jobs cut
-
BSNL Layoffs: 19,000 మంది ఉద్యోగులకు గండం
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL)వేలాది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కొత్త స్వచ్ఛంద పదవీ విరమణ ప్రణాళిక.. వీఆర్ఎస్ 2.0ని (VRS 2.o) ప్రతిపాదించింది. సంస్థ ఆర్థిక సమతుల్యతను మెరుగుపరుచుకోవడానికి ఉద్యోగుల తగ్గింపును (Layoff) ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ తొలగింపులు దాదాపు 18,000 నుండి 19,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని తెలుస్తోంది.దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాలలో 4జీ, 5జీ వంటి అధునాతన నెట్వర్క్ టెక్నాలజీలను ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న బీఎస్ఎన్ఎల్ ఖర్చులను తగ్గించుకోవడంపైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగుల కొత్త స్వచ్ఛంద పదవీ విరమణ ప్రణాళిక (VRS)ను ప్రతిపాదించింది ఖర్చులను తగ్గించుకోవడానికి శ్రామిక శక్తి తగ్గింపు కోసం టెలికమ్యూనికేషన్ విభాగం (DoT) ఆమోదాన్ని కోరింది. వీఆర్ఎస్ 2.0 కోసం రూ.1,500 కోట్లను ఆమోదించాలని కోరింది.తాజా తొలగింపులు బీఎస్ఎన్ఎల్ వర్క్ఫోర్స్ మేనేజ్మెంట్పై ప్రభుత్వ ఖర్చులో 38% వరకు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియలో బ్యాలెన్స్ షీట్ ఆరోగ్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ శ్రామిక శక్తిని నిర్వహణ కోసం సుమారు రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ ప్రతిపాదన కంపెనీ సంవత్సరానికి రూ.5,000 కోట్ల వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీఎస్ఎన్ఎల్ లేఆఫ్ అభ్యర్థనకు కేబినెట్, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి అనుమతి రావాల్సి ఉంది.2024 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎస్ఎల్ ఆదాయం రూ.21,302 కోట్లుగా ఉంది. గత సంవత్సరం రూ.20,699 కోట్లతో పోలిస్తే ఇది కాస్త మెరుగు. ప్రస్తుతం సంస్థలో మొత్తం 55,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 25,000 మంది ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులు కాగా 30,000 మంది నాన్ ఎగ్జిక్యూటివ్లు. 2019లో భారత ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ (MTNL) ఉద్యోగుల కోసం రూ.69,000 కోట్ల పునరుద్ధరణ ప్రణాళికను ఆమోదించింది. -
భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండడంతో కొంతమందికి ఉపాధి లభిస్తుంటే, ఇంకొందరు తమ కొలువులు కోల్పోయేందుకు కారణం అవుతుంది. కృత్రిమ మేధ(AI) వేగంగా వృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలోని ఉద్యోగ మార్కెట్(Job Market)పై దీని ప్రభావం తీవ్రంగానే ఉంది. గతంలో వివిధ రంగాల్లో భిన్న విభాగాల్లో పని చేసేందుకు మానవవనరుల అవసరం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయి. రానున్న పదేళ్లలో ఇప్పుడు చేస్తున్న చాలా ఉద్యోగాలు కనుమరుగవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో ప్రధానంగా కింది విభాగాలకు ముప్పు వాటిల్లబోతున్నట్లు చెబుతున్నారు.క్యాషియర్లు: సెల్ఫ్ చెక్ అవుట్ కియోస్క్లు, ఆన్లైన్ షాపింగ్(Online Shopping) వల్ల క్యాషియర్ల అవసరం తగ్గిపోతోంది.ట్రావెల్ ఏజెంట్లు: ఎక్స్ పీడియా వంటి ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్లు, యూట్యూబ్(YouTube), వెబ్ కంటెట్.. వంటి విభిన్న మార్గాలు ఉండడంతో ట్రావెల్ ఏజెంట్ల అవసరం తగ్గిపోతోంది.లైబ్రరీ క్లర్కులు: డిజిటల్ వనరులు, ఈ-బుక్స్(E-Books) అధికమవుతున్నాయి. దాంతో ఫిజికల్ లైబ్రరీ మేనేజ్మెంట్ అవసరం తక్కువగా ఉంది.పోస్టల్ సర్వీస్ వర్కర్స్: ఈ-మెయిల్, డిజిటల్ కమ్యూనికేషన్(Digital Communication) కారణంగా ఫిజికల్ మెయిల్ తగ్గడం పోస్టల్ వర్కర్ల అవసరాన్ని తగ్గిస్తోంది.డేటా ఎంట్రీ క్లర్క్లు: మాన్యువల్గా డేటా ఎంట్రీ చేసే క్లర్క్ల స్థానంలో ఏఐ, ఆటోమేషన్ డేటా ప్రాసెసింగ్ను క్రమబద్ధీకరిస్తున్నారు. దాంతో భవిష్యత్తులో వీరి అవసరం ఉండకపోవచ్చు.ఫ్యాక్టరీ వర్కర్స్: తయారీ రంగంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఆటోమేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొత్త మోడళ్లను రూపొందించడానికి వీలుగా రోబోటిక్స్ను వాడుతున్నారు. గతంలో ఈ పనంతా ఫిజికల్గా ఉద్యోగులు చేసేవారు.బ్యాంక్ టెల్లర్స్: గతంలో బ్యాంకింగ్ సమస్యలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులుంటే వెంటనే కాల్ సెంటర్కు కాల్ చేసిన కనుక్కునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. బ్యాంకింగ్ సిస్టమ్లో వచ్చిన మార్పులు, చాట్బాట్లు, మొబైల్ యాప్స్ వల్ల సంప్రదాయ బ్యాంకు టెల్లర్ల అవసరం తగ్గిపోతోంది.ట్యాక్సీ డ్రైవర్లు: సంప్రదాయ ట్యాక్సీ డ్రైవర్లు ఇప్పటికే భారీగా తగ్గిపోయారు. ఉబెర్, ఓలా, ర్యాపిడో.. వంటి రైడ్ హెయిలింగ్ సర్వీసులు ట్యాక్సీ(Taxi) సేవలను అందిస్తున్నాయి. దాంతో సంప్రదాయ డ్రైవర్లకు ఉపాధి కరవైంది.ఫాస్ట్ ఫుడ్ కుక్స్: ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో ఆటోమేషన్ పెరుగుతోంది. మాన్యువల్గా కాకుండా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అవసరమైన పదార్థాలతో రుచికరంగా ఫాస్ట్ఫుడ్ తయారు చేసే సిస్టమ్ను అభివృద్ధి చేశారు.మెషిన్కు అలసట, సెలవులు ఉండవు!మానవుల కంటే వేగంగా, మరింత కచ్చితత్వంతో ఏఐ ఆధారిత రోబోట్స్, చాట్బాట్స్.. పనులను నిర్వహించగలవు. ఫిజికల్గా ఉద్యోగులు షిఫ్ట్ల వారీగా పని చేస్తుంటారు. మెషిన్కు అలాంటివి ఉండవు. ఉద్యోగులకు అలవెన్స్లు, జీతాలు, సెలవులు, వీక్ఆఫ్లు.. వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రోబోట్స్కు అలాంటి ఇబ్బంది ఉండదు. దాంతో ఉత్పాదకత పెరుగుతుందనే వాదనలున్నాయి. ఇది డేటా ఎంట్రీ, బేసిక్ కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల కోతకు కారణమవుతుంది.అసలు ఏఐ వల్ల కొలువులే దొరకవా..?ఏఐ డెవలప్మెంట్, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఎథిక్స్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తోంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్లో అడ్వాన్స్డ్ స్కిల్స్ అవసరమయ్యే ఉద్యోగాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఒకవేళ చేస్తున్న ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురైతే తిరిగి అంతకంటే ఉన్నతమైన కొలువులు ఎలా సాధించవచ్చో దృష్టి కేంద్రీకరించి స్కిల్స్ పెంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఇదీ చదవండి: స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులుఇప్పుడేం చేయాలి..కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా నిర్వహించడానికి శ్రామిక శక్తికి తగినంత శిక్షణ ఇవ్వకపోతే అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కృత్రిమ మేధ ఆధారిత పాత్రలకు కార్మికులను సిద్ధం చేయడానికి శిక్షణ, అప్ స్కిల్ కార్యక్రమాల అవసరం ఉందని సూచిస్తున్నారు. ఆర్థిక, ఆర్థికేతర మార్గాల ద్వారా ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెబుతున్నారు. -
ఉద్యోగులను తొలగిస్తున్న మెటా
టెక్నాలజీ పరిశ్రమలో ఉద్యోగాల తొలగింపునకు అంతం లేకుండా పోతోంది. ఓ వైపు వేలాదిగా ప్రకటిత కోతలు కొనసాగుతుండగా మరోవైపు అప్రకటిత లేఆఫ్ల వార్తలు సైతం వినిపిస్తున్నాయి. తాజాగా టెక్నాలజీ దిగ్గజం మెటా కూడా ఇలాంటి తొలగింపులు చేపట్టింది. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, రియాలిటీ ల్యాబ్లతో సహా పలు యూనిట్లలో ఉద్యోగులను తొలగిస్తోందని ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ వెర్జ్ నివేదించింది.దీనిని మెటా ప్రతినిధి ధ్రువీకరించారు. రాయిటర్స్కు ఇచ్చిన ప్రకటనలో కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలు, ప్రాంతీయ వ్యూహాలకు అనుగుణంగా సర్దుబాటు చేయడానికి తమ బృందాల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. "ఇందులో కొన్ని బృందాలను వేర్వేరు ప్రదేశాలకు తరలించడం, కొంతమంది ఉద్యోగులను ఇతర పాత్రలకు మార్చడం వంటివి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావితమైన ఉద్యోగులకు ఇతర అవకాశాలను కనుగొనడానికి మేము కృషి చేస్తాం" అని కంపనీ ప్రతినిధి చెప్పారు.ఇదీ చదవండి: టీసీఎస్.. ఇన్ఫోసిస్కు ప్రత్యర్థి కాదా?కాగా వెర్జ్ రిపోర్టులో తొలగిస్తున్న ఉద్యోగాల సంఖ్యను కచ్చితంగా పేర్కొనలేదు కానీ అవి తక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు వెల్లడించింది. తొలగింపు సంఖ్యపై మెటా కూడా వ్యాఖ్యానించలేదు. మరో వైపు, తమ రోజువారీ 25 డాలర్ల భోజన క్రెడిట్లను ఉపయోగించి వైన్ గ్లాసులు, లాండ్రీ డిటర్జెంట్, ఇతర గృహోపకరణాలను కొనుగోలు చేశారనే ఆరోపణలపై లాస్ ఏంజిల్స్లోని మరో రెండు డజన్ల మంది సిబ్బందిని మెటా తొలగించిందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ నివేదికపై వ్యాఖ్యానించడానికి మెటా నిరాకరించింది. -
ఈ టెక్ కంపెనీ మొదలెట్టేసింది.. 5,600 మంది తొలగింపు!
టెక్ దిగ్గజం సిస్కో చెప్పినట్టే ఉద్యోగుల తొలగింపులు మొదలెట్టేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సిబ్బందిలో 7 శాతం అంటే సుమారు 5,600 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతూ మరో రౌండ్ తొలగింపులను ప్రకటించింది.సిబ్బందిని తగ్గించే ప్రణాళికలను గత ఆగస్ట్ లోనే సిస్కో సూచించింది. అయితే ఏ వ్యక్తులు లేదా విభాగాలు ప్రభావితం అవుతాయో కంపెనీ పేర్కొనలేదు. స్పష్టత లేకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. తొలగింపుల గురించి ఉద్యోగులకు సెప్టెంబరు మధ్యలోనే సమాచారం అందింది.టెక్ క్రంచ్ నుండి వచ్చిన నివేదిక సిస్కోలో పని వాతావరణం అధ్వాన్నంగా ఉందని వెల్లడించింది. ఇక్కడి పని వాతావరణాన్ని చాలా మంది ఉద్యోగులు విషపూరితంగా అభివర్ణించారు. తొలగింపులు సిస్కో థ్రెట్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ రీసెర్చ్ డివిజన్ అయిన టాలోస్ సెక్యూరిటీపై ప్రభావం చూపాయని నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: ఆర్నెళ్లు ఆలస్యం.. యాక్సెంచర్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ఓ వైపు ఉద్యోగాల కోత ఉన్నప్పటికీ కంపెనీ రికార్డ్స్థాయి లాభాల్లో కొనసాగుతోంది. సుమారు 54 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో 2024 "రికార్డులో రెండవ బలమైన సంవత్సరం" అని కంపెనీ నివేదించింది. లేఆఫ్ ప్రకటన వెలువడిన రోజునే ఈ ఆర్థిక నివేదిక విడుదలైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరిలోనూ సిస్కో 4,000 మంది ఉద్యోగులను తొలగించింది. -
వందలాది ఉద్యోగులను వదిలించుకోనున్న ప్రముఖ బ్యాంక్
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ గోల్డ్మన్ సాచ్స్ గ్రూప్ రానున్న వారాల్లో కొన్ని వందల మంది ఉద్యోగులను వదిలించుకోవాలని యోచిస్తోంది.తక్కువ-పనితీరు గల సిబ్బంది వార్షిక తొలగింపులో భాగంగా దీన్ని అమలు చేయబోతోందని ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్బర్గ్ నివేదించింది.తాజా తొలగింపులతో కలుపుకొంటే 2024 ఏడాదిలో మొత్తంగా 3 నుంచి 4 శాతం సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారు. వీటిలో చాలా చాలా వరకు ఏడాది ప్రారంభంలోనే జరినట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కొత్త ప్రతిభను చేర్చుకోవడానికి వీలుగా బ్యాంక్ ఈ చర్యలకు పూనుకుంటోంది. ఉద్యోగుల పనితీరు వార్షిక సమీక్షను కోవిడ్ సమయంలో తాత్కాలికంగా నిలిపేసిన బ్యాంక్ తిరిగి అమలు చేస్తోంది.గోల్డ్మ్యాన్ సాచ్స్ గ్రూప్ ఏడాది మధ్యలో 44,300 మందిని నియమించుకుంది. సిబ్బందికి సంబంధించిన బ్యాంక్ వార్షిక సమీక్ష సాధారణంగా జరిగే ప్రామాణిక ప్రక్రియ అని కంపెనీ ప్రతినిధి తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉండాలని కంపెనీ యోచిస్తోందని వివరించారు. -
చైనాకు టాటా.. బెంగళూరుకు ఐబీఎం ఆఫీస్లు!
అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్) చైనాను వీడుతోంది. అక్కడి కీలక పరిశోధనా విభాగాన్ని మూసివేస్తోంది. దీంతో 1,000 మందికి పైగా ఉద్యోగులు జాబ్స్ కోల్పోతున్నారు.ఆర్థిక మాంద్యం, పెరిగిన నియంత్రణ పరిశీలన కారణంగా చైనాను వీడుతున్న కంపెనీల జాబితాలో ఐబీఎం చేరింది. చైనాలో కంపెనీ రీసెర్చ్ & డెవలప్మెంట్, టెస్టింగ్ విభాగాలకు సంబంధించిన రెండు వ్యాపార కార్యకలాపాలను మూసివేస్తోందని ఓ నివేదిక పేర్కొంది. బీజింగ్లో స్థానిక వ్యాపార సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో విదేశీ పెట్టుబడులు మందగించాయి. ఈ నేపథ్యంలో మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు మార్చాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.ఐబీఎం తన చైనీస్ ఆర్&డీ కార్యకలాపాలను వేరే చోటకు తరలించాలని యోచిస్తోందని తెలిసిన ఉద్యోగిని ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ఇందు కోసం భారత్లోని బెంగళూరు లాంటి చోట్ల ఇంజనీర్లు, రీసెర్చర్లను ఈ యూఎస్ కంపెనీ నియమించుకుంటోందని ఈ విషయం గురించి వివరించిన ఉద్యోగులను ఉటంకిస్తూ తెలిపింది. -
ఒక్క మెడిసిన్ రిజెక్ట్.. 75% ఉద్యోగుల తొలగింపు
ఒక్క మెడిసిన్ రిజెక్ట్ అయినందుకు ఏకంగా 75% ఉద్యోగులను తొలగించింది ఓ అమెరికన్ ఔషధ సంస్థ. లైకోస్ థెరప్యూటిక్స్ అనే కంపెనీ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ చికిత్సలో ఉపయోగించే సైకోథెరపీ డ్రగ్ ఎండీఎంఏను తయారు చేసింది. దీన్ని యూఎస్ ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ ఆమోదానికి పంపగా తిరస్కరించింది.ఎఫ్డీఏ ఎండీఎంఏ ఔషధాన్ని తిరస్కరించిన వారం రోజుల్లోనే తమ సిబ్బందిలో 75% మందిని తొలగిస్తున్నట్లు, కంపెనీ వ్యవస్థాపకుడు బోర్డు నుంచి వైదొలుగుతున్నట్లు లైకోస్ థెరప్యూటిక్స్ ప్రకటించింది. "మేము ఎఫ్డీఏ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. ఈ సరికొత్త ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకురావడానికి మరింత కృషి చేస్తాం" అని బోర్డు ఛైర్మన్ జెఫ్ జార్జ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎఫ్డీఏ తిరస్కరణ నిర్ణయాన్ని సీరియస్గా తీసుకున్న కంపెనీ తమ ఔషధానికి మళ్లీ ఎఫ్డీఏ ఆమోదం పొందేలా తీవ్ర ప్రయత్నాలను చేపట్టింది. క్లినికల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఏజెన్సీతో సమన్వయం సహా ఆ ప్రయత్నాలను పర్యవేక్షించడానికి జాన్సన్ & జాన్సన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ హగ్ని నియమించింది. ఇప్పుడు లైకోస్లో సీనియర్ మెడికల్ అడ్వైజర్ అయిన హగ్, 17 ఏళ్లకు పైగా జాన్సన్ & జాన్సన్లో ఉన్నారు.ఎఫ్డీఏ ఆమోదం కోసం తమ ఎండీఎంఏ ఔషధాన్ని మళ్లీ సమర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లైకోస్ తెలిపింది. అయితే ఇది ఎంత సమయం పడుతుందో అంచనా వేయలేదు. మరొక ఫేజ్ 3 అధ్యయనాన్ని నిర్వహించాలని ఎఫ్డీఏ కోరిందని కంపెనీ గతంలో చెప్పింది. సాధారణంగా ఇది పూర్తి చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ ప్రకారం, 2020లో దాదాపు 13 మిలియన్ల అమెరికన్లు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ను కలిగి ఉన్నారు. దీని చికిత్స కోసం అతి తక్కువ ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఎఫ్డీఏ ఆమోదించిన రెండు మందులు ఉన్నప్పటికీ కొంత మంది రోగులకు అవి ప్రభావవంతంగా పనిచేయడం లేదు. -
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్లో భారీగా ఉద్యోగాల కోత
దేశంలో అన్ని రంగాల్లో ఉద్యోగాల కోతలు సర్వసాధారణమై పోతున్నాయి. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యెస్ బ్యాంక్ భారీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రకటించింది. ఫలితంగా 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.వ్యయ నియంత్రణ, సమర్థవంతమైన కార్యకలాపాల నిర్వహణ కోసం యెస్ బ్యాంక్ ఇటీవల చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పుడు ప్రకటించిన తొలగింపులతోపాటు రానున్న వారాల్లో మరిన్ని ఉద్యోగాలకు కోత పెడుతుందని భావిస్తున్నారు.ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. మల్టీనేషనల్ కన్సల్టింగ్ సంస్థను నియమించుకున్న యెస్ బ్యాంక్ ఆ సంస్థ చేసిన సిఫార్సుల మేరకు తొలగింపులు చేపట్టింది. హోల్సేల్, రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ సహా పలు విభాగాల్లో ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభారం పడింది.ఆపరేషన్స్ సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు, సిబ్బంది వినియోగాన్ని మెరుగుపరుచుకోవడమే పునర్వ్యవస్థీకరణ లక్ష్యంగా బ్యాంక్ పేర్కొంటోంది. అయితే వ్యయ నియంత్రణలో భాగంగానే డిజిటల్ బ్యాంకింగ్ వైపు యెస్ బ్యాంక్ మరింతగా మళ్లుతోందని నివేదికలు చెబుతున్నాయి. -
మైక్రోసాఫ్ట్లో మళ్లీ ఉద్యోగాల కోత.. భారీగా తొలగింపులు!
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ ఉద్యోగ కోతలను ప్రకటించింది. గత ఏడాది జనవరిలో ఏకంగా 10,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచిన మైక్రోసాఫ్ట్ అప్పటి నుంచి పలు చిన్న రౌండ్ల లేఆఫ్లు ప్రకటిస్తూ వచ్చింది. ఈ ఏడాది మేలో చివరిసారిగా తొలగింపులు చేపట్టిన టెక్ దిగ్గజం తాజగా మరో రౌండ్ తొలగింపును ప్రకటించింది.ఈ తొలగింపుల్లో మైక్రోసాఫ్ట్ మిక్స్డ్ రియాలిటీ విభాగం, అజ్యూర్ క్లౌడ్ యూనిట్తో సహా వివిధ విభాగాలలో సుమారు 1,000 మంది ఉద్యోగులు ప్రభావితమవుతున్నారు. అత్యంత ప్రభావితవుతున్న విభాగాల్లో హోలోలెన్స్ 2 ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్సెట్ను అభివృద్ధి చేసిన మిక్స్డ్ రియాలిటీ విభాగం ఉంది. ఓ వైపు ఉద్యోగ కోతలు ఉన్నప్పటికీ, హోలోలెన్స్ 2 అమ్మకాలను కొనసాగించాలని మైక్రోసాఫ్ట్ యోచిస్తోంది.'మైక్రోసాఫ్ట్ మిక్స్ డ్ రియాలిటీ సంస్థను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు ఈ రోజు ప్రకటించాం. రక్షణ శాఖకు సంబంధించిన ఐవీఏఎస్ కార్యక్రమానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం. మన సైనికులకు మద్దతు ఇవ్వడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాం. అదనంగా, విస్తృత మిక్స్ డ్ రియాలిటీ హార్డ్ వేర్ ఎకోసిస్టమ్ ను చేరుకోవడానికి మేము W365 లో పెట్టుబడిని కొనసాగిస్తాం. ఇప్పటికే ఉన్న హోలోలెన్స్ 2 కస్టమర్లు, భాగస్వాములకు మద్దతు ఇస్తూనే హోలోలెన్స్ 2 అమ్మకాలను కొనసాగిస్తాం' అని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి క్రెయిగ్ సిన్కోటా 'ది వెర్జ్'కు ఈమెయిల్ ప్రకటనలో తెలిపారు.మిక్స్ డ్ రియాలిటీ విభాగంతో పాటు అజూర్ క్లౌడ్ యూనిట్ ను కూడా గణనీయమైన తొలగింపులు తాకుతున్నాయి. అజూర్ ఫర్ ఆపరేటర్స్, మిషన్ ఇంజనీరింగ్ టీమ్లలో వందలాది ఉద్యోగాలను తొలగించినట్లు బిజినెస్ ఇన్సైడర్ నివేదించింది. క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్ టెక్నాలజీస్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై దృష్టి సారించడానికి 2021లో స్థాపించిన స్ట్రాటజిక్ మిషన్స్ అండ్ టెక్నాలజీస్ ఆర్గనైజేషన్లో ఈ టీమ్లు భాగంగా ఉన్నాయి. -
Citigroup Layoffs: 2,000 మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ సిటీ గ్రాప్ (Citigroup) ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (Q3) 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో ఈ ఏడాది కంపెనీ సీవెరన్స్ ఛార్జీలు (తొలగించిన ఉద్యోగులకు చెల్లించే పరిహారం) 650 మిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్బెర్గ్ వార్తా సంస్థ నివేదించింది. కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మార్క్ మాసన్ అనలిస్టులతో కాన్ఫరెన్స్ కాల్లో ఆదాయాలపై చర్చిస్తూ ఈ ఏడాది మొత్తంగా కంపెనీ దాదాపు 7,000 ఉద్యోగాలను తగ్గించిందని చెప్పారు. మూడో త్రైమాసికంలో 2000 ఉద్యోగాలు తగ్గించగా అంతకుముందు జూన్ చివరి నాటికి 5000 ఉద్యోగాలు తగ్గించినట్లు పేర్కొన్నారు. కంపెనీ హెడ్కౌంట్ తగ్గడానికి కారణం రీపోజిషనింగ్ ఛార్జీలే అని మాసన్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు సంస్థ నమోదు చేసిన ఛార్జీలు సిటీ గ్రూప్ గత నెలలో ప్రకటించిన పునర్వ్యవస్థీకరణను (ఐదు కీలక వ్యాపారాలపై సంస్థను తిరిగి కేంద్రీకరించే పునరుద్ధరణ)కి సంబంధించినది కాదని ఆయన స్పష్టం చేశారు. కంపెనీ పునర్నిర్మాణం మరిన్ని ఉద్యోగాల కోతలకు దారితీస్తుందని సిటీ గ్రూప్ పేర్కొంది. అయితే ఆ సంఖ్య ఎంతన్నది స్పష్టత ఇవ్వలేదు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన గూగుల్.. వాళ్లు చేసిన పాపం ఏంటంటే..
ప్రముఖ టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్.. గూగుల్ హెల్ప్ వర్కర్ల కాంట్రాక్ట్ను అర్ధాంతరంగా ముగించి నిర్ధాక్షణ్యంగా వారిని విధుల నుంచి తొలగించింది. ఇంతకీ వాళ్లు చేసిన పాపం ఏంటంటే యూనియన్ ఏర్పాటుకు ప్రయత్నించడమే. ఈ మేరకు ఆరోపిస్తూ యూఎస్ లేబర్ బోర్డ్కి బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. యూనియన్ ఏర్పాటుకు ప్రయత్నించిన ఉద్యోగులపై కక్ష తీర్చుకునేందుకు గూగూల్ మాతృసంస్థ ఆల్ఫాబిట్ తీసుకున్న నిర్ణయం ఫెడెరల్ కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ పేర్కొంది. బాధిత ఉద్యోగుల్లో 70 శాతం మందికిపైగా తాము ఉద్యోగాలు కోల్పోతున్నామని జులైలో చెప్పినట్లు నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ ఫైలింగ్ను ఉటంకిస్తూ ‘బ్లూమ్బెర్గ్’ నివేదించింది. ఆస్టిన్, టెక్సాస్, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాతోపాటు యూఎస్లోని ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల తొలగింపు గురించి "టౌన్ హాల్" ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆల్ఫాబెట్ తెలియజేసింది. అలాగే ఉద్యోగులకూ ఈమెయిల్స్ పంపించింది. Lay off: ‘మేం పీకేశాం.. వారికి ఎవరైనా జాబ్ ఇవ్వండి ప్లీజ్’ బాధిత ఉద్యోగుల్లో 118 మంది రైటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, కంటెంట్ రూపొందించే లాంచ్ కోఆర్డినేటర్లు ఉన్నారు. వీరింతా గూగూల్ సెర్చ్ రిజల్ట్స్, ఏఐ చాట్బాట్ నాణ్యతను మెరుగుపరచడంలో కీలకంగా పనిచేశారు. యాక్సెంచర్ ద్వారా వీరిని నియమించుకున్నప్పటికీ, చట్టబద్ధంగా గూగుల్ సంస్థే తమకు తమ యజమాని అని ఉద్యోగులు పేర్కొంటున్నారు. యాక్సెంచర్తోపాటు గూగుల్ను తమకు ఉమ్మడి యజమానిగా గుర్తించాలని లేబర్ బోర్డ్ను కోరుతున్నారు. 2018లో ఆల్ఫాబెట్ కాంట్రాక్టు వర్కర్లలో చాలా మంది దాని గ్లోబల్ వర్క్ఫోర్స్లో భాగమయ్యారని బ్లూమ్బెర్గ్ నివేదిక పేర్కొంది. అదేవిధంగా కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్ ద్వారా పనిచేస్తున్న ఆల్ఫాబెట్ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ చేయడానికి 2023 ఏప్రిల్లో ఆమోదం లభించింది. ఆ కార్మికుల ఉమ్మడి యజమాని ఆల్ఫాబెట్ అని నేషనల్ లేబర్ రిలేషన్స్ బోర్డ్ రీజనల్ డైరెక్టర్ జులై నెలలో ఇచ్చిన తీర్పును సభ్యులందరూ సమర్థించారు. -
35,000 ఉద్యోగాలు కట్! స్విస్ బ్యాంకులో సగానికిపైగా కోతలు..
స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం యూబీఎస్.. తాను టేకోవర్ చేస్తున్న మరో స్విస్ బ్యాంకు క్రెడిట్ సూసీలో 35,000 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తోందని బ్లూమ్బర్గ్ వార్తా సంస్థ తాజాగా కథనం వెలువరించింది. దాదాపు 45,000 మంది ఉద్యోగులు ఉన్న క్రెడిట్ సూసీ.. దాని సాల్వెన్సీ గురించి ఇన్వెస్టర్ల భయాలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దాదాపుగా కుప్పకూలింది. దీంతో స్విస్ ప్రభుత్వం భారీ బెయిలౌట్తో అండగా నిలవడంతో క్రెడిట్ సూసీను కొనుగోలు చేసేందుకు యూబీఎస్ గ్రూప్ ముందుకు వచ్చింది. ప్రపంచంలో ప్రముఖమైన ఈ రెండు బ్యాంకులు కలుస్తున్న నేపథ్యంలో భారీగా ఉద్యోగాల కోతలు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు ముందుగానే హెచ్చరించారు. కాగా ఉద్యోగ కోతలపై వివరణ కోసం అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్పీ... యూబీఎస్ను సంప్రదించగా స్పందించేందుకు నిరాకరించింది. మూడు దశల్లో.. యూబీఎస్, క్రెడిట్ సూసీ రెండు బ్యాంకింగ్ సంస్థల్లో కలిపి గత సంవత్సరం చివరి నాటికి దాదాపు 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 37,000 మంది స్విట్జర్లాండ్లో పని చేస్తున్నారు. ఉద్యోగుల కోత మూడు దశల్లో ఉంటుందని, మొదటిది జూలై చివరలో, మిగిలినవి సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఉంటాయని ఉద్యోగులకు తెలియజేసినట్లుగా బ్లూమ్బర్గ్ నివేదిక ఆయా కంపెనీలకు దగ్గరగా ఉన్న మూలాలను ఉటంకిస్తూ పేర్కొంది. బ్యాంక్ టేకోవర్కు సంబంధించి రాబోయే నెలల్లో ఒడుదుడుకులు ఉంటాయని, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కఠినమైన నిర్ణయాలు ఉంటాయని యూబీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గియో ఎర్మోట్టి జూన్ నెల ప్రారంభంలో హెచ్చరించారు. ఇదీ చదవండి: Bank Holidays July 2023: నెలలో దాదాపు సగం రోజులు సెలవులే! -
ఉద్యోగులకు షాకిచ్చిన మీషో.. 251 మంది అవుట్
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ మీషో 251 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ మొత్తం సిబ్బందిలో ఇది 15 శాతం. తొలగించిన ఉద్యోగులందరికీ నోటీసు పీరియడ్ దాటి ఒక నెల అదనంగా పరిహారంతో పాటు ఎసాప్స్ (ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్), బీమా ప్రయోజనాలు, జాబ్ ప్లేస్మెంట్పరమైన మద్దతు మొదలైన తోడ్పాటు అందించనున్నట్లు సిబ్బందికి పంపిన ఈమెయిల్లో సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే తెలిపారు. కోవిడ్ పరిణామాలు, భారీగా పెట్టుబడుల ఊతంతో 2020 నుంచి 2022 నాటికి కంపెనీ 10 రెట్లు వృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. అయితే, స్థూల పరిస్థితులు గణనీయంగా మారిపోవడంతో, లాభార్జన లక్ష్యాల సాధన దిశగా ప్రణాళికలను వేగవంతం చేయాల్సి వస్తోందని ఆత్రే వివరించారు. -
19,000 మందికి యాక్సెంచర్ ఉద్వాసన
న్యూఢిల్లీ: యాక్సెంచర్ వచ్చే ఏడాదిన్నరలో 19,000 మందికి ఉద్వాసన పలుకుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల్లో వీరి సంఖ్య 2.5 శాతమని ప్రకటించింది. సంస్థలో ప్రస్తుతం 7 లక్షల మందికి పైగా ఉద్యోగులున్నారు. వీరిలో అత్యధికంగా 3 లక్షల మంది భారత్లో పనిచేస్తున్నారు. -
గ్రేస్ పీరియడ్: హెచ్1బీ వీసాదారులకు భారీ ఊరట!
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో వరుసపెట్టి ఉద్యోగాలు కోల్పోతున్న హెచ్-1బి ఉద్యోగులకు ఊరట. ఉద్యోగం పోయిన రెండు నెలల్లోపే కొత్త కొలువు వెతుక్కోవాలన్న నిబంధనను సడలించి గ్రేస్ పీరియడ్ను ఆర్నెల్లకు పెంచాలని అధ్యక్షుని సలహా సంఘం సిఫార్సు చేసింది. తద్వారా కొత్త ఉపాధి అవకాశం వెతుక్కునేందుకు వారికి తగినంత సమయం దొరుకుతుందని అభిప్రాయపడింది. దీనికి అధ్యక్షుని ఆమోదం లభిస్తే కొన్నాళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది భారత టెకీలకు భారీ ఊరట కలగనుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్తో పాటు పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల మేరకు వారంతా 60 రోజుల్లోగా మరో ఉపాధి చూసుకోలేని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్ను 180 రోజులకు పెంచాల్సిందిగా సిఫార్సు చేసినట్టు ఆసియా అమెరికన్లు తదితరులపై అధ్యక్షుని సలహా సంఘం సభ్యుడు అజన్ జైన్ భుటోరియా వెల్లడించారు. అమెరికాలో 2022 నవంబర్ నుంచి రెండు లక్షలకు పైగా ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ఏకంగా 80 వేల మంది భారతీయులేనని అంచనా! గ్రీన్కార్డు దరఖాస్తుదారులకు ఊరట! మరోవైపు, ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల్లో ఆమోదిత ఐ-140 ఉపాధి ఆధారిత వీసా పిటిషన్లుండి, ఐదేళ్లకు పైగా గ్రీన్కార్డు దరఖాస్తు పెండింగ్లో ఉన్నవారికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు (ఈఏడీ) జారీ చేయాలని అధ్యక్షుని సలహా కమిటీ తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు ఆమోదం లభిస్తే ఇమిగ్రెంట్ వారి వీసా దరఖాస్తులపై తుది నిర్ణయం వెలువడేదాకా అమెరికాలో వృత్తి, ఉద్యోగాలు కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని కమిటీ సభ్యుడు అజన్ జైన్ భుటోరియా తెలిపారు. -
మూగబోయిన ట్విట్టర్ పిట్ట.. కారణం అదేనా?
న్యూయార్క్: ట్విట్టర్ మళ్లీ మొరాయించింది. గంటలపాటు స్తంభించిపోయింది. ట్విట్టర్ సేవలకు అంతరాయం కలగడం కొన్ని నెలలుగా పరిపాటిగా మారడం తెల్సిందే. సంస్థను మస్క్ హస్తగతం చేసుకున్నాక వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దాంతో ఉన్న కాస్త సిబ్బందికి నిర్వహణ తలకు మించిన భారంగా మారినట్లు కనిపిస్తోంది. తాజాగా 200 మంది ఇంజనీర్లను మస్క్ తొలగించారు. వీరిలో ప్రొడక్ట్ మేనేజర్లు, ఇంజనీర్లు, డేటా సైన్స్ విభాగ సిబ్బంది ఉన్నారు. బ్లూ వెరిఫికేషన్ చందా, త్వరలో అమలు చేయబోయే పేమెంట్స్ ప్లాట్ఫామ్లకు సారథిగా ఏస్తర్ క్రాఫోర్డ్నూ సాగనంపారు. తాజా ఉద్యోగుల ఉద్వాసన పర్వంలో సేల్స్ విభాగ చీఫ్ క్రిస్ రేడీని మస్క్ వెళ్లగొట్టడం గమనార్హం. -
గోమెకానిక్ ఖాతాల్లో గోల్మాల్
న్యూఢిల్లీ: వాహనాల రిపేర్ సేవలు అందించే స్టార్టప్ సంస్థ గోమెకానిక్ ఆర్థిక అవకతవకల వివాదంలో చిక్కుకుంది. ఈ వ్యవహారాన్ని స్వయంగా అంగీకరించిన కంపెనీ సహ వ్యవస్థాపకుడు.. సంస్థ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే వ్యాపారాన్ని కూడా పునర్వ్యవస్థీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుమారు 70 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపారు. గోమెకానిక్లో దాదాపు 1,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోగా మిగిలిన సిబ్బందిని జీతాలు లేకుండా మూడు నెలల పాటు పని చేయాలంటూ కంపెనీ కోరినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ గోమెకానిక్ను మరింత వృద్ధిలోకి తేవాలనే యావలో పడి వ్యవస్థాపకులు నియంత్రణ తప్పి వ్యవహరించారని, తప్పిదాలు చేశారని లింక్డ్ఇన్లో రాసిన పోస్టులో భాసిన్ పేర్కొన్నారు. దీనికి తాము తీవ్రంగా చింతిస్తున్నామని ఆయన తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత మాదే. పెట్టుబడులను సమకూర్చుకునేలా పరిష్కార మార్గాలను అన్వేషించుకుంటూ వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించాలని అంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం‘ అని భాసిన్ చెప్పారు. రూ. 120 కోట్ల పైగా రుణభారం ఉండగా, అందులో మూడో వంతు రుణాన్ని సత్వరం తిరిగి చెల్లించాల్సిన నేపథ్యంలో గోమెకానిక్ మనుగడ సాగించాలంటే నిధులను తప్పనిసరిగా సమీకరించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఆదాయాలను అధికంగా చూపడమే కాకుండా వ్యవస్థాపకులు కావాలనే వాస్తవాలను దాచిపెట్టారని ప్రధాన ఇన్వెస్టర్లు ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఈ అవకతవకలపై విచారణ జరిపేందుకు థర్డ్ పార్టీని ఎంపిక చేసినట్లు వివరించారు. కార్ల యజమానులను వారి ప్రాంతంలోని మెకానిక్ షాపులకు అనుసంధానించే స్టార్టప్గా గోమెకానిక్ 2016లో ప్రారంభమైంది. కుశాల్ కర్వా, నితిన్ రాణా, రిషభ్ కర్వా, భాసిన్ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. సెకోయా క్యాపిటల్, టైగర్ గ్లోబల్ వంటి సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. గోమెకానిక్ 2021 జూన్లో 42 మిలియన్ డాలర్లు సమీకరించింది. -
ఉద్యోగులకు దిగ్గజ కంపెనీ భారీ షాక్.. ఇక వేలాది మంది ఇంటికే
ఆర్ధిక మాంద్యం భయాల్లో ఇప్పట్లో పోయేలా లేవు. గతేడాది మే నుంచి మొదలైన రెసిషన్ భయాలు సంస్థల్ని ఇంకా పట్టి పీడుస్తూనే ఉన్నాయి. అందుకే నెలలు గడిచే కొద్ది ఖర్చుల్ని తగ్గించుకునేందుకు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా న్యూయార్క్కు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాకింగ్ దిగ్గజం గోల్డ్మన్ సాచ్స్ గ్రూప్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఈ వారంలో దాదాపు 3,200 ఉద్యోగుల్ని ఫైర్ చేయనుంది. అస్థిరంగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల ఫలితంగా కార్పొరేట్ డీల్స్లో భారీ మందగమనం ఏర్పడింది. ఫలితంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులకు పింక్ స్లిప్లు జారీ చేయనున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. అయితే ఉద్యోగులపై గోల్డ్మన్ సాచ్చ్ యాజమాన్యం స్పందించింది. లేఆఫ్స్ ఉంటాయని ప్రకటిస్తూనే ఎంతమంది అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కాగా సంస్థలోని కోర్ ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్ల నుంచి ఉద్యోగులను తొలగించనున్నట్లు గోల్డ్మన్ సాచ్స్ గ్రూప్ ప్రకటించింది. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచెత్తనున్న లేఆఫ్స్ సునామీ? -
Twitter layoffs: ఉద్వాసన తప్ప దారి లేదు: మస్క్
న్యూయార్క్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. సంస్థను ప్రక్షాళన చేసే పనిలో మస్క్ నిమగ్నమయ్యారు. సంస్థకు రోజూ 4 మిలియన్ డాలర్ల (రూ.32.79 కోట్లు) నష్టం వస్తోందని మస్క్ శనివారం ట్వీట్ చేశారు. అందుకే ఉద్యోగుల సంఖ్య తగ్గించుకోవాలని నిర్ణయించామని తెలిపారు. రాజీనామా చేసేవారికి 3 నెలల ప్యాకేజీ ఇస్తున్నామని, పట్టప్రకారం ఇవ్వాల్సిన దానికంటే ఇది 50 శాతం ఎక్కువ అని చెప్పారు. ట్విట్టర్ను మస్క్ గత నెలలో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సంస్థలో నిత్యం వందలాది మందికి పింక్ స్లిప్పులు అందుతున్నాయి. భారత్లో 200 మందికి పైగా ఉద్యోగులను ట్విట్టర్ తొలగించింది. ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ తదితర విభాగాల్లో లేఆఫ్లు అమలు చేస్తోంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో పలువురు ట్విట్టర్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ట్విట్టర్ యజమాన్యం కార్మిక చట్టాలను ఉల్లంఘింస్తోందని, చర్యలు తీసుకోవాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. -
తప్పనిసరైనందుకే తొలగింపులు..
న్యూఢిల్లీ: ప్రతికూల స్థూలఆర్థిక పరిణామాలను ఎదుర్కొని నిలబడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కొందరు ఉద్యోగులను తీసివేయక తప్పడం లేదని ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సీఈవో బైజు రవీంద్రన్ తమ సిబ్బందికి పంపిన సందేశంలో వివరణ ఇచ్చారు. కార్యకలాపాలను వేగంగా విస్తరించడంతో ఒకే రకం విధులను పలువురు ఉద్యోగులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొందని, అలాంటి డూప్లికేషన్ను తగ్గించుకునేందుకు ఈ ప్రక్రియ చేపట్టాల్సి వచ్చిందన్నారు. నిలకడగా వృద్ధి సాధించడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలోనే గ్రూప్ స్థాయిలో లాభాలు ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నందున కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని పేర్కొన్నారు. ‘సంస్థ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఎంతో భారమైన హృదయంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ సజావుగా జరగడంలో ఏవైనా ఆటంకాలు ఎదురైతే క్షమించండి. కంపెనీని నిలకడైన వృద్ధి బాట పట్టించి మిమ్మల్ని తిరిగి తెచ్చుకోవడమే నా మొదటి ప్రాధాన్యంగా ఉంటుంది‘ అని రవీంద్రన్ పేర్కొన్నారు. తొలగించే ఉద్యోగులకు మెరుగైన పరిహార ప్యాకేజీని ఇవ్వడంతో పాటు ఇతర ఉద్యోగాన్వేషణలోనూ కంపెనీ తోడ్పాటు అందిస్తుందన్నారు. ఆరు నెలల్లో దాదాపు 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామంటూ బైజూస్ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో రవీంద్రన్ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. -
11 మంది ‘ఉగ్ర’ ఉద్యోగుల తొలగింపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. వారికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని, బలగాల కదలికలను గురించి ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చారనే అభియోగాల మీద జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత అధికారులు వారిని తొలగించినట్లు శనివారం ప్రకటించారు. తొలగింపునకు గురైన వారిలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ చీఫ్ సలాహుద్దీన్ కుమారులు సయీద్ అహ్మద్ షకీల్, షాహిద్ యూసుఫ్లు ఉన్నారని పేర్కొన్నారు. తొలగించిన వారిలో పోలీస్, విద్య, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, విద్యుత్, ఆరోగ్య శాఖలకు చెందిన వారు ఉన్నారని వెల్లడించారు. వీరిలో నలుగురు అనంతనాగ్, ముగ్గురు బుద్గమ్కు చెందిన వారు కాగా.. బారాముల్లా, శ్రీనగర్, పుల్వామా, కుప్వారా జిల్లాల నుంచి ఒకరు చొప్పున ఉన్నట్లు తెలిపారు. వీరందరిని భారత రాజ్యాంగంలోని 311వ ఆర్టికల్ ద్వారా తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ ద్వారా ఉద్వాసనకు గురైతే వారు హైకోర్టులో మాత్రమే ఆ నిర్ణయాన్ని సవాలు చేయగలరు. రెండు సమావేశాల్లో.. కశ్మీర్కు చెందిన ఉన్నతాధికారుల కమిటీ ఇటీవల రెండు సార్లు సమావేశమైందని అధికారులు వెల్లడించారు. ఇందులో మొదటి సమావేశంలో ముగ్గురిని, రెండో సమావేశంలో 8 మందిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తొలగింపునకు గురైన వారు పలు రకాలుగా ఉగ్రవాదులకు సాయం అందించారని ఆరోపిం చారు. హవాలా ద్వారా డబ్బును పొందినట్లు వెల్లడించారు. భద్రతా బలగాలు చేపట్టబోయే కార్యకలాపాల వివరాలను చేరవేసి ఉగ్రవాదులకు సాయపడినట్లు అభియోగాలు మోపారు. -
5,000 మందికి టెక్ మహీంద్రా ఉద్వాసన
ముంబై: ఐటీ రంగంలో ఉన్న టెక్ మహీంద్రా.. బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ (బీపీఎస్) విభాగంలో పనిచేస్తున్న 5,000 మందిని 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల్లో నుంచి తీసివేయనుంది. ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ కంపెనీ ఇలా ఉద్యోగులకు ఉద్వాసన పలకనుండడం గమనార్హం. ఆటోమేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ ఆధారంగా పనులను పూర్తి చేస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. డిసెంబరు త్రైమాసికంలో సుమారు 2,500 మందిని తీసివేయగా, వీరిలో అత్యధికులు బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ విభాగానికి చెందినవారు. ‘గతేడాది మార్చినాటికి బీపీఎస్లో 43,000 మంది ఉండేవారు. ఈ ఏడాది మార్చికల్లా ఈ సంఖ్య 38,000లకు చేరనుంది. ఉత్పాదకతతోపాటు ఆదాయమూ పెరగడమే ఇందుకు కారణం’ అని టెక్ మహీంద్రా సీఈవో, ఎండీ సి.పి.గుర్నాని తెలిపారు. ఆదాయాలు పెరుగుతున్నప్పటికీ, సిబ్బందిని తగ్గించే ధోరణి రాబోయే కాలంలో కొనసాగకపోవచ్చని ఆయన అన్నారు. డిసెంబరు త్రైమాసికంలో బీపీఎస్ విభాగం ఆదాయం 11% వృద్ధి చెందింది. -
టిక్టాక్ శాశ్వతంగా బంద్
న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ అయిన టిక్టాక్ను భారత్ శాశ్వతంగా నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్టాక్ను ప్రమోట్ చేస్తున్న చైనా కంపెనీ బైట్డ్యాన్స్.. భారత్లో తన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2,000 పైచిలుకు ఉద్యోగులను తీసివేయనుంది. ఈ ఉద్యోగులకు మూడు నెలల వేతనంతోపాటు కంపెనీలో పనిచేసిన కాలాన్నిబట్టి మరో నెల పారితోషికం ఇవ్వనున్నారు. టిక్టాక్ గ్లోబల్ ఇంటెరిమ్ హెడ్ వనెస్సా పప్పాస్, గ్లోబల్ బిజినెస్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ బ్లేక్ చండ్లీ సంయుక్తంగా భారత్లోని ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్స్లో ఈ విషయాలను వెల్లడించారు. -
డేంజర్లో హలీవుడ్
అంతరిక్ష జీవులు దాడి చేస్తాయి. హాలీవుడ్ కాపాడుతుంది. యుగాంతం వచ్చి భూమి బద్దలవుతుంది. హాలీవుడ్ కాపాడుతుంది. సునామీ వచ్చి కెరటాలు ఆకాశానికి ఎగుస్తాయి. హాలీవుడ్ కాపాడుతుంది. ప్రపంచానికి ముప్పు వచ్చిన ప్రతిసారీ హాలీవుడ్ హీరో ఒకడు నిలబడతాడు. ఇప్పుడు కరోనా వచ్చింది. కాని– హాలీవుడ్ తనను రక్షించేది ఎవరా అని పిపిఇ ధరించి ఎదురు చూస్తూ ఉంది. ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో నంబర్ వన్ హాలీవుడ్. ఏడాదికి దాదాపు 9 లక్షల కోట్లు దాని టర్నోవర్. 120 సంవత్సరాల ఘన చరిత్ర, ఇంత వ్యాపారం ఉన్న హాలీవుడ్ కరోనా వల్ల ఏం కాబోతున్నది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే అది కరోనా వల్ల 9 బిలియన్ల డాలర్లను నష్టపోయిందని ఒక అంచనా. నిజానికి చిన్న అవాంతరాలకే కుప్పకూలే వ్యవస్థ ఇది. 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు 57 వేల మంది హాలీవుడ్ కార్మికులు ఉపాధి కోల్పోయారు. అదే సమయంలో తమ పారితోషికం పెంచమని 12 వేల మంది హాలీవుడ్, టెలివిజన్ రంగ రచయితలు సమ్మె చేశారు. వీటన్నింటి వల్ల 380 మిలియన్ డాలర్లు నష్టపోయింది హాలీవుడ్. ఆ సమయానికి ఇప్పటిలా డిజిటల్ స్ట్రీమింగ్ లేదు. జనం థియేటర్లలోనే సినిమాలు చూడాల్సిన పరిస్థితి. కాని జనం దగ్గర డబ్బు లేదు. ఆ సమయంలోనే హైవైగల్ అనే ఒక సినీ విశ్లేషకుడు ‘కరువు కాలంలో ఆల్కహాల్ అయినా కొంటారు కాని సినిమా టికెట్ కొనరు’ అని వ్యాఖ్యానించారు. అది అక్షరాలా నిజమైంది. దాదాపు రెండేళ్లపాటు పోరాడి ఆ గడ్డుకాలాన్ని దాటేసింది హాలీవుడ్. కరోనా సమయం హాలీవుడ్ని ‘డ్రీమ్ ఫ్యాక్టరీ’ అని కూడా అంటారు. కరోనా దెబ్బకు ఆ కలల వ్యాపారం కుప్పకూలి పోయింది. హాలీవుడ్లో పని చేసే వారందరూ ధనవంతులు కారు. హాలీవుడ్ మీద ఆధారపడి దాదాపు 9 లక్షల మంది పని చేస్తున్నారు. వీరిలో సుమారు రెండు లక్షల మంది మాత్రమే బాగా గడిచే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు. మిగిలినవాళ్లంతా రెక్కాడితేగాని డొక్కాడని వారే. వీళ్లలో చాలామంది కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోయారు. డిస్నీలాండ్ తన పార్క్లో పని చేసే లక్ష మంది ఉద్యోగాలని తొలగించింది. అలాగే థియేటర్లలో పని చేసే వాళ్లల్లో లక్షా యాభై వేల మందిని తీసేశారు. వాళ్లని పనిలో నుంచి తీసేస్తున్న యజమానులు ఇందుకు వేదన అనుభవిస్తున్నారు. జూన్, జూలై నుంచి సినిమా కార్యకలాపాలు ప్రారంభమైనా ఇంతమందికి ఉపాధి కల్పించడం కష్టం కావచ్చు. ‘ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉన్నాం’ అని సినిమాటోగ్రాఫర్లు అంటున్నారు. ‘కేవలం డోమినోలో మాత్రం ఉద్యోగాలున్నాయి. అక్కడ పని వెతుక్కుంటున్నాం’ అని ప్రొడక్షన్ కో ఆర్డినేటర్లు అంటున్నారు. ‘కింగ్డమ్’ సీరియల్లో పాపులర్ అయిన నటుడు మాక్ బ్రిండెట్ తన రెగ్యులర్ ఈఎంఐలు కట్టలేక నిరుద్యోగ భృతికి అప్లై చేశాడు. రానున్న పోటీ రాబోయే రోజుల్లో ఎలా పని చేయాలి అనే విషయం మీద హాలీవుడ్ కసరత్తు చేస్తోంది. ఎలా చేసినా గతంలాంటి స్థితి తిరిగి రాదని అందరికీ తెలుసు. స్టూడియోలు, యూనియన్ల మధ్య చర్చలు ఏ నిర్ణయాలకు వస్తాయో తెలియదు. కాని తక్కువ మందితోనే షూటింగ్ చేయాలి. అవకాశాలు కొద్దిమందికే ఉంటాయి. వాటి కోసం అందరూ దారుణమైన పోటీ పడతారు. వేతనాలు తగ్గిస్తారనే వార్త కార్మికులను కలవర పరుస్తోంది. ప్రపంచాన్ని కాపాడే హీరో హాలీవుడ్లో ఉండొచ్చు. కాని ఆ హీరోను కూడా కాపాడే సూపర్ హీరో ప్రేక్షకుడే. ఆ ప్రేక్షకుడు థియేటర్లకు వచ్చి కూచునే వరకు హాలీవుడ్డే కాదు ఏ సినిమా రంగమైనా డేంజర్లో ఉన్నట్టే. రక్షించేవాడు క్రిస్టఫర్ నోలన్? ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ హాలీవుడ్ను కాపాడనున్నాడా? కాపాడాలనే సమస్త హాలీవుడ్ భావిస్తోంది. క్రిస్టఫర్ తీసిన తాజా భారీ సినిమా ‘టెనెట్’ జూలై 17న విడుదల కానుంది. లాక్డౌన్ తర్వాత కరోనాతో ‘సహజీవనం’ దాదాపు స్థిరపడ్డాక హాలీవుడ్ ప్రపంచం మీదకు ప్రేక్షకుల స్పందన కోసం వదలనున్న సినిమా ఇదే. ఈ సినిమా ప్రేక్షకులను రప్పించగలిగితే మిగిలిన సినిమాలన్నీ గాడిలో పడతాయని భావిస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఓ సీక్రెట్ ఏజెంట్ ఎలా అడ్డుకున్నాడనేదే ‘టెనెట్’ కథ. మన డింపుల్ కపాడియా ఇందులో ముఖ్యపాత్ర పోషించింది. దీని తర్వాత బాండ్ ఫిల్మ్ ‘నో టైమ్ టు డై’ విడుదలవుతుంది.ఎలాగైనా అనుకున్న డేట్కే సినిమా విడుదల చేయాలని నోలన్ పట్టు పట్టి ఉన్నాడట. ఇదిలా ఉండగా ఏప్రిల్ 10న థియేటర్లతోపాటు కరోనా వల్ల డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కూడా విడుదలైన ‘ట్రోల్స్ వరల్డ్ టూర్’ వివాదం రేపింది. థియేటర్ల కంటే డిజిటల్గా ఇది బాగా కలెక్ట్ చేయడంతో అమెరికాలోని థియేటర్స్ వ్యవస్థ భగ్గుమంది. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన యూనివర్సల్ స్టూడియో వారి ఏ సినిమాలనూ విడుదల చేయబోమని అల్టిమేటం జారి చేసింది. దాంతో ఆ స్టూడియో నుంచి రాబోతున్న ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’, ‘జూరాసిక్ వరల్డ్: డొమినియన్’ తదితర సినిమాల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యింది. స్పానిష్ ఫ్లూ– హాలీవుడ్ సరిగ్గా వందేళ్ల క్రితం 1919 నవంబర్లో స్పానిష్ ఫ్లూ ప్రారంభమైంది. 1921 ఫిబ్రవరి వరకూ ఉధృతంగా తన ప్రభావం చూపి వెళ్లిపోయింది. అప్పటికి హాలీవుడ్ పసిపాప. న్యూజెర్సీ నుంచి 1912లో వలస వచ్చి ప్రస్తుతం హాలీవుడ్ ఉన్న చోట స్థిరపడుతూ ఉంది. అప్పటికి అమెరికా వ్యాప్తంగా 20 వేల థియేటర్లలో మూకీ సినిమాలు ఆడుతున్నాయి. అటువంటి సమయంలో స్పానిష్ ఫ్లూ దెబ్బతో హాలీవుడ్లో భయానక వాతావరణం నెలకొంది. ఎవర్ని కదిపినా అప్పుడే ఫ్లూ వ్యాధి బారిన పడ్డ వ్యక్తో లేదా ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న వ్యక్తో. మొదట్లో స్పానిష్ ఫ్లూని తేలిగ్గా తీసుకున్నాయి చాలా స్టూడియోలు, థియేటర్లు. అప్పుడే షూటింగ్ లో పాల్గొన్న ప్రముఖ తారలు బ్రియాంట్ వాష్బర్న్, అన్నా క్యూ నీల్సన్లకు ఫ్లూ వచ్చింది. దాంతో హాలీవుడ్ కలవరపడిపోయింది. షూటింగ్స్ ఆపేశారు. స్పానిష్ ఫ్లూ సమయంలో తీసిన మూకీ సినిమా ‘డాడీ లాంగ్ లెగ్స్’లో జనం ముఖాలకు మాస్క్లు హాలీవుడ్ స్టార్స్ తమ నెల జీతాలు తగ్గించుకుని ఆ మొత్తంతో స్టూడియోల్లోకి ఇతర సిబ్బందికి డబ్బులిచ్చారు. మాట్నీ ఐడియల్గా పేరొందిన హెరాల్డ్ లాక్వుడ్ స్పానిష్ ఫ్లూతో చనిపోయాడు. అయితే స్టూడియోలు నెలల తరబడి మూసి ఉంచడానికి మొరాయించాయి. స్టూడియోల్లో వర్క్ చేసుకుంటామని, అందుకు అనుమతి ఇవ్వమని విన్నపాలు ప్రారంభించాయి. దాంతో షూటింగ్స్కు పర్మిషన్ వచ్చింది. పోలీసులు చాలా నిబంధనలు పెట్టారు. సినిమాల్లో గుంపులు ఉండే సీన్స్ ఉండకూడదు. కేవలం ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టుల మీదే సీన్స్ తీయాలి. అయితే దీనివల్ల మరికొందరు స్పానిష్ ఫ్లూ బారిన పడ్డారు. అప్పట్లో స్టూడియోలకి వచ్చేవాళ్ల మీద క్రిమి సంహారక మందులు జల్లేవాళ్లు. రెడ్క్రాస్కి చెందిన నర్స్ షూటింగ్కి వచ్చినవాళ్ల మీద పౌడర్ చల్లుతుండేది. 1921 ఫిబ్రవరి వరకూ ఈ అవస్థ తప్పలేదు. ప్రేక్షకుల మీద ప్రయోగాలు అమెరికాలో దాదాపు ఆరు వేల థియేటర్లు ఉన్నాయి. ఆ థియేటర్లలో 40 వేల స్క్రీన్స్ ఉన్నాయి. వాటిలో అధిక శాతం రీగల్, ఎ.ఎమ్.సి, సినీమార్క్ అనే మూడు ప్రధాన సంస్థలవి. అమెరికాలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్ప మిగిలిన నిర్ణయాధికారాలు స్టేట్ గవర్నర్స్కే ఉంటాయి. థియేటర్లు ఓపెన్ చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాలకే వదిలేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మొదటగా టెక్సాస్లో మే 8న కొన్ని థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే థియేటర్లలో సీటింగ్ కెపాసిటీ 25 శాతానికి తగ్గించేశారు. టికెట్ రేట్లలో బాగా డిస్కౌంట్ ఇచ్చారు. హాలీవుడ్ని ‘డ్రీమ్ ఫ్యాక్టరీ’డిస్నీలాండ్ టెనెట్’ ఎయిర్ పోర్ట్లో ఎలా సెక్యూరిటీ చెక్ ఉంటుందో అంతకు మించి తనిఖీలు చేసి పంపిస్తున్నారు. అయితే పాత సినిమాలే ప్రదర్శిస్తున్నారు. ఒక్లహామా రాష్ట్రంలో థియేటర్లకి గ్లాస్ స్క్రీన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. జార్జియా రాష్ట్ర గవర్నర్ థియేటర్లను ఓపెన్ చేయమని ఆదేశాలిచ్చినా అక్కడ కొందరు థియేటర్ల యజమానులు అంగీకరించడం లేదు. అట్లాంటాలోని ప్లాజా థియేటర్ ఓనర్ కరోనా ఇంకా ఉండగా ఇలాంటి ప్రాణాంతకమైన పనులు చేయలేను అని తేల్చి చెప్పాడు. ‘ఈ పరిస్థితుల్లో ఆదాయం లేకపోగా శానిటైజేషన్ కోసం కొత్త పెట్టుబడి పెట్టాలి. పైగా సీటింగ్ కెపాసిటీ తగ్గించాలి. ఖర్చెక్కువ, రాబడి తక్కువ ఉండే ఇలాంటి పరిస్థితిలో థియేటర్లని మరికొంత కాలం మూసి ఉంచడం బెటర్’ అని మరో థియేటర్ ఓనర్ చెప్పాడు. కొందరు థియేటర్ల ఓనర్ల డిమాండ్ ఏమిటంటే కరోనా ఉండటం వల్ల ప్రేక్షకుల ఇళ్లకు నేరుగా క్యూబ్ సిస్టమ్ ద్వారా సినిమాలను విడుదల చేయాలి అయితే వచ్చిన దానిలో థియేటర్లకు కొంత వాటా ఇవ్వాలి అనేది. ఏమైనా జూలై నుంచి థియేటర్లు సంపూర్ణంగా తెరుచుకుంటాయని అక్కడి ప్రదర్శనారంగ దిగ్గజాలు భావిస్తున్నాయి. – తోట ప్రసాద్ (సినీ రచయిత) -
30.5 కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం
జెనీవా: కరోనా కారణంగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 30.5 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) అంచనా వేసింది. లాక్డౌన్ పెరగడం కారణంగా ఈ సంఖ్య పెరిగిందని తెలిపారు. లాక్డౌన్ కారణంగా 19.5 కోట్ల ఉద్యోగాలుపోయే ప్రమాదం ఉందని ఐఎల్ఓ అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
మావాళ్లకు కాస్త ఉద్యోగాలు ఇవ్వండి
మెల్బోర్న్: కరోనా నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతోన్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) ఇటీవలే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. అయితే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో వారికి బయట మరోచోట ఉద్యోగం ఇప్పించే ప్రయత్నంలో సహకరించేందుకు సిద్ధమైంది. జూన్ 30 వరకు తమవారికి తాత్కాలిక ఉద్యోగాల్లో చేర్చుకోవాలని అతి పెద్ద సూపర్ మార్కెట్ గ్రూప్లలో ఒకటి, తమ క్రికెట్ టీమ్ స్పాన్సర్ అయిన ‘వూల్వర్త్’ను కోరింది. ‘బోర్డులో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాత్కాలికంగా బయట ఏదో ఒక ఏర్పాట్లు చేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగానే వూల్వర్త్ సీఈఓ బ్రాడ్ బాండుసీకి నేను స్వయంగా లేఖ రాశాను. వారి సూపర్ మార్కెట్లలో ప్రస్తుతం సిబ్బంది అవసరం ఉందన్నట్లు మాకు తెలిసింది. అందుకే మా వాళ్లను తీసుకోమన్నాం’ అని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబర్ట్సన్ వెల్లడించారు. -
కొత్త గ్రీన్ కార్డులకు బ్రేక్
వాషింగ్టన్: కోవిడ్ నేపథ్యంలో అమెరికన్ల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ వలసలపై తాత్కాలిక నిషేధం విధిస్తామని ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అది రెండు నెలలపాటు ఉంటుందని స్పష్టం చేశారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించే గ్రీన్ కార్డుల జారీని ఈ రెండు నెలలు నిలిపివేస్తామని వెల్లడించారు. వలసదారులపై 60 రోజుల నిషేధం విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై బుధవారం సంతకం చేస్తానని ట్రంప్ చెప్పారు. ‘కరోనా మహమ్మారితో 2 కోట్ల మందికి పైగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. విదేశీయుల్ని వారి స్థానంలో ఉద్యోగాల్లో తీసుకుంటే మన పౌరులకు అన్యాయం జరుగుతుంది. అలా జరగనివ్వం’అని ట్రంప్ అన్నారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉండాలని వచ్చే వారి వలసలకే అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే వారెవరినీ రెండు నెలలు ఇక్కడ అడుగు పెట్టనిచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడిలో పడ్డాక ఈ ఉత్తర్వుల్ని సమీక్షిస్తామన్నారు. ‘అమెరికా పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడం మన బాధ్యత. ఈ రెండు నెలల తర్వాత ఆర్థిక పరిస్థితుల్ని నిపుణుల కమిటీ అంచనా వేసిన తర్వాత దానిని పొడిగించాలా, మార్పులు చేయాలా ఆలోచిస్తాం’’అని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ప్రతీ ఏడాది అక్కడ ఉద్యోగాలు చేస్తూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకునేవారికి లక్షా 40 వేల గ్రీన్ కార్డులను ఒక్కో దేశానికి 7శాతం వాటా చొప్పున మంజూరు చేస్తూ ఉంటుంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీసు (సీఆర్ఎస్) అంచనాల ప్రకారం విదేశీ వర్కర్లు, వారి కుటుంబసభ్యులు 10 లక్షల మంది గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. భారతీయు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 5,68,414 మంది వరకు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారని సీఆర్ఎస్ అంచనా. ట్రంప్ నిర్ణయంతో ఇక గ్రీన్ కార్డు వస్తుందా రాదా అన్న అయోమయంలో అక్కడి భారతీయులు ఉన్నారు. న్యాయస్థానంలో చెల్లుతుందా ? అమెరికాకి పూర్తిగా వలసలు నిషేధించే అధికారం అధ్యక్షుడికి ఉండదని కొందరు న్యాయనిపుణులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని న్యాయ స్థానంలో సవాల్ చేయవచ్చునని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ డిప్యూటీ పాలసీ డైరెక్టర్ ఆండ్రూ ఫ్లోర్స్ చెప్పారు. నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కరోనా కట్టడిలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ట్రంప్ వలసల అంశాన్ని ఎత్తుకున్నారని డెమోక్రాట్లు డొనాల్డ్ ట్రంప్పై విమర్శలు గుప్పిస్తున్నారు. హెచ్1బీపై ఉత్తర్వులు? అమెరికా నిర్ణయంతో ప్రభావితమయ్యే వారు, భారత్ టెక్కీలు అత్యధికంగా కలిగి ఉన్న హెచ్1బీ వీసాలపై అధ్యక్షుడు విడిగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందని వైట్హౌస్ పాలనాయంత్రాంగం అధికారి చెప్పారు. ఈ వలసల నిషేధంలో కొన్ని మినహాయింపులు ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఆ మినహాయింపులేమిటో ఆయన వివరించలేదు. ‘‘అమెరికాకి పూర్తిగా వలసల్ని నిషేధించం. కొందరికి మినహాయింపులుంటాయ్. మానవత్వ అంశాలను కూడా ప్రాతిపదికగా తీసుకుంటాం’’అని ట్రంప్ చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ఆహారం పంపిణీ చేసేవారికి మిహాయింపులిచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. -
రియల్టీకి లక్ష కోట్ల నష్టం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటివరకు దేశీయ రియల్టీ రంగానికి కరోనా వైరస్ కలిగించిన నష్టం అక్షరాలా లక్ష కోట్లు. రోజు రోజుకూ ఈ లాస్ మరింత పెరుగుతుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయపడ్డారు. దేశీయ రియల్టీ ఎదుర్కొంటున్న కరోనా ప్రభావాన్ని అధిగమించడానికి, నష్టాలను తగ్గించడానికి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలని క్రెడాయ్, నరెడ్కో సంఘాలు కేంద్రాన్ని కోరాయి. వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉద్యోగ అవకాశాల రంగం రియల్ ఎస్టేట్. లాక్డౌన్ నేపథ్యంలో నగదు కొరత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ రంగంలోనూ ఉద్యోగుల తొలగింపు, వేతనాల తగ్గింపు వంటివి తప్పవని క్రెడాయ్ నేషనల్ చైర్మన్ జక్షయ్ షా తెలిపారు. లాక్డౌన్ కొనసాగే కాలాన్ని బట్టి తొలగింపు నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. 25 శాతం తొలగింపులు.. అమ్మకాల క్షీణతతో కంపెనీలు చేసే మొదటి నిర్ణయం వేతనాల తగ్గింపే. లిక్విడిటీ కొరత కారణంగా డెవలపర్లు రుణాల చెల్లింపులు చేయడంలో డిఫాల్ట్ అవుతారు. ఫలితంగా కంపెనీలు దివాళ తీస్తాయి. దీంతో ఉద్యోగుల తొలగింపులు తప్పవని నరెడ్కో అధ్యక్షుడు నిరంజన్ హిర్నందానీ తెలిపారు. ప్రభుత్వం రియల్టీ రంగానికి ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే.. కంపెనీలు దివాలా తీయడం, ఉద్యోగాలు కోల్పోవటం వంటివి జరగవని తెలిపారు. లాక్డౌన్ కంటే ముందు శ్రామిక శక్తిలో ఉద్యోగుల తొలగింపు 15 శాతంగా ఉంటే.. ప్రస్తుతమిది 25 శాతానికి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. -
లాక్ డౌన్ : లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఫిబ్రవరి మొదట్లో ఆరంభమైన కరోనా మహమ్మారి (కోవిడ్-19) సంక్షోభంతో దేశీయంగా అనేక వ్యాపార సంస్థలు గణనీయంగా కీణించాయి. ముఖ్యంగా షాపింగ్ మాల్స్, రిటైల్ దుకాణాల ఆదాయం భారీగా క్షీణించింది. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితులు రానున్ననెలల్లో కూడా కొనసాగితే 30 శాతం మోడ్రన్ దుకాణాలు మూతపడతాయని, లక్షలమంది ఉపాధి కోల్పోతారని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అసోసియేషన్ అందించిన తాజా నివేదిక ప్రకారం ఫిబ్రవరి చివరి నాటికి, వ్యాపారం 20-25 శాతం పడిపోయింది. లాక్ డౌన్ తో ఈ నష్టాలు మరింత విస్తరించాయి. భారతదేశంలో 15 లక్షలకు పైగా ఉన్న ఆధునిక రిటైల్ దుకాణాల ద్వారా రూ .4.74 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. దాదాపు 60 లక్షల మంది ఉద్యోగులున్నారు. అయితే గత ఒకటిన్నర నెలల్లో వ్యాపారం 15 శాతానికి తగ్గింది. లాక్ డౌన్ సమయంలో తెరిచి ఉంచడానికి అనుమతించబడిన అవసరమైన వస్తువులను విక్రయించే దుకాణాలకు నష్టాలు తప్పడం లేదని తెలిపింది. ఇతర సాధారణ సరుకులను విక్రయించడానికి అనుమతి లేకపోవడంతో ఆయా సంస్థలను నష్టాలను చవిచూస్తున్నాయని తెలిపింది. మొత్తంమీద, దుస్తులు, ఆభరణాలు, బూట్లు (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, డ్యూరబుల్స్, ఐటి, టెలిఫోన్లు) రిటైల్పై గణనీయమైన ప్రభావం చూపిందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో కుమార్ రాజగోపాలన్ చెప్పారు. జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగితే, 30 శాతం రిటైల్ దుకాణాలను మూసివేసే పరిస్థితి వస్తుందని, దీనివల్ల 18 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని రాజగోపాలన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సింగపూర్, కెనడా, అమెరికా ప్రభుత్వాల మాదిరిగానే రిటైల్ పరిశ్రమకు ఉపశమన ప్యాకేజీ ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై భారత ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పారు. అలాగే తమ కంపెనీల్లో చాలా మంది చిల్లర వ్యాపారులు తమ ఉద్యోగులకు 35-40 రోజుల చెల్లింపు సెలవు ఇస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. తమ ఉద్యోగులు, వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పామని, లాక్ డౌన్ సమయంలో వారికి వేతనం లభించేలా చూస్తామని వి-మార్ట్ రిటైల్ సీఎండీ లలిత్ అగర్వాల్ చెప్పారు. ఉద్యోగులకు జీతాల భరోసా ఇవ్వడంతో పాటు, సంస్థ తన అమ్మకందారులకు మద్దతుగా రూ .1.5 కోట్ల నిధిని ఏర్పాటు చేసిందని హౌస్ ఆఫ్ అనితా డోంగ్రే ఎండీ కవి మిశ్రా చెప్పారు. -
ఒక్క ఉద్యోగం కూడా పోదు..
న్యూఢిల్లీ: బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయన్న ఉద్యోగ సంఘాల వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. విలీనాలతో ఏ ఒక్క ఉద్యోగం కూడా పోదని స్పష్టం చేశారు. ‘ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమే. గత శుక్రవారం ఏం చెప్పానో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ ఒక్క ఉద్యోగి తొలగింపు ఉండబోదని నేనప్పుడే స్పష్టం చేశాను‘ అని కస్టమ్స్, జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ఏ బ్యాంకు కూడా మూతబడదని, వినూత్నంగా కొత్త ప్రయోగాలేవో చేయాలంటూ బ్యాంకులనేమీ ఒత్తిడి చేయడం లేదన్నారు. ‘బ్యాంకులకు మరింత మూలధనం ఇస్తున్నాం. ఇప్పటిదాకా చేస్తున్న కార్యకలాపాలే ఇకపైనా చేయాల్సి ఉంటుంది. అంతే‘ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పది బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విలీనాలతో ఉద్యోగాలు పోతాయని, అలహాబాద్ బ్యాంకుతో విలీనం కారణంగా ఇండియన్ బ్యాంకు మూతబడుతుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మలా సీతారామన్ వీటిపై స్పందించారు. బ్యాంకులు మరింతగా రుణాలివ్వాలని, మరింతగా వ్యాపారాన్ని విస్తరించాలనే వాటికి అదనపు మూలధనాన్ని సమకూరుస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అన్ని రంగాలూ పరిశీలిస్తున్నాం.. ఎకానమీ మందగమనంలోకి జారుకుంటోందా అన్న ప్రశ్నలపై స్పందిస్తూ.. ప్రభుత్వం ఒక్కో రంగం అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఏ రంగమైనా ప్రభుత్వం వద్దకు వస్తే.. సావధానంగా వింటాం. అవి కోరుకునే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుంటాం. తగు రీతిలో స్పందిస్తాం‘ అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సార్లు ఇలా చేశామని, అవసరాన్ని బట్టి ఇది పునరావృతమవుతుందని మంత్రి చెప్పారు. సంక్షోభంలో కుదేలవుతున్న ఆటోమొబైల్ రంగాన్ని ఉదహరిస్తూ.. ఈ రంగం ప్రస్తుతం బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణమైన ఇంజిన్లు, ఆటోపరికరాల తయారీకి సంబంధించి పరిణామక్రమంలో ఉందని తెలిపారు. ఈ ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 2020 మార్చి 31 తర్వాత బీఎస్–4 ప్రమాణాల వాహనాలేవీ ఉత్పత్తి చేయొద్దంటూ నిర్దేశించినది..సుప్రీం కోర్టని, ప్రభుత్వం కాదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక జీఎస్టీ తగ్గించాలన్న ఆటోమొబైల్ కంపెనీల విజ్ఞప్తిపై జీఎస్టీ మండలే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అన్ని రంగాల సమస్యలనూ ఒక్క దెబ్బతో పరిష్కరించేసే మంత్రదండమేదీ లేదని, రంగాలవారీగా ఆయా సంస్థల విజ్ఞప్తులను బట్టే ప్రభుత్వం స్పందిస్తోందని వివరించారు. ‘ఆటోమొబైల్ రంగం సమస్యలు వేరు.. వ్యవసాయ రంగం సమస్యలు వేరు. ఇలా ఒక్కో రంగం సమస్యలు ఒక్కో రకంగా ఉంటాయి. దానికి తగ్గట్లే స్పందన ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఊతం .. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా విలీనం చేయడమనేది.. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. ‘తదుపరి దశ వృద్ధి సాధన కోసం దేశానికి పెద్ద బ్యాంకులు కావాలి. శుక్రవారం చేసిన మెగా బ్యాంకుల ప్రకటన ఆ లక్ష్య సాధన కోసమే. భారీ స్థాయిలో మూలధనం, వ్యాపార పరిమాణం, అధిక వృద్ధి సాధనకు తోడ్పడే భారీ బ్యాంకులు ఇప్పుడు మనకు ఆరు ఉన్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం ఈ బ్యాంకుల విస్తృతి మరింత పెరుగుతుందని, రుణ వితరణ సామర్ధ్యం మెరుగుపడుతుందని, వినూత్న సాధనాలు ..టెక్నాలజీతో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించగలవని రాజీవ్ కుమార్ తెలిపారు. పెద్ద బ్యాంకుల అవసరాలకన్నా 0.25 శాతం అధికంగానే ప్రభుత్వం మూలధనం సమకూర్చిందని పేర్కొన్నారు. ‘ఆయా బ్యాంకుల బోర్డుల సన్నద్ధతపైనే విలీన తేదీ ఆధారపడి ఉంటుంది. అది జనవరి 1న కావచ్చు.. లేదా ఏప్రిల్ 1న కావొచ్చు. ఏదైనా గానీ ఏప్రిల్ 1 లోగానే ఇది జరుగుతుంది‘ అని రాజీవ్ తెలిపారు. -
హెచ్4 వీసాలపై పిడుగు!
వాషింగ్టన్: హెచ్–4 వీసాదారులకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అనుమతులను రద్దుచేయాలన్న డీహెచ్ఎస్ (డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ) ప్రతిపాదనను అమలుచేసే దిశగా మరో అడుగు ముందుకు పడింది. హెచ్–1బీ వీసా కలిగిన వ్యక్తుల జీవిత భాగస్వాములకు, వారి 21 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఇచ్చేదే ఈ హెచ్–4 వీసా. హెచ్–4 వీసా కలిగిన వారు కూడా ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులిస్తూ 2015లో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ అనుమతులను రద్దు చేయాలని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా, డీహెచ్ఎస్ ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించాల్సిందిగా మే 22న అమెరికా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దయితే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లక్ష మందికి పైగా భారతీయులు, తమ కొలువులను కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ లక్ష మంది భారతీయుల్లో స్త్రీలే అత్యధికంగా ఉన్నారు. కనీసం సంవత్సరం తర్వాతే.. ఒక వేళ హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దయినా, అది అమలు కావడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుందని అమెరికాలో వలస చట్టాల న్యాయనిపుణుడు రాజీవ్ ఖన్నా చెప్పారు. ‘హెచ్–4 వీసాదారులకు ఉద్యోగాలు చేసుకునే అనుమతిని రద్దుచేసే ప్రక్రియ ప్రస్తుతం చివరి నుంచి రెండో దశలో ఉంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రతిపాదనకు మద్దతు లభిస్తే, ఫెడరల్ రిజిస్టర్లో దీనిని పోస్ట్ చేస్తారు. 30 లేదా 60 రోజుల్లోపు మళ్లీ ప్రజలు తమ అభిప్రాయాలు తెలపవచ్చు. అనంతరం నిబంధనకు తుదిరూపు వస్తుంది’ అని ఆయన వివరించారు. వలస విధానాల్లో పూర్తి సంస్కరణలు తీసుకొచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం తొలి నుంచీ మొగ్గుచూపుతుండటం తెలిసిందే. అందులో భాగంగానే, గతేడాది ఫిబ్రవరిలో తొలిసారిగా హెచ్–4 వీసాలకు ఉద్యోగానుమతులు రద్దు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం చేసింది. అనంతరం గతేడాది అక్టోబర్లో డీహెచ్ఎస్ ఈ ప్రతిపాదనకు అనుకూలంగా మాట్లాడింది. అయితే హెచ్–4 వీసాకు ఉద్యోగానుమతులు రద్దు చేస్తే అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రతిభావంతులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. -
ఆ టెక్ కంపెనీలో 5 వేల ఉద్యోగాలు ఔట్
అమెరికన్ మల్టినేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ హెచ్పీ తన ఉద్యోగులపై వేటు వేస్తోంది. 2019 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ నుంచి 4500 నుంచి 5000 మంది ఉద్యోగులు వీడాల్సి ఉంటుందని కంపెనీ హెచ్చరించింది. ప్రస్తుతం నడుస్తున్న పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులను తీసేస్తున్నట్టు ఈ పీసీ తయారీదారి మంగళవారం తెలిపింది. 2016 అక్టోబర్లోనే హెచ్పీ బోర్డు తన పునర్నిర్మాణ ప్లాన్కు ఆమోదం తెలిపింది. ఈ ప్లాన్లో భాగంగా సుమారు 4000 మందిని తీసేస్తామని అంచనావేసింది. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య మరో 1 శాతం నుంచి 2 శాతం పెరిగే అవకాశముందని కంపెనీ పేర్కొంది. అక్టోబర్ 31 నాటికి కంపెనీలో 49వేల మంది ఉద్యోగులున్నారు. హెచ్పీ రెగ్యులేటరీకి సమర్పించిన ఫైలింగ్లో లేఆఫ్స్కు సంబంధించి ప్రీట్యాక్స్ ఛార్జీలు సుమారు రూ.4700 కోట్లు(700మిలియన్ డాలర్లు) గా ఉంటాయని కంపెనీ తెలిపింది. అంతకముందు ఇవి 500 మిలియన్ డాలర్లుగా కంపెనీ అంచనావేసింది. హెచ్పీ అంచనావేస్తున్న ప్రీట్యాక్స్ ఖర్చుల్లో సగం సెవరెన్స్కు సంబంధించినవి కాగ, మిగతావి ఇన్ఫ్రాక్ట్రక్చర్, నాన్-లేబర్ యాక్షన్స్, ఇతర ఛార్జీలున్నాయి. ఎప్పుడైతే హ్యూలెట్ ప్యాకర్డ్ రెండు చీలిందో ఇక అప్పటి నుంచి హెచ్పీ ఇంక్ పీసీలు, ప్రింటర్ల అమ్మకం వంటి హార్డ్వేర్ బిజినెస్లపై దృష్టిసారిస్తోంది. హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ కో కంపెనీకి చెందిన డెడ్-సెంటర్, సాఫ్ట్వేర్, సర్వీసు యూనిట్లను నిర్వహిస్తోంది. 2018లో 22.6 శాతం మార్కెట్ షేరుతో హెచ్పీ ప్రపంచవ్యాప్తంగా పీసీ సరుకు రవాణాల్లో టాప్ స్థానంలో ఉంది. క్వార్టర్ ముగింపు నాటికి అంచనావేసిన దానికంటే మెరుగైన విక్రయాలనే ఈ కంపెనీ నమోదు చేసింది. -
జేఎల్ఆర్లోఉద్యోగాల కోత
లండన్ : టాటా మోటార్స్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఉద్యోగులపై వేటు వేస్తోంది. 1000 మంది ఉద్యోగులను తీసేస్తూ... తన రెండు యూనిట్లలో ఉత్పత్తిని తగ్గించనున్నట్టు జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ప్రకటించింది. ఓ వైపు బ్రెగ్జిట్, మరోవైపు డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గిపోవడం, రెగ్యులేటరీ సమస్యలు వంటి కారణాలతో ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు జేఎల్ఆర్ తెలిపింది. జాగ్వార్ విక్రయాలు ఈ ఏడాది 26 శాతం తగ్గగా.. ల్యాండ్ రోవర్ అమ్మకాలు 20 శాతం క్షీణించాయి. దీంతో కాంట్రాక్ట్ ప్రాతిపదికన తన రెండు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న వెయ్యి మంది తాత్కాలిక ఉద్యోగులను తీసేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. యూకేలో జేఎల్ఆర్ కంపెనీలో 40వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారు ఏడాదికి 5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తున్నారు. సోలిహుల్ వద్ద 1000 ఏజెన్సీ స్టాఫ్ తమ కాంట్రాక్ట్లను రెన్యూవల్ చేయించుకోలేదని కంపెనీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. అదేవిధంగా మరో వెస్ట్ మిడ్ల్యాండ్స్ సైట్లో 362 మంది శాశ్వత ఉద్యోగులను సోలిహుల్కు తరలించినట్టు పేర్కొన్నారు. డీజిల్ ఉద్గారాల స్కాండల్ వల్ల యూరోప్లో జేఎల్ఆర్ వాహనాలకు డిమాండ్ తగ్గి, విక్రయాలు పడిపోయాయి. డీజిల్ వాహనాలకు డిమాండ్ భారీగా తగ్గిందని జేఎల్ఆర్ చెబుతోంది. ఈ ఏడాది మొదట్లో కూడా జేఎల్ఆర్ తన ఉత్పత్తి తగ్గించింది. జేఎల్ఆర్ ఉత్పత్తి చేసే వాహనాల్లో 90 శాతం డీడిజల్ ఇంజిల్వే. జేఎల్ఆర్ ఉద్యోగాల కోత ప్రకటించడంతో, భారత స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ షేర్లు సుమారు 5 శాతం మేర కిందకి పడిపోయాయి. రూ.351.50 వద్ద ప్రారంభమైన కంపెనీ స్టాక్, ఇంట్రాడేలో రూ.337.90 వద్ద కనిష్ట స్థాయిలను తాకింది. చివరికి రూ.338.95 వద్ద ముగిసింది. -
డేంజర్ జోన్లో ఆ ఉద్యోగాలు..
వాషింగ్టన్ : హెచ్1బీ వీసాల నియంత్రణ చేపట్టిన ట్రంప్ సర్కార్ తాజాగా కాల్సెంటర్ ఉద్యోగాలను అమెరికన్లకే కట్టబెట్టేలా అడుగులు వేస్తోంది. భారత్లో కాల్సెంటర్ ఉద్యోగాలు పెనుముప్పును ఎదుర్కోనున్నాయి. విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే కాల్సెంటర్ ఉద్యోగులు తమ ప్రదేశాన్ని వెల్లడించడంతో పాటు అమెరికాలోని సర్వీస్ ఏజెంట్కు కాల్ను బదలాయించాలని కోరే హక్కు కస్టమర్కు కల్పించేలా ఓ బిల్లును కాంగ్రెస్ ఆమోదించింది. ఒహియో సెనేటర్ షెరుద్ బ్రౌన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. కాల్సెంటర్ జాబ్స్ను అవుట్సోర్స్ చేసే కంపెనీల జాబితాను రూపొందించాలని, ఈ ఉద్యోగాలను విదేశాలకు అవుట్సోర్స్ చేయని అమెరికన్ కంపెనీలకే కాంట్రాక్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. అమెరికాలో కాల్సెంటర్ జాబ్స్ కనుమరుగయ్యాయి..ఒహియో సహా అమెరికా అంతటా తమ కాల్ సెంటర్లను మూసివేసిన కంపెనీలు భారత్, మెక్సికోకు తరలించాయని సెనేటర్ బ్రౌన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాల్సెంటర్ ఉద్యోగుల సేవలను స్వీకరించాల్సి ఉందని, వారి జాబ్లను విదేశాలకు ఎగరేసుకుపోరాదని అన్నారు. కాగా ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ముఖ్యంగా భారత్లో కాల్ సెంటర్ ఉద్యోగాలకు రిస్క్ పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
ఉద్యోగులను తీసివేస్తున్న ప్రయివేటు బ్యాంకు
ప్రయివేటు బ్యాంకు ఎస్బ్యాంకు ఉద్యోగులపై వేటువేస్తోంది. కాస్ట్ కటింగ్లో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు బ్యాంక్నిర్ణయించింది. ఈమేరకు తన ఉద్యోగులకు ఈ మెయిల్ సమాచారాన్ని అందించింది. ఉద్యోగుల తీసివేతపై సిబ్బంది నోటీసులు అందించింది. నవంబర్ 1 నుంచి 30 రోజుల కాల పరిమితిని ఇస్తూ .. ఈ మెయిల్ సమాచారాన్ని పంపింది. ఖర్చులు తగ్గింపుతోపాటు, చాలా వినియోగదారులకు డిజిటల్ బ్యాంకింగ్ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఇదే కారణాలతో మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులు తమ పదవులకు గుడ్ బై చెప్పనున్నారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో యస్ బ్యాంక్ సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించింది. డిజిటలైజేషన్, పేలవమైన పనితీరు వంటి కారణాల ద్వారా వీరిని తొలగించింది. -
నోకియాలో ఉద్యోగాల కోత
వ్యయాల తగ్గించుకోవడానికి టెలికాం దిగ్గజం నోకియా ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఫ్రాన్స్లో దాదాపు 600 మంది ఉద్యోగులను తీసివేయాలని ప్లాన్ చేస్తున్నట్టు నోకియా తెలిపింది. ఈ ఉద్యోగాల కోతతో పాటు నష్టాల్లో ఉన్న వ్యాపారాలపై కూడా పునర్ దృష్టిసారించాలని చూస్తున్నట్టు పేర్కొంది. ఫ్రాన్స్లో 597 మంది ఉద్యోగులను తగ్గించాలని ప్లాన్ చేస్తున్నామని, మొత్తం వర్క్ఫోర్స్లో ఇది 10 శాతమని గ్రూప్ తెలిపింది. నోకియా తీసుకున్న ఈ నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని ఫ్రెంచ్ ట్రేడ్ యూనియన్లు సీఎఫ్డీటీ, సీఎఫ్ఈ-సీజీసీ, సీజీటీ, సీఎఫ్టీసీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.. ఆర్థికమంత్రిత్వ శాఖ వద్ద తమ గోడును వెల్లబుచ్చుకోనున్నట్టు తెలిపాయి. సమస్యను పర్యవేక్షించడానికి యూనియన్, సంస్థ ప్రతినిధులతో కమిటీ ఏర్పాటుచేశామని, మరికొన్ని వారాల్లో కమిటీని సమావేశపరచబోతున్నట్టు ఆ దేశ మంత్రిత్వశాఖ తెలిపింది. అల్కాటెల్-లుసెంట్ ఇంటర్నేషనల్, నోకియా సొల్యూషన్స్ నెట్వర్క్స్ ఫ్రాన్స్లలో ఈ ఉద్యోగాల కోత ఉండబోతుంది. వీటిలో మొత్తంగా 4200 మంది ఉద్యోగులున్నారని నోకియా అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఉద్యోగాల కోత ప్లాన్ నుంచి ఆర్ అండ్ బీ కార్యకలాపాలను మినహాయించారు. హైస్పీడు 5జీ టెలికాం నెట్వర్క్స్, సైబర్ సెక్యురిటీ, ఇంటర్నెట్తో లింక్ అయిన అప్లియన్స్లపై కంపెనీ పునః దృష్టిసారించాలని చూస్తుందని గ్రూప్ తెలిపింది. 2018 చివరి వరకు మొత్తం వ్యయాల్లో 1.4 బిలియన్ డాలర్లను పొదుపు చేసుకోవాలని నోకియా లక్ష్యంగా పెట్టుకుంది. -
ఆ కంపెనీ నుంచి 4వేల మంది ఔట్
శాన్ఫ్రాన్సిస్కో : క్లౌడ్ బిజినెస్లపై ఎక్కువగా దృష్టిపెట్టిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గురువారం ఉద్యోగాల కోతను ధృవీకరించింది. తమ కంపెనీ సేల్స్, మార్కెటింగ్ యూనిట్లలో అతిపెద్ద పునర్వ్యస్థీకరణ చేపడుతున్నట్టు తెలిపింది. ఈ ప్రభావంతో అమెరికా వెలుపల ఉన్న వ్యాపారాల సేల్స్ స్టాఫ్ 4వేల మందిని మైక్రోసాఫ్ట్ తొలగించనున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. ఈ ఉద్యోగాల కోత మొత్తం ఆ కంపెనీలో ఉన్న సేల్స్ ఫోర్స్లో 10 శాతం కంటే తక్కువేనని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్ తాజాగా చేపడుతున్న ఈ ఉద్యోగాల కోత ప్రభావం భారత్లో ఉంటుందా? లేదా? అనేది ఇంకా స్పష్టంకాలేదు. తమ కస్టమర్లకు, భాగస్వాములకు మంచి సేవలను అందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ మార్పులను చేపడుతున్నామని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. నేడు తాము తీసుకునే చర్యలతో కొంత మంది ఉద్యోగులు తమ తమ స్థానాల నుంచి వైదొలగాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అన్ని కంపెనీల మాదిరిగానే తాము సాధారణ ప్రక్రియలో ఉన్న కొన్ని వ్యాపారాలను విశ్లేషిస్తున్నామని, ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు పెరుగుతాయని, అది ఇతరులపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. కానీ ఎంతమందిని తీసివేస్తున్నామని ఆయన చెప్పలేదు. మైక్రోసాఫ్ట్ తాజాగా చేపడుతున్న ఈ పునర్వ్యస్థీకరణ ప్రక్రియలో 3000 నుంచి 4000 మంది ఉద్యోగులు సంస్థ నుంచి వైదొలగాల్సి ఉంటుందని తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్కు ఇటీవల క్లౌడ్, సర్వర్ వ్యాపారాల నుంచి అధికంగా రెవెన్యూలు వస్తున్నాయని వెర్జ్ రిపోర్టు చేసింది. సర్వర్ ప్రొడక్ట్లతో క్లౌడ్ సర్వీసుల రెవెన్యూలు 15 శాతం పైకి పెరిగాయని ఇది నివేదించింది. దాని క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ అజ్యూర్ రెవెన్యూలైతే ఏకంగా 93 శాతం వృద్ధి సాధించాయి. ఈ వ్యాపారాలు అమెజాన్ వెబ్ సర్వీసులను సైతం బీట్ చేసి, క్లౌడ్ మార్కెట్లో రెవెన్యూ లీడర్గా నిలిచాయి. దీంతో కంపెనీ ఎక్కువగా క్లౌడ్ సర్వీసులపై దృష్టిసారించింది. గతనెలలోనే మైక్రోసాఫ్ట్ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాలని ప్లాన్ చేస్తుందని టెక్ క్రంచ్ రిపోర్టు చేసింది. ఈ కంపెనీ గతేడాది జూలైలో 2,850 మంది ఉద్యోగులను తీసివేసిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్కు అమెరికాలో 71 వేల మంది ఉద్యోగులుండగా.. గ్లోబల్గా లక్షా 21వేల మంది ఉన్నారు. చదవండి..మైక్రోసాఫ్ట్ భారీగా ఉద్యోగాల కోతకు ప్లాన్ -
టెలికాంలో భారీగా ఉద్యోగాల కోత
తీవ్రమైన పోటీ నెలకొనడంతో టెలికాం సెక్టార్ గతేడాది 10వేల ఉద్యోగాలను తీసివేయాల్సి వచ్చిందని ఆర్ కామ్ చెప్పింది. ఈ పోటీ మరింత పెరిగే అవకాశముందని రేటింగ్ ఏజెన్సీలు అంచనావేస్తున్నాయని, దీంతో ఈ ఏడాది కూడా 40వేల కంటే ఎక్కువగా ఉద్యోగాల కోత ఉంటుందని పేర్కొంది. భారీ రుణభారంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూరుకుపోయిందనే ఆందోళన నేపథ్యంలో ఆర్ కామ్ నేడు ఓ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కంపెనీ రుణ భారం తగ్గించుకునేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామని చెప్పింది. పన్నులతో టెలికాం సెక్టార్ తీవ్రభారాన్ని భరించాల్సి వస్తుందని, దీంతో ఈ రంగ రుణాలు రూ.2.8 లక్షల కోట్లకు పెరిగినట్టు వివరించింది. ప్రస్తుతమున్న పన్ను రేట్లను మరింత పెంచుతూ టెలికాం రంగాన్ని 18 శాత పన్నుశ్లాబులోకి తీసుకురావడంపై ఆందోళనవ్యక్తంచేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టెలికాం రంగానికి మూడేళ్ల మానిటోరియం అందించాలని కోరింది. డేటా రేట్లు కూడా భారీగా దిగిరావడంతో రెవెన్యూలు కోల్పోతున్నామని చెప్పింది. కంపెనీ పురోగతిపై నెలాఖరున జరుగబోయే వచ్చే మీటింగ్ లో వివరించనున్నామని పేర్కొంది.. -
ఆ ఆటో దిగ్గజంలోనూ ఉద్యోగాలు కట్
మిచిగాన్ : టెక్ దిగ్గజంలోని ఉద్యోగాల కోత ఇప్పుడు ఆటో కంపెనీలకు పాకినట్టుంది. ఫోర్డ్ మోటార్ కంపెనీ కూడా తమ స్టాఫ్ కు కోత పెట్టాలని ప్లాన్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 10 శాతం తగ్గించుకోవాలని ఫోర్డ్ మోటార్ భావిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. లాభాలను పెంచడానికి తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఫోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ ఫీల్డ్స్, స్టాక్ ధర వెనుకబాటును, లాభాల పెంపుకోసం తీవ్రంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు ఈ రిపోర్టు పేర్కొంది. ఈ వారంలోనే ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగాల కోత ఉంటుందని వాల్ స్ట్రీట్ తెలిపింది. ముఖ్యంగా టార్గెట్ శాలరీ ఉద్యోగులను ఇంటికి పంపించేస్తారని న్యూస్ పేపర్ పేర్కొంది. అయితే గంట లెక్కన పనిచేసే ఫ్యాక్టరీ వర్కర్లపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో ఇంకా స్పష్టం కాలేదని ఈ జర్నల్ వెల్లడించింది. అలాన్ ములల్లిని రీప్లేస్ చేస్తూ ఫోర్డ్ సీఈవోగా మార్క్ ను నియమించిన దగ్గర్నుంచి కంపెనీ షేర్లు 36 శాతం పడిపోయాయి. ఆయన అవలంభిస్తున్న వ్యూహాలపై కంపెనీ బోర్డు సభ్యులు కూడా తీవ్రంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. మార్క్ ఎక్కువగా వందల కోట్ల కొద్దీ మొత్తాన్ని ఎలక్ట్రిక్ ఆటోలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రైడ్-షేరింగ్ ఎక్స్ పర్మెంట్లపైనే వెచ్చిస్తున్నారు. దీంతో కంపెనీ సంప్రదాయ వ్యాపారం నష్టాల్లో కొనసాగుతుందని బోర్డు సభ్యులు మండిపడుతున్నట్టు తెలుస్తోంది. అసలకే నెమ్మదించిన అమెరికా మార్కెట్లో తన ప్రత్యర్థి జనరల్ మోటార్స్ కంపెనీతో పోటీపడటం కంపెనీకి క్లిష్టతరంగా మారింది. ఫోర్డ్ తన మార్చి క్వార్టర్ ఫలితాల్లోనూ 42 శాతం పడిపోగా, జనరల్ మోటార్స్ లాభాలను నమోదుచేసింది. ఈ ప్రభావం ఉద్యోగులపై వేటుకు దారితీస్తుందని మార్కెట్ వర్గాలంటున్నాయి. ఫోర్డ్ కంపెనీలో 201000 మంది ఉద్యోగులుండగా.. వారిలో 1,01,000 మంది నార్త్ అమెరికాలోనే ఉన్నారు. -
700 మంది ఉద్యోగులను పీకేస్తున్న టెక్ దిగ్గజం
న్యూఢిల్లీ : బహుళ జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాప్ట్లో మరికొన్ని రోజుల్లో 700 ఉద్యోగాలు హుష్ కాకి కానున్నాయి. వచ్చే వారంలో ప్రకటించబోయే ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఉద్యోగాల కోతను మైక్రోసాప్ట్ ప్రకటిస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2017 జూన్ వరకు 2,850 ఉద్యోగాలకు కోత విధించబోతున్నామని మైక్రోసాప్ట్ ఇంతకమున్నుపే ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఈ నెలలో 700 మందికి కంపెనీ గుడ్ బై చెప్పనుందట. 2016 జూన్ 30 వరకు మైక్రోసాప్ట్లో 1,14,000 మంది ఉద్యోగులున్నారు. కంపెనీ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను జనవరి 26న గురువారం ప్రకటించనుంది. థామ్సన్ రాయిటర్స్ అంచనాల ప్రకారం కంపెనీ 25.27 బిలియన్ డాలర్ల రెవెన్యూ ఆర్జిస్తుందని తెలుస్తోంది. 2013లో నోకియాను సొంతం చేసుకున్న అనంతరం స్మార్ట్ ఫోన్ బిజినెస్లో పనిచేస్తున్న 25వేలకు పైగా ఉద్యోగులను మైక్రోసాప్ట్ పీకేసింది. ఈ ఉద్యోగాల కోత లక్ష్యం వివిధ యూనిట్లలో స్కిల్స్ను అప్డేట్ చేయడమేనని బిజినెస్ ఇన్సైడర్ రిపోర్టు చేసింది. -
మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాల కోత
హెల్సింకీ : ఫిన్నిస్ మొబైల్ ఫోన్ యూనిట్ ను మూసేస్తున్నట్టు అమెరికా సాప్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ ధృవీకరించింది. ఈ నేపథ్యంలో ఫిన్ లాండ్ లో 1,350 ఉద్యోగాలకు కోత పెట్టనున్నట్టు సోమవారం ప్రకటించింది. స్మార్ట్ ఫోన్ల వ్యాపారాన్ని క్రమబద్ధీకరణ భాగంలో 1,850 ఉద్యోగులను తొలగించే ప్లాన్ ను మైక్రోసాప్ట్ గత మేలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిన్లాండ్లోని ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ను మూసేస్తున్నామని ప్రకటించింది. ఎక్కువ ఉద్యోగాల కోతలు ఫిన్ లాండ్ లో ఉంటాయని అప్పుడే తెలిపింది. ఈ విషయాన్ని సోమవారం ధృవీకరించింది. ఆపదలో ఉన్న హ్యాండ్ సెట్ల తయారీ సంస్థ నోకియాను కొనుగోలు చేయడం ద్వారా మైక్రోసాప్ట్, ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ కొనుగోలు అనంతరం 54వేల జనాభా ఉన్న దక్షిణ ఫిన్ లాండ్ లోని సాలో పట్టణ నివాసులకు ఉద్యోగవకాశాలు మెరుగుపర్చింది. పదేళ్ల క్రితం వరకు నోకియా ఆపరేషన్స్ లో సాలో ఉద్యోగులు ఐదు వేల మంది ఉన్నారు. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీలోనే వారు ఎక్కువగా ఉద్యోగాలు పొందుతున్నారు. కానీ మైక్రోసాప్ట్ నిర్ణయంతో వారి ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరయ్యాయి. ఆ పట్టణంలో ఉన్న నోకియా ప్రొడక్ట్ డెవలప్ మెంట్ యూనిట్ మూసివేస్తున్నామనే ప్రకటనతో తమ ఉద్యోగాలు రిస్క్ లో పడబోతున్నాయనే ఆందోళనలను వ్యక్తంచేస్తున్నారు. గతేడాది కూడా ఈ యూఎస్ దిగ్గజం సాలో పట్టణ నివాసులను ఎక్కువ ఉద్యోగాల్లో చేర్చుకుంటామని ప్రకటించింది. కానీ ఫోన్ల బిజినెస్ లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఫిన్ లాండ్ రీసెర్చ్ డెవలప్ మెంట్ యూనిట్ ను మూసివేసి 1,350 ఉద్యోగులకు ఉపశమనం పలకాలని మైక్రోసాప్ట్ నిర్ణయించింది.