ 15 సిరీస్లో వనిల్లా కొత్త వేరియంట్స్ కలర్స్తో మార్కెట్కు పరిచయం చేయనున్నట్లు ‘9 టూ 5 మాక్’ నివేదిక తెలిపింది. వనిల్లా ఐఫోన్ 15 సిరీస్లో డార్క్ పింక్, లైట్ బ్లూ కలర్స్తో పాటు సెల్ఫీ జనరేటెడ్ రెండర్ ఇమేజ్ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు పింక్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్లలో వనిల్లా ఐఫోన్ 15 ఇమేజ్లను విడుదల చేయడంపై ఆసక్తి మరింత పెరిగింది. ఐఫోన్ 15సిరీస్లో బ్లాక్ , వైట్, రెడ్ వేరియంట్స్ కలర్స్తో మార్కెట్కు పరిచయం కానుందని నివేదికలు చెబుతున్నాయి. కానీ లేటెస్ట్ కలర్స్పై యాపిల్ స్పందించలేదు. ఇక రిపోర్ట్ల ప్రకారం.. ఈ ఏడాది ఐఫోన్ 15 ప్రో మోడల్స్ను స్పెషల్ కలర్స్ లాంచ్ చేయనుంది. ముఖ్యంగా ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్/ ఆల్ట్రా మోడల్స్లో డార్క్ రెడ్ కలర్స్తో టైటానియం ఫినిష్తో రానుంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ డిస్ప్లేల చుట్టూ తిన్నర్ బెజెల్స్, ఐఫోన్ 14 తరహా స్క్రీన్ను పోలి ఉండనుందని గతంలోనే పలు నివేదికలు తెలిపాయి. తాజా నివేదికలు సైతం యాపిల్ వాచ్ తరహా డిజైన్లతో థిన్ బెజెల్స్, కర్డ్వ్ షేప్స్తో విడుదల కానున్నట్లు సమాచారం. -
ఐఫోన్14.. యాపిల్ బంపర్ ఆఫర్!
తక్కువ ధరకు యాపిల్ ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే. రూ.80 వేల విలువైన ఐఫోన్ 14ను రూ.14 వేలకే అందిస్తోంది యాపిల్. ఐఫోన్ 14ను ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్లతో యాపిల్ గతేడాది విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.79,999. యాపిల్ స్టోర్ ఎప్పుడో గానీ డిస్కౌంట్లు ఇవ్వదు. కానీ ఐఫోన్ 14పై మాత్రం భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇందులో రెండు రకాల ఆఫర్లు ఉన్నాయి. మొదటి పాత ఫోన్ ఎక్సేంజ్, రెండోది బ్యాంక్ ఆఫర్. వీటిని ఉపయోగించుకుని చాలా తక్కువ ధరకే ఐఫోన్14 కొనుక్కోవచ్చు. అది ఎలాగో చూడండి... అన్ని రకాల ఆఫర్లు, డిస్కౌంట్లను వినియోగించుకుంటే యాపిల్ స్టోర్లో ఐఫోన్ 14 రూ.14,170 లభిస్తోంది. రూ.79,990 ఉండే ఈ ఫోన్ను యాపిల్ ప్రాథమిక ఆఫర్తో రూ.58,730కు ఉంచింది. ఆ తర్వాత పనిచేసే కండీషన్లో ఉన్న మీ పాత ఫోన్ను ఎక్సేంజ్ చేసుకుంటే గరిష్ట మొత్తంలో ఆఫర్ లభిస్తుంది. ఇక్కడ బయటకు కనిపించని ఒక సీక్రెట్ ఏంటంటే.. పైకి ఎంతో ఆసక్తికరంగా కనిపించే ఈ ఆఫర్ లో కొన్ని లిటిగేషన్ లు కూడా ఉన్నాయి. పాత ఫోన్ అనగానే మనం వాడే ఫోన్ తీసుకెళ్తే దానికి అంతగా విలువ కట్టరు. యాపిల్ ఫోన్లను ప్రతీసారి అప్ డేట్ చేసుకునే కస్టమర్లు కొందరు ఉంటారు. కొత్త మోడల్ వచ్చిన ప్రతీసారి వారు తమ వద్ద ఉన్న మోడల్ ను ఇచ్చి కొత్తది తీసుకుంటారు. అలాగే ఐఫోన్ 14 విషయంలోనూ ఇలాంటి షరతే వర్తిస్తుంది. మీ దగ్గర మంచి కండీషన్ లో ఉన్న ఐఫోన్ 12 లేదా ఐఫోన్ 13 మోడల్ ఉంటే.. దానికి గరిష్టంగా కట్టే విలువ దాదాపు రూ.35 వేలు. ఇక హెచ్డీఎఫ్సీ కార్డ్లతో చెల్లింపులు చేస్తే రూ.7వేలకు పైగా డిస్కౌంట్ వస్తుంది. ఇలా అన్ని ఆఫర్లు, డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే రూ.14,170కే ఐఫోన్ 14 మీ సొంతం అవుతుంది. పైకి సులభంగా అనిపించినా.. షరతులన్నీ చూసుకుంటే.. లాభమా? నష్టమా? వినియోగదారులే నిర్ణయించుకోవాలి. (ఇదీ చదవండి: హైడ్రోజన్తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి) -
Valentine’s Day sale: ఐఫోన్14 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: వాలెండైన్స్ డే అంటేనే బిజినెస్ వర్గాలకు సందడి. వాలెండైన్స్ డే డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు పలు ఆఫర్స్ను అందిస్తుంటాయి. అందులోనూ ఐఫోన్ల మీద తగ్గింపు అంటే ప్రేమికులు ఎగబడరూ! ఈ క్రేజ్ నేపథ్యంలో యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపుధరలు అందుబాటులో ఉన్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్ ఫోనలపై 12,195 దాకా తగ్గింపు లభిస్తోంది. దీంతోపాటు బ్యాంక్ కార్డ్లపై తక్షణ తగ్గింపులతో పాటు తక్షణ క్యాష్బ్యాక్ ఆఫర్లను కలిగి ఉన్నాయని గమనించాలి. HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు మరో రూ.4,000 క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 14పై 6వేలు, ఐ ఫోన్ 14 ప్లస్పై 7వేల దాకా తక్షణ డిస్కౌంట్ లభ్యం. ఐఫోన్ 14: ఐఫోన్ 14 ఇపుడు రూ. 67,705లకే కొనుగోలు చేయవచ్చు. గత సెప్టెంబర్లో లాంచింగ్ ధర రూ. 79,900 ఐఫోన్ 14 ప్లస్: ఐఫోన్ 14 ప్లస్ రూ. రూ. 84,900 గత సెప్టెంబర్లో దీని లాంచింగ్ ధర రూ. 89,900 ప్రో మోడల్స్పై కూడా ఆఫర్ అలాగే ఐఫోన్ 14 ప్రో , ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ పై డిస్కౌంట్ అందుబాటులోఉంది. రూ. 129,900వద్ద లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రోను ఈ సేల్లో రూ. 1,25,400కు కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ రూ. 1,35,400కే లభ్యం. అసలు ధర రూ. 139,900 ఇతర ఉత్పతులపై కూడా ఫిబ్రవరి 28 వరకూ సేల్! ఈ సేల్, తగ్గింపు ఆఫర్లు ఫిబ్రవరి 28 వరకు మాత్రమే ఈ అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు ఇతర ఉత్పత్తులపై కూడా తగ్గింపు లభ్యం. -
వావ్ ఐఫోన్ పై మరో క్రేజీ ఆఫర్! ఇంకెందుకు ఆలస్యం..ఇప్పుడే సొంతం చేసుకోండి!
సామర్ధ్యం ఉండి.. ఐఫోన్ను కొనలేకపోయామే అని బాధపడుతున్న ఐఫోన్ లవర్స్కు శుభవార్త. గతేడాది మార్కెట్లో యాపిల్ శాంసంగ్, వన్ ప్లస్తో పాటు ఇతర సంస్థలు భారీ ఎత్తున ఫోన్లను విడుదల చేశాయి. ఏ సంస్థ నుంచి ఎన్ని ఫోన్లు విడుదలైన అందులో ఐఫోన్కు ప్రత్యేకత వేరే ఉంటుంది. అందుకే స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ జీవితంలో ఒక్కసారైన ఐఫోన్ను వినియోగించాలని అనుకుంటారు. కానీ ఆ ఫోన్ ధర కారణంగా వెనక్కి తగ్గుతుంటారు. ఇప్పుడు అలాంటి వారి కోసమే ఈకామర్స్ కంపెనీలు భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ దేశీయ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఐఫోన్ అమ్మకాలపై క్రేజీ ఆఫర్ను ప్రకటించింది. 2022 ఆగస్ట్ నెలలో యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ను విడుదల చేసింది. ఆ సిరీస్లోని ఐఫోన్ 14 పై భారీ ఎత్తున డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. రీటైల్ మార్కెట్లో ఆఫోన్ ధర రూ.80 వేలు ఉండగా.. ఇప్పుడు అదే ఫోన్ పై రూ.5,910 డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇలా ఫ్లిప్ కార్ట్తో పాటు ఇతర డిస్కౌంట్లతో ఆ ఫోన్ ధర రూ.50,990కి తగ్గింది. ఒకవేళ మీరు 128 జీబీ వేరీయంట్ ఐఫోన్ 14ను ఎక్ఛేంజీలో సైతం కొనుక్కోవచ్చు. ఫోన్ కండీషన్ బాగుండి, మేజర్ సమస్యలు లేకపోతే ట్రేడ్- ఇన్ డిస్కౌంట్ వ్యాల్యూ ఆధారంగా క్యాలిక్లేట్ చేసి మీ ఫోన్ పై ఎంత ఎక్ఛేంజీ ఇవ్వాలో నిర్ధారిస్తారు ఐఫోన్ ప్రతినిధులు. ఆఫోన్పై ఎక్ఛేంజ్తో రూ.23వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఎగ్జిస్టింట్ ఇన్స్టంట్ డిస్కౌంట్ కింద 7శాతం డిస్కౌంట్, ఇతర బ్యాంక్లు ఇచ్చే ఆఫర్లు ఇలా మొత్తం కలిపితే రూ.40వేలకే ఫోన్ కొనుగోలు చేయొచ్చని ప్లిప్ కార్ట్ తెలిపింది. కాగా, యాపిల్ కంపెనీ త్వరలో ఐఫోన్ 15 సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చదవండి👉‘నా దారి నేను చూసుకుంటా’, చైనాకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారీ షాక్! -
ఐఫోన్ 14లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్.. అది ఎలా పనిచేస్తుందంటే?
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. పంత్ ఢిల్లీ నుంచి తన స్వస్థలం ఉత్తరాఖండ్కు వస్తున్న సమయంలో.. రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అతని కారులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న పంత్ను అదే మార్గంలో హరిద్వార్ వెళ్తున్న బస్ డ్రైవర్ సునీల్ కారులో నుంచి బయటకు లాగారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఇలాంటి ప్రమాదాల నుంచి యూజర్లను కాపాడేందుకే యాపిల్ సంస్థ ఐఫోన్ 14లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ను అభివృద్ధి చేసింది. ఐఫోన్, యాపిల్ వాచ్ వినియోగిస్తున్న యూజర్లు రోడ్డు ప్రమాదాలకు గురైతే అత్యవసర సేవలకు కనెక్ట్ అయ్యేందుకు సహాయ పడుతుంది. యాపిల్ కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అంటే ఏమిటి? క్రాష్ డిటెక్షన్ ఫీచర్ అనేది సెడాన్లు, మినీవ్యాన్లు,ఎస్యూవీలు, పికప్ ట్రక్కులు, ఇతర ప్యాసింజర్ కార్లతో కూడిన ఫ్రంట్-ఇంపాక్ట్, సైడ్-ఇంపాక్ట్ వంటి కారు ప్రమాదాల్ని గుర్తించేందుకు సహాయపడుతుంది. ఆ ఫీచర్ ఇప్పుడు ఐఫోన్ 14 మోడల్స్తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8, యాపిల్ వాచ్ ఎస్ఈ (2వ తరం), యాపిల్ వాచ్ ఆల్ట్రా తాజా వెర్షన్ వాచ్ఓఎస్లో సైతం అందుబాటులోకి వచ్చింది. కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ ఎలా పని చేస్తుంది? ఐఫోన్ 14 మోడల్లలో క్రాష్ డిటెక్షన్ డిఫాల్ట్గా ఆన్ ఆవుతుంది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అలారం మోగుతుంది. ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్లో రోడ్డు ప్రమాదానికి గురైనట్లు చూపిస్తుంది. వెంటనే ఫోన్ స్క్రీన్ మీద ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ల స్లైడర్ డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసే పరిస్థితుల్లో లేరంటే 20 సెకన్లలో అదే నెంబర్కు ఫోన్ కాల్ వెళుతుంది. ప్రమాదంలో ఉన్నారని కుటుంబ సభ్యులు, స్నేహితులు, పోలీసులు, దగ్గరలో ఉన్న హాస్పటల్స్కు వాయిస్ కాల్స్ వెళతాయి. -
యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ గత కొన్నేళ్లుగా యూజర్ల ప్రాణాల్ని కాపాడేలా క్రాష్ డిటెక్షన్ ఫీచర్తో ప్రొడక్ట్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, యాపిల్ వాచ్ సిరీస్ 8, యాపిల్ వాచ్ ఆల్ట్రాలలో ఈ లేటెస్ట్ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఆ ఫీచరే ఓ మహిళ ప్రాణాల్ని కాపాడింది. అదెలా అంటారా? రెడ్డిట్ పోస్ట్ ప్రకారం..ఐఫోన్ 14 క్రాష్ డిటెక్షన్ ఫీచర్ భార్య రోడ్డు ప్రమాదానికి గురైందంటూ భర్తను అప్రమత్తం చేసింది. అంతేకాదు యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో అడ్రస్ చెప్పి భర్తను అలెర్ట్ చేయడంతో అంబులెన్స్ కంటే ముందే వెళ్లి ఘటన స్థలంలో నెత్తుటి మడుగులో ఉన్న భార్యను ఆస్పత్రికి తరలించి ప్రాణం కాపాడుకున్నాడు. ఈ సందర్భంగా భర్త తనకు ఎదురైన అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. నేను ఆఫీస్ పని మీద క్లయింట్ను కలిసిందేకు వెళ్తున్నాను. అదే సమయంలో దుకాణం నుంచి ఇంటికి వెళ్తున్న నా భార్య ఫోన్ చేస్తే..ఆమెతో మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతుండగానే నా భార్య గట్టిగా కేకలు వేసింది. సెకన్ల వ్యవధిలో ఆమె ఫోన్ పని చేయడం ఆగిపోయింది. ఏమైందోనని కంగారుగా బయలు దేరుతుండగా అప్పుడే ఓ మెసేజ్ వచ్చింది. మీ భార్యకు యాక్సిడెంట్ అయ్యింది. ప్రమాదం ఈ ప్రాంతంలో జరిగిందంటూ అడ్రస్ సైతం ఆ మెసేజ్లో ఉంది. అంబులెన్స్ కంటే ముందు ఆ ప్రదేశానికి వెళ్లాను. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి నా భార్యను కాపాడుకోగలిగాను అంటూ రెడ్డిట్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. -
ఐఫోన్ 14పై క్రేజీ ఆఫర్ రూ. 50 వేలకే!
సాక్షి,ముంబై: యాపిల్ ఐఫోన్లపై డిస్కౌంట్ అంటే ఐఫోన్ లవర్స్కు పండగే. అందులోనూ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 14పై అంటే చెప్పనక్కరలేదు. ఫ్లిప్కార్ట్పై భారీ డిస్కౌంట్పై అందుబాటులో ఉంది.దీపావళి సేల్స్ సమయంలో కూడా ఇవ్వని తగ్గింపును ఇపుడు ఇవ్వడం గమనార్హం. స్మార్ట్ఫోన్ లాంచ్ అయిన కొద్ది నెలలకే తగ్గింపు ధరకు లభిస్తోంది. తాజాగా ఐఫోన్ 14ను రూ. 51,900 కంటే తక్కువ ధరకు పొందవచ్చు. అసలు ధర రూ. 79,900 కంటే రూ. 28,000 తక్కువన్నమాట.ఐఫోన్ 14 128జీబీ మోడల్ ఎంఆర్పీ రూ.79,900 కాగా ఫ్లిప్కార్ట్లో రూ .77,400కు లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ . 5000 తగ్గింపు అదనం. (PepsiCo Layoffs 2022: కార్పొరేట్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!) అలాగే పాతఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్పై యూజర్లు రూ.20,500 వరకూ తగ్గింపు పొందుతారు. ఎక్స్ఛేంజ్ డీల్తో లేటెస్ట్ యాపిల్ స్మార్ట్ఫోన్ ధర రూ. 51,900కు అందుబాటులో ఉంటుంది. రూ. 20,500 ఎక్స్ఛేంజ్ విలువ ప్రీమియం స్మార్ట్ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది. ఐఫోన్ 12 Pro ద్వారా రూ. 20వేలు, ఐఫోన్ 11 ధరపై రూ. 15వేలు తగ్గింపు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S20 Ultra మార్పిడి విలువ రూ. 12,450.వన్ప్లస్ 7టీ ద్వారా 10,100 రూపాయల ఎక్స్ఛేంజ్ లభిస్తుంది. దీంతోపాటు ఐఫోన్ 13ను కూడా తక్కువ ధరకే ఫ్లిప్కార్ట్పై సొంతం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: మారుతి బాటలో, టాటా మెటార్స్: కస్టమర్లకు కష్టకాలం!) -
ప్రాణాలు కాపాడుతున్న ఐఫోన్లు..అప్పుడు దూసుకొచ్చిన బుల్లెట్..ఇప్పుడు
ఐఫోన్ ఉక్రెయిన్ సైనికుడిని కాపాడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే ఐఫోన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడింది. ఈ ఏడాది జులైలో ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా సైన్యం తుపాకులతో దాడి చేసింది. ఈ దాడిలో ఉక్రెయిన్ సైనికుడి బ్యాగులో ఉన్న 2019 మోడల్ ఐఫోన్ 11ప్రోకు బులెట్ తగలడంతో సదరు సైనికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా యాపిల్ ఐఫోన్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ వ్యక్తి ప్రాణం నిలబెట్టింది. టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల ఐఓఎస్ 16.1 అప్డేట్ చేసింది. దీంతో ఐఫోన్-14 శాటిలైట్ ఫీచర్ వినియోగించుకునే సౌకర్యం ఏర్పడింది. ఈ ఫీచర్ సాయంతో వైఫై, ఇంటర్నెట్ సదుపాయం లేకుండా ప్రమాదంలో ఉన్న యూజర్లు తమ ప్రాణాల్ని కాపాడుకోవచ్చు. అలా శాటిలైట్ ఫీచర్తో మంచుతో కప్పబడిన అలాస్కా పర్వతాల్లో చిక్కుకున్న వ్యక్తి ప్రాణాలు పోకుండా సురక్షితంగా ప్రాణాల్ని కాపాడగలింది. అమెరికాలో స్నో మెషిన్ సాయంతో నూర్విక్ నుండి కోట్జెబ్యూకు ఓ వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. మంచు ఎక్కువగా కురియడంతో ఓ ప్రాంతంలో చిక్కుకున్నాడు. చేతిలో ఫోన్ ఉంది. స్నేహితులకు సమాచారం ఇచ్చేందుకు ఫోన్ నెట్ వర్క్ , ఇంటర్నెట్,వైఫై ఇలా కనీస సదుపాయాలు లేవు. ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడే అతనికి ఓ మెరుపులాంటి ఐడియా వచ్చింది. వెంటనే ఐఫోన్14 లో శాటిలైట్ ఫీచర్ను ఆన్ చేసి అలాస్కా రక్షణా బలగాలకు సమాచారం అందించాడు. ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నాయని, కాపాడమని కోరాడు. ఓ వ్యక్తి మంచులో చిక్కుకుపోయాడని అధికారులు అప్రమత్తం చేసిన వెంటనే, రెస్క్యూ టీమ్లను యాపిల్ షేర్ చేసిన ప్రదేశంలో మోహరించారు. ప్రమాదం అంచున ఉన్న బాధితుణ్ని కాపాడి అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సకాలంలో ట్రీట్మెంట్ అందడంతో ప్రాణాలతో భయటపడినట్లు అధికారులు తెలిపారు. -
మీ యాపిల్ ఐఫోన్ 14 కంటే..మా చైనా ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువ
ఒక్కసారి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఎన్ని ఎక్కువ గంటలు వినియోగించుకునే అంశంలో స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజ సంస్థలు బహిరంగంగా సవాళ్లు విసురుకుంటున్నాయి. తాజాగా చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ డిసెంబర్ 1న ‘షోవోమీ 13’ను లాంచ్ చేయనుంది. అంతకంటే ముందే ఫోన్ గురించి వివరించేందుకు ఆ సంస్థ ఓ ఈవెంట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా షావోమీ సీఈవో, ఫౌండర్ లీ జూన్..మరో స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ యాపిల్కు బహిరంగంగా సవాల్ చేశారు. యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ కంటే తాము విడుదల చేయనున్న షోవోమీ 13 ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మా ఫోనే గొప్ప చైనాకు చెందిన సోషల్ మీడియా నెట్ వర్క్ సంస్థ వీబో (ట్విటర్ తరహా) ఓ పోస్ట్ను షేర్ చేసింది. అందులో షోవోమీ ఫౌండర్ లీ జూన్ యాపిల్ ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ కంటే షావోమీ 13 బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉందని తెలిపారు. అంతేకాదు అందుకు సంబంధించి షోవోమీ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ స్క్రీన్ షాట్ను షేర్ చేశారు. ఆ పోస్ట్లో షోవోమీ13ను మిగిలిన ఫోన్లతో పోల్చారు. ఆ ఫోన్ల కంటే ఈ ఫోన్ పనితీరు బాగుంటుందని ధీమాగా చెబుతున్నారు. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 14, గతంలో విడుదలైన షోవీమీ 12ఎస్, షోవోమీ 12ఎస్ ఆల్ట్రా, షావోమీ 12ఎస్ ప్రో, హువావే పీ 50 ప్రో, శాంసంగ్ ఎస్ 22 ఆల్ట్రా కంటే షావోమీ 13 ఫోన్ను సింగిల్ ఛార్జ్తో బ్యాటరీని ఎక్కువ గంటలు వినియోగించుకోవచ్చని షావోమీ వివరించింది. డీఓయూ టెస్ట్లో తేలింది డీఓయూ టెస్ట్ అనే ప్రతి రోజు మనం వినియోగించే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఎంత సేపు ఉంటుందో సూచిస్తుంది. స్కోర్ సైతం అందిస్తుంది. లాంచ్ కానున్న షావోమీ -13 ఫ్లాగ్షిప్ బ్యాటరీ లైఫ్ టెస్ట్లో 1.37 స్కోర్ చేయగా ఐఫోన్ 14, 14 ప్రో మ్యాక్స్లు 1.28 స్కోర్ నమోదు చేశాయి. ఇక షోవీమీ ఫోన్ 4,500ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్ను అందిస్తుండగా.. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 4 మాత్రం 4,323ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్తో షిప్పింగ్ చేస్తోంది. షావోమీతో పాటు షావోమీ డిసెంబర్ 1న లాంచ్ ఈవెంట్ను నిర్వహించనుంది. ఈవెంట్లో ఫ్లాగ్షిప్ షావోమీ13 సిరీస్తో పాటు షోవోమీ వాచ్ ఎస్2, షావోమీ బడ్స్ 4, ఎంఐయూ 14 లను లాంచ్ చేయాలని భావిస్తోంది. అయితే, షోవీమీ మాత్రం భారత్, ఇతర దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టం చేయలేదు. చదవండి👉 ‘ఎలాన్ మస్క్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది’..విడుదల ఎప్పుడు, ధర ఎంత! -
యాపిల్ ఐఫోన్ 14.. ఇక కష్టమే..
-
ఆ ఐఫోన్ను కొనే దిక్కులేదు!..తయారీ నిలిపేసిన ‘యాపిల్’!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్ 14 ప్లస్పై పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి. డిమాండ్ లేకపోవడంతో ఫోన్ల తయారీని నిలిపివేయాలని మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థలకు యాపిల్ ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14సిరీస్లోని ప్లస్తో పాటు గతంలో కొనుగోలు దారుల్ని అంతగా ఆకట్టుకోని ఫోన్లను సైతం ఇలాగే నిలిపి వేసింది. సెప్టెంబర్ 16న అమెరికా క్యాలిఫోర్నియా యాపిల్ ప్రధాన కార్యాలయం క్యూపర్టినో వేదికగా యాపిల్ సంస్థ ఐఫోన్ 14 ను విడుదల చేసింది. గత నెలలో ఐఫోన్ 14 ప్లస్ సేల్ ప్రారంభించింది. అయితే ఈ సేల్లో 6.7 అంగుళాల డిస్ప్లే, సింగిల్ ఛార్జ్తో ఎక్కువ రోజులు ఫోన్ను వినియోగించే సామర్ధ్యం ఉన్న ఈ ఫోన్ అమ్మకాలు ఊహించని విధంగా జరుగుతాయని యాపిల్ అంచనా వేసింది. వాస్తవానికి నిపుణులు సైతం పెద్ద డిస్ప్లే ఫోన్లకు డిమాండ్, తక్కువ ధర ($899) దానికి తోడు హాలిడేస్ రావడంతో ఐఫోన్ 14 ప్లస్ సేల్స్ జరుగుతాయని అనుకున్నారు. కానీ యాపిల్, నిపుణుల అంచనాలు తారుమారయ్యాయి. పెద్ద స్క్రీన్ ఫోన్ను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఇంటస్ట్ర్ చూపించలేదు. దీంతో యాపిల్ తన ఐఫోన్ 14ప్లస్ ప్రొడక్షన్ను తగ్గించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. యాపిల్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో 900 లక్షల యూనిట్ల ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను తయారీ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఊహించిన దానికంటే 30 లక్షల ఫోన్ల తయారీని తగ్గించాలని భావిస్తోంది. యాపిల్ సంస్థ, ఐఫోన్లను సప్లయి చేసే సంస్థలు ఇప్పుడు 870 లక్షల యూనిట్లు లేదా అంతకంటే తక్కువగా తయారు చేయాలని భావిస్తున్నారు.సేల్స్ లేకపోవడంతో ఐఫోన్ 14లోని ఐఫోన్ 14, 14 ప్లస్ మోడళ్ల ప్రొడక్షన్ను తగ్గించనుందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. డిమాండ్ లేకపోవడంతో సేల్స్ తగ్గినప్పటికీ యాపిల్ గతంలోనే ఈ లేటెస్ట్ వెర్షన్ ఫోన్ల తయారీని భారీగా తగ్గించింది. గతంలో ఐఫోన్8, ఐఫోన్ 12 మినీ మోడల్ ఫోన్లు ఆకట్టుకోకపోవడంతో తయారీని తగ్గించేసింది. చదవండి👉 ‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్ -
ఐఫోన్ 14 కొనుగోలు చేశారా? తాజా వార్నింగ్ ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 14 మోడల్స్ (ఐఫోన్ 14 ప్రొ,ప్రో మ్యాక్స్) కొనుగోలు చేసిన వినియోగదారులకు మరికొంత కాలం వేచి ఉండాల్సి వస్తుందనే హెచ్చరికలను జారీచేసింది. కరోనా కారణంగా తమ వినియోగదారులకు ఐఫోన్ 14 డెలివరీ అనుకున్న దానికంటే ఆలస్యం కానుందని యాపిల్ తెలిపింది. ఇటీవల కోవిడ్ మళ్లీ విజృంభిస్తుండటం, ఆంక్షలతో ఉత్పత్తి ఆలస్యమవుతోందని వెల్లడించింది. చైనాలోని జెంగ్జౌలో కరోనా ఆంక్షలు అసెంబ్లింగ్ ప్లాంట్ను తాత్కాలింగా ప్రభావితం చేశాయని, ప్రస్తుతం చాలా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తోందని వెల్లడించింది. అలాగే సప్లయ్ చెయిన్ కార్మికుల ఆరోగ్యం, భద్రకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫలితంగా షిప్మెంట్స్ లేట్ అవుతున్నాయని తాజా ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉందని తెలిపింది. (ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్: రూ.40 వేల భారీ డిస్కౌంట్) చైనాలో రానున్న ఇయర్ ఎండ్ హాలిడే సీజన్కు ముందు చాలావరకు ఎలక్ట్రానిక్స్ తయారీదారులు బిజీగా ఉంటారు. కానీ ఇదే సమయంలో కరోనా ఆంక్షలు అక్కడి ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. సుమారు 2 లక్షలమంది ఉద్యోగులు పనిచేసే సెంట్రల్ చైనాలోని జెంగ్జౌ యాపిల్కు ఎంతో కీలకమైన ప్లాంట్లో తీవ్రమైన కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. చైనాలో కోవిడ్ నియంత్రణల కఠినతరంతో వచ్చే నెలలో ప్రపంచంలోని అతిపెద్ద ప్లాంట్లో ఐఫోన్ల ఉత్పత్తి 30శాతం క్షీణించనుందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ఫోర్స్ గత వారం జెంగ్జౌ ప్లాంట్లో సమస్యల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ షిప్మెంట్ల అంచనాను 80 మిలియన్ల నుండి 2-3 మిలియన్ యూనిట్లకు తగ్గించడం గమనార్హం. మరోవైపు అతిపెద్ద ఐఫోన్ తయారీదారు తైవాన్కు చెందిన ఫాక్స్కాన్, కరోనా నియంత్రణలతో దెబ్బతిన్న జెంగ్జౌ ప్లాంట్లో పూర్తి ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. -
భారత్లో ఐఫోన్ 14 తయారీ, యాపిల్ ఊహించని నిర్ణయం!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఊహించని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్లో ఐఫోన్ 14 ప్రీమియం ఫోన్లను ఇక్కడ తయారు చేయాలనుకున్న నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. యాపిల్ తన సంస్థకు చెందిన ఎక్కువ శాతం ప్రొడక్ట్లను చైనాలోనే తయారు చేయిస్తుంది. అయితే, దేశాల మధ్య ఉద్రిక్తతలు, డ్రాగన్ కంట్రీలో వైరస్ను అరికట్టేందుకు విస్తృతంగా లాక్డౌన్లను అమలు చేస్తోంది. దీనివల్ల చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అందుకే యాపిల్ సంస్థ ఐఫోన్ల తయారీని భారత్కు మారుస్తున్నట్లు గతంలో ప్రకటించింది. అందుకే యాపిల్ కంపెనీ గత నెలలో ‘ఐఫోన్ 14ను భారత్లో తయారు చేస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం’ అని తెలిపింది. అయితే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను భారత్లో తయారు చేయడం వాస్తవమే అయినా.. ప్రీమియం ఫోన్లను దేశీయంగా తయారు చేసే విషయంలో యాపిల్ వెనక్కి తగ్గినట్లు టెక్ బ్లాగ్ గిజ్మో చైనా తన కథనంలో పేర్కొంది. ఐఫోన్ 15 భారత్లోనే! స్మార్ట్ఫోన్ తయారీ సంస్థల అంచనాల ప్రకారం..యాపిల్ వచ్చే ఏడాదిలో భారత్, చైనాలలో ఒకేసారి ఐఫోన్15ను తయారు చేయోచ్చని భావిస్తున్నాయి. 2017లో ఐఫోన్ల తయారీని యాపిల్ ఇక్కడ ప్రారంభించింది. భారత్లో ఐఫోన్ 11, ఐఫోన్ 12, ఐఫోన్ 13తో పాటు లేటెస్ట్ ఐఫోన్ 14 ఫోన్లను ఇక్కడే తయారు చేయనుంది. దేశంలో విస్ట్రాన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 12 లను ఉత్పత్తి చేస్తుంది. చైన్నై కేంద్రంగా ఐఫోన్ తైవాన్ హ్యాండెసెట్ తయారీ దిగ్గజ సంస్థలైన విస్ట్రాన్ చైనాలో.. ఫాక్స్కాన్ (చెన్నై) భారత్లో కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాయి. యాపిల్ సంస్థ ఫాక్స్కాన్తో ఒప్పందం కుదర్చుకుని చెన్నై కేంద్రంగా ఐఫోన్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. చదవండి👉 ‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్ -
ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే..జాక్ పాట్! ఆపిల్కు దిమ్మదిరిగే కౌంటర్లు
సాక్షి,ముంబై: ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే విలువైన వస్తువుకు బదులు చీప్గా సబ్బులు, ఇతర పనికిరాని వస్తువులు, ఒక్కోసారి రాళ్లు వచ్చిన సంఘటనలు గతంలో చాలా చూశాం. దీనికి సంబంధించి ఫ్లిప్కార్ట్ గతంలో విస్తృతంగా ట్రోల్ అయింది కూడా. అలాగే ఇటీవలి సేల్లో కస్టమర్లకు చివరి నిమిషాల్లో ఆర్డర్లను రద్దు చేసిందంటూ ఫ్లిప్కార్ట్ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఉదంతం చోటు చేసుకుంది. ఒక వినియోగ దారుడు ఐఫోన్13ని ఆర్డర్ చేస్తే.. దీనికి బదులుగా లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ 14 అందుకోవడం చర్చకు దారి తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ట్విటర్ యూజర్ అశ్విన్ హెడ్జ్ ట్వీట్ చేశారు. అయితే దీనికి నెటిజన్లు రియాక్షన్ మాత్రం అల్టిమేట్. ఐఫోన్ 13, 14 అయినా ఒకటేగా పెద్దగా తేడా ఏముంది అంటూ వ్యంగ్యంగా కమెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ను షేర్ చేసిన నెటిజన్లు..రెండూ ఒకటేగా..ఆపిల్కే అయోమయంగా ఉంది. అయినా వాళ్ల తప్పేముంది.. నిజానికి రెండూ ఒకటేగా అంటూ సెటైర్లతో తమ కసి అంతా తీర్చుకుంటున్నారు. One of my follower ordered iPhone 13 from Flipkart but he recieved iPhone 14 instead of 13 😂 pic.twitter.com/FDxi0H0szJ — Ashwin Hegde (@DigitalSphereT) October 4, 2022 Even Apple got confused "ki dono same hi hai" https://t.co/V9HAjh2W5a — Raghav Aggarwal (@Raghav_285) October 5, 2022 Can't blame them, they literally are same devices. 😂 https://t.co/1PZGYFoCDZ — Vaibhav Sharma (@TheVaibhavShrma) October 5, 2022 -
‘ఐఫోన్’ పరువు తీసిన యాపిల్ బాస్ కూతురు, సమర్ధించిన టిమ్ కుక్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్.. ఐఫోన్ 14 సిరీస్తో పాటు సిరీస్ 8, ఎయిర్పాడ్స్ ప్రో, వాచీ ఎస్ఈ2లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఐఫోన్ 14 సిరీస్పై యాపిల్ సీఈవో టిమ్ కుక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లేటెస్ట్ సిరీస్ ఫోన్లపై యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ వేసిన మీమ్స్ సమర్ధించారు. 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్' జరిగింది. ఈ ఈవెంట్లో సీఈవో టిమ్ కుక్ ఐఫోన్ 14 సిరీస్లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్లను రిలీజ్ చేయగా.. వాటిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఫోన్లలో ఎలాంటి ఆవిష్కరణలు లేవనే విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చదవండి👉 ఐఫోన్ కోసం దుబాయ్ వెళ్లాడు..కానీ చివరికి ఈ క్రమంలో ఐఫోన్ 14 సిరీస్పై టిమ్కుక్ స్పందించారు. గత పదేళ్లుగా యాపిల్ కస్టమర్లలో నేను ఒకరిని. తొలిసారి బ్లాక్ బెర్రీ నుంచి ఐఫోన్ 4ఎస్కు షిఫ్ట్ అయ్యా. నాటి నుంచి మార్కెట్లో ఏ ఐఫోన్ వచ్చినా వెంటనే కొనుగోలు చేస్తుంటా. ఈ ఏడాది కూడా 256 జీబీ సిల్వర్ కలర్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ను కొనుగోలు చేశా. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ను ఉద్దేశిస్తూ..‘‘నా కొత్త బొమ్మతో రెండు వారాల పాటు ఆడిన తరువాత, "డైనమిక్ ఐలాండ్" తప్ప.. ఆశ్చర్యపోయేలా ఆవిష్కణలు లేవని గట్టి నమ్మకంతో చెప్పగలను. సెల్ఫీ కెమెరా, నోటిఫికేషన్లు, అలెర్ట్స్, ఇతర కార్యకలాపాల్ని అనుసంధానం చేసేలా ఫేస్ ఐడి సెన్సార్ మాత్రమే ఉందని అన్నారు. స్టీవ్ జాబ్స్ కూతురు చెప్పింది నిజమే స్టీవ్ జాబ్స్ కూతురు ఈవ్ జాబ్స్ కొత్త ఐఫోన్ 14 సిరీస్పై సెటైర్ వేశారు. పాత స్మార్ట్ఫోన్ల లాగానే కొత్త జనరేషన్ ఫోన్లు ఉన్నాయని అర్ధం వచ్చే ఓ మీమ్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 14కి అప్గ్రేడ్ అవుతున్నానని..ఓ వ్యక్తి తాను వేసుకున్న షర్ట్ లాంటిదే మరో షర్ట్ చేతిలో పట్టుకొని ఉన్న మీమ్ను ఈవ్ జాబ్స్ షేర్ చేసింది. ఆ మీమ్నే టిమ్ కుక్ సమర్ధించారు. చదవండి👉 ఐఫోన్ కోసం దుబాయ్ వెళ్లాడు..కానీ చివరికి -
ఆపిల్ కి షాకిచ్చిన ఐఫోన్ 14 ప్రో... భారీగా ప్రైస్ డ్రాప్
-
ఐఫోన్ 14 సిరీస్ : ‘బెడిసి కొట్టిన యాపిల్ మాస్టర్ ప్లాన్’!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ ప్రో తయారీని పెంచాలనే ప్రయత్నాల్ని విరమించుకుంటున్నట్లు బ్లూమ్ బర్గ్ తన కథనంలో పేర్కొంది. సెప్టెంబర్ 16 న ‘యాపిల్ ఫార్ అవుట్’ ఈవెంట్లో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ను విడుదల చేసింది. అయితే ఈ సిరీస్లోని ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ సేల్స్ పెరగడం.. ధర భారీగా ఉండడంతో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ను యూజర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. విడుదల ప్రారంభంలో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ సేల్స్ బాగున్నా.. క్రమ క్రమంగా వాటి అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల అమ్మకాలపై యాపిల్ పెట్టుకున్న భారీ అంచనాలు తారుమారయ్యాయి. అంచనాలు తలకిందులు ఈ తరుణంలో యాపిల్ సంస్థ ధర ఎక్కువగా ఉన్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల తయారీని తగ్గించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి విడుదలకు ముందు ఐఫోన్ 14 సిరీస్పై అంచనాలు భారీగా పెరగడంతో ఈ ఏడాది జులై 1 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో 6 మిలియన్ యూనిట్ల ఐఫోన్ 14 సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు..ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్లను తయారు చేయాలని భావించింది. ఆదరణ అంతంత మాత్రమేనా కానీ యూజర్ల అభిరుచులకు అనుగుణంగా లేకపోవడం, వాటి ఆదరణ అంతంత మాత్రంగా ఉండడంతో తయారీని తగ్గించాలని యాపిల్ సంస్థ ఐఫోన్ తయారీ సంస్థల్ని ఆదేశించినట్లు బ్లూమ్ బర్గ్ తన కథనంలో హైలెట్ చేసింది. బదులుగా, అదే సమయానికి 90 మిలియన్ ఐఫోన్ 14 ఎంట్రీ లెవల్ ఫోన్లను తయారు చేయాలని భావిస్తోంది. ఎంట్రీ లెవల్ ఫోన్ల కంటే ఐఫోన్ 14 ప్రో మోడల్ ఫోన్ల డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని యాపిల్ తగ్గించనుందని బ్లూమ్బెర్గ్ నివేదించింది. -
యాపిల్ సంస్థ గుడ్ న్యూస్.. మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్, ధర తగ్గునుందా!
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్లకు విపరీతంగా డిమాండ్ ఉంది. ప్రత్యేకంగా యూత్లో ఇఫోన్కి ఉన్న క్రేజ్ వేరే. అందులోని ఆపరేటింట్ సిస్టం, సెక్యూరిటీ సర్వీసెస్, ఫీచర్స్ కస్టమర్లను కట్టిపడేశాయి. అందుకే భారీగా ధర ఉన్నప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఫోన్ కంపెనీ యాపిల్ సంస్థ తాజాగా భారత్లో ఐఫోన్ 14 తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది. తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్ కేంద్రంగా ఫాక్స్కాన్ సంస్థతో కలిసి యాపిల్ ఈ ఐఫోన్లు ఉత్పత్తి చేపడుతోంది. ఫాక్స్కాన్ ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు మాత్రమే కాదు ప్రధాన ఐఫోన్ అసెంబ్లర్ కూడా. అతి త్వరలో మేడ్-ఇన్-ఇండియా ఐఫోన్ 14 ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది. త్వరలోనే వీటిని మార్కెటలోకి అందుబాటులో ఉంచుతామని సంస్థ తెలిపింది. అయితే దేశీయంగా ఐఫోన్లు తయారీ అవుతున్నాయి కాబట్టి వీటి ధర తగ్గే అవకాశలు ఉండచ్చని ఐఫోన్ ప్రియులు భావిస్తున్నారు. యాపిల్ తన 2022 ఐఫోన్ లైనప్ను సెప్టెంబర్ 7న ‘ఫార్ అవుట్’ ఈవెంట్లో ఆవిష్కరించింది. ఈ సిరీస్లో iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Pro Max తో పాటు సరికొత్త iPhone 14 Plus ఉన్నాయి. ఈ సిరీస్లో అదిరిపోయే ఫీచర్లతో రాబోతోంది. ఇందులో మెరుగైన కెమెరా, పవర్ఫుల్ సెన్సార్లు, అత్యవసర పరిస్థితుల్లో ఎస్ఓఎస్(SOS) టెక్స్ట్లను పంపడానికి శాటిలైట్ మెసేజింగ్ ఫీచర్తో వస్తుంది. భారతదేశంలో ఐఫోన్ 14ను తయారు చేస్తున్నందును సంతోషిస్తున్నామని. కొత్త ఐఫోన్ లైనప్ అధునాతన టెక్నాలజీతో పాటు ముఖ్యమైన భద్రతా సామర్థ్యాలు కూడా ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
ఐఫోన్ కోసం దుబాయ్ వెళ్లాడు..కానీ చివరికి
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసిన ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు ప్రపంచ దేశాల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వాటి ధర ఎక్కువే అయినప్పటికీ..డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం ఐఫోన్ను కొనుగోలు చేసేందుకు ఆర్డర్లు పెడుతున్నారు. మన దేశంలో విడుదల కాకపోవడంతో లేటెస్ట్ ఫోన్ కోసం విదేశాలకు వెళుతున్నారు. మనదేశంలో మరికొన్ని గంటల్లో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ విడుదలవుతుందనగా కేరళ రాష్ట్రం కొచ్చీకి చెందిన ధీరజ్ పళ్లియిల్ (28) అనే యువకుడు అదే ఫోన్ కోసం దుబాయ్ వెళ్లాడు. దుబాయ్లో మిర్డిఫ్ సిటీ సెంటర్లో 512జీబీ ఐఫోన్ 14 ప్రొను కొనుగోలు చేశాడు. ఆఫోన్ ధర దుబాయ్లో రూ.1,29,000 కాగా..భారత్లో రూ.1,59,900కే కొనుగోలు చేయొచ్చు. భారత్లో తక్కువే ధీరజ్ ఐఫోన్ ప్రో కోసం భారత్లో లభించే ధర కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశాడు. ఎలా అంటే? భారత్ నుంచి దుబాయ్ ప్లైట్ టికెట్ కోసం రాను పోను కలిపి రూ.40వేలు. దుబాయ్లో ఫోన్ ఖరీదు రూ.1,29,000. ఫ్లైట్ టికెట్ ధర రూ.40వేలు ప్లస్, ఫోన్ ధర రూ.1,29,000 ఉండగా మొత్తం కలిపితే. రూ.1,69,000గా ఉంది. అదేదో భారత్లో కొంటే రూ.10వేలు తగ్గేదని నెటిజన్లు లెక్కలేస్తున్నారు. కానీ ఐఫోన్ను విపరీతంగా అభిమానించే ధీరజ్ మాత్రం ఐఫోన్ 14ప్రోను కొనుగోలు చేసిన తొలి భారతీయుడిగా నిలిచిపోవాలని అనుకున్నాడు. అందుకే దుబాయ్ వెళ్లినట్లు తెలిపాడు.ఈ సందర్భంగా తాను 2017లో ఐఫోన్ 8ను, ఆ తర్వాత ఐఫోన్ 12, ఐఫోన్ 13ను అందరికంటే ముందే దుబాయ్లో కొనుగోలు చేసి.. ఐఫోన్ను కొనుగోలు చేసిన తొలి భారతీయ కస్టమర్ తానేనని సంతోషం వ్యక్తం చేశాడు. చదవండి👉 ‘భారత్కు గుడ్ బై’, దేశం నుంచి తరలి వెళ్లిపోతున్న చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు! -
ఐఫోన్14 మోడల్స్: గుడ్న్యూస్, భారీ ఆఫర్ ఎక్కడంటే?
హైదరాబాద్: ప్రముఖ మొబైల్స్ విక్రయ సంస్థ బీ న్యూ మొబైల్స్ కస్టమర్ల కోసం ఐఫోన్ 14 సిరీస్ను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఎండీ వై బాలాజీ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్, యాపిల్ సంస్థ ప్రతినిధులు మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఇది చదవండి: రూపీలోనే ఇన్వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా కొనుగోలుపై 25శాతం కచ్చితమైన బైబ్యాక్ ఆఫర్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ద్వారా కొనుగోలుపై రూ.5 వేల వరకు క్యాష్బ్యాక్ ఆఫర్ను పొందవచ్చు.‘‘తెలుగు రాష్ట్రాల్లోని 150 అవుట్లెట్లలో ఈ మోడళ్లు లభ్యమవుతాయి. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’’ అని సంస్థ సీఎండీ వై.బాలాజీ తెలిపారు. (Instagram: కొత్త టూల్ వచ్చేసింది..చూశారా మీరు?) -
‘జాక్ పాట్ ఎవరికో’, దేశంలో ఐఫోన్ల తయారీ..రంగంలోకి మరో దిగ్గజ సంస్థ!
దేశీయంగా యాపిల్ ఐఫోన్లను తయారు చేసేందుకు దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఐఫోన్ల తయారీకి టాటా కంపెనీ సంప్రదింపులు కొనసాగిస్తుండగా.. తాజాగా మెటల్ దిగ్గజం వేదాంత సైతం ఐఫోన్ల ఉత్పత్తికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత వారం వేదాంత, తైవాన్కు చెందిన ఐఫోన్ల సరఫరా సంస్థ ఫాక్స్కాన్లు సంయుక్తంగా రూ.1.54లక్షల కోట్లతో తొలి సెమీ కండక్టర్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. గుజరాత్లో నిర్మించనున్న ఈ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ విషయంలో ఇరు సంస్థల మధ్య ఒప్పొందాలు జరిగాయి. నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహరాష్ట్రలో మ్యానిఫ్యాక్చరింగ్ హబ్ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్లులో ఐఫోన్లతో పాటు టీవీలో ఉపయోగించే పరికరాల్ని తయారు చేయనున్నట్లు చెప్పారు. అయితే ఇప్పటికే టాటా గ్రూప్ ఇప్పటికే తైవాన్ సంస్థతో కలిసి ఐఫోన్ల తయారు చేయబోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు వేదాంత ఎంటర్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. విస్ట్రాన్తో టాటా గ్రూప్ యాపిల్ సంస్థ దేశీయంగా ఐఫోన్లను తయారు చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా చైనాలో ఫోన్ల తయారీ నిలిపివేయాలని భావిస్తుంది. చైనా నుంచి పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత భారత్లో ఐఫోన్ 14 సిరీస్లను ఉత్పత్తి చేయాలని అనుకుంటున్నట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో ప్రస్తావించింది. ఆ కథనాల్ని ఊటంకిస్తూ టాటా గ్రూప్ భారత్లో ఐఫోన్లను తయారు చేసేందుకు ఫాక్స్కాన్తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఐఫోన్ల ఉత్పత్తి, సప్లయ్ చైన్, అసెంబుల్ విషయంలో ఇరు సంస్థలు ఏకాభిప్రాయానికి వస్తే.. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. టాటాతో జత.. ఐదురెట్ల అవుట్పుట్ తైవాన్ హ్యాండెసెట్ తయారీ దిగ్గజ సంస్థలైన విస్ట్రాన్ చైనాలో.. ఫాక్స్కాన్ (చెన్నై) భారత్లో కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాయి. యాపిల్ సంస్థ ఫాక్స్కాన్తో ఒప్పందం కుదర్చుకుని చెన్నై కేంద్రంగా ఐఫోన్లను తయారు చేస్తుంది. వాటి అమ్మకాల్ని యాపిల్ నిర్వహిస్తుంది. అదే దేశీయ సంస్థలు ఫోన్ల తయారీలో భాగస్వామ్యం సంస్థకు లాభదాయకంగా ఉంటుందని యాపిల్ సీఈవో టిమ్కుక్ అభిప్రాయ పడుతున్నారు. టాటా గ్రూప్.. విస్ట్రాన్తో భాగస్వామ్యంలో దేశీయంగా ఐఫోన్లను ఐదురెట్లు కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఐఫోన్14 అలా వచ్చిందో లేదో...ఐఫోన్15 సిరీస్ ట్రెండింగ్
న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్14 అలా లాంచ్ అయిందోలేదో అప్పుడే రానున్న ఐఫోన్ సిరీస్పై ఊహాగానాలు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 2023లో లాంచ్ కానుందని భావిస్తున్న ఐఫోన్ 15 సిరీస్లో భారీ మార్పులే చేయనుందట. ప్రస్తుతం ఐఫోన్ 14పై మోడల్స్ ఫీచర్స్ మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో ఆపిల్ ఈసారి భారీ అప్డేట్స్తో నెక్ట్స్ సిరీస్ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో తాజా అంచనాల ప్రకారం ఐఫోన్-15 సిరీస్లో ప్రో, ప్రో మాక్స్ వేరియంట్ మధ్య భారీ మార్పులే తీసుకురానుంది.ముఖ్యంగా ఐఫోన్ 15 ప్రో అందించని ప్రత్యేక ఫీచర్లు ఐఫోన్ 15 ప్రో మాక్స్లో జోడించనుంది. కాగా ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ను ప్రపంచవ్యాప్తంగా బుధవారం ఆవిష్కరించింది. ఐఫోన్-14 సిరీస్లో ప్రో, నాన్-ప్రో మోడల్స్ ఫీచర్స్ అప్డేట్ చేసినా, కానీ, రెండు ప్రో మోడల్స్ మధ్య బ్యాటరీ, స్క్రీన్ తప్ప మిగతా ఫీచర్స్లో పెద్దగా తేడా లేకపోవడంతో ఆపిల్ యూజర్లు భారీ నిరాశ చెందారు. ముఖ్యంగా ఆపిల్ వ్యవస్థపాకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్ ఇన్స్టా స్టోరీ కూడా వైరల్గా మారిన సంగతి తెలిసిందే. (1/2) I believe Apple will create more differentiation between iPhone 15 Pros and iPhone 15 standard models to increase Pro shipment allocation and the new iPhone ASP. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 చదవండి:ఆపిల్ ఐఫోన్14: స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్..ఏమైంది? (1/2) I believe Apple will create more differentiation between iPhone 15 Pros and iPhone 15 standard models to increase Pro shipment allocation and the new iPhone ASP. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 (1/2) I think Apple should name A16 as A16 Pro and A15 used by two iPhone 14 standard models as A16/A15 Plus. Maybe it helps promote two iPhone 14 standard models. — 郭明錤 (Ming-Chi Kuo) (@mingchikuo) September 9, 2022 -
ఆపిల్ ఐఫోన్14: స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్..ఏమైంది?
న్యూఢిల్లీ: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 14 సిరీస్ను టెక్ దిగ్గజం ఆపిల్ ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా లాంచ్ చేసింది. అయితే లేటెస్ట్ ఐఫోన్ 14 ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ జాబ్స్కు నచ్చినట్టు లేదు. అందుకే సెటైర్ వేయడం ఇంటర్నెట్లో హాట్టాపిక్గా నిలిచింది. ఊహించని విధంగా మీమ్ను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో మీమ్ ఫెస్టివల్ జరుగుతోంది. స్టీవ్ జాబ్స్ కుమార్తె ఈవ్ ఇన్స్టాగ్రామ్లో ఆపిల్ ఐఫోన్, 13, 14ని పోలుస్తూ ఒక స్టోరీ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఫన్నీగా కమెంట్ చేస్తున్నారు. ఆపిల్ ప్రకటన తరువాత ఐఫోన్14ను అప్డేట్ చేసుకుంటున్నా అని క్యాప్షన్తో ఒక పోస్ట్ పెట్టారు. ఐఫోన్ 13తోపోలిస్తే. కొత్త ఐఫోన్ 14 పెద్దగా అప్డేట్ ఏమీ లేదంటూ ఐఫోన్ లవర్స్ పెదవి విరుస్తున్న సందర్భంలో ఈవ్ పోస్ట్ చర్చకు దారి తీసింది. మరోవైపు యుఎస్లోని ఐఫోన్ మోడల్స్లో ఇ-సిమ్ యాక్టివేషన్పై కూడా యూజర్లు అంసతృప్తిగా ఉన్నారు. తాజా అప్డేట్స్పై సోషల్ మీడియా మీమ్స్ ఒక రేంజ్లో పేలుతున్నాయి. "తదుపరి ఐఫోన్లో మైక్రోఫోన్ ఉండదు. ఇక మీరు నేరుగా మీరు మాట్లాడాలను కుంటున్న వారి దగ్గరకు వెళ్లాలి." అని ఒక యూజర్ కమెంట్ చేయగా, "త్వరలో ఇది ఐఫోన్కు బదులుగా ఇ-ఫోన్ అవుతుందని మరొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే ఈ సిమ్స్ ఇండియాకు రాకపోవడం మంచిదైంది. ఐఫోన్ 14 సిరీస్ సిమ్ ట్రేతో ఉండడం గొప్ప విషయం. లేదంటే ఇక్కడ చాలా గందరగోళ పరిస్థితి ఉండేది. తాము ఇంకా ఇ-సిమ్లకు సిద్ధంగా లేం అంటూ ఇండియన్ యూజర్ ఒకరు రాశారు. కాగా బుధవారం రాత్రి నిర్వహించిన "ఫార్ అవుట్" మెగా ఈవెంట్లో ఆపిల్ ఐఫోన్ 14, ఎయిర్పాడ్స్ ప్రో, ఆపిల్ వాచ్ అల్ట్రాలను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 మాక్స్ను ఆవిష్కరించింది. ఐఫోన్ 14 ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం. ఐఫోన్ 14 సెప్టెంబర్ 16 నుండి , ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుండి సేల్కు అందుబాటులో ఉంటాయి. ఇండియాలో ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,900, ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900గా ఉంటుంది. Eve Jobs, the daughter of Steve Jobs and Laurene Powell Jobs, reacts to today’s iPhone announcement on her Instagram. pic.twitter.com/bfn2VtbpsA — Yashar Ali 🐘 (@yashar) September 7, 2022 -
ఆపిల్ ఈవెంట్ : ఐఫోన్ 14 సిరీస్, కొత్త వాచ్, ఇయర్పాడ్స్ వచ్చేశాయ్ ఫోటోలు చూడండి
-
ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ విడుదల, ధర ఎంతంటే!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం రాత్రి ఐఫోన్ 14 సిరీస్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఐఫోన్ 14 ప్రో, ప్రో మ్యాక్స్ గురించి ఫీచర్లు, వాటి ధరల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఫోన్లను యాపిల్ అప్గ్రేడ్ చేసింది. ఈ రెండు ఫోన్లలో పంచ్ హోల్ డిస్ప్లే, లేటెస్ట్ వెర్షన్కి అప్గ్రేడ్ చేసింది. ఇది గత సంవత్సరం విడుదల చేసిన ఐఫోన్ 13 కంటే ఈ ఫోన్ మోడల్ లు పెద్దగా ఉన్నాయి. ఇందులో ఫేస్ ఐడి, రెండవది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఆసక్తికరంగా, యానిమేషన్ రూపంలో నోటిఫికేషన్లను పొందవచ్చు. ఈ ఫోన్ల డిస్ప్లే చుట్టూ సన్నని బెజెల్స్, సర్జికల్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్,టెక్ట్స్ర్డ్ మాట్టే గ్లాస్ డిజైన్ లు ఉన్నాయి. ఐఫోన్ ప్రో మోడల్ 6.1-అంగుళాల స్క్రీన్ ఉండగా..ప్రో మాక్స్ 6.7-అంగుళాల ప్యానెల్ను కలిగి ఉంటుంది. హ్యాండ్సెట్లు స్పేస్ బ్లాక్, సిల్వర్, గోల్డ్, డీప్ పర్పుల్ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి.ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ కాకుండా, ప్రో మోడల్స్ కొత్త ఏ16 బయోనిక్ చిప్సెట్తో విడుదలైంది. ఫోటోగ్రఫీ కోసం, 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో సహా ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇది పాత మోడళ్లలో కనిపించే 12-మెగాపిక్సెల్ సెన్సార్ కంటే పెద్ద అప్గ్రేడ్. దీనికి 1.4 యూఏఎం పిక్సెల్లతో కూడిన కొత్త 12-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, హెచ్డీ క్వాలిటీ ఫోటోలు తీసేలా1.4యూఎం పిక్సెల్, సెటప్లో 3x ఆప్టికల్ జూమ్ను అందించే మెరుగైన టెలిఫోటో కెమెరా కూడా ఉంది. ధరల విషయానికొస్తే ఐఫోన్ 14ప్రో ప్రారంభం ధర రూ.1,29,900, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ ధర రూ.1,39,900 గా ఉంది. రెండు ఐఫోన్లు సెప్టెంబర్ 9న యూఎస్లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంటాయి. -
దుమ్మురేపుతున్న ఫీచర్లు, ఐఫోన్ 14 సిరీస్ విడుదల!
ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 14సిరీస్ ను యాపిల్ విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం..బుధవారం రాత్రి 10.30 గంటలకు 'యాపిల్ ఫార్ అవుట్ 2022 ఈవెంట్' జరిగింది. ఈ ఈవెంట్లో సీఈవో టిమ్ కుక్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను విడుదల చేశారు. వాటిలోని ఐఫోన్ 14 (Iphone 14), ఐఫోన్ 14 ప్లస్ (Iphone 14 Plus) ఫోన్ ధరలతో పాటు.. ఈ-సిమ్స్,శాటిలైట్ కనెక్టివిటీ,యానిమేషన్ రూపంలో నోటిఫికేషన్ వంటి ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అదిరిపోయేలా ఐఫోన్ 14 ఫీచర్లు.. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ మిడ్ నైట్ స్టార్లైట్, పర్పుల్, రెడ్ వంటి ఐయిదు వేరియంట్ కల్సర్లో లభ్యం కానుంది. ఈ ఫోన్లలో ఏ15 బయోనిక్ చిప్, 6-కోర్ సీపీయూతో రెండు హై ఫర్మామెన్స్తో నాలుగు ఎఫెషెన్స్ కోర్లు, ఒక న్యూరల్ ఇంజిన్ ఉంది. ఐఫోన్ 14 లార్జర్ సెన్సార్లతో 12ఎంపీ మెయిన్ కెమెరా, 1.9 మైక్రాన్ పిక్సెల్స్, F1.5 ఎపర్చ్యూర్ (కెమెరా హోల్) OISతో వస్తుంది. ఓన్లీ ఈ-సిమ్స్ యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలో eSIMని పరిచయం చేసింది. తద్వారా ఎక్కువ సంఖ్యలో eSIMలను స్టోర్ చేసుకోవడానికి, సురక్షితంగా ఉంచుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక్క యూఎస్ ఐఫోన్ 14 సిరీస్లో మాత్రమే ఈ ఈ-సిమ్ సౌకర్యం ఉంది. ఎందుకంటే ఆ మోడళ్లలో ఫిజికల్ సిమ్ కార్డ్ పెట్టుకునే సిమ్ ట్రేస్లు లేవు శాటిలైట్ కనెక్టివిటీ యాపిల్ తన ఐఫోన్లో మొదటిసారి శాటిలైట్ కనెక్టివిటీని పరిచయం చేసింది. ఇప్పుడు, ఐఫోన్ 14 వినియోగదారులు ప్రాణ పాయ స్థితిలో ఉన్నా, లేదంటే ఎక్కడైనా చిక్కుకున్నా అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ శాటిలైట్ కనెక్టివిటీ సాయంతో ఫోన్ను కనెక్ట్ చేసుకోవచ్చు. గేమ్ ఛేంజ్ టెక్నాలజీని కమ్యూనికేషన్ ప్రవేశపెట్టడానికి తమకు సంవత్సరాలు పట్టిందని యాపిల్ తెలిపింది. యానిమేషన్ రూపంలోఐఫోన్ 14లో ఐఫోన్ 14 చిన్న పిల్ ఆకారపు నాచ్తో కొత్త ఫ్రంట్ డిజైన్ను కలిగి ఉంది. డిస్ ప్లే వెనుక భాగంలో ప్రాక్సిమిటీ సెన్సార్, నోటిఫికేషన్లు యానిమేషన్ రూపంలో పాప్ అవుట్ అవుతాయి. యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ ధరలు ఐఫోన్ 14 ప్రారంభ ధర 799 డాలర్లు (సుమారు రూ. 79,900) ఉండగా, ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర 899 డాలర్లు (సుమారు రూ.89,900)గా ఉంది. ఈఫోన్ల ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమవుతాయి. ఐఫోన్ 14 సెప్టెంబర్ 16న, ఐఫోన్ 14 ప్లస్ అక్టోబర్ 7 నుండి అందుబాటులో ఉంటుంది. నవంబర్ నాటికి ఈ ఫోన్లు అమెరికా, కెనడా కొనుగోలు దారులకు అందనున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆపిల్ ఐపోన్14: ధరలు,స్పెసిఫికేషన్స్, లేటెస్ట్ లీక్స్
న్యూఢిల్లీ:ఆపిల్ అతిపెద్ద వార్షిక ఫార్ అవుట్ ఈవెంట్లో నాలుగు కొత్త ఐఫోన్లను-ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మాక్స్, ఐఫోన్ 14 ప్లస్ మోడలల్స్గా లాంచ్ చేయనుందని ఊహాగానాలున్నాయి. అయితే ఈ ఫోన్లకు సంబంధించి ధరలు,స్పెసికేషన్స్పై చైనీస్ సోషల్ వెబ్సైట్లో తాజా లీక్స్ ఆసక్తికరంగా మారాయి. ఐఫోన్ 14 ప్రొ మాక్స్ : 458ppi పిక్సెల్ డెన్సిటీ 1200 నిట్స్ బ్రైట్నెస్తో 2778×1244 రిజల్యూషన్తో 6.7-అంగుళాల డిస్ప్లేను లాంచ్ కానుంది. 48ఎంపీ 8కే కెమెరా, 4323 mAh బ్యాటరీ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. ధరలు అంచనాలు: 256 జీబీ మోడల్ రూ. 1,25,525, 512 జీబీ వేరియంట్ రూ. 1,42,801 , 1 టీబీ మోడల్ రూ. 1,60,005గా ఉంటుందని అంచనా. ఐఫోన్ 14 ప్రొ: 6.1-అంగుళాలు డిస్ప్లే , 2532×1170 రిజల్యూషన్ 3200mAh బ్యాటరీతో లాంచ్ కానుంది. ధరలు అంచనాలు: 256జీబీ మోడల్ ధర రూ. 1,14,011, 512 జీబీ ధర రూ. 1,31,284 . 1టీబీ వేరియంట్ ధర రూ. 1,49,711 ఉండవచ్చని అంచనా. ఐఫోన్ 14 ప్లస్: 1000నిట్స్ బ్రైట్నెస్తో ట్రూ టోన్ P3 డిస్ప్లేతో వస్తోందట. 12ఎంపీ 4కే కెమెరా 4325mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. ధరలు అంచనాలు: 128జీబీ ధర రూ. 85,219, 256జీబీ రూ. 93,297 , 512 జీబీ ధర రూ. 1,04, 817గా ఉండనుంది. ఐఫోన్ 14: 6.1 అంగుళాల డిస్ప్లేతో రావచ్చనిఅంచనా. అలాగే 173గ్రా బరువుతో 3279mAh బ్యాటరీతో వస్తోందట. ధరలు అంచనాలు బేస్ మోడల్ధర దాదాపు రూ. 77,112గా ఉండనుంది. 256జీబీ మోడల్ ధర రూ. 85,169, 512 జీబీ వేరియంట్కు రూ. 1,04,817గా ఆపిల్ నిర్ణయించిదట. అయితే అధికారిక లాంచింగ్ వరకు ఐఫోన్ మోడల్స్, ఫీచర్లు ధరలపై సస్పెన్స్ తప్పదు. ఇది చదవండి: iPhone 14: మెగా ఈవెంట్పై ఉత్కంఠ: టిమ్ కుక్ సర్ప్రైజ్ చేస్తారా? -
మెగా ఈవెంట్పై ఉత్కంఠ: టిమ్ కుక్ సర్ప్రైజ్ చేస్తారా?
న్యూఢిల్లీ: టెక్దిగ్గజం ఆపిల్ బిగ్గెస్ట్ ఈవెంట్ మరికొన్ని గంటల్లో షురూ కానుంది. మోస్ట్ ఎవైటెడ్ ఐఫోన్ 14, ఆపిల్ వాచ్ సిరీస్ 8, ఇంకా ఎయిర్ పాడ్స్ ప్రొ-2, ఆపిల్ వాచ్ ఎస్ఈ-2 లాంటి కీలక ఉత్పత్తుల లాంచింగ్ అంచనాలు భారీగానే ఉన్నాయి. దీంతో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేదికపై ఎలాంటి విప్లవాత్మక ఉత్పత్తులను లాంచ్ చేయనున్నారనేది హాట్ టాపిక్గా మారింది. ఆపిల్ ఐఫోన్ 14: కోవిడ్ సంక్షోభం తరువాత నిర్వహిస్తున్న ఆపిల్ అతిపెద్ద ఈవెంట్ కావడంతో మరింత జోష్ నెలకొంది. ఇప్పటివరకు వచ్చిన పుకార్లు , లీక్ల ప్రకారం భారీ అప్డేట్స్ తో ఐఫోన్ -14 సిరీస్ను తీసుకొస్తోంది. 6.7 అంగుళాల భారీ డిస్ప్లే, 48ఎంపీ బిగ్ కెమెరా, ఆన్లోనే ఉండే డిస్ప్లే లాంటివి ఇందులో ఉన్నాయి. ఆపిల్ స్మార్ట్వాచ్ 8: ఆపిల్ 7 వాచ్ డిజైన్కు దగ్గరానేఈ కొత్త సిరీస్ ఉన్నప్పటికీ మరిన్ని విప్లవాత్మక మార్పులతో కొత్త వాచెస్ సీరిస్ను తీసుకొస్తోంది. ఆపిల్ స్మార్ట్వాచ్ వాచ్ 8 ప్రో: అతిపెద్ద డిస్ప్లే, టైటానియం సూపర్ డిజైన్, అదనపు బటన్తో ఈ స్మార్ట్వాచ్ను తీసుకు రానుందని సమాచారం. ఎయిర్పాడ్స్ ప్రో 2: తదుపరి జనరేషన్గా వస్తున్న వీటిల్లో ఆడియో, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సామర్థ్యాలను పెంచడంతో పాటు కొత్త డిజైన్తో లాంచ్ చేయనుంది. అలాగే కొత్త ఛార్జింగ్ కేస్ అంతర్నిర్మిత స్పీకర్తో ఫైండ్ మై ఫంక్షనాలిటీ ఫీచర్ను కూడా జోడించిందిట. ఈ ఆపిల్ మెగా ఈవెంట్ ఆపిల్ డాట్కామ్,యూ ట్యూబ్లో లైవ్ ఉంటుంది. -
ఐఫోన్లలోనే కాదు.. స్మార్ట్ ఫోన్లలో సైతం అదిరిపోయే ఫీచర్..
టెలికం రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 1జీ మొదులుకొని 2జీ, 3జీ, 4జీ అంటూ కొత్త కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తెస్తున్నాయి. వినియోగదారుల జీవన విధానాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. త్వరలో 4జీ కంటే 10రెట్ల వేగంతో పనిచేసే 5జీ అందుబాటులోకి తేనున్నాయి. ఈ తరుణంలో టెలికం రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులు, లేటెస్ట్ టెక్నాలజీలను వినియోగంలోకి తెచ్చేందుకు అనుసరిస్తున్న ఆధునిక పద్ధతుల్ని..ఆకళింపు చేసుకుంటున్న స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు వాటిని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ను యూజర్లకు పరిచయం చేయనుంది. తొలిసారి యాపిల్ ఈ శాటిలైట్ ఫీచర్పై వర్క్ చేస్తుండగా..ఇప్పుడు అదే దారిలో గూగుల్తో పాటు ఇతర సంస్థలు సైతం ఈ సరికొత్త ఫీచర్ను యూజర్లకు అందించనున్నాయి. గూగుల్ సైతం గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్ డెవెలప్మెంట్ టీంలో కీలకంగా పనిచేస్తున్న Hiroshi Lockheimer యాపిల్ తన ఐఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఎనేబుల్ చేయడంపై స్పందించారు. ఈ ఫీచర్ ఐఫోన్లలోనే కాకుండా.. వచ్చే ఏడాది విడుదల కానున్న ఆండ్రాయిడ్ 14లో ఎనేబుల్ చేసేందుకు గూగుల్, గూగుల్తో ఒప్పందమైన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. అయితే ఈ ఫీచర్ను అందుబాటులోకి వస్తే ఆండ్రాయిడ్ 13 కోసం సాఫ్ట్వేర్ను అప్గ్రేడ్ చేయడానికి, పాత వెర్షన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ను తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలన్ మస్క్ మహిమ ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్మార్ట్ ఫోన్లలో శాటిలైట్ కనెక్టివిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఈ ఫీచర్ సాయంతో స్మార్ట్ ఫోన్ యూజర్లు నెట్ వర్క్ లేని ప్రాంతాల్లో సైతం టెక్ట్స్, కాల్స్ చేసుకునే సౌకర్యం ఉంది. శాటిలైట్ కనెక్టివిటీ ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది. శాటిలైట్ నెట్ వర్క్లను ఆపరేట్ చేసేందుకు, వినియోగదారులకు అందుబాటులో తెచ్చేందుకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ ఫీచర్ ఎనేబుల్ అవుతుందా? లేదా అని తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సి ఉంటుందని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 సముద్రంలో పడిన ఐఫోన్, 'బ్రాండ్' బాబుకు దొరికిందోచ్! -
అదిరిపోయే సేల్: భారీ తగ్గింపు ఆఫర్లు..ఏకంగా 80 శాతం డిస్కౌంట్!
దేశీయ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కొత్త సేల్ను ప్రకటించింది. దసర పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈసేల్లో స్మార్ట్ ఫోన్లపై తగ్గింపులతో పాటు, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లపై 80శాతం డిస్కౌంట్ పొందవచ్చు. గతేడాది అక్టోబర్ 3 నుంచి 10 వరకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ను నిర్వహించింది. అలాగే ఈ ఏడాది సైతం ఈ సేల్ అదే సమయంలో ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే పలు నివేదికల ప్రకారం..సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. దీనిపై ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టత ఇవ్వాల్సి ఉండగా.. ఈ సేల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్యాంక్ కార్డ్లపై ఆఫర్లు 8 రోజుల పాటు సుధీర్ఘంగా జరిగే ఈ ప్రత్యేక అమ్మకాల్లో ఈ కామర్స్ సంస్థ ఎప్పటి లాగే ఆఫర్లను అందించనుంది. ముఖ్యంగా ఐసిఐసిఐ, యాక్సిస్ క్రెడిట్ కార్డులపై 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఇవ్వనుంది. కొనుగోళ్లను బట్టి డిస్కౌంట్ ఉంటుంది. దీంతో పాటు నో-కాస్ట్ ఈఎంఐ,ఎక్ఛేంజ్ ఆఫర్,ప్రిపెయిడ్ ఆఫర్స్ ఉన్నాయి. ఐఫోన్ 14సైతం వచ్చే నెల చివరిలో ప్రారంభయ్యే ఈ సేల్ 24 గంటల ముందే ఫ్లిప్ కార్ట్ ప్లస్ వినియోగదారులు కొనుగోలు చేసే సౌకర్యం కల్పిస్తుంది. ఇందులో భాగంగా ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 అమ్మకాలు జరపనుంది. దీంతో పాటు మరో ఈ బుధవారం విడుదలయ్యే ఐఫోన్ 14సిరీస్ ఫోన్ సైతం అమ్మనుంది. వీటితో పాటు రియల్ మీ, పోకో, వివో,యాపిల్,శాంసంగ్ ఫోన్లను డిస్కౌంట్ ధరలకే సొంతం చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలు ,టీవీలు, గృహోపరకరణలపై 80శాతం డిస్కౌంట్ పొందవచ్చు. సేల్ జరిగే 12ఏఎం, 8ఏఎం, 4పీఎం సమయంలో అదనపు డిస్కౌంట్లను సొంతం చేసుకోవచ్చు. -
ఆ ఫోన్ తయారీని నిలిపేస్తోందా, యాపిల్ సంచలన నిర్ణయం?
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ త్వరలో ఐఫోన్ 14 సిరీస్ను విడుదల చేయనుంది. ఈ సిరీస్ విడుదలతో ఇతర ఫోన్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. దీంతో పాటు ఐఫోన్ 11 ఫోన్ను తయారీని నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది యాపిల్ కొత్త సిరీస్ ఫోన్ విడుదల సమయంలో కొన్ని పాత ఫోన్ల తయారీని నిలిపివేస్తుంది. 2021లో ఐఫోన్ 13 సిరీస్ విడుదల సమయంలో ఐఫోన్ ఎక్స్ఆర్ ఉత్పత్తిని నిలిపివేసింది. తాజాగా ఐఫోన్ 14సిరీస్ విడుదలతో మూడేళ్ల క్రితం విడుదలైన ఐఫోన్ ఓల్డ్ మోడల్ ఐఫోన్ 11ను డిస్ కంటిన్యూ చేయనుంది. చెన్నై కేంద్రంగా యాపిల్కు చెందిన ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ తన ప్లాంట్లో ఐఫోన్ 11ను తయారు చేస్తుండేది. మార్కెట్లో విడుదలైన ఫోన్ సైతం కొనుగోలు దారుల్ని విపరీతంగా ఆకట్టుంది. ఐఫోన్లలో బెస్ట్ సెల్లింగ్ ఫోన్గా నిలిచింది. ఇప్పుడు అదే ఫోన్ మార్కెట్లో కనమరుగు కానుంది. ఐఫోన్ 11ను నిలిపి వేయడం అంటే ఐఫోన్ 11ను నిలిపి వేయడం అంటే.. యాపిల్ ఇకపై ఐఫోన్ 11 మోడల్ను తయారు చేయదని అర్ధం. ప్రస్తుతం ఉన్న స్టాక్ను అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి అనేక ఇతర థర్డ్ పార్టీ ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో కొనుగోలు చేయొచ్చు. ఆస్టాక్ అమ్మకాలు పూర్తయితేనే ఆమోడల్ను విక్రయాల్ని నిలిపివేసే అవకాశం ఉంది. టిమ్ కుక్ కన్ఫాం చేయలేదు ఐఫోన్ 11 తయారీ నిలిపివేత, ధరల తగ్గింపుపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటిపై యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఐఫోన్ 11 నిలిపివేయాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ మోడల్ను వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఐఫోన్ 11 నిలిపివేసినా మరికొన్ని సంవత్సరాల పాటు అవసరమైన సాఫ్ట్వేర్ అప్డేట్లను యూజర్లు పొందుతారని తెలుస్తోంది. చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! -
ఐఫోన్కు చిక్కులు.. 14 ప్రో భారత్లో లాంఛ్ కాదా?
యాపిల్ ఐఫోన్ 14 సిరీస్ విడుదలపై వినియోగదారులకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి ఆసక్తిని రెట్టింపు చేస్తూ యాపిల్ సంస్థ ఐఫోన్ 14 సిరీస్ను విడుదల తేదీ, ఫోన్లోని ఫీచర్లను లీక్ చేస్తుంది. ఈ తరుణంలో దేశీయ ఐఫోన్ లవర్స్ను నిరుత్సాహా పరుస్తూ పలు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. యాపిల్ ముందస్తు ప్రకటించిన తేదీలలో 'ఐఫోన్ 14 ప్రో' ను భారత్లో విడుదల చేసేందుకు అడ్డంకులు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను కొత్త ఫీచర్లను జోడిస్తూ అప్ గ్రేడ్ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్ 14 సిరీస్లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్ను మినహాయి ఇచ్చి..ఐఫోన్ 14 ప్రోలో మాత్రమే శాటిలైట్ కాలింగ్, టెక్స్టింగ్ ఫీచర్లను యాడ్ చేయనుంది. అదే జరిగితే ఐఫోన్ 14 ప్రో భారత్లో విడుదలలో జాప్యం కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఈ శాటిలైట్ ఫీచర్పై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే? యాపిల్ నుంచి తొలిసారి మరో వారం రోజుల్లో విడుదల కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను భారీ మార్పులతో మార్కెట్కి పరిచయం చేయనుంది. ముఖ్యంగా డిజైన్ల విషయంలో యాపిల్ సంస్థ రాజీపడడం లేదని, యూజర్లను అట్రాక్ట్ చేసేలా వైడ్ నాచ్, పిల్ షేప్డ్ డిజైన్, మొబైల్ స్క్రీన్ స్పేస్ మరింత పెద్దగా ఉండేలా చూస్తోంది. ఆ సంస్థ తొలిసారి ఐఫోన్ 14లో నెట్ వర్క్ లేకపోయినా యూజర్లు అత్యవసర పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకునేలా ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్పై పని చేస్తోంది. ఐఫోన్ 14 ప్రో శాటిలైట్ కనెక్టివిటీ ఐఫోన్ 14 ప్రోలో వస్తున్న శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ గురించి యాపిల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ ఆ ఫీచర్ ఉంటే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ భారత్లో విడుదల కాకపోవచ్చు. పైగా యాపిల్ సంస్థ మరిన్ని సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. భారత వైర్ లెస్ చట్టంలోని సెక్షన్ 6, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం దేశంలో తురయా/ఇరిడియం శాటిలైట్ ఫోన్ల వాడకాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. దీంతో అనుమతి లేకుండా భారతదేశంలో శాటిలైట్ ఫోన్లను ఉపయోగించడం ‘అనధికార / చట్టవిరుద్ధం’ అవుతుంది. యూజర్లకు కేంద్రం హెచ్చరికలు దేశ భద్రత దృష్ట్యా కేంద్రం శాటిలైట్ ఇంటర్నెట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎలాన్ మస్క్కు చెందిన స్టార్ లింక్ శాటి లైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్లో అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడి నిబంధనలకు విరుద్ధంగా మస్క్ వ్యవహరిస్తున్నారంటూ కేంద్రం అనుమతులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. స్టార్లింక్ ప్రీ బుకింగ్స్ నిలిపివేసింది. భారత్లో స్టార్ లింక్ లైసెన్స్ పొందలేదని, ఆ సేవల్ని కొనుగోలు చేయోద్దంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్ 14 ప్రో' ను విడుదల చేయాలంటే యాపిల్ ఐఫోన్ 14 ప్రో విడుదల కోసం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అయితే, ప్రస్తుతం మన దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ నిబంధనల్ని కేంద్ర సవరిస్తుందా? సవరించకుండా ప్రభుత్వం ఐఫోన్ కోసం మినహాయింపు ఇస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. శాటిలైట్ కాలింగ్, మెసేజింగ్ ఫీచర్ను నిలిపివేస్తే ఐఫోన్ 14 ప్రోను లాంఛ్ చేసుకునే వీలుంటుంది. చదవండి👉 మార్చుకోం : ఐఫోన్14 సిరీస్ విడుదలపై భారతీయులు ఏమంటున్నారంటే! -
మేడిన్ ఇండియా ఐఫోన్ 14
న్యూఢిల్లీ: కొత్తగా ప్రవేశపెట్టబోయే ఐఫోన్ 14ని చైనాతో పాటు భారత్లోనూ దాదాపు ఏకకాలంలో తయారుచేయడంపై టెక్ దిగ్గజం యాపిల్ కసరత్తు చేస్తోంది. చైనాలో ఉత్పత్తి మొదలుపెట్టిన రెండు నెలలకే తర్వాత భారత్లోనూ తయారీ ప్రారంభించాలని భావిస్తోంది. దీంతో చైనాలో తయారయ్యే ఐఫోన్ 14 సెప్టెంబర్లో మార్కెట్లోకి రానుండగా.. మేడిన్ ఇండియా వెర్షన్ అక్టోబర్ ఆఖరు లేదా నవంబర్ నాటికి సిద్ధం కాగలదని భావిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ దీపావళి పండుగ సీజన్ను పురస్కరించుకుని అక్టోబర్ 24కే ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా చైనాలో ఉత్పత్తి చేసే ఐఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాక యాపిల్ ఆరు నుంచి తొమ్మిది నెలల తర్వాత భారత్లో తయారు చేస్తోంది. అయితే, ఇటీవలి కాలంలో అమెరికా, చైనా ప్రభుత్వాల మధ్య విభేదాలు తలెత్తడం, కోవిడ్పరమైన లాక్డౌన్లతో సమస్యలు తలెత్తడం వంటి అంశాల వల్ల చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, ప్రత్యామ్నాయంగా భారత్లో తయారీ కార్యకలాపాలను పెంచుకోవడంపై యాపిల్ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రెండు దేశాల్లో తయారీ కార్యకలాపాల మధ్య జాప్యాన్ని గణనీయంగా తగ్గించుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఉంటున్న ఆరు నుంచి తొమ్మిది నెలల జాప్యాన్ని రెండు నెలలకు తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించాయి. భారత్లో తయారీని వేగవంతం చేసేందుకు సరఫరాదారులతో కూడా కంపెనీ చర్చలు జరుపుతోంది. ఏకకాలంలో ఉత్పత్తి.. భారత్లో యాపిల్ ఐఫోన్ల తయారీ 2017లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఫాక్స్కాన్, విస్ట్రన్, పెగాట్రాన్ సంస్థలు యాపిల్ కోసం ఐఫోన్ 13 ఫోన్లను దేశీయంగా తయారు చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 47,000 కోట్ల విలువ చేసే ఐఫోన్లను భారత్ నుంచి ఎగుమతి చేయాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత మార్కెట్లో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలూ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో యాపిల్ తమ ఉత్పత్తులను ఇరు దేశాల్లో (భారత్, చైనా) ఏకకాలంలో ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయని టీఎఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ గ్రూప్ వర్గాలు తెలిపాయి. తదుపరి ఐఫోన్ వెర్షన్ .. భారత్, చైనా నుంచి ఒకే సమయంలో రావచ్చని పేర్కొన్నాయి. ఇందుకోసం చైనా నుంచి విడిభాగాలను ఎగుమతి చేయడం, భారత్లో వాటిని అసెంబ్లింగ్ చేయడానికి సంబంధించిన ప్రక్రియను ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ అధ్యయనం చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది నుంచే రెండు దేశాల్లో ఉత్పత్తి ఏకకాలంలో ప్రారంభించాలని యాపిల్, ఫాక్స్కాన్ భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల రీత్యా సాధ్యపడకపోవచ్చని ఇరు కంపెనీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దీర్ఘకాలికంగానైనా ఈ ప్రణాళికను అమలు చేయాలని అవి భావిస్తున్నట్లు వివరించాయి. ఐఫోన్లను అసెంబ్లింగ్ చేయడమంటే చాలా కష్టతరమైన వ్యవహారమే. ఓవైపు వందలకొద్దీ సరఫరాదారులతో సమన్వయం చేసుకుంటూ మరోవైపు యాపిల్ విధించి కఠినతరమైన డెడ్లైన్లు, నాణ్యతా ప్రమాణాలను అందుకోవాల్సి ఉంటుంది. చైనాకు దీటుగా ఐఫోన్ల ఉత్పత్తిని సాధించగలిగితే భారత్కు పెద్ద మైలురాయిగా మారగలదు. -
మార్చుకోం : ఐఫోన్14 సిరీస్ విడుదలపై భారతీయులు ఏమంటున్నారంటే!
టెక్ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్ -14 సిరీస్ సెప్టెంబర్ 7న లాంచ్ కానుంది. కొత్త ఐఫోన్ సిరీస్ విడుదలతో యూజర్లు తమ ఫోన్లను అప్గ్రేడ్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సేవింగ్స్.కామ్ అనే సంస్థ ఐఫోన్ వినియోగదారులతో నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరికొద్ది రోజుల్లో ఎంతమంది ఐఫోన్లను అప్గ్రేడ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. కాస్ట్ ఎక్కువగా ఉన్నా ఐఫోన్-14 విడుదల కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారంటూ ఇలా పలు ప్రశ్నలపై సర్వేలో పాల్గొన్న యూజర్లను సర్వే సంస్థ ప్రతినిధులు అడిగారు. ► అందుకు 10శాతం మంది మాత్రమే ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఐఫోన్ అమ్మేసి కొత్త ఐఫోన్-14 సిరీస్ ఫోన్ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆర్ధిక పరిస్థితులతో పాటు ఇతర కారణాల వల్ల కొత్త ఫోన్లను కొనుగోలు చేసే ఉద్దేశం తమకు లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తరహా ధోరణి భారతీయల్లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ►ఉత్తర అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఏ ఐఫోన్ ఎక్కువ కాలం పని చేస్తుందో.. ఆ సిరీస్ ఫోన్లను సొంతం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఐఫోన్ -14 సిరీస్ ఫోన్ ధరలు ఎక్కువగా ఉంటే వారి అభిప్రాయాలు మార్చుకోవచ్చు. ►ఆసక్తికరమైన విషయమేమిటంటే, ముగ్గురు కొనుగోలుదారులలో ఇద్దరు 2 ఏళ్లు అంతకంటే తక్కువ రోజులు మాత్రమే ఐఫోలను వినియోగిస్తున్నారు. ఐఫోన్ -14 సిరీస్కి అప్గ్రేడ్ చేయాలనుకోవడానికి వేగవంతమైన ప్రాసెసర్లు, ఎక్కువ స్టోరేజ్, కెమెరా పనితీరు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ►తాము అప్గ్రేడ్ చేయబోమని తెలిపిన యూజర్లు వారి ప్రస్తుత ఐఫోన్లు బాగా పనిచేయడం, అలాగే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ల ధరలు ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణం. -
గుడ్ న్యూస్: ఐఫోన్ 14 వచ్చేస్తోంది, అదికూడా ఊహించని ధరలో
టెక్ దిగ్గజం యాపిల్ లేటెస్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న ఐఫోన్ లవర్స్గా గుడ్న్యూస్. ఐఫోన్14 సెప్టెంబర్ 7న లాంచ్ చేయనుందట. సాధారణంగా ఒక స్పెషల్ ఈవెంట్లో సెప్టెంబరు తొలి అర్థ భాగంలో తాజా ఐఫోన్లను ఆవిష్కరిస్తుంది.ఐఫోన్తోపాటు ఉత్పత్తులను ప్రకటించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే మరో గ్రాండ్ ఈవెంట్కు సిద్ధమవుతోంది యాపిల్. ఈ మేరకు ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్టుసమాచారం. కొత్త ఐఫోన్ను ఆవిష్కరించడం లాంచింగ్ వారం తర్వాత స్టోర్లలో తాజా ఉత్పత్తులను విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే ఐఫోన్14ను కూడా సెప్టెంబర్ 7 లాంచ్ చేసి. సెప్టెంబర్ 16నుంచి రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంచనుంది. బ్లూమ్బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం దీంతోపాటు మూడు కొత్త ఆపిల్ వాచ్ మోడల్లు , అనేక కొత్త వెర్షన్లు మాక్లు ,ఐప్యాడ్లు లాంచ్ చేయనుంది. అంతేకాదు దాదాపు ఐఫోన్ 13 రేటుకే ఐ ఫోన్ 14ను తన యూజర్లకుఅందించనుంది.ఈవెంట్ సమయంపై వ్యాఖ్యానించడానికి ఆపిల్ ప్రతినిధి నిరాకరించారు. -
ఐఫోన్ లవర్స్కు గుడ్న్యూస్!
ఐఫోన్ ప్రియులకు శుభవార్త. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ధరల్ని ఐఫోన్ 13 ధరలకే యాపిల్ అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 14 మోడల్ ప్రారంభ ధర దాదాపు రూ. 80,000 ఉండవచ్చంటూ ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. కొరియన్ టెక్ బ్లాగ్ Naverలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పరిమిత సంఖ్యలో సప్లయ్ చైన్ సమస్యలు ఇతర కారణాల్ని పరిగణలోకి తీసుకున్న యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు యాపిల్ 14 ధరల్ని పెంచే యోచన లేదని టెక్ బ్లాగ్ పేర్కొంది. అయితే స్తబ్ధుగా స్మార్ట్ఫోన్ మార్కెట్, డిమాండ్ తగ్గుదల కారణంగా యాపిల్ టాప్ ఎగ్జిక్యూటివ్లు ఈ నిర్ణయం తీసుకున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే యుఎస్లో ఐఫోన్14 ధర 799 డాలర్లు ఉండగా.. మనదేశంలో ఆ ఫోన్ ధర రూ. 63,200కే లభ్యం కానుంది. జీఎస్టీ, దిగుమతి సుంకం,ఇతర ఛార్జీల్ని కలుపుకొని ఈ ఫోన్ ధర పెరిగే అవకాశం ఉండనుంది. కానీ, గతేడాది యూఎస్ మార్కెట్లో ఐఫోన్ 13 ఫోన్ సిరీస్కు సమానంగా భారత్ మార్కెట్లో అదే సిరీస్ ఫోన్ లభ్యమయ్యాయని.. కాబట్టి భారత్లో సైతం ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ధరలు పెరిగే అవకాశం లేదని తెలుస్తోంది. -
అదిరిపోయే ఫీచర్లతో ఐఫోన్ 14, ట్రెండ్ సెట్ చేస్తుందా!
యాపిల్ ఐఫోన్ లవర్స్కు శుభవార్త. యాపిల్ ఐఫోన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ 13న విడుదల కానున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ఐఫోన్ 14 ప్రాసెసర్ గురించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గతేడాది సెప్టెంబర్ 24 వరకు విడుదలైన ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల వరకు ఏ15 ప్రాసెసర్ ఉండేది. అయితే మరికొన్ని నెలల్లో మార్కెట్కు పరిచయం కానున్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లైన ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్,ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్లలో ఏ15కు అడ్వాన్స్ వెర్షన్గా ఏ16 ప్రాసెసర్ ఉంటుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కానీ గేమింగ్ ఫర్మామెన్స్ కోసం యాపిల్ సంస్థ ఐఫోన్ 14 ప్రో ఫోన్లలో మాత్రమే ఈ ఏ16 ప్రాసెసర్ ను వినియోగించినట్లు సమాచారం. ఏ16 బయోనిక్ ప్రాసెసర్ ప్రత్యేకతలివే మ్యాక్ వరల్డ్ నివేదిక ప్రకారం..ఏ 16 బయోనిక్ ప్రాసెసర్ చాలా ప్రత్యేకమైందని తెలుస్తుంది. టీఎస్ఎంసీ 5ఎన్ఎంతో ఈ అడ్వాన్స్ వెర్షన్ ప్రాసెసర్ను తయారు చేశారు. 18 బిలియన్ నుండి 20 బిలియన్ ట్రాన్సిస్టర్లతో (A15లో 15.8 బిలియన్ల నుండి పెరిగింది) రానుంది. ఐఫోన్ 14 స్పెసిపికేషన్ ఐఫోన్14 ఫోన్ 6.1 అంగుళాల డిస్ప్లే . వీడియోలు చూసేందుకు, గేమ్స్ ఆడేందుకు 1170*2532 పిక్సెల్స్ రెజెల్యూషన్, 4జీబీ ర్యామ్ ప్లస్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక డ్యూయల్ సెటప్ రేర్ కెమెరా ఉంది. ఫోన్తో అద్భుతమైన ఫోటోల్ని తీసేందుకు 12ఎంపీ ప్లస్ 12ఎంపీ కెమెరాలు,సెల్ఫీలు దిగేందుకు, వీడియో కాల్స్ చేసుకునేందుకు ఫోన్ ముందు భాగంలో 12ఎంపీ ప్లస్ ఎస్ఎల్ 3డీ కెమెరాతో రానుంది. ఐఓఎస్ వీ 15 ఆపరేటింగ్ సిస్టం, 3115 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీంతో పాలు పలు రకాలైన కనెక్టివిటీ ఆప్షన్ ఉన్నాయి. ముఖ్యంగా వైఫై,మొబైల్ హాట్ స్పాట్, బ్లూటూత్, 5జీ నెట్ వర్క్కు సపోర్ట్ చేస్తుండగా..ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ప్రారంభ ధర రూ. 64వేల నుంచి రూ.71,500వరకు ఉండనున్నట్లు అంచనా. -
గుడ్న్యూస్: అదిరిపోయే డిస్కౌంట్లు, ఐఫోన్ 13పై బంపరాఫర్లు!
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఫోన్13పై బంపరాఫర్ ప్రకటించింది. అమెజాన్ అందిస్తున్న స్టన్నింగ్ డీల్లో కొనుగోలు దారులు భారీ డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లో తక్కువ ధరకే ఐఫోన్ 13ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్(అంచనా మాత్రమే)లో టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరెన్స్(డబ్ల్యూ డబ్ల్యూ డీసీ) నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో యాపిల్ ఐఫోన్14ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అమెజాన్ ఐఫోన్ 13లపై డిస్కౌంట్లు ప్రకటించింది. రూ.28,550 డిస్కౌంట్తో 128జీబీ ర్యామ్తో ఐఫోన్ 13ను కేవలం రూ.51,350కే అందిస్తుంది. అమెజాన్లో ఐఫోన్ 13ధర తగ్గింపు ఒరిజనల్గా 128జీబీ యాపిల్ ఐఫోన్ 13ఫోన్ ధర రూ.79,900 ఉండగా ఈ ఫోన్ అమెజాన్ రూ.51,350కే అందిస్తుంది. ముందుగా ఈ ఫోన్ కొనుగోలు దారులు రూ.10వేల ఫ్లాట్ డిస్కౌంట్తో ఆ ఫోన్ ధర రూ.69,990కి తగ్గుతుంది. దీంతో ఎక్ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.18,550 తగ్గగా.. ఆఫోన్ అసలు ధర కంటే రూ.28,550 తగ్గి రూ.51,350కే వస్తుంది. ఐఫోన్ 13 ఫీచర్లు యాపిల్ ఐఫోన్ 60హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో 6.1 అంగుళాల రెటీనా డిస్ప్లే,ఏ15 బయోనిక్ చిప్ సెట్, యాపిల్కు చెందిన గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్(జీపీయూ), డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ విత్ 12ఎంపీ ప్రైమరీ లెన్స్, ఫ్రంట్ సైడ్ 12 ఎంపీ ఆల్ట్రా వైడ్ లెన్స్, రెటీనా ఫ్లాష్తో 12ఎంపీ సెల్ఫీ కెమెరా,128జీబీ స్టోరేజ్ ఫీచర్లు ఉన్నాయి. చదవండి👉 భారత్లో ఐఫోన్ అమ్మకాలు అదరగొట్టేస్తున్నాయ్, రూ.10వేల కోట్లకు యాపిల్ ఎగుమతులు!