Jogulamba Gadwal
-
జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్
-
గద్వాల యువతి బలవన్మరణంలో ట్విస్ట్
క్రైమ్: జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఉదంతంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె కడుపు నొప్పితో బలవన్మరణానికి పాల్పడలేదని.. ప్రియుడి మోసం భరించలేకే అఘాయిత్యానికి పాల్పడిందని తేలింది. ధరూర్ మండల కేంద్రానికి చెందిన సునంద(23) డిగ్రీ పూర్తి చేసి.. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో చదువుతోంది. తాజాగా సొంతూరికి వెళ్లిన ఆమె.. ఇంట్లోనే ఉరేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి.. ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రకటించారు. అయితే.. సునంద తొలుత కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం నడిచింది. కానీ, ప్రియుడి ఆ మోసం భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తర్వాత తేలింది. అంతేకాదు.. ఆ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి.. రూ.9 లక్షలను యువతి తరపు బంధువులకు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. యువతి బంధువులను గ్రామ పెద్దలు బలవంతంగా ఒప్పించారని.. ఈ వ్యవహారంలో పోలీసులకు వాటా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సునందకు న్యాయం చేయాలని పలువురు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది. ఇదీ చదవండి: అదే పనిగా భర్త నైట్షిఫ్ట్ వెళ్తున్నాడని.. -
విషాదం.. కొడుకు పుట్టినరోజే.. తండ్రి ఆత్మహత్య..
ఉండవెల్లి: కొడుకు జన్మించిన రోజే ఓ తండ్రి బలవన్మర ణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో చోటు చేసు కుంది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న రాజు (29)కు కొన్నేళ్ల క్రితం గీతతో వివాహమైంది. వారిద్దరికి పాప, కుమారుడు ఉండగా.. ఆదివారం మూడో సంతానంగా మగ బిడ్డ అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించాడు. కుమారుడిని చూసి వచ్చిన రాజు.. మధ్యాహ్నం వేళ ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదని అతని తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: జైలు నుంచి బయటకొచ్చిన నిహారిక -
కుక్కల పరుగు పందెం.. మామూలుగా లేదుగా!
అయిజ(జోగుళాంబ గద్వాల జిల్లా): అయిజలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్రాష్ట్ర శునకాల పరుగు పోటీ నిర్వహించారు. పోటీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 9 కుక్కలు పాల్గొనగా.. అన్ని బహుమతులను కర్ణాటక రాష్ట్రానికి చెందిన శునకాలు కైవసం చేసుకోవడం విశేషం. ఇండి జిల్లాకు చెందిన వీఐపీ లల్యా ప్రథమ బహుమతిగా రూ.15,016, సుల్తాన్ ద్వితీయ బహుమతిగా రూ.10,016, తేజకళ్ల తృతీయ బహుమతిగా రూ.8,016, బాపురం జిల్లాకు చెందిన అంజి నాలుగో బహుమతిగా రూ.5,016 గెలుపొందాయి. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలివచ్చారు. చదవండి: బాబా ముసుగులో ‘నిత్య’ పెళ్లికొడుకు -
ఛార్జింగ్లో ఉన్న మొబైల్ తీస్తుండగా షాక్ తగిలి చిన్నారి మృతి
సాక్షి, గద్వాల్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్లో ఉన్న మొబైల్ ఫోన్ తీస్తుండగా షాక్ తగిలి నిహారిక అనే చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. అయిజ మండలం ఈడిగొనిపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. కాగా పదేళ్ల నిహారిక 4వ తరగతి చదువుతుంది. కూతురు అకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ పరికరాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. సెల్ఫోన్లు, ఈ-వాహనాలు పేలుతున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. కొన్ని సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడవద్దని, పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: మల్లారెడ్డి ఆదాయాలపై ఐటీ విచారణ: 13 మంది హాజరు.. మరో 10 మందికి నోటీసులు -
జోగులాంబ గద్వాల్ జిల్లాలో దారుణం..
-
దేవీ శరన్నవరాత్రులు: అమ్మవారికి రూ.5,55,55,555తో అలంకారం
దేవీ శరన్నవరాత్రోత్సవాలతో ఆధ్యాత్మికశోభ వెల్లివిరుస్తోంది. వేడుకల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం అలంపూర్ జోగుళాంబ, బాసర సరస్వతి, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవార్లు స్కందమాతగా దర్శనమిచ్చారు. విజయవాడ కనకదుర్గను, వరంగల్ భద్రకాళిదేవిని శ్రీలలితాత్రిపుర సుందరిగా అలంకరించారు. – జోగుళాంబ శక్తిపీఠం(గద్వాల జిల్లా)/ హనుమకొండ కల్చరల్/ బాసర(ముథోల్) దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్లోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు. రూ.5,55,55,555.55(5 కోట్ల 55 లక్షల 55 వేల 555 రూపాయల 55 పైసలు)ల కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేశారు. – స్టేషన్ మహబూబ్నగర్ -
జలమే గరళమై! గద్వాలలో ఘోరం.. 100 మందికి అస్వస్థత, ఇద్దరు మృతి
గద్వాల రూరల్: కలుషిత తాగునీరు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచే సుకుంది. గద్వాల పట్టణం 12వ వార్డుకు చెందిన వేదనగర్, గంటగేరి, ధరూరుమెట్టు, కృష్ణారెడ్డి బంగ్లా కాలనీల్లో మూడు రోజుల కిందట తాగునీరు కలుషితమై పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో గంటగేరికి చెందిన కృష్ణ (50), మంగలి నర్సింగమ్మ (59) సైతం వాంతులు విరేచనాలతో గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో చేరారు. చదవండి👉🏾వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా కృష్ణ పరిస్థితి విషమంగా మారడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కర్నూలుకు రిఫర్ చేశారు. దీంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో గుండెపోటు రావడంతో మృతి చెందాడు. అలాగే ఈ నెల 4 నుంచి జిల్లా ఆస్ప త్రిలో మంగలి నర్సింగమ్మ చికిత్స పొందుతు న్న క్రమంలో బుధవారం ఆమె పరిస్థితి విష మించడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్ప త్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతులిద్దరూ పక్క పక్క వీధుల వారే కావడంతో ఆ కాలనీలో విషాదం నెలకొంది. కాగా, 12వ వార్డులోని 4 కాలనీల్లో వాంతులు, విరేచనాలతో 3 రోజు లుగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో 24 మంది చికిత్స పొందుతున్నారు. గద్వాల ప్రైవేట్ ఆస్ప త్రుల్లో 70–75 మంది చికిత్స తీసుకుంటుండగా వారిలో 20 మంది చిన్నారులు ఉన్నారు. చదవండి👉🏾తాగేనీళ్లు లేకున్నా..మద్యం ఏరులై పారుతోంది కలుషిత నీటితోనే.. ఈ నెల 4న వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న కేసులు గుర్తించాం. వెంటనే వైద్యులతో కూడిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కలుషిత నీటి ప్రభావానికి గురైన కాలనీలో సర్వే చేపట్టాం. మృతి చెందిన ఇద్దరూ వాంతులు, విరేచనాల బారినపడినవారే. అయితే వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో వైద్యం అందించే సమయంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించి మృతి చెందారు. అస్వస్థతకు గురైన వారి నుంచి రక్తనమూనాలతోపాటు వారు వినియోగించే నీటి నమూనాలు సేకరించాం. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రాథమికంగా ఇలాంటి కేసులు నీటి కలుషితం కారణంగానే తలెత్తుతాయి. – చందూ నాయక్, డీఎంహెచ్ఓ, గద్వాల -
ప్రాణం పోయింది... పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు!
పెబ్బేరు: ఉన్న ఒక్కగానొక్క కొడుకు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఆ తల్లిదండ్రులు ఆశ పడ్డారు. కానీ 16ఏళ్ల ప్రాయంలోనే కొడుకు అర్ధాంతరంగా కన్నుమూశాడు. తాజాగా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడ వ్వడంతో కుటుంబం కంటికి పుట్టెడుగా శోకిస్తోంది. వివరాల్లోకి వెళ్తే... జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడుకు చెందిన చంద్రకళ, కుర్వ ఆంజనేయులు దంపతులు బతుకుదెరువు నిమిత్తం 20 ఏళ్లకిందట పెబ్బేరుకు వచ్చి స్థిరపడ్డారు. వీరికి కొడుకు రాకేష్(16), కూతురు నందిని. ఇద్దరు పిల్లలను స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. పక్షవాతానికి గురైన తండ్రి ఆంజనేయులు కొన్ని నెలలుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. రాకేష్ ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాశాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న అతను.. జూన్ 19న తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి, బావిలోపడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కాగా గురువారం విడుదలైన పదోతరగతి ఫలితాల్లో 8.8 జీపీఏ సాధించాడు. కొడుకు పాసైనట్లుగా తెలుసు కున్న తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అతడిని గుర్తు తెచ్చుకుని కన్నీరు మున్నీరయ్యారు. -
టీఆర్ఎస్లో అసంతృప్తి సెగలు.. రహస్య భేటీ..
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే అబ్రహం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. ప్రధానంగా పాలనా వ్యవహారాల్లో ఆయన తనయుడు జోక్యం చేసుకోవడం.. పార్టీలోని స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చదవండి👉: కేసీఆర్ సుముఖత.. టీఆర్ఎస్ వెంట పీకే టీమ్ నియోజకవర్గ పరిధిలోని పలువురు అసంతృప్త నేతలు ఇటీవల రహస్యంగా సమావేశమై పోరు కార్యాచరణ పథకం రచించారు. ఇందుకనుగుణంగా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో కారులో కిరికిరి తారాస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. పాలమూరులో ఒకవైపు బీజేపీ ప్రజాసంగ్రా మ యాత్ర కొనసాగుతుండగా మరోవైపు కాంగ్రెస్ సైతం క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై పోరుబాట పట్టింది. ఈ క్రమంలో అలంపూర్లో అధికార పార్టీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. గులాబీలో అంతర్గత పోరు రచ్చకెక్కిన నేపథ్యంలో ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోనని చర్చ జోరుగా సాగుతోంది. ఇలా ముదిరింది.. 2009 డీలిమిటేషన్లో అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యరి్థగా వీఎం అబ్రహం బరిలో నిలిచి విజయం సాధించారు. 2014లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కుమార్ గెలుపొందారు. తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో ఈసారి టీఆర్ఎస్ నుంచి అబ్రహం పోటీచేసి గెలిచారు. అయితే గెలిచిన కొంతకాలం తర్వాత స్థానిక నేతలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అదే సమయంలో ఆయన తనయుడు అజయ్ పొలిటికల్ ఎంట్రీకి అబ్రహం సన్నాహాలు చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో అలంపూర్ నుంచే వారసత్వం పుచ్చుకోనున్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో పాటు అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం అందకపోవడం.. అందినా చివరి నిమిషంలో కబురు రావడం వంటి సంఘటనలు స్థానిక ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తిని రగిల్చాయి. దళితబంధు, ఇతర పథకాల అమలులో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకోకపోవడం మరింత నిప్పు రాజేసినట్లు సమాచారం. దీంతో పలువురు అసమ్మతి నేతలు ఇప్పటికే నాలుగైదు పర్యాయాలు రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. అయితే పార్టీకి చెడ్డ పేరు రావొద్దనే ఉద్దేశంతో తగిన సమయం కోసం వేచిచూసినట్లు తెలుస్తోంది. అయిజలో రహస్య భేటీ.. ప్రస్తుతం అసంతృప్తితో రగులుతున్న నేతలు మొదట్లో ఎమ్మెల్యే అబ్రహంతో సఖ్యతగానే ఉన్నారు. ఎప్పుడైతే తన కొడుకు అజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడం.. అధికారిక కార్యక్రమాలతో పాటు తమ పరిధిలోని మండలాలు, గ్రామాల్లో జరిగే వివిధ కార్యకళాపాల్లో అజయ్ పెత్తనం చేయడాన్ని సీరియస్గా తీసుకున్న పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పీఏసీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సోమవారం అయిజలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశమై పోరు కార్యాచరణపై చర్చించారు. కేటీఆర్ వద్దకు పంచాయితీ.. ఓ నిర్ణయానికి వచ్చిన అసంతృప్త నేతలు సమావేశం అనంతరం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే అబ్రహం తీరుతో తమకు జరుగుతున్న అవమానాలను ఏకరువు పెట్టారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని హైదరాబాద్లోని వారి క్యాంపు కార్యాలయాల్లో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని కోరినట్లు సమాచారం. స్పందించిన వారు ‘అలాగేనని.. ప్లీనరీ ఉంది.. తర్వాత కలిసి మాట్లాడదాం’ అని అసంతృప్త నేతలను సముదాయించినట్లు తెలిసింది. ఎక్కడ కూడా బహిర్గతం కావొద్దని.. అంతర్గతంగానే పరిష్కరించుకుందామని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పంచాయితీ కేటీఆర్ వద్దకు చేరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్లీనరీ తర్వాత దీనిపై ఆయన దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అలంపూర్లో గట్టి పట్టు ఉన్న టీఆర్ఎస్ నేత తిరుమల్రెడ్డి మృతిచెందడం.. మరోవైపు గెలుపోటములను శాసించే చల్లా వెంకట్రామరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతుండడం.. ఈ క్రమంలో టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కడం చర్చనీయాంశాలుగా మారాయి. అలంపూర్ నియోజకవర్గంపై దృష్టి సారించిన అధికార పారీ్టలో కొందరు నేతలు ఇప్పటి నుంచే చక్రం తిప్పుతున్నారని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇసుకదందాలో తనయుడి మితి మీరిన జోక్యంతోనే ఎమ్మెల్యేపై అసమ్మతి సెగ రాజుకుందనే అభిప్రాయాలు టీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. -
గద్వాల జిల్లాలో ఉద్రిక్తత.. ఎస్ఐకి తీవ్ర గాయాలు
సాక్షి, గద్వాల: జోగులాంబ గద్వాలలోని కేటిదొడ్ది మండలం ఇర్కిచేడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఓ వర్గం వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహానికి నిప్పంటించారు. ఈ సందర్బంలో ఇరు వర్గాలను చెదరగొట్టే క్రమంలో ఎస్ఐకి మంటలు అంటుకున్నాయి. దీంతో ఆయన తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీసులు మోహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
-
జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు
-
జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం
సాక్షి, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నివాస గుడిసె కూలి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు గుడిసెలో మొత్తం ఏడుగురు ఉన్నారు. గ్రామానికి చెందిన హరిజన్ మోషకు భర్య శాంతమ్మ, కుమారులు చిన్న, రాము, చరణ్, తేజ కూతురు స్నేహ ఉన్నారు. ప్రతిరోజు మాదిరిగానే కుటుంబ సభ్యులంతా రాత్రి గుడిసేలో నిద్రిస్తుండగా వర్షానికి తడిసి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భార్యభర్తలతో సహా నలుగురు పిల్లలు చనిపోయారు. కూతురు స్నేహకు తీవ్రగాయాలు కావటంతో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. చదవండి: (ప్రయాణంలో విషాదం.. ఆరుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు) -
టీఆర్ఎస్ నేత బూతు పురాణం
-
కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రతిపక్షాల ముందస్తు అరెస్ట్
-
ర్యాలంపాడు రిజర్వాయర్ కట్టకు బీటలు
-
తాగొచ్చి వేధిస్తున్నాడని తల్లీ, అక్క దారుణం..
జోగులాంబ గద్వాల : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాగి వచ్చి వేధిస్తున్నాడనే కోపంతో యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లి, అక్క. ఈ సంఘటన ఉండవెల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. బొంకూరు గ్రామానికి చెందిన శేఖర్ నిత్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని అతడి తల్లి మద్దమ్మ, అక్క నీలమ్మ కోపం పెంచుకున్నారు. గురువారం అర్థరాత్రి అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. శరీరం మొత్తం కాలిపోవటంతో అతడ్ని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. -
అత్త ముక్కు కొరికిన కోడలు
సాక్షి, మానవపాడు (అలంపూర్): గతంలో కోడలిని అత్త కొట్టిన సంఘటనలు చూశాం.. ఇప్పుడు అత్త ముక్కును కోడలు కొరి కింది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మంగలి వీధిలోని శారదమ్మ, జయ్యన్న దంపతు లకు ప్రసాద్, భాస్కర్, శేఖర్ సంతానం. పెద్ద కొడుకు ప్రసాద్ కర్నూలులోని అత్తగారి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అన్నదమ్ముల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమ వారం ఉదయం మరోసారి గొడవ పడ్డారు. దీంతో చిన్న కుమారుడు శేఖర్ భార్య రేవతి ఆగ్రహంతో అత్త శారదమ్మ ముక్కు కొరికింది. తీవ్రరక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా, వైద్యులు.. ముక్కుకు ఏడు కుట్లు వేశారు. చదవండి: (ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేకపోతున్నా..) -
గర్భిణి సింధూరెడ్డి మృతదేహం లభ్యం
-
విగతజీవిగా తేలిన గర్భిణి సింధూరెడ్డి
సాక్షి, జోగులాంబ గద్వాల: కలుగొట్ల వాగులో రెండు రోజులుగా వెతుకుతున్న గర్భిణి నాగసింధూరెడ్డి(28) విగతజీవిగా తేలింది. సోమవారం తెల్లవారుజామున తుంగభద్ర నదిలో కర్నూలు బ్రిడ్జి దగ్గర గర్భిణీ మృతదేహం లభ్యమైంది. నాగసింధూరెడ్డి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు హృదయ విదాకరంగా విలపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భార్యభర్తలు నాగసింధూరెడ్డి, శివశంకర్రెడ్డితోపాటు వారి స్నేహితుడు జిలానీబాషా కలిసి శనివారం బెంగళూరు నుంచి హైదరాబాద్కు కారులో బయల్దేరారు. కలుగొట్ల వాగులో వీరు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. మిగతా ఇద్దరు బయటపడగా.. సదరు మహిళ గల్లంతైంది. గల్లంతైన ప్రాంతం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి గర్భిణి శవమై విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. (నీటి ఉధృతికి కొట్టుకుపోయిన కారు..) చదవండి: (తాత ఒకరికి... మనవడు మరొకరికి !) -
జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు
-
వేములవాడకు పోటెత్తిన భక్తులు
సాక్షి, హైదరాబాద్ : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేకువజామునే స్నానమాచరించి గుడికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజ రాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి సందర్భంగా ఆర్జిత సేవలన్నింటిని రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. స్వామివారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఖమ్మం: కల్లూరు మండలంలోని కాశ్మీర మహాదేవ క్షేత్రం శివాలయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దంపతులు దర్శించుకున్నారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు అభిషేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. కూసుమంచిలోని గణపేశ్వరాలయంలోని పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. సిద్దిపేట : హుస్నాబాద్ మండలం పొట్టపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దుబ్బాక మండలం చెల్లాపూర్లోని సోమేశ్వర ఆలయంలో శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కొమురం భీం అసిఫాబాద్: కాగజ్ నగర్ మండలంలోని ఈజ్గాంలో శివమల్లన్న జాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నల్లగొండ: తిప్పర్తి మండలం, రామలింగాలగూడెం శివాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి పూజారులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి పాలకిషేకం చేసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్లో గల 400 ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన శివాలయంలో శివునికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో హాజరైన భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు బూర్గంపాడు మండలం మోతె గ్రామంలో పవిత్ర గోదావరి నదిమధ్యలో కొలువైన వీరభద్ర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో శివయ్యను దర్శించేందుకు తరలి వస్తున్నారు. ములుగు: వెంకటాపురం మండలం లోని శ్రీ ఉమారామళింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేపట్టారు రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక, అధ్యాత్మిక కేంద్రంగా మారబోతుందన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. మెదక్: పాపన్నపేట్ మండలంలోని నాగసాన్ పల్లి ఏడుపాయల వనదుర్గా మాతకు మంత్రి హరీష్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరి వెంట ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉన్నారు. ఏడుపాయల మంజీర నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఉపవాస దీక్షతో వనదుర్గాభవాన్ని మాతను దర్శించుకుంటున్నారు. ఏడుపాయల వన దుర్గ భవాని క్షేత్రంలో ఎస్పీ శ్రీమతి చందన దీప్తి ఆదేశాల మేరకు మూడంచెల భద్రత నెలకొల్పారు. కామారెడ్డి: బిచ్కుంద మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని జుక్కల్ ఎమ్యెల్యే హన్మంత్ షిండే సందర్శించారు. బాన్సువాడ మoడలం సోమేశ్వర్ సోమలింగాల ఆలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి: మంథని వద్ద గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల: వెల్గటూరు మండలం కోటిలింగాల వద్ద భక్తులు గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించిస్తున్నారు. అనంతరం కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు చేపడుతున్నారు. సంగారెడ్డి: ఝరాసంగం మండల కేంద్రంలోని కేతకీ సంగమేశ్వర స్వామిని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్ దర్శించుకున్నారు. నారాయణఖేడ్లోని పంచగామ శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మంజీర నదిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు చిట్కూల్ చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆందోల్ గ్రామంలోని శివాలయంలోనూ అభిషేకాది కార్యక్రమాలు చేపట్టారు. మంచిర్యాల్: లక్సెట్టిపేట దండేపల్లి జన్నారం శివరాత్రి సందర్భంగా ఉదయాన్నే గోదావరి పుణ్య స్నానం ఆచరించిన భక్తులు అనంతరం శివాలయాల్లో మొక్కులు తీర్చుకుంటున్నారు. జోగులాంబ గద్వాల- అలంపూర్ బాలబ్రహ్మేశ్వరాలయంలో భారీగా తరలివస్తున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గద్వాల సమీపంలో కృష్ణానదీలో పుణ్యస్నానాలు ఆచరించి నదీఆగ్రహారం స్పటిక రామేశ్వరాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు. అడ్డాకుల మండలం కందూరులో కల్పవృక్షాలకు నెలవైన శ్రీ రామలింగేశ్వరాలయాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. నిజామాబాద్: మహా శివరాత్రి పర్వదిన వేడుకలు జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. నీల కంటేశ్వరాలయం , శంభుని గుడి, ఆర్మూర్ నవనాథ సిద్దేశ్వరాలయం, బోధన్ చక్రేశ్వరాలయం, లొంక రామ లింగేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. నీలకంటేశ్వర ఆలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్: నవ సిద్ధుల గుట్టపై భక్తుల తాకిడి పెరిగింది. నిర్మల్: బాసరలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఉప ఆలయం శ్రీ సురేశ్వరాలయం, శ్రీ వ్యాసేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. తెల్లవారుజామున సుప్రభాతసేవతో సంతతధార అభిషేకాలు మొదలయ్యాయి. శివలింగానికి ఆలయ అర్చకులు, వేదపండితులు బిల్వార్చనతో పూజలు చేశారు. సాయంత్రం ప్రదోష కాలంలో మహాలింగార్చన కార్యక్రమం తలపెట్టారు. పుట్టమన్నుతో చేసిన 365 మృత్తికా లింగమూర్తులకు వేదమంత్రోత్సరణతో అభిషేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి లింగోద్భవ సమయంలో సూర్యేశ్వర, వ్యాసేశ్వర ఆలయాల్లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహా హారతి, మంత్రపుష్పంతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. మంచిర్యాల: లక్సెట్టిపేట దండేపల్లి జన్నారంలో శివరాత్రి సందర్భంగా భక్తులు ఉదయాన్నే గోదావరి పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం శివాలయాల్లో మొక్కులు తీర్చుకుంటున్నారు. -
ఆ స్థానాల్లో ఫలించిన టీఆర్ఎస్ వ్యూహాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు జరిగిన 17 మున్సిపాలిటీల్లో కేవలం 8 స్థానాల్లోనే స్పష్టమైన మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ మిగతా పీఠాలను సైతం కైవసం చేసుకునేలా వ్యూహాలు రచించింది. ఈ క్రమంలో మెజార్టీ సాధించని భూత్పూర్, కోస్గి, నారాయణపేట, అమరచింత, కల్వకుర్తి, కొల్లాపూర్, అయిజ పురపాలికలపై జెండా ఎగరవేసింది. గులాబీ పార్టీ ఎత్తుగడలతో గెలుపునకు ఆస్కారమున్న భూత్పూర్, నారాయణపేట పీఠాలను బీజేపీ పోగొట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో కేవలం మక్తల్లో మాత్రమే కాషాయం జెండా ఎగిరింది. ఇటు నిన్నటి వరకు కోస్గి పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనే పూర్తి ధీమాతో ఉన్న ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలింది. రెండ్రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలతో కోస్గి పీఠం ‘చే’జారింది. వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్ఎస్ అనూహ్యంగా పాగా వేసింది. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు తమకున్న సభ్యుల బలగాన్ని రహస్య శిబిరాలకు తరలించి సోమవారం నేరుగా ఆయా మున్సిపాలిటీలకు తరలించారు. ముందుగా గెలిచిన అభ్యర్థులు కౌన్సిలర్లుగా ప్రమాణాస్వీకారం చేయగా.. తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్లను ఎనుకున్నారు. కొల్లాపూర్లో ‘గులాబీ’ని గెలిపించారు.. రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారిన కొల్లాపూర్ ‘పుర’పోరు కథ సుఖాంతమైంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి వర్గీయులు 9 మంది గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున బరిలో దిగిన జూపల్లి వర్గీయులు 11 మంది విజయం సాధించారు. దీంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పుర పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తమ ఎక్స్అఫీషియో ఓట్లతో ఆ పుర పీఠంపై గులాబీ జెండా ఎగరేసేందుకు స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి కొల్లాపూర్కు చేరుకున్నారు. ముందుగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు అనూహ్యంగా సమావేశ గది బయటికి వెళ్లిపోయారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో ఓట్లతో టీఆర్ఎస్ కొల్లాపూర్ పురంపై గులాబీ జెండా ఎగిరింది. మక్తల్లో రభస.. మక్తల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎంపిక ప్రక్రియలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య తలెత్తిన వివాదం తారాస్థాయికి చేరుకుంది. పట్టణంలో మొత్తం 16 వార్డులు ఉంటే.. టీఆర్ఎస్ 5, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ రెండు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలిచారు. పుర పీఠంపై పాగాకు వ్యూహం రచించిన బీజేపీ.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరిని జత కలుపుకుంది. ఎన్నిక సమయంలో బీజేపీకి అనుకూలంగా ఓటేస్తే.. వైస్ చైర్పర్సన్ పదవి ఇస్తామని హామీ ఇస్తామని నమ్మించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా చైర్పర్సన్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పావనికి అనుకూలంగా అందరూ చెయ్యి ఎత్తారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల వైస్చైర్పర్సన్కు బీజేపీ అభ్యర్థులు సహకరించకపోగా.. తమ పార్టీకి చెందిన అఖిలను వైస్ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ కౌన్సిలర్లు మండిపడ్డారు. తమను నమ్మించి మోసం చేశారని బీజేపీ నాయకత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు. ► కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో స్థానిక ఎమెల్యే జైపాల్యాదవ్కు ముఖ్య అనుచరుడిగా ఉన్న షానవాజ్ ఖాన్కు వైస్ చైర్మన్ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ చైర్మన్గా ఎడ్మ సత్యం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత పాలకవర్గంలో వైస్ చైర్మన్గా పని చేసి.. ఈ సారి మరోసారి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి అనుచరుడు షాహీద్ పేరు తెరపైకి వచ్చింది. గెలిచిన అభ్యర్థులందరూ షాహీద్ వైపే మొగ్గుచూపడంతో అతను వైస్ చైర్మన్గా ఎన్నికయ్యాడు. దీంతో ఎమ్మెల్యే వర్గీయుల్లో కాస్త అసంతృప్తి వ్యక్తమవుతోంది. ► పుర ఎన్నికల ఫలితాల తర్వాత అమరచింతలో మారిన రాజకీయ సమీకరణాలు గులాబీ నేతలను కాస్త ఆందోళనకు గురి చేశాయి. అక్కడున్న పది వార్డుల్లో టీఆర్ఎస్ మూడు, సీపీఎం రెండు, బీజేపీ, టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్, స్వతంత్రులు ఒక్కో స్థానంలో గెలుపొందిన విషయం తెలిసిందే. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాజకుమార్ కారెక్కారు. ఆరో వార్డు నుంచి గెలిచిన మాధవి, పదో వార్డు నుంచి గెలుపొందిన గోపి సీపీఎం అభ్యర్థులతో పురపీఠం కైవసం చేసుకుందామని భావించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డికి మద్దతు విషయంలో ఒక అభ్యర్థిపై అనుమానం వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా ఎక్స్అఫీషియో ఓటు వేద్దామనే ఆలోచనతో అమరచింత మున్సిపాలిటీకి చేరుకున్నా.. సదరు అభ్యర్థి సైతం టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపడంతో చిట్టెం ఓటు అవసరం లేకుండానే గులాబీ అక్కడ జెండా ఎగరవేసింది. ► భూత్పూర్ మున్సిపల్ పరిధిలో పది వార్డులకు టీఆర్ఎస్, బీజేపీ నాలుగు చొప్పున స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ అభ్యర్థులు రెండు వార్డుల్లో గెలిచారు. దీంతో రంగంలో దిగిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆదివారం రాత్రి 11గంటల ప్రాంతంలో గెలిచిన బీజే పీ అభ్యర్థుల్లో ఇద్దరికి గులాబీ కండువా కప్పా రు. దీంతో గులాబీ బలం ఆరుకు చేరింది. సో మవారం ఉదయమే భూత్పూర్కు వచ్చిన బీజే పీ జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి విప్ జారీ చేసి వెళ్లినా.. ఆ పురంపై గులాబీ జెండా ఎగరడాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. అయితే.. బీజేపీ నుంచి గెలిచి కారెక్కిన కెంద్యాల శ్రీనివాస్కు వైస్ చైర్మన్ పదవి వరించింది. చేజారుతూ.. చేజిక్కిన ‘కోస్గి’ అధికార పార్టీ అనూహ్యంగా కోస్గి పీఠం పాగా వేసింది. ఆ మున్సిపాలిటీ పరిధిలో 16వార్డులు ఉండగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో ఏడు చొప్పున గెలుచుకోగా.. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు. స్వతంత్రుల్లో 4వ వార్డు నుంచి గెలుపొందిన జనార్దన్రెడ్డి (టీఆర్ఎస్ రెబల్) కాంగ్రెస్కు మద్దతివ్వగా.. మరో అభ్యర్థి బెస్త ఎల్లమ్మ టీఆర్ఎస్కు మద్దతు తెలిపింది. దీంతో రెండు పార్టీలకు ఎనిమిది చొప్పున మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన అనిత కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ ఏడు, కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో మెజార్టీ సాధించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ తరఫున స్థానిక ఎమ్మెల్యే ఒక్కరే ఎక్స్అఫీషియో ఓటుకు దరఖాస్తు చేసుకున్నారనే సమాచారంతో కాంగ్రెస్ నేతలు పుర పీఠం తమదేననే ధీమాతో ఉండిపోయారు. కానీ సోమవారం ఉదయం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డితో పాటు ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే ఒక్కరే ఎక్స్అఫీషియో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారంటూ అధికారులు తమను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కౌన్సిలర్ల పదవికి ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు, ఇతర పార్టీ నేతలందరూ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు. దీంతో పూర్తి మెజార్టీతో ఉన్న టీఆర్ఎస్ నాయకులతో అధికారులు చైర్పర్సన్, చైర్మన్లను ఎన్నుకుని వారితో ప్రమాణస్వీకారం చేయించారు. గెలుపు కోసం వారి ఓట్లు.. హంగ్ ఉన్న పట్టణాల్లో ఎక్స్అఫీషియో ఓట్లు వేసి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరూ కదిలారు. ముందుగా ఓటు అవసరం లేకుండా.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో లాబీయింగ్ చేసిన నాయకులు ఆ ప్రయత్నాలు ఫలించని చోటుకు వెళ్లి ఓటేశారు. కోస్గిలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కొల్లాపూర్లో నాగర్కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి, అయిజలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లేశారు. మక్తల్లో ఎమ్మెల్సీ రాంచందర్రెడ్డి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఓటేశారు. నీకొకటి.. నాకొకటి.. ‘పుర’ పీఠాలు కైవసం కోసం స్పష్టమైన మెజార్టీ రాని పార్టీలు కలిసి రెండు చోట్ల పాగా వేశాయి. పది వార్డులు ఉన్న అమరచింతలో టీఆర్ఎస్ 3, సీపీఎం 2, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇండిపెండెంట్, సీపీఐ నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు. దీంతో ఆ పీఠంపై పాగాకు ప్రయత్నించిన టీఆర్ఎస్.. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాజకుమార్కు గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరో వార్డు నుంచి గెలిచిన మాధవి, పదో వార్డు నుంచి గెలుపొందిన గోపి సీపీఎం అభ్యర్థులతో మంతనాలు జరిపిన స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి చైర్పర్సన్ పదవిని టీఆర్ఎస్ అభ్యర్థి మంగమ్మకు ఇచ్చి.. వైస్ చైర్మన్ పదవిని గోపికి ఇచ్చారు. ఇటు 20 వార్డులు ఉన్న ఆ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఆరు స్థానాల్లో, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ రెబెల్స్ పది మంది గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏఐఎఫ్బీ గెలిచిన పదిమంది టీఆర్ఎస్ రెబెల్స్ కావడం.. వారందరూ తాము టీఆర్ఎస్కే మద్దతు ఇస్తామని చెప్పడంతో ఇరువురి మధ్య సయోధ్య కుదిరింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన 16వ వార్డు అభ్యర్థి దేవన్నకు చైర్మన్.. తొమ్మిదో వార్డు నుంచి ఏఐఎఫ్బీ తరఫున గెలిచిన నర్సింహుడుకు వైస్ చైర్మన్ పదవి వరించింది. -
‘దిశ’ అస్థికల నిమజ్జనం
ఎర్రవల్లిచౌరస్తా (అలంపూర్): జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలోని కృష్ణానదిలో సోమవారం ‘దిశ’అస్థికలను తండ్రి శ్రీధర్రెడ్డి నిమజ్జనం చేశారు. మత్స్యకారుల సాయంతో పుట్టి ద్వారా కృష్ణలోకి వెళ్లి తండ్రి శ్రీధర్రెడ్డి అస్థికలను నదిలో కలిపారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు, వెటర్నరీ శాఖ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్కౌంటర్ చేయాలి.. అనంతరం శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఈ సందర్భంగా కంటతడి పెట్టుకున్నారు. ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రావద్దని అన్నారు. అతి కిరాతకంగా హత్య చేసిన మానవ మృగాలను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలన్నారు. దిశ తమ మధ్య లేకపోవడం కలచివేస్తోందని సహచర ఉద్యోగులు పేర్కొన్నారు. అతి దారుణంగా నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆ నరరూప రాక్షసులను బహిరంగ ప్రదేశంలో ఉరితీయాలని డిమాండ్ చేశారు. -
రోడ్లపై వరి నాట్లేసిన డీకే అరుణ
-
వరి నాట్లేసిన డీకే అరుణ
సాక్షి, జోగుళాంబ గద్వాల : గుంతలతో పాడైన రోడ్లు, ఏళ్లుగా సాగుతున్న ఆర్వోబీ నిర్మాణానికి నిరసనగా మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ రోడ్డుపై వరినాట్లు వేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక రెండవ రైల్వేగేటు సమీపంలోని రోడ్డు గత వర్షాలకు పాడైపోయింది. మరమ్మత్తు చేయకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె ఈ నిరసన తెలిపారు. మరోవైపు గత ఐదేళ్లుగా ఆర్వోబి నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
కేసీఆర్ గారూ! మీరు తెలంగాణాకు ముఖ్యమంత్రి..
సాక్షి, జోగులాంబ : 'కేసీఆర్ గారు ! మీరు తెలంగాణాకు ముఖ్యమంత్రి , చింతమడకకు కాదన్న విషయం గుర్తుంచుకోవాలి' అని బీజేపీ మహిళా నేత డీకే అరుణ ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ తాను పుట్టిన గ్రామానికి వెళ్లి అభివృద్ధి పేరుతో అక్కడ ఉన్న కుటుంబాలకు రూ. 200 కోట్లు కేటాయించడం మంచి విషయమేనని, అయితే అదే చిత్తశుద్దితో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. గతంలో కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసిన కొందరు తమ స్వంత గ్రామాలను అభివృద్ధి చేసుకున్నారే తప్ప తెలంగాణకు చేసిందేమి లేదని డీకే అరుణ ఎద్దేవా చేశారు. తాజాగా ప్రజల కష్టాలు పట్టించుకోకుండా కేసీఆర్ కూడా ఇదే ధోరణి ప్రదర్శించడం శోచనీయమని వెల్లడించారు. 'రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే ప్రతి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉండాలని' రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై అరుణ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక మంత్రిగా వ్యవహరిస్తూ ఇలా మాట్లాడడం సిగ్గు చేటని, ఆయనేమైనా పెన్షన్ తన ఇంట్లో నుంచి ఇస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. మున్నిపాలిటీల్లో అడ్డగోలుగా విభజనలు చేయడం వల్లే కోర్టు మొట్టికాయలు వేస్తుందని తెలిపారు. ఇప్పటికేనా చిల్లర రాజకీయాలను మానుకోవాలని హితవు పలుకుతూ, చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడితే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని తెరాస నాయకులనుద్దేశించి డికె అరుణ హెచ్చరించారు. -
ప్రియురాలికి మరొకరికితో పెళ్లి నిశ్చయమైందని..
సాక్షి, శాంతినగర్ (అలంపూర్): తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శాంతినగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని కలుకుంట్లలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ నర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కలుకుంట్లకి చెందిన నరేష్కుమార్గౌడ్ (28) వనపర్తిలో ఐదేళ్లక్రితం పాల డెయిరీ నడిపేవాడు. వనపర్తిలో అప్పట్లో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం అతను కర్నూలులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, ఇటీవల తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైందని తెలుసుకొని మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం సాయంత్రం కలుకుంట్లలోని సొంత ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటీన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. మృతుడి అన్న ప్రేమ్కుమార్గౌడ్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు. -
చిన్నారులను మింగిన వాగు
సాక్షి, రాజోళి (అలంపూర్): స్థానిక శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన ముగ్గురు స్నేహితులు ఆదివారం సెలవు రోజు కావడంతో సమీపంలోని పెద్దవాగు వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షానికి అందులో నీరు చేరింది. సమీపంలో ఉన్న కుంటలూ నిండాయి. ఆదివారం ఉదయం ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారుల్లో కొందరు వెనక్కి రాగా.. శివయ్య (10), సాయి చరణ్ (9), యుగంధర్ (7) మధ్యాహ్నం 12 గంటలకు పెద్దవాగు వద్దే ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపించడం లేదని గ్రామంలో అంతటా వెతికారు. చివరకు రాత్రి పది గంటలకు వాగు వద్ద ఉన్న ముగ్గురు చిన్నారు చెప్పులను చూసి అనుమానం వచ్చిన స్థానికులు మత్య్సకారులతో గాలించారు. చివరికి మృతదేహాలు బురదలో ఇరుక్కుపోగా వాటిని బయటకు తీశారు. వారిని చూసిన కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. తల్లిదండ్రులు, స్థానికుల రోదనలతో ఆ ప్రాంతంలో నిండిపోయింది. ప్రతిరోజూ తమ మధ్యనే తిరుగుతూ, తమ పిల్లలతో కలిసి ఆడుకునే ముగ్గురు చిన్నారులు ఆకస్మికంగా మృత్యువాత పడటంతో గ్రామస్తులను కలిచి వేసింది. కడుపుకోత ఈ ఘటనలో మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మేమేమి పాపం చేశాం దేవుడా, వారి కి బదులు మమ్మల్ని తీసుకోవచ్చు కదా.. ముక్కు పచ్చలారని పిల్లలను చంపావ్ అని తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరు అక్కడి వారిని కలచివేసింది. మాకు ఎందుకు ఇంత కడుపుకోత మిగిలిల్చావ్ అని కన్నీరుమున్నీరయ్యారు. మూడు ఇళ్లలో కొడుకులే మృతి ఆదివారం జరిగిన ఘటనతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతిచెందిన వారు మూడు కుటుంబాల్లో ఒక్కో కుమారుడే కావడంతో తమ వారసుడిని కోల్పోయామని గుండెలవిసేలా రోదించారు. బజారి ఇంటిలో పెద్ద కుమారుడైన శివయ్య మృతి చెందగా వారికి కూతురు ఉంది. వెంకప్పకు ముగ్గురు అమ్మాయిల తర్వాత కుమారుడు సాయిచరణ్ జన్మించగా.. ఈ ఘటనలో ఆ బాబు మృత్యువాతపడ్డాడు. కుర్వ ఎల్లప్ప కుమారుడు యుగందర్ మృతి చెందగా.. కుమార్తె ఉంది. ఇలా మూడు కుటుంబాల్లో ముగ్గురు కుమారులే చనిపోయారు. సంఘటనా స్థలానికి శాంతినగర్ సర్కిల్ సీఐ గురునాయుడు, ఎస్ఐ మహేందర్ చేరుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
ఎంపీపీ ఎన్నిక : పోలీసుల లాఠీచార్జ్
అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు టీఆర్ఎస్కు చెందిన రెండు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. క్యాంపు నుంచి నేరుగా అలంపూర్కు వచ్చిన ఓ వర్గం ఎంపీటీసీ సభ్యులను మరోవర్గం అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అలంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ, వైస్ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. మొదటి రోజు శుక్రవారం కోరం లేక ఎన్నిక వాయిదా పడటంతో రెండోరోజు అధికారులు ఈ ప్రక్రియను కొనసాగించారు. అలంపూర్ మండలంలోని ఆరు ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. అయితే ఎంపీపీ పీఠం కోసం రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. ఒకవర్గం బుక్కాపురం ఎంపీటీసీ సభ్యురాలు రూపాదేవిని ఎంపీపీగా ఎన్నుకోవాలని.. మరోవర్గం కాశీపురం ఎంపీటీసీ సభ్యురాలు పింజరి బేగంను ఎంపీపీని చేయాలని పట్టుబడుతున్నాయి. ఒక్కో వర్గంలో ముగ్గురు చొప్పున ఎంపీటీసీలు విడిపోయారు. కానీ కో–ఆప్షన్ ఎన్నిక తర్వాత ఒక వర్గంలో నలుగురు ఎంపీటీసీ సభ్యులతో క్యాంపు నిర్వహించారు. మరోవర్గంలో ఇద్దరు ఎంపీటీసీలు మాత్రమే మిగిలారు. రెండోరోజు ఎంపీపీ ఎన్నికకు ఇద్దరు ఎంపీటీసీలు ఉన్న వర్గం ముందుగా చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత నలుగురు ఎంపీటీసీలు ఉన్న వర్గంలో అందరూ మహిళలు కావడంతో ఎవరూ గుర్తుపట్టకుండా ముసుగులు ధరించారు. వీరితోపాటు మరికొందరు ముసుగులు ధరించి ఎంపీడీఓ కార్యాలయానికి ఓ వాహనంలో చేరుకున్నారు. దీంతో వారిని మరోవర్గం వారు అడ్డుకున్నారు. పోలీసులు వారించే ప్రయత్నం చేస్తున్నా జెడ్పీటీసీ సభ్యురాలు షంషాద్ ఇస్మాయిల్ భర్తపై దాడికి దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేసి ఎంపీటీసీలను ఒక్కొక్కరిని లోపలికి పంపించారు. చివరకు కాశీపురం ఎంపీటీసీ సభ్యురాలు పింజరి బేగం ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా క్యాతూర్ ఎంపీటీసీ సభ్యురాలు అనురాధ ఎన్నికయ్యారు. గొడవ సమాచారం అందుకున్న ఎస్పీ లక్ష్మీనాయక్, ఏఎస్పీ కృష్ణ, డీఎస్పీ షాకీర్హుస్సేన్ అలంపూర్ చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
ఇటిక్యాల (అలంపూర్): దైవ దర్శనానికి వెళ్తూ.. ట్రాక్టర్ బోల్తాపడటంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల గ్రామ శివారులోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. మానవపాడు మండలం చిన్నపోతులపాడుకు చెందిన మల్లికార్జున్ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ట్రాక్టర్పై మంగళవారం గద్వాలలోని జమ్ములమ్మ దేవతను దర్శించుకొనేందుకు సోమవారం రాత్రి బయలుదేరారు. అయితే మునగాల శివారులో జాతీయ రహదారిపై ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున్ (45), పార్వతమ్మ (39), అయిజ మండలం మేడికొండకు శైలజ (10) అక్కిడికక్కడే దుర్మరణం పాలవగా.. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందులో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో సుమారు 40 మంది ప్రయాణిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అయిజలో 30 పడకల ఆస్పత్రికి ఆమోదం
సాక్షి, అయిజ: జనాభాపరంగా, వ్యాపారపరంగా దినదినాభివృద్ధి చెందుతున్న అయిజ మున్సిపాలిటీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గత సంవత్సరం జనవరిలో సివిల్ హాస్పిటల్గా మార్చేందుకు అనుమతులు లభించాయి. తొలిత 30 పడకల ఆస్పత్రిని నిర్వహించి కొన్ని రోజుల తర్వాత కమ్యూనిటీ హెల్త్సెంటర్ (సీహెచ్సీ)గా మార్చేందుకు అధికారులు ప్రణాళిక తయారు చేస్తున్నారు. సీహెచ్సీ భవనాన్ని నిర్మించేందుకు సుమారు. రూ.5 కోట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి సివిల్ హాస్పిటల్ను నిర్వహించేందుకు రూ.1.10 కోట్లు మంజూరయ్యాయి. ఎన్నికల అనంతరం టెండర్వర్క్ నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక తయారు చేశారు. అయిజ పీహెచ్సీని సివిల్ హాస్పిటల్గా మార్చి 30 పడుకల ఆస్పత్రిని నిర్వహించనున్నారు. అనంతరం సీహెచ్సీ భవనం నిర్మించి వైద్యసేవలందించే ఆలోచనలో ప్రభుత్వం ప్రణాళిక చేసింది. ఇప్పటివరకు గద్వాల జిల్లాలోని అలంపూర్లో ఒకే ఒక కమ్యూనిటీ హెల్త్సెంటర్ ఉంది. అయిజలో కమ్యూనిటీ హెల్త్సెంటర్ ఏర్పాటుచేస్తే నియోజకర్గంలోనే రెండు సీహెచ్సీలు ఉంటాయి. వందల సంఖ్యలో రోగులు అయిజ మండలంలోని ప్రజలతో పాటు గట్టు, వడ్డేపల్లి మండలాల ప్రజలు అయిజ పీహెచ్సీకి వస్తుండటంతో ఇప్పుడున్న 6 పడకల ఆస్పత్రి చాలడంలేదు. ప్రతిరోజూ 150కు పైగా అవుట్ పేషెంట్లు వస్తుంటారు. నెలకు 100కు పైగా ప్రసవాలు జరుగతుంటాయి. గతంలో అయిజ పీహెచ్సీలో అత్యధికంగా 547 కాన్పులు నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం గద్వాల జిల్లా కేంద్రంలో ఏరియా హాస్పెటల్ ఉంది. అలంపూర్ నియోజకవర్గ కేంద్రంలో మాత్రమే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. ఈ రెండింటికి మధ్యనున్న గ్రామాలకు అయిజ పీహెచ్సీ ఉంది. అయితే అలంపూర్ లేదా గద్వాలకు చేరుకోవాలంటే కొన్ని గ్రామాలకు 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. వ్యయప్రయాసాలకు గురై అలంపూర్, గద్వాలకు చేరుకోవడానికి ఇష్టపడని ప్రజలు అయిజ పీహెచ్సీకి వస్తుంటారు. ప్రసవం కష్టతరమైతే వారు అలంపూర్ లేదా గద్వాలకు వెళ్లాల్సి ఉంటుంది.అయిజ సీహెచ్సీ అయితే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. అయిజలో 30 పడకల ఆస్పత్రి నిర్వహిస్తే ప్రసవాల సంఖ్య పెరుగుతుంది. గద్వాలకు పోవాల్సిన అవసరం ఉండదు అయిజలో చిన్న ఆస్పత్రిని పెద్ద ఆస్పత్రిగా మార్చితే అయిజ పట్టణం ప్రజలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు పొరుగు మండలాల ప్రజలకు మేలు కలుగుతుంది. ఎన్నికలు ముగిసిన తరువాత పెద్ద ఆస్పత్రిని కడుతామని అధికారులు అంటున్నారు. పెద్ద ఆస్పత్రి కడితే వ్యవ్రయాసాలకు గురై గద్వాలకు పోవాల్సిన అవసరం ఉండదు. – సుగుణమ్మ, అయిజ సీహెచ్సీలో నాణ్యమైన వైద్యసేవలు.. సీహెచ్సీ ఏర్పాటైతే స్త్రీవ్యాధి నిపుణురాలు, చిన్న పిల్లల వైద్యులు, పంటిడాక్టర్, శస్త్రచికిత్స వైదులు, ఫార్మాసిస్టులు, రేడియోగ్రాఫర్, ఎక్స్రే ల్యాబ్ అటెండర్, ల్యాబ్ టెక్నీషియన్లు, ల్యాబ్ అటెండర్, వార్డుబాయ్లు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆయ, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, హెడ్నర్సర్ ఉద్యోగాల నియామకాలు చేపడుతారు. అదేవిధంగా డార్క్రూం అసిస్టెంట్, వాటర్మెన్, వాచ్మెన్ల ఉద్యోగాలు ఏర్పాటు చేయడంతో రోగులకు సంపూర్ణ వైద్యం అందించేందుకు వీలవుతుంది. అందుకోసం సుమారు రెండకరాల విస్తీర్ణంలో నూతనంగా సీహెచ్సీ భవన నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అందుకోసం పీహెచ్సీ ఆవరణలో శిథిలమైన పాతభవనాలు కూల్చివేసి వాటి స్థానంలో సీహెచ్సీకి కావాల్సిన భవనం ఏర్పాటు చేస్తారు. – రామలింగారెడ్డి, మెడికల్ ఆఫీసర్ -
నులిపేద్దాం!
గద్వాల న్యూటౌన్: నులిపురుగుల సంక్రమణను నిరోధించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది. ఈనెల 19న జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 1–19 ఏళ్లలోపు ఉన్న 2,02,763 మందికి అల్బెండజోల్ మాత్రలు వేయించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటికే వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులకు అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ మాత్రలను ఆయా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీలకు సరఫరా చేశారు. వాస్తవానికి మనిషి పేగుల నుంచి పోషకాలను గ్రహించి వృద్ధిచెందే పరాన్న జీవులే నులిపురుగులు. ముఖ్యంగా పిల్లల్లో ఏలికపాములు, నులి, కొంకి పురుగులుగా ఉంటాయి. ఆరుబయట ఒట్టికాళ్లతో ఆడుకోవడం ద్వారా, చేతులు శుభ్రం చేసుకోకుండా భుజించడం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల వ్యాప్తి చెందుతుంది. దీనిని నివారించేందుకు షూ ధరించడం, భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయొద్దు. పండ్లు, కూరగాయలను శుభ్రం చేసి తినాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. ఆరుబయట మలవిసర్జనకు వెళ్లరాదు. ఆహార పదార్థాలపై మూతలు పెట్టాలి. వీధుల్లో విక్రయించే ఆహారాన్ని భుజించరాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలపై ప్రభావం నులిపురుగులతో పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు కలుగుతాయి. దీంతోపాటు శారీరక, మానసిక పెరుగుదల తగ్గిపోతుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. అల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. రక్తహీనతను నియంత్రించడమేగాక వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. మాత్రలు ఇలా ఇవ్వాలి అల్బెండజోల్ మాత్రలు 1–2 ఏళ్లలోపు చిన్నారులకు సగం మాత్రను పొడి చేసి నీటిలో కలిపి తాగించాలి. జబ్బుతో ఉన్న, ఇతర మందులను తీసుకుంటున్న వారికి ఇవ్వరాదు. 2–19 ఏళ్లలోపు వారు మాత్రను చప్పరించి, నమిలి మింగాలి. కాగా, జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో మొదటి, ఆగస్టులో రెండో విడత నిర్వహిస్తారు. మొదటి విడతలో భాగంగా ఈనెల 19న అల్బెండజోల్ మాత్రల పంపిణీకి వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాస్థాయిలో గత నెల 22న కలెక్టర్ శశాంక అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. దీనికి ఐసీడీఎస్, విద్యాశాఖ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ తదితర 16 శాఖల అధికారులు హాజరయ్యారు. ఆ తర్వాత ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించి మాత్రలు వేసే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులకు వివరించారు. నులిపురుగుల వల్ల వచ్చే ఇబ్బందులు, నివారణ చర్యలతో కూడిన కరపత్రాలు, వాల్పోస్టర్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయానికి పది రోజుల క్రితమే చేరాయి. పీహెచ్సీల వారీగా వీటిని సరఫరా చేశారు. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా 1–19 ఏళ్లలోపు వారికి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల వారీగా గుర్తించారు. బడిబయట ఉన్న పిల్లలను సైతం ఆశా కార్యకర్తలు గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో వేస్తారు. మిగిలిన వారికి ఈనెల 23న వేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. పకడ్బందీగా నిర్వహిస్తాం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినో త్సవం రోజు అల్బెండజోల్ మాత్రల పంపిణీని పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈపాటికే 1–19 ఏళ్లలోపు ఉన్న వారిని గుర్తించాం. తల్లిదండ్రులు తప్పక తమ పిల్లలకు ఈ మాత్రలు వేయించాలి. – డాక్టర్ రాజేంద్రకుమార్, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ -
‘అబద్ధాలు చెప్పేవారిని హైదరాబాద్లో బట్టేబాజ్ అంటారు’
సాక్షి, అలంపూర్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. గురువారం ఉదయం అలంపూర్ చేరుకున్న కాంగ్రెస్ నాయకులు జోగుళాంబ శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన సభలో సీనియర్ నేత జనారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేశాడని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని.. ఎవరు ప్రశ్నించిన అణచివేస్తున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై మాట్లాడుతున్న కేసీఆర్.. ఇంతకుముందు టీడీపీతో పొత్తు పెట్టుకున్న విషయాన్ని గమనించాలని ప్రజలను కోరారు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే తాను టీఆర్ఎస్ కండువా కప్పుకుంటానని అన్నట్టు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని.. తాను ఆ మాట అన్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాలు విసిరారు. టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ‘అబద్ధాలు చెప్పేవారిని హైదరాబాద్లో బట్టేబాజ్, దోకేబాజ్ అని అంటారు. తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బట్టేబాజ్. గిరిజనులను, దళితులను, ఇలా అన్ని వర్గాలను మోసం చేసినందుకు కేసీఆర్ దోకేబాజ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందజేస్తామని హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ.. ఉద్యమాలు చేసి ఎన్నో అవమానాలు పడి నేడు తెలంగాణను దొరల పాలు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల అకాంక్ష తీర్చింది యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ మాత్రమేనని అన్నారు. రాములమ్మ సినిమాలో రాములమ్మ ఎన్ని కష్టాలు పడిందో.. తెలంగాణలో నేడు ప్రజలు ఆ కష్టాలు పడుతున్నారని ఆరోపించారు. తనను దేవుడిచ్చిన చెల్ల అన్న కేసీఆర్.. కారణం లేకుండా తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చెప్పాలన్నారు. రైతు బంధు పథకం రైతు మరణ బంధు అవుతుందని విమర్శించారు. చిన్న ఇల్లు కోసం ఆశపడి తెలంగాణను దొరలకు కట్టబెట్టామని.. ఈ పాలనకు చరమ గీతం పాడి కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ డబ్బు ఇస్తే తీసుకుని కాంగ్రెస్కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజలు కేసీఆర్కు అయిదేళ్ల అధికారం ఇస్తే నాలుగేళ్లకే పారిపోయాడని.. మళ్లీ అధికారం ఇస్తే మూడేళ్లకే పారిపోతాడని ఎద్దేవా చేశారు. -
జోగుళాంబదేవినే మరిచారు!
అలంపూర్ రూరల్ : జోగుళాంబ గద్వాలలో శుక్రవారం పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, తన ప్రసంగంలో అలంపూర్ నియోజకవర్గం, జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధి గురించి ప్రస్తావించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కృష్ణా పుష్కరాల సందర్భంగా అలంపూర్ వచ్చిన సీఎం, అనేక అభివృద్ధి అంశాలపై హామీలు ఇచ్చారు. అయితే, జోగుళాంబ ఆలయ అభివృద్ధి విషయమై కేంద్ర పురావస్తు శాఖతో మాట్లాడతానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మొన్నటి సభలో ఆలయాల గురించి మాట్లాడకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పుష్కరాలపై దృష్టి ఏదీ? యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒకే ప్రాంతంలో ప్రవహించే తుంగభద్ర నది పుష్కరాలకు సమయం సమీపిస్తున్నా సీఎం కేసీఆర్ ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. 2020 మార్చి 31నుంచి ప్రారంభంకానున్న తుంగభద్ర నదికి ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ వేయించడం, ఆలయాల పరిసరాలను భక్తుల రద్దీకి అనుగుణంగా ఆధునీకరించడం వంటివి చేయాల్సిఉంది. ఈనేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖతో ఈ ప్రభుత్వం అనుమతులు కోరేదెన్నడు? మాస్టర్ ప్లాన్ వేయించేదెన్నెడు? నివాస గృహాల నష్ట పరిహారాలు అందించేదెన్నడు? ఇలా అనేక రకాలుగా అలంపూర్ నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లాకు ఒరిగింది ఏమీ లేదు సీఎం పర్యటనతో జిల్లాకు ఒరిగింది ఏమీ లేదు. ప్రతిపక్షాల గొంతునొక్కే విధం గా ఎమ్మెల్యే సంపత్ను గృ హనిర్భంధం చేశారు. జోగుళాంబ అమ్మవారి పేరు కానీ, గత హామీలు కానీ ఎక్కడా ప్రస్తావించకుండా మరొకరు ప్రశ్నించకుండా సభను ముగించారు. ఈవైఖరి సరికాదు. – జెట్టి రాజశేఖర్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రశ్నిస్తాననే గృహ నిర్బంధం సీఎం కేసీఆర్ గతంలో అలంపూర్ వచ్చిన సమయంలో ఆలయం, నియోజకవర్గ అభివృద్ధికి అనేక హామీలు ఇచ్చారు. వాటి అమలుపై ప్రశ్నించాల్సిన నైతిక బాధ్యత ఎమ్మెల్యేగా నాపై ఉంది. నేను ప్రశ్నిస్తాను అనే భయంతోనే గృహనిర్బంధం చేయించారు. – ఎస్. సంపత్కుమార్, ఎమ్మెల్యే అలంపూర్ అమ్మ మొక్కు మరిచారు సీఎం కేసీఆర్ బెజవాడ కనకదుర్గమ్మకు, తిరుపతి వెంకన్నకు, అంతకుముందు కొండగట్టు అంజన్న, వేములవాడ, యాదాద్రి, భద్రాద్రిలో మొక్కలు చెల్లిస్తూ వస్తున్నారు. కానీ జోగుళాంబ అమ్మ మొక్కు మరిచారు. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పిన మాటలు అడియాశలే అయ్యాయి. – బోరింగ్ శ్రీనివాస్, జోగుళాంబ సేవాసమితి అధ్యక్షుడు -
గద్వాలపై కేసీఆర్ వరాల జల్లు
-
గద్వాలపై కేసీఆర్ వరాల వర్షం
జోగులాంబ గద్వాల : జిల్లాపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వరాల వర్షం కురిపించారు. గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన అనంతరం నడిగడ్డ ప్రగతి సభలో సీఎం ప్రసంగించారు. గద్వాల ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. గద్వాల అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. గట్టు ఎత్తిపోతల పథకానికి నల్ల సోమనాద్రి గట్ట ఎత్తిపోతల పథకం అని పేరు పెడతామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, వాటిలో ఒకటి గట్టులో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేడీ దొడ్డిలో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గుర్రంగడ్డ బ్రిడ్జిని రూ. 8 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తామని చెప్పారు. గద్వాల బస్టాండ్కు ముఖ్యమంత్రి నిధి నుంచి రూ. 2 కోట్లు, జూరాల డ్యామ్ సైట్ దగ్గర బృందావనానికి రూ. 15 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ బహిరంగ సభకు మంత్రులు హరీశ్ రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావులు హాజరయ్యారు. -
29న గద్వాల్కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29న జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొని సీఎం ప్రసంగించనున్నారు. గద్వాల జిల్లాలో గట్టు ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపిన విషయం విదితమే. మొత్తం రూ. 553.98 కోట్లకు పరిపాలనా అనుమతులు లభించాయి. గట్టు ప్రాంత సమస్యకు తప్పకుండా పరిష్కారం చూపుతానని తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలుపుకొన్నారు. గట్టు, ధరూర్ మండలాల్లోని 25 వేల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 3 వేల ఆయకట్టు స్థిరీకరణతో మొత్తం 28,000 ఎకరాలకు సాగునీరందించేలా ఈ ఎత్తిపోతలకు డిజైన్ చేశారు. -
గద్వాల నెత్తిన నిప్పుల కుంపటి
సాక్షి, గద్వాల: సూర్య భగవానుడు ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం ఉష్ణోగ్రత 43.4డిగ్రీల సెల్సియస్కు చేరడంతో మధ్యాహ్నం 12గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఈ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుని జనం ఆందోళన చెందుతున్నారు. పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 5డిగ్రీ సెల్సియస్ వరకు ఎక్కువ నమోదవుతోంది. దీంతో ఎండవేడికి బయటి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతకు తోడు వేడిగాలులూ వీస్తుండటంతో జనంఇబ్బందులకు గురవుతున్నారు. ఉపశమనం కోసం శీతల పానీయాలను తాగుతున్నారు. ఎండలను నుంచి తట్టుకునేందుకుగాను గొడుగులు, తువ్వాలు కప్పుకొని బయటకు వస్తున్నారు. ఎండదెబ్బకు దుకాణ సముదాయాలు సైతం కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. వ్యాపార సముదాయాలకు సాయంత్రం వేళ మాత్రమే ప్రజలు వస్తున్నారు. కొన్నిరోజుల క్రితం పగలు ఎండకొట్టినా రాత్రివేళ వాతావరణం చల్లగానే ఉండేది. ప్రస్తుతం రాత్రివేళా ఉక్కబోత భరించలేనంతగా ఉంటోంది. కూలర్లు పెట్టినా ఉపశమనం దక్కట్లేదంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పెరిగిన ఉష్ణోగ్రతలతో వాహనదారులు సైతం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యం గత వేసవి కాలంలో నడిగడ్డలో 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పుడే 42డిగ్రీల సెల్సియస్ దాటడం ఆందోళన కలిగిస్తోంది. వేసవితాపం నుంచి విముక్తి పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు పేర్కొంటున్నారు. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు ముఖాన్ని మాడ్చేలా వడగాలులు.. ఇలా జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 15రోజుల క్రితం 37డిగ్రీల సెల్సియస్లోపు ఉష్ణోగత్ర నమోదైన సమయంలో లేని వడగాలులు ప్రస్తుతం 40డిగ్రీలు దాటిన క్రమంలో వేడిగాలులు ఉత్పన్నమవుతున్నాయి. మామూలు ఎండల కంటే వడగాలులు ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఎండలో తిరిగే వారికి ప్రధానంగా వడదెబ్బ తగలడం, బాగా నీరసించి పోవడం, కండరాలు పట్టుకుపోతాయంటున్నారు. దీనివల్ల తరచూ వాంతులు, విరేచనాలు, హైఫీవర్, చర్మం పొడిబారడం, డీ–హైడ్రేషన్, బీపీ పెరగడం, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం వేళ బయటికి రాకుండా ఉండటం, ఒకవేళ వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నీళ్లు, కొబ్బరిబొండాలు ఎక్కువగా తాగాలని వారు సూచిస్తున్నారు. -
పల్లెల్లో ఎన్నికల వేడి
సాక్షి, గద్వాల : రాష్ట్ర ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టానికి అసెంబ్లీలో ఆమోదం తెలపడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కొత్త గ్రామ పంచాయతీలను కూడా ఏర్పాటు చేస్తూ సర్పంచ్ల ఎన్నికల విధానంపైన కూడా స్పష్టత ఇవ్వడంతో అన్ని పార్టీల నాయకులు గ్రామాలబాట పట్టారు. నూతన పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచ్లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడమే కాకుండా సర్పంచ్, ఉపసర్పంచ్కు కలిపి ఉమ్మడిగా చెక్పవర్ కల్పించనున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్తచట్టం ద్వారా నిధుల ఖర్చులో మరింత పారదర్శకత పెరగనుంది. జిల్లాలో నూతనంగా ప్రతిపాదనలు పంపిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జిల్లాలో ఇప్పటివరకు 195 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రస్తుతం మరో 60గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీల సంఖ్య 255కు చేరింది. నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామస్వరాజ్యం సాధ్యమవుతుందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నాలుగు మున్సిపాలిటీలు ప్రభుత్వం తాజాగా గద్వాల మున్సిపాలిటీలో జమ్మిచేడు, వెంకంపేట గ్రామాలను విలీనం చేశారు. ఆలంపూర్, ఇమాంపూర్ గ్రామాలను వీలీనం చేసి నూతన మున్సిపాలిటీగా అలంపూర్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా వడ్డేపల్లి, పైపాడు గ్రామాలను కలిపి వడ్డేపల్లి చిన్న మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు వల్ల గ్రామాల్లో సర్పంచ్స్థానాలు పెరగడంతో పాటు, పాలన మరింత చేరువ కానుంది. అదేవిధంగా నూతనంగా చిన్న మున్సిపాలిటీలుగా ఏర్పటైన అలంపూర్, వడ్డేపల్లి భవిష్యత్లో మరింత అభివృద్ధి కానున్నాయి. సర్పంచ్, ఉపసర్పంచ్లకే చెక్ పవర్ నిధుల వినియోగానికి సంబంధించి ఇప్పటి వరకు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు ఉమ్మడి చెక్పవర్ ఉంది. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిపినా వారిద్దరూ సంతకం చేస్తేనే నిధులు విడుదలవుతాయి. ఈ విధానంతో చాలావరకు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ సర్పంచ్లు నిర్వహించలేకపోయేవారు. కొన్ని సందర్భాల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సమన్వయలోపం వల్ల నిధుల విడుదలలో సంక్షోభం ఏర్పడేది. ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్లకే చెక్పవర్ను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒకే రిజర్వేషన్ రెండు పర్యాయాలు అమలుచేస్తున్నారు. సర్పంచ్ తప్పుచేస్తే చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలే తరువాయి.. ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించడంతో పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. సర్పంచ్ల ఎన్నిక విధానంపైన కూడా స్పష్టత ఇవ్వడంతో ఇక ఎన్నికలు నిర్వహించడమే తరువాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అన్నిపార్టీలు గ్రామాల్లో ఇప్పటికే గెలుపు గుర్రాలను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్ కూడా ఓటర్ల జాబితాను పంపాలని కలెక్టర్లను ఆదేశించింది. ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, బ్యా లెట్ బాక్స్లు, పోలింగ్ కేంద్రాలు ఈ విధంగా గ్రామపంచాయతీలు, జనాభాకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.. జిల్లాలో ఇప్పటికే గద్వాల మున్సిపాలిటీ, అయిజ నగర పంచాయతీలో ఓటర్ల జాబితాను సవరిస్తున్న అధికారులు, గ్రామ పంచాయతీలలోనూ ఓటర్ల జాబితాను సిద్దం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 2,03,734మంది, 2,02,988 మహిళలు, మొత్తం 4,06,750 మంది ఓటర్లు ఉన్నారు. -
తీపి కబురు
గద్వాల : గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. వీరికోసం హరితహారం కార్యక్రమం ద్వారా ఈత, తాటి, ఖర్బూజా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో నాటేందుకుగాను గీత కార్మికుల సంఘాలకు వీటిని అందిస్తోంది. వాస్తవానికి ఎక్సైజ్ శాఖకు ఏటా గీత కార్మికులు వివిధ రూపాల్లో పన్ను చెల్లిస్తున్నారు. ఇక ఎలాంటి పన్నులు చెల్లించకుండా తమ వృత్తిని కొనసాగించేందుకు ఇటీవల ఆమోదం తెలిపింది. కాగా జిల్లాలోని గద్వాల, గట్టు, మల్దకల్, కేటీదొడ్డి, ఇటిక్యాల, రాజోళి, ధరూరు, వడ్డేపల్లి, అయిజ తదితర మండలాల్లో సుమారు 2,400మంది గీత కార్మికులు ఉన్నారు. ఒక్కో సంఘంలో 20నుంచి 30 మంది వరకు సభ్యులు ఉన్నారు. అలాగే 68 వ్యక్తిగత లైసెన్సులు ఉన్నాయి. ఏటా లైసెన్స్తోపాటు వివిధ రకాల పన్నుల రూపంలో ఎక్సైజ్ శాఖ రూ.22,05,250 వసూలు చేస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక నుంచి ఎవరూ ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈపాటికే హరితహారంలో భాగంగా గట్టు మండలం తప్పెట్లమెర్సులోని పదెకరాల్లో ఈత, ఖర్బూజ మొక్కలను నాటించింది. గీత కార్మికులు కల్లును గీసే క్రమంలో ప్రమాదం జరిగితే రూ.ఐదు లక్షల బీమా అందించనుంది. సంఘాల ద్వారా ప్రతి కార్మికుడికి రూ.రెండు లక్షల రుణ సదుపాయం కల్పించింది. ఇప్పటికే 50ఏళ్లుపై బడిన వారికి పింఛన్ కింద నెలకు రూ.వేయి అందిస్తోంది. మరోవైపు కల్తీ సారా, గుడుంబా తయారీ చేయకుండా వివిధ రకాల వ్యక్తిగత రుణాలు మంజూరు చేసి గౌరవప్రదమైన జీవితం కల్పించింది. దీంతో గౌడ కులస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం సంతోషదాయకం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషదాయకం. ప్రస్తుతం స్వచ్ఛమైన కల్లు దొరకడం కష్టంగా మారింది. ఇదే అదనుగా భావించిన కొందరు విష రసాయనాలతో తయారుచేసిన కల్లును విక్రయిస్తూ గీత కార్మికులను పెడదోవ పట్టిస్తున్నారు. దీనిని నివారించేందుకుగాను ఈత, ఖర్బూజ మొక్కలను విరివిగా పెంచాలని ఆదేశించడం శుభసూచకం. దీంతో కొందరు పంట పొలాల మధ్య వీటికి సాగుకు ముందుకు వస్తున్నారు. పన్నుల నుంచి మినహాయించడం ఇవ్వడం ఉపశమనం. – వెంకటేష్గౌడ్, గువ్వలదిన్నెతండా, కేటీదొడ్డి మండలం కార్మికులకు మరింత భరోసా గీత కార్మికులకు పలు వరాలు కురిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయం శుభపరిణామం. గతంలోవలే సొసైటీలను తయారు చేసుకునే వీలు కల్పించడం, ఈత, తాటి చెట్లకు పన్ను రద్దు చేయడం సంతోషంగా ఉంది. ము ఖ్యంగా గీత కార్మికులకు పింఛను, బీమా పెంచడంతో ఆయా కుటుంబాలకు మరింత భరోసా లభించింది. – పరమేష్గౌడ్, పెద్దధన్వాడ, రాజోళి మండలం -
పేదోడి బియ్యం పక్కదారి
కేటీదొడ్డి (గద్వాల) : పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. రెవెన్యూ, విజిలెన్స్ పౌరసరపరా అధికారులు పక్కాగా తనిఖీలు నిర్వహించక పోవడంతో అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గ్రామాల్లో రేషన్ బియ్యం దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఎవరైనా సమాచారం అందించినప్పుడు మాత్రమే అధికారులు దాడులు చేసి పట్టుకుంటున్నారు తప్పా స్వతహాగా గ్రామాల్లో తనిఖీలు చేపట్టడంలేదు. తాజాగా గద్వాల మండలం బీసీ కాలనీకి చెందిన మార్రెన్న, వీరేష్, జగదీష్లు మంగళవారం ర్యాలంపాడులో 23 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తక్కువ దరకు కొనుగోలు చేసి ఆటోలో కర్ణాటక రాష్ట్రం రాయచూర్కు తరలిస్తుండగా ఎస్ఐ భాగ్యలక్ష్మికి సమాచారం అందింది. ఈ మేరకు ఆమె ఏఎస్ఐ రషీద్, కానిస్టేబుల్ బాల్రెడ్డి, రెవెన్యూ అధికారులకు అప్రమత్తం చేశారు. వారు ఉదయం 5:30 గంటలకు కాపుకాసి పట్టుకున్నారు. అనంతరం బియ్యంతో పాటు ఆటోను స్వాధీనపరుచుకున్నారు. ఆర్ఐ రాజేష్, ఎన్పోర్స్మెంట్ డీటీ విజయ్కుమార్, వీఆర్ఓ ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
వ్యవసాయ పొలంలో వెండి నాణేలు
ఆత్మకూర్: ఓ రైతు వ్యవసాయ పొలాన్ని చదును చేస్తుండగా వెండి నాణేలు బయటపడ్డాయి. విషయం తెలిసిన గ్రామస్తులు గుంపులుగుంపులుగా చేరి తవ్వకాలు జరిపారు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలోని కత్తెపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండారెడ్డికి చెందిన పొలాన్ని సికింద్రాబాద్కు చెందిన వ్యక్తి, ఆయన ద్వారా నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం అన్నారం క్యాంపు గ్రామానికి చెందిన నారాయణరావు 22 ఎకరాల పొలాన్ని నెల క్రితం కొనుగోలు చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం సర్వే 123/ ఈలో ని పిల్లిగుట్ట వద్ద పొలాన్ని సాగు కోసం చదును చేస్తున్నాడు. ఈ సందర్భంగా తవ్వకాల్లో వెండి నాణేలు లభ్యం కావడంతో వ్యవసాయ కూలీల ద్వారా గ్రామస్తులకు సమాచారం చేరింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దసంఖ్యలో పొలం వద్దకు చేరుకుని తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో వందల సంఖ్యలో నాణేలు దొరికినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న ఆత్మకూర్ సీఐ బండారి శంకర్ నేతృత్వంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులు, రైతుకు దొరికిన 17 వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నాణేలు నిజాం కాలం నాటివిగా గుర్తించారు. అనంతరం తహసీల్దార్ జెకె.మోహన్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించగా. నాణేలను కలెక్టర్కు అందచేయనున్నట్లు తెలిపారు. కాగా, తవ్వకాల్లో వందల సంఖ్యలో నాణేలు బయటపడ్డాయనే ప్రచారం సాగుతోంది. -
పదేళ్ల తర్వాత తల్లి చెంతకు..
గద్వాల అర్బన్ : పదేళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని వలస వెళ్లిన ఆ కుటుంబానికి అప్పట్లో విషాదం ఎదురైంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త చనిపోయిన కొన్నాళ్లకే కూతురు కూడా కనిపించకుండా పోయింది. అలా పదేళ్లుగా ఆ తల్లి కూతురి కోసం దుఖిస్తుండగా ఇప్పుడు బిడ్డ ఆచూకీ తెలిసిన వైనమిది. గద్వాలలోని వడ్డెగేరికి చెందిన పద్మ, రాముడు భార్యాభర్తలు. భర్త మరణం తర్వాత పొత్తిళ్లలో ఉన్న కుమారుడు, ఆరేళ్ల కుమార్తెతో కలిసి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ వెళ్లింది. హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతంలో అడ్డా కూలీగా మారింది. ఇదే క్రమంలో పద్మ తల్లి చనిపోయిందని సమాచారం రాగానే కాచిగూడ రైల్వేస్టేషన్కు ఆమె వచ్చింది. అక్కడ రద్దీ ఉండడంతో ఆరు నెలల కుమారుడిని కుమార్తె హైమావతి చేతిలో పెట్టి టికెట్ తెచ్చేందుకు వెళ్లి వచ్చే సరికి కుమారుడు మాత్రమే ఉన్నాడు. దీంతో అప్పటి నుంచి కుమార్తె కోసం వెతుకుతున్నా ఫలితం కనిపించలేదు. కాగా, అప్పట్లో హైమావతిని చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది సికింద్రాబాద్లోని నవజీవన హోంకు, ఆతర్వాత నింబోలి అడ్డాలోని ప్రత్యేక చిల్డ్రన్ హోం(బాలికల), రాజేంద్రనగర్లోని కేజీబీవీ పాఠశాలకు తరలించారు. 6, 8వ తరగతి వరకు చదవిన హైమావతి తన తల్లి గద్వాలలో ఉన్నారని నిర్వాహకులకు చెప్పగా వారు జిల్లా బాలల సంరక్షణ అధికారి రాములుకు మహబూబ్నగర్ అధికారులు ఫొటోతో పాటు సమాచారం ఇచ్చారు. ఆయన ఇచ్చిన సమాచారంతో వడ్డేగేరి అంగన్వాడీ కార్యకర్త ఫొటోలో ఉన్న బాలికను గుర్తు పట్టి ఆమె తల్లి పద్మకు చూయించింది. తన కుమార్తెను ఆమె గుర్తించగా.. మహబూబ్నగర్ స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలిక హైమావతిని తల్లి పద్మకు గురువారం అప్పగించారు. -
అష్ట దిగ్బంధం
గద్వాల క్రైం : ‘సార్! కొత్త బస్టాండ్ వద్ద బైక్ నిలిపి పక్కనే ఉన్న దుకాణంలో మందులు తీసుకుని వచ్చేసరికి అక్కడ వాహనం కనిపించలేదు..’ ‘అయ్యా! ఇంట్లో దొంగలు చొరబడి విలువైన వస్తువులు, బంగారు నగలు ఎత్తుకెళ్లారు...’ మరో బాధితుడు. ‘ఓ సారో..ఒక్కగానొక్క కుమార్తె రెండు రోజులుగా కనిపించడం లేదు, యాడికి బోయిందో తెలియదు, ఎలాగైనా నా బిడ్డ ఆచూకీ తెలుసుకుని అప్పగించండి..’ అంటూ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు.. సదరు ఎస్ఐ సరే.. సరే రెండు రోజుల్లో మీ సమస్యలను పరిష్కరిస్తాం.. అం టూ సమాధానం వస్తుంది. ఇక కేసు దర్యాప్తులో భా గంగా సీసీ కెమెరాల కంట్రోల్ విభాగంలోని పర్యవేక్షకుడు వద్దకు సమాచారం.. సిబ్బంది గంటల తరబడి అక్కడే ఉండి అన్ని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా క్షుణంగా గుర్తించి నిందితులను ఛేదించి బాధితులకు న్యాయం చేస్తారు.. సార్! గాంధీచౌక్లో ట్రాఫిక్ జాం అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు..’ అంటూ ఓ వాహనదారుడు ఉన్నతాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తాడు.. ఇలాం టి తరుణంలో సీసీ కెమెరాల పర్యేవేక్షకుడి సాయం కోసం అక్కడ సమస్యపై కంట్రోలర్ విభాగానికి ఫోన్ చేసి ఎంత మేర ట్రాఫిక్ జాం అయిందని వెంటనే కంట్రోల్ రూంకు వెళ్లి సూచనలు ఇవ్వు.. ఉన్నతాధికారులు సీసీ కెమెరాల మానిటర్కు ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఉండదు.. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తన మొబైల్లో ఇంటర్నెట్ లింకు ఆధారంగా నిక్షిప్తం చేసుకున్నది అనుసంధానమై నేరుగా సీసీ కంట్రోలర్ సిబ్బంది ఉన్న చోటు నుంచి సమస్యలపై నేరుగా చూసి చెప్పవచ్చు. ఇలా జిల్లాలో పోలీసు శాఖ టెక్నాలజీని వినియోగించడంలో ముందుంది. జిల్లా కేంద్రంలో 55సీసీ కెమెరాలు గద్వాల పట్టణంలోని 55సీసీ కెమెరాల దృశ్యమాలికలను మొబైల్ ద్వారా ఎక్కడి నుంచైనా చూసుకునేలా సాంకేతిక విప్లవంతో నాంది పలికింది. సీసీ కెమెరాల విభాగంలో పర్యవేక్షకుడు వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలోనూ అరచేతిలో ఉన్న మొబైల్ సాయంతో ఏ ప్రాంతంలో ఏమైనా అవాంఛనీయ సంఘటనలు తతెత్తినప్పుడు వెంటనే గుర్తించి తగు చర్యలు తీసుకునేందుకు దోహదపడుతుంది. ఇక సీసీ కెమెరాల విభాగం సీఐ కార్యాలయంలోని ప్రత్యేక భవనంలో పర్యవేక్షకుడు నిత్యం మానిటరింగ్ చేస్తూ పట్టణంలో జరిగిన పలు సంఘటనలపై దృష్టి సారించి ఉన్నతాధికారులకు సమాచారం అందించి శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నారు. పరుగులకు చెక్ పట్టణంలో అనుమానాస్పదంగా గుర్తు తెలియని నిందితులు ఉన్నట్లు సమాచారం వస్తే ఉన్నతాధికారులు గతంలో వెంటనే సీసీ కెమెరాల కంట్రోలర్కు సమాచారం అందించేవారు. అయితే సిబ్బంది భోజనం సమయం కావడంతో బయటకు వెళతారు. ఈ క్రమంలో తిరిగి కార్యాలయానికి రావడంలో అలస్యమవుతుంది. ఇక నిందితులు అక్కడి నుంచి తప్పించుకుని మరోచోట ప్రత్యక్షమవుతారు. సిబ్బంది సైతం కార్యాలయానికి పరుగులు తీస్తారు. ఈలోపు నిందింతులు సునాయసంగా చేజారిపోతారు. ఇలాంటి వాటికి కొత్త విధానంతో చెక్ పెట్టినట్టే. సిబ్బంది ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ లింకు ఆధారంగా తన అరచేతిలో ఉన్న మొబైల్ ద్వారా గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి నిందితులు ఎటు వెళ్తున్నారనే విషయం ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయొచ్చు. దీంతో నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టడానికి వీలుంటుంది. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ క్షణాల్లో కేసులను ఛేదించి బాధితులకు ఊరట కల్పించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో జిల్లా పోలీసు శాఖ ముందంజలో ఉంది. ఇదే విషయమై ఇటీటల పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో సీఎం, డీజీపీ సైతం ఎస్పీ విజయ్కుమార్ను అభినందించారు. ఇక మొబైల్ యాప్కు సంబంధించి ఇంటర్నెట్ లింకు ద్వారా కెమెరాల అనుసంధానంతో పట్టణంలో మరింత నిఘా పెట్టేందుకు వివిధ సీసీ కెమెరాల పాయింట్లు వీక్షించే సిబ్బందికి ఇటీవలే హైదరాబాద్లో శిక్షణకు పంపించి ప్రావీణ్యం తెలుసుకునేలా ప్రోత్సహించారు. శాంతిæభద్రతల పర్యవేక్షణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు పోలీసులంటే జావాబుదారీగా ఉండాలంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. సిబ్బంది పెట్రోలింగ్, ట్రాఫిక్ తదితర విధులను ఎంత మేర చేస్తున్నారో తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఇక ఎక్కడ ఏం జరిగినా ఈ కొత్త పరిజ్ఞానంతో చెక్ పెట్టొచ్చంటున్నారు. నిరంతర నిఘా జిల్లాలో విపత్కర పరిస్థితులు ఎదురైనా వాటిని నిలువరించి ప్రజలకు జావాబుదారీగా ఉండాలనేది మా సంకల్పం. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ కేసులు, సమస్యలను ఎక్కడి నుంచైనా సులువుగా తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా మొబైల్ యాప్తో సీసీ కెమెరాలను సిబ్బంది పరిశీలించి తగు వివరాలను ఉన్నతాధికారులకు సమాచారం అంది స్తారు. వెంటనే సిబ్బంది అప్రమత్తమవుతారు. – ఎస్.ఎం.విజయ్కుమార్, ఎస్పీ, గద్వాల -
మూఢనమ్మకాలు విడనాడాలి
ధరూరు : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకు సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మూఢ నమ్మకాలను విడనాడి ముందుకు సాగాలని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రుక్మిణి అన్నారు. ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరంలో భాగంగా మూడో రోజు మండలంలోని బురెడ్డిపల్లిలో ఆమె విద్యార్థులతో కలిసి ఇంటింటికీ తిరిగి మూఢనమ్మకాలు, బాల్యవివాహాలపై అవగాహన కల్పించారు. బాలికా చదువులపై ప్రతిఒక్కరూ ముందుండాలన్నారు. బాలికలను బడికి పంపించి అక్షరాస్యతను పెంపొందించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకుని బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొత్తం 250 కుటుంబాల్లో సర్వే నిర్వహించి అన్ని కుటుంబాల ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు. సర్పంచ్ బెనకన్న, విద్యార్థులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలి గద్వాల రూరల్: గ్రామంలో ప్రతిఒక్కరూ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని ఎన్ఎస్ఎస్ యూనిట్–2 ప్రోగ్రాం అధికారి సుందరమూర్తి అన్నారు. ఆదివారం మండలంలోని రేకులపల్లిలో ఎంఏఎల్డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను వివరించారు. అంతకు ముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ సచివాలయం, ప్రధాన వీధుల్లో ముళ్లపొదలు తొలగించి చెత్తాచెదారాన్ని తొలగించారు. సర్పంచ్ సుజాత, అధ్యాపకులు కృష్ణయ్య, భాస్కర్, వలంటీర్లు పాల్గొన్నారు. -
ప్రమాదంతోనే స్పందిస్తారా?
కేటీదొడ్డి : మండలంలో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకొని వంగిపోవడం, వాటి తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం వేసిన విద్యుత్ స్తంభాలను అధికారులు పట్టించుకోకపోవడంతో అవి ఎప్పుడు నేల కూలుతాయో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరంగా మారిన స్తంభాలను వేలాడుతున్న తీగలను బాగుచేయాలని అధి కారులకు ఎన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. గతంలో విద్యుత్స్తంభాలు నేలకొరిగి ప్రమాదాలు కూడా జరిగాయని, అంతజరిగినా.. అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. తీగలు తెగిపడి.. కొన్ని రోజుల క్రితం ఎర్సందొడ్డిలో విద్యుత్ తీగలు తెగిపడి రెండు ఎద్దులు మృతిచెందాయి. మండలంలోని కొండాపురం, కేటీదొడ్డి, గువ్వలదిన్నె, నందిన్నె, కుచినెర్ల, గ్రామాల శివారులో విద్యుత్ తీగలు వేలాడుతూ విద్యుత్స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. గువ్వలదిన్నె స్టేజీ సమీపంలో రోడ్డు పక్కన విద్యుత్స్తంభం శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారాయి. స్తంభానికి మధ్యలో ఇనుపచువ్వలు పైకితేలాయి. బలమైన గాలులు వీచినప్పుడు విద్యుత్స్తంభం కూలిపోయే అవకాశం ఉందని రైతులు భయాందోళన చెందుతున్నారు. కొండాపురం గ్రామ శివారులో స్తంభాలకు విద్యుత్ తీగలు కింద నిలబడితే చేతికందేలా ఉన్నాయి. బలమైన గాలులు వీచినప్పుడు విద్యుత్తీగలు ఒకదానికి ఒకటి తగిలి నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అదికారులు చర్యలు తీసుకుని ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి తీగలను సరిచేయాలని రైతులు కోరుతున్నారు. భయంగా ఉంది... పొలం వద్ద విద్యుత్ తీగలు చేతికందేలా ఉన్నాయి. పొలం పనులు చేసుకునేటప్పుడు భయమేస్తుంది. బలమైన గాలులు వీస్తే వైర్లు ఒకదానికి ఒకటి తగిలి నిప్పురవ్వలు పడుతున్నాయి. పొలం పనులు చేసుకోవాలంటే భయంగా ఉంది. తీగలు సరిచేయాలి. – యాదవరాజు, ఎర్సందొడ్డి సమస్య పరిష్కరిస్తాం.. సమస్య ఉన్న మాట వాస్తవమే. ఎర్సందొడ్డి సర్పంచ్ స్తంభాలు కావాలని మా దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే స్తంభాలు వేయిస్తాం. అలాగే కేటీదొడ్డి, నందిన్నె శివారు పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను మా లైన్మెన్కు చెప్పి తీగలు లాగేలా చూస్తాం. – పరశురాం, విద్యుత్ ఏఈ -
‘నివేదన’కు స్పందించండి
గద్వాల అర్బన్ : గ్రామీణులు దూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రాయాలకోర్చి ‘ప్రజావాణి’కి రావద్దనే ఉద్దేశంతోనే నివేదన యాప్ రూపొందిం చా మని జాయింట్ కలెక్టర్ సంగీత తెలి పారు. వీలైనంత వరకు దీని ద్వారా నే ఫిర్యాదులు చేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’కి 52 ఫిర్యాదులు అందా యి. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన ప్రజల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. నివేదన యాప్ ద్వారా లేదా నేరుగా ఫిర్యాదు చేసిన సమస్యలపై అధికారులు నిబద్ధతతో పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రీవెన్స్కు 13 అర్జీలు గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 13 అర్జీలు అందాయి. గద్వాల, మల్దకల్, గట్టు, ధరూరు, వడ్డేపల్లి, ఇటిక్యాల, అయిజ మండలాల ప్రజలు ఎస్పీ విజయ్కుమార్ను కలసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామన్నారు. రేషన్ సరుకులు ఇవ్వడం లేదు కట్టెల మిషన్లో పనిచేసేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు చేతివేళ్ల సరిగా పని చేయడం లేదు. దీంతో వేలిముద్రలు పడటం లేదని మూడు నెలలుగా రేషన్ షాపులో సరుకులు ఇవ్వడం లేదు. ఎలాగైనా అందేలా చూడాలి. – పద్మ, వెంకటస్వామి దంపతులు, వడ్డెవీధి, గద్వాల ‘కల్యాణలక్ష్మి’ వర్తింపజేయాలి నా కూతురు కళావతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకుంటే వివిధ కారణాలతో మండల అధికారులు ఇంతవరకు ఆమోదించడం లేదు. ఇప్పటికైనా ఈ పథకం డబ్బులు వచ్చేలా చూడాలి. – మునెమ్మ, చెనుగోనిపల్లి, గద్వాల మండలం -
గర్భిణులకు 102 సేవలు
అలంపూర్ : గర్భిణులకు వైద్య సేవలే కాదు రవాణా కష్టాలు దూరమయ్యాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అమ్మఒడిలో భాగంగా 102 సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంత కాల ం బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఆపసోపాలతో ఆస్పత్రికి చేరిన గర్భిణులకు 102 వాహనసేవలు ఊరటనిస్తున్నాయి. 102 వాహనంలోనే ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షల అనంతరం అదే వాహనంలో ఇంటికి సురక్షింతంగా చేరుకుంటున్నారు. దీంతో బస్సులు, ప్రైవేటు వాహనాల కోసం నిరీక్షణ తప్పింది. అలంపూర్, ఉండవెల్లి మండలంలోని క్యాతూర్ పీహెచ్సీ పరిధిలోని గ్రామాలకు 102 ద్వారా సేవలందిస్తున్నారు. ప్రభుత్వం అమ్మఒడి పథకంలో భాగంగా 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగానే అలం పూర్, ఉండవెల్లి మండలాలకు సేవలం దించేలా ఒక వాహనం ఏర్పాటు చేశారు. ఇటివలే దాన్ని అలంపూర్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే సంపత్కుమార్ ప్రారంభిం చారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చి న వాహనం ద్వారా ఆయా గ్రామాల్లోని గర్భిణులను 102 వాహనం ద్వారా క్యా తూర్ పీహెచ్సీకి చేరవేస్తున్నారు. అనంతరం అదే వాహనంలో తిరిగి వారి ఇం టి వద్ద వదిలేస్తున్నారు. దీంతో సులభతరంగా ఆస్పత్రికి వచ్చి ప్రభుత్వ వైద్యశాలలోనే గర్భిణులు మహిళలు వైద్య సేవలు అందుకునే అవకాశం కలిగింది. సబ్ సెంటర్ల వారీగా సేవలు.. క్యాతూర్ పీహెచ్సీలో సబ్సెంటర్ల వారీగా 102 ద్వారా సేవలందిస్తున్నారు. క్యాతూర్ పీహెచ్సీ పరిధిలో మొత్తం 7 సబ్సెంటర్లు ఉన్నాయి. క్యాతూర్ సబ్ సెంటర్లో క్యాతూర్, భీమవరం, యాపల్దేవిపాడు, అలంపూర్ సబ్ సెంటర్లో అలంపూర్, కాశీపురం సబ్ సెంట్లో కాశీపురం, ఇమాంపురం, బైరాపురం, బస్వాపురం, సింగవరం–1, సింగవరం–2, లింగనవాయి సబ్ సెంటర్లో లింగనవాయి, కోనేరు, ఉట్కూరు, తక్కశీల సబ్ సెంటర్లో తక్కశీల, ప్రాగటూరు, శేరుపల్లి, మారమునగాల–1, మారమునగాల–2, గొందిమల్ల సబ్ సెంటర్లో గొందిమల్ల, బుక్కాపురం, బైరన్పల్లి, సుల్తానాపురం సబ్సెంటర్లో సుల్తానాపురం, ర్యాలంపాడు, జిల్లెలపాడు గ్రామాలు ఉన్నాయి. ఈ సబ్ సెంటర్లలో ఒక్కో సబ్ సెంటర్కు ఒక్క రోజు కేటాయించి ఆ రోజు ఆయా గ్రామాల నుంచి ఆశ కార్యకర్తలు గర్భిణులను పీహెచ్సీకి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి వాళ్ల ఇళ్లకు చేర్చుతున్నారు. సంతోషంగా ఉంది... క్యాతూర్ పీహెచ్సీకి వైద్య పరీక్షల నిమిత్తం రా వడం ఇబ్బందిగా ఉండేది. సమయానికి బస్సులు, ఆటోలు రాక ఇబ్బందులు పడ్డాం. దీంతో సమయానికి చేరుకోలేక వైద్య పరీక్షలు చేయించుకోవడం కష్టంగా ఉండేది. 102 వాహనం రావడంతో ఆ కష్టాలు దూరమయ్యాయి. వైద్య పరీక్షలకు వెళ్లడానికి ఇబ్బందులు తొలగాయి. వాహనం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉంది. – కృష్ణవేణి, గర్భిణి, ఉట్కూరు సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం 102 సేవలు అందుబాటులోకి తెచ్చింది. అందుకే ఒ క్కో సబ్ సెంటర్ పరిధిలోని గ్రా మానికి ఒక రోజు కేటాయించాం. గర్భిణులు 102 వాహనంలో వచ్చి వైద్య సేవల అనంతరం తిరిగి వెళ్లవచ్చు. ఈ అవకాశం ప్రతి గర్భిణి సద్వినియోగం చేసుకోవాలి. – అనురాధ, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, క్యాతూర్ -
స్మార్ట్ ఫోన్ ఉంటేనే ‘నివేదన’
మల్దకల్ : నివేదన, స్పందన యాప్లకు అందరు స్మార్ట్ఫోన్ తప్పనిసరిగా ఉపయోగించాలని ఎంపీడీఓ గోవిందరావు వివిధ శాఖల అధికారులకు సూచించారు. బుధవారం మండల పరిషత్ సమావేశ హాల్లో అంగన్వాడీ, పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్శాఖ, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులకు నివేదన, స్పందన యాప్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కలెక్టర్ రజత్కుమార్షైనీ ఇటీవలే ప్రారంభించిన నివేదన, స్పందన యాప్లను అందరు తమ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ప్రజలు పంపిన ఫిర్యాదులకు సమాధానాలు వారం రోజుల్లో పంపించాల్సి ఉంటుందని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయన్నారు. స్మార్ట్ఫోన్లు లేవనే సాకుతో ఫిర్యాదులకు స్పందించని అధికారులపై కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయన్నారు. సూపరింటెండెంట్ రాజారమేష్, జూనియర్ అసిస్టెంట్ సూర్యప్రకాష్రెడ్డి, వివిధ శాఖల అధికారులు మల్లేశ్వర్రావు, శ్రీలత, జ్యోతి, మాణిక్యరాజ్, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
నిషేధిత కల్లుకు కళ్లెం
గద్వాల క్రైం : నిషేధిత కల్లు తయారీ.. విక్రయాలపై పోలీసు, ఎక్సైజ్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. అయితే నిషేధిత కల్లును కొందరు గుట్టుగా అధికారుల కళ్లు గప్పి రైలుమార్గాల ద్వారా గద్వాలకు చేరుస్తున్నారు. ఇక రైల్వే పోలీసుల తనిఖీల్లో నిత్యం నిషేధిత కల్లును పలువురు తీసుకెళ్తున్న తరుణంలో నిఘా ఉంచి నిందితుల నుంచి వందలాది లీటర్ల నిషేధిత కల్లును స్వాధీనం చేసుకుంటున్నారు. గద్వాల మండల కేంద్రంలోని నిషేధిత కల్లు తయారీ, విక్రయాలపై పోలీసు, ఎక్సైజ్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంది. దొడ్డిదారిన వనపర్తి నుంచి.. ఇటీవల గద్వాలకు చెందిన కొందరు రైలు మార్గాల ద్వారా నిషేధిత కల్లును దొడ్డిదారిన వనపర్తి జిల్లా నుంచి గద్వాలకు తీసుకొస్తున్నారు. ఇలా తీసుకొచ్చిన ని షేధిత కల్లును రహస్యంగా కల్లు ప్రియులకు విక్రయిస్తున్నారనే సమాచారం అధికారులకు తెలిసింది. దీంతో ఎక్సైజ్ అధికారులు రైల్వే పోలీసులను అప్రమత్తం చేయడంతో నిత్యం రైల్వే అ ధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల్లో 20 రోజుల్లోనే 1,000 లీటర్ల నిషేధిత కల్లును స్వాధీనం చేసుకొని 15 మందిపై కేసులు నమోదు చేసి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. రైలు మార్గంలో ఎందుకంటే.. గద్వాలో నిషేధిత కల్లు తయారీ, విక్రయాలు చేస్తే అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో నిషేధిత కల్లుకు అలవాటు పడిన కల్లు ప్రియులు కల్లు దొరక్కపోవడంతో వనపర్తి జిల్లాకు వెళ్తున్నారు. ఇది అదునుగా భావించిన కొందరు అక్కడి నుంచి ఇక్కడకు తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తే లాభం వస్తుందనే దురాలోచనతో రైలు మార్గం ద్వారా గుట్టుగా తీసుకొస్తున్నారు. అందులోనూ రైలు మార్గం ద్వారా తీసుకురవాడం సులువుగా ఉండటం. అధికారులు పెద్దగా దృష్టి సారించరనే నేపంతో రైలు మార్గం ఎంచుకున్నారనే విమర్శలు నెలకొన్నాయి. నిషేధిత కల్లు విక్రయాలపై నిఘా.. నిషేధిత కల్లు తాగడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభవం చూపుతుంది. పలు ఆరోగ్య సమస్యలు, మత్తు కలిగించే క్లోరల హైడ్రేట్, ఆల్ఫాజోం తదితర పదార్థాలతో తయారు చేసిన కల్లు తాగడంతో మత్తుకు బానిసగా మరి మానసికంగా కుంగిపోతారు. నిషేధిత కల్లు దొరకని సమయంలో పిచ్చిగా కేకలు వేయడం ఇతరత్ర భయాందోళనకు దారి తీస్తారు. ప్రభుత్వం కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపింది. నిషేధిత కల్లు ఎవరైనా రహస్యంగా తీసుకొస్తున్నట్లు తెలిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. నిషేధిత కల్లును విక్రయించినా, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – గోపాల్ గద్వాల ఎక్సైజ్ సీఐ -
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : పట్టెడన్నం పెట్టే అన్నదాతల విషయంలో ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. సాగుకోసం చేసిన అప్పులను కూడా తీర్చలేక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ‘రైతు సమస్యలు– పరిష్కారాల సదస్సు’ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జేఏసీ నేతలు, రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సంక్షోభాలను వివరించారు. అష్టకష్టాల కోర్చి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధరలేక సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు నుంచి పంట చేజారిపోగానే అమాంతం రేట్లు పెరిగిపోతున్నాయన్నారు. వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం ప్రకృతి వైఫల్యం వల్ల వచ్చినది కాదని, కేవలం మానవ నిర్మితమైనదన్నారు. విత్తనాలు, ఎరువులు ఇలా ప్రతీది కల్తీమయమవుతుందని పేర్కొన్నారు. పారిశ్రామిక రంగానికి ఇస్తున్న ప్రోత్సాహాల మాదిరిగా వ్యవసాయరంగానికి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విధిలేని పరిస్థితుల్లో వ్యవసాయం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వ్యవసాయరంగం పూర్తి సంక్షోభంలో కూరుకుపోయిందని వనపర్తి జిల్లా జేఏసీ చైర్మన్ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. సాగుకు పెట్టుబడి లేక ఆవులు, దూడలను పెబ్బేర్ సంతలో అమ్ముకుంటున్నారన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ఎలాంటి గిట్టుబాటు ఉండటం లేదన్నారు. విధిలేని పరిస్థితిలో వ్యవసాయం చేస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు. రైతులకు తీరని నష్టం పత్తి విత్తనాల కంపెనీలు, సీడ్ ఆర్గనైజర్ల మోసాల వల్ల గద్వాల జిల్లా రైతులు తీవ్రంగా మోసపోతున్నారని జిల్లా జేఏసీ చైర్మన్ నాగర్దొడ్డి వెంకట్రాములు ఆవేదన వ్యక్తంచేశారు. 20ఏళ్లుగా చేస్తున్న వారి అక్రమాలపై రైతులే స్వయంగా నడుంబిగించి పోరాటం చేయాల్సి వచ్చిందే తప్ప, ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. సీడ్పంట ద్వారా ఎకరాకు రూ.5లక్షల దిగుబడి వస్తే కేవలం రైతుకు రూ.2లక్షలు అందజేసి, మిగతా మూడు లక్షలు కంపెనీలు, సీడ్ఆర్గనైజర్లు కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. తుంగభద్రనది నుంచి న్యాయబద్దంగా రావాల్సిన వాటా 15.9టీఎంసీలను ఎందు కు రాబట్టడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, వివిధ మండలాల నుంచి పెద్దసంఖ్య లో రైతులు తరలివచ్చారు. ఆత్మç ßæత్య చేసుకున్న రైతులకు సంతాప సూచకంగా మౌనం పాటించారు. క్రియాశీలకంగా టీజేఏసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ వ్యవసాయరంగానికి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మహబూబ్నగర్ జిల్లా జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచి ఉద్యమాలలో భాగస్వామ్యం చేయడంలో జేఏసీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందన్నారు. అందులో భాగంగానే ప్రభు త్వ వాగ్దానాలు అమలుచేయాలని జేఏసీ ఒక బాధ్యతతో డిమాండ్ చేస్తోం దని అన్నారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై 45రోజుల పాటు జేఏసీ సమగ్రంగా అధ్యయనం చేసిందని, ఆ నివేదికను కేంద్ర నాయకత్వానికి అందజేశామన్నారు. ఫిబ్రవరి 4న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సదస్సులో ఒక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. -
ఉత్తీర్ణతపై దృష్టి
శాంతినగర్ : ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన ఉండాలని, వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ రజత్కుమార్సైనీ స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఉపాధ్యాయులు. ఉమ్మడి వడ్డేపల్లి మండలంలో మొత్తం 630 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వడ్డేపల్లి మండలంలో 5 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 1 ఎయిడెడ్ పాఠశాల, మరో కస్తూర్బా పాఠశాల ఉంది. రాజోలి మండలంలో 3 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎంపీహెచ్ఎస్, ఉర్దూ మీడియం పాఠశాల ఉంది. ఆయా పాఠశాలల్లో పది చదువుతున్న విద్యార్థులంతా మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించా లని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండటంతో ప్రత్యేక ప్రణాళికతో ఉపాధ్యాయులు విద్యాబోధన చేపట్టారు. ముగ్గురు విద్యార్థుల చొప్పున ఆయా పాఠశాలల్లో చదువులో వెనుకబ డిన విద్యార్థులను గుర్తించి ఒక్కో ఉపాధ్యాయుడు ముగ్గురు చొప్పున దత్తత తీసుకున్నారు. వారు పాస్అయ్యే బాధ్యతను ఉపాధ్యాయులు చేపట్టారు. వారం రోజులపాటు చెప్పిన పాఠాల్లోని అంశాలపై ప్రతివారం స్లిప్టెస్ట్లు నిర్వహిస్తున్నారు. అందులో రాయలేని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సాగిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి అల్పాహారం.. విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు కృషిచేస్తున్నట్లు ఎంఈఓ నర్సింహులు పేర్కొన్నారు. ఈ విషయమై కొందరు దాతలను కలిశామన్నారు. అందుకు వారు సానుకూలంగా ఉన్నారని, ఫిబ్రవరి 1నుంచి అల్పాహారం అందించి ప్రత్యేక తరగతులు కొనసాగిస్తామన్నారు. సక్రమంగా పాఠశాలకు విద్యార్థులను తల్లిదండ్రులు పాఠశాలకు సక్రమంగా పంపాలి. పనులున్న సమయంలో పాఠశాలకు పంపకపోవడంతో పాఠాలు అర్థంగాక వెనుకబడి పోతున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రోత్సాహక బహుమతులు విద్యార్థులను ప్రోత్సహించే దిశగా 9.5 గ్రేడ్ సాధించిన వారికి శాంతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు హరుణ్రషీద్ రూ.516, సామేల్ రూ.1,116, ఊశన్న రూ.2,116, నాగేంద్రం రూ.5,116, 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు సాయిరాం రూ.10,116 ప్రోత్సాహక బహుమతులు ప్రకటించారు. పట్టుదలతో చదువుతున్నాను.. పదిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని మమ్మల్ని ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారు. పాఠశాల వదిలిన అనంతరం ప్రత్యేక తరగతులు పెట్టి పాఠాలు చెబుతున్నారు. పదిలో ఎలాగైనా 9.5 జీపీఏకు పైగా మార్కులు తెచ్చుకోవాలని, పాఠశాలకు, ఉపాధ్యాయులకు మా తల్లిదండ్రులకు పేరు రావాలని పట్టుదలతో చదువుతున్నాను. – స్వప్న, విద్యార్థి, జెడ్పీహెచ్ఎస్ శాంతినగర్ టాప్ మార్కులు సాధించే దిశగా బోధన అత్యధిక మార్కులు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషిచేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మా టాపర్లంతా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేరారు. అయినా ఉన్నవారిని వందశాతం పాస్చేయించి అత్యధిక మార్కులు సాధించేదిశగా అడుగులు వేస్తున్నాం. – నర్సింహులు, ఎంఈఓ, వడ్డేపల్లి ప్రత్యేక తరగతులు.. ఆయా గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ప్రారంభిచారు. ఉదయం గంట, సాయంత్రం గంటపాటు తరగతులు నిర్వహిస్తూ.. విద్యాబోధన చేస్తున్నారు. -
పసికందును బకెట్లో వేసి చంపిన కసాయి
ఉండవెల్లి: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తండ్రే కసాయిగా మారాడు. ఐదు నెలల వయస్సు ఉన్న కన్న కూతురి ప్రాణాలను పొట్టనపెట్టుకున్నాడు. పుల్లూరుకు చెందిన కుర్వ విజయ్కుమార్ నీళ్ల బకెట్లో తన కుమార్తెను పడవేశాడు. దీంతో నీటిలో ఊపిరాడక ఆ పసికందు మృతిచెందింది. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
బరితెగించిన ఏఎస్ఐ..
సాక్షి, జోగుళాంబ: జిల్లాలోని ఓ ఏఎస్ఐ బరితెగించాడు. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ఓ మహిళా కానిస్టేబుల్తో మసాజ్ చేయించుకుంటూ సిక్రెట్గా అమర్చిన కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. జోగులాంబ గద్వాల్ సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా పని చేస్తున్న హసన్ గత కొద్దికాలంగా కిందిస్థాయి సిబ్బందితో సపర్యలు చేయించుకుంటున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను సాక్ష్యాలతో పట్టుకోవాలనుకున్న కొంతమంది సీక్రెట్ కెమెరాలు అమర్చారు. స్టేషన్ విశ్రాంతి గదిలో మహిళా హోంగార్డ్ తో మసాజ్ చేయించుకుంటున్నట్లు ఉన్నఈ వీడియోను సోమవారం మీడియాకు అందజేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ వెంటనే విచారణకు ఆదేశించారు. -
మహిళా హోమ్ గార్డుతో ఏఎస్ఐ మసాజ్
-
రూ.51 కట్టి సొసైటీల్లో సభ్యత్వం తీసుకోవాలి
- ఒక్కొక్కరికి రూ.1.25లక్షల చొప్పున గొర్రెలకు రుణాలు - గొర్రెల కాపరితో మంత్రి హరీశ్ మాటామంతి సాక్షి, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలో నెట్టెంపాడు కాల్వల పరిశీలనలో భాగంగా పర్యటిస్తున్న మంత్రి హరీశ్రావుకు గట్టు మండలం ఆరగిద్ద గ్రామం వద్ద గొల్లకుర్మలకు చెందిన పాగుంట అనే వ్యక్తి గొర్రెలను మేపుతూ కాల్వగట్లపై కనిపించాడు. దీంతో వెంటనే మంత్రి హరీశ్ తన కాన్వాయ్ను ఆపి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లాడు. ప్రభుత్వం గొల్లకుర్మలకు అందజేస్తున్న సబ్సిడీ గొర్రెల పథకంపై ఆరా తీశాడు. వారి మధ్య సంభాషణ ఇలా ఆసక్తికరంగా సాగింది.. మంత్రి హరీశ్: ఏమయ్యా...నీ పేరేంటీ? సారూ నాపేరు పాగుంట. మంత్రి: గొల్లకుర్మలకు ప్రభుత్వం గొర్రెలను అందజేయాలని నిర్ణయించింది నీకు తెలుసా.. పాగుంట: తెలుసు సార్.. గ్రామంలో చెప్పారు. మంత్రి: సహకార సంఘంలో సభ్యత్వం తీసుకున్నావా.. పాగుంట: తీసుకున్న సార్. మంత్రి: ఎన్ని డబ్బులు కట్టావు.. పాగుంట: రూ.300 కట్టాను సార్. మంత్రి: అంత ఎందుకు కట్టావు.. సభ్యత్వానికి కేవలం రూ.51 మాత్రమే ఇవ్వాలి. పాగుంట: ఏమో సార్ మాకు తెల్వదు మా గ్రామంలో అంతనే కట్టించుకున్నారు. కొంత మంది రెండు వేలు కూడా ఇచ్చిండ్రు. (అప్పుడే పక్కన ఉన్న పొలాల్లోని గొల్లకుర్మలు కూడా హరీశ్రావు వద్దకు వచ్చారు.) మంత్రి: సభ్యత్వానికి మీరెంత చెల్లించారు..? పాగుంట, ఇతర రైతులు: మేము రూ.300 కట్టాము సార్, మా ఊర్లో, మరి కొన్ని ఊర్లలో 2 వేలు కూడా తీసుకున్నారు. మంత్రి: ఇలా ఎంత మంది ఇచ్చిండ్రు రెండు రెండువేలు.. పాగుంట, ఇతర గొల్లకుర్మలు: కురుమోల్లందరూ మాకు తెలిసిన వరకు రూ.300 చొప్పున 300 మంది వరకు ఇచ్చినారు. 2 వేల చొప్పున 30 మంది కట్టిండ్రు సార్. మంత్రి దీనిపై వెంటనే కలెక్టర్ రజత్కుమార్సైనితో మాట్లాడుతూ గొల్లకుర్మల సొసైటీ రిజిస్ట్రేషన్లపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్: రెండు, మూడు గ్రామాల్లో నిర్వహించాం. అన్ని గ్రామాల్లో నిర్వహిస్తాం సార్. మంత్రి: గొల్లకుర్మలను ఉద్దేశించి ..మీకు వచ్చేది లక్షా 25 వేలు, అందులో బారాన పైసలు మాఫీ, చారానా పైసలు కట్టాలి. అంటే రూ.93 వేలు సబ్సిడీ, రూ.32 వేలు మీరు కట్టాలి. పాగుంట: గొర్లు ఇచ్చేందుకు ఎంత కట్టాలి సార్. ఈ రసీద్ సరిపోతదా.. మంత్రి..: రూ.51 కట్టి సభ్యత్వం తీసుకుంటే చాలు. గొర్ల రుణాలు తీసుకునేందుకు అర్హులు. పాగుంట, గొల్లకుర్మలు: మాకు రూ.40 వేలు అవుతుందని చెప్పారు సార్. మంత్రి: తప్పు.. మీకు తెల్వక మిమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నరు. రూ.2 వేలు ఎవరూకట్టొద్దు.. సభ్యత్వానికి రూ.51 ఇచ్చి, గొర్లు వచ్చిన తర్వాత రూ.32 వేలు ఇవ్వాలి. అంతే..సరేనా వస్త మరి.. (ఇలా గొల్లకుర్మలతో మాటామంతీ జరిపిన అనంతరం మంత్రి హరీశ్రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు.)