kama reddy
-
‘వాటిని మేనిఫెస్టోలో చేర్చండి.. లేదంటే 200 మంది నామినేషన్ వేస్తాం’
కామారెడ్డి జిల్లా: తెలంగాణ సీఎం కేసీఆర్పై పోటీకి సమాయత్తమవుతోంది తెలంగాణ అమరుల ఐక్యవేదిక. దీనిలో భాగంగా రెండొందల మంది అమరుల కుటుంబ సభ్యులు నామినేషన్ పత్రాల కోసం కామారెడ్డికి వచ్చినట్లు తెలంగాణ అమరుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన రఘుమారెడ్డి.. తెలంగాణలో 1345 మంది తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైతే కేవలం 400 మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించిందన్నారు. కొంతమందికి నాల్గవ తరగతి ఉద్యోగాలు ఇవ్వగా, మరికొంతమందికి ఐదేళ్ల తర్వాత రూ. 10 లక్షల చొప్పున ఇచ్చారన్నారు. ‘రైల్ రోకో, బస్ రోకో చేసిన సమయంలో 175 మంది వికలాంగులుగా మారారు.. వీరికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు. చదువుకున్న వారికి విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి. చదువుకోని వారికి ఒక్క కుటుంబానికి 10 ఎకరాలు ఇవ్వాలి. తమ డిమాండ్లు ఈ నెల 9 మధ్యాహ్నం 12:30 లోపు కేసీఆర్ తమను పిలిచి మేనిఫెస్టోలో చేర్చాలి. లేకపోతే ఆ రోజు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్ వేసిన మరుక్షణమే 200 మంది అమరుల కుటుంబాలు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. కామారెడ్డితో పాటు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో కూడా నామినేషన్స్ వేస్తాం’ అని హెచ్చరించారు. నేను కందిపప్పు అయితే నువ్వు గన్నేరు పప్పు: కేటీఆర్కు రేవంత్ కౌంటర్ -
కామారెడ్డిలో పోటీపై షబ్బీర్ అలీ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: తాను నియోజవర్గం మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. కామారెడ్డి నుంచే పోటీ చేస్తానని షబ్బీర్ ఆలీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు కొందరు కావాలనే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ కామారెడ్డి వచ్చారన్నారు. తన పుట్టుక, చావు కామారెడ్డిలోనేనని షబ్బీర్ ఆలీ తేల్చిచెప్పారు. ‘కేసీఆర్కు స్వాగతం పలుకుతున్నాను. కామారెడ్డికి రండి.. ఇద్దరం పోటీలో ఉందాం. ఇద్దరం ప్రజాక్షేత్రంలో తలబడదాం. మీ నిజాయితీని నిరూపించుకోండి. నా నిజాయితీని నేను నిరూపించుకుంటాను. ప్రజలే నిర్ణయిస్తారు. అంతే కానీ నీవు అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరు’ అని తెలిపారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బరిలో నిలుస్తుండటంతో షబ్బీర్ అలీ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రత్యర్థిగా కేసీఆర్ఉండటంతోనే పోటీకి షబ్బీర్ ఆలీ విముఖత వ్యక్తం చేస్తారనేది ఆ రూమర్ల సారాంశం. కేసీఆర్పై పోటీకి దిగితే అది తన పొలిటికల్ కెరీర్పై పడుతుందంటూ వార్తలు వ్యాపించాయి. ప్రస్తుత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కాకుండా ఎల్లారెడ్డి నుంచి బరిలో దిగాలని షబ్బీర్ అలీ ఆలోచిస్తున్నట్టు పార్టీలో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటిని తాజాగా ఖండిస్తూ తన పోటీ కామారెడ్డి నుంచేనని స్పష్టం చేయడంతో ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇది కూడా చదవండి: కమీషన్ల కోసమే కాళేశ్వరం.. కేసీఆర్పై బండి సంజయ్ ఫైర్ ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
కలెక్టరేట్లకు సౌర సొబగులు
జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో సోలార్ పార్కింగ్ షెడ్ల ఏర్పాటు దిశగా తెలంగాణ రెడ్కో (రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ పార్కింగ్ షెడ్లను ఏర్పాటు చేయగా తాజాగా ఇతర జిల్లాల్లోనూ వాటి ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సూర్యా పేట, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ల క్యాంపస్లలో సోలార్ పార్కింగ్ షెడ్ల నిర్మాణం పూర్తయింది. 20న సూర్యాపేట ప్లాంటును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.– సాక్షి, హైదరాబాద్ ఖమ్మంలో 200 కేవీ సామర్థ్యంతో.. ఖమ్మం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 200 కేవీ (కిలోవాట్ల) గ్రిడ్ అనుసంధానిత సోలార్ విద్యుత్ ప్లాంటును తెలంగాణ రెడ్కో ఏర్పాటు చేసింది. పార్కింగ్ స్థలాన్ని సద్వినియోగం చేసుకొనేలా పార్కింగ్ ప్రాంత పైభాగంలో సోలార్ ప్యానల్స్ను అమర్చింది. ప్రస్తుతం కలెక్టరేట్ కాంప్లెక్స్లో హైటెన్షన్ సర్వీస్లో నెలకు 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్ను వినియోగిస్తున్నారు. లోటెన్షన్ సర్వీస్లో మరో 14 వేల యూనిట్లకుపైగా విద్యుత్ ఖర్చవుతోంది. తాజాగా 200 కేవీ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుతో 24 వేల యూనిట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.దీనివల్ల రెండు సర్వీసుల్లో కలిపి నెలకు 4–5 వేల యూనిట్ల వరకు మాత్రమే గ్రిడ్ నుంచి వినియోగించుకున్నా సరిపోనుంది. అంతమేర మాత్రమే విద్యుత్ బిల్లు చెల్లించాల్సి రానుంది. ప్రస్తుతం నెలకు రూ. 1.80 లక్షల వరకు విద్యుత్ బిల్లులను కలెక్టరేట్ కార్యాలయాలు చెల్లిస్తుండగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో 80% వరకు విద్యుత్ బిల్లు తగ్గనుంది. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల ఏటా రూ. 20 లక్షల వరకు చార్జీల భారం తగ్గనుంది. ఈ లెక్కన 200 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు ఆరున్నరేళ్లలో తీరనుంది. మరో రెండు జిల్లాల్లో... రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్లో 100 కేవీ సామర్థ్యంతో సోలార్ ప్లాంట్, కామారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్లో 100 కేవీ సామర్థ్యంగల ప్లాంట్ పనులు పురోగతిలో ఉన్నాయి. మరోవైపు ఇతర కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చొరవ చూపా లని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీశ్రెడ్డి సూచించారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుతో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తి వల్ల జరిగే కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు. ప్లాంట్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా గరిష్టంగా ఆరున్నర ఏళ్ల లో తిరిగి వస్తుందన్నారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్య తను 20 ఏళ్లపాటు తెలంగాణ రెడ్కో పర్యవేక్షించనుంది. సూర్యాపేటలో 100 కేవీ సామర్థ్యంతో.. సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో 100 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏటా 1.44లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా ఏటా రూ.11.23లక్షల మేర ఆదా కానున్నట్లు రెడ్కో అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అయిన వ్యయం ఐదున్నర ఏళ్లలో తీరనున్నట్లు వివరిస్తున్నారు. -
కేసీఆర్తో కలిసి నడిచాడు, కమిట్మెంట్ ఉన్న ఎమ్మెల్యే: కేటీఆర్
సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్ కమిట్మెంట్ ఉన్న నాయకుడని అన్నారు. పైసలు, పదవుల కోసం సురేందర్ రాజకీయల్లోకి రాలేదని, తెలంగాణ రావాలని కేసీఆర్తో కలిసి నడిచారని గుర్తు చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన నాయకులకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తెలిపారు. కేసీఆర్ను, మంత్రులను సురేందర్ ఎప్పుడు కలిసినా మా నియోజకవర్గం వెనుకబడింది, నిధులు కేటాయించాలని అడుగుతారని కేటీఆర్ గుర్తు చేశారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.20 కోట్ల 31లక్షల నిధులు మంజూరు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే అత్యధికంగా 1లక్షా 3 వేల మందికి రైతు బంధు అందుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం రైతులు అవస్థలు పడ్డారని విమర్శించారు. కరెంట్ లేక సాగునీరు కోసం రైతులు అడుక్కోవాల్సి వచ్చిందన్నారు. విత్తనాలు, ఎరువు పోలీస్ స్టేషన్లో పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్దని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు 10 సార్లు ఓటేస్తే రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. వ్యవసాయానికి నాణ్యమైన కరెంటు ఇచ్చారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీవి నీతి లేని మాటలని కేటీఆర్ ధ్వజమెత్తారు. హిందూ, ముస్లిం తప్ప బీజేపీకి మరో ఎజెండా లేదని ఫైర్ అయ్యారు. రాబంధులు రావాలా రైతు బంధు కావాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే మళ్ళీ కుంభకోణాలేనని విమర్శించారు. హస్తం పాలనలో దుర్భిక్షం.. బీఆర్ఎస్ పాలనలో సస్యశ్యామలమని తెలిపారు. కాగా 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీచేసిన సురేందర్ సమీప టీఆర్ఎస్(ఇప్పటి బీఆర్ఎస్) అభ్యర్థిపై 31,000 వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అంతకముందు మంత్రి వేముల వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.28 కోట్లతో నిర్మించిన ఆరు లేన్ల రహదారి, స్వాగత తోరణం, సెంట్రల్ లైటింగ్, మీడియన్, రోడ్డు డివైడర్లను కేటీఆర్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో.. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. -
పెళ్లి రిసెప్షన్లో యువకుల హల్చల్.. తుపాకీ, తల్వార్తో డ్యాన్స్లు
సాక్షి, కామారెడ్డి: పెళ్లి రిసెప్షన్లో కొందరు యువకుడు వీరంగం సృష్టించారు. తుపాకీలు, కత్తులు చేతపట్టి డ్యాన్స్ చేశారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 10వ తేదీ రాత్రి మద్నూర్ మండల కేంద్రంలో జరిగిన పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకలో పెళ్లి కొడుకుతోపాటు మరికొందరు యువకులు తల్వార్, గన్లతో డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ వీడియోలను కొందరు ఫేస్బుక్లో పోస్టు చేయడంతో వైరల్గా మారాయి. చివరికి ఈ విషయం పోలీసులకు చేరింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవ వరుడితోపాటు స్నేహితులనుఅదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
మామూలు మోసం కాదిది
-
ప్రజా యుద్ధంతోనే సమాజానికి రక్షణ: కూర రాజన్న
సాక్షి, కామారెడ్డి: ప్రజాయుద్ధంతోనే సమాజానికి రక్షణ ఉంటుందని సీపీఐ (ఎంఎల్) జనశక్తి కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి కూర రాజన్న అన్నారు. భూస్వాములను, దొరలను ప్రభుత్వాలు, పోలీసులు రక్షిస్తున్నాయని పేర్కొన్నారు. తనపై కావాలనే తప్పుడు కేసు పెట్టారని, తాను పారిపోయినట్లు పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. పదిహేను సంవత్సరాల క్రితం సాగర్ అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, కానీ ఆ వ్యక్తిని కూడా తమతో కలిపి కేస్ చేయడం సరికాదన్నారు. బీడీ కంపెనీలు రక్షణ కోసం ఫండ్ ఇవ్వడం ఆనవాయితీ అని, కానీ కావాలనే డబ్బులు డిమాండ్ చేసినట్లు తప్పుడు కేసు పెట్టారని కూర రాజన్న పెట్టారు. పెట్టిన కేసును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా.. కామారెడ్డిలో చందాల వసూళ్ల కేసులో రాజన్న బెయిల్ మంజూరు కావడంతో 10 నెలల తర్వాత చంచల్గూడ జైలు నుంచి మంగళవారం విడుదలయ్యారు. చదవండి: రేవంత్, ఈటల సవాళ్లపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. -
కామారెడ్డి.. ఎల్లారెడ్డి.. కుమ్ములాటకు రెడీ
ఇందూరు ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్దం జరుగుతోందా? కొందరు నేతలు టిక్కెట్ల కోసం పాము, ముంగిసల్లా కాట్లాడుకుంటున్నారా? వీళ్ళ వ్యవహారం జిల్లా నుంచి ఢిల్లీ దాకా పాకిపోయిందా? గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో కొందరి కారణంగా పుట్టి మునిగే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎడమ చేయి vs కుడి చేయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పార్టీని కాంగ్రెస్ స్థానిక నేతలు చేతులారా దెబ్బ తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఎవరికి వారు పోటీ పడుతూ.. కొట్లాడుకుంటున్నారు. కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్గానికి... ఎల్లారెడ్డి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మదన్ మోహన్రావు ఓ కొరకరాని కొయ్యలా మారాడు. ఎల్లారెడ్డి టిక్కెట్ను ఇప్పటికే సుభాష్ రెడ్డి అనే నేత ఆశిస్తున్నారు. అయితే మదన్ మోహన్ చేసుకుంటున్న ప్రచారంతో... సుభాష్ రెడ్డితో పాటు...షబ్బీర్ అలీకి దిక్కుతోచని పరిస్థితులేర్పడ్డాయి. పైగా సుభాష్ రెడ్డీకి షబ్బీర్ అలీ మద్దతుగా ఉంటున్నందుకు...మదన్మోహన్ ఆయనకు కూడా ఎర్త్ పెడుతున్నాడు. అప్పుడప్పుడు టీపీసీసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న అజారుద్దీన్ ను తీసుకొచ్చి... అధిష్ఠానం ఆదేశిస్తే కామారెడ్డి నుంచి తాను బరిలోకి దిగుతానంటూ స్టేట్ మెంట్స్ కూడా ఇప్పిస్తుండటంతో.. షబ్బీర్ వర్గీయుల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడిన్టవుతోంది. ఈ క్రమంలోనే...పీసీసీ చీఫ్ రేవంత్ పర్యటన సందర్భంగా రెండు వర్గాల మధ్య మరోసారి బాహాబాహీకి తెరలేచింది. నీ గుట్టు నేను విప్పుతా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నిర్వహించే రచ్చబండ కార్యక్రమాల సమయంలో.. ఎల్లారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్న మదన్ మోహన్, సుభాష్ రెడ్డి గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎల్లారెడ్డిలో రేవంత్ సభ జరిగిన సమయంలో కూడా రచ్చ జరిగింది. ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న కార్ల కాన్వాయ్ ఒకటి వచ్చి సుభాష్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం.. సదరు ఎమ్మెల్యే స్టిక్కర్ కారు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి,. మదన్ మోహన్ స్వయానా ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు. మంత్రి స్టిక్కర్ కార్ల కాన్వాయ్ ఘటనతో మదన్ మోహన్ పై కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఏఐసీసీ స్థాయిలో ఉన్న తన పలుకుబడితో మదన్ మోహన్ సస్పెన్షన్ అమలవకుండా చేసుకోగలిగారు. ఇటవంటి ఘటనలన్నీ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను బట్టబయలు చేశాయి. అంతేకాదు, ఒకసారి కామారెడ్డిలో మదన్ మోహన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వచ్చిన అజారుద్దీన్... అధిష్ఠానం ఆదేశిస్తే తాను కామారెడ్డి బరిలో ఉంటానని..ఇంకోసారి ఎల్లారెడ్డిలో పోటీ చేస్తానని చెప్పారు. ఇలా షబ్బీర్ వర్గానికి వ్యతిరేకంగా మదన్ మోహన్ వర్గం జిల్లాలో సీరియస్గా పనిచేస్తోంది. అటు షబ్బీర్కు, ఇటు సుభాష్రెడ్డికి దిక్కుతోచని పరిస్థితి తీసుకువస్తున్నారు మదన్మోహన్. తగ్గేదే లేదట.! కామారెడ్డి, ఎల్లారెడ్డి చూసుకుంటానని చెప్పడానికి షబ్బీర్ అలీ ఎవరని ప్రశ్నిస్తూ మదన్మోహన్ కామారెడ్డిలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏడుసార్లు ఓటమి పాలైన షబ్బీర్ ముందు కామారెడ్డిలో గెలిచి.. ఎల్లారెడ్డి సంగతి చూడాలని సూచించారు. టిక్కెట్లు పంపిణీ చేసేందుకు.. షబ్బీర్ అలీ టీపీసీసీ అధ్యక్షుడో, ఏఐసీసీ అధ్యక్షుడో కాదంటూ మదన్ మోహన్ కామెంట్ చేశారు. కచ్చితంగా తాను ఎల్లారెడ్డి నుంచి బరిలో ఉంటానని తేల్చి చెప్పిన మదన్ మోహన్.. ప్రజలు తిరస్కరిస్తే ఓ కార్యకర్తలా పనిచేయడానికీ సిద్ధమేనంటూ తన మనోగతాన్ని వివరించారు. అదే సమయంలో షబ్బీర్ అలీకి వ్యతిరేకంగా తన గళాన్ని గట్టిగా వినిపించాడు. దీంతో కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ అంతర్గత కలహాలు ఇప్పుడు తారాస్థాయికి చేరిపోయాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుంది: రేవంత్రెడ్డి
సాక్షి, కామారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్పై రైతులంతా తిరుగుబాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మనఊరు మనపోరు’ సభలో రేవంత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. 12 వేల కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణలో ప్రతిరైతు సంతోషంగా ఉంటారని అన్నారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు కట్టబెడుతున్న కేసీఆర్.. రైతులకు ఆ మాత్రం చేయలేరా? అని సూటిగా ప్రశ్నించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. పంజాబ్, హర్యానా రైతులకంటే నిజామాబాద్ రైతులు చైతన్యవంతులని రేవంత్రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని ముఖ్యమంత్రి కూతురు కవితను ఓడించారని గుర్తు చేశారు. గెలిపిస్తే పసుపు బోర్డ్ తెస్తామని హామీ ఇచ్చి మరచిన ఎంపీని కూడా ఓడించాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రేవంత్రెడ్డి తెలిపారు. -
రైలుబండెక్కి వచ్చెత్త పా..! ముప్పై ఏళ్లుగా నిరాటంకంగా..
బతుకుదెరువు కోసం తెలంగాణ పల్లెల నుంచి ముంబయికి వలసలు కొత్తకాదు. దశాబ్దాల కాలంగా ముంబయి నగరం ఎందరికో బతుకునిచ్చింది. ఇప్పటికీ ఎందరో వెళుతుంటారు. అప్పట్లో అక్కడకు వెళ్లాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చాల్సి వచ్చేది. బస్సుల్లో అవస్థల ప్రయాణం ఆపై అడ్డగోలు చార్జీలు చెల్లించాల్సి వచ్చేది. అయితే సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా రైలు నడపడంతో ఈ ప్రాంత ప్రజలకు ముంబయి వెళ్లి రావడం సులువైంది. మూడు దశాబ్దాల నాడు అంటే 1992లో ‘దేవగిరి’ ఎక్స్ప్రెస్ పేరుతో ముంబయికి రైలు మొదలైంది. ముప్పై ఏళ్లుగా నిరాటంకంగా నడుస్తోంది. మొన్నామధ్య లాక్డౌన్ సమయంలో కొంతకాలమే రైలు నిలిచింది. తరువాత యథావిధిగా నడుస్తోంది. కాగా తెలంగాణ జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వేల కుటుంబాలు ముంబయిలో స్థిరపడ్డాయి. అలాగే ఉన్నత చదువుల కోసం, ఉద్యోగరీత్యా వెళ్లినవారూ ఉన్నారు. బంధుత్వాలు కూడా ఉన్నాయి. దీంతో అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా ముంబయితో ఎంత అనుబంధం ఉందో, దేవగిరి ఎక్స్ప్రెస్తోనూ ప్రజలకు అంతే అనుబంధం పెరిగింది. – సాక్షి, కామారెడ్డి రైలు ఆగేచోటల్లా ఎక్కేస్తారు.. సికింద్రాబాద్ నుంచి ముంబయికి 878 కిలోమీటర్లు దూరం కాగా, దేవగిరి ఎక్స్ప్రెస్ దాదాపు 17 గంటల నుంచి 18 గంటల పాటు నడుస్తుంది. సికింద్రాబాద్తో పాటు మెదక్ జిల్లాలోని మిర్జాపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ముథ్కేడ్, నాందేడ్ స్టేషన్ల మీదుగా రైలు ముందుకు సాగుతుంది. కాగా కామారెడ్డి రైల్వే స్టేషన్ సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లా వాసులకు అందుబాటులో ఉంటుంది. దీంతో ముంబయి వెళ్లేవారంతా కామారెడ్డికి వచ్చి రైలు ఎక్కి వెళతారు. ముంబయి నుంచి వచ్చే వారు కూడా కామారెడ్డి స్టేషన్లో దిగి ఇక్కడి నుంచే సొంతూళ్లకు వెళతారు. దేవగిరి ఎక్స్ప్రెస్ వచ్చిందంటే చాలు కనీసం వంద మంది దిగుతారు. రోజూ వెయ్యి మందికి పైగా.. దేవగిరి ఎక్స్ప్రెస్లో 20 బోగీలు ఉండగా, అందులో రెండు మూడు మాత్రమే జనరల్ బోగీలు కాగా, మిగతావి రిజర్వేషన్వి. ముంబయి వెళ్లేవారంతా రిజర్వు చేసుకుని వెళతారు. దాదాపు వెయ్యి మంది రిజర్వేషన్ చేయించుకుని ప్రయాణం చేస్తుండగా, ఇతర స్టేషన్లు దిగేందుకు, జనరల్ బోగీల్లో మరో వెయ్యి మంది వరకు వెళతారని అంచనా. కామారెడ్డి, నిజామాబాద్ రైల్వే స్టేషన్ల ద్వారా ముంబయి నగరానికి ప్రతిరోజూ కనీసం వంద మంది వెళ్లినా సంవత్సరానికి 30 వేల మంది వెళుతుంటారు. ముప్పై ఏళ్ల కాలంలో పది లక్షల మంది వెళతారు. తిరుగు ప్రయాణంలో కూడా అదే స్థాయిలో వస్తుంటారు. ఈ లెక్కన మూడు దశాబ్దాల కాలంలో దాదాపు 20 లక్షల మంది తిరిగినట్టు అంచనా. దేవగిరితో ఎంతో అనుబంధం.. మూడు దశాబ్దాలుగా నడుస్తున్న దేవగిరితో ఈ ప్రాంత ప్రజలకు అనుబంధం ఏర్పడింది. రైల్లో ఏ నంబరు బోగీ ఎక్కడ వస్తుందో ఇట్టే చెప్పేస్తుంటారు. రిజర్వేషన్ చేసుకోవడం, బెర్త్, టూ టైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ తదితర రిజర్వేషన్ల గురించి కూడా చాలా మందికి అవగాహన కలిగింది. కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, లింగంపేట, రామారెడ్డి, సదాశివనగర్, బీబీపేట, మెదక్ జిల్లాలోని రామాయంపేట, మెదక్, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన వందలాది కుటుంబాలు ముంబయిలో స్థిరపడ్డాయి. కొందరైతే నెలకోసారైనా సొంతూళ్లకు వచ్చి వెళుతుంటారు. పెళ్లిళ్ల సీజన్ ఉందంటే చాలు బంధువుల పెళ్లిళ్ల కోసం ముల్లేమూటలతో వచ్చి వారం, పదిరోజులు ఉండి వెళతారు. పండుగల సమయంలో కూడా వచ్చి వెళ్తారు. దీంతో దేవగిరితో ఆ కుటుంబాలకు అవినాభావ సంబంధం ఏర్పడింది. పదేళ్లుగా.. మాకు ముంబయిలో వ్యాపా రాలున్నాయి. మా అమ్మా, నాన్న అక్కడే ఉంటారు. నేను కూడా చాలా కాలం అక్కడే ఉండేవాన్ని. పదేళ్లుగా ఇక్కడికి వచ్చి ఉంటున్నా. వందల సార్లు దేవగిరిలో ముంబయికి వెళ్లాను. మాకు ముంబయికి ఎంత అనుబంధమో, దేవగిరికి కూడా అంతే అనుబంధం ఉంది. –రాఘవేందర్, వ్యాపారి, కామారెడ్డి రెగ్యులర్గా వెళతాం దుస్తుల కొనుగోళ్ల కోసం ముంబయికి ప్రతీసారి దేవగిరిలోనే వెళతాం. తిరిగి రావడం కూడా అదే రైలులోనే. ఏళ్ల తరబడిగా అందులో ప్రయాణిస్తున్నాం. దేవగిరి రైలు కామారెడ్డి ప్రాంత ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంది. ఉదయం కల్లా ముంబయిలో దిగి పనులు చేసుకుని, తిరిగి రాత్రి రైలెక్కుతాం. - సుధాకర్, వ్యాపారి, కామారెడ్డి ముంబయి తొవ్వలో దేవగిరి ఎక్స్ప్రెస్ ∙మూడు దశాబ్దాలుగా సేవలు ∙ఉమ్మడి జిల్లావాసులకు అనుకూలం ∙రైలుతో విడదీయలేని అనుబంధం ముంబయికి వెళ్లేందుకు దేవగిరి ఎక్స్ప్రెస్ రైల్లో ఎక్కుతున్న ప్రయాణికులు -
కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్.. ఏం జరిగిందో తెలిస్తే షాక్..
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి వివాహిత కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కామారెడ్డిలోని మంగళవారం ఉదయం ఓ వివాహితపై గుర్తు తెలియని వ్యక్తి దాడి ఘటన అంతా డ్రామాగా తేలింది. కానీ ఏ వ్యక్తి కూడా ఆమెపై కత్తితో దాడి చేయలేదని, తనకు తానే బ్లేడుతో గొంతు కోసుకుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిషాక్ ఫిర్దౌసి అనే మహిళ.. ఎవరో గొంతు కోశారంటూ హై డ్రామా నడిపింది. సీన్లోకి రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ సేకరించారు. డాగ్ స్వ్కాడ్తో తనిఖీలు నిర్వహించారు. విచారణ జరిపి అసలు నిజాన్ని బయట పెట్టారు. తనే గొంతు కోసుకుని డ్రామా ఆడిందని పోలీసులు వెల్లడించారు. నిషాక్ వింత ప్రవర్తనతో అత్తమామలు షాక్ అయ్యారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని.. రెండు నెలల క్రితం ఉరివేసినట్లుగా నిషాక్ పడిపోయినట్లుగా సమాచారం. ఎవరో తనని చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. ఇవీ చదవండి: వరంగల్లో దారుణం.. అన్న కుటుంబంపై కత్తులతో దాడి లక్షా 75 వేల ఆవు దూడ.. వింత చేప..! -
భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య
గాంధారి (ఎల్లారెడ్డి): భార్య మహిళా కానిస్టేబుల్.. ఆమె ఎస్సైతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనిపై ఎన్నిసార్లు వారించినా ఆమె పట్టించుకోలేదు. పైగా ఎస్సైతో దాడి చేయించింది. దీన్ని భరించలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు నిందితులను అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున ధర్నాచేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాం ధారి మండలం మాధవపల్లిలో చోటుచేసుకుంది. పోలీస్తుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర దెగులూర్ తాలూకాలోని షాకూర్ గ్రామానికి చెందిన శివాజీరావు 15 ఏళ్ల క్రితం మాధవపల్లికి చెందిన రైతు బాజారావు ఇంటికి ఇల్లరికం వచ్చాడు. బాజారావుకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రజితను శివాజీరావుకు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి కూతురు పుట్టిన రెండేళ్లకు అనారోగ్యంతో రజిత మృతి చెందింది. దీంతో బాజారావు రెండో కూతురు సంతోషితో శివాజీరావుకు రెండో పెళ్లి చేశారు. మూడేళ్ల క్రితం సంతోషికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి కామారెడ్డికి కాపురం మార్చారు. వీరికి రెండేళ్ల కూతురు ఉంది. ఈ క్రమంలో సంతోషికి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శివప్రసాద్ రెడ్డితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి భర్తను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన శివాజీరావు ప్రవర్తన మార్చు కోవాలని భార్యను హెచ్చరించాడు. దీంతో సంతోషి, ఎస్సై కలిసి శివాజీరావును మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డి నుంచి మాధవపల్లికి వచ్చిన శివాజీరావు తన ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. గాంధారి ఎస్సై శంకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తుల ధర్నా సమాచారం అందుకున్న సంతోషి కామారెడ్డి నుంచి గ్రామానికి చేరుకుంది. శివాజీరావు బంధువులు పెద్ద సంఖ్యలో మంగళవారం అర్ధరాత్రి గ్రామానికి వచ్చారు. అతని చావుకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని పట్టుపట్టారు. పోలీసులు ఎవరి కంట పడకుండా సంతోషిని దొడ్దిదారిన పోలీస్స్టేషన్కు తరలించారు. కోపోద్రిక్తులైన మృతుని బంధువులు ప్రధాన రహదారిపై రాళ్లు అడ్డంగా వేసి ధర్నా చేశారు. బుధవారం ఉదయం 10 వరకు ఆందోళన కొనసాగింది. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తానాజీరావు చెప్పడంతో ఆందోళన విరమించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కామారెడ్డి జిల్లా: చిట్యాలలో ఎలుగుబంటి హల్చల్
-
చిట్యాలలో ఎలుగుబంటి హల్చల్
సాక్షి, కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి నీటి కోసం గ్రామ శివారులోకి రాగా గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామస్తులు ఎలుగుబంటిని తరిమికొట్టగా గ్రామ శివారులో గల నీళ్లు లేని బావిలో పడింది. దాంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా వలల సహాయంతో ఎలుగుబంటిని పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నించారు. గ్రామస్తుల అరుపులు కేకలతో ఓ సందర్బంలో దాడి చేయడానికి ఎలుగుబంటి ప్రయత్నించి అడవిలోకి పారిపోయింది. చదవండి: విచిత్ర సంఘటన.. డ్రైవర్గా మారిన పెళ్లికొడుకు మంచె మీదే బీటెక్ విద్యార్థి ఐసోలేషన్.. చెట్టుమీదే -
ఈ భాషలన్నీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కొట్టిన పిండి!
సాక్షి , కామారెడ్డి: ‘ఆ ఎమ్మెల్యే మరాఠీ మాట్లాడే గ్రామాలకు వెళ్లినప్పుడు కనిపించిన వారినల్లా ‘కసే అహత్’ అంటూ మరాఠీలో వారి యోగ క్షేమాలు తెలుసుకుంటారు. కన్నడ మాట్లాడే గ్రామాలకు వెళితే ‘నీవు హేగిద్దిరే’ అంటూ కన్నడలో మాట్లాడి వారి కష్టసుఖాలను కనుక్కుంటారు. అలాగే తెలుగు మాట్లాడే గ్రామాలకు వెళితే ‘బాగున్నరా..’ అంటూ తెలుగులో మాట్లాడతారు. ఆయనే బహు భాషల సమ్మేళనమైన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే హన్మంత్ సింధే. ఆయనకు పలు భాషలు వచ్చు. అందుకే నియోజకవర్గంలో ఏ భాషవాళ్లు కలిస్తే వారి భాషలో మాట్లాడతారు. నియోజకవర్గంలో గిరిజనుల జనాభా కూడా ఎక్కువే. లంబాడీ భాషలో కూడా ఆయన అనర్గళంగా మాట్లాడతారు. అలాగే అధికారుల దగ్గరకు వెళ్లినపుడు ఇంగ్లీషు భాషను ఉపయోగిస్తారు. హిందీ మాట్లాడే అవకాశం ఉంటే హిందీలో మాట్లాడతారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో ప్రజలు తెలుగు, కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడతారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా వారితో ఆయా భాషల్లో మాట్లాడాల్సిందే. ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన ఎమ్మెల్యే హన్మంత్ సింధేకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలతో పాటు కన్నడ, మరాఠీ భాషలు కూడా వచ్చు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఏ భాష మాట్లాడితే ఎమ్మెల్యే కూడా వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. జుక్కల్ మండలంలోని సోపూర్ గ్రామం దాటితే కర్ణాటక రాష్ట్రం వస్తుంది. దీంతో జుక్కల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు చాలా వరకు కన్నడనే మాట్లాడతారు. అలాగే మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటాయి. ఇక్కడ చాలా వరకు మరాఠీ మాట్లాడుతారు. పలు గ్రామాల్లో మరాఠీ మీడియం స్కూళ్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇలా జుక్కల్ నియోజకవర్గం మూడు భాషల సంగమంలా ఉంటుంది. ఎమ్మెల్యే సింధే ఎన్నికల సమయంలో ప్రచారంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయడానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడుతారు. ప్రతి సభలో ఆయన మూడు భాషలలో మాట్లాడి ఆకట్టుకుంటారు. దీంతో ప్రజలు కూడా ఆయనంటే అభిమానం చూపిస్తారు. ఎమ్మెల్యే వివిధ భాషల్లో మాట్లాడడాన్ని కొత్తవారు ఆసక్తిగా చూస్తుంటారు. చదవండి: నభూతో నకాశీ.. మెప్పించిన చిత్రకళ ‘పల్లాను గెలిపిస్తే సీఎం గ్లాస్లో సోడా పోశాడు’ -
బయటపడ్డ భర్త బాగోతం.. చితకబాదిన మొదటి భార్య
సాక్షి, కామారెడ్డి : గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకుని కామారెడ్డి అశోక్నగర్ కాలనీలో మకాం పెట్టిన ఓ భర్తను పట్టుకొని మొదటి భార్య దేహశుద్ది చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా ముఠా కొండూరు మండలం చేర్యాల గ్రామానికి చెందిన పరశురాం బోర్వేల్స్ వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య ధనలక్ష్మీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారంతా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వ్యాపారం నిమిత్తం అన్ని ప్రాంతాలకు తిరిగే పరశురాం మూడు నెలలుగా ఇంటికి తిరిగి వెళ్లలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా కామారెడ్డికి చెందిన ఓ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుని అశోక్నగర్లో ఉంటున్నాడని తెలిసింది. దీంతో సోమవారం బంధువులతో కలిసి వచ్చి, పరశురాంను పట్టుకుని చితకబాది తమ వెంట తీసుకెళ్లారు. తనకు మాయమాటలు చెప్పి అన్యాయం చేశాడని రెండో భార్య కవిత ఆరోపించింది. చదవండి : అంగట్లో ఆడపిల్ల: ఏడు నెలల్లో ఏడు సార్లు ప్రేమపెళ్లి: బాలికను వివాహమాడిన మరో బాలిక -
ప్రియుడి మోజులో పడి.. ముక్కలుగా నరికి
నిర్మల్ : వివాహేతర సంబంధానికి అలవాటు పడిన మహిళ ప్రియుడితో కలిసి çకట్టుకున్నవాడిని నిర్ధాక్షిణ్యంగా చంపింది. మిస్టరీగా మారిన హత్య కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా మామడ పోలీస్స్టేషన్లో డీఎస్పీ ఉపేంద్రరెడ్డి బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలోని మో ర్తాడ్కు చెందిన అబ్దుల్ సమద్ పైసల్ (45)ను భార్య యాస్మిన్బేగం, ఆమె ప్రియుడు మహ్మాద్ అథాఉల్లాలు కలిసి హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా మామడ మండలం బూరుగుపల్లి జాతీయరహదారి సమీపంలో రోడ్డు పక్కన పడవేశారు. ఈ క్రమంలో గత డిసెంబర్ 25న రహదారి పక్కన పొదల్లో మూట కనిపించగా గ్రామస్తులు విప్పి చూశారు. అందులో కుళ్లిన స్థితిలో ఉన్న శవాన్ని గుర్తించారు. స్థానిక సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించగా సీఐ జీవన్రెడ్డి, ఎస్సై వినయ్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం, డాగ్స్క్వాడ్తో కొన్ని ఆధారాలు సేకరించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించారు. ఈ క్రమంలో తన భర్త అబ్దుల్ సమద్ పైసల్ కనిపించడం లేదని అతడిభార్య యాస్మిన్బేగం మోర్తాడ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. మామడ పోలీసులు ఆ దిశగా విచారణ జరిపారు. పైసల్ భార్య యాస్మిన్ను పిలిపించి కుళ్లిన స్థితిలో ఉన్న శవం ఫొటోల ను చూపించగా తన భర్త ఆనవాళ్లు కావని చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు పైసల్ అక్క, స్నేహితులను పిలి పించి శవానికి సంబంధించిన ఆనవాళ్లు చూపించారు. వారు సమద్ పైసల్గా గుర్తించారు. అనుమానంతో పోలీసులు యాస్మిన్తోపాటు ప్రియుడు మహ్మద్ అథాఉల్లాను అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో నిజాలు బయటపడ్డాయి. ప్రియుడి మోజులో పడి.. మోర్తాడ్కు చెందిన అబ్దుల్ సమద్ పైసల్ పెయింటర్గా పనిచేస్తుండగా, భార్య యాస్మిన్ బేగం బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఆటోడ్రైవర్ మహ్మద్ అథాఉల్లాతో యాస్మిన్ బేగంకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన భర్త పద్ధతి మార్చుకోవాలని భార్యకు చెప్పడంతోపాటు కమిటీ సభ్యులకూ ఫిర్యాదు చేశాడు. కమిటీ సభ్యులు మహ్మాద్ అథాఉల్లాను హెచ్చరించి పైసల్ ఇంటికి వెళ్లరాదని సూచించారు. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు పడుతున్నాడని, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్రణాళిక రూపొందించారు. గతనెల 16న రాత్రి సమయంలో అబ్దుల్ సమద్ పైసల్ను ఇంట్లోనే కర్రతో అథాఉల్లా దాడి చేయగా అతడు స్పృహ కోల్పోయాడు. అనంతరం యాస్మిన్ ప్రియుడితో కలిసి భర్త మెడకు తాడు బిగించి చంపివేశారు. 17న శవాన్ని ఇంట్లోనే ఉంచి కత్తితో ముక్కలు ముక్కలుగా చేసి పడేద్దామని అనుకుని కాలును తొలగించి ముక్కముక్కలుగా చేశారు. శరీరం ముక్కముక్కలుగా చేయడం ఆలస్యం అవుతుందని కిరోసిన్తో ముఖం ఆనవాలు ఏర్పడకుండా కాల్చివేశారు. అనంతరం శరీరాన్ని సంచులలో బ్లాంకెట్లో చుట్టి డిసెంబర్ 18న ఆటోలో తీసుకువచ్చి నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కన పొదలో పడేసి వెళ్లిపోయారు. మృతుడిని ఎవరూ గుర్తు పట్టకుండా దుస్తుల లోగోను తొలగించారు. హత్య చేసేందుకు వాడిన ఆటో, కత్తి, సెల్ఫోన్లు, తాడు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యాస్మిన్బేగం, మహ్మద్ అథాఉల్లాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హత్య కేసును ఛేదించిన సీఐ జీవన్రెడ్డి, ఎస్సై వినయ్, పోలీసులు శంశుల్హక్, రఫి, భీమన్నను ఎస్పీ విష్ణువారియర్ అభినందించారు. -
ఊరు మొత్తం ఖాళీ, మళ్లీ రాత్రికే..
సాక్షి, కామారెడ్డి : కరోనా మహమ్మారి పీడ పూర్తిగా విరగడ అయిపోవాలని కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామం మొత్తం వింత ఆచారాన్ని పాటించింది. ఒకరోజు ఊరంతా ఖాళీ చేసి గ్రామస్తులందరూ వన భోజనాలకు వెళ్లారు. ఈ సంప్రదాయం బీబీ పేట మండల కేంద్రంలో కనిపించింది. కరోనా నేపథ్యంలో ఆదివారం కూడా జనాలు అందరూ ఊరు విడిచి బయట ఉండాలని నిర్ణయించారు. కరోనా నియంత్రణలోకి రావాలనే ఉద్దేశ్యంతో గ్రామ దేవతలకు పూజలు ఘనంగా పూజలు చేశారు. డప్పు వాయిద్యాలతో ఊరేగింపులు తీశారు. అనంతరం వన భోజనాలకు వెళ్లారు. మళ్లీ రాత్రిలోగా ఊళ్ళోకి రావాలని తీర్మానించుకున్నారు. ఎలా చేయడం ద్వారా గ్రామ దేవతలు తమ గ్రామాన్ని చల్లగా చూస్తారని, కరోనా లాంటి వ్యాధులు దరి చేరకుండా దేవతలు ఆశీర్వదిస్తారని బీబీ పేట గ్రామస్తుల విశ్వాసం. కామారెడ్డి జిల్లాలో మరో రెండు గ్రామాలు నిజామాబాద్ జిల్లాలో ఒక గ్రామం లోనూ ఇలాంటి కట్టుబాట్లే కనిపించాయి. -
ఈ ఐదక్షరాల శాసనం వయసు 2,200 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్ : ఇదో శాసనం.. శాసనమంటే వాక్యాల సమాహారం కాదు, కేవలం ఐదక్షరాల పదం. ఆ పదానికి స్పష్టమైన అర్థం వెతకాల్సి ఉంది. అది చెక్కింది నిన్న మొన్న కాదు, దాదాపు 2,200 ఏళ్ల క్రితం. అంటే.. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దమన్నమాట. ఇది ఇంతకాలం ఓ గుండుపై అనామకంగా ఎదురుచూస్తూ ఉంది. మరి ఆ మాటకు స్పష్టమైన అర్థం ఏంటో ఎవరికీ తెలియదు. అసలు అది మన తెలుగు భాష, లిపి కాదు. అచ్చమైన ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపిలో లిఖించి ఉంది. అది కూడా అప్పుడప్పుడే శాతవాహన యుగం మొదలవుతున్న తరంనాటిది. అంటే.. అశోకుడి హయాంలో వాడిన లిపిలో ఉండటమే దీనికి తార్కాణం. వెరసి తెలంగాణ లో ఇప్పటివరకు వెలుగు చూసిన శాసనాల్లో ఇదే అతిపురాతనమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకాలం కృష్ణా, గోదావరి నదుల తీరాల్లో శాసనాలు ఎన్నో వెలుగుచూడగా, ఇది మంజీరా పరీవాహక ప్రాంతంలో బయటపడటం గమనార్హం. మంజీరా నదికి 500 మీటర్ల దూరంలో... కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపల్లి మండలంలోని మాల్తుమ్మెద గ్రామ శివారులో ఈ అపురూప లఘు శాసనం తాజాగా వెలుగుచూసింది. ఆదిమానవుల జాడ మొదలు ఎన్నో చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా ఉన్న ఈ గ్రామంలో ఇంత పురాతన చెక్కడం బయటపడటం విశేషం. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలతోపాటు బౌద్ధ ఆధారాలున్న ధూళికట్ట, కొండాపూర్, బోధన్ తదితర ప్రాంతాల్లో క్రీ.శ. ఒకటో శతాబ్దానికి చెం దిన శాసనాలు గతంలో వెలుగు చూసిన విష యం తెలిసిందే. కానీ, అంతకు కనీసం 200 ఏళ్ల పూర్వం నాటి శాసనం ఇప్పుడు ఇక్కడ బయటపడింది. మంజీరా నదికి 500 మీటర్ల దూరంలో పెద్ద బండరాయిపై ఈ అక్షరాలు చెక్కి ఉన్నాయి. ‘మాధవచంద’ అంటే.. ‘‘తెలుగులో ఈ శాసనం అర్థం ‘మాధవచంద’. ఇది వ్యక్తి పేరో, ప్రాంతం పేరో, వీటికి సంబం ధంలేని మరే అర్థమో అయి ఉండవచ్చు. దాని పై ఇంకా స్పష్టత లేదు. ఆ ఒక్క పదమే ఇక్కడ ఎందుకు చెక్కి ఉందో కనుగొనాల్సి ఉంది. ఎన్నో చారిత్రక ఆధారాలకు నెలవుగా ఉన్న ఆ గ్రామంలో దీనిపై మరింత పరిశోధన జరిపితే మరిన్ని వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది. కానీ, తొలి శాతవాహన కాలం నాటి గుర్తులు ఇక్కడ ఉన్నాయనేది ఈ శాసనంతో స్పష్టమైంది’’అని ఆ శాసనాన్ని పరిశీలించిన చరిత్ర పరిశోధకులు ఎం.ఎ.శ్రీనివాసన్ పేర్కొ న్నారు. సర్వేయర్గా ఉంటూ చరిత్ర పరిశోధనలో ఆసక్తి చూపుతున్న శంకర్రెడ్డి దీన్ని తొలుత గుర్తించారు. హెరిటేజ్ తెలంగాణ విశ్రాంత అధికారి వై.భానుమూర్తితో కలసి తాను పరిశీలించినట్టు వెల్లడించారు. ఆ అక్ష రాల నిగ్గు తేల్చేందుకు తాను సంప్రదించగా, అవి తొలి శాతవాహన కాలం నాటి లిపితో ఉన్నాయని ఏఎస్ఐ ఎపిగ్రఫీ విభాగం సంచాలకులు పేర్కొన్నట్టు శ్రీనివాసన్ వెల్లడించారు. -
గురుకుల ప్రిన్సిపాల్పై వేధింపుల కేసు
మద్నూర్(జుక్కల్): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ అదే పాఠశాల స్టాఫ్నర్స్ సునీత సోమవారం మద్నూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గతేడాది నుంచి తనను వేధిస్తూ లొంగదీసుకోవడానికి ప్రయత్నాలు చేశాడని, ప్రతిఘటించడంతో ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ తన భర్త శంకర్తో వచ్చి బోరున విలపించింది. గతంలో తనను హైదరాబాద్ వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో తీసుకెళ్లి అసభ్యకరం గా ప్రవర్తించాడని పేర్కొంది. తనతో పాటు అక్కడి మహిళా సిబ్బందికి ఇబ్బందులు పెడుతున్నా భయంతో బయటకు చెప్పుకోలేకపోతున్నారని వివరించింది. చెప్పినట్టు చేయకపోతే చంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. -
‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు’
కామారెడ్డి క్రైం: టెక్నాలజీని వాడుకుని ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేయడంతోనే టీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఓటమి ఎదురైనందుకు తాను ఇలా మాట్లాడటం లేదన్నారు. సాంకేతికతపై అవగాహన ఉన్నందునే మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన గంపగోవర్ధన్కు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. తాను నియోజకవర్గంలో 45 రోజలు పాటు ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చే శానన్నారు. అలాగే ప్రజలు అన్నిచోట్ల నుంచి బీజేపీకి ఓట్లు వేశారని పేర్కొన్నారు. ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఓట్లు వేసినా ట్యాంపరింగ్ చేయడంతోనే సీట్లు రాలేదన్నారు. లేదంటే ఎన్నికల ప్రచార సమయంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో, ఎన్ని సీట్లు వస్తాయో సీఎం కేసీఆర్కు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. రెవెన్యూ, పోలీస్శాఖలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ఖూనీ చేసిందన్నారు. నీతి, నిజాయితీలు, అవినీతి రహిత పాలనే అజెండాగా ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్తామన్నారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ విధానాన్ని తీసుకువచ్చేలా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, అసెంబ్లీ కన్వీనర్ తేలు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కుంట లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు బాలకిషన్, నాయకులు మహేశ్గుప్తా, నరేందర్రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం : బాణాల తాడ్వాయి: ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని, కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటు లో ఉండి వారి సమస్యలను తీ ర్చేలా కృషి చేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా అద్యక్షడు బా ణాల లక్ష్మారెడ్డి అన్నారు. తా డ్వాయి మండలంలోని క్రిష్ణాజివాడి గ్రామంలో శుక్రవా రం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పని చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం నుంచి ఏఒక్క గ్రామానికి నిధులు రాలేదని, కేంద్రం నుంచి ఎల్లారెడ్డి నియోజక వర్గానికి 13, 14ఆర్థిక నిధుల క్రింద రూ.157కోట్లు వచ్చాయని తెలిపారు. మోదీ ప్ర భుత్వం భారత దేశంలో ఉన్న ప్రతి గ్రామానికి రూ.కోట్లల్లో నిధులు విడుదల చేస్తే రాష్ట్రప్రభుత్వం తమ నిధులని చెప్పుకుంటున్నదని ఆరోపించారు. ఈ నెల 16న జుక్కల్, 17న బాన్స్వాడ, 18న కామారెడ్డి నియోజక వర్గాలలో సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యకర్తలు మరింత కష్టపడి రాబోయే ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు మర్రి రాంరెడ్డి, నాయకులు వెంకన్న, బాలకిషన్, సురెందర్రెడ్డి, రమణారెడ్డి, వెంకట్రావు, సాయిబాబా, నర్సింహారెడ్డి, సతీష్, రవీందర్రావు, ఏడు మండలాల అ«ధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూతు కమిటి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాహుల్ తలచుకుంటే షబ్బీర్ అలీనే సీఎం..!
సాక్షి, కామారెడ్డి : రాహుల్ గాంధీ తలచుకుంటే తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం షబ్బీర్ అలీనే అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కునూర్లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్లొన్న రేవంత్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఎన్నికల్లో ఓడిపోతున్నా షబ్బీర్ అలీ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్థన్ అసలు కామారెడ్డిలో ఒక్కసారైన కనిపించారా అని ప్రశ్నించారు. కామారెడ్డి ప్రజలకు షభ్బీర్ అలీ ముత్యం లాంటి వ్యక్తి అని ఆయనే రేపు కాబోయే ఉప ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తలుచుకుంటే ఆయనే సీఎం కూడా అయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో ప్రశ్నించిన వారిపై కేసీఆర్ అక్రమంగా కేసుల పెడుతున్నారని.. వాటికివ్వరు బయపడేది లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, పెదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు లాంటి ఒక్క పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ను రాజకీయంగా బొంద పెట్టడానికి తాను రోడ్ షోలు చేస్తున్నట్లు రేవంత్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు డబ్బులిస్తే తీసుకోండని.. అవి మీ డబ్బులే కాబట్టి తీసుకుని ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టండని పిలుపునిచ్చారు. అక్రమ ఫైల్స్ దొరికాయని నాపై దాడులు చేశారు.. చివరికి కొండను తవ్వి ఎలుకని పట్టినట్లు నా దగ్గర ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారని మండిపడ్డారు. -
వైన్స్ నిల్.. ‘బెల్ట్’ ఫుల్
సదాశివనగర్(ఎల్లారెడ్డి)/బీబీపేట(కామారెడ్డి) : మద్యం పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతోంది. ఊరూరా బెల్టు షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దీంతో సామాన్యులు పొద్దంతా పని చేసి సంపాదించిన సొమ్మును మద్యానికి వెచ్చిస్తూ కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో బెల్టు షాపుల దందా ‘మూడు బాటిళ్లు.. ఆరు కాసులు’గా తయారైంది. ఈ దందా దర్జాగా సాగుతోంది. అధికారుల కన్నుసైగలలోనే ఈ తంతు కొనసాగుతున్నా ఎక్సైజ్ అధికారులు, పోలీసులు అటువైపు కన్నెతి చూడడం లేదు. కామారెడ్డి జిల్లాలో 37 వైన్స్ దుకాణాలు, మూడు బారులు కొనసాగుతున్నాయి. అధికారులు మామూళ్లమత్తులో జోగుతున్నారని తెలుస్తోంది. ప్రతి నెల ముడుపులు అందడంతో వారు బెల్టు దుకాణాలపై దృష్టి సారించడం లేదని స్పష్టమౌతుంది. మద్యం షాపుల ప్రతి నెల రూ.30 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. వైన్స్లలో మద్యం సేవించ రాదు, బార్లలో సీల్డ్ మద్యం అమ్మరాదు. వైన్స్కు సంబంధించి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటలు, బార్లకు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటలవరకు అమ్మకాలు చేపట్టాలి అనే నిబంధనలు విధించారు. ఇవి కాకుండా బయట ఎక్కడపడితే అక్కడ మద్యం విక్రయించరాదని ఆదేశాలున్నాయి. అయినా ఆ నిబంధనలు నిర్వాహకులు పాటించడం లేదని తెలుస్తోంది. దీంతో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులు అందుబాటులో ఉండడంతో పొద్దంతా కష్టపడి పనిచేసి సంపాదించిన కూలి డబ్బులతో మద్యం తాగుతూ సంసారాలను పాడు చేసుకుంటున్నారు సంపాదన మద్యానికి ఖర్చు చేస్తుండడంతో వారి కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. మద్యానికి బానిసలైన కొందరు ఏ పని చేయకుండా ఉదయాన్నే బెల్టు షాపులకు చేరుకొని ఉద్దెర పెట్టి అప్పుల పాలవుతున్నారు. అధిక ధరలకు విక్రయాలు.. మద్యం ధరలకు అడ్డూ అదుపు లేకుండా పోయాయి. దీంతో ప్రజారోగ్యానికి చిల్లు పడుతోంది. బెల్టు షాపుల్లో ప్రతి క్వార్టర్కు రూ.10 నుంచి రూ.20 వరకు, ఒక్కో బీరు సీసా మీద రూ. 20 అదనంగా తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. గ్రామాల్లో చీప్ లిక్కర్ విక్రయాలు బాగా పెరిగాయి. వాటిలో కూడా కల్తీ మద్యం కలుపుతూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. పేరుకే కిరాణం.. అమ్మేది మద్యమే.. అనేక మంది పేరుకు కిరాణ దుకాణాలు నిర్వహిస్తూ లోపల మాత్రం మద్యం వ్యాపారం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో బస్టాండ్లలోనే బెల్టు షాపులు నిర్వహిస్తుండటం, రాత్రయితే అక్కడ పండుగ వాతావరణంలా కనపడుతూ చుట్టు పక్కల ఉన్న కాలనీవాసులకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంకా గ్రామం లోపలికి వెళ్తే కిరాణ దుకాణాల్లో, సొంత ఇళ్లల్లో పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు పెట్టుకొని మరీ విక్రయిస్తుండడం చాలా ఉన్నాయి. మద్యం మత్తులో అక్కడే ఇళ్ల మద్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు అరోపిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కిరాణ దుకాణాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తూ జనాల దగ్గర బాగానే డబ్బులు సంపాదిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో మహారాష్ట్ర నుంచి కల్తీ మద్యం తెప్పించి అమ్ముతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంచుమించూ ప్రతి గ్రామంలో మద్యం దుకాణాలు వెలిసి ఊరంతా ఏరులై పారుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపులను అరికట్టాల్సిన ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో ఎన్ని బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు అనే పూర్తి సమాచారం ఎక్సైజ్ అధికారుల వద్ద ఉన్నా ఇప్పటివరకు ఏ బెల్టు షాపుపై దాడులు చేసిన దాఖలాలు లేవు. బెల్టు షాపుల నిర్వాహకుల దగ్గర మామూళ్లు తీసుకోవడంతోనే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో వెలుస్తున్న బెల్టు షాపులను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. బెల్టు దుకాణాలు నిర్వహిస్తే బైండోవర్ నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసినట్లు అయితే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమ మద్యం విక్రయాలు నిర్వహించిన వారిపై కేసులు నమోదు చేస్తాం. కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండెవర్ చేస్తున్నాం. బెల్టు దుకాణాలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకుంటాం. చట్టానికి ఎవరూ అతీతులు కారు. –శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ బెల్టు షాపులకు అనుమతులు లేవు గ్రామాల్లో బెల్టు షాపులను నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవు. ఎక్కడైనా అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నాం. ఒకవేళ అమ్ముతున్నారని ఎవరైనా సమాచారం అందిస్తే బెల్టు షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –రాధాకృష్ణారెడ్డి, ఎక్సైజ్ సీఐ, దోమకొండ -
నమో వేంకటేశా..
కామారెడ్డి రూరల్ : మండలంలోని లింగాపూర్లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వర ఆలయంలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వరకు సుబ్రహ్మణ్య శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవతామూర్తులప్రతిష్ఠాపన మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 30న ఉదయం 7:30కు ప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభమవుతాయని, ఏప్రిల్ 1న శిఖర ప్రతిష్ఠ, ధాన్యాది, శయ్యాది, పుష్పాది, ఫలాధివాసముులు, హోమం, 2న అవాహిత దేవతా పూజలు, బలిప్రదానం, గర్త సంస్కారము కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. అనుగ్రహ భాషణం ప్రతిష్ఠాపనోత్సవాల్లో తోగుట రామాపూరం శ్రీ మధనానంద పీఠాధిపతి, శ్రీశ్రీశ్రీ మధవానంద సరస్వతీతో యంత్ర ప్రాణ ప్రతిష్ఠా కళాన్యాసము, మహాభిషేకం, కుంభాభిషేకం, స్వామీజీ అనుగ్రహాభాషనం ఉంటాయ తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు భక్తులకు అన్నదానం, సాయంత్రం సాయంత్రం భజన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు పూలు, పండ్లు, పూజ సామగ్రి నవధాన్యాలు, పగడాలు, ముత్యాలు, నవరత్నాలు, యంత్రం కింద వేయడానికి తీసుకురావచ్చన్నారు. 2న దేవదాయశాఖ మంత్రి రాక విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగం గా ఏప్రిల్ 2న నిర్వహించనున్న కార్యక్రమాలకు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వవిప్ గంపగోవర్ధన్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేలు హాజరవుతారని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఆలయ విశిష్టత లింగాపూర్ గ్రామంలోగల శ్రీవేంకటేశ్వర పురాతన ఆలయం భక్తులకు కొంగు బంగారంగా, కోరికలు తీర్చే వెంకన్నగా పేరుంది. కాల క్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు జీర్ణోద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తిరుమలతిరుపతి దేవస్థానం నిత్య ధూపదీప నైవెద్య పథకం కింద సహాయం అందించింది. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ సర్వశ్రేయో నిధి (సీజీఎఫ్) కింద రూ.30 లక్షలు ఆలయ నిర్మాణానికి మంజూరు చేసింది. టీటీడీ దేవతామూర్తుల విగ్రహాలను అందించింది. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు ఐక్యంగా ఆలయ పునర్నిర్మాణానికి ముందుకు వచ్చి సుమారు రూ.కోటి వ్యయంతో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. -
నీకోసం నీవే చదివి ఎదగాలి
నిజామాబాద్నాగారం(నిజామాబాద్అర్బన్): నీ కోసం నీవే చదివి జీవితంలో ఎదగాలని, అమ్మానాన్నల కోసమో, స్నేహితుల కోసమో, బంధువుల కోసమో, చుట్టు పక్కల వారికోసమో చదవొద్దని మోటివేషన్ స్పీచ్ నిపుణుడు, ఉత్తమ యువసారథి అవార్డు గ్రహీత బ్రదర్ షఫీ సూచించారు. ప్రపంచంలో కేవలం ఒకశాతం మందిమాత్రమే లక్ష్యాలను సాధిస్తున్నారని, మిగతా 99శాతం మంది కారణాలు చూపుతూ లక్ష్యసాధనను పక్కనపెడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో గురువారం రాత్రి మైనారిటీ గురుకులాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కీ – సక్సెస్’ సదస్సుకు ఆయన హాజరై విద్యార్థులు, నగరవాసులనుద్ధేశించి ప్రసంగించారు. సృష్టిలో అన్ని జన్మలకంటే మానవ జన్మ గొప్పదని, భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి వ్యక్తి నిరంతరం సాధన చేయాలన్నారు. ఈ ప్రపంచంలో విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఎంతో మంది మహనీయులు నిరూపించారన్నారు. సమస్యలు ఎదురవగానే జీవితం ఇంతే అని అనుకోకూడదని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్నారని, మైనారిటీ గురుకులాల ఏర్పాటు అభినందనీయమన్నారు. షఫీ కూతురు తంజీలా ప్రసంగిస్తూ నీవు చెప్పదలుచుకున్న విషయం నిజమైతే ఎవరికి భయపడవల్సిన అవసరం లేదన్నారు. సదస్సులో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్గుప్తా, బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఆర్డీవో వినోద్కుమార్, నెడ్క్యాప్ చైర్మన్ అలీం, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు, మైనారిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రహదోషాలను రూపుమాపే కాలభైరవాలయం
కాలుడు అంటే యముడు. యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి యముడిని సైతం భయపెట్టే మహిమ గల స్వామిగా శ్రీ కాలభైరవుడికి పేరు. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు శ్రీ కాలభైరవస్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం. అందుకే నిత్యం అశేష భక్తుల తాకిడితో ఇసన్నపల్లి (రామారెడ్డి) శ్రీ కాలభైరవస్వామి ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. నేటినుంచి బహుళ నవమి 12వ తేదీ వరకు కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా... దిగంబరునిగా... ఆలయంలో శ్రీ కాలభైరవస్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉంటుంది. స్వామివారి మూలవిగ్రహం ఎప్పుడు వెలిసిందో కచ్చితంగా చెప్పే ఆధారాలు లభ్యం కాలేదు. జైనమతం బాగా వ్యాప్తి చెందిన సమయంలో ఆలయం నిర్మించి ఉంటారని, అందుకే స్వామి దిగంబరునిగా దర్శనమిస్తాడని కొందరి భావన. కానీ పురాణేతిహాసాల్లోనూ శ్రీ కాలభైరవుడిని దిగంబరుడిగానే పేర్కొనడం జరుగుతుంది. స్థలపురాణం ఇసన్నపల్లి గ్రామం ప్రారంభంలోనే శ్రీ కాలభైరవస్వామి ఆలయం ఉంటుంది. అష్టదిక్కులలో రామారెడ్డి గ్రామానికి అష్టభైరవులు ఉన్నారు. వీరు ఎల్లప్పుడు గ్రామాన్ని రక్షిస్తుంటారని నానుడి. ఈ అష్టభైరవులలో ప్రధానుడు శ్రీ కాలభైరవస్వామి. మిగతా ఏడు భైరవ విగ్రహాలు కాలప్రవాహంలో కనుమరుగైపోయాయి. గ్రామానికి కిలోమీటరు దూరంలో కాశిపల్లి అనే చోట విశ్వేశ్వరుని ఆలయం, దానికి ముందు భాగంలో గ్రామం వైపు చూస్తున్న భైరవ విగ్రహం కూడా ఉన్నాయి. ఇలా రామారెడ్డి గ్రామం చుట్టూ కాశీ (కాశిపల్లి), రామేశ్వరం (రామేశుని కుంట) ఇలాంటి పుణ్యక్షేత్రాల పేర్లతో శివాలయాలు, భైరవుని విగ్రహాలు దర్శనమిస్తాయి. శ్రీ కాలభైరవస్వామి తన తండ్రి పేరిట ఈశాన్య దిక్కునే ఉంచుకుని నిరంతరం గ్రామాన్ని, భక్తులనూ రక్షిస్తూ ఉంటాడని చెబుతున్నారు. ఇక్కడి పుష్కరిణిని అమృతమయమైన నీళ్లను అందించే అక్షయ పాత్రగా భావిస్తారు. ఎన్ని నీళ్లు తోడుకున్నా తరిగిపోని జలసంపద ఈ పుష్కరిణి ప్రత్యేకత. ఈ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసే వారికి అన్ని రకాల వ్యాధులు, భూతప్రేత పిశాచ బాధలు తొలగిపోతాయని నమ్మకం. స్వామివారికి నిత్యపూజలతో పాటు ప్రతి మంగళవారం విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి యేడాది వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, కార్తీకమాసంలో స్వామివారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మార్గశిర మాసంలోనూ సంతతాభిషేకం, విశేషపూజలు నిర్వహిస్తారు. కాలభైరవస్వామి జన్మదిన వేడుకలు 8న సంతతధారాభిషేకం, శ్రీ బద్ధిపోచమ్మ అమ్మవారికి బోనాలు. రాత్రికి భజన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 9న పూజాదికార్యక్రమాలు. తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 10న లక్షదీపార్చన, 11న సంతతధారాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ధ్వజారోహణం, మహాపూజ, దక్షయజ్ఞ కార్యక్రమాలు, మధ్యాహ్నం సింధూర పూజ, డోలారోహణం. బండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తర్వాత భద్రకాళిపూజ, పల్లకీసేవ, అర్ధరాత్రి రథోత్సవం నిర్వహిస్తారు. భక్తులకు అన్నదానం ఉంటుంది. 12న దక్షయజ్ఞం (అగ్నిగుండం) నిర్వహిస్తారు.కామారెడ్డి జిల్లా ఎన్నో ప్రాచీన దేవాలయాలకు ప్రసిద్ధిగాంచింది. రాష్ట్ర రాజధాని నుంచి నాగపూర్ వెళ్లే ఎన్హెచ్–44 జాతీయ రహదారి పై కామారెడ్డి చేరుకున్న తర్వాత అక్కడ నుంచి మరో 10 కిలోమీటర్ల దూరంలో ఇసన్నపల్లి (రామారెడ్డి) గ్రామం ఉంటుంది. వందల యేళ్ల క్రితం ఇక్కడ వెలసిన శ్రీ కాలభైరవస్వామి దర్శనానికి నిత్యం వేలసంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. – సేపూరి వేణుగోపాలచారి సాక్షి, కామారెడ్డి -
‘స్వచ్ఛ’త వైపు..
సాక్షి, కామారెడ్డి : బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా కామారెడ్డిని ప్రకటించడానికి అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మరు గుదొడ్లు లేని ఇళ్ల జాబితాను రూపొందించిన అధికారులు.. అన్ని ఇళ్లల్లో మరుగుదొడ్లు నిర్మించేలా టార్గెట్లు విధించారు. కలెక్టర్ సత్యనారాయణ వంద శాతం స్వచ్ఛత సాధించాలన్న పట్టుదలతో అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జిల్లాలో 1,61,224 కుటుంబాలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ పథకాలు, సొంత డబ్బులతో 1,18,014 మంది మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. ఇంకా 43,210 ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించుకుంటే వంద శాతం లక్ష్యం సాధించినట్లవుతుంది. ఇందుకోసం అధికారులకు టార్గెట్లతో పాటు గడువు విధించారు. కాగా జిల్లాలో ఇప్పటి వరకు 114 గ్రామ పంచాయతీల పరిధిలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. 229 పంచాయతీలు మిగిలి ఉన్నాయి. అక్టోబర్ 2 నాటికి 67 పంచాయతీల్లో 4,668 మరుగుదొడ్లు నిర్మించడం ద్వారా వాటిని వంద శాతం ఓడీఎఫ్ గ్రామాలుగా ప్రకటించాలని నిర్ణయించారు. అక్టోబర్ 31 లోగా 76 పంచాయతీల్లో 11,906 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం విధించారు. నవంబర్ 15 నాటికి మిగిలిన 86 పంచాయతీల్లో 26,636 మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించాలని నిర్ణయించారు. ఇందుకోసం అధికారులకు టార్గెట్లు విధించారు. పరుగులు తీస్తున్న అధికారులు... మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి టార్గెట్లు విధించడంతో అధికారులు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా ఉపాధిహామీ, మండల పరిషత్ అధికారులు, సిబ్బంది గ్రామాల వారీగా మరుగుదొడ్లు లేనివారితో మాట్లాడుతున్నారు. మరుగుదొడ్లను నిర్మించుకోకుంటే సంక్షేమ పథకాల లబ్ధి నిలిచిపోతుందని అధికారులు హెచ్చరికలు కూడా చేస్తున్నారు. దీంతో మరుగుదొడ్లు లేనివాళ్లు నిర్మించుకోవడానికి ముందుకు వస్తున్నారు. మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు ఉపాధి హామీ ద్వారా అందుతుంది. కొన్ని చోట్ల ముందు పెట్టుబడికి డబ్బులు లేవనే మాట చెప్పిన చోట గ్రామ సంఘాల ద్వారా వారికి డబ్బు ఇప్పించి మరీ నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే చాలా మంది మరుగుదొడ్డి నిర్మించుకోవడం అనేది తమ బాధ్యత కాదని, అధికారులే కట్టి ఇస్తారన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఓ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. నిర్మాణాలతో సరిపోదు.. ఇప్పటికీ చాలా గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మొదటి నుంచి ఉన్న అలవాటును మార్చుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన అనేది ఇప్పటికీ కొనసాగుతోంది. చాలా మంది మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి ఇష్టపడడం లేదు. మరుగుదొడ్లు నిర్మించుకున్నవారు సైతం వాటిని వినియోగించడంలేదు. వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకుని రికార్డుకెక్కిన దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో ఇప్పటికీ చాలా మంది ఆరుబయటకే వెళుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చినపుడు మరుగుదొడ్డి నిర్మించుకుని మూలన పడేస్తున్నారు. చాలా గ్రామాల్లో మరుగుదొడ్లను వాడడం లేదు. ఆరుబయట మలవిసర్జన ద్వారా కలిగే ఇబ్బందులను గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
సీఎం హామీ నెరవేర్చలేదని..
- హోంగార్డు ఆత్మహత్య కామారెడ్డి: చాలీచాలని జీతంతో బతుకు బండి లాగించలేక ఓ హోంగార్డు బలవన్మరణానికి పాల్పడ్డాడు. శాసన సభ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో.. ఈ దుర్భర పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నానని లేఖ రాసి తనువు చాలించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సోమవారం వెలుగుచూసింది. బిక్కునూరు పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నశివ ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి హోంగార్డులను పర్మనెంట్ చేస్తానని చెప్పి మాట తప్పారని సూసైడ్నోట్లో పేర్కొన్నాడు. -
కొత్తకొత్తగా..
నవ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ తొలిసారిగా సమావేశం కాబోతోంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో జిల్లానుంచి తొమ్మిది మంది టీఆర్ఎస్ సభ్యు లే ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఇందులో నలుగురు మొదటి పర్యాయం ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే. నూతన రాష్ట్రంలో సమావేశమయ్యే తొలి అసెంబ్లీ సమావేశా ల్లో పాల్గొనే అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కేసీఆర్ కొలువులో చోటు సంపాదించుకున్న పోచారం శ్రీని వాస్రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్రెడ్డి, గంప గోవర్ధన్ నాలుగుసార్లు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మూడుసార్లు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఈసారి జిల్లాకు చెందిన నలుగురు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నా రు. బాల్కొండ నుంచి ప్రశాంత్రెడ్డి, ఆర్మూర్ నుంచి జీవన్రెడ్డి, బోధన్ నుంచి షకీల్, నిజామాబాద్ అర్బన్ స్థానంనుంచి గణేశ్గుప్తా తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరు సోమవారం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణాలతోనే సరి.. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ సమావేశాలు సో మవారం నుంచి ఐదు రోజుల పాటు సాగనున్నాయి. గవర్నర్ ప్రసంగంతో పాటు సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎంపిక, బీఏసీలు నిర్వహించనున్నారు. ఈసారి చర్చలు, సమస్యల ప్రస్తావనకు అవకాశం లేదని, తదుపరి సమావేశాల్లోనే మాట్లాడే అవకాశం రావొచ్చని ఓ ఎమ్మెల్యే తెలిపారు. ఆ సమావేశాల్లో జిల్లా సమస్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. దీంతో సభ్యులకు మాట్లాడే అవకాశం రావాలంటే మలి విడత సమావేశాల వరకు ఆగాల్సిందే. ఈ సందర్భంగా తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోతున్న పలువురు ఎమ్మెల్యేల అభిప్రాయాలిలా ఉన్నాయి. -
మీ త్యాగఫలమే..
కుట్రలకు కలత చెంది... భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన పెరుముల కుమార్ ఐటీఐ చదివారు. ప్రైవేటు ఎలక్ట్రీషియన్గా పనిచేసేవారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర పాలకులు కుట్రలు చేస్తున్నారని కలత చెంది 2014, ఫిబ్రవరి 11న పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మార్పణం చేసుకున్నారు. ఈ క్షణాన తమ కొడుకు ఉంటే సంబరపడి పోయే వాడని కుమార్ తండ్రి యెల్లేశం, తల్లి అంజమ్మ కన్నీరుమున్నీరయ్యారు. - కామారెడ్డి, న్యూస్లైన్ ఉద్యమానికి ఊపు తెచ్చిన కిష్టయ్య భిక్కనూరు మండలం శివాయిపల్లికి చెందిన పుట్టకొక్కుల కిష్టయ్య ఉరఫ్ కానిస్టేబుల్ కిష్టయ్య సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు తీవ్ర ఆవేదన చెందారు. కామారెడ్డి పట్టణంలో 30 నవంబర్, 2009న సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మార్పణం చేసుకున్నారు. కిష్టయ్య ఆత్మర్పణంతో తెలంగాణలో ఉద్యమం ఎగిసి పడింది. కిష్టయ్యకు తల్లి లక్ష్మమ్మ, భార్య పద్మ, కొడుకు రాహుల్, కూతురు ప్రియాంక ఉన్నారు. - కామారెడ్డి, న్యూస్లైన్ కేంద్రం నిర్ణయంతో .. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుడతామంటూ కేంద్ర ప్రభుత్వం 2009, డిసెంబర్ 9న చేసిన ప్రకటనను, సీమాంధ్రంలో ఎగిసిన ఉద్యమానికి తలొగ్గి వెనక్కి తీసుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఆకుల శివకుమార్ 10 డిసెంబర్, 2009న బావిలో దూకి ఆత్మార్పణం చేసుకున్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక మండల కన్వీనర్గా బాధ్యతలు నిర్వర్తించిన శివకుమార్.. తుదిశ్వాస విడిచే వరకు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుండడంతో తన కుమారుడు శివకుమార్తో పాటు తెలంగాణ అమరులందరీ ఆత్మశాంతిస్తుందని తల్లి అంజమ్మ ‘న్యూస్లైన్ ’కు తెలిపారు. - ఎల్లారెడ్డి, న్యూస్లైన్ కన్నవారిని విడిచి.. సీమాంధ్ర పెత్తందారుల ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం 2009,డిసెంబర్9న చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవడంతో బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్కు చెందిన శామకూర శంకర్ తీవ్రంగా కలత చెందారు. ఇక తెలంగాణ రాదని తీవ్ర భావోద్వేగానికి గురైన శంకర్ 31మార్చి, 2012న ఒంటికి నిప్పంటించుకున్నారు. తెలంగాణ కోసమే ఆత్మబలిదానం చేసుకున్నానంటూ సుమారు 80 శాతం కాలిన గాయాలతో కొన ఊపిరితో శంకర్ న్యాయమూర్తికి మరణ వాం గ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం శంకర్ కుటుంబం కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. భర్త, కొడుకు దూరం కావడంతో శంకర్ తల్లి భూదేవి మేకల కాపరిగా మారి ఇద్దరు కూతుళ్లు చంద్రభాగ, మమతలను సాకుతోంది. పూరి గుడెసెలో కడు దుర్భరంగా బతుకులు వెళ్లదీస్తున్నారు. - బాన్సువాడ రూరల్, న్యూస్లైన్ -
తర్జన.. భర్జన
ఉత్కంఠగా ‘పుర’పోరు అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీల కసరత్తు మెజార్టీ స్థానాలు లక్ష్యంగా నేతల పావులు రెండు రోజుల్లో ముగియనున్న నామినేషన్లు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘పుర’పోరుపై జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల కసరత్తు సాగుతోంది. మెజార్టీ స్థానాలు లక్ష్యంగా గెలుపు గుర్రాల వేటలో పడిన పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో తర్జన భర్జన పడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల మధ్యన పొత్తులుంటాయన్న సస్పెన్స్కు ఇంకా తెరపడక పోగా... మేయర్, చైర్మన్ల అభ్యర్థులు ఖరారు కాక పురపోరు ఉత్కంఠభరితంగా మారింది. నిజామాబాద్ పురపాలక సంస్థతో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా రెండో రోజైన మంగళవారం నాటికి మొత్తం నామినేషన్ల సంఖ్య 82కు చేరింది. రెండు రోజుల్లో.. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలకు రెండు రోజు ల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది. కార్పొరేషన్ కు 13, మున్సిపాలిటీల్లో 14 తేదీలు నామినేషన్లకు చివరి రోజు కాగా, మేయర్, మున్సిపల్ అభ్యర్థుల ను ప్రధాన పార్టీలు ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్యన పొత్తులు ఉంటాయన్న ప్రచారానికి ఆ పార్టీ నాయకుడు హరీష్రావు మంగళవారం తెర వేశారు. స్థానిక సంస్థల వరకైతే పొత్తు లు లేనట్లేనని ఆయన ఓ ప్రకటన చేశారు. బీజేపీ, టీడీపీల పొత్తుల వ్యవహారం కూడా ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ, సీపీఐ తదితర పార్టీలు నగర, మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిపోరుకు సమాయత్తం అయ్యాయి.ఆయా పార్టీలకు చెందిన ‘బి’ఫారములు అందనప్పటికీ ఆశావహులు మాత్రం సోమవారం నుంచి నామినేషన్లు వేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో 59, కామారెడ్డి మున్సిపాలిటీలో 13, బోధన్లో 3, ఆర్మూరులో 7నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే మరో రెం డు రోజుల్లో నామినేషన్ల ఘట్టం ముగియనుండగా, ఈ లోపే అభ్యర్థుల జాబితా, ‘బి’ఫారాలను అందజేసేందుకు చేస్తున్న కసరత్తుపై ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై.. కార్పొరేషన్, మున్సిపాలిటీల అభ్యర్థులపై కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీలు కసరత్తు చేస్తుండగా.. టీడీపీ వలసలను అడ్డుకోవడంలో తలమునకలవుతోంది. మేయర్, చైర్మన్ల అభ్యర్థిత్వాలపై తర్జన భర్జనలు పడుతుండగా సీనియర్ టీడీపీ, నగర అధ్యక్షుడు సూర్యవంశి అంబాదాస్ మంగళవారం బీజేపీలో చేరి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్, కార్పొరేటర్లపై కసరత్తు చేసేందుకు పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ నిజామాబాద్లో మకాం వేసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ స్పీక ర్ సురేశ్ రెడ్డిలు మూడు మున్సిపాలిటీల్లో అభ్యర్థులపై చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కిరాలేదు. నిజామాబాద్ కార్పొరేషన్లో మొదటి విడతలో వైఎస్ఆర్ సీపీ జిల్లా ఎన్నికల పరిశీలకులు నాయుడు ప్రకాశ్ 18 మంది అభ్యర్థులకు ‘బి’ఫారములను అం దజేశారు. టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ తదితర పార్టీలు కూడా అభ్యర్థులను బరిలో దిం పాయి. మెజార్టీ స్థానాలు లక్ష్యంగా ప్రధాన రాజకీ య పార్టీలు పావులు కదుపుతుండటం చర్చనీయాం శం అవుతోంది. -
తొలిరోజు ఏడు
బల్దియా ఎన్నికల నామినేషన్ల ఘట్టం సోమవారం ప్రారంభమైంది. అయితే తొలిరోజు నామినేషన్ వేయడానికి అభ్యర్థులు అంతగా ఆసక్తి చూపలేదు.ఆర్మూర్లో ఒక్కరు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు. నిజామాబాద్ కార్పొరేషన్లో ఐదు, కామారెడ్డి, బోధన్ మున్సిపాలిటీలలో ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. కార్పొరేషన్, న్యూస్లైన్ : నిజామాబాద్ కార్పొరేషన్లో తొలిరోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయని ఇన్చార్జి కమిషనర్ మంగతాయారు తెలిపారు. 1, 7, 11, 24, 42 డివిజన్ల నుంచి ఒక్కొక్కరు నామినేషన్ వేశారన్నారు. ఏడో డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కార్పొరేటర్ సూదం లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఒకటో డివిజన్లో రజని, 11వ డివిజన్లో కళావతి, 24వ డివిజన్లో రేవతి, 42వ డి విజన్లో గోదావరి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. బోధన్లో.. బోధన్ టౌన్ : నామినేషన్ల స్వీకరణ కోసం బోధన్ బల్దియా ఆవరణలో 12 కౌంటర్లను ఏర్పాటు చేశారు. నామినేషన్స్ వేసే ప్రాంతాన్ని సబ్ కలెక్టర్ హరినారాయణన్ సందర్శించా రు. అభ్యర్థితోపాటు ప్రతిపాదించే వ్యక్తులు ఇద్దరిని మాత్ర మే బల్దియా ఆవరణలోకి అనుమతించాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుం డా చూడాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గడ్డం శంకర్ అనే స్వతంత్ర అభ్యర్థి 32వ వార్డుకు నామినేషన్ వేసేందుకు వచ్చారు. బోధన్లో.. కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీలోని 33 వార్డులకు నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం 14వ వార్డుకు ఒక నామినేషన్ దాఖలైందని ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ బాలోజీ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ వార్డు నుంచి కారంగుల అంజల్రెడ్డి కౌన్సిలర్గా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని పేర్కొన్నారు. -
పుర‘పోరు’ తొలిఘట్టం నేటి నుంచే
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో 91 వార్డులు, 50 డివిజన్లకు ఎన్నికలు ఆశావహుల కసరత్తులు ముమ్మరం అభ్యర్థుల ఎంపికలో ప్రధాన పార్టీలు బిజీ కామారెడ్డి, న్యూస్లైన్: పుర‘పోరు’లో తొలిఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ సోమవారం నుంచి మొదలు కానుంది. జిల్లాలో కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలకు ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో 50 డివిజన్లుండగా, కామారెడ్డి మున్సిపాలిటీలో 33 వార్డులు, బోధన్లో 35, ఆర్మూర్లో 23 వార్డులు న్నాయి. కార్పొరేషన్లో ఈ నెల 10 నుంచి 13 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించారు. మున్సిపాలిటీలలో ఈనెల 10 నుంచి 14 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ల పరిశీలన ఈ నెల 15న జరుగనుంది. మార్చి 18 ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించారు. నామినేషన్ల దాఖలు కోసం మున్సిపాలిటీలలో మూడు వార్డులకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో ఎన్నికల అధికారిని నియమించారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోనే నామినేషన్లు స్వీకరించనున్నారు. అభ్యర్థుల ఎంపికకు పార్టీల కుస్తీ వార్డులు, డివిజన్లలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఆయా పార్టీలు కుస్తీపడుతున్నాయి. ముందుగానే వార్డుల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రధాన పార్టీలు వాటిని పరిశీ లిస్తున్నాయి. కొందరు అభ్యర్థిత్వం ఖరారుకాకముందే ప్రచారం మొదలుపెట్టారు. ఎలాగైనా తమకు టికెట్టు వస్తుందన్న ధీమా తో ఉన్నవారు వార్డుల్లో తిరుగుతున్నారు. మరికొందరు టికెట్ల చక్కర్లలో ఉన్నారు. టికెట్టు ఖరారైన తర్వాతనే వార్డుల్లో తిరగాలని భావిస్తున్నారు. అయితే ప్రధాన పార్టీలకు కొన్ని వార్డుల్లో ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్న పరిస్థితులలో వారి మధ్య రాజీ కుదిర్చి ఎవరో ఒకరిని ఎంపిక చేయడం తలకుమించిన భారంగా మారింది. టికెట్లు దక్కనివారు ఇతర పార్టీలకు జంప్ కావడమో, రెబెల్గా బరిలోకి దిగడానికో సిద్ధమవుతున్నారు. నామినేషన్ల ఘట్టానికి ముందే చాలా మంది పార్టీలు ఫిరాయించారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయితే మరికొంతమంది గోడ దూకే అవకాశాలున్నాయి. -
నామినేషన్ వేసేముందు.. ఒక్కక్షణం
కామారెడ్డిటౌన్, న్యూస్లైన్ : బల్దియా పోరులో మరో అంకానికి తెరలేసిం ది. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఆశావహులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే నామినేషన్ వేసే ముందు అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ల సమయంలో ప్రజలు అధికంగా గుమికూడడాన్ని నిరోధించడానికి, తగిన నియంత్ర ణ ఉండడానికి ఎన్నికల కమిషన్ 2011 జూలై 01న జీఓ నెంబర్ 528/ఎస్ఈసీ-ఎఫ్1/2011-5 ను జారీ చేసింది. దాని ప్రకారం.. ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధి లోపలకు గరిష్టంగా రెండు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్ల సమయంలో ఎన్నికల అధికారి, సహాయ అధికారి కార్యాలయంలోనికి అభ్యర్థితోపాటు నామినేషన్ ప్రతిపాదించేందుకు గరిష్టంగా మరో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. చట్ట ప్రకారం నామినేషన్ పత్రాన్ని అభ్యర్థి స్వయంగా గాని, లేక అతని ప్రతిపాదకుడు గాని ఎన్నికల అధికారి లేదా సహాయ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థి హాజరు కాలేని పక్షంలో ఎన్నికల అధికారి కార్యాలయంలోనికి ప్రతిపాదకుడితోపాటు మరో ఇద్దరిని అనుమతిస్తారు. నామినేషన్ దాఖలు చేసేటప్పుడు అభ్యర్థి వెంట ఉండే వాహనాల వ్యయాన్ని అభ్యర్థి ఎన్నికల వ్యయంలో లెక్కిస్తారు. నామినేషన్లో అందించిన వివరాలు సక్రమంగా లేకపోయినా తిరస్కరించే అధికారం అధికారులకు ఉంటుంది. ఇతర అంశాలు.. బల్దియాలో ఓటు హక్కు ఉంటే చాలు. ఆ బల్దియాలో ఏ వార్డునుంచైనా పోటీ చేయవచ్చు. ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉన్నవారు దరఖాస్తు చేసుకుంటే నామినేషన్ పత్రాన్ని ఉచితంగా అందిస్తారు. ఒక అభ్యర్థి తరపున ఒక వార్డుకు నాలుగింటికి మించకుండా నామినేషన్ పత్రాలను సమర్పించవచ్చు. {పతి నామినేషన్ పత్రంపై అభ్యర్థి, లేక ప్రతిపాదకుడి సంతకం తప్పనిసరి. పోటీకి సంసిద్ధతను తెలియజేస్తూ డిక్లరేషన్పై అభ్యర్థి సంతకం చేయాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరపున లేదా రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద రిజిష్టరైన రాజకీయ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి పార్టీ పేరును నామినేషన్ పత్రంలో సూచించాల్సి ఉంటుంది. నామినేషన్ ఉపసంహరణ చివరి తేదీన మధ్యాహ్నం 3 గంటలలోపు బీఫామ్ సమర్పించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 1,250, ఇతరులు రూ. 2,500 నామినేషన్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 2,500, ఇతరులు రూ. 5 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రెవెన్యూ శాఖ డిప్యూటీ తహశీల్దార్ హోదాకు తక్కువ గాని అధికారి నుంచి డిక్లరేషన్ పత్రాన్ని నామినేషన్కు జతచేయాల్సి ఉంటుంది. -
పునర్నిర్మాణంలో పీఆర్టీయూ కీలకపాత్ర
కామారెడ్డి, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో పీఆర్టీయూ ఉపాధ్యాయులు క్రియాశీల పాత్ర పోషించారని, రాబోయే రోజుల్లో తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ముందుంటారని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. మంగళవారం కామారెడ్డిలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రవీంద ర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో అన్ని పాఠశాలలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలన్నారు. తెలంగాణకు 60 శా తం విద్యుత్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్రెడ్డి మాట్లాడుతూ...సకలజనుల సమ్మె కాలాన్ని ఆన్డ్యూటీ సౌకర్యం కల్పించి వేతనాలు ఇప్పించడంలో పీఆర్టీయూ కృషి ఉందన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయడానికి కృషి జరగాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కమలాకర్, శంక ర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దామోదర్రెడ్డి, మధుసూధన్రెడ్డి, తాడ్వాయి శ్రీని వాస్, గోవర్ధన్, రవీందర్శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణతల్లి, కానిస్టేబుల్ కిష్టయ్య, ఆచార్య జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. -
వీఆర్ఓలకు నియామక పత్రాలు
కలెక్టేరేట్,న్యూస్లైన్ : గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకుల మెరిట్ అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాల పరి శీలన ముగిసింది. మంగళవారం స్థానిక ప్రగతి భవన్లో కలెక్టరేట్ కార్యాలయ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెం ట్లు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు వీఆర్ఓల పత్రాల పరిశీలన ప్రారంభించారు. మొతం 65 మందిలో 64 మందిని ఎంపిక చేసి వీఆర్ఓలుగా నియామక పత్రాలు అందించారు. ఒక అభ్యర్థి ధ్రువీకరణ పత్రాలు ని బంధనలకు అనుగుణంగా లేనందున తిరస్కరించారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ వెంకటేశ్వర్రావు పర్యవేక్షించారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్ఏ) మాత్రం నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఒరి జినల్ సర్టిఫికెట్లను ఉదయం 9 గంటల నుంచి ఆర్ డీఓ యాది రెడ్డి ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలించారు. వీఆర్ఏలో 1: 5 శాతం ప్రకారం మెరిట్, రోస్టర్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో 153 మంది మెరిట్ అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మొత్తం 43 పోస్టులకు గాను అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరి శీలించి 36 మందిని ఎంపిక చేశారు. మిగితా 7 పోస్టులను అభ్యర్థుల వద్ద సరైన వివరాలు లేకపోవడంతో నిలిపి వేశారు. ఎంపికైన 36 మందికి వీఆర్ఏలుగా ఆయా మండల తహశీల్దార్ల ద్వారా బుధవారం నియామక పత్రాలు అందించనున్నా రు. సెలక్షన్ కమిటీలో నిజామాబాద్ తహశీల్దార్,ఎంపీడీఓ, సెక్షన్ న్ సూపరింటెండెంట్లు ఉన్నారు. కామారెడ్డిలో.. కామారెడ్డి : వీఆర్ఏ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను మంగళవారం కామారెడ్డిలోని ఆర్డీఓ కార్యాలయం పరిశీలించారు. ఆర్టీఓ వెంకటేశ్వర్లు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వారికి నియామక పత్రాలను అందజేశారు. దోమకొండ మం డలంలో ఏడుగురు, గాంధారి మండలంలో ఇద్దరిని వీఆర్ఏ పోస్టులకు ఎంపికచేశారు. బోధన్ : వీఆర్ఏ పోటీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తన కార్యాలయంలో బోధన్ సబ్ కలెక్టర్ ఇం టర్వ్యూలు నిర్వహించారు. జుక్కల్ మండలానికి సం బంధించి 15 పోస్టులకు గాను 70 మంది హాజరయ్యారు -
ఇవేమి వసతి గృహాలు
విద్యార్థులను ఇలాగేనా చూసుకునేది! కనీస సౌకర్యాలు కూడా లేవు మెనూ ప్రకారం భోజనమూ లేదు ఆకస్మిక తనిఖీలు చేసి నివ్వెరపోయిన ఏసీబీ అధికారులు కామారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్లైన్ ‘‘ఇంత ఘోరమా... హాస్టల్ను నిర్వహించేది ఇలాగేనా’’ అంటూ ఏసీబీ అ ధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహం పక్కన గల ఎస్టీ బాలుర హాస్టల్లో వారు సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అనంతరం నిజామాబాద్ ఏసీబీ సీఐ వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్త తనిఖీలలో భాగంగా ఇక్కడా సోదా లు చేశామన్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు. హాజరు పట్టిక తప్పుడు తడకగా ఉందని పేర్కొన్నారు. హాస్టల్ భవనం, తరగతి గదులు, స్నానాల గదులు, మరుగుదొడ్లు, స్టోర్ రూం, వంట గదిని, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వార్డెన్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందన్నారు. అసలు ఇలాగేనా విద్యార్థులను చూసుకునేది అని మండిపడ్డా రు. ‘‘మెనూ ప్రకారం భోజనం పెట్టడం లే దు. ఏ ఒక్క గదిలో కూడా ఫ్యాన్లు సరిగా లేవు, దోమతెరలు లేవు, పది మరుగుదొడ్లు ఉంటే రెండు మాత్రమే వాడుతున్నారని వివరించారు. స్టోర్ రూంలో బియ్యం, వంట సామగ్రిని చూసి వార్డె న్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగినా రికార్డులను ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గంటలపాటు తనిఖీలు చేపట్టి, రికార్డులను స్వాధీనం చేసుకున్నా రు. పూర్తి విచారణ అనంత రమే చర్యలుంటాయని అన్నారు. ఇక్కడా అంతే గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని బీసీ వసతి గృహాన్ని సోమవారం రాత్రి నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ సంజీవరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్చార్జ్ వార్డెన్ నర్సిం హులు అందుబాటులో లేకపోవడంతో ఆయనను ఫోన్లో సంప్రదించారు. ఏసీబీ డీఎస్పీ అని చెప్పగానే ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజులుగా బీసీ హాస్టల్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని డీఎస్పీ తెలిపా రు. హాస్టల్ నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. మౌలిక వసతులు లేవని అన్నారు. 89 మంది విద్యార్థులకుగాను 24 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో అన్ని హాస్టళ్లను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు. -
గలగలా గోదారి...దాహం తీరే దారేది?
పల్లెల గొంతులు ఎండుతున్నయి రూ. 172 కోట్లు కరిగిపోయినా కొలిక్కిరాని పనులు ఇంకా రూ. వంద కోట్లు వస్తేనే ప్రయోజనం అరకొరగా నిధులు విదిలిస్తున్న సర్కారు గడువుల మీద గడువులు పెడుతున్న అధికారులు నత్తనడకన సాగుతున్న గోదావరి జలాల తాగునీటి పథకం గ్రామాలలో అప్పుడే మొదలైన వేసవి కష్టాలు ‘ఎంతెంత దూరం...కొంత కొంత దూరం’ అన్నట్టుగా ఉంది కామారెడ్డి తాగునీటి పథకం పనుల తీరు. ఈ పథకం పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్టుగా సా..గు..తు..న్నా..యి. తెలంగాణలోనే భారీ వ్యయంతో చేపట్టిన గోదావరి జలాల తాగునీటి పథకం పనులపై అధికార పార్టీ నేతలు గొప్పలకు పోతున్నా అవి కొలిక్కిరావడం లేదు. ప్రజల తాగునీటి కష్టాలు తీరడం లేదు. కామారెడ్డి, న్యూస్లైన్: భూగర్భ జలాలు పాతాళానికి వెళ్లిన పరిస్థితులలో, కామారెడ్డి ప్రాంత ప్రజల దాహార్తి తీర్చే ఈ పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి రూ. 140 కోట్లు మంజూరు చేశారు. ప్రజారోగ్య శాఖ రూ. 32 కోట్లు కేటాయించింది. 2008 మార్చి ఒకటిన కామారెడ్డిలో పనులకు మహానేత శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరేళ్లవుతున్నా పనులు ఇంకా ఓ కొలిక్కి లేదు. నెలా,రెండు నెలలలో పనులు పూర్తవుతాయని, కామారెడ్డి పట్టణానికి మొదటగా నీళ్లందిస్తామని అధికారులు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. కొద్ది దూరమే ఇప్పటిదాక మల్లన్నగుట్ట వరకు మాత్రమే ట్రయల్న్ ్రపూర్తయింది. మల్లన్నగుట్ట నుంచి కామారెడ్డి పట్టణానికి పైపులైను పనులు పూర్తి కాలేదు. మరోవైపు ఉన్న నిధులన్నీ అయిపోయాయి. జలాల్పూర్ వద్ద ఉన్న శ్రీరాంసాగర్ బ్యాక్వాటర్ను అర్గుల్కు, అక్కడి నుంచి ఇందల్వాయి మీదుగా మల్లన్నగుట్ట వరకు పంపింగ్ చేయా ల్సి ఉంటుంది. కామారెడ్డి పట్టణంతోపాటు 219 గ్రామాలకు నీటిని అందించాలి. కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, తాడ్వా యి, సదాశివనగర్, ధర్పల్లి, డిచ్పల్లి మండలాలలోని గ్రామాలకు నీటిని అందించేందుకు ఈ పథకానికి రూపకల్పన చేశారు. తొలిదశ పూర్తి తొలిదశలో రూ.140 కోట్లతో మల్లన్నగుట్ట వరకు చేపట్టిన పనులు ఇటీవలే పూర్తయ్యాయి. గ్రామాలకు నీటిని అందించాలంటే మరో రూ. 60 కోట్లు అవసరమవుతాయని అప్పట్లో అధికారులు అంచనా వేశారు. అది ఇప్పుడు రూ. 120 కోట్లకు చేరుకుంది. ఇటీవల రూ. 20 కోట్లు మంజూరు కావడంతో టెండర్లు నిర్వహించారు. మరో రూ. వంద కోట్లు వస్తేగాని అన్ని గ్రామాలకు నీటిని అందించలేని పరిస్థితి. మూడు నెలల క్రితం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి మల్లన్నగుట్ట వద్ద ఈ పథకం పనులను పరిశీలించిన సందర్భంలో రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించినా, ఇంకా ఉత్తర్వులు రాలేదు. మల్లన్నగుట్ట నుంచి కామారెడ్డి పట్టణానికి నీటిని అందించేందుకు ప్రజా ఆరోగ్య శాఖ ద్వారా రూ. 12 కోట్లు మంజూరు చేశారు. పట్టణంలో ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ల విస్తరణకు రూ. 20 కోట్లు మంజూరు చే శారు. పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. మల్లన్నగుట్ట నుంచి పట్టణంలోని డిగ్రీ కాలేజీ వరకు పైపులైన్ల పనులు పూర్తి కాకపోవడంతో పట్టణానికి నీరందించ లేకపోతున్నారు. ఇటీవల కలెక్టర్ ప్రద్యుమ్న ఈ పథకం పనులను ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమీక్షించారు. మార్చి మొదటి వారంలోగా కామారెడ్డి పట్టణానికి నీటిని అందించే విధంగా పనులను వేగిరం చేయాలని ఆదేశించారని సమాచారం. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు కింద పైపులైన్లు వేయడంలో తలెత్తిన ఇబ్బం దులతోనే ఆలస్యమయ్యాయని పబ్లిక్హెల్త్ అధికారులు అంటున్నారు. పట్టణానికి పొంచి ఉన్న ముప్పు ఏటా మార్చి మొదటి వారం వచ్చేసరికి కామారెడ్డిలో బోర్లు వట్టిపోవడం ద్వారా నీటి కష్టాలు తలెత్తుతుం టాయి. ఈసారి భారీ వర్షాలు కురిసినప్పటికీ పట్ట ణంలో మాత్రం నీటికి ఇబ్బందులు త ప్పే పరిస్థితులు కనిపించడం లేదు. ఫిబ్రవరి నెలాఖరులోగా పైపులైన్ పనులు పూర్తి చేసి మల్లన్నగుట్ట వద్ద నుంచి పట్టణంలోని నీటి ట్యాంకులకు ఎక్కిస్తే గాని వచ్చే నెలలో నీటిని సరఫరా చేయలేని పరిస్థితి. పైపులైన్ల విస్తరణ పనులు పూర్తి చేసిన నిర్మాణ సంస్థ ట్రయల్న్ ్రనిర్వహిస్తోంది. మల్లన్నగుట్ట వద్ద నుంచి ట్యాంకులకు నీటిని ఎక్కించిన తరువాతనే పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయడానికి ఆస్కారం ఉంటుంది. -
ఏడుపే
వేళాపాలా లేని కరెంటు కోతలు లో ఓల్టేజీతో దెబ్బతింటున్న మోటార్లు కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు తడిసి మోపెడవుతున్న మరమ్మతుల ఖర్చు ఊరూరా ఎండుతున్న పంటలు వానలు కురిసినా తప్పని ఇబ్బంది లబోదిబోమంటున్న రైతాంగం ‘‘కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. ఒక ఫేజులో లోఓల్టే జీ వస్తుంది. దీంతోని మోటార్లు కాలిపోయి వేలకు వేలు కర్సయితున్నయి’’ ఇది సదాశివనగర్ మండలం రామారెడ్డి గ్రామానికి చెందిన రైతు ఒద్దె రవి ఆవేదన. ‘‘ఏడు గంటల కరెంటు అని సెప్పుతున్నరు గని ఆరు గంటలు గూడ సక్కంగ ఇస్తలేరు. ఈ సారి కాలం అయి బోర్లు మంచిగబోస్తున్నయనుకుంటే కరెంటు పరేషాన్ జేత్తాంది’ ఇది మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన రైతు రేకులపల్లి మోహన్రెడ్డి బాధ. కామారెడ్డి, న్యూస్లైన్ : ప్రతి ఊరిలోనూ కరెంటు సమస్య రైతుల్ని వేధిస్తోంది. శనివారం కామారెడ్డి, సదాశివనగర్, మాచారె డ్డి మండలాలలోని పలు గ్రామాల లో ‘న్యూస్లైన్’ క్షేత్ర స్థాయిలో కరెం టు సమస్యపై పరిశీలన జరిపింది. కామారెడ్డి డివిజన్లో 50,795 వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. అత్యధికంగా రైతులు భూగర్భజలాలపైనే ఆధార పడి 1.25 లక్షల ఎకరాలలో పంటలు సాగు చేస్తున్నారు. ఈసారి వానలు బాగా కురవడంతో భూగర్భ జలా లు వృద్ధి చెందాయి. దీంతో రైతులు రబీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే 50 శాతానికి పైగా వరి నాట్లు పూర్తయ్యాయి. చాలా గ్రామాలలో వేస్తున్నారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలు వేశారు. కునుకు కూడా కరువే అయితే, కరెంటు సమస్య రైతులకు కునుకు లేకుండా చేస్తోంది. సదాశివనగర్ మండలం మర్కల్, ఉప్పల్వాయి, రామారెడ్డి, మాచారెడ్డి మండలంలోని మద్దికుంట, రెడ్డిపేట, అన్నారం, ఎల్లంపేట, అక్కాపూర్, గన్పూర్, మాచారెడ్డి, చుక్కాపూర్, లక్ష్మీరావులపల్లి, పల్వంచ తదితర గ్రామాలలో కరెంటు సమస్యతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. కరెంటు సరఫరాలో సమయపాలన అమలు కావడంలేదని రైతులు తెలి పారు. దీంతో కరెంటు కోసం చేల వద్దనే ఎదురు చూడాల్సి వస్తోందని అంటున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన సందర్భంలో మరమ్మతుల కోసం ఎస్పీఎంకు తరలించడానికి, మరమ్మతులకు ఖర్చు మీద పడుతోందన్నారు. మోటార్లు కాలిపోవడంతో కనీసంగా రూ. మూడు వేలు ఖర్చవుతున్నాయని పేర్కొన్నారు. మాటలకు చేతలకు పొంతన లేదు విద్యుత్తు సిబ్బంది తెలిపిన విధంగా రైతులు తమ గ్రామంలో ఫలానా సమయానికి కరెంటు ఉంటుందని పొలం వద్దకు వెళితే ఆ సమయంలో కరెంటు రావడం, కొద్ది సేపటికే పోవడం జరుగుతోంది. ఇదేమిటని సిబ్బందిని ప్రశ్నిస్తే ‘పైనుంచే పోయింది’ అనే సమాధానం వస్తోంది. కరెంటు పోయి అరగంట, గంటకు వస్తోంది. దీంతో పారిన మడే పారుతోందని రైతులు తెలిపారు. మాటిమాటికీ కరెంటు పోవడం, రావడంతో స్టార్టర్లు మొరాయించి, మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు. వాటిని బో ర్ల నుంచి పైకి తీసి, మరమ్మతులు చేయించడానికి రెండు, మూడు రోజుల సమయం పడుతోంది. దీంతో వేసిన పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. వేలకు వేలు ఖర్చు మరమ్మతుల ఖర్చులూ భారంగా మారాయి. మోటార్లను పైకి తీయడానికి, వైండింగుకు వేలకు వేలు వె చ్చించాల్సి వస్తోంది. పంటలు సాగు చేస్తున్న సమయంలోనే ఈ పరిస్థితి ఉంటే, ముందుముందు ఎ లాంటి కష్టాలు ఎదుర్కొనాల్సి ఉంటుందోనని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు సరఫరాలో ఆటంకాలు రావడమే గాకుండా లోఓల్టేజీ సమస్యలు తలెత్తుతుండడం రైతులను ఇబ్బందులు పెడుతోం ది. మోటార్లు మొరాయించి దెబ్బ తింటున్నాయని ప లువురు పేర్కొన్నారు. విద్యుత్తు ట్రా న్స్ఫార్మర్లపై త క్కువ లోడు ఉన్నచోట కూడా లో ఓల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు దెబ్బతింటున్నాయని తెలిపారు. కరెంటు ఎప్పుడస్తుందో, పోతుందో తెలుస్తలేదు యాసంగి పంటలు ఏస్తున్న కొద్దీ కరెంటు కష్టాలు పెర్గుతున్నయి. కరెంటు ఎప్పు డు అస్తుందో ఎప్పుడు పో తుందో తెలుస్తలేదు. పది దినాల సంది కరెంటు పరేశానీ పెరిగింది. లో ఓల్టేజీతో రెండు సార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. మోటార్లు, స్టార్టర్లు గూడ ఇ బ్బంది పెడుతున్నయి. -ఒద్దె రవి, రైతు, రామారెడ్డి బోర్లల్ల నీళ్లున్నా.. కరెంటు లేక ఇబ్బంది ఈ సారి వానలు మంచిగవడ్డయి. బోర్లు మంచిగ బోస్తున్నయి. గని కరంటుతోనే ఇబ్బంది పడుతున్నం. కరెంటుకు టైము లేకుండబోయింది. కరెంటు భయానికే కొంత భూమిని పడావుగ ఉంచినా. -రేకులపల్లి మోహన్రెడ్డి, మద్దికుంట, మాచారెడ్డి మండలం పారిన మడే పారుతుంది కరెంటు రాకడ, పోకడతోని పారిన మడే పారుతుంది. ఏడు గంటలు అస్తదని జెబుతున్నరు గని ఏనాడు కరెంటు సక్కంగ అస్తలేదు. ఒక్కో రోజు ఐదు గంటలు గూడ అస్తలేదు. కరెంటు ఇబ్బంది పెడుతుండడంతోనే నాట్లు ఏసుడు లేటైతుంది. -పంతుల్నాయక్, రైతు, అన్నారం, మాచారెడ్డి మండలం కరెంటు పరేషాన్ జేత్తంది ఒక్కో దినం కరెంటు పరేషాన్ జేత్తంది. వారం పది దినాల సంది కరెంటు ఎపుడు అస్తుందో ఎప్పుడు బోతుందో తెలుస్తలేదు. కరెంటు కోసం గంటల సేపు పొలంకాడ ఉండుడైతుంది. రాత్రి పూట అయితే కరెంటు మీద నమ్ముకం బోయింది. ఏడు గంటలు కరెంటు ఇయ్యాలె. -మూన్సింగ్, రైతు, ఎల్లంపేట, మాచారెడ్డి మండలం ఒకటి రెండు రోజుల్లో సమస్య పోతుంది గ్రిడ్లో వచ్చిన సమస్యతో కరెంటు సరఫరాలో కొంత ఇబ్బంది ఏర్పడింది. దీంతో కరెంటు కోతలు విధించాల్సి వచ్చింది. సమస్యపై ఉన్నతాధికారులతో ఎప్పటిక ప్పుడు మాట్లాడుతున్నం. ఒకటి రెండు రోజుల్లో పరిష్కారం అవుతుంది. -రమేశ్, ట్రాన్స్కో డీఈ,కామారెడ్డి -
ఏదీ భద్రత!
జిల్లాలో రాత్రీపగలు తేడా లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి. తాళం వేసి ఊరెళితే ఇంట్లోని సొమ్ము భద్రంగా ఉంటుందన్న నమ్మకం ప్రజలకు లేకుండా పోయింది. ఏ దొంగ ఇంటికి కన్నం వేస్తాడోనన్న బెంగ పట్టుకుంటోంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నా అదే భయం. ఏవైపునుంచి ఏ దొంగో వచ్చి మెడలోని గొలుసో, చేతిలోని బ్యాగో కొట్టేస్తాడేమోనని.. పోనీ బ్యాంకుల్లోనైనా సొమ్ము భద్రంగా ఉంటుందని భావించొచ్చా అంటే అదీ లేదు. ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు ఏమార్చి కార్డు మార్చి, ఖాతాను ఖాళీ చేసేంతగా దొంగలు తెలివి మీరిపోయారు. దొంగతనాల నివారణకు పోలీసులేమైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే.. ఫలితాలేమీ కనిపించడం లేదు. గతేడాది సగటున రోజుకు నాలుగు దొంగతనాలు జరగడం.. సగం సొత్తుకూడా రికవరీ కాకపోవడం పోలీసు శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. కామారెడ్డి, న్యూస్లైన్ : గతంలో దొంగలు ఏ అర్ధరాత్రో చోరీలకు పాల్పడేవారు. ఇప్పటి చోరులు తెలివిమీరారు. రాత్రీపగలు తేడా లేకుండా ఏ సమయంలోనైనా దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళం వేస్తే ఇల్లు గుల్ల చేస్తున్నారు. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుంటే గొలుసులు తెంపుకొని పారిపోతున్నారు. బ్యాంకులోంచి డబ్బులు తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని వస్తుంటే.. దానినీ అపహరిస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎంలకూ కన్నాలు వేస్తున్నారు. తెలివిగా ఏటీఎం కార్డులు కొట్టేసి, డబ్బులు దోచేస్తున్నారు. యథేచ్ఛగా.. దొంగతనాల నివారణకు పోలీసు యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దొంగలు మాత్రం తమ పనిని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. 2013లో జిల్లాలో 1,490 చోరీలు జరిగాయి. రూ. 4 కోట్లకుపైగా సొత్తు అపహరణకు గురైంది. దొంగతనాల్లో 109 గొలుసు దొంగతనాలున్నాయి. వీటిలో 17 కేసులకు సంబంధించిన సొత్తును మాత్రమే పోలీసులు రికవరీ చేశారు. మిగిలిన కేసుల్లో పురోగతి శూన్యం. తాళాలు పగులగొట్టి.. శుభకార్యాలకోసమో.. తీర్థయాత్రల నిమిత్తమో.. ఇత ర పనులపైనో.. ఇంటికి తాళం వేసి వెళ్తేచాలు.. దొం గలు స్పాట్ పెడుతున్నారు. గత నెల 25వ తేదీన నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్-1లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు రూ. 2.30 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అదే నెల 30న జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోయారు. పలు ఇళ్ల తాళాలు పగులగొట్టి, సుమారు 14 తులాల బంగారం, 40 తులాల వెండి, నగదు అపహరించారు. నెల వ్యవధిలో కామారెడ్డి పట్టణంలోని నాలుగు పాఠశాలల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. పాఠశాలల్లోని కంప్యూటర్లు, ఫ్యాన్లు, బ్యాటరీలు, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. గొలుసు దొంగతనాలు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలను దొంగలు టార్గెట్ చేసుకుంటున్నారు. సమీపంలో ఎవరూ లేని సమయంలో బైక్పై వచ్చి మహిళల మెడలోంచి గొలుసులు తెంపుకొని పారిపోతున్నారు. గత నెల 27న నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్దనున్న ఆలయానికి వచ్చిన దొంగలు.. మహిళా పూజారి మెడలోంచి రెండు తులాల బంగారు గొలుసు తెంపుకొని పారిపోయారు. అదే నెల 28వ తేదీన నవీపేటలో అంగన్వాడీ కార్యకర్త నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్పై వచ్చిన దొంగలు ఆమె మెడలోంచి రెండున్నర తులాల బంగారు ఆభరణాన్ని తెంపుకెళ్లారు. జిల్లాలో ఇలాంటి ఘటనలో గతేడాది 109 జరిగాయి. క్యాష్ ఉందని తెలిసినా.. అవసరాల కోసం డబ్బులను తీసుకెళ్తున్నవారిని గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కామారెడ్డి మండలంలోని టేక్రియాల్ గ్రామానికి చెందిన కుర్మ చిన్నమల్లయ్య గత నెల 24న కామారెడ్డి పట్టణంలోని ఎస్బీహెచ్లోంచి రూ. 2 లక్షలు డ్రా చేశారు. ఆ డబ్బులను తీసుకొని రైల్వే స్టేషన్ వైపు వెళ్తుండగా.. వెనకనుంచి బైక్పై వచ్చిన దొంగలు అతడిని మాటల్లో దింపారు. ఎవరూ లేని సమయంలో డబ్బుల సంచి లాక్కొని పరారయ్యారు. అదే మండలంలోని అడ్లూర్ గ్రామానికి చెందిన గాండ్ల పోచవ్వ సైతం ఇలాగే డబ్బులు పోగొట్టుకుంది. ఆమె ఈనెల 2వ తేదీన కామారెడ్డి సంతకు వచ్చింది. పశువులను విక్రయించగా రూ. 50 వేలు వచ్చాయి. ఆ డబ్బులను సంచిలో దాచుకొని వెళ్తుండగా.. దొంగలు బైక్పై వచ్చి, మార్గమధ్యలో అటకాయించి సంచిని లాక్కొని పారిపోయారు. ఏటీఎంలలో.. డిచ్పల్లి, ఎల్లారెడ్డి ఏటీఎంలలో దొంగలు వినియోగదారులను ఏమార్చి, ఏటీఎం డెబిట్ కార్డులు దొంగిలించిన ఉదంతాలున్నాయి. అలా దొంగిలించిన కార్డుల ద్వారా వారి ఖాతాలను ఖాళీ చేసినా.. దొంగలను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి పాత ఎంజే ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఎస్బీహెచ్ ఏటీఎం లోంచి రూ. 500ల నకిలీ నోటు రావడం కలకలం సృష్టించింది. చిక్కరు.. దొరకరు దొంగతనాలు జరిగిన సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి క్లూస్టీంల ద్వారా ఆరా తీస్తున్నా ఫలితం ఉండడం లేదు. పోలీసుల కళ్లు కప్పి దొంగలు రోజుకో ప్రాంతంలో చోరీలకు పాల్పడుతున్నారు. అయితే దొంగలు రెచ్చిపోతున్నా.. వారి ఆట కట్టించడంలో పోలీసు శాఖ విఫలమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. అపహరణకు గురైన సొత్తును రికవరీ చేయడంలోనూ వారు విఫలమవుతున్నారు. గతేడాది రూ. 4 కోట్లకుపైగా సొత్తు అపహరణకు గురికాగా రికవరీ చేసింది రూ. 2 కోట్లలోపే కావడం గమనార్హం. -
ఖాళీలెన్నో.. ‘కొలువులు’ కొన్నే..
కామారెడ్డి, న్యూస్లైన్: జిల్లాలోని 718 పంచాయతీలను 477 క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్కో పంచాయతీ కార్యదర్శి పనిచేయాల్సి ఉంది. అయితే జిల్లాలో 163 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 314 పంచాయతీ కార్యదర్శుల పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 66 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ జారీ చేసింది. సదాశివనగర్ మండలంలో 24 పంచాయతీలుండగా ఏడుగురు, కామారెడ్డి మండలం లో 17 పంచాయతీలకుగాను నలుగురు పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో కార్యదర్శులకు వేరే క్లస్టర్ల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. రెండు, మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా చేశారు. అంటే ఒక పంచాయతీ కార్యదర్శి ఐదారు గ్రామాల బాధ్యతలు చూడాల్సి వస్తుండడంతో పాలన కుంటుపడుతోంది. పంచాయతీ కార్యదర్శులతో పనులు ఉంటే ఆయన ఏ గ్రామంలో ఉన్నాడో తెలుసుకుని, అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. గ్రామాల్లో కీలకమైన భూముల వ్యవహారం చూసే రెవెన్యూ కార్యదర్శుల పోస్టులదీ ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల 65 రెవెన్యూ కార్యదర్శుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇంకా రెండు వందలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అరకొర పోస్టుల భర్తీ ప్రకటనలపై నిరుద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఖాళీలన్నింటిని భర్తీ చేయాలని కోరుతున్నారు. -
సొంతగూటికి చేరనున్న ‘నిట్టు’ !
కామారెడ్డి, న్యూస్లైన్ : టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జీగా కొనసాగుతున్న నిట్టు వేణుగోపాల్రావు త్వరలో సొంతగూటికి చేరనున్నారు. రాజకీయ ఎదుగుదలకు కారణమైన బీజేపీలో చేరడానికి ఆయన నిర్ణయించుకుని ఆ పార్టీ నేతలతో సంప్రదించినట్లు సమాచారం. పార్టీలో చేరికకు పార్టీ నుంచి గ్రీన్సిగ్నల్ లభించినట్టు తెలిసింది. తెలంగాణ విషయంలో టీడీపీ వైఖరిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తొలగించలేని పరిస్థితులు, భవిష్యత్తులో పార్టీకి స్థానం లభించే పరిస్థితులు కానరాకపోవడం తో ఆయన ఆ పార్టీకి గుడ్బై చెప్పేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్న బీజేపీలో చేరడమే మంచిదన్న భావనతో ఆయన ఆ పార్టీలోకి చేరడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ కౌన్సిలర్గా మూడు పర్యాయాలు పనిచేసిన నిట్టు వేణుగోపాల్రావుకు పట్టణంతో పాటు నియోజక వర్గంలో బలమైన క్యాడర్ ఉంది. మాజీ ఎమ్మెల్యే యూసుఫ్అలీ పిలుపు మేరకు నిట్టు వేణుగోపాల్రావు తన అనుచరులతో 2008లో టీడీపీలో చే రారు. సాధారణ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి గంప గోవర్ధన్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిన తరువాత 2011 లో వచ్చిన ఉప ఎన్నికల్లో నిట్టు వేణుగోపాల్రావు టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి చెందిన తరువాత ఆయన నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జిగా క్రియాశీలకంగానే పనిచేశారు. తెలంగాణ విషయంలో టీడీపీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరితో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వేణుగోపాల్రావు ఇక లాభం లేదనుకుని ఆ పార్టీకి గుడ్బై చెప్పడానికి సిద్ధమయ్యారు. నియోజకవర్గంలో బీజేపీకి క్యాడర్ కూడా ఉండడం, తాను అదే పార్టీలో పనిచేసిన నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరడమే ఉత్తమమని భావించి బీజేపీలో చేరడానికి సన్నద్ధ మైనట్టు తెలుస్తోంది. టీడీపీకి మరో దెబ్బ టీడీపీకి నిట్టు గుడ్బై చెబితే నియోజక వర్గంలో ఆ పార్టీకి మరో దెబ్బతగిలినట్టేనని భావిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నియోజక వర్గంలో ఆ పార్టీ ఎంతో బలంగా ఉండేది. నాలుగు పర్యాయాలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. మున్సిపల్తో పాటు మండలాల్లోనూ ఆ పార్టీ బలం ఎంతో ఉండేది. ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పార్టీని వీడిన తరువాత నియోజక వర్గంలో ఆ పార్టీకి భారీ దెబ్బతగిలింది. ఇప్పుడు నిట్టువేణుగోపాల్రావు నిష్ర్కమిస్తే మరో దెబ్బతగిలి కోలుకోకపోవచ్చని భావిస్తున్నారు. -
కామారెడ్డి ‘ట్రామాకేర్’ ప్రారంభమెన్నడో!
దేవునిపల్లి, న్యూస్లైన్ : జిల్లా మీదుగా పోతున్న నల్లని జాతీయ రహదారులు నిత్యం ఎరుపెక్కుతున్నాయి. రోజూ ప్రమాదాలతో రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. సకాలంలో సరైన వైద్యం అందక కొనప్రాణంతో ఉన్నవారు కన్నుమూస్తున్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగితే వెంటనే అత్యాధునిక వైద్యసేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2008లో మంజూరు చేసిన ట్రామాకేర్ సెంటర్లు జిల్లాలో ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన కేం ద్రం పనులు అర్ధంతరంగా నిలిచిపోగా.. ఇక పనుల పూర్తయి రెండున్నరేళ్లు గడుస్తున్న కామారెడ్డి ‘కేర్’సెంటర్ను పట్టించుకునే నాథుడే లేరు. తుప్పుపడుతున్న సామగ్రి.. కామారెడ్డికి 2008లో మంజూరైన ట్రామాకేర్ సెంటర్ ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. 2011 మా ర్చిలో భవన నిర్మాణం పూర్తవ్వడంతో ప్రభుత్వానికి అ ప్పగించారు. ఈ రెండున్నరేళ్లలో వృథాగా పడిఉన్న కో టిన్నర విలువైన సామగ్రి సైతం తుప్పుపట్టింది. ఇప్ప టి వరకు భవనానికి రూ.65 లక్షలు, సామగ్రికి రూ.కోటి వర కు, అంబులెన్సుకు రూ.30లక్షలు ఖర్చు చేశారు. ఇంకా రూ.రెండు కోట్ల వరకు నిధులు రావాలి. మరిన్ని అధునాతన యంత్రాలు, వైద్యులు, సిబ్బందిని నియమించా ల్సి ఉంది. ‘అప్పుడు ప్రారంభిస్తాం.. ఇప్పుడు ప్రారంభిస్తాం..’ అంటూ హామీలు ఇస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు కాలయాపన చేస్తూ వస్తున్నారే తప్పా ప్రజాసంక్షేమాన్ని పట్టించుకున్న పాపానపోవడం లేదు. నేడు ఢిల్లీ నుంచి ప్రత్యేకబృందం రాక కామారెడ్డిలోని ట్రామా కేర్ సెంటర్ను పరిశీలించడానికి ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం అధికారులు రానున్నారు. వీరి వెంట ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ స్వర్ణ నాగార్జున, డిప్యూటీ కమిషనర్ లోకనాయక్, ప్రభుత్వ పిన్సిపాల్ సెక్రెటరీ అజయ్సహాని, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ అనురాగ్ తదితరులతో పాటు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సైతం రానున్నారు. ఢిల్లీ బృందం పరిశీలన తర్వాైతెనా కామారెడ్డి ట్రామాకేర్ సెంటర్ ప్రారంభమవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. -
ఉల్టాపల్టా.. తిరగబడిన ‘రియల్’ దందా
కామారెడ్డి, న్యూస్లైన్: రియల్ దందా తిరోగమనంలో నడుస్తోంది. కొనుగోళ్లు, అమ్మకాలు మందగించడంతో రిజిస్ట్రేషన్లు సగానికి సగం తగ్గిపోయాయి. ఇదే సమయంలో ప్రభుత్వాదాయం గణనీయంగా పడిపోతోంది. మూడు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణంలో గత మూడు, నాలుగేళ్లలో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూముల క్రయవిక్రయాలు జరి గాయి. గత ఏడాదీ రియల్ దందా బాగానే సాగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి భూముల విలువలు పెరుగుతాయని, రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా అదే స్థాయిలో ఉంటాయని ప్రభుత్వం ముందుగానే ప్రకటించడంతో పెద్ద ఎత్తున క్రయవిక్రయాలు జరిగాయి. తరువాత తగ్గుతూ వచ్చి రెం డు, మూడు నెలలుగా సగానికి సగం పడిపోయాయి. దీంతో రియల్ వ్యాపారంలో స్తబ్ధత ఏర్పడింది. కామారెడ్డిలో రిజిస్ట్రేషన్లు, ఆదాయం ఇలా కామారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ ఏడాది జనవరిలో 808 రిజిస్ట్రేషన్లు జరుగగా రూ. 75.22 లక్షల ఆదాయం సమకూరింది. ఫిబ్రవరిలో 839 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 91.30 లక్షలు, మార్చిలో 1276 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.1.92 కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్లో 674 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 82.65 లక్షలు, మే నెలలో 732 రిజిస్ట్రేషన్లకుగాను రూ. 82. 43 లక్ష లు, జూన్లో 665 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 76.83 లక్షలు, జూలైలో 527 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 70.33 లక్షలు, ఆగస్టు లో 442 రిజిస్ట్రే షన్ల ద్వారా రూ. 57.22 లక్షలు, సెప్టెంబర్లో 579 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 94.64 లక్షలు, అక్టోబర్లో 587 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 71.51 లక్షలు, నవంబర్నెలలో ఇ ప్ప టి దాకా 421 రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 53.57 లక్షల ఆదాయం సమకూరింది. దీనిని బట్టి ఇక్కడ రియల్ వ్యాపారం ఎంతగా దెబ్బతిన్నదో అర్థం చేసుకోవచ్చు. అప్పులపాలైన వ్యాపారులు రియల్ దందాలో పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు పరిస్థితులు తారుమారు కావడంతో ఆందోళనకు గురవుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. గతంలో డబ్బులు సంపాదించిన వారు సర్దుకుపోగా, కొత్తగా వ్యాపారంలో ప్రవేశించిన వారు అప్పులు కట్టే పరిస్థితులు లేక తల్లడిల్లిపోతున్నారు. అడ్డ గోలు వడ్డీల కారణంగా తమ ఆస్తు లు అమ్ముకున్నా అప్పులు తీరేలా కనిపించడం లేదని కొం దరు ఆందోళన చెందుతున్నారు. ఫైనాన్సుల్లో ఖాళీ ఖజానా కామారెడ్డిలో కోట్ల రూపాయలు టర్నోవర్ చేసే ఫైనాన్సుల్లో సైతం ప్రస్తుతం డబ్బులు లేదని అంటున్నారు. చాలా మంది ఫైనాన్సుల నుంచి అప్పులు తీసుకుని భూములపై పెట్టుబడు లు పెట్టడం, అవి రికవరీ కాకపోవడంతో ఫైనాన్సుల్లో డబ్బు లు రికవరీ కావడం లేదని తెలుస్తోంది. కొన్ని ఫైనాన్సుల యజమానులు సైతం భూములపై పెట్టుబడులు పెట్టి ఇప్పు డు లబోదిబోమంటున్నారు. అత్యాశకు పోయి బోల్తాపడ్డామని ఓ ఫైనాన్స్ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ బూమ్ తిరిగి ఎప్పుడు వస్తుందో, తమ పెట్టుబడులు ఎప్పు డు రికవరీ అవుతాయోనని చాలా మంది వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు. -
మూడు‘ముళ్లు’
కామారెడ్డి, న్యూస్లైన్ : పెళ్లి పందిరి విప్పకముందే నూతన వధూవరుల మధ్య కలతలు రేగుతున్నాయి. ఇంటికి వేసిన రంగులు వెలసిపోకముందే వైవాహిక బంధాలు బీటలు వారుతున్నాయి. పెళ్లి సందడి తగ్గకముందే ఏడడుగుల బంధాన్ని తెంపేస్తున్నారు. మూడుముళ్ల బంధం గొప్పతనం తెలుసుకోకముందే విడాకులబాట పడుతున్నారు. అయితే పరిష్కారంలేని సమస్యలతో కాకుండా చిన్నచిన్న గొడవలకే చాలా మంది విడాకులు తీసుకుంటున్నారని తెలుస్తోంది. చాలా మంది పంతాలకు పోయి కోర్టు గడప తొక్కడమో, పెద్దలను ఆశ్రయించి ఇడుపు కాగితం రాయించుకోవడమో చేస్తున్నారు. కొందరు ఆవేశంలో ఆత్మహత్యలకు పా ల్పడడమో, హత్యలకు ఒడిగట్టడమో చేస్తున్నారు. జిల్లాలో 25,51,335 జనాభా ఉండగా, 6.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఏటా ఇరవై వేల వరకు వివాహాలు జరుగుతుండగా అందులో ఐదు వందలకుపైగా జంటలు విడాకులు పొందుతున్నట్లు సమాచారం. పోలీసు స్టేషన్ల ద్వారా కొందరు, కోర్టుల ద్వారా ఇంకొందరు, కుల సంఘాల ద్వారా మరిందరు వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఒక్క కామారెడ్డి కోర్టులోనే ఏడాది కాలంలో 120కి పైగా విడాకుల కేసులు నమోదయ్యాయి. ఎందుకిలా? భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడం, ఓర్పు, సహనం లోపించడం వంటి కారణాలతో చిన్నచిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. యువతీ యువకులు వైవాహిక జీవితంపై పెళ్లికి రకరకాల కలలు కంటారు. తన జీవిత భాగస్వామిని హీరోగానో, హీరోయిన్గానో ఊహించుకుంటారు. పెళ్లి తర్వాత పరిస్థితి అలా లేకపోయేసరికి మనసు గాయపడి తరచూ గొడవ పడుతుంటారు. అనుమానం పెను భూతంగా మారుతోంది. భార్యపై భర్త, భర్తపై భార్య అనుమానం పెంచుకుంటున్నారు. దీంతో అనుబంధం దెబ్బతింటోంది. వైవాహిక బంధాలు తెగిపోవడంలో గల్ఫ్కు వలసబాట పాత్ర ఎంతో ఉంది. పెళ్లయిన వెంటనే ఉపాధి కోసం దేశాలు పట్టిపోతుండడంతో వీరి మధ్య అనుబంధం తగ్గుతోంది. వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. భార్యాభర్తలు ఉద్యోగులైన సందర్భంలో మరోరకమైన సమస్య తలెత్తుతోంది. తాను సంపాదిస్తున్నా ఆర్థిక పరమైన స్వేచ్ఛ ఇవ్వడం లేదన్న కారణంతో పలు కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయి. బంధువుల విషయంలోనూ దంపతులు గొడవపడుతున్నారు. తమవారిని నిర్లక్ష్యం చేస్తున్నావని భా ర్యాభర్తలు పరస్పరం వాదులాటకు దిగుతున్నారు. సర్దుకుపోతే.. దంపతులిద్దరూ మొండి వైఖరిని వీడాలి. ఏ సమస్య వచ్చినా ఇరువురు కూర్చుని సావధానంగా చర్చించుకుంటే గొడవ పెద్దది కాకుండా చూసుకోవచ్చు. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడాన్ని మానుకోవాలి. పక్కవారితో పోల్చి కుటుంబంలో కలతలు సృష్టించుకోవద్దు. తమ స్థాయినిబట్టి మసలుకోవాలి. ఇద్దరూ సంపాదిస్తున్నపుడు ఎవరి సంపాదనైనా ‘తమ కుటుంబానిదే’ అన్న భావనతో వ్యవహరించాలి. ఖర్చుల విషయంలో ఆలోచించుకుని మెదలుకోవాలి. సంపాదనలో కొంతభాగాన్ని ఇరువురి ఇష్టప్రకారంగా పొదుపు చేసే ప్రయత్నం చేయాలి. భార్యాభర్తల మధ్య ఏవైనా పొరపొచ్చాలు వచ్చినపుడు పెద్దవాళ్లకు చెప్పడమో, ఇరుగుపొరుగు వారి దృష్టికి తీసుకెళ్లడమో చేయొద్దు. ఇద్దరూ ప్ర శాంతంగా వ్యవహరించాలి. గొడవలో తమ తప్పెం తో తెలుసుకుని, సర్దుకుపోయే ప్రయత్నం చేయాలి. కుటుంబ వ్యవహారాల్లో బంధువులు తలదూర్చడం వల్ల వివాదాలు పెరుగుతున్నాయి. అందుకే తమ మధ్య ఏర్పడే చిన్నచిన్న గొడవలు బంధువులకు తెలియకుండా జాగ్రత్త పడాల్సి. లేదంటే వారు వాటిని ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తారు. పిల్లల ముందే తగవులాడుకుంటే ఆ ప్రభావం వారి మానసిక స్థితిపై పడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రుల గొడవలు పిల్లలను కలిచివేస్తాయని గుర్తుంచుకోవాలి. అమ్మానాన్నలు ఎప్పుడూ పోట్లాడుతుంటే వారు చదువుపై దృష్టి పెట్టరు. ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందని అర్థం చేసుకోవాలి. అవగాహన పెంచుకుంటే.. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడంతోనే బంధుత్వాలు తెగిపోతున్నాయి. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు పెద్దవారు నచ్చచెప్పేవారు. పెద్దలంటే గౌరవ భావం ఉండడంతో వారూ సర్దుకుపోయేవారు. ఇప్పుడు చిన్నకుటుంబాల్లో పెద్దల మాటకు విలువ లేకుండాపోయింది. భార్యాభర్తలు ఒకరిపై ఒకరు నమ్మకం, అవగాహన పెంచుకుంటే సమస్యలు దూరమవుతాయి. వైవాహిక జీవితంలో ఏర్పడిన దూరాన్ని కౌన్సెలింగ్ ద్వారా తగ్గించవచ్చు. -నిమ్మ దామోదర్రెడ్డి, న్యాయవాది, కామారెడ్డి అహాన్ని తొలగించుకుంటే.. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయ డం ఒక కారణమైతే, పెళ్లైన కొంత కాలానికే వేరు కాపురాలు పెట్టడం వల్ల బంధా లు, బంధుత్వాల గురించి తెలియ డం లేదు. చిన్న విషయాలకే గొడవలు పడుతున్నారు. అనుబంధాన్ని పెంచుకోవాల్సినవారు అహంతో వైవాహిక జీవితంలో అగాథాన్ని పెంచుకుంటున్నారు. విడాకుల దాకా వెళుతున్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకొంటూ, నేనేం తక్కువ అనే భావనను దూరం చేసుకుంటే బంధం నిలబడుతుంది. పిల్లలకు బంధుత్వాల విలువ తెలిసేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. -సురేందర్రెడ్డి, డీఎస్పీ, కామారెడ్డి అర్థం చేసుకుంటే.. ఇష్టం లేని పెళ్లిళ్లు, సినిమా జీవి తాన్ని ఊహించుకోవడం, అ హం, ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం వైవాహిక బంధం తెగిపోవడానికి కారణాలవుతున్నాయి. సంసార సుఖం పొందలేనివారు ఎక్కువగా విడాకులను ఆశ్రయిస్తున్నారని ఇటీవలి కాలంలో జరిగి న పరిశోధనల్లో తేలింది. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పు డు భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తే చెప్పుకునేందుకు పెద్దలు ఉండేవారు. ఇప్పుడు చిన్న కుటుంబాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రశాంతం గా మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. -కేశవులు, మానసిక వైద్యుడు, ఇందూరు -
తెగిపోతున్న బంధాలు.. ఆందోళన కలిగిస్తున్న హత్యలు
కామారెడ్డి, న్యూస్లైన్ : కారణమేదైతేనేం ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. పైన చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినవాళ్లే హత్యలకు తెగబడుతున్నారు. క్షణికావేశం లో బంధువులనే హతమారుస్తున్నారు. కుటుం బ కలహాలు, ఆస్తి తగాదాలు, అనుమానాలు, ఆర్థిక సమస్యలు.. ఇలా పలు సమస్యలు మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి. జిల్లాలో ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పలు హత్య కేసుల్లో రక్తసంబంధీకులే హంతకులనే విషయం పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. జిల్లాలో వరుసగా ఇలాంటి హత్యలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ తగాదాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఒకవైపు, హత్యలు మరోవైపు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కుటుంబ కలహాలు కొన్ని కుటుంబాల్లో తలెత్తుతున్న కలహాలు ఆత్మహత్యలు, హత్యలకు దారితీస్తున్నాయి. చిన్నచిన్న విషయాలను భూతద్దంలో చూస్తూ పెద్దవిగా చేసుకుంటున్నారు. దీంతో కలహాలు పెరిగి ఆవేశాలకులోనై హత్యలకు పాల్పడుతున్నారు. కొందరు మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అనుమానాలతో హత్యలు జీవిత భాగస్వామిపై అనుమానాలు పెంచుకుని కొందరు వేదింపులకు పాల్పడుతున్నారు. భార్యను భర్త, భర్తను భార్య అనుమానించిన సంఘటనలు గొడవలకు కారణమవుతున్నాయి. అవి హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. కుటుంబ సభ్యుల సెల్ఫోన్లకు ఇతరుల నుంచి లెక్కకు మించి ఫోన్కాల్స వచ్చిన సందర్భాల్లో అనుమానాలు పెంచుకుంటున్నారు. ఇది పెను భూతంగా మారి హత్యలకు దారితీస్తోంది. ఏ సమస్యకైనా పరిష్కార మార్గం ఉంటుందని, చిన్నచిన్న సంఘటనలను భూతద్దంలో చూడకుండా వాటి పరిష్కారానికి ప్రయత్నించాలని మానసిక వైద్యులు, న్యాయవాదులు, పోలీసులు సూచిస్తున్నారు. అనుమానం పెనుభూతం క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులపై అనుమానాలు, వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. మత్తుపదార్థాలు స్వీకరించడమూ అనర్థాలకు మూలమవుతోంది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఎంతటి సమస్యకైనా పరిష్కార మార్గం ఉంటుంది. కూర్చొని చర్చించుకుంటే పరిష్కారం దొరుకుతుంది. -కేశవులు, మానసిక వైద్యనిపుణుడు, ఇందూరు నమ్మకం పెరగాలి కుటుంబాల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే వీటిని అర్థం చేసుకొని పరిష్కార మార్గాలు కనుగొనాల్సింది పోయి కొట్లాటలకు దిగుతున్నారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. కుటుంబంలో పెద్దవాళ్లను గౌరవించాలన్న భావన పెరగాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరగాలి. భార్యపై భర్తకు, భర్తపై భార్యకు నమ్మకం ఉండాలి. తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏ సమస్యా ఉండదు.-సురేందర్రెడ్డి, డీఎస్పీ, కామారెడ్డి విలువలు సన్నగిల్లడం వల్లే... మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడు. దీంతో సమాజంలో విలువలు తగ్గిపోతున్నాయి. తండ్రి అంటే పిల్లలకు, భర్త అంటే భార్యకు, భార్య అంటే భర్తకు గౌరవం లే ని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కలహాలు పెరిగి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఏదైనా సంఘటన జరిగినపుడు పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. అప్పుడే నేరాలు తగ్గుతాయి. -క్యాతం సిద్ధరాములు, న్యాయవాది, కామారెడ్డి -
మావోల పేరుతో ‘మాజీ’ల అరాచకం
కామారెడ్డి, న్యూస్లైన్ : జిల్లాలో మాజీల ఆగడాలు ఇటీవల పెరిగిపోయాయి. జిల్లాలో మావోయిస్టు ఉనికి లేకుం డాపోయినా కొం దరు ‘మాజీ’లు మాత్రం మావోయిస్టుల పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన మాజీలు ముఠాలుగా ఏర్పడి సెటిల్మెంట్లు, భూకబ్జాలు, చందాల వసూళ్లకు పాల్పడుతున్నారు. నక్స ల్స్ కార్యకలాపాలు లేకపోవడంతో పోలీసులు నక్సల్స్కు సంబంధిం చిన వ్యవహారాలపై పెద్దగా దృష్టిపెట్టడం లే దు. ఇదే అదనుగా భావించిన కొందరు ‘మాజీ’లు అరాచకాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నా రు. చందాలు ఇవ్వాలంటూ ఇటీవల కామారెడ్డి పట్టణం లో పలువురు వ్యాపారులకు మావోయిస్టుల పేరుతో ము ద్రించిన లెటర్ప్యాడ్లపై హెచ్చరికలు పంపిన వ్యవహా రంలో పోలీసులు మాజీల ముఠాను పట్టుకున్నారు. పదేళ్ల క్రితం వరకు జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు జో రుగా సాగేవి. కామారెడ్డి ప్రాంతంలోనైతే నక్సల్స్ చెప్పిన ట్లే నడిచేది. అలాంటి పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వం తీవ్ర నిర్బంధం మోపడంతో వందలాది మంది అరెస్టయ్యారు. మరికొందరు పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఈ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయా యి. అయితే కొందరు ‘మాజీ’లు మాత్రం నక్సల్స్ పేరు తో తమ అరాచకాలను కొనసాగిస్తూ వచ్చారు. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో భూ కబ్జాలకు పాల్పడడం, సెటిల్మెంట్లు చేయడం వంటివి పెరిగాయి. కామారెడ్డికి సమీపంలో ఓ వైద్యుడి కుటుంబానికి చెందిన విలువైన భూమికి సంబంధించి ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ఓ మాజీ నక్సలైట్, దోమకొండకు చెందిన మరొకరితో కలిసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాకు ప్రయత్నించాడు. సదరు డాక్టరు కుటుంబ సభ్యులు గట్టిగా ఎదురు తిరగడంతో తోకముడిచారు. అదే ముఠా విలువైన స్థలాలపై దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకుని కబ్జాలకు పాల్పడుతున్న ట్లు ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డి ప్రాంతానికి చెందిన కొందరు మాజీలు భూముల పంచాయతీలు, డబ్బుల సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తాజాగా వ్యాపారులను డబ్బుల కోసం డిమాండ్ చేసిన కేసులో సదాశివనగర్ మండలం కన్నాపూర్కు చెందిన మాజీ డిప్యూటీ కమాండర్ తోకల రాజనర్సయ్య అలియాస్ గజేందర్, రెడ్డిపేటకు చెందిన మామిండ్ల బుచ్చిరాజు, ఇస్రోజివాడికి చెందిన మాధూరి శ్రీనివాస్ అలియాస్ లడ్డూ శ్రీనివాస్, మద్దికుంటకు చెందిన గజ్జెల శంకర్ అలి యాస్ లచ్చాపేట్ శ్రీను, కామారెడ్డి ఎస్సీ కాలనీకి చెందిన కొత్తూరి భూమయ్య అలియాస్ దండోర భూమయ్య, ధర్పల్లి మండలం సిర్నపల్లికి చెందిన దండుగ నర్సయ్య అలియాస్ సాయిలు పట్టణంలోని శ్రీరాంనగర్కాలనీకి చెందిన గోవింద రమేశ్, కామారెడ్డికి చెందిన పెయింటర్ ఎల్.ప్రకాశ్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో ‘మాజీ’ల మరో అరాచకం వెలుగు చూసింది. -
పేదకు పెద్ద జబ్బు
దేవునిపల్లి, న్యూస్లైన్ : కామారెడ్డి పట్టణంలోని సైలాన్ బాబా కాలనీలో నివసించే షరీఫా బేగం, హైమద్పాషా దంపతులకు ముగ్గురు పిల్లలు. మొద టి ఇద్దరు కవలలు. వారికి 13 ఏళ్లు. చిన్నకుమారుడు ఆయాన్కు ప్రస్తుతం ఐదేళ్లు. హైమ ద్ ప్లంబర్గా పనిచేస్తున్నాడు. పుట్టిన ఆరు నెలలకే ఆయాన్ నోరు, ముక్కులోంచి రక్తం కక్కుకున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి తలసేమియా వ్యాధి ఉన్నట్లు గుర్తిం చారు. నెలకోసారి రక్తం ఎక్కించాలని సూచిం చారు. లేకపోతే రక్తహీనతతో మరణించే ప్రమాదం ఉందన్నారు. దీంతో నెలకోసారి హైదరాబాద్లోని చత్తాబజార్ ఏరియాలో ఉన్న తలసేమియా సంస్థ అస్పత్రికి తీసుకెళ్లి ‘ఓ’ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించుకుంటూ వస్తున్నారు. ఆయాన్కు నాలుగేళ్ల వయసునుంచి 15 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి వస్తోంది. వైద్యం, రక్తానికి, మం దులకు, ప్రయాణ చార్జీలకు నెలకు ఐదు వేల రూపాయల వరకు ఖర్చవుతున్నాయని ఆయాన్ తండ్రి హైమద్ తెలిపారు. ఢిల్లీలో ఆపరేషన్ చేస్తారని, * 10 లక్షలు ఖర్చవుతాయని, అయి తే వ్యాధి ఖచ్చితంగా నయమవుతుందని చెప్పలేమని వైద్యులు తెలిపారన్నారు. అంతడబ్బు తానెక్కడినుంచి తేవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు జీవి తాంతం ఇలా బాధపడాల్సిందేనా అంటూ కన్నీరుమున్నీరయ్యారు. దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు. ఆయాన్కు సహాయం చేయాలనుకునేవారు 95738 90558 నెంబర్లో హైమద్ను సంప్రదించగలరు.