jogi ramesh
-
ఈ రోజు జగన్ సీఎంగా ఉండి ఉండుంటే.. బాబుపై నిప్పులు చెరిగిన జోగి రమేష్
-
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతలు దౌర్జన్యాలు చేసి గెలిచారు
-
కూటమి కాదు.. కుట్రల ప్రభుత్వం: జోగి రమేష్
సాక్షి,తాడేపల్లి:ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేసిందని,అరాచకాలు,అక్రమాలు,దౌర్జన్యాలు చేసి మున్సిపాలిటీల్లో పదవులు దక్కించుకున్నారని వైఎస్సార్సీపీ సీనియర్నేత మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. సోమవారం(ఫిబ్రవరి3) తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏ కార్పొరేషన్,మున్సిపాలిటీల్లోనూ టీడీపీకి బలం లేదు.మా పార్టీ వారిని కిడ్నాప్ చేసి గెలుపొందటం సిగ్గుచేటు. మా కార్పొరేటర్లు వెళ్లే బస్సు మీద రాళ్ల దాడి చేయడం దారుణం. తిరుపతి ప్రతిష్టను దిగజార్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదు. 2019లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీని తిట్టారు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ,కేజ్రివాల్ను తిట్టారు. అసలు చంద్రబాబు ఒక మనిషేనా? ఆయనకు సిగ్గుందా? సిద్దాంతాలు,విలువలు లేని ఏకైక మనిషి చంద్రబాబు.ఐటీ రైడ్స్ నుంచి రక్షించుకోవడానికే ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.ఇది కూటమి ప్రభుత్వం కాదు,కుట్రల ప్రభుత్వం.వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి గెలవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారు.ఈ దాడులు,దౌర్జన్యాలపై ఈసీ స్పందించాలి. అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఈసీ అడ్డుకోవాలి’అని జోగి రమేష్ డిమాండ్ చేశారు. -
ఆరు నెలలు కాలేదు జనం నడ్డి విరగ్గొట్టారు
-
టీడీపీ సుద్దులన్నీ బీసీ నేతలకు మాత్రమేనా?
తెలుగుదేశం పార్టీ రాను రాను మరీ సంకుచితమైన రాజకీయ పార్టీగా మారిపోతోంది. రాజకీయాలన్నీ ఎన్నికల సమయానికి మాత్రమేనని ఆ తరువాత అందరూ కలిసి పని చేయాలని సుద్దులు చెప్పిన చంద్రబాబు ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా గౌడ సంఘం నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు, రాష్ట్ర మంత్రులు ఒకే వేదికను పంచుకోవడాన్ని ఆ పార్టీ నేతలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. నూజివీడులో జరిగిన ఈ కార్యక్రమానికి సొంత నియోజకవర్గం కావడంతో పార్థసారథి, లచ్చన్న మనవరాలిగా శిరీష వెళ్లారు. వైఎస్సార్సీపీ నేతలు జోగి రమేశ్ కూడా హాజరయ్యారు. అంతే.. టీడీపీ నేతలు జోగి రమేష్ వేదిక పంచుకోవడమే తప్పని, పార్ధసారథిలో వైఎస్సార్సీపీ వాసనలు పోలేదని, శిరీష తప్పు చేశారని టీడీపీ కులోన్మాదులు, లోకేష్ మెప్పుకోసం తాపత్రాయ పడుతున్న నేతలు పెద్ద ఇష్యూ చేసేశారు. అక్కడితో ఆగనూ లేదు. అదేదో పెద్ద నేరం అన్నట్లు టీడీపీ నాయకత్వం పార్ధసారథి, శిరీష్ లతో క్షమాపణ చెప్పించింది. ఎంత దారుణం! వారు కూడా తమ ఆత్మగౌరవాన్ని వదలుకుని చంద్రబాబుకు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్లకు క్షమాపణ చెప్పేశారు. అయినా సరే టీడీపీ నేతలు కొందరు పార్దసారథిని విమర్శలతో ట్రోల్ చేశారు. దీంతో ఆయన తాను ఎంత చిత్తశుద్దితో పని చేస్తున్నా టార్గెట్ బాధపడడం చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్మాదం ఈ స్థాయికి చేరిందా? అన్న ప్రశ్న వస్తుంది. దీన్ని కులోన్మాదం అనాలా? లేక ఇంకేమైనానా? బీసీ వర్గానికి చెందిన నేతలు మాత్రమే ఇలా కలవకూడదని ఏమైనా టీడీపీ ఆంక్షలు పెట్టిందా? ఎందుకంటే.. కమ్మ, కాపు, రెడ్డి తదితర అగ్రవర్ణాలలోని టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ వారితో, ఇతర పార్టీల నేతలతో కలిసి తిరిగినా, సభలలో మాట్లాడినా, వ్యాపారాలు చేసినా అభ్యంతరం వ్యక్తం కావడం లేదు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్ను ఆహ్వానిస్తారా? అంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వంటి వారు విరుచుకుపడ్డారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అప్పట్లో ఆనాటి సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం చెబుతానంటూ నాటి మంత్రి జోగి రమేష్ చంద్రబాబుకు ఇంటికి వెళ్లారు. టీడీపీ నేతలు దీన్నే ఒక పెద్ద దాడిగా ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక జోగిపై కేసు కూడా పెట్టేశారు. అంతమాత్రాన ఆయన ఇలాంటి సభలలో పాల్గొనకూడదని అంటే దానిని ఉన్మాదం అనక ఏమంటాం? విశేషం ఏమిటంటే టీడీపీకి మద్దతు ఇచ్చే కొందరు విశ్లేషకులు కూడా చాలా పెద్ద ఘోరం జరిగిందని టీవీలలో ఇంగితం లేకుండా మాట్లాడారు. ఈనాడు పత్రిక అయితే నీచాతినీచంగా పార్థసారథి, శిరీషల ఫోటోలు వేసి ‘ఇంగితం ఉందా’ అని, కనీస ఇంగితం లేకుండా వార్త రాసింది. ఈనాడు మీడియా స్థాయి అబద్ధాలు చెబుతోందని ఇంతకాలం విమర్శించుకున్నాం కానీ.. దాని స్థాయి అట్టడుగుకు చేరిందనేందుకు ఇదో నిదర్శనంగా నిలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవారు. ఎన్.టిఆర్. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పార్టీలోకి రాలేదు. సినిమాలలో నటించే వారికి రాజకీయం ఏమి తెలుసు అని విమర్శలు కూడా చేశారు. కాని 1983లో టీడీపీ అధికారంలోకి రావడంతోనే బాబు పార్టీ మారిపోయారు. టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబుకు పార్టీ సభ్యత్వం ఇవ్వద్దని కొందరు సీనియర్ నేతలు అన్నా, ఎన్.టి.ఆర్. వారికేదో చెప్పి పార్టీలోకి తీసుకున్నారు. తాజా పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఎన్.టి.ఆర్కు ఇంగితం లేదనుకోవాలా? పార్టీలో గ్రూపు నడిపి, చివరికి ఎన్.టి.ఆర్.పదవికే ఎసరు పెట్టిన చంద్రబాబును ఏమనాలి? ఆ సమయంలో చంద్రబాబును ఎన్.టి.ఆర్. పలురకాలుగా దూషించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. ఎన్టీఆర్కు విలువల్లేవని విమర్శించిన నోటితోనే చంద్రబాబు తాము ఆయన వారసులమని కూడా ప్రకటించుకున్నారు. ఇంగితం లేనిది ఎవరికి?ఎన్.టి.ఆర్. బతికున్నంత కాలంలో అసభ్యకరమైన కార్టూన్లూ, నగ్న కేరికేచర్లు ప్రచురించిన ఈనాడు మరణానంతరం అవసరమైనప్పుడల్లా ఆయన్ను యుగపురుషుడని కొనియాడుతూ కథనాలు రాసింది. ఇక్కడ కూడా ఇంగితం లేనిది ఎవరికి? తన రాజకీయ జీవితం మొత్తం కప్పగెంతులేసిన చంద్రబాబు ఎవరెవరిని ఎప్పుడు దూషించింది.. అదే నోటితో ఎలా పొగిడిందీ తెలియందెవరికి? అందులో ఎవరికీ ఇంగితం జ్ఞాపకం రాకపోవడమే రాజకీయ వైచిత్రి! ఇవన్నీ మరచి కేవలం జోగి రమేష్తో ఒక వేదిక పంచుకున్నందుకు పార్థసారథి, శిరీషలకు ఇంగితం లేదని ధ్వజమెత్తుతున్నారు. లచ్చన్న ఒక కుల నాయకుడా అని వీరు తెలివిగా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమాణం అన్ని కుల సంఘాలకూ వర్తింపజేస్తున్నారా మరి? కమ్మ కుల సంఘం మీటింగ్లో ఎన్.టి.ఆర్. విగ్రహాన్ని మాత్రమే ఎందుకు పెట్టుకుంటున్నారు? చంద్రబాబునే ఎందుకు పొగుడుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఆ కుల మీటింగ్లోకి హాజరైతే తప్పు లేదా? అంతెందుకు మాజీ మంత్రి పుల్లారావు, మరి కొందరు టీడీపీ నేతలు గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తుండే వారు అంటారు. వంగవీటి రంగ హత్య గురించి బాబుకు ముందే తెలుసన్న తీవ్ర విమర్శలతో చేగొండి హరిరామయ్య పుస్తకం రాస్తే దాని ఆవిష్కరణ సభకు టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీ పక్షాల నేతలందరూ హాజరయ్యారే.... టీడీపీ అప్పుడు ఎవరితోనూ క్షమాపణ చెప్పించ లేదే! మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు వేడకులకు రష్యా వెళ్లిన వారిలో టీడీపీ వారు కూడా ఉన్నారంటారు అంతేకాదు... టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు కొందరు కలిసి జూదమాడతారట. వీటికి రాని అభ్యంతరం లచ్చన్న విగ్రహావిష్కరణ సభకు వైఎస్సార్సీపీ నేత హాజరైతే వచ్చిందా? రెడ్డి జన సంఘం సభలకు కూడా వివిధ పార్టీల వారు హాజరవుతుంటారు. అంతెందుకు! లచ్చన్న మరణం తర్వాత జరిగిన ఒక కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, బీవీ రాఘవులుతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. అంటే చంద్రబాబు తప్పు చేసినట్లేనా? ఎన్నికల తర్వాత అంతా రాష్ట్రం కోసమే ఆలోచించాలని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని చంద్రబాబు తరచుగా ప్రచారం చేసేవారు.ఇప్పుడు ఇలా ఎందుకు వ్యవహరించినట్లు? అంటే తన కుమారుడు, మంత్రి లోకేష్ కేవలం అవగాహన రాహిత్యంతో పార్థసారథి, శిరీషలపై ఆగ్రహం వ్యక్తం చేస్తే, దానిని ఆమోదించి చంద్రబాబు కూడా మాట్లాడారా? తెలిసో, తెలియకో లోకేష్ మాట్లాడి ఉంటే సరిచేయాల్సిన పెద్దరికం చంద్రబాబుదే అవుతుంది కదా? అది కూడా చేయలేక పోయారంటే బాబు ఎంత నిస్సహాయంగా ఉంటున్నది అర్థం చేసుకోవచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర ఖజానాకు మేలు చేసే లక్ష్యంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్గా నవయుగ సంస్థను తప్పించి మెగా సంస్థను ఎంపిక చేశారు. దీన్ని చంద్రబాబుసహా పలువురు టీడీపీ నేతలు విమర్శించారు. కానీ ఇప్పుడు అదే మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డితో కలిసి చంద్రబాబు టూర్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి స్వస్థలమైన డోకిపర్రులోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి చంద్రబాబు వెళ్లారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కృష్ణారెడ్డి మంచివాడైపోయారా? మామూలుగా అయితే ఎవరూ వెళ్లవద్దని అనరు. కాని నూజివీడు ఘటన తర్వాత ఇవన్ని ప్రశ్నలు అవుతాయి. 2019 కి ముందు ఎన్ని ఘటనలు జరిగాయి. ప్రస్తుతం అలయ్ బలయ్ అంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అప్పట్లో ఎన్ని మాటలు అనుకున్నారు. మళ్లీ అదే పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు ఎంత తాపత్రయపడింది తెలుసు కదా? అలాగే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు, లోకేష్ లను ఎన్నేసి మాటలు అన్నారు. అసలు తన తల్లినే దూషించారని టీడీపీపై ఆరోపించారు. కాని ఏ ఇంగితం పెట్టుకుని మళ్లీ కలిశారని అంటే ఏమి చెబుతాం. బీజేపీతో తేడా వచ్చాక బీజేపీ అధ్యక్ష హోదాలో తిరుపతి వచ్చిన అమిత్ షాపై టీడీపీ వారు రాళ్లు వేశారు. ప్రధాని మోడీని చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు దూషించారు. దేశ ప్రధానిని పట్టుకుని టెర్రరిస్టు, పెళ్లాన్ని ఏలుకోలేని వాడు అంటూ పరుష పదాలతో మాట్లాడిన వీరు, తర్వాత కాలంలో మోడీ అంత గొప్పవాడు లేడని చెబుతున్నారు. అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం రోజుల తరబడి డిల్లీలో ఎదురు చూశారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు స్వయంగా లోకేష్ డిల్లీ వెళ్లి, తన పెద్దమ్మ సాయంతో అమిత్ షాను కలిసి వచ్చారే! ఇందులో ఎవరికి ఇంగితం ఉన్నట్లు?ఎవరికి లేనట్లు? చంద్రబాబు ఎవరినైనా ఏమైనా అనవచ్చు. ఎవరితోనైనా జట్టు కట్టవచ్చు? అది గొప్పతనం. ఆయన తిడితే అంతా తిట్టాలి. ఆయన పొగిడితే అంతా పొగడాలి. ఎటు తిరిగి ఆయన చేతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి భజన మీడియా ఉంది కనుక ఏమి చేసినా చెల్లిపోతోంది.పార్థసారథి తండ్రి కెపి రెడ్డయ్య గతంలో కాంగ్రెస్, టీడీపీలలో పనిచేశారు. ఎంపీగా పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని కాపాడడానికి మరి కొందరితో కలిసి కాంగ్రెస్లో చేరారు. అప్పట్లో రెడ్డయ్యపై టీడీపీ వారు ఆరోపణలు చేసేవారు. అయినా రెడ్డయ్య వాటన్నిటిని ధీటుగా ఎదుర్కునేవారు. రెడ్డయ్య నోటికి అంతా భయపడే పరిస్థితి ఉండేదని చెబుతారు. ఇప్పుడు ఆయన కుమారుడు పార్థసారథి కూడా ఒకరకంగా అదే ఆత్మగౌరవ సమస్యను ఎదుర్కుంటున్నారు. కాంగ్రెస్ లోను, ఇప్పుడు టీడీపీలోను మంత్రిగా ఉన్నారు. శిరీష తండ్రి గౌతు శివాజి కూడా ఆరుసార్లు టీడీపీ ఎమ్మెల్యే. అలాంటి కుటుంబానికి చెందిన శిరీషను టీడీపీ నాయకత్వం అవమానించి క్షమాపణ కోరుతుందా?ఒకప్పుడు సమరసింహా రెడ్డి మంత్రిగా ఏదో కాకతాళీయంగా మరో మంత్రి కటారి ఈశ్వరకుమార్తో మాట్లాడుతూ బీసీలా..వంకాయలా అని అన్నారు. అది కాంగ్రెస్ లో పెద్ద దుమారం రేపింది. చంద్రబాబు నాయుడు గత టరమ్ లో బీసీ నేతలు కొందరు సచివాలయానికి వస్తే దేవాలయంవంటి ఇక్కడకు వచ్చి ప్రశ్నిస్తారా? అని మండిపడ్డారు. మరో సందర్భంలో మత్యకారులను ఉద్దేశించి తోకలు కట్ చేస్తానని అనడం వివాదాస్పదమైంది. ఈ మధ్యనే కాకినాడ సీపోర్టు యజమాని కేవీ రావు పై అభియోగాలు చేస్తూ లేఖ రాసిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా టీడీపీ కులోన్మాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కున్నారు. అవమానాలకు గురి కావల్సి వచ్చింది. టీడీపీ బీసీ నేతలు ఇలాంటి వాటిని భరిస్తుండడం విశేషం. కనీసం ధైర్యంగా తాము తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారు. మరో వైపు జగన్ బీసీలకు అత్యంత గౌరవం ఇచ్చి ఎన్నడూ లేని విధంగా వారికి నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చి గౌరవించారు. వారిలో ముగ్గురు పార్టీని వీడడం దురదృష్టకరం. తమను గౌరవించేవారు కావాలో, లేక అవమానించేవారు కావాలో బీసీ నేతలే నిర్ణయించుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నీకు నిజంగా దమ్ముంటే.. వసంత కృష్ణ ప్రసాద్ కి జోగి రమేష్ సవాల్
-
వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం వీరప్పన్: జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: దొంగకోళ్లు పట్టేవాడికి, టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్కు తేడా లేదని.. మైలవరం నియోజకవర్గంలో సహజ వనరుల్ని లూటీ చేస్తున్నాడంటూ మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసంతకృష్ణ ప్రసాద్ను మైలవరం వీరప్పన్గా అభివర్ణించారు. మైలవరంలో బ్రాందీ షాపులు పెట్టుకున్నా వసంత కృష్ణప్రసాద్కు కమీషన్లు ఇవ్వాలి’’ అంటూ దుయ్యబట్టారు.‘‘గతంలో కృష్ణప్రసాద్ ఏడుస్తున్నాడనే నేను మైలవరానికి ఏనాడూ రాలేదు. వసంత కృష్ణప్రసాద్కు మీడియా సమక్షంలో నాతో చర్చకు వచ్చే దమ్ముందా? అంటూ జోగి రమేష్ సవాల్ విసిరారు. ‘‘పర్వతనేని ఇంటి ముందు సీటు కోసం అబ్బా కొడుకులు తిట్టుకుని, కొట్టుకున్నారు. ఎన్ని పుస్తకాలు రాసినా మీ చరిత్రకి సరిపోవు. సిగ్గుమాలిన, సంస్కారం లేని కుటుంబం మీది. వసంత కృష్ణప్రసాద్ బూడిద అక్రమాలపై పోరాడతాం’’ అని జోగి రమేష్ హెచ్చరించారు.జగన్, జోగి రమేష్ ఫోటోలు చూస్తే భయమా? బ్యానర్లు తీసేయమని అధికారులకు చెబుతున్నారు. నేను మా పార్టీ అధ్యక్షుడిని ఒప్పిస్తా.. నువ్వు కూటమికి రాజీనామా చెయ్యి. పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా మైలవరంలో పోటీచేద్దాం... సిద్ధమా?. రాబోయే ఎన్నికల్లో మైలవరం నుంచి వైఎస్సార్సీపీఅభ్యర్థిగా పోటీ చేస్తున్నా. 2027 తర్వాత కృష్ణ ప్రసాద్ చాప, దిండు సర్దుకుని వెళ్లిపోతాడు’’ అంటూ జోగి రమేష్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: YSRCP సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ -
చంద్రబాబు బ్యాచ్ ని రఫ్పాడించిన జోగి రమేష్
-
వారిని వదిలిపెట్టను.. జోగి రమేష్ వార్నింగ్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కేసులకు భయపడను.. నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఇబ్రహీంపట్నం గడ్డమీదే ఉన్నా.. నా మీదకు రాకుండా.. నా కుమారుడిపై కేసు పెట్టారు. ఈ రోజుతో అయిపోదని గుర్తు పెట్టుకోండి’’ మాజీ మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు. బుధవారం.. మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో.. మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరమని గుర్తుంచుకోండి. నా జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టనని తేల్చి చెప్పారు.మంచి మనసున్న నేత వైఎస్ జగన్. ఆయన చెప్పాడనే 2019లో నేను మైలవరం నుంచి పక్కకు వెళ్లా.. ఈ క్యాండెట్ చివరి వరకూ ఉండడని జగనన్నతో ఆరోజే నేను చెప్పా.. ఆయనను నమ్మించి మోసం చేసి ఎన్నికల ముందు గోడ దూకేశాడు. రావాల్సిన బిల్లులన్నీ రాగానే పార్టీ మారిపోయాడు’’ అంటూ మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్పై జోగి రమేష్ మండిపడ్డారు.‘‘నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్సీపీలో ఉండండి. ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదు. మా మోచేతి నీళ్లు తాగి.. ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే కారు కూతలు కూస్తున్నాడు. ఇక పై జగనన్న గురించి మాట్లాడితే తాటతీస్తాం. కేసులకు మేం భయపడం.. మా వాళ్లజోలికి వస్తే చూస్తూ ఊరుకోం’’ అని జోగి రమేష్ చెప్పారు.‘‘జనవరిలో మైలవరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించుకుందాం. కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటా. ఈ రోజు ఓడిపోయాం.. కానీ మళ్లీ వైఎస్ జగన్ని సీఎంగా చేసుకుందాం. ఐదు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత వచ్చింది. 2027లో ఎన్నికలు రాబోతున్నాయ్.. మళ్లీ గెలిచేది మనమే’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
బాబూ.. కక్ష సాధింపు ఆనందం వీడాలి: జోగి రమేష్
సాక్షి, మంగళగిరి: ఏపీలో కూటమి నేతలకు రాజకీయ విలువలు లేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పాటిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.కాగా, మాజీ మంత్రి జోగి రమేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రాజకీయాల్లో విశ్వసనీయత అవసరం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పాటిస్తున్నారు. చంద్రబాబు ఇంటికి ఎందుకు వెళ్లానో విచారణలో చెప్పాను. అయ్యన్న పాత్రుడు.. వైఎస్ జగన్పై చేసిన విమర్శలకు నిరసన చేసేందుకు వెళ్ళాను. అయితే, నాపై దాడి చేసి.. మళ్లీ నా మీదనే కేసు పెట్టారు. అధికారం ఎవరికీ శాశ్వత కాదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి. ఏపీలో చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుంది. కక్ష ఉంటే నాపై తీర్చుకోవాలి. నా కొడుకుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు.కూటమి నేతలకు రాజకీయ విలువలు లేవు. హామీలు అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నారు. సూపర్ సిక్స్ అమలు చేస్తే ప్రజలు సంతోషిస్తారు. మంచి పాలన చేయాలని కానీ.. కక్ష సాధించడం సరికాదు. ఇటువంటి ఆనందాన్ని చంద్రబాబు వీడాలి. కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నా కొడుకుని అగ్రిగోల్డ్ భూముల కేసులో ఇరికించారు. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా మేము కొనుగోలు చేయలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సత్య ప్రసాద్ దగ్గరకు నేనే వచ్చి అగ్రిగోల్డ్ గురించి వివరిస్తా.లోకేష్ రెడ్ బుక్ తీస్తే ఏమి అవుతుంది?. వైఎస్సార్సీపీని అడ్డుకోవాలని చూస్తే సాధ్యం కాదు. మళ్ళీ నన్ను విచారణకు రమ్మని పిలవలేదు. 2002 నుంచి ఒకటే ఫోన్ నెంబర్ వాడుతున్నా. నేను మళ్ళీ విచారణకు రమ్మంటే వస్తాను. వారు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాను. ఇప్పుడు మీరు పరుష పదజాలం వాడితే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోండి. నాకు పార్టీ సపోర్ట్ ఉంది. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాను. తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం వేధించాలని చూస్తుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తా..
-
కక్ష కట్టారు.. కేసులకు భయపడేది లేదు: జోగి రమేష్
సాక్షి, విజయవాడ: తనపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారని.. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి పీఎస్కు వచ్చిన జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తా.. ప్రతి పశ్నకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.‘‘ప్రజలంతా సూపర్ సిక్స్ పథకాల అమలు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మాత్రం రెడ్ బుక్ అమలు చేసే పనిలో ఉన్నారు. కేసులకు భయపడేది లేదు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
అతి తెలివితేటలు వద్దు.. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం
-
YSRCP నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు
-
బాబుపై జోగిరమేష్ భార్య ఫైర్
-
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
-
టార్గెట్ జోగి రమేష్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇబ్రహీంపట్నం: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు తెరతీసింది. చట్టానికి లోబడి, నిబంధనల ప్రకారం భూమి కొనుగోలు చేసి, దానిని విక్రయించిన వ్యవహారంలో అక్రమ కేసు నమోదు చేసింది. పత్రికల్లో ప్రకటన ఇచ్చి మరీ కొనుగోలు చేసిన ఓ భూ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టిస్తూ, అక్రమ కేసు నమోదు చేశారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్తోపాటు, చిన్నాన్న వెంకటేశ్వరరావును నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాక.. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సోదాలతో పేరుతో హల్చల్ చేశారు. అనంతరం.. జోగి రాజీవ్ను ఎలాంటి నోటీసులివ్వకుండానే అదుపులోకి తీసుకుని గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జోగి సతీమణి శకుంతల.. మా బిడ్డ ఏం పాపం చేశాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం.. ఏసీబీ కార్యాలయం వద్దకు జోగి రమేష్ చేరుకుని, అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. నిజానికి.. గతంలో టీడీపీ నేతలు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు జోగి రమేష్ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. ఆ ఉదంతంతో చంద్రబాబు అతనిపై కక్షగట్టి ఇప్పుడు వేధింపులకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక జోగి రమేష్ తనయుని అరెస్టు వార్త తెలియగానే వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, వెలంపల్లి, దేవినేని అవినాష్, మాజీమంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతోపాటు, వైఎస్సార్సీపీ శ్రేణులు గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్రమ ఆరెస్టులపై పోరాడతామని, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులన్నీంటిని ఎదుర్కొంటామని చెప్పారు. తొమ్మిది మందిపై సీఐడీ అక్రమ కేసు ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మందిపై సీఐడీ అక్రమ కేసు నమోదు చేసింది. ఇందులో జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి మోహనరంగాదాసు, వెంకట సీతామహాలక్ష్మి, సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేశ్, డిప్యూటీ తహశీల్దార్ విజయకుమార్, విజయవాడ రూరల్ తహశీల్దారు, నున్న సబ్రిజి్రస్టార్ ఉన్నారు. సీఐడీ కేసు విచారణలో ఉండగానే ఏసీబీ హడావిడిగా కేసు నమోదు చేయడం గమనార్హం. ఇక ఏసీబీ కార్యాలయంలో మంగళవారం దేదీప్యను విచారించారు. మరోవైపు.. గతంలో చంద్రబాబు ఇంటివద్ద నిరసన చేపట్టిన కేసులో జోగి రమే‹Ùకు మంగళవారం తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీచేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు పలువురు మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే.. అక్రమ కేసులపై పోరాటం చేస్తాంమాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడతారని, అక్రమంగా అరెస్టులు చేస్తారన్నారు. అసలు ఈ కేసులో లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? అని ప్రశ్నించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, విచారణకు పిలవకుండా జోగి రమేష్ను టార్గెట్ చేశారన్నారు. చంద్రబాబును నిలదీయకుండా వదలమన్నారు. జోగి రమేష్కు పొలం అమ్మిన వారు ముద్దాయిలు కారు.. కొనుక్కున్న వారు లేరు.. మరి అలాంటప్పుడు జోగి రమేష్ కుటుంబ సభ్యులు మాత్రమే ముద్దాయిలా? అని ప్రశ్నించారు. ఈ తప్పుడు కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. నిజానికి అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు మనుషులే కొన్నారని నాని చెప్పారు. జోగి రమేష్ సతీమణి మాట్లాడుతూ.. అప్పటి సీఎం జగన్గారిని ఉద్దేశించి టీడీపీ నేతలు దారుణంగా మాట్లాడడంవల్లే తన భర్త నిరసన తెలపడానికి చంద్రబాబు నివాసానికి వెళ్లారని.. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా వేధిస్తారా? అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్ రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని, అందుకే బీసీ అయిన జోగి రమేష్ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీమంత్రి వెలంపల్లి అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా జోగి రమేష్ కుటుంబాన్ని వేధిస్తున్నారని.. తాము పరామర్శకు రావొద్దా అని మాజీమంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. అలాగే, జోగి రమేష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని.. అందుకే జగన్ ఆదేశాల మేరకు తామంతా ఇక్కడకు వచ్చామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్ చెప్పారు. 14 రోజులపాటు రిమాండ్ ఇదిలా ఉంటే.. జోగి రాజీవ్, సర్వేయర్ రమే‹Ùకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏసీబీ కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు న్యాయమూర్తి హిమబిందు ఎదుట హాజరుపర్చగా ఇరువర్గాల వాదనల అనంతరం న్యాయమూర్తి ఈనెల 23వరకు రిమాండ్ విధించారు. నిందితుని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు.మా నాన్నపై కక్ష తీర్చుకునేందుకే..నా తండ్రిపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకే అక్రమ కేసులు పెట్టారు. ఈనాడులో ప్రకటన చూసే కొన్నాం.. అలాగే, ప్రకటన ఇచ్చే అమ్మాం. ఈ వ్యవహారాన్ని లీగల్గానే కోర్టులోనే తేల్చుకుంటాం. – జోగి రాజీవ్, జోగి రమేష్ తనయుడు నాపై కక్షతో నా కొడుకుపై కేసు.. మా అబ్బాయి మీద కేసు నమోదు చేయడం దుర్మార్గం. చంద్రబాబూ.. నీకు నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. అటాచ్ అయిన అగ్రిగోల్డ్ భూములు ఎవరైనా కొంటారా? కావాలనే కక్షతోనే నా కొడుకుని అరెస్టుచేశారు. ఇది బలహీనవర్గాలపైన, గౌడ కులస్తుపైన దాడిగా నేను భావిస్తున్నా. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తమ కుటుంబం తప్పుచేసినట్లు రుజువుచేస్తే ఆత్మహత్య చేసుకుంటాం. – జోగి రమేష్, మాజీమంత్రి ఇద్దరిని అరెస్టు చేశాం విజయవాడ రూరల్ అంబాపురం గ్రామంలో సీఐడీ అటాచ్మెంట్లో ఉన్న అవ్వా శేషనారాయణకు చెందిన అగ్రిగోల్డ్ భూమి కొనుగోలుపై వచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతం జోగి రాజీవ్, సర్వేయర్ రమే‹Ùలను అరెస్ట్చేశాం. ఇందులో ఐదుగురు నిందితులను గుర్తించాం. తదుపరి విచారణ తరువాత మిగిలిన వారిని అరెస్టుచేస్తాం. – సౌమ్యలత, ఏసీబీ అడిషనల్ ఎస్పీ -
మా 175 మందిని అరెస్ట్ చేసుకో..
-
వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా టీడీపీ కక్ష సాధింపు: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పథకాల అమలు చేయకుండా.. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమ్తెతారు. అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కుమారుడు కొన్న భూములకు దగ్గరలో కూడా లేవన్నారు.2022లో పేపర్ ప్రకటన జోగి రమేష్ ఇచ్చారు. ఆయన దగ్గర స్థలం కొన్నప్పుడు కూడా వాళ్లు కూడా పేపర్ ప్రకటన ఇచ్చారు. సీబీఐ కూడా ఎక్కడా అభ్యంతరాలు చెప్పలేదు. ఆగస్ట్ 2న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చంద్రబాబుపై జోగి రమేష్ గట్టిగా మాట్లాడారు కాబట్టే కక్ష కడుపులో పెట్టుకొని ఆయన కొడుకుపై అక్రమ కేసులు పెట్టారు.’’ అని పేర్ని నాని మండిపడ్డారు.‘‘175 నియోజకవర్గాల్లో అందరిని జైల్లో వేసిన పోరాటం ఆపం. టీడీపీ చేసే తప్పులపై పోరాటం చేస్తాం.. 2029లో టీడీపీని కులగొట్టేందుకు కావాల్సిన పోరాటం చేస్తాం. పొలం అమ్మిన వారు ముద్దాయిలుగా లేరు.. అమ్మిన వాళ్లు చంద్రబాబు చుట్టాలయి వుంటారు. అరెస్టులు చేసి తప్ఫడు కేసులు పెట్టి మానసిక ఆనందం పొందుతున్నారు. రెడ్ బుక్లో ఎవరెవరు పేర్లు ఉన్నాయో వాళ్లను వేధిస్తున్నారు. ఒకే సంఘటనకు రెండు కేసులు పెట్టారు. మానసిన ఆనందం తాత్కాలికం..’’ అని పేర్ని నాని దుయ్యబట్టారు. -
నా ఇంటి మీదకు వచ్చావ్.. అందుకే నా ఈ రివెంజ్..
-
కొడుకు అరెస్ట్ పై కన్నీళ్లు పెట్టుకున్న జోగి రమేష్ భార్య
-
అన్యాయంగా నా కొడుకు అరెస్ట్: జోగి రమేష్
-
జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
చంద్రబాబూ.. వంకర బుద్ధి మార్చుకో: జోగి రమేష్
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిపై జోగి రమేష్ నిరసన తెలిపారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ధర్నాకు దిగారు.‘‘అగ్రిగోల్డ్లో మా కుటుంబం తప్పు చేసినట్టు నిరూపిస్తే.. విజయవాడ నడిరోడ్డుపై ఉరి వేసుకుంటాం. చంద్రబాబు మాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. మా కుమారుడు విదేశాల్లో చదివాడు, ఉద్యోగం చేశాడు. బలహీనవర్గాలపై దాడి ఇది.. గౌడ కులం నుంచి అంచెలంచెలుగా ఎదిగా. కోపం ఉంటే నాపై కక్ష తీర్చుకోండి. నా కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు’’ అని జోగి రమేష్ ధ్వజమెత్తారు.చంద్రబాబూ.. నీకూ కొడుకులు ఉన్నారు.. తప్పుడు కేసులు బనాయించడం మంచిది కాదు. చంద్రబాబు వంకర బుద్ది మార్చుకోవాలి. ఇది జోగి రమేష్ మీద.. జోగి రాజీవ్పై జరిగిన దాడి కాదు.. బలహీన వర్గాలపై జరిగిన దాడి. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చండి.. డైవర్షన్ పాలిటిక్స్ వద్దు.. హామీలు నెరవేర్చి ప్రజలకి మంచి చేయండి ’’ అంటూ జోగి రమేష్ హితవుపలికారు. -
మాజీ మంత్రి జోగి రమేష్పై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ శ్రేణులపై అధికార కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా వారిపై పలు అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు గురి చేస్తోంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఇంటిలో మంగళవారం ఉదయం పోలీసులు సోదాలు చేపట్టారు. ఎందుకొచ్చారోకూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు తీరుపై జోగి రమేష్ కుటుంబ సభ్యులు, అనుచరులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రెండు నెలల క్రితం జోగి రమేష్ ఇంటిపై రాళ్లతో దాడులుఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. జూన్ 16న జోగి రమేష్పై రాళ్ల దాడి చేశారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై పరులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. -
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.తాజాగా, మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై జనసేన,టీడీపీ సానుభూతి పరులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. -
చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది ?
-
బాబు.. దోచుకుంది దాచుకునేందుకు విదేశాలకు వెళ్లావా?: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు.కాగా, మంత్రి జోగి రమేష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడ్నుండి ఎక్కడకు వెళ్లారు?. వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లోమీడియా రాసింది. అబ్బే ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు? ఎక్కడకు వెళ్లారు?. చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా మురిదిపోయింది.ఈ రహస్య పర్యటన వెనుక కారణం ఏంటి?. దోచుకున్న డబ్బుని దాచుకోవటానికి వెళ్లారా?. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు.. ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు?. అసలు ఈ పది రోజులు ఎక్కడకు వెళ్లారో ఎందుకు చెప్పటం లేదు?. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరం. మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో సహా మేము చెప్పాం. మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత?. ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలి.అవినీతిపరుడైన ఏబీ వెంకటేశ్వరరావును టీడీపీ నేతలు అక్కున చేర్చుకున్నారు. దేవినేని ఉమా సహా అందరూ వెళ్లి అవినీతిపరుడిని సత్కరించారు. ఈరోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ దెబ్బకి టీడీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. నాలుగో తేదీన ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబుకు మూర్చ వస్తుంది. ఆ రోజున కూటమి కుదేలవుతుంది. వైఎస్సార్సీపీ శ్రేణులంతా సంబరాలకు సిద్ధం కావాలి. పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకోవాలి. సీఎం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని పిలుపునిస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్
-
ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
సాక్షి, విజయవాడ: ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు. దోచిన డబ్బంతా దుబాయ్లో దాచడానికి వెళ్లరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరార్తో టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయని విమర్శించారు. కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారన్నారు జోగి రమేష్. ఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు జోగి రమేష్. పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. టీడీపీ అడ్రస్ గల్లంతు కాబోతుంది కాబట్టే చంద్రబాబు విధ్వంసానికి పాల్పడ్డాడని విమర్శించారు. పురందేశ్వరి ఈసీకి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే అధికారులను మార్చారనిన్నారు.కాగా అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్చుప్గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.చదవండి: ఇట్లు ఇటలీకి -
ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు
-
పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు
-
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
-
పెనమలూరులో తుఫ్యాన్
కంకిపాడు: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సమయం సమీపించే కొద్దీ పెనమలూరులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. గెలుపుపై వైఎస్సార్ సీపీలో ధీమా వ్యక్తమవుతుండగా, టీడీపీ డీలా పడుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి జోగి రమేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రామగ్రామాన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాల లబ్ధి, అభివృద్ధి కార్యక్రమాలతో వైఎస్సార్ సీపీకి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రజలంతా పారీ్టకి వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. కూటమి విధానాలు నచ్చక టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పారీ్టలను వీడి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. ప్రచారంలో బీజేపీ అంటీముట్టనట్టు ఉండటం, జనసేనలోని వర్గాలు కలిసిరాకపోవడంతో టీడీపీ నాయకుల వెన్నులో వణుకు మొదలైంది. నాలుగోసారి నియోజకవర్గానికి ఎన్నికలు పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య కృష్ణా జిల్లాలోనే అత్యధికం. ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు తాజాగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,94,928 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,42,349 మంది, మహిళలు 1,52,577 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. నియోజకవర్గ పునరి్వభజన ప్రక్రియతో 2009లో కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాలతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పాటైంది. ఆయా మండలాలతో పాటుగా ఉయ్యూరు నగర పంచాయతీ, తాడిగడప మునిసిపాలిటీ కూడా ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. నియోజక వర్గంలో ఇప్పటి వరకూ 2009, 2014, 2019లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నాలుగో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 177 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ 31,448 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2019లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 11,317 ఓట్ల మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. ఈ దఫా పెనమలూరు స్థానం కోసం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్తో పాటు మరో తొమ్మిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. బోడె.. నీకో దండం ‘టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ వ్యవహారశైలిలో ఇప్పటికీ మార్పులేదు. కనీసం కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించడంలేదు’ అని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ఇదెక్కడి గోల. ఆయనకో దండం. ఇష్టం లేకున్నా కొనసాగుతున్నాం అంటూ ఆ పార్టీ శ్రేణులే మధనపడుతున్న పరిస్థితి. కూటమి నేతృత్వంలో చేపడుతున్న ప్రచారానికి స్పందన అంతంత మాత్రంగా ఉంటోంది. అధికారం లేకున్నా ఐదేళ్లు ప్రజలతోనే ఉన్నానని అండగా నిలవాలని ప్రచారంలో గొప్పగా చెప్పుకొంటున్నారు. 2014 నుంచి 2019 వరకూ కేవలం కొద్ది మంది అనుయాయులను పక్కనపెట్టుకుని అందలం ఎక్కించారంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. ఇసుక విక్రయాలు, మట్టి అక్రమ వ్యాపారం, సెక్స్రాకెట్, కాల్ మనీ, బిల్డర్ల నుంచి అక్రమ వసూళ్లు వంటి అనేక ఆరోపణలు బోడె ప్రసాద్ చుట్టూ ఉచ్చులా బిగుస్తున్నాయి. స్వపక్షంలోనూ విపక్షం ఉండటం, నాయకులు కలిసినా మనసులు కలవకపోవడంతో కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బీజేపీలోని ఓ వర్గం ఇప్పటికే దూరంగా ఉంటోంది. జనసేన వర్గాలు పూర్తిగా కలిసి పనిచేయటం లేదు. సీనియర్ నాయకుడు చలసాని వెంకటేశ్వరరావు (పండు) వర్గానికి అన్యాయం జరగడంతో ఆయన కుమార్తె చలసాని స్మిత, గౌతమ్, ఆమె వర్గం టీడీపీకి షాక్ ఇచ్చింది. వారంతా వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారు. స్థానికుడు అన్న ఒక్క అనుకూలం తప్ప బోడె ప్రసాద్కు మిగిలినవన్నీ ప్రతికూల అంశాలే. తొలుత సీటు ఖరారు కాక అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తాననడం, ఆఖరికి ఎన్ఆర్ఐల పుణ్యమాని సీటు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందంటూ ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఎలాగూ ఎదురుగాలి వీస్తుండటంతో ఇండెంట్ వేసి చందాలు రాబడుతూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టే పనిలో నేతలు ఉన్నారన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. జోగికి ప్రజాదరణ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకి ఫిరాయించటంతో వైఎస్సార్ సీపీ అధిష్టానం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమే‹Ùకు పెనమలూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పటికే జోగి రమేష్ ప్రజలకు చేరువయ్యారు. ఆయన పారీ్టలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. వైఎస్సార్ సీపీ విజయాన్ని కాంక్షిస్తూ జోగి కుటుంబం యావత్తూ ప్రచారాన్ని సాగిస్తూ ప్రజాదరణ చూరగొంటోంది. సమస్యలు విన్న వెంటనే ‘నేనున్నా.. పరిష్కరించే బాధ్యత నాది’ అని జోగి భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ విధానాలు నచ్చి, టీడీపీ, జనసేన పక్షాల్లో ఇమడలేక అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటికే వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ బలోపేతంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అర్హులందరికీ అందించింది. పాలనను గ్రామస్థాయికి తీసుకొచ్చింది. వలంటీరు వ్యవస్థ ద్వారా సంక్షేమాన్ని గడపకు చేర్చి అన్ని వర్గాల సంక్షేమానికి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పాల్పడుతోంది. ఇవన్నీ జోగికి అనుకూల అంశాలు. -
ప్రజలను వెధవలు అంటారా?
పెనమలూరు: ‘రాష్ట్ర ప్రజలను వెధవలు అని కించపరుస్తారా... ఇది మీ పెత్తందారి ఆలోచనలకు నిదర్శనం...’ అని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణాజిల్లా గంగూరులోని తన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం దెబ్బతీసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరూ సీఎం వైఎస్ జగన్ వైపే ఉన్నారని, రాష్ట్రానికి మళ్లీ జగనన్న సీఎం అవుతారని అనేక సర్వేలు స్పష్టంచేశాయని చెప్పారు. దీంతో టీడీపీ దిక్కుతోచక అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందన్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం రంగంలోకి వచ్చిందని, ప్రజలను డబ్బులతో ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ ప్రయత్నంలో ‘డబ్బుతో ఓట్లు కొనవచ్చు... తెలుగు ప్రజలు వెధవలు...’ అంటూ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం చేసిన ప్రసంగాన్ని జోగి రమేష్ మీడియాకు చూపించారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే చదివి, విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకున్న తరువాత తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మాట్లాడటం దారుణమని, ఇది పెత్తందారుల మనస్తత్వానికి నిదర్శమని మండిపడ్డారు. కోమటి జయరాం, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలపై ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఎన్ఆర్ఐలు చంద్రబాబును నమ్మి రాజకీయాల్లో తలదూర్చి అక్రమాలకు పాల్పడితే నట్టేట ముంచుతాడని జోగి రమేష్ హెచ్చరించారు. ఎన్ఆర్ఐలు డబ్బు సంచులతో గ్రామాల్లోకి వచ్చి ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే జనం తరిమికొడతారని, దొంగ ఓట్లు వేయటానికి ప్రయత్నిస్తే జైలుకు వెళతారని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో ఓడిపోయి హైదరాబాద్కు పలాయనం చిత్తగిస్తారని, ఇక ఆయన ఎన్ఆర్ఐలను ఎలా కాపాడుతారో ఆలోచించుకోవాలని సూచించారు. ఎన్ఆర్ఐలు తాము పుట్టి, పెరిగి, చదువుకున్న ప్రాంతానికి నిస్వార్థంగా సేవ చేయాలని, స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరారు. పేదలకు మేలు చేస్తున్న సీఎం జగన్కు ఎన్ఆర్ఐలు మద్దతు తెలిపితే ప్రజలందరికి మరింత మంచి జరుగుతుందని చెప్పారు. -
చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయం: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: జూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయమని అన్నారు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మత్రి జోగి రమేష్. ఎన్నికల్లో ఓడిపోయాక, బాబు అండ్ కో.. హైదరాబాద్కు పారిపోతారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్, విలువలు, విశ్వసనీయత లేని రాజకీయ అజ్ఞానులని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగితే అవహేళనగా మాట్లాడటానికి మీకు సిగ్గు లేదా అని మండిపడ్డారు. చంద్రగిరి నుంచి బాబు, భీమవరం నుంచి పవన్ ఎందుకు పారిపోయారని సూటిగా ప్రశ్నించారు. సీఎంపై దాడి జరిగితే అవహేళనగా మాట్లాడతారా?: విజయవాడ నడిబొడ్డున ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై దాడి జరిగితే, ఆ దాడి ఒక డ్రామా అని, పథకం ప్రకారం చేశారని చంద్రబాబు, లోకేష్లు సిగ్గు లేకుండా మాట్లాడతారా?. సంస్కార హీనంగా అవహేళన చేస్తారా? మీరు అసలు మనుషులేనా? ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఇది ఐదు కోట్ల మంది ప్రజలపై జరిగిన దాడి. మరీ ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, ఇతర వర్గాల పేదలపై జరిగిన దాడిగా ప్రజలంతా చూస్తున్నారు. పేదలను నేనున్నాను.. మీకు అండగా ఉంటాను.. అంటూ ప్రతి గడపనూ ఆదుకున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడిని నరరూప రాక్షసులైన నారా చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ అవహేళన చేశారు. వీళ్లు విలువలు, విశ్వసనీయత లేని రాజకీయ అజ్ఞానులు. ఆ బలమైన రాయి కొంచెం కింద కంటికి తగిలి ఉంటే కన్ను పోయేది. అదే కణతకి తగిలి ఉంటే ప్రాణమే పోయేది. ఇలాంటి కోల్డ్ బ్లడెడ్ హత్యలకు పురిగొల్పిన చంద్రబాబు అండ్ కో.. ఈ రోజు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఎవరు దాడి చేశారు..దాడి చేసిన వారి వెనుక ఎవరున్నారు అనేది మొత్తం పోలీసుల విచారణలో బయటకు వస్తుంది. ముందుగానే చంద్రబాబు భుజాలు తడుముకోవడం దేనికీ? కుట్ర కోణమంతా బయటకు వస్తుంది.. చంద్రబాబు కాస్త వెయిట్ చేయాలి. అంత సంఘటన జరిగినా. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు జగనన్నకు మెండుగా ఉన్నాయి కనుక ప్రాణాపాయం తప్పింది. ఆయనకు తలకు గాయమైందని తెలియగానే కోట్లాది మంది ప్రజలు ప్రార్ధనలు చేశారు. జగనన్నపై ప్రేమ ప్రతి గడపలో కనిపించింది. జగన్కు వస్తున్న ఆదరణ చూడలేక విషనాగులు కాటువేయాలని చూస్తున్నాయి సిద్ధం సభలతో బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతుంటే విషనాగులు కాటువేయాలని చూస్తున్నాయి. జైత్రయాత్రను అడ్డుకునేందుకు, చంద్రబాబు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడు. దాడి జరగకముందు రోజే.. ముఖ్యమంత్రిపై రాళ్ళతో దాడులు చేయండి.. కొట్టండి అని బహిరంగ సభలో చెప్పాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంత సంస్కార హీనంగా మాట్లాడాడో ప్రజలంతా చూశారు. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 45 ఏళ్ల అనుభవం దేనికీ పాతిపెట్టడానికా? చంద్రబాబు సభలు పెడితే జనం రాక వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. మిమ్మల్ని చూడ్డానికి ఎవరు వస్తారు? మీ సొల్లు వినీ వినీ జనం విసుగెత్తిపోయారు. జగన్ యాత్రలో కోట్లాది మంది జనం రోడ్ల మీదకు వస్తున్నారు. అక్కచెల్లెమ్మలు, యువకులు యాత్రలో పాల్గొంటున్న తీరు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. రామోజీ, రాధాకృష్ణా..ఆ వచ్చే ప్రజలను కళ్లు తెరిచి చూడండి. జనం రాలేదు..జనం వెళ్లిపోయారంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. పేదల పక్షాన జగనన్న ఉన్నారు. ప్రజలు చంద్రబాబును నమ్మం గాక నమ్మం అని చెప్తున్నారు. చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయింది ఎవరు బాబూ?: చంద్రబాబు పెడనలో నిన్న ఇష్టారీతిన మాట్లాడాడు. అసలు నీ నియోజకవర్గం చంద్రగిరి. నువ్వు పారిపోయింది కుప్పానికి. ఈ ఎన్నికల్లో కుప్పంలో నువ్వు ఓడిపోయి, హైదరాబాద్ పారిపోవడం ఖాయం. నీ పార్ట్నర్ గతంలో ఎక్కడ పోటీ చేశాడు? భీమవరం, గాజువాకలు వదిలి, ఇప్పుడు పిఠాపురం ఎందుకు పారిపోయాడు? పిఠాపురంలో గ్లాసు పగిలిపోతే హైదారాబాద్లో షూటింగులు చేసుకుంటాడు. చంద్రబాబు కొడుకు లోకేశ్..ఎక్కడ పోటీ చేస్తున్నాడు..? మంగళగిరి నీ సొంతమా? దమ్ముగా, ధైర్యంగా ఉన్నాం. జగనన్న సైనికుల్లా ఉన్నాం..ఆయన వెంటే నడుస్తాం. ఆయన్ను ఎవరైనా ఏదన్నా అంటే మీ చెమడాలు వలుస్తాం. జగన్ ఏం చేశారని మీరు అంతగా కడుపుమంటను ప్రదర్శిస్తున్నారో చంద్రబాబు, పవన్లు చెప్పాలి. మీకు చేతగానిది ఐదేళ్లలో ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చేసి చూపించారు. జగన్ మా బిడ్డ, మా పెద్ద కొడుకు అని ప్రజలు చెబుతున్నారు. మాకు ఇళ్లు కట్టిస్తున్నాడు..మా పిల్లల్ని చదివిస్తున్నాడు..మా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాడని ప్రజలు గడపగడపలో చెబుతున్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి-సంస్కరణలు చూసి, దేశమంతా ఏపీౖవైపు చూస్తుంది. దిక్కు మాలిన చంద్రబాబు రేపు..దిక్కు లేని వాడు అవ్వబోతున్నాడు. మే 13న పోలింగ్ స్టేషన్ కు ఎప్పుడు వెళదామా.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరు మోసగాళ్లు.ఢిల్లీ వెళ్లి బీజేపీతో కలిశారు. కొత్తేముంది..2014లోనూ మీరు ముగ్గురేగా పోటీ చేసింది. గెలిచిన తర్వాత ముగ్గురూ తిట్టుకుని.. మూడు ముక్కలయ్యారు. పవన్ కల్యాణ్ను చంద్రబాబు ఇతను పెద్ద పుడింగా..ఇతని వల్ల మేం గెలిచామా? అని తిట్టారు. చంద్రబాబేమో, మోడీని, వారి కుటుంబ సభ్యులందరినీ తిట్టాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మీరు కలుస్తారు? సిగ్గుందా? జూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం: మీరు బంగాళాఖాతంలో కలపడం కాదు..రేపు ఫలితాల తర్వాత టీడీపీ, జనసేన పార్టీల అడ్రస్ గల్లంతు కాబోతుంది. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కల్యాణ్..ఇద్దరూ ఓడిపోయి హైదరాబాద్ పారిపోబోతున్నారు. మనసు పెట్టి ప్రజల మనసులు గెలుచుకున్న నాయకుడు జగన్ గారు. 3648 కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల సంకల్పాన్ని మేనిఫెస్టో చేసుకుని ముందుకెళ్లారు. ఆ మేనిఫెస్టో ప్రతి గడపకు చేరింది కాబట్టే వారు జగన్ గారిని ప్రతి గుండెలో పెట్టుకున్నారు. చంద్రబాబు ఖతం అయిపోబోతున్నాడు. టీడీపీ వారికి చెప్తున్నా. చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయం. ఆ విషయం తెలుసుకుని చాలా మంది ఆ రెండు పార్టీల నుంచి మావైపు వచ్చారు. ఇప్పుడు జనసేన, టీడీపీ కాళీ అయిపోతున్నాయి. మిగిలిన వారికి కూడా చెప్తున్నా.. జగనన్న వెంట నడవండి. ప్రజా సేవలో మమేకం కండి. జగన్ పార్టీ చూడడం లేదు..మతం, కులం ఏమీ చూడటం లేదు. చంద్రబాబును నమ్మొద్దు..అతను పెద్ద మోసకారి. పార్టీ పెట్టిన వ్యక్తినే పైకి పంపించిన ఘనుడు. చివరికి జూనియర్ ఎన్టీఆర్ను కూడా వెన్నుపోటు పొడిచాడు. అతని సినిమాలు ఆడనివ్వకుండా చేశాడు. చంద్రబాబును ప్రజలు బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పాటికే సర్వేలన్నీ చెప్తున్నాయి. జగన్ గారిది వన్సైడ్ వార్ అని స్పష్టంగా చెప్తున్నారు. వైఎస్సార్సీపీ 175కి 175 స్థానాల్లో విజయఢంకా మోగించబోతోంది. -
కుప్పంలో బాబు, పిఠాపురంలో పవన్ అడ్రస్ గల్లంతే
-
సీఎం జగన్ పై దాడి...జోగి రమేష్ ఆగ్రహం
-
ఆ విషయం బాబుకు తెలుసు కాబట్టే బీజేపీతో పాట్లు
-
విలువలు లేని దుర్మార్గుడు చంద్రబాబు
కంకిపాడు: రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని దుర్మార్గుడు, మోసగాడు చంద్రబాబు అని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ధ్వజమెత్తారు. మామకు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో సీఎం అయ్యారన్నారు. సూట్కేస్లకు సీట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జోగి రమేశ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఉయ్యూరు ప్రజాగళం సభలో చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాబు రోడ్షోకు, ఉయ్యూరు సభకు జనం నుంచి ఏ మాత్రం స్పందన లేదన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో, పొర్లాడతాడో, తెగతెంపులు చేసుకుంటాడో, కాళ్ల బేరానికి వెళ్లి కాళ్లు పట్టుకుంటాడో తెలియదని ఎద్దేవా చేశారు. పనికిమాలిన రాజకీయాలు చేసే ఘనత ఆయనకే సొంతమన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడటం కాదని, కనీసం కుప్పంలో అయినా ఎమ్మెల్యేగా గెలవటం కోసం ఆరాటపడుతున్నారన్నారు. అయితే కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు. వెన్నుపోటు రాజకీయాలపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. యూత్ కాంగ్రెస్ నేతగా, వంగవీటి మోహన రంగా అనుచరుడిగా రాజకీయంగా ఎదిగానన్నారు. వైఎస్సార్ మనసు గెలుచుకున్నానని, జగనన్న పక్కన చోటు దక్కించుకున్నానని తెలిపారు. చంద్రబాబులాగా దొడ్డి దారిలో తాను ఏ పదవీ పొందలేదన్నారు. ఎమ్మెల్యే పార్థసారథి పెనమలూరు సీటు ఆశిస్తే అడ్డంగా మోసం చేసి నూజివీడు పంపలేదా? అని నిలదీశారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన బీసీ నేత కొనకళ్ల నారాయణకు కనీసం సీటు కూడా ఇవ్వకుండా మోసం చేయలేదా? అని ప్రశ్నించారు. బోడె ప్రసాద్ ఇక్కడ గెలవలేడని, కాల్మనీ, సెక్స్ రాకెట్ అభియోగాలు ఉన్నాయని పక్కనపెడితే ఆయన కుటుంబం అంతా కన్నీరుమున్నీరుగా ఏడ్చింది చంద్రబాబు వల్ల కాదా? అని మండిపడ్డారు. మైలవరం సీటు రూ.100 కోట్లకు చంద్రబాబు అమ్ముకున్నాడని దేవినేని ఉమా విమర్శించలేదా? అని ప్రశ్నించారు. మోసపూరిత, వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబని నిప్పులు చెరిగారు -
చంద్రబాబుకు జోగి రమేష్ సవాల్
-
పెనమలూరులో మళ్లీ వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరవేస్తాం
-
పవన్ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ ఫైర్
-
పవన్ కు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్
-
బీసీ డిక్లరేషన్ పేరిట బాబు, పవన్ మరో మోసం
సాక్షి, అమరావతి: బీసీ డిక్లరేషన్ అబద్ధాల వీరులు చంద్రబాబు, పవన్కళ్యాణ్ మరో మోసానికి తెర తీశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు–బ్యాక్ బోన్ క్లాసులనే వైఎస్సార్సీపీని కాపీ కొట్టారని ధ్వజమెత్తారు. ఈ మేరకు వారిద్దరూ మంగళవారం ప్రకటన జారీ చేశారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులని వైఎస్సార్సీపీ 2019 ఎన్నికల ముందు ఏలూరు డిక్లరేషన్లో చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా బీసీలకు 143 వాగ్దానాలిచ్చిన టీడీపీ అందులో ఒకటి కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు 50 ఏళ్లకే పెన్షన్, బీసీ సబ్ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు సహా పలు కల్లబొల్లి హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ వర్గం ప్రజలు బాబు, పవన్ను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్కు ఎలాంటి విలువ లేదన్నారు. 40 ఏళ్ల బాబు రాజకీయ జీవితంలో బీసీల్ని బాగా వాడుకుని చివరికి కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెల కులాలుగా అవమానించే సంస్కృతి నుంచి బయటపడలేదన్నారు. రూ.2.55 లక్షల కోట్ల జమ గడచిన 57 నెలల పాలనలో తమ ప్రభుత్వం డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు జమ చేసిందని మంత్రులు చెల్లుబోయిన, జోగి రమేష్ గుర్తు చేశారు. అందులో బీసీలకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.1.71 లక్షల కోట్ల మేర మేలు చేశామన్నారు. బాబు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్ల మేర మేలు చేస్తామంటున్నారని, ఈ లెక్కన పరిశీలిస్తే తమ ప్రభుత్వం చేసిన దానికంటే రూ.25 వేల కోట్లు తక్కువే చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. 2014లో బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తానని, చివరకు రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి బాబు దగా చేశారన్నారు. నిరుపేదలైన బీసీల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య, ఇళ్ల పట్టాలు పంపిణీపై కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. బీసీలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందన్న ఘనుడు బాబు అన్నారు. బీసీ అక్కచెల్లెమ్మలకు ఈ రోజు ఇస్తున్న చేయూత వంటి పథకం 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన బాబు ఏ ఒక్క రోజైనా అమలు చేశారా అని నిలదీశారు. -
సామాజిక న్యాయం చేసి చూపించిన ఘనత సీఎం జగన్దే: జోగి రమేష్
-
ఐప్యాక్కి పీకేకు సంబంధం లేదు: మంత్రి జోగి రమేష్
సాక్షి, విజయవాడ: ఒక పీకే(పవన్ కల్యాణ్) అయిపోయాడు.. ఇప్పుడు ఇంకొక పీకే(ప్రశాంత్ కిషోర్) వచ్చాడంటూ.. మంత్రి జోగి రమేష్ విసుర్లు విసిరారు. తాజాగా ఏపీ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మంత్రి జోగి రమేష్ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రశాంత్ కిషోర్కి అసలు ఆంధ్రాలో టీమ్ ఉందా?.. అతను సర్వేలెప్పుడు చేశాడు?. ఐ ప్యాక్ కి ప్రశాంత్ కిషోర్ కి సంబంధం లేదు. ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టేందుకు ఆయనేవో రెండు మాటలు మాట్లాడాడు. ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏమైంది?. ప్రశాంత్ కిషోర్ ని ఎవరూ పట్టించుకోరు. టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్నే పీకే చదువుతున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. .. ‘చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఎంతంది పీకేలు వచ్చినా, చంద్రబాబు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరని.. జగనన్న పాలనను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నార’ని మంత్రి జోగి రమేష్ అన్నారు. -
‘చంద్రబాబు ఫ్యూచర్ భువనేశ్వరి ముందే కనిపెట్టేశారు’
సాక్షి, విజయవాడ: భువనేశ్వరి ఆమె మనసులో మాట బయటపెట్టారని, రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును అసహ్యించుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు. భువనేశ్వరి ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రజల మనసులో ఉన్న ఆకాంక్షను ఆమె గమనించారని మంత్రి వ్యాఖ్యానించారు. భువనేశ్వరి సరదాగా చెప్పిన మాట కాదు.. ఆమె మనసులో ఉన్న భావనే బయటపెట్టారు. 35 ఏళ్ల నుంచి కుప్పానికి చంద్రబాబు ఏం చేయలేదు. చంద్రబాబు కుప్పానికీ పనికిరాడు. రాష్ట్రానికీ పనికిరాడని సొంత భార్యే చెప్పేసింది. సిద్ధాంతం, విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 175 స్థానాల్లో టీడీపీని నిలబెట్టలేని అసమర్ధుడయ్యాడు. టీడీపీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశాడు. పవన్కు 50, 60 పంచాలి.. మరో పార్టీకి ఇంకొన్ని పంచాలనే ఆలోచనలో ఉన్నాడు. చంద్రబాబు దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇవన్నీ గమనించారు కాబట్టే చంద్రబాబును పక్కకు తోసేయాలని భువనేశ్వరి ఆలోచన’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ పనికిరాడు.. ఎన్టీఆర్ కూతురుగా తానే బెటర్ అని భువనేశ్వరి భావిస్తున్నట్లున్నారు. చంద్రబాబు ఓడిపోతున్నాడని భువనేశ్వరి ముందే కనిపెట్టారు. ఎన్టీఆర్ కూతురుగా తనకైనా ఓట్లేస్తారని భువనేశ్వరి అనుకుంటున్నారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం’’ అని జోగి రమేష్ చెప్పారు. ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి? -
మంగళగిరిలో లోకేష్ ని మడతపెట్టి.. మంత్రి జోగి రమేష్ పంచులే పంచులు
-
‘మంగళగిరిలో లోకేష్ను మడత పెట్టేస్తాం’
గుంటూరు: మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సీటులో నారా లోకేష్ పోటీ చేయటం దారుణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జోగి రమేష్ బుధవారం మంగళగిరి వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ లోకేష్ను మడత పెట్టేస్తుందని అన్నారు. వైఎస్సాఆర్సీపీ దెబ్బకు లోకేష్ పారిపోతాడని అన్నారు. మంగళగిరి అని పలకటమే చేతకాని లోకేష్ మంగళగిరిలో పోటీ చేయటమా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి రకరకాల వేషాలలో దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలునిచ్చారు. సీఎం జగన్కు అండగా ఉండాలి.. అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకురావాలని ఎంతోమంది మేధావులు ఆలోచన చేశారని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే మేధావుల ఆలోచనలనకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకొచ్చారు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని.. ఆయనకు అందరూ అండగా ఉండాలని అన్నారు. బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు పేదలకు దేవుడని వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్లోనే సామాజిక న్యాయం అమలవుతుందని తెలిపారు. మంగళగిరిలో బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ చేస్తున్నాడని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అగ్రవర్ణాల సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనపెట్టి మంగళగిరి సీటును బీసీలు కేటాయించారని అన్నారు. వైఎస్సార్సీపీ మరోసారి గెలిపించుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతారని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. దొంగల ముఠా.. పచ్చ మీడియా చెప్పే విషయాలను రాసే కథనాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. -
చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరులో నాపై పోటీ చేసే దమ్ముందా? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. కంకిపాడులో పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు సర్వేలు కూడా చేయించుకున్నాడని, ఎవరు పోటీ చేసినా గెలిసేది తానేనన్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్ను ఎదుర్కోలేరు. ప్రతిపక్షాలను కృష్ణా నదిలో కలిపేస్తామన్నారు. ‘‘ప్రజల గుండెల్లో జగన్ నిలిచిపోయారు. ఢిల్లీలో కాంగ్రెస్ పీఠాన్ని వణికించిన ధీరుడు సీఎం జగన్. ఆయనపై సోనియా, రాహుల్ కుట్రలు పన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు. కాంగ్రెస్ ముందుపోటు పొడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలుస్తాం. పెనమలూరు గడ్డ వైఎస్సార్సీపీ అడ్డా’’ అని మంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: షర్మిలకు ఏ అన్యాయం చేశామో.. ఆమె చెప్పాలి: సజ్జల -
ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం: మంత్రి జోగి రమేష్
-
ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం: మంత్రి జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్: ఎక్కడి నుంచైనా తాను పోటీకి సిద్ధమని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సీఎం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కేశినేని నాని నిజం తెలుసుకొని, సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు వైఎస్సార్సీపీలో చేరారని తెలిపారు. నందిగామలో జగనన్న వాకింగ్ ట్రాక్ను మంత్రి జోగి రమేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, తదితర నేతలు పాల్గొన్నారు. సుమారు రూ. కోటి రూపాయల వ్యయంతో 700 మీటర్ల వాకింగ్ ట్రాక్ను ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేశినేని నానికి వైఎస్ జగన్పై అభిమానం ఉన్నా..చంద్రబాబు తిట్టమని చెప్పడం వల్లే సీఎంపై విమర్శలు చేశారని మండిపడ్డారు. నానికి విజయవాడ ఎంపీ స్థానం కేటాయించినట్లు తెలిపారు. విజయవాడ ఎంపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకోబోతుందని పేర్కొన్నారు. పెనమలూరులో ప్రత్యర్థిగా పార్థసారథి అయినా, చంద్రబాబు అయినా తన పోటీ అక్కడి నుంచే ఉంటుందని స్పష్టం చేశారు. -
ఎన్నికలకు ముందే బాబు, పవన్ అస్త్ర సన్యాసం
సాక్షి, అమరాతి: ప్రజల్లో గుర్తింపు లేని చంద్రబాబు, ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపులేని పవన్ కళ్యాణ్.. వారిద్దరూ కలిసి వైఎస్సార్సీపీని ఏం చేయగలరని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. అన్ని స్థానాల్లో పోటీ చేసే దమ్ము జనసేనకు ఉందా అని పవన్ను నిలదీశారు. ఓటమికి కారణాలను ముందే వెతుక్కుంటున్నారని, ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి ఐదేళ్ళు అయిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి ఖాయమని, కుప్పం ప్రజలు తరిమికొడతారని ఆయనకు తెలిసిపోయిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ను ఎదుర్కోలేమని తెలిసి ఇద్దరూ కలిసి ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్నారని అన్నారు. ఒక రోజు లక్షల ఓట్లు తొలగించారని, మరో రోజు లక్ష ఓట్లు జోడించారని ఎల్లో మీడియాతో పచ్చి అబద్ధాలు రాయిస్తున్నారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక ఎన్నికల కమిషన్కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. అసలు 175 నియోజకవర్గాలలో పోటీ చేయటానికి టీడీపీ, జనసేనకు అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ... దళితులను అక్కున చేర్చుకున్న నేత సీఎం జగన్ అని అన్నారు. చంద్రబాబు దళితులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు మాత్రమే చేస్తారని, చేసే మేలేమీ ఉండదని విమర్శించారు. దళితులపై పవన్ ఆరోపణలు సరికాదన్నారు. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ముందుగానే దొంగ ఓట్లు అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, రాజశేఖర్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు
-
జనసేనకు ఎలక్షన్ కమిషన్ దగ్గర గుర్తింపు లేదు: జోగి రమేష్
-
‘బాబూ.. ఆ సీటు అమ్ముకున్నావా? లేదా..?’
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబును బీసీలెవ్వరూ నమ్మరని, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. నిన్నటి దాకా తన సొంత సామాజికవర్గం తప్ప మిగతా సామాజిక వర్గాల వారందర్నీ చంద్రబాబు హీనంగా, చులకనగా చూశాడు. ఇప్పుడేమో రేపోమాపో ఎన్నికలగానే మళ్లీ ఆయన వేషం మార్చాడంటూ మంత్రి దుయ్యబట్టారు. పెడనలోని మార్కెట్ యార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. బీసీలపై చంద్రబాబు దొంగ ప్రేమ: మీ తోకలు కత్తిరిస్తాం.. అంతుచూస్తానంటూ.. బీసీల్ని బెదిరించిన ఈ చంద్రబాబు మళ్లీ ఇప్పుడు బీసీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడు. ఈ రోజు జయహో బీసీ పేరిట పార్టీ కార్యక్రమం పెట్టుకుని అందులో ఆయనతో పాటు అచ్చెన్నాయుడు, బండారు సత్యన్నారాయణ, ఇంకా కొంతమంది బీసీలకేదో చేసినట్టు పెద్దపెద్దగా రంకేలేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు బీసీల విషయంలో ఎంతగా పశ్చాతాప్తం పడ్డా.. వాళ్ల మాటల్ని బీసీలు నమ్మరు గాక నమ్మరు. బీసీలకు పెద్దన్నగా జగన్కు ఆదరణ: అణగారిన వర్గాలు, బడుగు, బలహీనవర్గాల్ని గుర్తించి వారిని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తెచ్చి అక్కునజేర్చుకుని బీసీలకు పెద్దన్నగా నిలిచిన సీఎం జగన్. అందుకే, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలంతా జగనన్న పట్ల ఆదరణ చూపుతూ మళ్లీ మా సీఎం నువ్వేనన్నా అని అంటున్నారు. 75 సంవత్సరాల దేశ చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నిలబెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే.. ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అని చెప్పుకోవాలి. గర్వంగా చెప్పుకుంటున్నాం... కేబినెట్లో 25 మంది మంత్రులుంటే.. అందులో 17 మందిని నాతో సహా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులిచ్చి గౌరవించిన ఘనత మన ముఖ్యమంత్రి జగనన్నకే దక్కుతోంది. 9 రాజ్యసభ స్థానాల్లో 4 స్థానాల్ని బలహీనవర్గాలకు కట్టబెట్టి బీసీల్ని అగ్రస్థానంలో నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకులు మా జగనన్న అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎస్సీల రాజ్యసభ్య సీటును అమ్ముకున్న నీచుడు చంద్రబాబు: చంద్రబాబు రాజ్యాంగ పదవుల నియామకంలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపుసోదరులందరినీ మోసం చేశాడు. ఎస్సీ సామాజికవర్గానికి రాజ్యసభ స్థానం కేటాయిస్తామని.. తెలుగుదేశం పార్టీ సీనియర్గా ఉన్న వర్ల రామయ్య గారికి కబురు పంపితే.. పాపం, ఆయన భారీ ర్యాలీగా విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ దగ్గరకు వచ్చేలోగానే.. ఆ రాజ్యసభ సీటును నీ సామాజికవర్గానికి చెందిన కనకమేడల రవీంద్రనాథ్కుమార్కు అమ్ముకున్నావా..లేదా..? అనేది చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్ చేస్తున్నాను. మోసానికి కేరాఫ్ చంద్రబాబు: చంద్రబాబు పేరు చెబితే మోసం గుర్తుకొస్తుంది. సుదీర్ఘ కాలం రాజకీయం అనుభవం ఉందని చెప్పుకుంటున్న ఆయన 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క అక్కచెల్లెమ్మల ఖాతాల్లోనైనా ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి జమ చేశాడా..?. డ్వాక్రా అక్కచెల్లమ్మలకు రుణమాఫీ అని చెప్పి చేతులెత్తిపోయాడు. ఆయన ఎగొట్టిన రుణమాఫీని వైఎస్ జగన్ వచ్చాక అమలు చేసిన పరిస్థితి మీ అందరూ గుర్తుచేసుకోవాలి. అదే విధంగా రైతుల్ని కూడా రుణమాఫీ పేరిట నిలువునా ముంచిన వ్యక్తి చంద్రబాబు. ఆయన పాదం పెడితేనే పచ్చని పంటలు కూడా నిలువెల్లా మాడిమసైపోతాయి. చంద్రబాబు ఉంటే కరువు.. కరువంటే కేరాఫ్ చంద్రబాబు అనేది గుర్తు. మానవత్వమే జగనన్న కులం: అదే మన జగనన్న అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి నేటి వరకు అంటే 2019 నుంచి ఇప్పటి దాకా ప్రతీ అక్కచెల్లెమ్మలు, రైతులు, అవ్వాతాతలు, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వసంక్షేమం ఎంత జమ అయిందో అందరూ లెక్కగట్టండి. కులం, మతం, రాజకీయం, ప్రాంతం చూడకుండా మన జగనన్న ఇప్పటికీ డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సొమ్ము అక్షరాలా రూ.2.41 లక్షల కోట్లు. జగనన్న మనసున్న మనిషి. మానవత్వమే ఆయన కులం. కనుకే, ఈరోజు అన్ని సామాజికవర్గాల అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతులు, యువత ఆయన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రశ్నిస్తానన్న పవన్కళ్యాణ్ అప్పట్లో ఏం చేశాడు..?: గతంలో చంద్రబాబు నెరవేర్చని హామీలను ఏనాడైనా ప్రశ్నించావా పవన్కళ్యాణ్..?. గతంలో మీరిద్దరూ కలిసే పోటీ చేశారు కదా..? ఇళ్ల స్థలం లేని అక్కచెల్లెమ్మలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఆనాడు హామీలు ఇచ్చారు. మరి, ఆ హామీలు నెరవేర్చారా? దానిపై ఏనాడైనా నీ దత్తదండ్రి చంద్రబాబును నువ్వు ప్రశ్నించావా..?. రైతు రుణమాఫీ అంటూ రైతుల్ని చంద్రబాబు నట్టేట ముంచితే.. ఆ పాపంలో నువ్వు కూడా భాగస్వామిగా ఉండలేదా..?. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేశామని ఎందుకు చేయలేదని చంద్రబాబును ఎప్పుడైనా పవన్ కల్యాణ్ ప్రశ్నించాడా? గ్రామగ్రామాన జగన్ మార్కు ఇది: చంద్రబాబుది దద్దమ్మ పాలన అని పిల్లోడు కూడా చెబుతున్నాడు. అదే మా జగనన్న ముఖ్యమంత్రిగా తన మార్క్ను గ్రామగ్రామాన చూపించారు. ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్ జగన్నన్న మార్క్ కనపడుతుంది. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, నాడు–నేడు ద్వారా రూపురేఖలు మారిన స్కూల్స్, 108, 104.. ఇలా సీఎం జగన్ ముద్ర ప్రతి గ్రామంలో స్పష్టంగా కనపడుతుంది. మరి, రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ ఉందో చూపించండి. అందరం ఏకతాటిపైకొచ్చి బాబు, పవన్లను చిత్తుగా ఓడిస్తాం: చంద్రబాబు అధికార హయాంలో ప్రజల ఖాతాల్లో ఎందుకు ఒక్క రూపాయి కూడా జమచేయలేకపోయాడని అందరూ ఆలోచన చేయాలి. అదే ప్రభుత్వం.. అదే బడ్జెట్. మరి, మా ప్రభుత్వం పేదలకిచ్చిన సొమ్మంతా గత పాలకులు ఏం చేశారు..? అంటే, వాళ్లు దోచేసుకున్నారు.. పంచుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సంక్షేమ లబ్ధిని లెక్కగట్టి.. చంద్రబాబు దవడ పగిలేటట్టు రేపటి ఎన్నికల్లో ఆయనకు అందరూ బుద్ధిచెప్పాలి. ఈ రోజు ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులంతా ఏకతాటిపైకొచ్చి చంద్రబాబు, పవన్కళ్యాణ్లను చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయం. ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్ -
రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ ఎక్కడైనా ఉందా ?
-
చంద్రబాబు కోసం పవన్ ఏ గడ్డయినా తింటారు: మంత్రి జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు ప్రధాని మోదీకి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లేఖ రాయటంపై మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఆ లేఖలో సీబీఐతో పాటు ఈడీ ఎంక్వైరీ చేయాలని పవన్ కల్యాణ్ కోరారు. అసలు జనసేన అధ్యక్షుడు ఏ ఆధారాలతో లేఖ రాశారని జోగి రమేశ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలపై వివరాలను వెల్లడించారు. 30.65 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూస్తున్నాయని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్లలో స్కాం జరిగిందంటూ ప్రధానికి లేఖ రాయటం సరికాదు. ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ రాసిన 13 అంశాలపై మీడియా ద్వారా పూర్తి వివరాలతో సమాధానాన్ని పంపిస్తున్నానని జోగి రమేశ్ తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. అంతా ఆన్లైన్ పేమెంట్లు. మరి, అవినీతికి ఆస్కారం ఎక్కడ పవన్?, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కల్యాణ్కు ఇళ్లు ఉందా? ఆధార్ కార్డు ఉందా? డోర్ నెంబర్ ఉందా? కనీసం ఓటు అయినా ఉందా? ఎంత దుర్మార్గులు మీరు. పచ్చి దుర్మార్గుడు అయిన చంద్రబాబు తాబేదారు పవన్ కల్యాణ్ ఏ గడ్డి అయినా కరవటానికి సిద్ధపడతాడు. 75 ఏళ్ల దేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగనటువంటి అభివృద్ధి, సంక్షేమం నాలుగేళ్ల ఎనిమిది నెలల్లో ఇంత అభివృద్ధి జరుగుతోంది. జగనన్న ముఖ్యమంత్రి కాగానే.. పాదయాత్రలో కష్టాలు, కన్నీళ్లు పడ్డ అక్కచెల్లెమ్మలు, నిరుపేదలు గూడులేక నిరాశ్రయులుగా ఉన్న వారికి సీఎం జగన్ అడ్రస్ ఇచ్చారు. ఎప్పటి నుంచో కలలుగా మిగిలిపోయిన 30.65 లక్షల పేదింటి అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు. అక్కచెల్లెమ్మలకు పట్టాలు ఇవ్వటంతో పాటు ఇప్పటికే వారిలో 21.75 లక్షల మందికి గృహ నిర్మాణం చేపట్టారు. కొన్ని లక్షల అక్కచెల్లెమ్మలు గృహ ప్రవేశాలు చేసుకుని జయహో జగనన్న అని నినదిస్తున్నారు. మరి, ఇందులో స్కాం జరుగుతోందా? ఇంటి నిర్మాణానికి చేతికి డబ్బులు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కటీ ఆన్లైన్ పేమెంట్ జరుగుతోంది. బుర్ర లేకుండా స్కాం అని పవన్ కల్యాణ్ అనటం ఏమిటి? ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియకుండా పేదల గృహాల మీద స్కాం అని లేఖ రాయటమా? గతంలో చంద్రబాబు నెరవేర్చని హామీలను ఏనాడైనా ప్రశ్నించావా పవన్ గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ కలిసే పోటీ చేశారు. ఇళ్ల స్థలం లేని అక్కచెల్లెమ్మలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఆనాడు హామీలు ఇచ్చారు. మరి, ఆ హామీలు నెరవేర్చారా? దానిపై ఏనాడైనా చంద్రబాబును పవన్ కల్యాణ్ ప్రశ్నించాడా? రైతు రుణమాఫీ అంటూ రైతుల్ని చంద్రబాబు నట్టేట ముంచాడు. ఆ పాపంలో భాగస్వామిగా ఉన్న పవన్ ఏనాడైనా ప్రశ్నించాడా? డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేశామని ఎందుకు చేయలేదని చంద్రబాబును ఎప్పుడైనా పవన్ కల్యాణ్ ప్రశ్నించాడా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. దానిపైన చంద్రబాబును ఏనాడైనా పవన్ కల్యాణ్ ప్రశ్నించాడా? 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు ఇళ్లస్థలాలు ఇవ్వలేని దద్దమ్మ. కానీ ఈనాడు సీఎం జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా, ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇంత మంచి చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి పవన్ కల్యాణ్ సెల్యూట్ చేయకుండా స్కాం జరుగుతోందంటూ లేఖలు రాయటం ఏమిటి? రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా సీఎం జగన్ మార్క్ కనిపిస్తుంది. మరి, చంద్రబాబు తన మార్క్ చూపించగలడా?,చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్లు కోరుకున్న గ్రామానికి వెళ్దాం. వారి మార్క్ ఏ ఒక్కటి ఉన్నా చెప్పండి. ఈరోజున రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్ జగన్ మార్క్ కనపడుతుంది. ఇదిగో.. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, నాడు-నేడు ద్వారా రూపురేఖలు మారిన స్కూల్స్, 108, 104.. ఇలా సీఎం జగన్ ముద్ర ప్రతి గ్రామంలో స్పష్టంగా కనపడుతుంది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించటమే కాదు.. చూపిస్తున్నారు. కుప్పంలో ఏ గ్రామానికి అయినా వెళ్దాం. అంతెందుకు నారావారిపల్లెకు వెళ్లినా జగనన్న మార్క్ కనపడుతుంది. మరి, రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ ఉందో చూపించండి. ఇంత కడుపు మంట మీకు ఎందుకు రా బాబూ. రాష్ట్రంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ.... జయహో జగనన్న అంటుంటే.. కడుపుమంట, కడుపు ఉబ్బరంతో ప్రతిపక్ష నాయకులు ఉడికి పోతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ నిరుపేదలపై ప్రతిపక్షాలు ఎందుకు విషం చిమ్ముతున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేశ్ ఎక్కడికంటే అక్కడకి పోదాం. ప్రజలను అడుగుదాం. ఎవరు మేలు చేశారో ప్రజలే చెబుతారు. ఇప్పుడు చంద్రబాబు కుప్పంలో ఎయిర్పోర్టు కడతారంట. కుప్పంలో ఎయిర్పోర్టా? 14 ఏళ్లలో సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశావు చంద్రబాబు. కుప్పంలో పంటలు పండిస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముతారంట. కనీసం కుప్పం ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు చంద్రబాబు ఇవ్వలేదు. ఆర్డీఓ ఆఫీసు తెచ్చుకోలేదు. రెవిన్యూ డివిజనల్ ఆఫీసు జగన్ గారు కుప్పం ప్రజలకు ఇచ్చారు. పేద ప్రజలు ఇళ్లు కట్టుకుని సంతోషంగా ఉన్నా విషం కక్కుతున్నారు. పవన్ కల్యాణ్ లేఖపై చర్చకు సిద్ధం. పవన్ కల్యాణ్ సిద్ధమా? పవన్ కల్యాణ్ లేఖలో ప్రతి అంశం మీద చర్చించటానికి సిద్ధంగా ఉన్నాను. చర్చకు పవన్ కల్యాణ్ రావాలి. ఎక్కడైనా ఒక్క రూపాయి తేడా ఉందో చూపించండి. ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్రానికి రావటం హోటల్లో పడుకోవటం. ఒక గంట కార్యకర్తలతో మాట్లాడి.. 23 గంటలు పడుకోవటం పవన్ కల్యాణ్ చేస్తున్నారు. కాకినాడ చుట్టుప్రక్కల అభివృద్ధి ఎలా జరుగుతుందో వెళ్లి చూడు పవన్ కల్యాణ్. నేడు 17వేలకు పై చిలుకు జగనన్న కాలనీలు కడుతున్నాం. కట్టేవి ఇళ్లు కాదు. ఊళ్లకు ఊళ్లే వేగంగా శరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. పేదల హృదయాల్లో చిరస్థాయిల్లో నిలబడాలని కోరుకుంటున్నాడు కాబట్టే.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. రూ.2.50 లక్షల కోట్లు డీబీటీ ద్వారా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అందించారు. ప్రతి ఇంటిలో ఆనందం.. ప్రతి గ్రామంలో అభివృద్ధిని సీఎం జగన్ చేసి చూపిస్తున్నారు. ఇంతకన్నా ఏమి కావాలి? కళ్లు కుట్టి.. కడుపు మంటతో పచ్చ రోగుల్లా.. ప్రధానికి లేఖలు రాస్తున్నారు. పేదల ఇళ్లపై కాదు.. చంద్రబాబు అవినీతిపై ప్రధానికి లేఖ రాయి పవన్ పవన్ కల్యాణ్ లేఖ రాయాల్సింది గృహ నిర్మాణాల మీద కాదు.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం మీదనో.. చంద్రబాబు మీద జరిగిన ఐటీ రైడ్స్ మీదనో లేఖలు రాయాలి. త్వరలో మేం కూడా చంద్రబాబు అవినీతి మీదన లేఖ రాయబోతున్నాం. చంద్రబాబు దోచేసిన స్కిల్ స్కాంలో పవన్ కల్యాణ్కు ఎంత ముట్టింది? పవన్ కల్యాణ్కు ఏ విధంగా మనీలాండరింగ్ జరిగింది. ఎంత ప్యాకేజీ తీసుకున్నాడో లేఖ రాస్తాం. చంద్రబాబు హయాంలో ఐటీ, ఈడీ రైడ్స్ చేస్తే తప్పు. పవన్ దృష్టిలో చంద్రబాబు నోట్లో వేలు పెడితే కొరకలేని వాడు. చంద్రబాబు అవినీతిపై పవన్ లేఖలు రాయడు. ఎందుకు అంటే.. చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నాడు కాబట్టి. గతంలో గ్యాస్కు నెలకు రూ.100 సబ్సిడీ అని రూ.7200 చంద్రబాబు ఎగ్గొట్టాడు. రేపో మాపో ఎన్నికలకు వెళ్తాం. చంద్రబాబు, పవన్ చేసే దుర్మార్గాలు ప్రజలకు తెలియవా? ఇద్దరు కలసి సూపర్ 6 అని మేనిఫెస్టో పెడతారంట. సీఎం కాకముందు ప్రజలు అది ఇస్తా.. ఇది ఇస్తా అని చెబుతారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఫ్రీగా బస్సు ఎందుకు ఇవ్వలేదు. గ్యాస్ బండ్లు ఎందుకు ఇవ్వలేదు. 2014లో గ్యాస్ సిలిండర్కు నెలకు రూ.100లు చొప్పన ఐదేళ్లకు రూ.7200 ఇస్తానని చెప్పి నయాపైసా అక్కచెల్లెమ్మల అకౌంట్లలో వేయలేదు. ఇవాళ గ్యాస్ సిలిండర్లు అంటే అక్కచెల్లెమ్మలు నమ్ముతారా? ఆ గ్యాస్ సిలిండర్లతోనే మిమ్మల్ని కొడతారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే విజయం ప్రతిపక్ష పార్టీలు పొత్తులు.. ఎంతమందితో పెట్టుకున్నా.. వైఎస్ఆర్సీపీని ఇంచు కూడా కదిపించలేరు. 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ విజయదుందిభి మోగించబోతోంది. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇళ్ల స్థలాలుపై వివరాలు ఇవిగో పవన్.. ప్రభుత్వ ఎంత ఇచ్చామో, ప్రైవేటు వ్యక్తుల నుంచి ఎంత భూమి కొనుగోలు చేశామో వివరాలు పంపిస్తున్నాము. ఎక్కడా కూడా నయాపైసా తేడా ఉండదు. పేపర్, పెన్ను ఉందని ఇంగ్లీషులో నాలుగు మాటలు రాసి ప్రధాని మోడీకి పంపించటం కాదు. ప్రధాని మోడీని ఏమి అడగాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ ఇవ్వమని అడగాలి. కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో టీడీపీతో లింకులు. గృహ నిర్మాణానికి ఇస్తున్న డబ్బులు సరిపోవట్లేదు. ఇంకా పెంచమని మోడీని పవన్ కల్యాణ్ అడిగితే ప్రజలు హర్షిస్తారు. గృహాలు కట్టుకుని సంతోషంగా ఉన్న పేదింటి అక్కచెల్లెమ్మలపై కడుపు మంట ఎందుకు? గృహాలు, ఇళ్ల స్థలాల వివరాలను పవన్ కల్యాణ్కు పంపిస్తున్నాం. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక సాధికార యాత్ర చూసిన తరువాత చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చంద్రబాబు పార్టీలో ఏ ఒక్క బీసీలు మిగల్లేదు. గత ఎన్నికల ముందు కూడా జయహో బీసీ అని రాజమండ్రిలో చంద్రబాబు సభ పెట్టాడు. అది అట్లర్ ప్లాఫ్ అయిపోయింది. ఈరోజు బీసీలు ఎవ్వరూ టీడీపీలో లేరు. చంద్రబాబు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా.. ఎన్ని పనికిమాలిన వాగ్ధానాలు చేసినా టీడీపీని బీసీలు ఎవ్వరూ నమ్మరు. ఒకప్పుడు బీసీలు టీడీపీని నిలబెడితే వారిని చంద్రబాబు తన్ని తరిమేశారు. నేడు బీసీలు అంతా సీఎం జగన్ వెంట అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం కావటం ఖాయం. ఇదీ చదవండి: 2023 సుభిక్షం.. సంతోషం -
చంద్రబాబు పొత్తులు..ఏకిపారేసిన మంత్రి జోగి రమేష్
-
మేనిఫెస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా?: జోగి రమేష్ సవాల్
సాక్షి, తాడేపల్లి: తెలుగుదేశం పార్టీకి తెగులు పట్టిందని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ దివాళా తీసిందని అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదనీ తెలుసని ఎద్దేవా చేశారు. పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు వైస్సార్సీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయిందని ఆరోపించటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 99.5% హామీలను అమలు చేసిన నేత సీఎం జగన్మోహన్రెడ్డి అని చెప్పిన జోగి రమేష్.. దీనిని తాము నిరూపిస్తామని తెలిపారు. మేనిఫస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. టీడీపీ 2014 నాటి మేనిఫెస్టో, వైఎస్సార్సీపీ 2019 నాటి మేనిఫెస్టో మీద చర్చకు రాగలరా?అని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని తెలిపారు. మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టే ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్ళి మళ్ళీ ఓట్లు అడగగలుగుతున్నామన్నారు. చరిత్రలో ఎవరైనా ఎన్నికల తర్వాత ఇలా ఇంటికి వెళ్ళి అమలు చేసిన కార్యక్రమాల గురించి చెప్పారా? అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబులాగా మేనిఫెస్టోని నెట్ నుంచి తొలగించలేదని దుయ్యబట్టారు. మేనిఫెస్టోని చించి శనక్కాయల పొట్లాలుగా మార్చలేదని మండిపడ్డారు. 2014లో మేనిఫెస్టోని అమలు చేయలేదు కాబట్టే చంద్రబాబును జనం చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. ‘అసలు చంద్రబాబుకు ఏపీతో ఏం పని?. ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉందా?. ఇల్లు, డోర్ నెంబర్ ఉందా?. ఇలాంటి అడ్రస్ లేని వ్యక్తులు మా గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి. రైతులు, డ్రాక్రా మహిళలకు రుణమాఫీ పేరుతో దారుణంగా మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారు. అలాంటి మోసకారి, దుర్మార్గుడు అయినందునే చంద్రబాబుకు ఈ గతి పట్టింది. 30 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్న జగన్ లాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా?. అసలు చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా?. ‘చంద్రబాబు దిక్కుమాలిన మేనిఫెస్టోని అసలు ఎవరైనా నమ్ముతారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోకాళ్ల మీద నడిచినా ఆ పాపం పోదు. మళ్ళీ ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణమని అంటున్నారు. మేము ఎలాంటి ప్రకటనా చేయకపోయినా మాపై ఆరోపణలు చేస్తున్నారు. రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్, లోకేష్ ఉండేది, తినేది హైదరాబాదులో. అక్కడ కూర్చుని ఏపీలో రాజకీయాలు చేయటం ఏంటి?. ఈ ఎన్నికల తర్వాత వారు ఈవైపు ఇక కన్నెత్తి కూడా చూడరు’ అని జోగి రమేష్ విమర్శించారు. చదవండి: అర్హులకే నంది అవార్డులు.. ఎవరికీ అన్యాయం జరగదు: పోసాని -
ఇద్దరు పీకేలు...పీకేది ఏమీ లేదు..
-
ఓట్ల నమోదులో టీడీపీ ఓవరాక్షన్.. ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర సంఘం ప్రతినిధులను వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. ఈసీ ప్రతినిధులను జోగి రమేష్, పేర్ని నాని, కొఠారు అబ్బయ్య చౌదరి కలిశారు. ఈ సందర్బంగా ఓట్ల నమోదులో టీడీపీ చేస్తున్న అవకతవకలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేశారు. అనంతరం, మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో ఓట్ల నమోదులో టీడీపీ చేస్తున్న అవకతవకలపై ఫిర్యాదు చేశాం. తెలంగాణలో ఓట్లు ఉన్న వాళ్ళకి ఇక్కడ తొలగించాలని కోరాం. అక్కడ ఓటు హక్కు వినియోగించి మళ్ళీ ఇక్కడ ఓటు నమోదుకు టీడీపీ ప్రయత్నం చేస్తోంది. డబుల్ ఎంట్రీ క్రిమినల్ చర్య. దీని కోసం హైదరాబాద్లో టీడీపీ క్యాంపెయిన్ చేస్తోంది. దానిపై ఫిర్యాదు చేశాం. రాష్ట్ర యంత్రాంగం మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలు మానేసి ఎన్నికల ఫిర్యాదుల్లోనే ఉండాలని టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేస్తోంది. కోనేరు సురేష్ అనే వ్యక్తి ఈ తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాం. కోనేరు సురేష్ తప్పుడు ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆశ్చార్యపోయారు. మై పార్టీ డ్యాష్ బోర్డ్ అనే యాప్లో ఓటర్ లిస్టులో ఫోటోలు, అడ్రస్, కులం అన్ని వివరాలు ఉన్నాయి. దానిపై చర్యలు తీసుకోవాలని కోరాం. టీడీపీ సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం వ్యవహారంపై ఫిర్యాదు చేశాం. టీడీపీ-జనసేన కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని ఫిర్యాదు చేశాం. మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికెళ్లి ప్రలోభాలకు గురి చేస్తుందని ఫిర్యాదు ఇచ్చాం. టీడీపీ మేనిఫెస్టో ప్రచారంతో చంద్రబాబు సంతకంతో లెటర్లు ఇస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. 2019లో ఓటర్ జాబితాలో ఉన్న ఓట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఫేక్ ఓట్లను నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దొంగే దొంగ అన్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు’ అని సైటెర్లు వేశారు. -
రైతులకు అండగా కొడాలి నాని మరియు పేర్ని నాని
-
ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పించడంలో సిద్ధహస్తులు. ప్రజలను ఏ విధంగా మోసం చేయాలనేది టీడీపీ ఆలోచన’’ అంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. టీడీపీ నేతలు అక్రమ మార్గంలో గెలిచేందుకే ప్రయత్నిస్తున్నారు. చాలమందికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించాలని ఈసీని కోరాం. ఎవరికైనా సరే ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి’’ అని వైఎస్సార్సీ నేతలు పేర్కొన్నారు. హైదరాబాద్, ఏపీలో 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయి. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్కు అందించాం. డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరాం. దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానం. ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం. -మంత్రి జోగి రమేష్ ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా. ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి. టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుంది. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు తాను చేసిన తప్పులు ఇతరులపైకి నెడతారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్ధాలు చెప్పాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. -మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇదీ చదవండి: బాబు కోసం ఇంత బరితెగింపా!? -
ఒకరికి ఒక చోటే ఓటుండాలి
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యంలో ఒకరికి ఒకచోట మాత్రమే ఓటు ఉండాలని.. ఇది వైఎస్సార్సీపీ సిద్ధాంతమని మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్ స్పష్టం చేశారు. ఓటర్ల ముసాయిదా జాబితాలో కొందరికి రెండు, మూడుచోట్ల ఓట్లు ఉన్నట్లు తాము గుర్తించామన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు విదేశాల్లో ఉన్న వారికి సైతం ఇక్కడ ఓట్లు ఉన్నాయన్నారు. వాస్తవానికి ఆధార్ కార్డు ఎక్కడ ఉంటే.. అక్కడే ఓటు హక్కు ఉండటం న్యాయమని స్పష్టం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ నాయకుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాను కలిసి ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలు, డూప్లికేట్ ఓట్లు, డీ రిజిస్ట్రేషన్ (తెలంగాణ), ఓటర్ల రీఎన్రోల్మెంట్ (ఆంధ్రప్రదేశ్) అంశాలపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖేష్కుమార్ మీనాను కలిసి వినతిపత్రం సమర్పించారు. తొలగించారని ఒకరోజు.. చేర్పించారని మరో రోజు: మంత్రి రమేష్ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి ఒకచోట మాత్రమే ఓటు ఉండాలని.. కానీ.. ఒకే వ్యక్తికి రెండు, మూడుచోట్ల ఓట్లు ఉన్నట్టు తమ పార్టీ గుర్తించిందన్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రెండుచోట్ల కొందరికి ఓట్లు ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇలాంటివి కొన్ని తాము గుర్తించామని.. వాటి గురించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయలేని టీడీపీ నేతలు కొందరు తమ పార్టీపై రోజూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సిబ్బంది లక్షల ఓట్లు తొలగించారని ఒక రోజు.. లక్షల ఓట్లు చేర్పించారని ఇంకో రోజు రాస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామని తెలిసే టీడీపీ అనుకూల పచ్చమీడియా అలాంటి రాతలు రాస్తోందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత 70 రోజులు పత్తా లేకుండా పారిపోయిన లోకేశ్, మంత్రులకు భయం చూపెడతానంటున్నాడని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమన్నారు. పీపుల్స్ యాక్ట్ ప్రకారం చర్యలు కోరాం: మంత్రి మేరుగు నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. గత నెలలో ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండుచోట్ల 16 లక్షలకు పైగా ఓటర్లుగా నమోదయ్యారన్నారు. అలాంటి వాటిని తొలగించాలని కోరామన్నారు. 1950 పీపుల్స్ యాక్ట్ సెక్షన్–17 ప్రకారం ఏ నియోజకవర్గంలో అయినా ఒక వ్యక్తికి ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నారు. దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరుగుతున్నాయని, అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని, అక్కడ ఓట్లు క్యాన్సిల్ చేయించుకుని ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేలా కొందరు చూస్తున్నారన్నారు. పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు ఓటు వేసి.. ఆ తర్వాత మన రాష్ర్టంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే వారిపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని కోరినట్టు వివరించారు. ఈ మేరకు అధికారులకు క్లియర్గా ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం’ అనేది తమ నినాదమన్నారు. యుద్ధానికి రాకుండానే.. అస్త్ర సన్యాసం చేసే సన్నాసులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు, పవన్ కల్యాణే అని మేరుగ ఎద్దేవా చేశారు. -
ప్రజాస్వామ్యంలో ఒకచోటనే ఓటు ఉండాలి: మంత్రి జోగి రమేష్
-
లోకేష్ యువగళం పాదయాత్రపై జోగి రమేష్ అదిరిపోయే సెటైర్లు
-
లోకేష్ ని ఏకిపారేసిన మంత్రి జోగి రమేష్
-
జోగి రమేష్ కుమార్తె పెళ్లి.. దంపతులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంత్రి జోగి రమేష్ కుమార్తె వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. వివరాల ప్రకారం.. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కుమార్తె వివాహా వేడుకకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ వేడుకకు సీఎం జగన్ వెళ్లారు. ఈ సందర్బంగా వేడుకలో వధువు రేష్మా ప్రియాంక, వరుడు అమోఘ్ సతీష్ గుత్తేదార్లను ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వదించారు. -
తణుకులో కదం తొక్కిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం/తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదం తొక్కారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో తాము సాధించిన సాధికారతను ఎలు గెత్తి చాటారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో వేల్పూరు రోడ్డులో యాత్ర ప్రారంభమై నరేంద్ర సెంటర్ వరకు సాగింది. బస్సు యాత్రకు నియోజకవర్గం, పరిసర ప్రాంతాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి బాణసంచా, పూలవర్షంతో బ్రహ్మరథం పట్టారు. తణుకు సెంటర్లో వేలాది జనం సమక్షంలో జరిగిన సభలో మంత్రులు, నేతలు ప్రసంగించారు. రామోజీకి ఎందుకింత కడుపుమంట? : మంత్రి జోగి రమేష్ బడుగు, బలహీన వర్గాలు సాధించిన సామాజిక సా«దికారతను ఓ వేడుకలా నిర్వహిస్తూ చేపట్టిన సాధికార బస్సు యాత్రలపై రామోజీరావుకు ఎందుకింత కడుపు మంట అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడుతూ.. సభ మొదలవ్వడానికి కొన్ని గంటల ముందు ఖాళీ కుర్చీల ఫొటోలు తీసి, సభ అయిపోయి జనాలు వెళ్లాక ఖాళీ కుర్చీ ఫొటోలు తీసి జనాలు రాలేదంటూ రామోజీరావు, రాధాకృష్ణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై అక్కసుతో విషపు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. వెనుక బడిన వర్గాల వారిని చట్ట సభలకు పంపించి వారిని ధైర్యంగా నిలబడేలా చేసింది సీఎంజగన్ మాత్రమేనన్నారు. పేదవాడికి చదువు, వైద్యం అందించిన ఘనత జగన్కు దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. సీఎం జగన్ అందించిన సంక్షేమంలో 80 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దకిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రూపాయి అవినీతికి తావు లేకుండా లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేశారన్నారు. గత ప్రభుత్వాలు అన్నీ కలిపి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, ఒక్క జగన్ హయాంలోనే 2.70 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, వీటిలో 76 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చాయని తెలిపారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్వారానే సాధ్యమైందన్నారు. ఈ సమవేశంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీలు మార్గాని భరత్, నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్పై దేశవ్యాప్తంగా నమ్మకం: అలీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలుకు సూచనగా ఇప్పు డు చేస్తున్నవి యాత్రలు మాత్రమేనని, 2024లో జాతర జరగబోతోందని, ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా) అలీ చెప్పారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో మోత మోగించిన సీఎం జగన్.. ఈ సారి 175కి 175 నియోజకవర్గా లనూ కైవసం చేసుకుంటారని తెలిపారు. సీఎం జగన్పై అందరికీ అపార నమ్మకం ఉందన్నారు. ఆ నమ్మకంతోనే వైజాగ్ సమ్మిట్కు అదాని, అంబానీలతో సహా దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చి ఏపీలో పరిశ్రమలు ఏర్పా టు చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల ప్రతి కుటుంబంలో ఒక్క ఉద్యోగం వచ్చినా ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకుంటుందని, ఇదంతా సీఎం సుపరిపాలనతోనే సాధ్యమైందన్నారు. -
గృహ నిర్మాణశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణం వేగాన్ని పెంచాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 7.43 లక్షల ఇళ్లను అక్కచెల్లెమ్మలకు అందించామన్న అధికారులు.. ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా ముందుకు సాగుతున్నామని అధికారులు తెలిపారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. సీఎం జగన్ మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు. కరెంటు, తాగు నీరు ఉన్నాయా? లేవా? అన్న వాటిపై ఆడిట్ చేయించాలన్నారు. ఇప్పటివరకూ తీసుకున్న రుణాలపై వడ్డీ డబ్బు విడుదలకు సన్నద్ధం కావాలన్న సీఎం.. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్లు సమర్థవంతంగా పనిచేసేలా వారికి తగిన అవగాహన కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన లక్షల విలువైన ఆస్తిని ఎలా నిర్వహించుకోవాలన్న దానిపై వారికి అవగాహన ఇవ్వాలి’’ అని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ జవహర్రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ దీవాన్ మైదీన్, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల -
పొన్నూరు గడ్డపై మంత్రి జోగి రమేష్ మైండ్ బ్లోయింగ్ స్పీచ్
-
సామాజిక న్యాయంలో చరిత్ర సృష్టించిన జగన్
పామర్రు: సామాజిక న్యాయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే చరిత్ర సృష్టించారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొని, అనేక కార్యక్రమాలతో ఈ వర్గాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చి సామాజిక సాధికారత సాధించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ ముఖ్యమంత్రీ ఈ ఘనత సాధించలేదన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం కృష్ణాజిల్లా పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేబినెట్ సహా అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ పెద్ద పీట వేశారని, మహిళలకు 50 శాతం పదవులిచ్చారని అన్నారు. ఇది ఓ చరిత్రగా నిలిచిపోతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు ఊపిరిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ని ప్రజా క్షేత్రంలో ఎవరూ ఓడించలేరని, పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం, చంద్రబాబు, లోకేశ్, రామోజీ, రాధాకృష్ణతో కలిసి ఎన్ని వ్యూహాలు పన్నినా జగన్ ముందు పనిచేయవన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకొన్నారని, సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించి చరిత్ర సృష్టించారని చెప్పారు. రాజ్యసభ సీటిస్తానని ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. అదే సీటును వంద కోట్లకు కనకమేడల రవీంద్రకుమార్కు అమ్ముకున్నారని తెలిపారు. ఇలా అడుగడుగునా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానించిన చంద్రబాబును మరోసారి చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ అక్కున చేర్చుకున్న సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలను కోరారు. ఉన్నత స్థితికి బడుగు వర్గాలు: మంత్రి నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే, జగజ్జీవన్రామ్, సాహూ మహరాజ్, అబ్దుల్ కలామ్ వంటి మహానుభావుల ఆలోచనా విధానాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను ఉన్నత స్థితికి చేరుస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా, రూపాయి లంచం లేకుండా పేదవారి చెంతకు సంక్షేమ పథకాలను చేరుస్తున్నారని అన్నారు. 31 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలిచ్చి వారి కుటుంబాలకు గూడు కల్పించిన సీఎంగా దేశంలోనే రికార్డు సృష్టించారన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యను, అత్యాధునిక కార్పొరేట్ వైద్యాన్ని పేదవారికి అందిస్తున్న ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. 2014లో 648 వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. పైగా, రుణాలు మాఫీ చేస్తానని రైతులు, మహిళలను మోసం చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎందుకూ పనికిరారని అవహేళన చేశారని తెలిపారు. మన విలువలు కాపాడుకోవడానికి 2024లో తిరిగి జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బాబును ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎప్పటికీ క్షమించరు : ఎంపీ సురేష్ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సోమరిపోతులవుతారన్న చంద్రబాబును ఈ వర్గాలు ఎప్పటికీ క్షమించబోవని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఆరు లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన చంద్రబాబు సోమరిపోతు కాదా అని ప్రశ్నించారు. రెండెకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించారో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చెబితే వారు కూడా కోటీశ్వరులు అవుతారని అన్నారు. రూ.370 కోట్లు అవినీతికి పాల్పడిన చంద్రబాబు జైలుకు వెళితే టీడీపీ ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. నిజం గెలవాలి అని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెబుతున్నారని, నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారని అన్నారు. బడుగులను అందలమెక్కిస్తున్న సీఎం జగన్: ఎంపీ మోపిదేవి అనేక పథకాలతో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను సీఎం జగన్ అందలమెక్కిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ మాట్లాడుతూ గతంలో పెన్షన్ కావాలంటే నాయకులకు దండాలు పెడితేనో, టీడీపీ కండువాలు కప్పుకుంటేనే మంజూరయ్యేదన్నారు. సెంటర్లో కనబడి దండం పెట్టకపోతే పెన్షన్ రద్దయ్యేదని చెప్పారు. సీఎం జగన్ పాలనలో కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పధకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, సింహాద్రి రమేష్ బాబు, పేర్ని నాని, ముస్తాఫా, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. -
‘సీఎం జగన్ పాలనే కావాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు’
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు కాదని.. ఒక జాతికి మాత్రమే అధ్యక్షుడు అంటూ మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు అయితే.. తెలంగాణలో పార్టీని ఎందుకు మూసేశారు?. అందుకే చంద్రబాబు వాళ్ల జాతికి మాత్రమే అధ్యక్షుడు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎవరూ బయటకు రాలేదు.. వాళ్ల జాతి తప్ప మరెవరూ బయటికి రాలేదు’’ అని దుయ్యబట్టారు. ‘‘జగనన్న ఈ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రిగా కొనసాగాలనే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించుకుంటున్నాం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండటం చారిత్రాత్మకమైన విషయం. ముక్త కంఠంతో ఈ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు’’ అని మంత్రి చెప్పారు. సీఎం జగన్ పాలన మాకు కావాలి. మా పిల్లల భవిష్యత్తుకు కావాలి. మా కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఎదగడానికి కావాలి. మా ఆరోగ్య పరిరక్షణకు ఔషధంలా పనిచేస్తున్న జగనన్న మాకు కావాలి. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది గడపలకు బటన్ నొక్కి డబ్బులు పంపించారు. ఆ డబ్బుతో మా కుటుంబాలు సంతోషంగా ఆర్థికంగా బాగున్నాయని ప్రతి అక్క, చెల్లి అంటున్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిది సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారు’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. చదవండి: జగనే ఎందుకంటే.. -
‘ప్రజలు ఛీ కొట్టినా నారా లోకేష్కు బుద్ది రాలేదు’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే అర్హత టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు ఉందా? అని ఏపీ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. దొంగచాటుగా మంత్రి అయిన లోకేష్.. కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేదని, ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా లోకేష్కు బద్ది రాలేదని జోగి రమేష్ దుయ్యబట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్కు ఈడీ, ఐటీ ఎవరి పరిధిలో ఉన్నాయో తెలియదా? అని జోగి రమేష్ నిలదీశారు. కక్షసాధింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నరని, చంద్రబాబు పాపం పండింది కాబట్టే దొరికిపోయారని అన్నారు. ‘సీఎం జగన్ హీరో.. లోకేష్ జీరో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని సీఎం జగన్ హీరో అయ్యారు. చంద్రబాబు తప్పు చేయలేదని లోకేష్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? 3,300 కోట్ల దోచుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారు ఆధారాలతో సహా స్కిల్ స్కామ్ కేసులో బాబు దొరికిపోయారు కనుకే జైలుకు వెళ్లాడు. స్కాం బయట పడ్డాక రిమాండ్కు వెళ్లారు. రాజ్ భవన్ బయట లోకేష్ గుక్కపట్టి ఏడుస్తున్నాడు. చంద్రబాబుని అరెస్టు చేశారనీ, జైలుకు పంపారని ఏడుపు మొదలెట్టాడు. అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు. మా ఎంపీలు, ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? గవర్నర్కు ప్రజాస్వామ్యం, చట్టం గురించి తెలియదని లోకేష్ అనుకుంటున్నారు. సిద్దార్దలూత్ర లాంటి గంటకు కోటన్నర తీసుకునే లాయర్లతో వాదించినా ఎందుకు బెయిల్ రాలేదు?. కన్ను బాగలేదు, కాలు బాగులేదని చెప్పుకుని బయటకు వచ్చారు. చంద్రబాబుకు మెడికల్ గ్రౌండ్స్లేనే తప్ప సాధారణ బెయిల్ ఎందుకు రాలేదో తెలుసుకో లోకేష్. మమ్మల్ని తొక్కితాడంట. ఆల్రెడీ మేము తొక్కేసి, తాట తీశాం అన్న సంగతి తెలుసుకో. ఇదే స్కిల్ స్కాంలో ఈడీ అధికారులు నలుగురిని అరెస్టు చేశారని ఎందుకు చెప్పలేదు?. సీఐడీ మా పరిధిలో ఉందన్నావు సరే మరి ఈడీ, ఐటీ శాఖ ఎవరి పరిధిలో ఉంది? చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వలేదా? టీడీపీకి కాదు, తన జాతికి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు. అధికారం ఉంటే మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాదా?. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని వ్యూహాలు వేసినా టీడీపీ అడ్రస్ గల్లంతే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ ఒక తాటి మీదకు వచ్చి జగనే మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఇది గుర్తు పెట్టుకుని లోకేష్ పిచ్చిప్రేలాపనలు మానుకోవాలి’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
చంద్రబాబుకి 25 రోజులే టైం ఉంది: జోగి రమేష్
-
ఏపీలో జైత్రయాత్రలా సాగుతున్న వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర
-
దేశంలో సామాజిక సాధికారత సాధించిన తొలి సీఎం జగన్
అవనిగడ్డ: స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేసి సామాజిక సాధికారత సాధించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన సామాజిక సాధికార సభలో మంత్రి మాట్లాడారు. అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతూ పేదలకు ఉన్నతస్థాయి విద్య, వైద్యాన్ని చేరువ చేశారని చెప్పారు. ప్రతి పేద పిల్లవాడికి ఫీజుల నుంచి చదువుకోవడానికి అవసరమైన అన్ని వనరులు సీఎం జగన్ సమకూరుస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని, వందల కోట్లు తీసుకొని ఆయన సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు అమ్ముకున్నారని విమర్శించారు. సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి చరిత్ర సృష్టించారని చెప్పారు. గతంలో చంద్రబాబు బీసీల తోక కట్ చేస్తానని అన్నారని, ఎస్సీల్లో పుడతారని ఎవరు కోరుకుంటారని హీనంగా మాట్లాడారన్నారు. 2019 ఎన్నికల్లో ఆ బీసీలు, ఎస్సీలే చంద్రబాబు తోక కట్చేశారని చెప్పారు. కాపుల ఆరాధ్య దైవమైన వంగవీటి మోహనరంగాను పొట్టన పెట్టుకున్న చంద్రబాబుకే పవన్కళ్యాణ్ వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా యాదవులకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారన్నారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్కువ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారన్నారు. పౌష్టికాహారం సూచీలో 24వ స్థానం నుంచి 8వ స్థానానికి తెచ్చారని, పేదరికాన్ని 15 నుంచి 6 శాతానికి తగ్గించిన ఘనత కూడా సీఎం జగన్దే అని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ గతంలో ఎందరో మేధావులు సామాజిక న్యాయం కోసం ఎన్నో ఉద్యమాలు చేసినా సాధ్యం కాలేదని, ముఖ్యమంత్రి వైస్ జగన్ దానిని సాధ్యం చేసి చూపించారని చెప్పారు. రూ.2.40 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో జమ చేయడం, లక్షలాది అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ స్ధలాలు, నాడు – నేడు ద్వారా విద్య, వైద్య రంగాలను ఆధునికంగా తీర్చిదిద్దారని తెలిపారు. చంద్రబాబు రాజకీయాలను కలుషితం చేశారని, సీఎం జగన్ సమూలంగా ప్రక్షాళన చేసి, పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారని చెప్పారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి విద్య, అత్యాధునిక వైద్యం, అవినీతి రహిత సంక్షేమం ద్వారా పేదల ఇళ్లల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. మాజీ సీఎం చంద్రబాబు పేదల ఇళ్లలో దీపాలు ఆర్పే వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎన్నో అవమానాలకు గురిచేసి, జైలుకి పంపించారని, అదే వర్గాలను సీఎం జగన్ అక్కున చేర్చుకొని, పార్లమెంట్కు పంపించారని చెప్పారు. పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని చెప్పారు. అమరావతిలో పేదలకు ఇళ్ళ స్ధలాలు రాకుండా కోర్టుల ద్వారా అడ్డుపడిన ఘనుడు కూడా చంద్రబాబే అన్నారు. సీఎం జగన్కు మరోసారి అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతారన్నారు. గతంలో చాలా మంది నాయకులు పేదరికాన్ని తగ్గిస్తామని మాటలే చెప్పారని, సీఎం జగన్ దానిని ఆచరణలో చేసి చూపించారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రశంసించారు. సీఎం జగన్ రూ.2.40 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో జమ చేయడం ద్వారా పేద కుటుంబాలను బలోపేతం చేశారని చెప్పారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సాధికారత సాధించిన ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఓసీకి రిజర్వ్ అయినప్పటికీ, బీసీ అయిన తనకు ఆ సీటు ఇచ్చి సీఎం వైఎస్ జగన్ సామాజిక సాధికారతకు అసలైన అర్ధం చెప్పారని కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక చెప్పారు. 22ఎ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించడంతో పాటు అడిగిన వెంటనే కిడ్నీ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య (నాని), కైలే అనిల్కుమార్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పేదల జీవితాల్లో వెలుగులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రాష్ట్రంలోని పేదల జీవితాల్లో ఇప్పుడే వెలుగులు చూస్తున్నామని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ఫలితమేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం బాపట్ల అంబేడ్కర్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, అగ్రవర్ణ పేదలకు చేసిన మేలును వివరించారు. ఈ సభలో మంత్రి రమేష్ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ సామాజిక ధర్మాన్ని పాటిస్తున్నారని, అన్ని వర్గాలకు మేలు చేకూర్చారని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా బడుగు, బలహీనవర్గాలు సగర్వంగా సామాజిక సాధికార యాత్ర చేసే అవకాశం కల్పించారని తెలిపారు. కేబినేట్లో 15 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారని, దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇంత స్థాయిలో భాగాన్ని ఇచి్చన ముఖ్యమంత్రి లేరని అన్నారు. రాజ్యసభ స్థానాలను చంద్రబాబు రూ.100 కోట్లకు అమ్ముకునే వారని, ఈ రోజున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావును రాజ్యసభ సభ్యులను చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతోందని వివరించారు. మోషేన్ రాజును శాసన మండలి చైర్మన్ను చేశారన్నారు. నెట్లో చూసి ఇంగ్లిష్ నేర్చుకోవచ్చంటున్న పవన్ కళ్యాణ్.. అతని పిల్లలకూ అలానే నేర్పుతారా అంటూ నిలదీశారు. ఈ యాత్రను లోకేశ్ గాలియాత్ర అంటున్నారని, ఇది గాలియాత్ర కాదని, ప్రజా వ్యతిరేకులైన చంద్రబాబు అండ్ కోపై దండయాత్ర అని చెప్పారు. సాధికార యాత్రకు జనం లేరని రాధాకృష్ణ, రామోజీ, టీవీ 5 బీఆర్ నాయుడు ప్రచారం చేస్తున్నారని, వారికి దమ్ముంటే వచ్చి ఈ యాత్రలకు ప్రభంజనంలా వస్తున్న ప్రజలను చూడాలని సవాల్ చేశారు. జగన్ కటవుట్ చూస్తేనే జనం ఇలా వస్తే.. జగనే స్వయంగా వస్తే బాపట్ల పట్టుద్దా అని అన్నారు. ప్రతి కుటుంబానికి లబ్ధి: ఎంపీ మోపిదేవి వైఎస్ జగన్ పాలనలో ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా లబ్ధి పొందిందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేంతవరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగలేదన్నారు. జగన్ పాలనలోనే అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు లభించాయని చెప్పారు. జగనన్న పాలనలో మహిళా ఆర్థికాభివృద్ధి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మహిళా సాధికారిత జగనన్న పాలనలోనే సాధ్యమైందని చెప్పారు. భువనేశ్వరి ఏనాడూ మహిళల కోసం బయటకు రాలేదని, ఈ రోజు అవినీతి చేసి జైలుకు వెళ్లిన భర్త కోసం బయటకు వచ్చి డ్రామాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. జగన్ పాలన దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే కోన రఘుపతి రాష్ట్రంలో వైఎస్ జగన్ అందిస్తున్న పరిపాలన దేశానికే రోల్మోడల్గా ఉందని, దేశం మొత్తం మనవైపే చూస్తోందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెపాపరు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు గురించి జగనన్న ఆలోచిస్తున్నారన్నారు. పేదల గురించి ఇంతగా ఆలోచించే వ్యక్తిని ఇంతవరకు చూడలేదన్నారు. మనకు జిల్లాను ఇచి్చనందుకు, మెడికల్ కళాశాల ఇచ్చినందుకు తిరిగి జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సి ఉందన్నారు. జగనన్నతోనే పేదల అభ్యున్నతి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ పేద పిల్లల ఉచిత చదువుల కోసం, మహిళల ఆర్థికాభివృద్ధి కోసం, ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం కోసం, రైతు భరోసా కోసం మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనుడు జగనన్న అని చెప్పారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అవహేళన చేస్తే.. వైఎస్ జగనన్న ఎస్సీలు మేనమామలని అన్నారని గుర్తు చేశారు. అమరావతి భూములతో చంద్రబాబు అవినీతి చేస్తే, ఆ భూములను పేదలకు పంచిన వ్యక్తి జగనన్న అని కొనియాడారు. చంద్రబాబు రూ.370 కోట్లు కాజేస్తే అది చిన్న అమౌంటేనని పవన్ చెప్పడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. చంద్రబాబు ఎస్సీ, బీసీలను దొంగలని జైల్లో పెడితే జగనన్న ఢిల్లీలో కూర్చొపెట్టారని చెప్పారు. వైఎస్ జగన్కు భయం పరిచయం చేస్తానని లోకేశ్ అంటున్నాడని, సోనియా గాంధీకే ఆయన భయపడలేదని, పిల్లకుంక లోకేశ్ ఎంత అని ఎద్దేవా చేశారు. -
లోకేష్ వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన మంత్రి జోగి రమేష్
-
‘సీఎం జగన్ మమ్మల్ని తలెత్తుకునేలా చేశారు’
సాక్షి, గుంటూరు: జగనన్న పాలనలో సామాజిక సాధికారిత యాత్ర ద్వారా రాష్ట్రానికి జరిగిన మేలును ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్సీసీ సిద్ధమైంది. గురువారం సాయంత్రం తెనాలి రూరల్ కొలకలూరులోని బాపయ్యపేట నుంచి సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, హఫీజ్ ఖాన్,మాజీ ఎంపీ బుట్టా రేణుక , గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, పోతుల సునీత, కల్పలతారెడ్డి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు జెండా ఊపి బస్సు యాత్రను ప్రారంభించారు. బస్సుయాత్ర ప్రారంభించిన అనంతరం కొలకలూరులో కుమ్మర,శాలివాహనులతో మంత్రులు మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. ►కోస్తాంధ్రలో మొట్టమొదటి సామాజిక యాత్ర భేరి మోగించబోతున్నాం. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సామాజిక ధర్మాన్ని జగన్ మోహన్ రెడ్డి పాటించారు. నాలుగున్నరేళ్లలో దమ్ముగా మేం తల ఎత్తుకునేలా చేశారు. మాకు జగన్ మోహన్ రెడ్డి అనే ఒకే ఒక్క నాయకుడున్నాడు. సామాజిక సాధికారిత ద్వారా 175 నియోజకవర్గాల్లో మాకు జరిగిన మేలును వివరిస్తాం. చంద్రబాబు పాపం పండింది. 40 ఏళ్లలో చేసిన అవినీతి బయటపడింది. నారా భువనేశ్వరి నిజం గెలవాలంటూ రోడ్డెక్కారు. నిజం గెలిచింది...నిజం నిగ్గు తేలింది.. కాబట్టే చంద్రబాబు బొక్కలో ఉన్నాడు. 40 ఏళ్లలో చంద్రబాబు వెన్నంటే ఉన్న మీరే చంద్రబాబు పాపాలు చెప్పాలి. వెన్నంటే ఉండి మీ తండ్రికి ఎలా వెన్ను పోటు పొడిచాడో మీరు చెప్పాలి. రెండు ఎకరాలతో రెండు లక్షలు ఎలా దోచుకున్నారో మీరు చెప్పాలి. పేదల కోసం జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారో మేం చెప్తాం రెఢీనా? :::మంత్రి జోగిరమేష్ ►అనునిత్యం ప్రజల వద్దకే పాలన అనేది జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. ఈ నాలుగున్నరేళ్లలో బడుగు,బలహీన వర్గాల స్థితి గతులు ఎలా మారాయో ఈ యాత్రలో చెబుతాం. పేదలకు జరిగిన మేలును చెప్పేందుకు మేం యాత్ర చేస్తున్నాం. ఓ రిమాండ్ ఖైదీ కోసం టీడీపీ నేతలు రోడ్డెక్కారు. తమ వ్యాపారాల కోసం.. గుట్టు బయటపడకుండా ఉండాలనేదే వారి తాపత్రయం. కుంభకోణాలతో చంద్రబాబు అవినీతి పాలన అందించారు. అవినీతి లేకుండా జవాబుదారీగా పాలనను జగనన్న అందించారు. జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలను ప్రజలకు వివరిస్తాం. పేదలకు ఇంగ్లీష్ మీడియం అవసరమా అని ఒకరంటారు. యూ ట్యూబ్ ద్వారా ఇంగ్లీష్ నేర్చికోవచ్చని మరొకరంటారు. పవన్ కళ్యాణ్ కు ఇదే నా సవాల్. పవన్ కు దమ్ముంటే మా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలతో పోటీగా ఇంగ్లీష్ మాట్లాడాలి. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏ ఒక్క ఉపకులాలను కూడా విస్మరించకుండా న్యాయం చేశారు. మీకు మంచి జరిగితేనే ఓటేయమని దమ్ముగా అడుగుతున్నాం :::మంత్రి ఆదిమూలపు సురేష్ -
పేదలమైన మనం పెత్తందారుల కోటల్ని బద్దలు కొడదాం: జోగి రమేష్
-
మా యాత్ర పేదల కోసం.. వాళ్లది జైల్లో ఉన్నవారి కోసం
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ తరపున సామాజిక భేరి మోగించబోతున్నట్లు పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ప్రకటించారు. ఈ సామాజిక భేరి ద్వారా పెత్తందార్ల కోటలు బద్ధలు కొట్టబోతున్నామని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్తోపాటు వైఎస్సార్సీపీ నేతలు పలువురు సామాజిక భేరీ బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నేతలు మీడియాతో మాట్లాడారు. ‘‘ఇచ్చాపురం, తెనాలి, శింగనమలో రణభేరి మోగించబోతున్నాం. పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం జరగబోతోంది’’ అంటూ జోగి రమేష్ వివరించారు. టీడీపీ తరపున నారా భువనేశ్వరి చేపట్ట తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్రపై మంత్రి వ్యంగ్యాత్మక విమర్శలు చేశారు. ‘‘నిజం గెలవాలి అని కాకుండా వారు పాప పరిహార యాత్ర చేస్తే బాగుండు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చేసిన పాపాలకు పరిహారం చేసేలా యాత్ర చేయాలి. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితం గురించి భువనేశ్వరి ప్రజలకు వివరించాలి. మీ నాన్నకు (దివంగత ఎన్టీఆర్) ఎలా వెన్నుపోటు పొడిచారో మీకే బాగ తెలుసు, కాబట్టి ఆ నిజాలు చెప్పాలి. రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలి. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు. పాపం పండినందున కోర్టులు చంద్రబాబుకు రిమాండ్ విధించాయి’’ అని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. జగన్ పాలన.. జనం మెచ్చిన పాలన అని, సామాజిక ధర్మం పాటించిన నాయకుడు జగన్ అని ఆయన సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం పలు కార్యక్రమాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఏకతాటి మీదకు తెచ్చారని, మొత్తం 175 నియోజకవర్గాలలో ఈ విషయాలను వివరించనున్నామని, తద్వారా సామాజిక భేరి మోగించబోతున్నామని ఆయన వివరించారు. ‘‘గురువారం మొదలయ్యే బస్సు యాత్రతో పెత్తందార్ల కోటలు బద్దలు కొట్టబోతున్నాం. జగన్ జనరల్ కేటగిరి నియోజకవర్గాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించారు. నాయకత్వం అంటే అది. జగన్ సామాజిక న్యాయం చేసిన తీరును దేశమంతా చూస్తోంది. మంచి జరిగితేనే మద్దతు ఇవ్వమని కోరుతున్నాం’’ అని జోగి రమేష్ అన్నారు. ► మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ....దళితుల మీద చంద్రబాబు హయాంలో జరిగినన్ని దాడులు మరెప్పుడూ జరగలేదని, వైఎస్సార్సీపీ పాలనలో పేదల బతుకులు మారాయని అన్నారు. తాము పేదల కోసం బస్సు యాత్ర చేస్తుంటే.. జైల్లో ఉన్న వ్యక్తి కోసం వారు యాత్ర చేస్తున్నారంటూ భువనేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తానన్నారు. మత్స్యకారులను తోలు తీస్తానన్నారు. కానీ, జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అక్కున చేర్చుకున్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా పాలన చేస్తున్నారు. మా పాలన నచ్చితేనే మాకు ఓటు వేయమని అడిగే ధైర్యం ఉన్న నాయకుడు జగన్. జగన్ ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆయన పాలన ఉంటేనే పేదలకు బతుకు’’ అని మేరుగ నాగార్జున అన్నారు. ► రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... ‘‘చేసిన మేలు చెప్పుకునేందుకే సామాజిక సాధికార యాత్ర చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్ పాలనలో న్యాయం జరుగుతోంది. బీసీలంటే బాబు క్యాస్ట్ అనే విధంగా చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు’’ అని మండిపడ్డారు. పేదల పిల్లలకు ఇంగ్లీషు మీడియం వద్దని, ఇళ్ల పట్టాలు వద్దనీ, అమరావతిలో పేదలు ఉండడానికి వీల్లేదని చంద్రబాబు ప్రయత్నించారని, వారిని ఆలయాల్లోకి కూడా రానివ్వలేదని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే పేదలకు అవే ఆలయ కమిటీలలో పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ‘‘మన చేయి పట్టుకొని నడిపిస్తున్నది జగనే. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి తర్వాత తప్పించుకునే వ్యక్తి చంద్రబాబు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి జగన్’’ అని మంత్రి ఆదిమూలపు అన్నారు. ‘‘నారా భువనేశ్వరి.. చంద్రబాబు ఎన్టీఆర్ ను ఎలాంటి వేధింపులకు గురి చేశారో చెప్పండి .. ఇప్పటికైనా నిజం చెప్పాలి’’ డిమాండ్ చేశారాయన.. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థపై పవన్ కల్యాణ్ డ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించిన మంత్రి ఆదిమూలపు ఆయనకో ఛాలెంజ్ విసిరారు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న దళిత విద్యార్థులతో పవన్ ఇంగ్లీష్లో మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. ►మాజీ మంత్రి కొలుసు పార్థసారథి కామెంట్స్ ‘‘ముఖ్యమంత్రిగా జగన్ఈ రాష్ట్ర వనరులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కూడా అందించాలని చూశారు. పనులు లేని సమయంలో చేయి చాచి అడుక్కునే పరిస్థితి రాకూడదని సీఎం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. కరోనా సమయంలో తిండిలేక అనేక రాష్ట్రాల్లో ప్రజలు చనిపోయారు. కానీ జగన్ పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి రాలేదు.’’ అని మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ►మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ పాయింట్స్ ఈ సమావేశంలోనే మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ మాట్లాడుతూ గురువారం నుంచి జరిగే బస్సు యాత్రను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. జగన్ సీఎం అయ్యాక అనేక సంస్కరణలు తెచ్చారని, సామాజిక సంక్షేమాభివృద్దిని చేసి చూపించారని కొనియాడారు. వచ్చే ఎన్నికలు పేదలు పెత్తందార్ల మధ్య జరిగేవని స్పష్టం చేశారు. ‘‘సామాజిక న్యాయం కేవలం నినాదం కాదు.. అమలు చేయాల్సిన విధానం. జగన్ పేదల వైపు నిలపడితే, చంద్రబాబు పెత్తందార్ల వైపు నిలబడ్డారు. ఈ యుద్దంలో పేదలు బాగుపడాలంటే జగనే మళ్ళీ సీఎం కావాలి’’ అని ఆకాంక్షించారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం జగన్ సూచించడంతో.. వైఎస్సార్సీపీ సామాజిక న్యాయ యాత్రకు సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సుయాత్ర జరిగేలా ప్రణాళిక రూపొందించింది. ఆదివారాలు మినహా మిగిలిన ఆరు రోజులు యాత్ర కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగనమల నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. బస్సు యాత్ర షెడ్యూల్ అక్టోబర్ 26 – ఇచ్చాపురం, తెనాలి, శింగనమల అక్టోబర్ 27 – గజపతినగరం, నరసాపురం, తిరుపతి అక్టోబర్ 28 – భీమిలి, చీరాల, పొద్దుటూరు అక్టోబర్ 30 – పాడేరు, దెందులూరు, ఉదయగిరి అక్టోబర్ 31 – ఆముదాలవలస, నందిగామ, ఆదోని నవంబర్ 1 – పార్వతీపురం, కొత్తపేట, కనిగిరి నవంబర్ 2 – మాడుగుల, అవనిగడ్డ, చిత్తూరు నవంబర్ 3 – నరసన్నపేట, కాకినాడ రూరల్, శ్రీకాళహస్తి నవంబర్ 4 – శృంగవరపుకోట, గుంటూరు ఈస్ట్, ధర్మవరం నవంబర్ 6 – గాజువాక, రాజమండ్రి రూరల్, మార్కాపురం నవంబర్ 7 – రాజాం, వినుకొండ, ఆళ్లగడ్డ నవంబర్ 8 – సాలూరు, పాలకొల్లు, నెల్లూరు రూరల్ నవంబర్ 9 – అనకాపల్లి, పామర్రు, తంబళ్లపల్లె ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ప్రతిరోజూ యాత్ర ఉంటుంది. మొత్తంగా డిసెంబర్ 31 వరకూ 60 రోజుల పాటు సభలు జరుగుతాయి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్రను నిర్వహించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు. జగనన్న పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ఉద్దేశం. ఎమ్మెల్యేలు, స్థానిక సమన్వయకర్తలు ఈ బస్సు యాత్రకు అధ్యక్షత వహిస్తారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాంలకు సీఎం జగన్ సమన్వయ బాధ్యతలను అప్పగించారు. -
సొల్లు మాటల సోదిగాళ్లు..
-
చంద్రబాబు నిజాయితీపరుడంటూ కబుర్లు చెబుతున్నారు
-
ఆస్తులపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా?: జోగి రమేష్
-
ఆస్తులపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా?: జోగి రమేష్
సాక్షి, అమరావతి: చేతగాని చవట సన్నాసులందరూ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారంటూ ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు నిజాయితీపరుడంటూ కబుర్లు చెబుతున్నారు. ఆవు దూడ మీద, దూడ ఆవు మీద చెప్పినట్టు బాబు, లోకేశ్ ప్రవర్తన ఉంది. తన ఆస్తులపై సీబీఐ విచారణ కోరే దుమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ మంత్రి సవాల్ విసిరారు. ‘‘చంద్రబాబు అరెస్టును ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆయనకు ఎవరైనా మద్దతుగా నిలబడ్డారా?. చంద్రబాబు పెత్తందారుల వైపు నిలబడినందుకే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయింది. సీఎం జగన్ పరిపాలన ఒక సువర్ణయుగంగా ఉందని ప్రజలే చెబుతున్నారు’’ అని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. చదవండి: పవన్ కల్యాణ్ కొత్త ప్లాన్.. బీజేపీ లొంగుతుందా? -
‘టీడీపీ కన్నీటి గాథలకు కరిగిపోయే వారు ఎవరూ లేరు’
మచిలీపట్నం: టీడీపీ కన్నీటి గాథలకు కరిగిపోయే వారు ఎవరూ లేరని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. ప్రజలు టీడీపీని మర్చిపోతారనే భయంతో రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. టీడీపీ ఇచ్చే పిలుపులకి స్పందన కరువైంది. దత్తపుత్రుడు, లోకేష్ ప్రజల సమస్యలపై మాట్లాడటం మానేశారు. టీడీపీ కన్నీటి గాథలకు కరిగిపోయే వారు ఎవరూ లేరు. టీడీపీ పిలుపునకు నియోజకవర్గానికి పదిమంది మాత్రమే వస్తున్నారు. పవన్ ఆవనిగడ్డ సభ ఫ్లాప్ అయ్యింది. పెడన సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది, వారాహి ఫ్లాప్ అవ్వడంతో దానికి పవన్ ప్యాకప్ చెప్పేశారు. సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ ప్రజలకు చేరువైన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వం.’ అని తెలిపారు మంత్రి జోగి రమేష్. కులాల పేరుతో దౌర్జన్యం చేస్తారా? ఆర్థిక నేరాలకు పాల్పడ్డ చంద్రబాబును అరెస్ట్ చేస్తే కులాల పేరుతో దౌర్జన్యం చేస్తారా? అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నారు. మధ్య పానం పెడితే తప్పా.. అంటూ ఆనాడు ఎల్లో మీడియా రాసింది. మద్యపానం నిర్మూలించినది ఎన్టీఆర్ . ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన పదవి లాక్కొని ఆయన ఆశయాలకు తూట్లు పొడిచారు. 1998 లో మధ్యపాననిషేధం ఎత్తి వేయక పోతే ప్రభుత్వం నడపలేమని చంద్రబాబు ప్రకటించి ఎత్తివేశారు. గుడి బడి అని చూడకుండా 4378 ప్రవేట్ వైన్ షాప్లు, 43వేల బెల్ట్ షాప్లు పెట్టారు.ప్రెసిడెంట్ మెడల్, డీలక్స్ విస్కీ, గవర్నర్ విస్కీ, బూమ్ బూమ్ బీర్ 2017లో చంద్రబాబు పాలనలో అనుమతి ఇచ్చారు’ అని తెలిపారు నారాయణస్వామి. -
వైఎస్సార్సీపీ పదాధికారుల సమావేశం.. సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: సోమవారం విజయవాడలో వైఎస్సార్సీపీ పదాధికారుల సమావేశం జరగనుంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ సభకు రాష్ట్ర నలమూలల నుంచి పార్టీ శ్రేణులు భారీగా హాజరుకానున్నారు. మొత్తం 8,222 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. ఐదు కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉండటం చారిత్రాత్మక అవసరం. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అమలుచేయటం సీఎం జగన్కే చెల్లింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయ లేనివి సీఎం జగన్ మాత్రమే చేస్తున్నారు. ఆరోగ్య సురక్షలాంటి కార్యక్రమం అమలు చేయాలనే ఆలోచన రావటమే గొప్ప విషయం. పేదవాడికి ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉండాలనేది జగన్ లక్ష్యం. జైల్లో ఉన్న అవినీతిపరులను ప్రజలు పట్టించుకోవటం లేదు. తమకు ఎవరు న్యాయం చేయగలరో వారికే ప్రజలు పట్టం కడతారు అని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు సీఎం జగన్ తెచ్చారు. గడప గడపకు కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ఇళ్లను నేతలు టచ్ చేశారు. రేపు వైఎస్సార్సీపీ సమావేశానికి 8వేలకుపైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో రేపటి సమావేశానికి ప్రాముఖ్యత ఉంది. ఆరోగ్య సురక్ష ద్వారా పేదలందరికీ వైద్యం అందుతోంది. రేపటి మీటింగ్లో అనేక కీలక అంశాలపై సీఎం జగన్ ప్రసంగిస్తారు. సంక్షేమం, అభివృద్ధి నుండి వైద్యం వరకు ఎన్నో తెచ్చారు. రాష్ట్రం సమగ్రాభివృద్దితో ముందుకు దూసుకుపోతోంది. మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి జగనే సీఎం కావాలి. డబ్బున్న వారికే పరిమితం అనుకున్న కార్పోరేట్ వైద్యం జనం ముంగిటకే వచ్చింది. ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో టీడీపీ ఉంది. చంద్రబాబు అవినీతితో అరెస్టు అయితే, విప్లవకారులను అరెస్టు చేసినట్టు కొన్ని మీడియా సంస్థలు హడావుడి చేస్తున్నాయి. ఇలాంటివన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: టీడీపీ నేత బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా: మంత్రి రోజా -
టీడీపీ, జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు వైరస్: మంత్రి జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: పెడనలో అటెన్షన్ ప్లే చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రయత్నించారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. సినిమా స్టైల్లో రాళ్లదాడి జరగబోతుందంటూ డైలాగులు వేశారని దుయ్యబట్టారు. తీరాచూస్తూ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని మండిపడ్డారు. టీడీపీ, జనసేన కలిసినా రెండు వేలమందిని కూడా జనాన్ని తెచ్చుకోలేక పోయారని అన్నారు.పెడన ప్రజలను రౌడీలు అన్నందుకు పవన్ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ కాదు అది వైరస్ కేవలం రెండు వేలమందితో కూడా సభ పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి విమర్శించారు. అవనిగడ్డలో ప్లాప్ షో నిర్వహించాని అన్నారు. టీడీపీ, జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు అది వైరస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్, చంద్రబాబుక కలయిక విషంతో సమానమని అన్నారు. టీడీపీ, జనసేన కలిసిన తర్వాత మరింత దిగజారిపోయారని మండిపడ్డారు. రెండు చోట్లా ఓడిపోయిన పవన్ నిసిగ్గుగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. పవన్కు సిగ్గు, మనసాక్షి లేదని విమర్శించారు. రౌడీలతో పోల్చుతావా పవన్? ‘మీ వెకిలి వేషాలు చూశాక ప్రజలు నిర్దారణకు వచ్చేశారు. 2014లో మీరు చేసిన స్కాంలను జనం చూశారు. దోచిన సొమ్ము షెల్ కంపెనీలకు పంపిన వైనాన్ని సీఐడీ బయట పెట్టింది. చివరికి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చున్నారున. అత్తారింటికి దారేది సినిమా ఎక్కడో పైరసీ జరిగితే మా పెడన కళంకారీ తమ్ముళ్లను పవన్ కొట్టించారు. కలంకారీ పరిశ్రమ దేశానికే గర్వకారణం. సీఎం జగన్ ప్రభుత్వం ఆ కళాకారులను గౌరవించి సత్కరించింది. అలాంటి వారిని రౌడీలతో పోల్చుతావా పవన్? చదవండి: పరిటాల సునీత, శ్రీరామ్లపై కేసు నమోదు కాపు ప్రజలకు దమ్ము, ధైర్యం ఉంది చంద్రబాబు పాలన అవినీతి రాజ్యం అంటూ గతంలో పవన్ మాట్లాడారు. టీడీపీ ప్రజాద్రోహి అన్నారు. పవన్ సీఎం కావాలంటే మా కులం బ్లడ్ ఎక్కించుకోవాలన్నారు. మొన్న రాజమండ్రి జైల్లో పవన్ ఆ కులం బ్లడ్ ఎక్కించుకున్నారా?. పవన్కు సిగ్గులేనందుక వారి బ్లడ్ ఎక్కించుకున్నారేమో?. కానీ కాపు ప్రజలకు దమ్ము, ధైర్యం ఉంది. పవన్ లాగ వ్యవహరించరు. టీడీపీ వారికి ఇదేం ఖర్మ! వంగవీటి రంగాని ఘోరంగా నరికి చంపిన వారికి పవన్ భుజాన వేసుకొని మోస్తున్నారు. మీలాంటివారిని ప్రజలు నమ్మరుకాక నమ్మరు. చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా, మరికొందరు బ్రోకర్లు పావలాలు పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ వారికి ఖర్మ పట్టింది. పవన్ వారాహి మీద మాట్లాడుతుంటే టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర కింద నిలపడే ఖర్మ పట్టింది. పేదల పక్షాన జగన్, పెత్తందార్ల పక్షాన పవన్, పవన్ భారతీయుడో, రష్యావాడో తెలియదు. రష్యా వాడైతే ఏపీకి రావాలంటే కచ్చితంగా పాస్ పోర్టు కావాల్సిందే. పేదల పక్షాన జగన్, పెత్తందార్ల పక్షాన పవన్, చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు పని అయిపోయిందని పవన్ చెప్తున్నారు. టీడీపీ వారు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోవాలి. చంద్రబాబు, పవన్ కలయిక అపవిత్రమైనది, ఒక విషబీజం లాంటిది. వీరి వలన ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు. 2024 తర్వాత పవన్తో నేను సినిమా తీస్తా. జానీ-కూలీ, గబ్బర్ సింగ్-రబ్బర్ సింగ్ పేరుతో సినిమా తీస్తా’ అంటూ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. -
టిడిపి, జనసేన కలిసిన తర్వాత పెట్టిన మీటింగ్ ప్లాప్ అయింది
-
పెడనలో అల్లర్లకు పవన్ కుట్ర
సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా పెడనలో జరగబోయే వారాహి యాత్రపై దాడిచేసే అవకాశం ఉందంటూ జనసేన అధినేత పవన్కళ్యాణ్ చేసిన పిచ్చివ్యాఖ్యలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. దాడికి యత్నిస్తున్నారంటూ పిచ్చి ఆరోపణలు చేయటంకాదు.. ఆధారాలుంటే నిరూపించే దమ్ముందా? అంటూ ఆయన సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. పెడన ప్రజలు శాంతి కాముకులని.. ఏనాడూ చిన్న హింసకు కూడా పాల్పడలేదని చెప్పారు. అలాంటి వాళ్లు నిన్ను అడ్డుకోవడానికి, నీ సభను చెదరగొట్టడానికి కత్తులు, రాడ్లతో దాడులు చేస్తారని అంటావా? అని జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు నీ వారాహి యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం మాకేంటని మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అవనిగడ్డ సభ ఫ్లాప్తో పవన్లో దిగులు పట్టుకుంది. పెడనలో కూడా బుధవారం జరిగే సభకు ఇలాగే జనం రారని భయపడుతున్నారు. అంగళ్లు మాదిరిగా అక్కడ గొడవల్ని సృష్టించే కుట్రకు తెరతీశారు. అందుకే పవన్ ఇలా మాట్లాడుతున్నారు. జైలులో ఉన్న దత్తతండ్రి మాస్టర్స్కెచ్ ఇది. ఆదిలోనే టీడీపీ, జనసేన పొత్తు వికటించింది. చంద్రబాబుతో జతకు పవన్ ఒక్కడే తహతహలాడున్నారు. అధినేత నిర్ణయాన్ని పవన్ అభిమానులు, జనసేన పార్టీ కేడర్ ఒప్పుకోలేకపోతోంది. ఇక జనసేన పార్టీ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. పవన్ చాప, దిండు సర్దుకుని హైదరాబాద్కు వెళ్లడమే తరువాయి. అవనిగడ్డలో మూడుగంటలసేపు కష్టపడి మీటింగ్ కొనసాగిస్తే కేవలం 300 మంది మాత్రమే సభాస్థలిలో ఉన్నారు. అది కూడా టీడీపీ, జనసేన జతకట్టిన తర్వాత జరిగిన మొట్టమొదటి సభలో. ఇదీ వాళ్ల పరిస్థితి. పార్టీ పరువు పోతుందని జనసేన, టీడీపీ నేతలు తమ కేడర్కు ఫోన్లు చేస్తేనే అంతమంది వచ్చారు. జనసేన అలా చతికిలపడడానికి కారణం టీడీపీతో జత కట్టడమే. అధినేత తీరు వారికి నచ్చడంలేదని దీంతో తేలిపోయింది. పవన్కళ్యాణ్ను నమ్మొద్దు.. గతకాలపు అనుభవాల్ని తెలుసుకున్న తర్వాత కూడా టీడీపీతో జతకట్టి చంద్రబాబును మరోమారు గద్దెనెక్కించేందుకు జనసేన కార్యకర్తలెవరూ సిద్ధంగా లేరు. ఇదే విషయంపై బాహాటంగానే ఆ పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇక ఆ పార్టీ కార్యకర్తలకు, పవన్కళ్యాణ్ అభిమానులకు చెప్పేదేమంటే, ఇప్పటికైనా ఆయన మాటల్లోని మర్మాన్ని అర్థంచేసుకోవాలి. పవన్ను నమ్మితే జనసైనికులు నట్టేట మునిగినట్లే. -
చంద్రబాబుకు ప్రజల్లో సానుభూతి రావడం లేదు..!
-
పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ ఫన్నీ సెటైర్లు
-
రాష్ట్రంలో సైకో పాలన ఎప్పుడో పోయింది: మంత్రి జోగి రమేష్
-
'టీడీపీతో జనసేన పొత్తు.. పిచ్చోడికి మళ్లీ పెళ్లి లాంటిది'
సాక్షి, అమరావతి: టీడీపీతో జనసేన పొత్తుపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఇది పిచ్చోడికి మళ్లీ మళ్లీ పెళ్లి లాంటిదని ఎద్దేవా చేశారు. జైల్లో చంద్రబాబుతో మిలాఖత్ తరువాత లగ్నం కుదిరిందని అన్నారు. తాడు బొంగరం లేని వాళ్లతో పవన్ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతోందని మంత్రి జోగి రమేశ్ అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా సీఎం జగన్పై పవన్ అర్థరహితమైన విమర్శలు చేశారని మండిపడ్డారు. సీఎం జగన్ ఒంటిచేత్తో వైసీపీని స్థాపించారని అన్నారు. విపక్ష నేతగా ఒక్కడే 67 మందిని గెలిపించాడని చెప్పారు. ఆ తర్వాత 151 సీట్లు గెలిపించి సీఎం అయ్యారని అన్నారు. ఇదీ చదవండి: సైకిల్ గుర్తుతో జనసేన పోటీ? -
పిచ్చి కుక్కలా వాగితే జనం బట్టలూడదీసి కొడతారు
-
ఒకరితో సంసారం మరొకరితో పెళ్లి..ఇదేం పవన్ రాజకీయం
-
పవన్, బాబులు కలిసే ఉన్నారు.. ఇప్పుడు కొత్తగా కలవడం ఏంటి?
-
పవన్ పరామర్శకు వెళ్లి పొత్తులు మాట్లాడుకున్నారు: మంత్రి జోగి రమేష్
-
బీజేపీతో సంసారం చేస్తూనే టీడీపీతో పవన్ కలిశారు: మంత్రి జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టై జైలులో ఉంటే.. పవన్ కల్యాణ్ పరామర్శకు వెళ్లి పొత్తులు మాట్లాడుకున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. బీజేపీతో సంసారం చేస్తూనే టీడీపీతో పవన్ కలిశారని విమర్శించారు. స్కిల్ స్కాంలో పవన్ పాత్ర కూడా ఉందని.. చంద్రబాబు తన అవినీతిలో పవన్కు ఎంత వాటా ఇచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాల్లో పవన్ భాగస్వామి కాదా? అని నిలదీశారు. పవన్, బాబులు కలిసే ఉన్నారని.. ఇప్పుడు కొత్తగా కలవడం ఏంటని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసిన అవినీతి ప్రజలందరికీ తెలుసు అని.. చేసిన పాపాలు పండి బాబు జైలుపాలయ్యారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్తో యుద్ధమంటే 5 కోట్ల మంది ప్రజలతో యుద్ధం చేయడమేనని అన్నారు. కోటిమంది డ్వాక్రా అక్కచెల్లెళ్ళపై, 66 లక్షల మంది అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగుల మీద యుద్ధం చేయటమేనని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. చదవండి: అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మంత్రి బుగ్గన సమీక్ష ‘ఇద్దరు మెంటల్ కేసుల మధ్యలో ఒక పీకే కనిపించాడు. పవన్ సినిమా తీయాలనుకుంటే ఇదే పేరు పెట్టుకోవచ్చు. ట్యాగ్ లైన్ కింద బొక్కలో బాబు, 7691 అని పెట్టుకోవచ్చు. చంద్రబాబు పరామర్శకి పవన్ వెళ్లినప్పుడు ఆయన బాగోగులు అడగాలి. జైలులోకి పవన్ వెళ్లేటప్పుడు బీజేపీతో ఉండి.. అక్కడ చంద్రబాబుతో తాళి కట్టించుకుని టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. బయటకు వచ్చాక పొత్తు ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వచ్చాక సినిమా డైలాగులు వేస్తే కుదరదు. తండ్రి జైల్లో ఉంటే కొడుకు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లటానికి సిగ్గుండాలి. తన తండ్రి నిజ స్వరూపాన్ని లోకేష్ జాతీయ స్థాయిలో చెప్తాడంట. ఢిల్లీలో అందరి కాళ్లు పట్టుకోవటానికే లోకేష్ ఢిల్లీ వెళ్లారు. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు. గంటకి కోటిన్నర చొప్పున లాయర్లకి ఇచ్చి వాదించినా కోర్టులు నమ్మలేదు. చంద్రబాబు, పవన్ పొత్తుల గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా?. ఇవ్వాళ కొత్తగా పొత్తు గురించి చెప్పాలా? ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా గోదావరి, కృష్ణానదిలో కొట్టుకుపోవాల్సిందే’నని జోగి రమేష్ దుయ్యబట్టారు. -
2014 నుంచే వీళ్ల బంధం కొనసాగుతోంది: జోగి రమేష్
-
ఐదు లక్షల ఇళ్లు పూర్తి
సాక్షి, అమరావతి : పేదల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డును నమోదు చేసింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్లులేని పేదలకు పక్కా గృహాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని తాజాగా పూర్తిచేసింది. ఈ నెలాఖరులోగా వీటిని పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. సీఎం నిర్దేశించిన లక్ష్యాన్ని ఆ శాఖ విజయవంతంగా ఛేదించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,00,653 ఇళ్ల నిర్మాణాన్ని సోమవారంతో పూర్తిచేసింది. అనతికాలంలోనే రికార్డు.. రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదల సొంతింటి కలను నిజంచేయడానికి 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. దీనికింద 31 లక్షలకు పైగా పేదింటి అక్కచెల్లెమ్మలకు పట్టాలు అందించారు. రెండు దశల్లో 21.25 లక్షలకు పైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇందులో 18.63 లక్షలు సాధారణ ఇళ్లు. వీటిలో 5 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పుడు పూర్తిచేశారు. వీటికి మౌలిక సదుపాయాలు కూడా చకచకా కల్పిస్తున్నారు. పూర్తయిన ఇళ్లకు కరెంటు, మంచి నీటి కనెక్షన్లు ఇస్తున్నారు. అలాగే, 2020 డిసెంబర్ 25న ప్రస్తుత కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో సీఎం జగన్ పట్టాల పంపిణీ చేయడంతో పాటు, పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేవలం రెండేళ్ల ఎనిమిది నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో ఇళ్లు పూర్తిచేసి పేదలకు అందించినట్లు అవుతోంది. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి.. పేదల ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నాటి నుంచి అడుగడుగునా టీడీపీ అడ్డుతగిలింది. కోర్టుల ద్వారా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయకుండా అడ్డంకులు సృష్టించింది. వీటిని అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో టీడీపీ ఏకంగా 2021 అక్టోబర్లో కోర్టులకు వెళ్లి నిర్మాణాలనే అడ్డుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో కొందరు వ్యక్తుల సంతకాలు తీసుకుని, వారి సమ్మతి లేకుండా మోసపూరితంగా కేసులు వేసిన ఘటనలు వెలుగుచూశాయి. పేదలకు వ్యతిరేకంగా టీడీపీ చేసిన కుట్రతో అప్పట్లో ఆరునెలలపాటు ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. మరోవైపు.. నిర్మాణాలు ప్రారంభించిన వెంటనే రెండో దశ కరోనా వ్యాప్తి ప్రారంభం, గత ఏడాది తీవ్ర వర్షాలు, వరదలు ఇలా ప్రకృతి విపత్తులు.. టీడీపీ, ఇతర దుష్టచతుష్టయం రాక్షసబుద్ధిని ఎదురొడ్డి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసింది. అక్కచెల్లెమ్మలకు లక్షల విలువైన ఆస్తి పేదలందరికీ ఇళ్ల పథకం కింద రూ.లక్షల విలువైన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం పేద అక్కాచెల్లెమ్మల పేరిట సమకూరుస్తోంది. ఇందుకోసం అన్ని విధాలుగా సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. ♦ ప్రాంతాన్ని బట్టి ప్రభుత్వం రూ.15 లక్షల వరకు విలువైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసింది. ♦ ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతో పాటు పావలా వడ్డీకి రూ.35 వేల బ్యాంకు రుణం సమకూరుస్తోంది. ♦ అంతేకాక.. ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తున్నారు. ♦ మిగిలిన ఐరన్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రిని మార్కెట్ ధరలకన్నా తక్కువకు సరఫరా చేయడం ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.54,518 మేర అదనపు సాయం అందిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలి.. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఇళ్లులేని ప్రతి కుటుంబానికి పక్కా ఇళ్లు సమకూరుస్తున్నారు. 5 లక్షల ఇళ్లు పూర్తిచేయడానికి అహర్నిశలు కృషిచేసిన గృహ నిర్మాణ, ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు. ఇదే స్పూర్తితో ఇక ముందూ పనిచేయాలి. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. – జోగి రమేశ్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పండుగలా గృహ ప్రవేశాల వేడుకలు.. వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పండుగలా గృహప్రవేశ వేడుకలు చేపట్టనున్నాం.త్వరలోనే ఈ వేడుకలు ప్రారంభిస్తాం. ఒక పెద్ద కాలనీలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా ఇంటి తాళాలు అందజేస్తాం. ప్రజాప్రతినిధులు అన్ని జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. – అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ -
మీ నాన్ననే ఉరికించాం.. నువ్వెంత..: మంత్రి జోగి రమేష్
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారంటూ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నేను నీ ఇంటికే వచ్చా.. మీ నాన్న పారిపోయాడు. మీ నాన్ననే ఉరికించాం.. నువ్వెంత. లోకేష్.. టైమ్, ప్లేస్ చెబితే నీ దగ్గరికే వస్తా.. పాదయాత్ర అంటే బౌన్సర్లను పెట్టుకుని చేయడం కాదు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. సీఎం జగన్ను తిట్టడం, ప్రభుత్వంపై నిందలు వేయడం కోసమే లోకేష్ యాత్ర చేస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు. ‘‘గన్నవరం సభ.. ప్రభుత్వాన్ని తిట్టడం కోసమే పెట్టినట్లు ఉంది. లోకేష్ నోరు అదుపులో పెట్టుకో. పాదయాత్ర అంటే ఏంటో వైఎస్సార్, వైఎస్ జగన్ను చూసి నేర్చుకో. నడవలేని వృద్ధులు సైతం జగన్ పాదయాత్రకు వచ్చారు’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘మీరు పాదయాత్రలు చేసినా.. వారాహి యాత్రలు చేసినా అధికారంలోకి రారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ భీమవరంలో, చంద్రబాబు కుప్పంలో ఒంటరిగా పోటీ చేయాలి’’ అంటూ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. చదవండి: ఆర్జీవీ థర్డ్ గ్రేడ్ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు.. రివర్స్ కౌంటర్ ఇచ్చిన వర్మ -
అమరావతి అందరిదీ
పేద వర్గాలపై పెత్తందారుల దోపిడీలను సహించి భరించే కాలం పోయింది. ఈ మార్పు ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది. అలాంటి మార్పులకు మనసా వాచా కర్మణా సహకరించే ప్రభుత్వంగా, మీ అన్నగా.. నిరుపేద అక్కచెల్లెమ్మల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో ‘సామాజిక అమరావతి’కి పునాదిరాయి వేస్తున్నా. ఇక నుంచి అమరావతి మనందరిది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పేదలకు మేలు జరిగే ప్రతి విషయంలో మనందరి ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పేదలకు మంచి జరగకూడదని రాక్షస బుద్ధితో అడ్డుకుంటున్న వారితో పెద్ద యుద్ధమే చేస్తున్నామన్నారు. సోమవారం సీఆర్డీఏ పరిధిలో పేదలకు 50,793 ఇళ్ల నిర్మాణం, 45 సామాజిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో సీఎం జగన్ మాట్లాడారు. తొలుత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేఅవుట్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వెంకటపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... వెంకటపాలెంలో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం ఆ తర్వాత కూడా బుద్ధి మారలేదు.. సీఆర్డీఏలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇళ్లç స్థలాలు ఇవ్వకుండా, ఇళ్లు కట్టించకుండా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు సృష్టించిన ఊరుపేరూ లేని సంఘాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ – 5 అడ్డు తగిలాయి. వీరంతా మొదట పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. ఇందుకోసం ఏకంగా హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లిన దౌర్భాగ్యమైన పరిస్థితిని మన రాష్ట్రంలో మాత్రమే చూస్తున్నాం. ఈ పెద్దమనుషులు, పెత్తందార్లు, పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో 5 కేసులు వేశారు. ఈ కేసులను పరిష్కరించేందుకు మీ తరపున మీ బిడ్డ మూడేళ్ల పాటు పోరాటం చేస్తూ వచ్చాడు. దేవుడు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎప్పుడూ మంచికే ఉంటాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచింది. అనుమతులు తెచ్చుకుని మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆ తర్వాత కూడా వారి బుద్ధి మారలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి పేదల ఇళ్ల నిర్మాణానికి అడ్డు తగిలేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో వారు ఎక్కని గడప దిగని గడప లేదు. కలవని కేంద్ర మంత్రీ, కేంద్ర సెక్రటరీలు కూడా లేరు. ఇంతమందిని కలిశాక చివరి ప్రయత్నంగా మళ్లీ హైకోర్టులో కేసు వేశారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ ఎక్కడా ఉండదు. చరిత్రలో నిలిచిపోయే రోజు ఇంతమంది పెత్తందార్లు ఒక్కటై పేదవాడికి ఇళ్లు రాకూడదని అడ్డుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నించిన పరిస్థితులు దేశ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతాయి. ఇలా పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ, ఎన్నెన్నో అవరోధాలను అధిగమించి విజయం సాధించి పేదల ఇళ్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ ఇళ్ల నిర్మాణానికి, మీ ఇంటి కలల సాకారానికి ఇవాళ ఇక్కడ పునాదులు కూడా వేస్తున్నాం. అక్కచెల్లెమ్మల సొంతింటి కలల సాకారానికి మనం చేసిన సామాజిక న్యాయ పోరాటం చరిత్ర ఉన్నంత వరకూ ఎప్పడూ మర్చిపోలేనిది. పెత్తందారులపై పేదవాడు, పేదల ప్రభుత్వం సాధించిన విజయంగా చరిత్రలో పదిలంగా ఉంటుంది. గతంలో ఎన్నడూ చూడలేదు అమరావతిని పేరుకేమో రాజధాని అంటారు. రాజధానిలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుపడి కోర్టులకు వెళ్లారు. పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ (సామాజిక అసమతుల్యత) వస్తుందని, కులాల సమతుల్యం దెబ్బతింటుందని న్యాయస్థానాల్లో వాదించిన చరిత్ర వీళ్లది. ఇలాంటి పెత్తందారులున్న వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైన మనుషులను, మనస్తత్వాలను, వాదనలను, రాతలను, టీవీల్లో డిబేట్లను, రాజకీయ పార్టీలను గతంలో ఎప్పుడూ చూడలేదు. నయా జమీందార్ల మొసలి కన్నీరు పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే ఈ నయా జమీందార్లు, పెత్తందార్లంతా అడ్డుతగిలే కార్యక్రమం చేశారు. తెలుగు భాష ఏమైపోతుందని మొసలి కన్నీరు కారుస్తారు. ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను మాత్రం ఇంగ్లీష్ మీడియం బడులకే పంపిస్తారు. మన పిల్లలు మాత్రం తెలుగు బడులకే పోవాలంటారు. నా అక్కచెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తే రకరకాల కోర్టు కేసులు వేశారు. పేదవాడు ఎప్పుడూ పేదవాడుగానే మిగిలిపోవాలన్న పెత్తందారీ ఆలోచనకు ఇవొక నిదర్శనాలు. మీ బిడ్డ పేదల కోసం అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్షకు చోటివ్వకుండా బటన్ నొక్కి రూ.2.25 లక్షల కోట్లు పంపిస్తే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీ బిడ్డ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. చంద్రబాబు హయాంలో కన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల వృద్ధి రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఈ రోజు ఎలా చేయగలుగుతున్నాడు? ఆ రోజు గజదొంగల ముఠా ఎందుకు చేయలేకపోయింది? మీ బిడ్డ హయాంలో ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు ఎలా వస్తున్నాయి? చంద్రబాబు హయాంలో ఎందుకు రాలేదు? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏ పేదవాడు, అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని వలంటీర్, సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్షకు తావివ్వకుండా ఒకటో తారీఖునే అది ఆదివారమైనా, పండగరోజైనా సరే తెల్లవారుజామునే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి చేతిలో పెన్షన్ డబ్బులు పెడుతున్నారు. ఈ వ్యవస్థను కూడా పెత్తందార్లు, పేదల వ్యతిరేకులు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు ఏ సమాజమైనా, కుటుంబమైనా నిన్నటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్ బాగుండాలని కోరుకుంటుంది. అలాంటి వారి ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం అంటారు. అలాంటి ఎదుగుదలను, అభివృద్ధిని అడ్డుకుంటే, వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్గం, అమానుషత్వం, రాక్షసత్వం అంటారు. విచిత్రమేంటంటే పేదలకు మంచి చేయడాన్ని అడ్డుకుంటూ దాన్ని వారు హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు. ఈ రోజు ఉదయాన్నే ఈనాడు పేపర్లో చూశా. వాళ్లు రాసిన రాతలు చూసి ఆశ్చర్యం అనిపించింది. దిగజారుడుతనం ఏ స్థాయికి వెళ్లిందంటే చంద్రబాబు బినామీల అమరావతిలో ఉండేందుకు అమెరికా, సింగపూర్ల నుంచి మనుషులు రావచ్చట. కానీ ఇదే అమరావతిలో చుటు్టపక్కల ఉన్న పేదలకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని ఈనాడులో రాస్తారు. ఇంత దిక్కుమాలిన పెత్తందారులు, పేదల వ్యతిరేక భావజాలం ఎక్కడైనా ఉంటుందా? జగనన్నను టచ్ కూడా చేయలేరు ఎన్నికల సీజన్ రాగానే కొందరు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు పేదలను పీక్కుతిన్నాడు. పవన్కళ్యాణ్ ఎన్నో పార్టీలు మార్చాడు. బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం.. ఇలా ఎన్ని పార్టీలైనా మార్చగలడు. మా జగనన్నను ఓడిస్తారా.. ఎంతమంది వచ్చినా ఆయన్ను టచ్ కూడా చేయలేరు.ఇంకొకడు జగనన్నతో పోటీ అంటూ నడుస్తున్నాడు. నువ్వెంత నీ స్థాయి ఎంత? పెత్తందార్ల కోటలను బద్దలుకొట్టి, పేదల పక్షాన నిలిచి సుప్రీంకోర్టు దాకా వెళ్లి వారిని గెలిపించి జగన్ చరిత్రను తిరగరాశారు. పేదలకు ఇళ్ల స్థలాలు వద్దు అని కోర్టుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు. – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మీరొచ్చాకే బడుగు వర్గాలకు ధైర్యం వచ్చింది మీరు పాదయాత్ర చేస్తే రోడ్లపై పసుపు నీళ్లు చల్లిన వ్యక్తులను ఇక్కడ చూశాం. మా సమస్యలు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. జగనన్న వచ్చిన తర్వాత మాకు ధైర్యం, భరోసా వచ్చింది. జగన్ పేదల పక్కనుంటే చంద్రబాబు పెత్తందార్ల తరఫున యుద్ధం చేస్తున్నాడు. కోర్టులలో సైతం జగన్ గెలిచి ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జీవితకాలం పేద వాడి గుండెల్లో మీ పేరు నిలిచిపోతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలను లక్షాధికారులను చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుంది. – బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పాలకుడంటే ప్రజల కన్నీటిని తుడిచేవాడు.. పాలకుడంటే పాలించేవాడే కాదు, ప్రజల సంక్షేమాన్ని కోరుతూ వారి కన్నీటిని తుడిచేవాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త అర్థం చెప్పారు. మేం మీకు రుణపడి ఉంటాం. మీరే మా ధైర్యం అన్నా. మీకు పక్కనే ఉన్న వెంకన్న స్వామి, కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మాకు పట్టాలు ఇచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది, ఇప్పుడు ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. మేం అనేక పథకాల ద్వారా కూడా లబ్ధిపొందుతున్నాం. నగదు రూపంలో మొత్తం రూ.1,89,250, స్థిరాస్తి రూపంలో రూ.పది లక్షల నుంచి రూ. పదిహేను లక్షలు వరకు లబ్దిపొందాను. – రోజా, లబ్ధిదారు, మంగళగిరి వలంటీర్లపై బురద జల్లుతున్నారు నేను సొంత ఇల్లులేక, అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడ్డాను, నాకు ఏ ప్రభుత్వంలో ఇల్లు రాలేదు, కానీ, మీరు రాగానే మంజూరైంది, మా పేదల తరఫున మీరు నిలబడి చేసిన న్యాయపోరాటానికి మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. నేను వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధి పొందాను, నా కొడుకు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడంటే మీరే కారణం. అన్నా.. నేను నాలుగేళ్లుగా వలంటీర్గా సేవలు అందిస్తున్నాను, ఈ మధ్యకాలంలో చంద్రబాబు, పవన్కళ్యాణ్ మాపై బురద జల్లుతున్నారు. మీరు మాకు ధైర్యం ఇచ్చారు, థాంక్యూ అన్నా. – స్వప్న, లబ్దిదారు, రాణిగారితోట, విజయవాడ తూర్పు నియోజకవర్గం -
పవన్ కళ్యాణ్ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడు :మంత్రి జోగి రమేష్
-
‘పవన్.. ఆ విగ్గురాజుతో కలిసి కంపెనీ పెట్టుకో’
సాక్షి, గుంటూరు: ఎక్కడైనా ప్రతిపక్షాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని పోరాటం చేస్తాయి. కానీ, ఆంధ్రప్రదేశ్లోనే విచిత్రంగా పేదల ఇళ్లకు అడ్డుపడ్డాయని, ఇంత దుర్మార్గులను ఎక్కడా చూడలేదని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా వెంకటపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి రమేష్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను ఏకిపారేశారు. ‘‘రాజధానిలో పేదలు నివసించకూడదా?’’.. రాజకీయాల్లో చంద్రబాబు అంత దౌర్భాగ్యుడు లేడు. ఈ నాలుగేళ్లు సైలెంట్గా ఉండి.. ఎన్నికల సీజన్ స్టార్ట్ కాగానే రోడ్డెక్కాడు. ఇదెలా ఉందంటే.. చిత్తకార్తెలో కుక్కల్లాగా రోడ్డెక్కినట్లుంది. ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు పేదలకు ఏనాడూ మంచి చేసింది లేదు. శవాలను సైతం పీక్కుని తినేరకం బాబు. అలాంటోడు మళ్లీ వస్తున్నాడు. అప్రమత్తంగా ఉండాలి అని ఏపీ ప్రజలకు మంత్రి జోగి రమేష్ సూచించారు. ఇంకోడున్నాడు పవన్ కల్యాణ్.. పిచ్చి కుక్కలాగా అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నాడని జోగి రమేష్ మండిపడ్డారు. భార్యలతో పాటు ఎన్ని పార్టీలు మారుస్తావ్ రా నాయనా? అంటూ పవన్ను ప్రశ్నించారాయన. మార్చడం.. తార్చడం పవన్కు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో విగ్గురాజు ఒకడున్నాడు. వాడితో కలిసి.. ఇలా పార్టీలు మార్చడం, ఎన్నికల్లో పోటీ చేయించడం లాంటి కంపెనీ ఒకటి పెట్టుకో అంటూ పవన్కు సలహా ఇచ్చారు. ఒకడున్నాడు.. చంద్రబాబు గాలికి వదిలేస్తే నడుచుకుంటూ ఊళ్లన్నీ తిరుగుతున్నాడు. ఆ ఊర పందికి సింహంలాంటి సీఎం జగన్తో పోటీయా?.. అంటూ నారా లోకేష్పైనా జోగి రమేష్ విరుచుకుపడ్డారు. సీఎం జగన్ పేదలకు చేయూత ఇస్తున్నాడు. అన్నం పెడుతున్నాడు. అమ్మ ఒడి ఇస్తున్నాడు. కోటి మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా ఇస్తున్నాడు. అద్దె ఇళ్లలో ఉంటున్నవాళ్లకు శాశ్వత గూడులు కల్పిస్తున్నాడు. ఎంత మంది వచ్చినా సీఎం జగన్ను టచ్ కూడా చేయలేరంటూ జోగి రమేశ్ ఆవేశపూరితంగా ప్రసంగించారు. పేద వాళ్ల పక్షాన నిలిచిన జగనన్నకు రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ వెంట నిలవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి జోగి రమేష్. ఇదీ చదవండి: ఇంటిపై రామోజీ ఏడుపు ఇంతింత కాదయ్యా! -
‘వృద్ధసైకో, పిల్లసైకో, ఇంకొక సైకో గంజాయి తాగి రోడ్డున పడ్డారు’
సాక్షి, తాడేపల్లి: అవాస్తవాలను ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. వృద్దసైకో, పిల్లసైకో, ఇంకొక సైకో గంజాయి తాగి రోడ్డున పడ్డారంటూ ధ్వజమెత్తారు మంత్రి జోగి రమేష్. శనివారం తాడేపల్లి నుంచి ప్రెస్మీట్ నిర్వహించిన మంత్రి జోగి రమేష్, ‘లోకేష్ అప్పడంగాడు. ఈ అప్పడం గవర్నర్ ని కలిసి రాష్ట్రంలో గంజాయి ఉందని ఫిర్యాదు చేశాడు. అసలు ఇతనికి ఉన్న అర్హత ఏంటి?, వార్డు సభ్యునిగా కూడా గెలవని వ్యక్తి గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేశారు. గంజాయి సాగుని ధ్వంసం చేసి క్లీన్ ఏపీగా సీఎం జగన్ మార్చారు. అప్పట్లో మీ నాన్న సీఎం గా ఉన్నప్పుడు ఏపీలో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగింది. అప్పటి మీ మంత్రులు గంజాయి వ్యాపారం చేశారు. మాటలేమో కోటలు దాటతాయి, చర్చకు రమ్మంటే పారిపోతారు. భూతాలు, పిశాచాలు, సైతానుల గురించి పురాణాల్లో చెప్పేవారు.ఆ ముగ్గురు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లే, ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందుతుంటే తట్టుకోలేక శాంతిభద్రతల విఘాతం కల్గించాలని చూస్తున్నారు. గంజాయి సరఫరాలో పెద్దపెద్దవారి ఇన్వాల్మెంట్ ఉందని మంత్రులే చెప్పారు.చంద్రబాబు, లోకేష్ పాత్ర ఉందని అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు చెప్పారు. మరి అలాంటిది మా ప్రభుత్వంపై గవర్నర్ కి ఫిర్యాదు చేస్తావా లోకేష్? అంటూ నిలదీశారు. ‘అప్పుడు పవన్ ఐస్క్రీమ్ తింటున్నారా’ కాకినాడ: గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు అరాచకాలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఐస్ క్రీమ్ తింటున్నాడా? అని ప్రశ్నించారు మంత్రి సీదిరి అప్పలరాజు. పవన్ కళ్యాణ్ది ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ అని, అతనొక రాజకీయ వ్యభిచారి అని సీదిరి మండిపడ్డారు. సచివాలయాల్లో ఎలాంటి సేవలందిస్తారో పవన్కు తెలియదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థల మీద పవన్కు నమ్మకం లేదన్నారు. పవన్ని కూడా పీకే గాడు.. వీపీ గాడు అని తాము కూడా ఏకవచనంతో అనలేమా? అని హెచ్చరించారు మంత్రి సీదిరి. చదవండి: హిందూ ధర్మం టార్గెటా? బాబూ పవనూ.. ఎక్కడా?.. ఇక్కడో లుక్కేస్కో -
రంగా పేరు తలిచే అర్హత టీడీపీకి లేదు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): పేద, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన వంగవీటి మోహనరంగాను పొట్టన పెట్టుకుంది ఎవరో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. రంగా వెన్నులో దిగిన కత్తి, ఆయనపై విసిరిన బాంబు.. టీడీపీది కాదా.. చంద్రబాబుది కాదా.. సైకిల్ది కాదా అని ప్రశ్నించారు. రంగాను చంపిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఆయన బొమ్మ పెట్టుకునే అర్హత కూడా లేదన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే రంగా ఆత్మ శాంతిస్తుందా ప్రశ్నించారు. వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత ఆకుల శ్రీనివాసకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించన ఈ కార్యక్రమానికి మంత్రి జోగి రమేశ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి రమే‹Ùనాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. రంగా వ్యక్తి కాదు ఒక శక్తి.. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా పేరు పలికే అర్హత పవన్కళ్యాణ్కు లేదన్నారు. చంద్రబాబు పల్లకిని పవన్ మోస్తే.. రంగా అభిమానులు కూడా మోయాలా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ దయచేసి రంగా పేరును వాడొద్దని అన్నారు. రంగా పేరును వాడే అర్హత వైఎస్సార్ అభిమానులమైన తమకే ఉందన్నారు. రంగా పేరును కలకాలం నిలిచేలా చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. రంగా ఒక వ్యక్తి కాదని శక్తి అని పేర్కొన్నారు. ఆయన అందరి వాడన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రంగా విధానాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని, కాపులకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ అందరిలోనూ ధైర్యం నింపగల శక్తిమంతుడు రంగా అని కొనియాడారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే వైఎస్సార్, రంగానే కారణమన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు వంగవీటి రంగా ఒక ఐకాన్ అని పేర్కొన్నారు. మంచి చేస్తున్న వారికి అండగా నిలవాల్సిన అవసరం కాపులకు ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా రంగాతో కలిసి నడిచిన పది మందిని ఘనంగా సత్కరించారు. అనంతరం రంగా జీవిత చరిత్రలో కొన్ని అంశాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎపీఎండీసీ చైర్మన్ పుణ్యశీల, వైఎస్సార్సీపీ నేతలు భవకుమార్, మహమూద్, రాధారంగా మిత్రమండలి నాయకులు చెన్నుపాటి శ్రీను పాల్గొన్నారు. -
చనిపోయిన వారింటికెళ్లి బాబు ఓట్లు అడగటం ఏంటి: మంత్రి జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. విద్యార్థి అమర్నాథ్ హత్య దురదృష్టకరమని తెలిపారు. ఎవరి ఇంట్లోనూ ఇలాంటి ఘటనలు జరగకూడదని అన్నారు. ఈ మేరకు మంత్రి మంగళవారం మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ ఆదేశాలతో బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల సాయం అందించామని పేర్కొన్నారు. నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దోషులకు శిక్షపడేలా చేస్తామని తెలిపారు. పరామర్శ పేరుతో బాబు డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ‘శవరాజకీయాలు చంద్రబాబుకు అలవాటు. కులాలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. శవాలపై పేలాలు ఏరుకునే వ్యక్తి చంద్రబాబు. బాబు మైండ్ పోయి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. బాధిత కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి పాలిటిక్స్ చేస్తున్నారు. చనిపోయిన వారింటికి వెళ్లి ఓట్లు అడుక్కునే దౌర్భాగ్యస్థితిలో ఉన్నారు. వారింటికి వెళ్లి ఓట్లు అడగటం ఏంటి?. తనకు అండగా ఉండాలని కోరడం సిగ్గుచేటు. శవాలపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబువి పనికిమాలిన రాజకీయాలు. రాజకీయాలతో తమకు సంబంధం లేదని అమర్నాథ్ తల్లి చెప్పారు. పొర్లుదండాలు పెట్టినా బీసీలు టీడీపీకి ఓట్లేయరు. చంద్రబాబు చేసే శవ రాజకీయాలు జనం చూస్తూనే ఉన్నారు. ముద్రగడ పద్మనాభం రాసిన లేఖని చూస్తే పవన్ రాజకీయాలు వదిలేసి పారిపోతాడు. సినిమాలు లేక ఇక్కడకు వచ్చిన రాసిచ్చిన స్క్రిప్ట్లు చదువుతున్నాడు. ఎమ్మెల్యేగా గెలుపొందలేని పవన్ సీఎం కావాలని కలలు కంటున్నాడు. 175 నియోజకవర్గాలలో గెలుస్తానని చంద్రబాబు అంటున్నారు. అసలు అన్ని సీట్లలో పోటీ చేసే దమ్ము ఉందా? అంతమంది అభ్యర్థులు మీకు ఉన్నారా?. వంగవీటి మోహన రంగా హత్యకు చంద్రబాబు కారణమని చేగొండి హరిరామజోగయ్యే అన్నారు. ఆ సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటి పార్టీకి ఓటెయ్యమని పవన్ ఎలా అడుగుతున్నాడు? చంద్రబాబు విదిల్చే కాసులకు కక్కుర్తి పడి టీడీపీకి ఓటెయ్యమని ఎలా అడుగుతున్నాడు? కాపులంతా అందుకే పవన్ను ఛీ కొడుతున్నారు.’ అని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. చదవండి: ముద్రగడకు కాపు ఉద్యమ నేతల సంఘీభావం -
నీ పప్పు కొడుకు ఎప్పటికీ ఎమ్మెల్యే అవ్వడు.. అంటున్న మంత్రి
-
ఆరిపోయిన పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, ఇప్పుడు ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆరిపోయిన టీడీపీకి చంద్రబాబు అధ్యక్షుడు.. ఆయన జీవితం గురించి ‘ఐటీడీపీ’కి తెలియనట్టుంది. ఎన్టీఆర్ని ఎలా వెన్నుపోటు పొడిచారో కూడా తెలీదా? అంటూ మంత్రి ప్రశ్నించారు. ‘‘2014 నాటి టీడీపీ మేనిఫెస్టోలో సంవత్సరానికి 12 సిలెండర్లు ఇస్తానన్నారు. సబ్సిడీ కూడా ఇస్తానన్నారు. మరి ఎందుకు ఇవ్వలేదు?. 14,500 కోట్ల డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళలను నిలువునా మోసం చేశారు. హైస్కూల్ పిల్లలకు సైకిళ్లు ఇస్తానని మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారు. మొదటి సంతకం చేసిన బెల్టుషాపులు కూడా ఎత్తి వేయలేదు. మంచినీళ్లు ఇవ్వలేదు కానీ ఇంటింటికీ మద్యం సరఫరా చేశారు. ఇప్పుడు కొత్తగా పీ-4 అనే మంత్రం అందుకున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా చంద్రబాబూ?’’ అంటూ జోగి రమేష్ దుయ్యబట్టారు. చదవండి: Fact Check: వాస్తవాలకు మసిపూసి ‘ఈనాడు’ విష ప్రచారం ‘‘పేదలను ధనవంతులు చేస్తాడంట. పేదలకు ఇళ్లు కట్టిస్తానంటే అడ్డుకుని కోర్టులకు వెళ్లిన వ్యక్తి ఇప్పుడు ధనవంతులను ఎలా చేస్తారు?. మాట ఇస్తే ఎందాకైనా పోరాటం చేసే వ్యక్తి జగన్. ఆయన్ని చూసి చంద్రబాబు నేర్చుకోవాలి. భోగాపురం ఎయిర్ పోర్టు శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదీ ప్రజల మీద జగన్కి ఉన్న ప్రేమ. పోలవరాన్ని ఏటీఎంలాగా వాడుకున్నది చంద్రబాబు’’ అని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. -
‘రాజకీయాల్లో సీఎం జగన్కు పోటీ కానీ సాటి వచ్చే వారు కానీ లేరు’
సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పోటీ కానీ, సాటి వచ్చే వారు కానీ లేరని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కంచుకోటను ఇంచు కూడా కదల్చలేరన్నారు మంత్రి. కృష్ణాజిల్లా నీటిపారుదల సలహామండలి 38వ సమావేశానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. ‘గత నాలుగేళ్లుగా బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి. జలాశయాలన్నీ కళకళలాడాయి. రైతులకు మంచి దిగుబడి వచ్చింది. ఎవరూ ఇవ్వనంతగా రైతులకు గిట్టుబాటు ధరను సీఎం ఇచ్చారు. ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా పడతాయని ఆశిస్తున్నాం. జూన్ 7 వ తేదీన కృష్ణాడెల్టాకు నీరు విడుదల చేస్తున్నాం’ అని అన్నారు. కాలువల్లో గుర్రపుడెక్క, తూటుకాడను తొలగించేందుకు టెండర్లు పిలిచామని, రూ. 30 కోట్లతో పనులు పూర్తి చేస్తామన్నారు. వైఎస్సార్ పులిచింతలకు శంకుస్థాపన చేసిన పనులు కూడా పూర్తి చేశారన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని, ప్రారంభోత్సవం చేసుకునే రోజులు అతి త్వరలోనే ఉన్నాయన్నారు మంత్రి జోగి రమేష్. అదే సమయంలో చంద్రబాబు నాయుడుపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ‘చంద్రబాబు మేనిఫెస్టోను జనం చించి చేతిలో పెట్టారు. చంద్రబాబు ఎంతటి దుర్మార్గుడో ప్రజలకు తెలుసు. 14 ఏళ్ల సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క పథకమైనా తాను చేశానని చెప్పగలడా?, చంద్రబాబు, లోకేష్ల పనైపోయింది. 2024లో చంద్రబాబు దుకాణం సర్దుకోవాల్సింది’ అని విమర్శించారు. -
చంద్రబాబు మేనిఫెస్టో పై వైఎస్సార్సీపీ ఫైర్
-
వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ సింగల్ గానే వస్తుంది
-
ఆ మేనిఫెస్టోను టిష్యూ పేపర్ లా చింపి పారేశారు
-
నీకు ఒక ఊరు సరిపోదు నాయనా...!
-
‘పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనుడు చంద్రబాబు. ఆయన చరిత్రే నకిలీ చరిత్ర అంటూ మంత్రి జోగి రమేష్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆల్ కాపీ బాబు.. నకిలీ బాబుకు 2024లోనూ పరాభవం తప్పదు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. కాగా, మంత్రి జోగి రమేష్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘డర్టీ బాబు.. టిష్యూ మేనిఫెస్టో. 2014 ఎన్నికల్లో 650 వాగ్దానాలు చేసి గాలికొదిలేశాడు. 650 వాగ్దానాల్లో 10 హామీలైనా నెరవేర్చలేదు. మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు. 14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు చేయలేని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారు. వచ్చే ఎన్నికల్లోనూ సింగిల్గానే పోటీ చేస్తాం. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఏమైంది?. 14 ఏళ్ళలో ఉచిత బస్సు ప్రయాణం ఎందుకివ్వలేదు?. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశాడు. 2024 ఎన్నికల్లోనూ చంద్రబాబును బీసీలు తరిమితరిమి కొడతారు. పేదల రక్తాన్ని పీల్చిపిప్పిచేసిన దుర్మార్గుడు చంద్రబాబు. ఆయన వేషాలను ప్రజలు గమనిస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతే. చంద్రబాబు ఇక హైదరాబాద్ లేక సింగపూర్లో వెళ్ళిపోవడం ఖాయం. కేబినెట్లో ఒక్క బీసీకైనా చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చాడా?. కానీ, సీఎం జగన్ కేబినెట్లో సామాజిక న్యాయం చేశారు. సీఎం జగన్ మాట చెప్పాడంటే.. చేస్తాడంతే. పేదలను సంపన్నులుగా చేయగలిగే వ్యక్తి సీఎం జగన్. అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్. ముఖ్యమంత్రి జగన్ గురించే మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. పేదలకు ఇళ్ల స్థలం ఇస్తుంటే కోర్టులకెళ్లి అడ్డుకున్నావు. ఇప్పుడు పేదల ఆదాయం రెట్టింపు చేస్తానంటున్నాడు. మేనిఫెస్టో అంటే బాధ్యత ఉండాలి. ఒక మాట ఇస్తే దాని కోసం ఎంతవరకైనా పోరాడాలి. ఈ క్రమంలోనే మహానాడులో ప్రవేశపెట్టిన టీడీపీ మేనిఫెస్టోను చించేసి చెత్త బుట్టలో పడేశారు. ఇది కూడా చదవండి: బాలకృష్ణ ఫొటో ఎందుకు పెట్టలేదు.. కొడాలి నాని సీరియస్ -
నాలుగేళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు: మంత్రి జోగి రమేష్
సాక్షి, కృష్ణా జిల్లా: నాలుగేళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని మంత్రి జోగి రమేష్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా పెడన నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ ప్రవేశపెట్టారన్నారు. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ సింహంలా సింగిల్గా వస్తాడు. చంద్రబాబు, దుష్టచతుష్టయం, దత్తపుత్రుడు కలిసొచ్చినా జగన్ని ఏం చేయలేరు. 2024లో 151పైగా స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తామని మంత్రి అన్నారు. చదవండి: చంద్రబాబు వల్ల ఎన్టీఆర్కు మూడు సార్లు గుండెపోటు : పోసాని -
‘చంపిన చేతుల్తోనే దండేసి దండంపెట్టడం చంద్రబాబుకే చెల్లింది’
సాక్షి, అమరావతి: చంపిన చేతుల్తోనే దండేసి దండంపెట్టడం చంద్రబాబుకే చెల్లిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహానాడు పేరిట ఈరోజు రాజమండ్రిలో చంద్రబాబు వెకిలిచేష్టలు చూశాం. పిచ్చిప్రేలాపల్ని విన్నాం. మహానాడు వేదికపై ఒకపక్క ఎన్టీరామారావు విగ్రహం పెట్టి ఆయన చిత్రపటానికి దండ వేసి చంద్రబాబు దండం పెట్టారు. పాపం, ఈ రోజు ఎన్టీరామారావు ఆత్మ రాజమండ్రి మహానాడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది’’ అని ఎద్దేవా చేశారు. ‘‘ఈ సందర్భంగా ఎన్టీరామారావు దేవుడ్ని ఒక వరం కోరుకుంటారు. అదేమంటే, ‘నిండు నూరేళ్లు జీవించాల్సిన నన్ను వెన్నుపోటు పొడిచి నన్ను సమాధి చేసిన చంద్రబాబు.. నాకు దండ వేయడమేంటి..? నాకు దండం పెట్టడమేంటి..? అని.. నాకు గానీ దేవుడు మరలా ప్రాణం పోస్తే.. నన్ను కిరాతకంగా వెన్నుపోటు పొడిచి, నా నడ్డివిరిచి, నా పార్టీని లాక్కొని మానసికంగా తీవ్రంగా క్షోభపెట్టి సమాధి చేసిన చంద్రబాబును ఆ వేదిక మీదనే కొట్టికొట్టి చంపి సమాధి చేస్తాను.. అందుకు నాకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుకుంటాడు. చంద్రబాబు ఆయన తోక నాయకులు కలసి ఎంత దిగజారిపోయారు..? రాజకీయాల్లో ఒక వ్యక్తిని రాళ్లతో, కర్రలతో, చెప్పులతో కొట్టడమేంటి..? ఆ వ్యక్తిని మానసికంగా, శారీరకంగా పతనం చేసి చంపడమేంటి..? మరలా అదే వ్యక్తి శతజయంతి ఉత్సవాల పేరిట మీరు చంపిన వ్యక్తిని.. మీ చేతులతో నిలువునా వెన్నుపోటు పొడిచి పొట్టనబెట్టుకున్న నాయకుడికే మీరు చేతులెత్తి దండం పెట్టి దండలేయాల్సిన దౌర్భాగ్యం మీకు పట్టిందా..? మరీ ఇంత దుర్మార్గమా..? అని అడుగుతున్నాను. ఎన్టీరామారావు పేరు, ఆయన ఫొటోలేకుండా వేదికమీద కూర్చోలేని నాయకులు వీళ్లు’’ అంటూ మంత్రి మండిపడ్డారు. చదవండి: టీడీపీ మహానాడులో లోకేష్కు షాకిచ్చిన కార్యకర్త నూరేళ్ళు బతకాల్సిన నాయకుడిని సమాధి చేసి.. నూరేళ్ళు బతకాల్సిన నాయకుడ్ని 28 ఏళ్ళ క్రితమే సమాధి చేసేసి, ఆయన ఆయుర్థాయాన్ని తగ్గించి, చివరి దశలో అవమానించి, పదవి లాక్కుని, వెన్నుపోటు పొడిచి, ఒకరకంగా హత్య చేసిన తర్వాత, ఈరోజు శత పురుషుడ్ని - శక పురుషుడ్ని.. స్మరించుకుంటూ డ్రామాలు ఆడటం బహుశా ప్రపంచ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కాదు. ఇప్పుడు రాజమండ్రిలో నడుస్తున్నది ఒక డ్రామా- ఒక రికార్డింగ్ డ్యాన్స్ మాత్రమే తప్ప ఇందులో ప్రజా ప్రయోజనం లేదు. - ప్రజలకు ఏం చేశారన్నది మహానాడు ఎజెండాలోనే లేదు. - టీడీపీ మహానాడు తీర్మానాలు అంటూ 153 పేజీల మెటీరియల్ పబ్లిష్ చేశారు. చంద్రబాబు అనే చెవిటివాడి చెవిలో శ్రీకృష్ణుడు అనే ఎన్టీఆర్ శంఖం ఊదుతున్నట్టుగా మొదటి పేజీ పబ్లిష్ చేశారు. - ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, ఎన్టీఆర్ కు ముందు-తర్వాత అంటూ తెలుగువారి చరిత్ర అని రాశారు, బాగుంది. - చంద్రబాబు ముందు-తర్వాత అనే తెలుగువారి చరిత్ర చాప్టర్ మాత్రం లేదు. - 153 పేజీల ముసాయిదా తీర్మానాల పుస్తకంలో మేము మా పరిపాలనలో ఈ మంచి చేశాం అని లేదు. - చంద్రబాబు పేరు చెబితే.. ఈ పథకం గుర్తుకు వస్తుందని ఒక్క వాక్యం కూడా లేదు. - 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు వల్ల, ఒక పేద ఇంటికి పలానా మంచి జరిగిందని ఒక్క చాప్టర్ కూడా రాయలేకపోయారు. -పైగా, 2014-19 మధ్య రైతు రుణాలన్నీ మాఫీ చేసేసినట్టు, కౌలు రైతులకు కూడా రుణ మాఫీ జరిగినట్టు, పంటల బీమా ఏటా ఇచ్చినట్టు, ఇవ్వని సున్నా వడ్డీ రుణాలు ఇచ్చినట్టు, పూర్తి చేయని ప్రాజెక్టులను పూర్తి చేసేసినట్టు, పాడి పరిశ్రమ కూడా వర్థిల్లినట్టు.. రాశారు. - నిజానికి 5 ఏళ్ళ చంద్రబాబు పాలనలో సగటును ఏడాదికి 300 మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించారు. - అంటే రాష్ట్రంలో ఉన్న మండలాల్లో సగం.. 5 ఏళ్ళూ కరవే. పేదల ఇళ్ళనూ అవమానించారు - ఇక, పథకాలకు సంబంధించి అమ్మ ఒడి కన్నా గొప్ప పథకాన్ని తాము ఇచ్చినట్టు, డ్వాక్రా మహిళలకు రుణాలన్నీ రద్దు చేసినట్టు, బెల్టు షాపులు లేవన్నట్టు, మద్యం ధరల్ని నియంత్రించినట్టు అందులో రాశారు. - టీడీపీ హయాంలో ఒక్క సెంటు భూమిని కూడా ఇళ్ళ నిర్మాణానికి ఇవ్వకపోయినా, ఇచ్చేశాం అని రాశారు. - తాను పడుకోవడానికి కూడా ఇళ్ళు సరిపోవని అచ్చెన్నాయుడు అంటే.. తన టాయిలెట్ కూడా ఇంతకంటే పెద్దదిగా ఉంటుందని లోకేశ్ అంటే.. ఈ ఇళ్ళను సమాధులతో పోల్చాడు చంద్రబాబు నాయుడు. - దిశ యాప్ వల్ల మహిళలకు కలుగుతున్న రక్షణను పక్కన పెట్టి, అలాంటి యాప్ లేకపోవడం వల్లే చంద్రబాబు- పాలన బాగుందని చెప్పారు. - టీడీపీ హయాంలో మొత్తంగా ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు, 5 ఏళ్ళలో కలిపి 30 వేలు. జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షలు. -టీడీపీ పాలనలో పరిశ్రమలు రాలేదు, పెట్టుబడులు లేవు.. అని తెలిసినా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఖాతా రాసుకున్నారు. - ఇప్పుడు మరోసారి బీసీలకు డిక్లరేషన్ అని కొత్త వాగ్దానాలతో కొత్త డ్రామా మొదలు పెట్టారు. - ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నేరుగా వారి చేతికి మీరు ఏమి అందించారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా... రూ. 2.10 లక్షల కోట్ల డీబీటీ ద్వారా జగన్ గారి పాలనలో అందిన ప్రయోజనాలతో పోలికే లేకుండా, ఎస్సీలకు న్యాయం చేసేశామని పద్దు రాసుకున్నారు. - ఇలా మొత్తంగా చూస్తే.. పూర్తిగా డ్రామా తప్ప, పచ్చి అబద్ధాలు తప్ప.. ఈ మహనాడులో ప్రజలకు పనికొచ్చే అంశాలు ఏమీ లేవు. చతికిలపడిన సైకిల్ అది తెలుగుదేశం పార్టీ ఇంకా జనాల్లో బతికే ఉందనే భ్రమల్లో చంద్రబాబు బతుకుతున్నాడు. 2019 ఎన్నికల్లోనే ఆపార్టీకి జనం సమాధి కట్టారని ఆయన తెలుసుకోవాలి. మరలా సైకిల్కు పూర్వవైభవం తెస్తానని బాబు రంకెలేయడం పనికిమాలిన కార్యక్రమమే.. ఆ సైకిల్ ఎప్పుడో చతికిలపడిందని .. పార్టీలేదు.. బొక్కా లేదంటూ స్వయంగా ఆపార్టీ సీనియర్ నాయకుడు అచ్చెన్న చెప్పిన సంగతిని అందరూ గుర్తెరగాలి. బాబు చెబుతున్నట్లు ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ తెస్తాడంట. అది ఎక్కితే మహానాడు వేదిక నుంచి నేరుగా గోదాట్లోకి పోవడమేనని బాబు తెలుసుకోవాలి. మేనిఫెస్టో అంటే విలువలేని నేత బాబు మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు అసలు విలువుందా..? 2014కు ముందు 600 పైచిలుకు హామీలతో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్క హామీనైనా అమలు చేసి మాట నిలబెట్టుకున్నాడా..? అని నిలదీస్తున్నాను. బీసీలకు మేలు చేశానని బద్మాష్ బాబు శుద్ధ అబద్ధాలు ఆడుతున్నాడు. ఆదరణ, ఇతర పథకాల పేరుతో బీసీలను అడ్డం పెట్టుకుని అగ్రవర్ణాలే బాగుపడ్డారు గానీ బీసీల్ని బానిసలుగా చూసిన బాబు వాళ్ల మేలు కోసం ఏరోజూ పాటుపడలేదు. అధికారంలో ఉన్నప్పుడు బీసీల్ని పట్టించుకోని బాబు, ఎన్నికల సమయం వచ్చేసరికే బీసీల జపం చేయడం రివాజుగానే వస్తుందని నేను మరోమారు గుర్తు చేస్తున్నాను. రకరకాల మాయమాటలతో మళ్లీ బీసీల్ని బురిడీ కొట్టించడానికి బాబు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎన్ని ఎత్తుగడలేసినా బీసీ సోదరులు మాత్రం టీడీపీ పక్షాన ఉండరన్నది యదార్థం. ఎందుకంటే, బీసీల తోకలు కత్తిరిస్తానన్నది ఈ మహానుభావుడేనన్న విషయం ప్రతీ ఒక్క బీసీ సోదరుడు గుర్తుకుతెచ్చుకోవాలని మనవి చేస్తున్నాను. బీసీలే బాబును తరిమితరిమి కొడతారు ఈరోజు రాష్ట్రంలోని బీసీవర్గాలన్నీ సంఘటితమయ్యాయి. ఇన్నాళ్లకు తమను ఆదరించే నాయకుడు వచ్చాడని.. అన్నివర్గాల పెద్దన్నగా జగన్ గారు నిలిచారని బీసీసోదరులు నమ్మారు. కనుకనే, వైఎస్ఆర్సీపీ ఇటీవల జరిపిన జయహో బీసీ మహాసభ విజయవంతంతో చంద్రబాబు వెన్నులో వణుకుపుట్టింది. చంద్రబాబు పిచ్చి పరాకాష్టకు చేరింది. అందుకనే, పర్యటనల్లో బీసీ తమ్ముళ్లూ అంటూ రంకేలేస్తున్నాడు. ఎన్నికల సమయానికి ఓట్ల అవసరం వచ్చేసరికి ఆయన ఇప్పుడు బీసీల జపం చేస్తున్నారు. రాబోయే కాలంలో బీసీ కాలనీలకు వెళ్లి ఆత్మగౌరవం, సామాజికన్యాయం అనే పదాలు బాబు మాట్లాడితే.. ఆయన్ను బీసీలే చెప్పులు, రాళ్లు విసిరి తరిమితరిమి కొడతారని హెచ్చరిస్తున్నాను. బీసీలకు పెద్దన్న మా జగన్ గారు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో తల ఎత్తుకుని తిరుగుతున్నారు. బీసీలకు బాద్షాగా జగన్ గారు మాకు పదవులు, పనుల్లో పెద్దపీట వేయడం మూలానా మేమంతా సమాజంలో అత్యున్నతమైన జీవనశైలితో బతుకుతున్నాం. రాజకీయ, ఆర్థిక, సామాజికంగా ప్రతీ అంశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం తపనపడుతున్న మా జగన్గారు మా అందరికీ మనసున్న ముఖ్యమంత్రి. చదవండి: వివేకా కేసు: చంద్రబాబు దుర్మార్గం ఏ స్థాయికి చేరిందంటే.. ఆ పేదలే బాబుకు, టీడీపీకి రాజకీయంగా పాతరేస్తారు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఎక్కడైనా పేదలకు సెంటు స్థలమిచ్చాడా..? టిడ్కో ఇళ్ల పేరుతో పేదల దగ్గర డబ్బులు వసూలు చేయడం నిజం కాదా.? వీటికి సమాధానం చెప్పే దమ్మూధైర్యం బాబుకు ఉందా..? అని నిలదీస్తున్నాను. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా నిరుపేద వర్గాల మహిళాసోదరీమణుల పేరుతో ప్రభుత్వం ఇళ్లపట్టాలిచ్చి.. వారికి నిలువ నీడను ప్రసాదిస్తే, ఈ చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారు. ప్రభుత్వమిచ్చే ఇళ్ళ స్ఠలాల భూములను సమాధులతో పోలుస్తారా..? అందుకే, నేను ఇప్పుడు ఒక విషయం చెబుతున్నాను. ఈరోజు పేదవర్గాల కుటుంబాలకు ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్ల పునాదుల్లోనే చంద్రబాబుకు, ఆయన పార్టీ టీడీపీకి సమాధి ఖాయమని హెచ్చరిస్తున్నాను. తమకు ఇళ్లు రాకుండా ఇన్నాళ్లూ రకరకాల కారణాలతో జాప్యం చేసిన చంద్రబాబు కుట్ర కుతంత్రాలన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలంతా తెలుసుకున్నారు. రేపటి ఎన్నికల్లో వారంతా కలసి చంద్రబాబు, ఆయన పార్టీ టీడీపీపై కసిదీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బాబును నమ్మితే నట్టేటా మునిగినట్టే.. బాబుకు నిలువెల్లా విషమే ఉంటుంది. ఆయన నయవంచన రాజకీయం ఇక చెల్లదు. చంద్రబాబును నమ్ముకుంటే ఎవరైనా నట్టేటా మునిగినట్టే. ఆయన్ను నమ్ముకున్న నాయకులు గానీ, కార్యకర్తలు గానీ ఎన్టీఆర్ గారు మాదిరిగానే పైలోకాలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు అనే వ్యక్తి ఒక రియల్ఎస్టేట్ బ్రోకర్. అమరావతి రాజధాని పేరిట 33 వేల ఎకరాలకు ఒక వలయం పెట్టి పెత్తందారీ రాజ్యానికి చంద్రబాబు కాపలా ఉండి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తున్నాడు. - పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు అహంకార మనస్తత్త్వాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించారు. న్యాయస్థానాలు పేదల పక్షాన ఉన్నాయి కాబట్టి.. మా పక్షాన వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి ధీరోధాత్తుడు నిలబడ్డారు కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలైన పేదలే విజయం సాధించారు. నిన్న పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేశాం. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాలైన పేదలంతా వైఎస్ఆర్సీపీకి అండగా ఉండి ఎన్నికలు ఎప్పుడొచ్చినా 175 కి 175 స్థానాల్లో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. -
రియల్ ఏస్టేట్ బ్రోకర్ చంద్రబాబుతో పోరాటం.. పేదలదే విజయం
-
ఈ యుద్ధంలో పేదలదే గెలుపు: మంత్రి జోగి రమేష్
సాక్షి, అమరావతి: అమరావతిలో రేపు (శుక్రవారం) నిరుపేదలకు ఇళ్ల ‘పట్టా’భిషేకం జరగబోతోందని, రాష్ట్ర చరిత్రలో నిల్చిపోయే ఒక అపురూప ఘట్టం అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సీఎం జగన్ చేతుల మీదుగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలతో పాటు, ఇళ్ల పంపిణీ జరగబోతుందన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇది ఒక గొప్ప పండగ. 50 వేల మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నాం. అలాగే వారికి ఇళ్లు నిర్మించే కార్యక్రమం కూడా రేపు ప్రారంభమవుతోందన్నారు. మంత్రి జోగి రమేష్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే ఈ మహత్తర కార్యక్రమం కోసం ఒక యుద్ధమే జరిగింది. నిరుపేదలు.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షాన నిలబడిన సీఎం జగన్, వారి కోసం న్యాయ పోరాటం చేశారు. అటు పెత్తందార్ల పక్షాన నిలబడిన నరరూప రాక్షసుడు చంద్రబాబు.. అమరావతిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా విశ్వ ప్రయత్నం చేశారు. పేదలకూ సొంత ఇళ్లు ఉండాలని, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తపిస్తున్న ప్రభుత్వం మనందరిది అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వరాదని అడ్డుకున్న దుర్మార్గులు చంద్రబాబు అండ్ కో. వాళ్ల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జిల్లా కోర్టులు మొదలు హైకోర్టు.. చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అయినా పేదల పక్షాన పోరాడిన ప్రభుత్వం తన సంకల్పాన్ని సాధించుకుంది. సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందట! గతంలో ఏనాడైనా ఇలాంటి మహత్కార్యాన్ని చూశామా?. అమరావతిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే, సామాజిక సమతుల్యం (డెమొగ్రఫిక్ బ్యాలెన్స్) దెబ్బ తింటుందట!. అలా సామాజిక అంటరానితనం వస్తుందట. అంటే అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నివసిస్తే రాజధానిలో అంటరానితనం వస్తుందా? అంత దారుణమా?. చంద్రబాబు సమర్థిస్తున్న పెత్తందార్లకు పాలేర్లు కావాలి. పని వాళ్లు కావాలి. అంతేకాని.. ఆ పని వాళ్లు అక్కడ ఉండకూడదు. ఆ పాలేర్లు రాజధానికి దూరంగా బతకాలి. అదీ చంద్రబాబు వైఖరి. అందుకే ఆయనకు రాజకీయాల్లో ఉండే అర్హత ఏ మాత్రం లేదు. బాబుకు సమాధి తప్పదు: నిరుపేదలకు ఇస్తున్న ఇంటి స్థలాన్ని సమాధితో పోల్చిన చంద్రబాబు.. తనలోని నైజాన్ని బయటకు వెళ్లగక్కాడు. అందుకే ఆయనకు భూస్థాపితం తప్పదు. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న చంద్రబాబును, వచ్చే ఎన్నికల్లో ఆ నిరుపేదలే.. ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే మళ్లీ చిత్తుగా ఓడిస్తారు. పెత్తందార్ల కోటను వారు బద్ధలు కొడతారు. అందుకు అంతా సిద్ధంగా ఉన్నారు. చదవండి: పేదలకు ‘పట్టా’భిషేకం.. అక్కచెల్లెమ్మలకు తోడుగా.. బాబును నమ్ముకుంటే మునిగినట్లే: రాజధాని పేరుతో పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబు.. నిజానికి రియల్ ఎస్టేట్ బ్రోకర్. రాజధాని పేరిట 33 వేల ఎకరాలకు ఒక వలయం పెట్టి పెత్తందారీ రాజ్యానికి కాపలా ఉంటూ.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లా పని చేస్తున్నారు. అందుకే చంద్రబాబు అహంకార మనస్తత్త్వాన్ని ప్రజలు గమనించాలి. రాష్ట్రమంతా ఎక్కడికక్కడ ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లిన చంద్రబాబు, తన నిజ స్వరూపం బయట పెట్టారు. ఆయన ఎప్పటికైనా పెత్తందార్ల పక్షానే ఉంటారు. కాబట్టి చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే. అందరినీ ఆహ్వానిస్తున్నాం: అమరావతిలో ఒక గొప్ప కార్యక్రమం, పండగలా జరగబోతోంది. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి అమరావతి రైతులతో సహా అందరినీ ఆహ్వానిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును కూడా వక్రీకరిస్తూ అమరావతిలో కొందరు పెత్తందారీ మహిళలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. వాళ్లకు అండగా నిలబడి పోరాటాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. అందుకే ఇప్పటికైనా అమరావతి రైతులు చంద్రబాబు నయవంచనను అర్ధం చేసుకోవాలని, పేదల పండగలో భాగస్వామ్యం కావాలని మంత్రి జోగి రమేష్ కోరారు. -
‘రాష్ట్ర ప్రజలే చంద్రబాబుకు, టీడీపీకి సమాధి కడతారు’
సాక్షి, తాడేపల్లి: అయ్యన్నపాత్రుడు ఇచ్చిన గంజాయి తాగి చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. పేదలకు ఇచ్చే సెంటు స్థలంలో సమాధి కట్టుకోమని చంద్రబాబు మాట్లాడుతుంటే ఇక ఆయన్నేమనాలన్నారు. రాష్ట్ర ప్రజలే చంద్రబాబుకు టీడీపీకి సమాధి కడతారని మంత్రి ధ్వజమెత్తారు. పేదలకు మూడు సెంట్లు చొప్పున స్థలాలు ఇచ్చానని సిగ్గు లేకుండా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు మంత్రి జోగి రమేష్. తాడేపల్లి నుంచి మీడియాతో మాట్లాడిన జోగి రమేష్.. ‘శరవేగంగా జగనన్న కాలనీలు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నాయి. 2014నుండి 2019 వరకు సీఎం గా ఉండి ఒక్క సెంటైనా ఇంటికోసం ఇచ్చావా?, 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు జగన్ ఇంటిస్థలాలు ఇచ్చారు. వారంతా కలిసి చంద్రబాబును రాజకీయంగా సమాధి చేస్తారు. అసలు ప్రజలంటే చంద్రబాబుకు ఎందుకు అంత చులకన?, ఎస్సీల్లో ఎవరు పుట్టాలని అంటారు. బీసీల తోకలు కత్తిరిస్తామని అవహేళన చేశారు. ఓట్లప్పుడే మా వాళ్లు కావాలా మీకు?, అధికారంలోకి వచ్చాక మమ్మల్ని ఏనాడైనా పట్టించుకున్నావా? రాజధానిలో పేదలు ఉండకూడదా? ఇదెక్కడి చట్టం?, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజధానిలో నివసించే హక్కు లేదా?, హైకోర్టు, సుప్రీంకోర్టులదాకా వెళ్లి ఆపాలని చూడటం ఏంటి?, కోర్టులు కూడా మనసున్న జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పాయి. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కోర్టుల్లో అడ్డుకోవాలని చూసినందుకు పేదలంతా చంద్రబాబును రాజకీయంగా పాతరేస్తారు. జగన్ లాంటి ధీరుడు, ధైర్యశాలిని ఎదుర్కోవడం చంద్రబాబు వల్ల కాదు. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు కాళ్లు నాకుతాను అంటూ వెళ్తున్నారు. నేను ముఖ్యమంత్రి అభ్యర్ధిని కాదని పవన్ అన్నాడంటే అదీ జగన్ గెలుపు. పొత్తుల పేరుతో కట్టకట్టుకుని వచ్చే అన్ని పార్టీలను ప్రజలు భూస్థాపితం చేయటానికి సిద్దంగా ఉన్నారు. చంద్రబాబు ఫ్రస్టేషన్తో రంకెలేస్తున్నారు. ఎన్ని కేకలు, అరుపులు వేసినా ప్రజలు నమ్మరు’ అని పేర్కొన్నారు. -
పాలకుడిని కాను.. పాలేరునని పవన్ స్పష్టం చేశారు
-
‘పవన్ పూజకు పనికిరాని పువ్వు లాంటోడు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్పై మంత్రి జోగి రమేష్ సీరియస్ అయ్యారు. పాలకుడిని కాదు.. పాలేరునని పవన్ ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. పవన్ని నమ్ముకుంటే నట్టేట ముంచారని కార్యకర్తలు బాధ పడుతున్నారని కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి జోగి రమేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్.. చంద్రబాబుకు పాలేరు. పదేళ్లుగా జెండాలు మోసిన జనసైనికులు ఆత్మరక్షణలో పడ్డారు. పవన్ ప్యాకేజీ స్టార్ తప్ప పాలకుడు కాదని మేం చెబుతూనే ఉన్నాం. పవన్ పూజకు పనికిరాని పువ్వు లాంటి వ్యక్తి. పాలకుడిని కాదు.. పాలేరునని పవన్ ఒప్పుకున్నారు. టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ జనసేన నేతల పేరుతో టీడీపీ వారే పోటీ చేస్తారు. జనసైనికులు కూడా పాలేరులుగా మారకుండా నిర్ణయం తీసుకోవాలి. గతంలో పవన్ కుటుంబ సభ్యులను సైతం చంద్రబాబు మనుషులు బూతులు తిట్టారు. పార్టీ పెట్టి పదేళ్లయినా పవన్ ఏమీ సాధించలేక పోయాడు. చంద్రబాబు కుతంత్రాలు ఇలాగే ఉంటాయి. పాలకుడు ఎవరో, పాలేరు ఎవరో గుర్తించి వ్యవహరించాలి అంటూ సూచనలు చేశారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే: సీఎం జగన్ -
పేదల రాజధానిలో ఇళ్ల పండగ
సాక్షి, అమరావతి: న్యాయస్థానం తీర్పుతో సీఆర్డీఏ పరిధిలో దాదాపు 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియ వేగం పుంజుకుంది. ముళ్ల కంపలను తొలగించి స్థలాలను చదును చేయడంతో పాటు వెంటనే ప్లాట్ల మార్కింగ్ జరుగుతోంది. నిరుపేదల కోసం 1,134.58 ఎకరాలను కేటాయించడంతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్–5 జోన్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 48,218 మందికి కేటాయించింది. వీరందరికీ అతి త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. విశాలమైన రోడ్లు.. అటు తాడికొండ, ఇటు నీరుకొండ.. ఐదు కి.మీ పరిధిలోనే మంగళగిరి, మరికొద్ది దూరంలో తాడేపల్లి.. ఎటు చూసినా 20 నిమిషాల ప్రయాణం దూరం మాత్రమే ఉండే ప్రాంతంలో నిరుపేదల లే అవుట్లు సిద్ధమవుతున్నాయి. సీఆర్డీఏ అధికారులు, సిబ్బందితో పాటు వార్డు సచివాలయాల సిబ్బంది సైతం శరవేగంగా పనులు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలులో 900.97 ఎకరాలను ఆర్ 5 జోన్గా మారుస్తూ మార్చిలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో పాటు ఎస్–3 జోన్లోని 233.61 ఎకరాలను కూడా ఆర్–5కి జోడించారు. నిరుపేదల కోసం కేటాయించిన మొత్తం 1,134.58 ఎకరాల్లో గుంటూరు జిల్లా పరిధిలోని లబ్ధిదారులకు 550.65 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా (వీఎంసీ) పరిధిలోని లబ్ధిదారులకు 583.93 ఎకరాలు కేటాయించారు. ధర్మమే గెలిచింది రాజధాని ల్యాండ్ పూలింగ్ పేరుతో వేలాది ఎకరాలను సేకరించిన గత సర్కారు అక్కడ పెద్దలకు మాత్రమే చోటు కల్పించి పేదలకు తావు లేకుండా చేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమిలో 5 శాతం నిరుపేదల గృహాల కోసం కేటాయించే వీలున్నా అడ్డంకులు సృష్టించింది. నిరు పేదలకు చోటులేనిది రాజధాని ఎలా అవుతుందని భావించిన ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం కొత్తగా ఆర్–5 జోన్ను ఏర్పాటు చేసింది. ఇందులో రెండు జిల్లాలకు చెందిన 48,218 మంది నిరుపేదలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో స్థలాలు కేటాయించింది. గుంటూరు జిల్లాకు చెందిన పేదల కోసం 10 లేఅవుట్లను సిద్ధం చేయగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 11 లే అవుట్లు రూపుదిద్దుకున్నాయి. భారీ భవంతుల మధ్య బడుగు జీవులు ఉండకూడదని టీడీపీ నాయకులు రైతుల ముసుగులో ఆటంకాలు సృష్టించినా ఎట్టకేలకు ధర్మమే గెలిచిందని నిరుపేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 15న పట్టాల పంపిణీ యోచన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుతో సీఆర్డీఏ ప్రాంతంలో నిరుపేదలు నివాసం ఉండేందుకు మార్గం ఏర్పడింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల పక్షపాతి అని మరోసారి రుజువైందని అక్క చెల్లెమ్మలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే చట్టప్రకారం ఆర్–5 జోన్ను ఏర్పాటు చేయడం, లేఅవుట్ పనులు కూడా పూర్తి కావస్తుండడంతో ఈనెల 15న లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసే అవకాశం ఉంది. దురుద్దేశంతోనే అడ్డుపడ్డారు వేల మంది నిరుపేదలకు సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 45పై కొందరు కోర్టును ఆశ్రయించడం బాధాకరం. రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ చెందుతుంది. అలాంటి చోట పేదలకు ఇళ్లు కేటాయించరాదంటూ కొందరు స్వార్ధపూరితంగా కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే దురుద్దేశంతోనే ఇళ్ల స్థలాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా అడ్డుకున్న వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. – ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యే మంగళగిరి చంద్రబాబుకు చెంపపెట్టు పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది. రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలు నివసించేలా ఉండాలి. కానీ అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేద కాపు వర్గానికి చెందిన ప్రజలు ఉండకూడదని చంద్రబాబు భావించారు. రాజధానిలో తన అనుచరులు, తన సామాజిక వర్గం వారు మాత్రమే ఉండాలని కోరుకున్నారు. – జోగి రమేశ్, మంత్రి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నాం. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే. అన్యాయమైన డిమాండ్తో కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. సామాజిక అసమతుల్యత అంటూ అడ్డుపడ్డ వారికి ఈ తీర్పు చెంప దెబ్బ లాంటిది. త్వరలో ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. రాజధాని అంటే ఏ ఒక్కరిదో కాదు, ప్రజలందరిదీ అనే విషయాన్ని టీడీపీ నేతలు ఇప్పటికైనా గుర్తించాలి. కమ్యూనిస్టులు కూడా బుద్ధి తెచ్చుకుని పేదల కోసం పని చేయాలి. – లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ అడ్డుకోవడం దుర్మార్గం రాజధానిలో పేదలు ఉండకూడదని అడ్డుకోవడం దుర్మార్గం. రాజధాని అంటే రాష్ట్ర ప్రజలందరిదీ. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్న వారికి కోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది. రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి పేదలంతా అండగా ఉంటారు. – తమిదం లలిత, మంగళగిరి ఓట్ల వరదలో కొట్టుకుపోతారు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే అక్కడున్న వారికి వచ్చిన నష్టమేంటో అర్ధం కావడం లేదు. రాజకీయాల కోసం పేదలకు అన్యాయం చేయాలనుకున్న వారికి కోర్టు తీర్పు గుణపాఠం లాంటిది. రాజధానిలో ఎవరైనా నివసించే హక్కు ఉంది. ప్రభుత్వం చేస్తున్న మేలును అడ్డుకుంటున్నవారు పేదల ఓట్ల వరదలో కొట్టుకుపోతారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు. – జగన్నాధం రాజేశ్వరి, మంగళగిరి మిఠాయిలు పంచిన ఎంపీ నందిగం సురేష్ తాడికొండ: బాపట్ల ఎంపీ నందిగం సురేష్ హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ శుక్రవారం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలోని తన కార్యాలయంలో బహుజన పరిరక్షణ సమితి దీక్షా శిబిరం నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, పెరికే వరప్రసాద్, బేతపూడి రాజేంద్ర,కుమార్, బొలిమేర శ్యామ్యూల్, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, ఈపూరి ఆదాం, పులి దాసు, ఇందుపల్లి సుభాషిణి, రాజ్కుమార్, కారుమూరి పుష్పరాజ్ పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు. న్యాయం జరిగింది.. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అందరికీ ఇళ్ల స్ధలాలను కేటాయించారు. మంగళగిరి తాడేపల్లి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వరంటూ విపక్షాలు ప్రచారం చేసినా కోర్టు కేసుల వల్ల కొంత ఆలస్యమైనా కచ్చితంగా వస్తాయని వలంటీర్లు చెప్పారు. పేదలకు కోర్టులో న్యాయం జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. – ఎస్కె నగీనా, నులకపేట సొంతింటి కల నెరవేరనుంది జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు కూడా ఇళ్ల పట్టాలు వస్తాయని ఎదురు చూశాం. ఇన్నాళ్లకు మా కల నెరవేరుతోంది. అందరికీ ఇళ్ల స్ధలాలు ఇస్తారని సచివాలయ సిబ్బంది తెలియజేశారు. – ఎస్కె కరీమున్నీసా, డ్రైవర్ కాలనీ ఆటంకాలు తొలగాయి.. కొందరు రాజకీయ నాయకులు కోర్టును ఆశ్రయించి పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్నారు. ఎట్టకేలకు ఆటంకాలు తొలగిపోయాయి. ఈ ప్రాంతంలో పేదలంతా అద్దె ఇళ్లల్లోనే నివాసముంటున్నారు. పెళ్లయిన పిల్లలు ఒక చిన్న గదిలో తల్లిదండ్రులతో కలసి జీవిస్తున్నారు. ఇన్నాళ్లకు ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలం రానుండటం ఆనందంగా ఉంది. – నారాయణరెడ్డి, పోలకంపాడు -
ఎన్టీఆర్ను పదవి నుంచి తప్పించడంలో రజనీకాంత్ పాత్ర: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: ఎన్టీఆర్ను చంపిన వారందరూ ఒకే వేదిక మీదకు వచ్చి ఇప్పుడు ఆయనను పొగుడుతున్నారని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. ఎన్టీఆర్ చనిపోయిన 27 ఏళ్ల తర్వాత భారతరత్న ఇప్పిస్తావా చంద్రబాబు? అని ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశావు? అని అడిగారు. అప్పుడు ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదు అని నిలదీశారు. ఎన్టీఆర్ను పదవి నుంచి తప్పించడంలో రజనీకాంత్ పాత్ర కూడా ఉందని జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు తన వారసుడని ఎన్టీఆర్ ఎప్పుడన్నా ప్రకటించారా? అని ప్రశ్నించారు. తడిగుడ్డతో గొంతులు కోసే వ్యక్తి చంద్ర బాబు అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఒక నయవంచకుడు, వెన్నుపోటుదారుడు అంటూ ధ్వజమెత్తారు. 'పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి టీడీపీని, ఎన్టీఆర్ ట్రస్టు భవన్ను చంద్రబాబు లాక్కున్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో మంచి జరిగిందని ఏ ఒక్కరైనా చెప్పగలరా? ఎన్టీఆర్ను చంపిన ఖూనీకోర్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ యుగానికి తడిగుడ్డలతో గొంతులు కోసే రక్త చరిత్ర ఉన్న వ్యక్తి చంద్రబాబు. ఈ యుగానికి వీరుడు, ధీరుడు సీఎం వైఎస్ జగన్. లోకేష్ పాదయాత్ర పేరుతో డ్రామాలు చేస్తున్నాడు. తెలుగు సినీ తారలెవరైనా చంద్రబాబును పొగుడుతారా?' అని జోగ్ రమేశ్ ప్రశ్నించారు. చదవండి: రజనీకాంత్ వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనం: కొమ్మినేని శ్రీనివాసరావు -
బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు అవహేళన చేశారు: మంత్రులు
సాక్షి, తాడేపల్లి: తాడేపల్లిలో మంగళవారం నాయీబ్రాహ్మణ కృతజ్ఙతాసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యాక్రమానికి బీసీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నాయీబ్రాహ్మణ సంఘం నేతలు హాజరయ్యారు. సంప్రదాయ వృత్తిదారులకు జగనన్న చేదోడు కింద ప్రతి ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందించడం, ఆలయాలలో పనిచేసే వారికి రూ, 20 వేల వేతనం అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్ని ఆలయాల పాలకమండలిలో స్థానం కల్పించడంపై నాయీబ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ మంత్రులు మాట్లాడుతూ.. బీసీలకు సీఎం జగన్ అన్ని విధాల అండగా నిలిచారని తెలిపారు. సుదీర్ఘ పాదయాత్రలో జగన్ బీసీల కష్టాల చూశారని గుర్తు చేశారు. ఆలయాల పాలక మండలిలో నాయీబ్రాహ్మణులు సభ్యులయ్యారని, త్వరలోనే నాయీ బ్రాహ్మణులు సైతం చట్టసభల్లో అడుగుపెడతారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని విమర్శించారు. బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు అవహేళన చేశారని, ఆయనకు బీసీలంటే చిన్నచూపని దుయ్యబట్టారు. చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అనూహ్య వాతావరణం.. వాతావరణ శాఖ హెచ్చరికలు -
‘చంద్రబాబు జీవితమంతా కబ్జాలు, అబద్దాల బాగోతమే’
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రులు సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు పదవీ వ్యామోహంతో పిచ్చి పట్టిందన్నారు. చంద్రబాబుది అంతా కబ్జాలు, అబద్దాల బాగోతమే అంటూ విమర్శలు చేశారు. కాగా, మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. సెప్టెంబర్ నుంచి విశాఖ నుండే పరిపాలన కొనసాగుతుందన్నారు. చంద్రబాబు మళ్లీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. చంద్రబాబుది అంతా కబ్జాలు, అబద్దాల బాగోతమే. హామీలు నెరవేర్చలేదు కాబట్టే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపించారు. సంస్కారం లేకుండా చంద్రబాబు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నాడు. రామ్మోహన్నాయుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు పదవీ వ్యామోహంతో పిచ్చి పట్టింది. చంద్రబాబు 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేని దద్దమ్మ. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే 175 స్థానాల్లో పోటీ చేయాలి. 2024 ఎన్నికల్లో మళ్లీ విజయం వైఎస్ఆర్సీపీదే అని అన్నారు. -
చంద్రబాబు, హరీష్ రావుకు మంత్రి జోగి రమేష్ కౌంటర్
సాక్షి, గుంటూరు: తెలంగాణ మంత్రి హరీష్ రావుకు మంత్రి జోగి రమేష్ కీలక సూచన చేశారు. అలాగే, నారా లోకేష్ మాటలకు త్వరలోనే ప్రజలు సమాధానం చెప్తారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే చంద్రబాబు అండ్ కో అడ్డుపడుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి జోగి రమేష్.. బుధవారం గుంటూరు కలెక్టరేట్లో గృహ నిర్మాణ పథకం సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. మేము అధికారంలోకి రాగానే 30లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. వారికి శాశ్వతంగా ఇల్లు నిర్మిస్తున్నాం. ఇళ్ల నిర్మాణాలతోపాటుగా మౌలిక వసతులు కూడా కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం మంచి చేస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై కోర్టులకు వెళ్తున్నారు. సెల్ఫీలు దిగుతూ.. అవి వారు నిర్మించినవే అంటూ కలరింగ్ ఇస్తున్నారు. 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను చంద్రబాబు నిలబెట్టగలరా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీకి వస్తే అభివృద్ధి కనపడుతుందన్నారు. లోకేష్ మాటలకు ప్రజలు త్వరలోనే సమాధాని చెబుతారు. ప్రజల దెబ్బకు 23 సీట్లతో చంద్రబాబు గూబ గుబేలు అయ్యింది. లోకేష్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
జగనన్నే మా భవిష్యత్తు.. ఇది చారిత్రాత్మక ప్రజా మద్దతు
సాక్షి, తాడేపల్లి: గత చంద్రబాబు పాలనకు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకూ ఉన్న తేడాను ప్రజలు గమనించారని, అందుకే ప్రజలంతా మా భవిష్యత్తు నువ్వే జగన్ అంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఏడు లక్షల మంది సైన్యం అక్కాచెల్లెమ్మల ఇళ్లకు వెళ్లగా.. వారంతా ఎంతో అభిమానంతో మెగా సర్వేకు సహకరిస్తున్నారని చెప్పారు. వారం రోజుల్లో 63 లక్షల కుటుంబాల సర్వే చేయగా.. సీఎంకు మద్దతు తెలుపుతూ 47 లక్షల మిస్డ్ కాల్స్ వచ్చాయని వెల్లడించారు. ఇది ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకమని, ఇదొక చారిత్రాత్మక ప్రజామద్దతుగా పేర్కొన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని మ్యానిఫెస్టోలో పెట్టడంతో పాటు అవన్నీ పరిష్కరిస్తున్నారని కొనియాడారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. గణాంకాలతో ప్రజలకు జరిగిన మేలును వివరిస్తున్నామన్నారు. మాకు ఓటు వేయని వారికి కూడా సాయం చేశామని, అందరికీ మేలు చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు. టీడీపీ కోటలు బద్దలు అవుతున్నాయి.. ఏడు లక్షల మంది సైనికులు చేస్తున్న సర్వేలో అదే తేలుతోందని స్పష్టం చేశారు. కరోనా వలన ఆర్ధిక సమస్యలు వచ్చినా ఏపీ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందని.. సీఎం జగన్ సువర్ష పాలనలోనే ఇది సాధ్యం అయిందని చెప్పారు. -
చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్
-
జగనన్న కాలనీలు చూద్దాం వస్తావా బాబూ..?
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. 14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశారో.. నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏం చేశారో చర్చిద్దామా? అని ప్రశ్నించారు. 1.50 కోట్ల ఇళ్ల దగ్గరకు రావడానికి చంద్రబాబు సిద్దమా? అని మంత్రి సవాల్ చేశారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటేః బాబు పిల్ల చేష్టలుః నెల్లూరు జిల్లాలో టిడ్కో ఇళ్ల మీద చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్స్ చూస్తే.. పిల్ల చేష్టల్లా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పిచ్చి ప్రేలాపనలు మానుకుంటే మంచిది. వయసుకు తగ్గట్టుగా ప్రవర్తన ఉండాలి. 74 ఏళ్ళ వయసు, 44 ఏళ్ళ రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు.. తాను చేయని పనిని, చేసినట్లుగా చెప్పుకుంటూ సెల్ఫీలు దిగటం- దాన్ని ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉంది. మీ హయంలో పునాది దశకే పరిమితమైన టిడ్కో ఇళ్లను మా ప్రభుత్వం వచ్చాక పూర్తి చేసి, మౌలిక సదుపాయలు కల్పిస్తే.. దాన్ని నీవేదో ఉద్ధరించినట్లుగా ప్రచారం చేసుకోవడానికి సిగ్గు ఎక్కడ లేదు అని అడుగుతున్నాం. టిడ్కో ఇళ్ళు, షేర్ వాల్ టెక్నాలజీ పేరుతో చంద్రబాబు నాయుడు హంగామా చేసి, చివరకు పేదల మీద అప్పు భారం వేస్తే.. మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఆ భారాన్ని మొత్తం తగ్గించి పేదవాళ్ల కు వాటిని అందించే కార్యక్రమం చేస్తున్నారు. బాబుకు ఛాలెంజ్ః చంద్రబాబు నాయుడుకు ఛాలెంజ్ చేస్తున్నా. ఆయన చేసిన ట్వీట్ కు జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 50 లక్షల గడపల దగ్గరకు రావడానికి, ఎవరి హయాంలో ఏం మేలు జరిగిందో చర్చించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడా..? అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అలానే, మా హయాంలో నిర్మిస్తున్న 17, 005 జగనన్న కాలనీల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ కాలనీలలో లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఏ విధంగా కాలనీల్లో ప్రజలు నివాసం ఉంటున్నారో తెలుసుకోవడానికి మాతో పాటు చంద్రబాబు వచ్చినా సరే, లేకుంటే ఆయనతో పాటు మేము అయినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తున్నా. స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా..?. మీ అబ్బాయి నారా లోకేష్కు పనిపాట లేక రోడ్ల వెంట తిరుగుతున్నాడు. బస్సు ఎక్కి ఫోటో, ఆటో దగ్గర ఫోటో దిగి పెడుతున్నాడు. మరి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సిగ్గులేదా? అని అడుగుతున్నాం. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబుకు రేపో, మాపో మూర్ఛ రోగం వస్తోంది. చంద్రబాబు తన పాలనలో చెప్పుకోవడానికి అయినా ఒక్క సంక్షేమ పథకం ప్రవేశపెట్టి అమలు చేశాడా? అభివృద్ధి కార్యక్రమం చేశాడా? తన అయిదేళ్ల పాలనలోకాలక్షేపం, కబుర్లు చెప్పబట్టే చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నిర్మాణంలో ఉన్న 17 వేల జగనన్న కాలనీలు మాతో పాటు వచ్చి చంద్రబాబు చూస్తే గుండె ఆగి చస్తాడు. ఇవాళ 17వేల జగనన్న లే అవుట్లు...ద్వారా ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నాం. కొన్నిచోట్ల పదివేలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఒక మున్సిపాల్టీయే ఏర్పడుతుంది. ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యక్షంగా చూసేందుకు రమ్మని మరోసారి చంద్రబాబుకు ఛాలెంజ్ చేస్తున్నాం. 14 ఏళ్ళ సీఎంగా నీవు చేసిందేమోటో చెప్పగలవా బాబూ? 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చేసిన మేలు ఏమిటి..? ఆయన చేసిన అభివృద్ధి ఏమిటి? నాలుగేళ్లల్లోనే జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు ఏంటో మేం జగన్ మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి చెబుతున్నాం. నీవు ఏమైనా మంచి చేసి ఉంటే.. ప్రజల గడపల వద్దకు వెళ్ళి చెప్పే ధైర్యం ఉందా..? అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి చేసి ఉంటే.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు ఎందుకు పరిమితం అయింది...?. గడిచిన మూడేళ్ల పది నెలల కాలంలో ప్రతి గడపకు మేము మంచి చేశాం కాబట్టే.. ఆ గడపకు వెళ్లి అక్కా చెల్లి, అవ్వాతాత, అన్నాతమ్ముడి ఆశీర్వాదం తీసుకుంటున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే.. ఏ రాజకీయ నాయకుడు అయినా ప్రతి గడపకు వెళ్లిన దాఖలాలు లేవు. ఇవాళ మా ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచి చేసింది కాబట్టే, వారి ఆశీస్సుల కోసం మేమంతా ఆ గడప దగ్గరకు నేరుగా వెళుతున్నాం. ప్రతి గడపకు వెళ్లడమే కాకుండా ప్రభుత్వ పథకాలు సంతృప్తిగా ఉన్నాయా? వారికి రావాల్సిన లబ్ధి గురించి అడుగుతున్నాం. ఒక్క రూపాయి అవినీతి లేకుండా, డీబీటీ ద్వారా నేరుగా తమ ఖాతాల్లోకి నగదు జమ కావడం గతంలో ఎన్నడూ జరగలేదని, ఇప్పుడు అలా జరుగుతుంది కాబట్టే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాము ముఖ్యమంత్రిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా, తమ బిడ్డగా, తమ్ముడిగా, అన్నగా, మేనమామగా చూస్తున్నామని, ప్రజలు ఆశీర్వదిస్తుంటే ఏ నాయకుడికైనా ఇంతకన్నా కావల్సిందేముంది. అదే చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రానికి ఒక కంసుడుగా, ఒక నరకాసురుడుగా ప్రజలు భావిస్తున్నారు. అమ్మ ఒడిలాంటి పథకం పెట్టాలని బాబు బుర్రకు ఏనాడైనా తట్టిందా..? మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే ఓర్వలేని చంద్రబాబు నాయుడు సెల్ఫీలు అంటూ మాకు ఛాలెంజ్ లు విసరడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, చీమూ, నెత్తురు ఉంటే మా ఛాలెంజ్ ను స్వీకరించాలి. గత నాలుగేళ్ళుగా మేము చేసిన మేలుతో పాటు, చంద్రబాబు హయాంలో డ్వాక్రా మహిళలకు చేస్తామని ఎగ్గొట్టిన రుణమాఫీపైనా, రైతులు రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని మోసం చేసిన విషయంలో చర్చకు సిద్ధమా?. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బుర్రలో.. పిల్లల చదువుకోసం తల్లులు ఖాతాల్లో నగదు వేసే ఆలోచన ఎన్నడైనా తట్టిందా? ఇవాళ జగన్ మోహన్ రెడ్డిగారు తన మానస పుత్రికగా, అమ్మ ఒడి పథకం ద్వారా ఆ కార్యక్రమం చేపట్టారు. అక్కచెల్లెమ్మలకు ఆసరా, చేయూత, కాపు నేస్తం ఇస్తున్నాం. అలాగే ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి మరీ అవ్వా తాతల చేతుల్లో పెన్షన్ డబ్బులు ఇస్తున్నాం. మీ పాలనలో ఇటువంటివి ఏమైనా చేశారా చంద్రబాబూ..? అని అడుగుతున్నాం. నారా లోకేష్ కు మాతో పోటీపడే దమ్ము, ధైర్యం లేదు. కేవలం సెల్ఫీలు తీసి, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు పెట్టి హడావుడి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కొడుకుగా పాదయాత్ర చేస్తున్నావో, లేక మాజీమంత్రిగా పాదయాత్ర చేస్తున్నావో మాకు తెలియదు కానీ... జగనన్న కాలనీల పురోగతి, పనితీరు మీద చర్చకు ఎక్కడకు రమ్మన్నా నేను వచ్చేందుకు సిద్ధం. ఒకవేళ మాతో నారా లోకేష్ వచ్చినా తీసుకువెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు. చంద్రబాబు అయినా నారా లోకేష్ అయినా గుడ్డ కాల్చి మొహాన వేసి తుడుచుకుని వెళ్లిపోయే రకాలు. మీ ట్వీట్లకు స్పందించాం. మా ఛాలెంజ్ కు మీరు సిద్ధమా? మీకు స్పందించే గుణం ఉంటే.. తండ్రికొడుకులు వచ్చేందుకు సిద్ధమా? మీ పాదయాత్రలో ఎక్కడైనా పాల్గొనేందుకు నేను సిద్ధం. ప్రతి గడప దగ్గరకు వెళ్లి ప్రతి అక్కచెల్లెమ్మను అడుగుదాం. మీ హయాంలో చేసిన అభివృద్ధి, మేలు- మా నాలుగేళ్ల పాలనలో జరుగుతున్న మేలుపై వారినే నేరుగా అడుగుదాం. మా నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగారు నేరుగా బటన్ నొక్కగానే డీబీటీ ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలు కామన్ మెన్ ఖాతాలోకి జమ అయ్యాయంటే అది పరిపాలన. మీకులా దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం మాకు చేతకాదు. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించడమే మా జగనన్న విధానం. దమ్ముంటే మా ఛాలెంజ్ ను స్వీకరించాలని చంద్రబాబుకు ఆయన కొడుకు లోకేష్ కు ఛాలెంజ్ చేస్తున్నాం. 175 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టే సీన్ బాబుకు ఉందా..? మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ...-2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగించబోతోంది. వై నాట్ 175, వై నాట్ కుప్పం.. ఇవే మా టార్గెట్ లు. 175 స్థానాల్లో మమ్మల్ని ఓడిస్తామంటున్న చంద్రబాబు నాయుడుకు అన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని నిలబెట్టే సీన్ ఉందా? అదే ఉంటే పొత్తుల కోసం పొర్లాడటం ఎందుకు? దమ్ము, ధైర్యం లేని చవటలు, సన్నాసులు జగన్ గారితో పోటీనా? ఒక వీరుడిని ఎదుర్కొనేందుకు ఎన్ని పార్టీలు పొత్తులతో కలిసి వచ్చినా.. సింహం ముందు దిగదుడుపే. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు జరగబోయే ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. పార్టీ గుర్తుతో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో మేమే కదా గెలిచాం. -
నెల్లూరు టీడ్కో ఇళ్ల వద్ద చంద్రబాబు సెల్ఫీకి మంత్రి జోగి రమేష్ కౌంటర్
-
కట్టని ఇళ్ల వద్ద సెల్ఫీలు దిగటం సిగ్గుచేటు: జోగి రమేశ్
సాక్షి, అమరావతి: నారా చంద్రబాబు, లోకేశ్ సెల్ఫీ బాబులు, కామెడీ రాజాలుగా తయారయ్యారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. పేదలకు వారు నిర్మించిన ఇళ్లంటూ నెల్లూరులో టిడ్కో ఇళ్ల వద్ద బాబు సెల్ఫీ దిగడంపై మంత్రి ఒక ప్రకటనలో స్పందించారు. టీడీపీ హయాంలో నెల్లూరులో టిడ్కో ఇళ్లు, ఇప్పుడున్న ఇళ్ల నాడు–నేడు ఫోటోలను విడుదల చేశారు. నెల్లూరులో టిడ్కో ఇళ్లన్నీ ఆయనే కట్టేశానని చెప్పుకోవడానికి సిగ్గులేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబే టిడ్కో ఇళ్లన్నీ కట్టేస్తే మరి వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టినవేమిటని అన్నారు. టిడ్కో ఇళ్ల రూపంలో పేద, మధ్యతరగతి ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదని చెప్పారు. టిడ్కో ఇళ్ల పేరిట పేదవారి ఆశలను ఆసరాగా చేసుకుని అవినీతికి పాల్పడ్డారని అన్నారు. చదరపు అడుగు నిర్మాణానికి ఆ రోజుల్లో రూ.1,000–1,100 మధ్య ఖర్చయితే అంతకు రెండు మూడు రెట్లు అధికంగా టెండర్లు ఖరారు చేసి దోచేశారన్నారు. అది కూడా ఒక్క చోటా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, అస్తవ్యస్తంగా వదిలేశారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాకే టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, అన్ని మౌలిక వసతులతో ప్రజలకు అందిస్తోందని తెలిపారు. నెల్లూరులోనూ బాబు కట్టని ఇళ్ల వద్ద సెల్ఫీలు తీసుకొని తానే కట్టానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక టి డ్కో ఇళ్ల కోసం రూ. 8,734 కోట్లు ఖర్చు చేసిందన్నా రు. అందులో రూ. 5,840 కోట్లు, నిర్మాణ పనులకు, టీడీపీ అస్తవ్యస్తంగా వదిలేసిన ఇళ్లకు మౌలిక సదుపాయాల కోసం రూ.725 కోట్లు ఖర్చు చేసిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వదిలిన రూ.3 వేల కోట్లు బకాయిలు కూడా తమ ప్రభుత్వమే తీర్చిందని తెలి పారు. బాబు హయాంలో 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లకు ఒక్కో లబ్ధిదారుడిపై రూ. 7.2 లక్షలు భారం వేయగా, వైఎస్ జగన్ ఆ భారాన్ని తొలగించి, ఇళ్లను ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు. ఇలా పేదలపై రూ. 3,805.4 కోట్ల మేర భారాన్ని తప్పించారన్నారు. 365 చ.అ, 430 చ.అ ఇళ్ల లబ్ధిదారుల కు ముందస్తు చెల్లింపుల్లో 50 శాతం సబ్సిడీని సీఎం జగన్ కల్పించారన్నారు. ఈ రూపేణా రూ.482.31 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించిందన్నారు. ఒక్క రూపాయికే ఇళ్లను రిజిస్ట్రేషన్ చేయిస్తూ రూ.1,200 కోట్ల రిజిస్ట్రేషన్ భారాన్ని కూడా తొలగించామన్నా రు. చంద్రబాబు ప్రభుత్వం టీడ్కో ఇళ్ల అంచనాలు పెంచేసి, దోచేస్తే.. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్ చేపట్టి రూ.392 కోట్లు ప్రజా ధనం ఆదా చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అస్తవ్యస్తంగా వదిలేసిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి ఇప్పటికే 50వేల ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. మిగి లిన ఇళ్లను కూడా త్వరలోనే లబ్ధిదారులు అందిస్తామని చెప్పారు. చంద్రబాబు తమతో వస్తే ఇళ్లు ఎక్కడ కడుతున్నారో చూపిస్తామన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఊళ్లను చూస్తే చంద్రబాబు గుండె ఆగిపోయినా ఆశ్చర్యం లేదన్నారు. టీడీపీం సెల్ఫీల పార్టీ అని ఆరోపించారు. చంద్రబాబు వాలకం చూస్తుంటే చార్మినార్, తాజ్మహల్ కూడా ఆయనే కట్టేశానని ఓ సెల్ఫీతీసుకునేట్టు ఉన్నారన్నారు. తండ్రీ కొడుకుల కామెడీని రాష్ట్ర ప్రజలు చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. -
జగనన్న కాలనీలు ఆధునిక లోగిళ్లు
సాక్షి, అమరావతి: జగనన్న కాలనీల్లో శాశ్వతప్రాతిపదికన అత్యాధునిక మౌలిక సౌకర్యాలు కల్పించి, ఆధునిక లోగిళ్లుగా తీర్చిదిద్దుతున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. త్వరలోనే జగనన్న కాలనీలు పూర్తవుతాయని, రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర అని చెప్పారు. 4బీ అప్లికేషన్ జియో ట్యాగ్ విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని, చివరికి కోర్టులో కేసులు కూడా వేయించారని తెలిపారు. భూములను కొని మరీ పేదవారికి ఇళ్లు ఇస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. జగనన్న కాలనీల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఏ పార్టీ వారైనా ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ ఇళ్లు కట్టించి ఇస్తున్నారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. వేలాది ఎకరాల భూమి కొనుగోలు చేసి సంతృప్తస్థాయిలో పేదలందరికీ ఇళ్లు ఇవ్వడం ఓ చరిత్ర అని ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి కొనియాడారు. కొన్నిచోట్ల పట్టా కేటాయించిన తర్వాత రద్దవడంపై పరిశీలన జరపాలని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు కోరారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఇళ్లను అమ్ముకునేవని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి అన్నారు. సాంకేతిక సమస్యలతో ఇళ్లు లభించని వారికి వేరే చోట పట్టాలివ్వాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కోరారు. సీఎం జగన్ చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతమని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు తరం, వైఎస్ జగన్మోహన్రెడ్డి తరం అని చరిత్ర చెప్పుకుంటుందని అన్నారు. టీడీపీ హయాంలో అనారోగ్యశ్రీగా మార్చారు - మంత్రి రజిని టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ... టీడీపీ హయాంలో 107 ప్రొసీజర్లు పెంచితే, ఆరోగ్యశ్రీలో 3,138 ప్రొసీజర్లు పెంచిన ఘనత సీఎం వైఎస్ జగన్కు దక్కుతుందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకానికి ఆరోగ్యశ్రీ స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి తెలిపారు. మత్స్యకారులకు అండగా ఉంటాం- మంత్రి సీదిరి అప్పలరాజు వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకారునికి మత్స్యకార భరోసా అందిస్తున్నామని పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ప్రమాదంలో మరణించిన మత్స్యకారుడు కుటుంబ పెద్ద కాకపోయినప్పటికీ పరిహారం అందిస్తున్నామని చెప్పారు. భీమిలి, చింతపల్లి, రాజయ్యపేట వద్ద ఎఫ్ఎల్సీలకు టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభిస్తామన్నారు. అవసరమైతే సబ్సిడీ మొత్తాన్ని పెంచుతామన్నారు. మత్స్యకార భరోసా కుటుంబంలో అందిరికీ వర్తింపజేయాలని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్ కోరారు. 15 రోజుల శిక్షణతో అర్చకత్వం హిందూ ధర్మ ప్రచారం, రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది 2,900 దేవాలయాలు నిర్మిస్తున్నామని, ధూపదీప నైవేద్యాల కింద రూ.27.47 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ధూపదీప నైవేద్యాల పెండింగ్ బిల్లులు పది రోజుల్లో క్లియర్ చేస్తామన్నారు. దేవాలయానికి సంబంధం ఉన్న ప్రతి కమిటీకి ఏటా రూ.15 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. దేవాలయాల్లో పని చేసేందుకు ఆసక్తితో ఉన్న వారికి 15 రోజులు శిక్షణ ఇచ్చి అర్చకత్వంలో నియమిస్తామని చెప్పారు. 16 ఏళ్లు నిండిన తరువాత వంశపారంపర్య అర్చకులుగా నియమిస్తామన్నారు. హిందూధర్మ పరిరక్షణకు జగన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. చంద్రబాబు కూల్చేసిన ఆలయాలను సీఎం జగన్ పునర్మిస్తున్నారని తెలిపారు. -
పార్టీ పెట్టిన పదేళ్లకు గుర్తొచ్చిందా పవన్: జోగి రమేష్ ఫైర్
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. సామాజిక న్యాయంపై చర్చకు సిద్దమా? అంటూ ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత పవన్ లేదంటూ ఫైర్ అయ్యారు. కాగా, మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ముందుగా బీసీలకు పవన్ క్షమాపణలు చెప్పాలి. పార్టీ పెట్టిన పదేళ్లకు పవన్కు బీసీలు గుర్తొచ్చారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఒక బానిస. 2014లో చంద్రబాబుతో కలిసి బీసీలకు ఇచ్చిన 125 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. బీసీలు తలెత్తుకునేలా బీసీల తలరాతను మార్చింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఏపీలో సామాజిక న్యాయం చూసి ఓర్వలేకపోతున్నారు. 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పలేని చవట దద్దమ్మలు. మీరంతా కలిసి కట్టుగా వచ్చినా సీఎం జగన్కు ఏమీ చేయలేరు’ అని కామెంట్స్ చేశారు. -
పవన్ కళ్యాణ్ బీసీలకు క్షమాపణ చెప్పాలి
-
మంత్రి జోగి రమేష్ తో స్ట్రెయిట్ టాక్
-
బాలకృష్ణ డైలాగులు రాసిస్తే లోకేష్ చెప్తున్నారు: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: ఈనాడు రామోజీరావు, టీడీపీపై మంత్రి జోగి రమేష్ సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలి అంటూ సవాల్ విసిరారు. దున్నపోతుపై వర్షం పడినట్టు రామోజీ వ్యవహారం ఉందని తీవ్ర విమర్శలు చేశారు. కాగా, జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈనాడు పత్రికపై ప్రజా వ్యతిరేకత మొదలైంది. ప్రజలు ఎల్లో మీడియాను దహనం చేస్తారు. రామోజీ అండ్ కో ప్రతీరోజు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. 32 పథకాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మన్ననలు పొందారు. సంక్షేమం అంటే ఏవిధంగా ఉంటుందో చూపించాం. సామాజిక న్యాయం ఏంటో చూపించాం. దున్నపోతుపై వర్షం పడినట్టు రామోజీ వ్యవహారం ఉంది. చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలి. అసెంబ్లీ సాక్షిగా సామాజిక న్యాయంపై చర్చిద్దాం. ఈనాడు తప్పుడు వార్తలపై నిరసనలు తెలిపాము. ఈరోజు ఐదుగంటలలోపు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాము. కానీ, ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పలేదు. దీంతో, ఈనాడుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. రామోజీ వికృత జర్నలిజం దహించిపోయే రోజులు వచ్చాయి. ఎవరేం చేశారో చర్చకు రావాలి. ఇదే నా సవాల్. అసెంబ్లీకి రా తేల్చుకుందాం, ఏ అంశం మీదైనా మాట్లాడుదాం. బాలకృష్ణ డైలాగులు రాసిస్తే లోకేష్ చెప్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఈనాడుపై వైఎస్ఆర్సీపీ తరపున చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: మంత్రి జోగి రమేష్
-
రామోజీ ఇలాగే విషం చిమ్మితే ఊరుకునేది లేదు: మంత్రి జోగి రమేష్
-
‘రామోజీపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది’
విజయవాడ: ప్రభుత్వంపై పనిగట్టుకుని బురదజల్లే ప్రయత్నం చేస్తన్న ఈనాడు రామోజీరావుకి.. ప్రభుత్వం చేస్తున్న మంచి కనిపించడం లేదా అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. ప్రభుత్వం చేస్తున్న మంచిని ఏనాడైనా ఈనాడులో రాశావా అని మండిపడ్డారు మంత్రి. రామోజీరావు రాసే ప్రతివార్త విషపు రాత అని, రామోజీపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందనే విషయం తెలుసుకోవాలని హెచ్చరించారు. రామోజీ ఇలాగే విషం చిమ్ముతూ వార్తలు రాస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి వార్నింగ్ ఇచ్చారు. సాక్షి టీవీతో మాట్లాడిన మంత్రి జోగి రమేష్.. ‘రామోజీరావుకి పిచ్చిపట్టింది . హైదరాబాద్లో నాలుగు గోడల మధ్య కూర్చొని సీఎంపై విషం కక్కుతున్నాడు. హైదరాబాద్లో కూర్చున్న నీకు ఏపీలో అభివృద్ధి ఏం కనబడుతుంది. నీ కులం వాళ్లే అధికారంలో ఉండాలా?, వేరే కులం వారికి రాజ్యాధికారం అవసరం లేదా?, సీఎం జగన్ చేస్తున్న సంక్షేమం నీ కళ్లకు కనిపించడం లేదా?, రామోజీపై ప్రజల తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికైనా విషపు రాతలు మానుకోవాలి. ఇదే తరహాలో భవిష్యత్లో వార్తలు రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని హెచ్చరించారు. -
సామాజిక న్యాయ నిర్మాత సీఎం జగన్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంత కాలం సామాజిక న్యాయ నిర్మాతగా, సామాజిక విప్లవకారుడిగా సీఎం వైఎస్ జగన్ పేరు నిలిచిపోతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60 శాతానికి పైగా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినందుకు మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున మంగళవారం విజయవాడలోని పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పుష్పాభిషేకం, సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలు, ఆశయాల్ని సీఎం జగన్ అమలు చేసి చూపించారని తెలిపారు. సామాజిక న్యాయం అంటే ఇలా ఉండాలని రుజువు చేశారన్నారు. పంచాయతీ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తున్నారని చెప్పారు. సామాజిక న్యాయానికి రూపకల్పన చేసి పెత్తందారీ వ్యవస్థను బద్దలు కొట్టారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సీఎం జగన్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశంలోనే ఎవరూ చేయలేదు.. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు జరిగిన బీసీ సభలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. తాజాగా 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, దేశంలో బడుగు, బలహీనవర్గాలకు ఇంత పెద్ద మొత్తంలో ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. గతంలో పనిచేసిన వారు బీసీలకు అంత చేశాం.. ఇంత చేశామంటూ మాటలు మాత్రమే చెప్పారని ఎద్దేవా చేశారు. తాము ఊహించనంతగా సీఎం వైఎస్ జగన్ బీసీలకు 68 శాతానికిపైగా సీట్లు కేటాయించారన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రాజ్యాధికారంలో బడుగులకు అత్యున్నత స్థానం కల్పించినందుకు గర్వపడుతున్నామన్నారు. ఏపీ దేశానికే రోల్మోడల్గా నిలుస్తుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో మహనీయులు కన్న కలలు నెరవేరుతున్నాయని చెప్పారు. శాసనమండలిలో 14 స్థానాలు కేటాయించడం నభూతో న భవిష్యత్ అని అన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ ఎం.శివరామకృష్ణ పాల్గొన్నారు. -
సామాజిక న్యాయం సీఎం వైఎస్ జగన్ తోనే సాధ్యం: మంత్రి జోగి రమేష్
-
టీడీపీ పెత్తందారీ వ్యవస్థను బద్దలుకొట్టిన వ్యక్తి సీఎం జగన్: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. సామాజిక న్యాయం అంటే ఏంటో సీఎం జగన్ నిరూపించారని తెలిపారు. టీడీపీ పెత్తందారీ వ్యవస్థను బద్దలుకొట్టిన వ్యక్తి వైఎస్ జగన్ అని కొనియాడారు. సామాజిక విప్లవం వైపు ఆయన అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ.. ‘సీఎం జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యం. 75 ఏళ్ల చరిత్రలో ఏపీలో మాత్రమే సామాజిక న్యాయం జరిగింది. సీఎం బీసీలను తల ఎత్తుకునేలా చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో సంక్షేమం, అభివృద్ధి వెల్లివిరిస్తోంది. ఆయన పాలనలో బలహీన వర్గాలవారు ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషంగా ఉన్నారు. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రభుత్వం. రిజర్వేషన్లు లేకపోయినా ఎక్కువ పదవులు ఇచ్చిన ఘనత జగన్ ది. డీబీటీ ద్వారా సుమారు రూ.2లక్షల కోట్లు అందజేశారు. లోకేష్ తన స్థాయికి మించి విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానాలను బేరానికి పెట్టిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ రాజ్యసభ స్థానాలను సూట్కేసుల కోసం అమ్ముకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై చంద్రబాబు, లోకేష్ విషం కక్కుతున్నారు. పొత్తులు పెట్టుకుని పొర్లాడినా టీడీపీని జనం పట్టించుకోరు. టీడీపీని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం అందరిపై ఉంది. అసెంబ్లీ నుంచి పారిపోయిన చంద్రబాబు రోడ్లమీద ఏదేదో మాట్లాడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి ఎవరి హయాంలో సామాజిక న్యాయం జరిగిందో చర్చకు చంద్రబాబు సిద్ధమా’ అని సవాల్ విసిరారు. చర్చకు వచ్చే దమ్ము చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. బీసీలపై చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే చర్చకు రావాలని మంత్రి జోగి రమేష్ ఛాలెంజ్ చేశారు. చదవండి: టికెట్టా.. వద్దే వద్దు! ఇంటర్నల్ సర్వేలతో బెంబేలెత్తుతున్న టీడీపీ నేతలు -
‘బీసీలంతా జగనన్నకు సెల్యూట్ చేస్తున్నారు’
సాక్షి, కృష్ణా: బీసీలకు ఆత్మగౌరవాన్నిచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఏపీ మంత్రి జోగిరమేష్ ఉద్ఘాటించారు. సోమవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై జోగి రమేశ్ స్పందించారు. ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో బీసీలకు పెద్దపీట వేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలకు సీఎం జగనన్న అగ్రస్థానం కల్పించారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వెనుకబడిన తరగతులను అందలం ఎక్కించిన ఏకైక నేత బహుశా జగనన్నే!. చట్టసభల్లో మా హక్కులను కాపాడుకునేందుకు ఆయన అవకాశం కల్పించారు. జగనన్న వల్ల బీసీలంతా తలెత్తుకుతిరుగుతున్నారు. బీసీలంతా జగనన్నకు సెల్యూట్ చేస్తున్నారు. భారతదేశ చరిత్ర పుటల్లో సీఎం జగన్ నిలిచిపోతారు అని పేర్కొన్నారు. బీసీలంతా సీఎం జగన్ వెంటే.. సాక్షి, గుంటూరు: సీఎం జగన్ బీసీలను రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి కవురు శ్రీనివాస్. గతంలో ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, డీసీసీబీ చైర్మన్ గా అవకాశం ఇచ్చి.. నేడు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ప్రకటించిన 18ఎమ్మెల్సీల్లో 14మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారు. అలాగే పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు. బీసీలంతా సీఎం జగన్ వెంటే ఉంటారు. బీసీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా చేసిన ఘనత జగన్ దే అని కవురు శ్రీనివాస్ తెలిపారు. -
సీఎంగా జగన్ ఉన్నాడు కాబట్టే..అనేక పథకాలు
-
లోకేష్ డబ్బుంటే సరిపోదు.. ఖలేజా ఉండాలి: జోగి రమేష్