land Registrations
-
ఏపీలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు
-
4 వేల లావాదేవీలు.. రూ.20.8 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: భూములు, ఆస్తుల క్రయ విక్రయాలు సర్వసాధారణంగా జరిగేవే. భూమిని అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా ప్రభుత్వ కార్యాలయంలో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. హక్కుల రికార్డు మ్యుటేషన్ జరగాల్సిందే. ఇలాంటి రిజిస్ట్రేషన్లు రాష్ట్రంలో రోజుకు ఎన్ని జరుగుతాయో తెలుసా.. తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో రోజుకు సగటున 4 వేల వరకు క్రయవిక్రయ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ లావాదేవీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు సగటున రూ.20.8 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఈ పదేళ్లలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించి మొత్తం 1,46,18,601 లావాదేవీలు జరగ్గా, వీటిద్వారా రూ.76,201.17 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన 2014–15 సంవత్సరంలో 8,27,374 లావాదేవీల ద్వారా రూ. 2,746 కోట్ల ఆదాయం రాగా, ఇటీవల ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 18,41,324 లావాదేవీల ద్వారా రూ.14,588.06 కోట్ల ఆదాయం వచ్చిందని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పదేళ్లలో అత్యధికంగా 2021–22లో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ ఏడాదిలో 20 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు జరగడం గమనార్హం. కాగా, మన పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిజిస్ట్రేషన్ల వృద్ధి కొంచం తక్కువగానే కనిపిస్తోంది. తెలంగాణలో టాప్ 30 సబ్రిజి్రస్టార్ కార్యాలయాలివే.. రిజిస్ట్రేషన్ల విషయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల నుంచే సింహభాగం లావాదేవీలు జరుగుతాయి. ఆదాయం కూడా ఎక్కువగా ఇక్కడి నుంచే వస్తుందని గణాంకాలు చెపుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 144 సబ్రిజి్రస్టార్ కార్యాలయాల్లో 30 చోట్ల ఎక్కువగా లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ జాబితాలో రంగారెడ్డి (ఆర్వో), గండిపేట, పఠాన్చెరు (ఆర్వో), కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, మేడ్చల్ (ఆర్వో), కూకట్పల్లి, వరంగల్ (ఆర్వో), మహేశ్వరం, బాలానగర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఎస్ఆర్నగర్, చంపాపేట, ఆజంపుర, గోల్కొండ, నారపల్లి, సరూర్నగర్, వనస్థలిపురం, చిక్కడపల్లి, కాప్రా, వల్లభ్నగర్, కీసర, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం (ఆర్వో), చేవెళ్ల ఉన్నాయని వార్షిక నివేదిక వెల్లడించింది. -
‘అసైన్డ్’ ఆగడం! రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన చంద్రబాబు సర్కారు
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై వైఎస్సార్ సీపీ హయాంలో యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) పొందిన రైతన్నలపై కూటమి సర్కారు కక్ష సాధింపులకు దిగింది. దశాబ్దాల తర్వాత తమ భూములపై ఆంక్షలు తొలగిపోవడంతో సంతోషంగా సాధారణ రైతులుగా సాగు చేసుకుంటున్న వారిని మళ్లీ కష్టాల్లోకి నెట్టింది. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల చట్ట సవరణ ద్వారా ఫ్రీ హోల్డ్ అయిన భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా ఫ్రీ హోల్డ్ అయిన భూములన్నింటిపైనా విచారణ నిర్వహించాలని, రీ వెరిఫికేషన్ చేయాలని స్పష్టం చేసింది. వాస్తవానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను అనధికారికంగా నిలిపివేసింది. ఇప్పుడు దాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో లక్షలాది రైతు కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వం ఒరిజినల్ అసైనీలకు న్యాయబద్ధంగా, ఇష్టపూర్తిగా అమ్ముకునే హక్కు కల్పించింది. అసైన్డ్ పేదలకు భూములపై పూర్తి హక్కులతోపాటు అవసరాలకు విక్రయించుకునే అవకాశమిచ్చింది. ఒకవేళ ఇప్పటికే చేతులు మారినా ఒరిజినల్ అసైనీలకే హక్కులు ఉండేలా చర్యలు తీసుకుంది. మరి అలాంటప్పుడు అది బడుగు, బలహీన వర్గాల రైతులకు మేలు చేసినట్లా? కీడు చేసినట్లా? అని కూటమి ప్రభుత్వాన్ని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.చిరకాల వాంఛ నెరవేర్చిన వైఎస్ జగన్ ప్రభుత్వాల నుంచి భూములు పొందిన లక్షలాది మంది నిరుపేద రైతుల చిరకాల కోరికను నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం నెరవేర్చింది. పేదలకు అసైన్ చేసిన (కేటాయింపు) భూములపై వారికి కేటాయించిన తేదీ నుంచి 20 సంవత్సరాల తర్వాత హక్కులు లభించేలా 1977–అసైన్డ్ భూముల చట్టానికి 2023లో కీలక సవరణ చేసింది. దీంతో 27 లక్షల మంది అసైన్డ్ భూముల రైతన్నలు తమ భూములపై హక్కులు (ఫ్రీ హోల్డ్) పొందే అవకాశం కలిగింది. అయితే అసైన్డ్ భూములు చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఒరిజినల్ అసైనీ (ఒరిజినల్ కేటాయింపుదారు)కే యాజమాన్య హక్కులు కల్పించింది. ఎవరు పడితే వారు అసైన్డ్ భూములను సొంతం చేసుకునే ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. చట్ట ప్రకారం ప్రభుత్వం నుంచి భూములు పొందిన వారు లేక వారి వారసులకు మాత్రమే అసైన్డ్ భూములపై హక్కులు కల్పించింది. ఈ క్రమంలో పూర్తి వెరిఫికేషన్ తర్వాత 9 లక్షల ఎకరాలపై సంబంధిత రైతులకు హక్కులు కల్పించి ఆ భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించింది. మిగిలిన భూములపైనా వెరిఫికేషన్ పూర్తి చేసి 22 ఏ జాబితా నుంచి తొలగించాల్సి ఉండగా కూటమి సర్కారు ఆ పని నిలిపివేసింది. అంతటితో ఆగకుండా గత ప్రభుత్వం 22ఏ జాబితా నుంచి తొలగించిన భూములకు చెందిన రైతులపైనా విచారణ పేరుతో కక్ష సాధింపులకు దిగింది. విచారణలో సక్రమమని తేలిన భూములపైనా ఆంక్షలు కొనసాగించాలని, ప్రభుత్వానికి తెలియకుండా వాటిని 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించకూడదని స్పష్టం చేయడాన్ని బట్టి చంద్రబాబు సర్కారు పేద అసైన్డ్ రైతులపై ఎంత క్షక్ష పూరితంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.రైతుల చేతుల్లోనే 97.22 శాతం భూములు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పేదల అసైన్డ్ భూములు ఫ్రీ హోల్డ్ కావడం, వాటిపై వారికి సంపూర్ణ హక్కులు లభించడంతో ఏదో గోల్మాల్ జరిగిందని, అన్యాక్రాంతమయ్యాయని కూటమి సర్కారు దుష్ప్రచారం చేస్తోంది. వాస్తవానికి 22 ఏ జాబితా నుంచి తొలగించిన 9 లక్షల ఎకరాల్లో విక్రయాలు జరిగింది కేవలం 25 వేల ఎకరాలు (2.78 శాతం) మాత్రమే. అంటే ఒరిజినల్ అసైనీలు మాత్రమే ప్రయోజనం పొందారు. మిగిలిన 97.22 శాతం భూములపై కూడా హక్కులు ఒరిజినల్ రైతుల చేతుల్లోనే ఉన్నాయి. దీన్ని చంద్రబాబు ప్రభుత్వం తప్పుగా చిత్రీకరిస్తూ అసైన్డ్ భూముల చట్ట సవరణను తప్పు పడుతోంది. అదే సమయంలో చట్ట సవరణను కొనసాగిస్తామని ప్రకటించింది. దీన్నిబట్టి అసైన్డ్ భూములపై దళితులకు, బడుగులకు హక్కులు దక్కకూడదన్నదే చంద్రబాబు సర్కారు లక్ష్యంగా కనపడుతోంది.విస్తృత అధ్యయనం తర్వాతే చట్ట సవరణఅసైన్డ్ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు కల్పించటానికి ముందు వైఎస్ జగన్ ప్రభుత్వం విస్తృతంగా అధ్యయనం చేసింది. అప్పటి రెవెన్యూ మంత్రి నేతృత్వంలో ఎమ్మెల్యేలతో కమిటీని నియమించింది. వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన కమిటీ అసైన్మెంట్ భూముల చట్టాలు, నియమ నిబంధనలను క్షుణ్నంగా పరిశీలించి గత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత ఒరిజినల్ లబ్ధిదారులకు లేదా వారి వారసులకు అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు వీలు కల్పించాలని, అందుకు అనుగుణంగా ఏపీ అసైన్మెంట్ చట్టం (పీఓటీ)– 1977కి సవరణలు చేయాలని కమిటీ సిఫారసు చేసింది.పీఓటీ 1977 చట్టం స్ఫూర్తిని గౌరవిస్తూ.. అసైన్డ్ భూములపై లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని గత ప్రభుత్వానికి కమిటీ సిఫారసు చేయగా దీనికి నాటి మంత్రివర్గం ఆమోదం తెలిపి చట్టానికి సవరణలు చేసింది. 20 ఏళ్లకు ముందే ఎవరైనా పేద రైతుల నుంచి భూములు కొనుక్కుంటే వారికి ఎలాంటి ప్రయోజనం దక్కని విధంగా కూడా అదే సందర్భంలో చట్ట సవరణ చేసింది. తద్వారా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకూడదన్న ఒరిజినల్ పీఓటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్)–1977 చట్టం స్ఫూర్తిని గౌరవించింది. తద్వారా అసైన్మెంట్ అయిన దగ్గర నుంచి 2023లో చట్ట సవరణ జరిగే వరకూ అసైన్డ్ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన రైతులకు మాత్రమే మేలు జరుగుతుంది. ఇలా ఒరిజనల్ అసైనీలకు మాత్రమే ప్రయోజనం దక్కేలా చర్యలు తీసుకున్నారు.పేద రైతులను రోడ్డుకీడ్చేసి..గత ప్రభుత్వం ఇంత పకడ్బందీగా చట్ట సవరణ చేసి అసైన్డ్ భూములపై విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే దాన్ని వక్రీకరించి భూములన్నీ అన్యాక్రాంతమైనట్లు ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కుట్ర మినహా మరేమీ లేదని స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ నేతలు అసైన్డ్ భూములను సొంతం చేసుకున్నట్లు కూటమి సర్కారు అభాండాలు మోపుతోంది. ఫ్రీ హోల్డ్ అయిన 9 లక్షల ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగింది కేవలం 25 వేల ఎకరాలే. అందులో ఎక్కడైనా తేడాలున్నాయని భావిస్తే విచారణ నిర్వహించుకోవచ్చు. అంతేగానీ ఒరిజినల్ అసైనీల చేతుల్లో ఉన్న మొత్తం ఫ్రీహోల్డ్ భూములన్నింటిలోనూ తప్పులు జరిగాయని వితండవాదం చేస్తూ ఆ రైతులను రోడ్డు కీడ్చడం కచ్చితంగా పేదలపై కక్ష సాధించడమే. పేదలంతా వైఎస్ జగన్కు అండగా ఉండడాన్ని జీర్ణించుకోలేని కూటమి సర్కారు వారిని ఇక్కట్లకు గురి చేస్తూ బురద జల్లడానికి సిద్ధపడినట్లు స్పష్టమవుతోంది. ఆ ఉత్తర్వులు అన్యాయం..ఏళ్ల తరబడి అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములపై రైతులకు సంపూర్ణ హక్కులను మాజీ సీఎం వైఎస్ జగన్ కల్పించారు. పేద రైతులపై కక్ష సాధించేలా అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదని, వాటిపై విచారణ జరపాలని కూటమి ప్రభుత్వం ఆదేశించడం దారుణం. చిప్పాడ పంచాయితీలో మా అమ్మ వెంకాయమ్మ పేరుతో 2 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. రిజిస్ట్రేషన్ కోసం మేం చేసుకున్న దరఖాస్తు పెండింగ్లో ఉండగా నిలిపివేయాలని ఆదేశిచడం అన్యాయం.– కొయ్య అప్పల సూర్యనారాయణరెడ్డి, పాత మూలకుద్దు, భీమిలి మండలంబ్యాంకు రుణాలు రాకుండా చేసింది..ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు 20 ఏళ్లకు పైబడి లబ్ధిదారుల అధీనంలో ఉంటే సంపూర్ణ యాజమాన్య హక్కులు దక్కేలా గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ ప్రక్రియ కొనసాగుతుండగా టీడీపీ కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయడం దారుణం. భూములు చేతిలో ఉన్నా అవసరానికి బ్యాంకు రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా చేసింది. గత ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును రద్దు చేయడం సరికాదు. – ఆండ్రా వెంకట సుబ్బారెడ్డి, రైతు, ఆత్మకూరుమళ్లీ కష్టాలు మొదలుఏళ్ల తరబడి అసైన్డ్ భూములను అనుభవిస్తున్న రైతులకు మేలు కలిగేలా గత ప్రభుత్వం చొరవ తీసుకుని యాజమాన్య హక్కులు కల్పించింది. ఇప్పుడు రైతులకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. భూములను తనఖా పెట్టి రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా చేసింది.– మెట్టుకూరు చంద్రశేఖర్రెడ్డి, రైతు, గోవిందంపల్లి, అనంతసాగరం మండలంనిలిపివేయడం అన్యాయం..గత ప్రభుత్వం అసైన్డ్ భూములపై పేదలకు కల్పించిన యాజమాన్య హక్కులను కూటమి సర్కారు హరించడం దారుణం. ఇది పేద రైతుల కడుపు కొట్టడమే. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లతో ఎంతో మంది పేద రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. – బోస నర్సింగరావు, జేవి అగ్రహారం, భీమిలి నియోజకవర్గంరోడ్ల పైకి రైతులుమాకు భూములున్నా యాజమాన్య హక్కులు కల్పించకుండా కూటమి ప్రభుత్వం అడ్డుపడటం సరికాదు. సక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగిన వాటిని కూడా పెండింగ్లో ఉంచాలని నిర్ణయించడం ఏమిటి? కూటమి ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోకుంటే లక్షల మంది పేద రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది.– పెద్దాడ వెంకటప్పారావు, జేవి అగ్రహారం, భీమిలి నియోజకవర్గం. పేదల కడుపుకొడుతున్నారు..మాకు తిరుపతి సమీపంలో నాలుగు ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. గత ప్రభుత్వం సర్వ హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఎంతో సంతోషపడ్డాం. గతంలో ఎంతో మంది పాలకులు హామీలిచ్చినా నెరవేర్చలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రమే రిజిస్ట్రేషన్కు అనుమతి ఇచ్చింది. కొత్త ప్రభుత్వం రాగానే ఫ్రీ హోల్డ్ పేరుతో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ను నిలుపుదల చేయడం దారుణం. పేదల పట్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు. చంద్రబాబు నిరుపేదల కడుపు కొడుతున్నారు. –ప్రభాకర్, భైరాగిపట్టెడ, తిరుపతి అన్యాయం చేయొద్దు..మాకున్న అసైన్డ్ భూమికి గత ప్రభుత్వంలో సర్వహక్కులు కల్పించారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. చాలా ఆనందం వేసింది. చాలా ఏళ్లుగా ఉన్న సమస్య గత ప్రభుత్వంలో పరిష్కారమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిలిపి వేయడం వల్ల ఎంతో మంది రైతులు నష్టపోతారు. సీఎం చంద్రబాబు రైతులకు మేలు చేయాలే కానీ అన్యాయం చేయకూడదు. ప్రీహోల్డ్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. – సుబ్బానాయుడు, రైతు, 50 బసివిరెడ్డిపల్లి గ్రామం, గంగాధర నెల్లూరు, చిత్తూరు జిల్లా రైతులకు తీవ్ర ఇబ్బందులు..ఫ్రీ హోల్డ్ అయిన చుక్కల భూములు, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం దారుణం. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. గత ప్రభుత్వం అన్ని రకాల విచారణలు నిర్వహించాకే అనుమతించింది.– జీ రామయ్య, రైతు, పొదలకూరు మండలంకథ మళ్లీ మొదటికే..దశాబ్దాల తర్వాత రైతులు కష్టాలు తీరాయనుకుంటే మళ్లీ మొదలవుతున్నాయి. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని సంతోషపడుతున్న సమయంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం వల్ల కథ మొదటికి వస్తుంది. ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలి.– వి.దయాకర్రెడ్డి, పొదలకూరు మండలం -
నిర్ణయమే మిగిలింది.. రిజిస్ట్రేషన్ విలువల సవరణ క్షేత్రస్థాయి కసరత్తు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విలువల సవరణ కసరత్తు క్షేత్ర స్థాయిలో పూర్తయింది. గత నెల 18వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తీసుకునే తుది నిర్ణయం కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఎదురుచూస్తోంది. క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలను కొత్త కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ ఇటీవల జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలతో కలిసి సమీక్షించారని, అన్ని కేటగిరీలు, స్థాయిల్లో ప్రతిపాదించిన కనిష్ట, గరిష్ట విలువలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. వీలున్నంత త్వరలోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ఈ విలువల ప్రతిపాదనలను వివరిస్తామని, ఆ తర్వాత రెవెన్యూ మంత్రితో కలిసి ముఖ్యమంత్రితో భేటీ కావాల్సి ఉందని, ఆ భేటీలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం పూర్తి కాగానే మిగిలిన షెడ్యూల్ మేరకు ముందుకెళతామని, క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలకు ఆమోదం తీసుకుని, శాఖా పరమైన సాఫ్ట్వేర్లో అప్డేట్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటే వచ్చే నెల 1వ తేదీ నుంచే సవరించిన విలువలను అమల్లోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. గతానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విలువలను ఒకేసారి సవరించారు. అప్పుడు క్షేత్రస్థాయి నుంచి కసరత్తు చేయకుండా, రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం విలువలు నిర్ణయించారు. కాగా ప్రభుత్వం మరోసారి భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విలువల సవరణకు నిర్ణయం తీసుకోవడంతో..గత నెల 15వ తేదీన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువరించింది. వాటి ప్రకారమే క్షేత్రస్థాయి నుంచి కసరత్తు ప్రారంభమైంది. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు (ఖాళీ నివాస స్థలాలు), ఆస్తుల (అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు) విలువలను క్షేత్రస్థాయిలో ఉన్న మార్కెట్ ధరలకు అనుగుణంగా పెంచాలని సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయం మేరకు రిజిస్ట్రేషన్ విలువల కసరత్తు జరిగింది. ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్ల విషయంలో ప్రస్తుతం మార్కెట్ ధర ఎంత ఉందో చూసి అందులో సగం మేరకు విలువలను సవరించే ప్రయత్నం జరిగింది. మూడు కేటగిరీల్లో నిర్ధారణ వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరిల్లో నిర్ధారించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు ఒక విలువ, వెంచర్లు చేసేందుకు సిద్ధంగా ఉన్న భూములకు ఇంకో విలువ, హైవేల పక్కన ఉండే వ్యవసాయ భూములకు మరో విలువను ప్రతిపాదించారు. అందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాలు మినహాయించి వ్యవసాయ భూమి కనిష్ట విలువ రూ.5 లక్షలుగా ప్రతిపాదించారు. ఆపై రూ.50 లక్షల వరకు వ్యవసాయ భూముల విలువలను ప్రతిపాదించగా, వెంచర్లకు సిద్ధంగా ఉన్న భూములు, హైవేల పక్కన ఉండే భూములను అక్కడి విలువల ప్రాతిపదికన రూ.40 లక్షల నుంచి 2.90 కోట్ల వరకు ప్రతిపాదించారు. ఈ విలువల మేరకు 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించే విధంగా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇక నివాస స్థలాల చదరపు గజం కనీసం రూ.500, అపార్ట్మెంట్ల చదరపు అడుగు కనీసం రూ.1000గా ప్రతిపాదించారు. ప్రజాభిప్రాయం లేకుండానే..? క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలకు ఆమోదం లభించిన అనంతరం ఈనెల ఒకటో తేదీ నుంచే సవరించిన విలువల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాల్సి ఉంది. ఈ మేరకు గత నెల 15వ తేదీన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెలువరించిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదించిన విలువలపై ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించి వాటిపై సమీక్ష చేసిన అనంతరం తుది విలువలను నిర్ధారించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కూడా క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలను ఆన్లైన్లో పెట్టలేదు. అయితే గతంలో రిజిస్ట్రేషన్ విలువలను సవరించిన రెండుసార్లు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈసారి ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలనుకున్నా సమయం సరిపోయేలా లేదని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే గడువును కుదిస్తారని లేదంటే ఈసారి కూడా ప్రజాభిప్రాయం లేకుండానే తుది విలువలను నిర్ధారించే అవకాశాలున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. -
కోడ్ మూడ్లోనే రెవెన్యూ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మినహా ఆ శాఖ పరిధిలో ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని, ఎన్నికల కోడ్ కారణంగా గత రెండున్నర నెలలుగా ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందన్న సాకుతో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కూడా రెవెన్యూ వర్గాలు ముందుకు రాకపోవడం గమనార్హం. ధరణి పోర్టల్తో పాటు జీవో 59 కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవాల్సిన కలెక్టర్లు ఆ ఫైళ్లన్నింటినీ పక్కన పెట్టేయడం, తాజాగా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వా త కూడా వాటిని పరిశీలించకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి నెలకొందని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి. దీనికి తోడు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయం కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోయిందని, కనీసం క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా ఆరా తీసే పరిస్థితి లేకుండా పోయిందని రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు ఈ ఏడాది సెపె్టంబర్ నుంచే రాష్ట్రంలో ఎన్నికల సందడి ప్రారంభమయింది. అక్టోబర్లో ఎన్నికల షెడ్యూల్రాగా, నవంబర్లో నోటిఫికేషన్ వెలువడింది. అయితే షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే కోడ్ అమల్లోకి రావడంతో అప్పటి నుంచి రెవెన్యూ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ సిబ్బందిదే కీలక పాత్ర కావడం, తహసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా, ఆర్డీవోలు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించాల్సి ఉండటంతో వారు రెవెన్యూ పనులన్నింటినీ పక్కన పెట్టి ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఇక కలెక్టర్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఈనెల 4వ తేదీ వరకు (ఎన్నికల కోడ్ ముగిసే వరకు) బిజీబిజీగా ఉన్నారు. దీంతో తహసీల్దార్ నుంచి కలెక్టర్ స్థాయి వరకు రెవెన్యూ వ్యవహారాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. కనీసం విరాసత్, పెండింగ్ డిజిటల్ సంతకాల దరఖాస్తులను కూడా పరిష్కరించలేదు. దీంతో ప్రస్తుతం ధరణి, జీవో 59 (ప్రభుత్వ భూముల క్రమబద్ధికరణ)లకు చెందిన లక్షలాది మంది దరఖాస్తుదారులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. తదుపరి ఆదేశాల వరకు పెండింగ్లోనే? రాష్ట్రంలో అధికారం చేతులు మారిన నేపథ్యంలో రెవెన్యూ శాఖకు సంబంధించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు రెవెన్యూ కార్యకలాపాలు ముట్టుకో వద్దని, అన్ని ఫైళ్లు పెండింగ్లో పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, ఈ మేరకు కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పా రని అంటున్నారు. మరోవైపు రెవెన్యూ కార్యకలాపాలపై ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని సీసీఎల్ఏ కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని కూడా సమాచారం. అయితే ఇవి కేవలం మౌఖిక ఆదేశాలు మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆదేశాల నేపథ్యంలోనే రెవెన్యూ వ్యవహారాలు స్తబ్దుగా మారాయని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘రెవెన్యూ వ్యవహారాలపై ప్రభుత్వం ఆదేశాలివ్వడం కొత్తేమీ కాదు. కానీ అధికారంలో ఉన్న పార్టీ మారడంతో రెవెన్యూ సిబ్బందిలో కొంత కంగాళీ ఉన్న మాట మాత్రం వాస్తవం. ఏం చేస్తే ఏం జరుగుతుందోననే ఆందోళనతో ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు..’ఈ శాఖ ముఖ్య అధికారి ఒకరు చెప్పారు. అయితే ‘ఎప్పటివో పాత దరఖాస్తులు పరిష్కరించేందుకు అడ్డు వచ్చిందెవరు? జీవో 59 కింద దరఖాస్తులు స్వీకరించి ఆరు నెలలు దాటిపోయింది. వాటి పరిష్కారం వద్దని ప్రభుత్వం ఎందుకు అంటుంది?’అని ప్రశ్నించారు. పైగా వీటి పరిష్కారం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా? ’అని అన్నారు. -
సర్వే నంబర్ల స్థానంలో ఎల్పీఎం నంబర్లు
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వేతో రాష్ట్రంలోని భూమి రికార్డుల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. ప్రస్తుతం ఉన్న సర్వే నంబర్లు కనుమరుగై, వాటి స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్పీఎ) నంబర్లు రానున్నాయి. ఇప్పటికే సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో ఎల్పీఎం నంబర్లతోనే కార్యకలాపాలు జరుగుతున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు కూడా కొత్త నంబర్లతోనే జరగనున్నాయి. బ్రిటిష్ కాలంలో భూములను సర్వే చేసి ఇచ్చిన నంబర్లే ఇప్పటికీ రికార్డుల్లో ఉన్నాయి. ఒక సర్వే నంబరులో 2 నుంచి 10 అంతకంటె ఎక్కువ మంది భూయజమానులు ఉన్నారు. ఒక సర్వే నంబరులో 30 ఎకరాల భూమి ఉంటే అందులో 10, 15 మంది పేర్లు కూడా ఉన్నాయి. దీనివల్ల లెక్కలేనన్ని భూ సమస్యలు, వివాదాలు ఏర్పడ్డాయి. భూముల రీ సర్వే ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపింది. ప్రతి భూ కమతానికి ఎల్పీఎం నంబరు, ప్రతి యజమానికి ఆధార్ తరహాలో ఒక ఐడీ నంబరు ఇస్తోంది. మారనున్న 1.96 కోట్ల సర్వే నంబర్లు రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు, వాటి పరిధిలో 90 లక్షల మంది పట్టాదారులు (భూ యజమానులు) ఉన్నారు. ఈ పట్టాదారులకు చెందిన 2.26 కోట్ల ఎకరాల భూమి 1.96 కోట్ల సర్వే నంబర్లుగా రికార్డుల్లో విభజించి ఉంది. రీ సర్వేలో ఈ మొత్తం విస్తీర్ణాన్ని డ్రోన్, ఏరియల్ సర్వే, అవి చేయలేని చోట డీజీపీఎస్ సర్వే ద్వారా కొలుస్తున్నారు. కొలిచిన తర్వాత ప్రతి ల్యాండ్ పార్సిల్కు ఎల్పీఎం నంబరు, ఆధార్ మాదిరిగానే భూదార్ పేరుతో విశిష్ట గుర్తింపు సంఖ్య, జియో కోఆర్డినేట్స్ను ప్రభుత్వం కేటాయిస్తోంది. సర్వే అనంతరం ప్రతి రైతుకి ప్రభుత్వం ఇచ్చే భూ హక్కుపత్రంలో ఆ వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందులోనే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్, యజమాని ఫొటో, క్యూఆర్ కోడ్ ఉంటాయి. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ రైతుకు సంబంధించిన భూమి కొలతలు, భూ విస్తీర్ణం వంటి వివరాలన్నీ కనపడతాయి. ఈ ఎల్ï³ఎం నంబర్ల ప్రకారమే క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్లు జరుగుతాయి. దీనివల్ల మోసపూరిత రిజిస్ట్రేషన్లకు, రికార్డుల ట్యాంపరింగ్కు అవకాశం ఉండదు. వెబ్ల్యాండ్–2లో ఎల్పీఎం నంబర్లు రీ సర్వే ద్వారా కొత్తగా తయారు చేస్తున్న డిజిటల్ రెవెన్యూ రికార్డుల్లో ఇకపై ఎల్పీఎం నంబర్లే ఉంటాయి. సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లోని రెవెన్యూ రికార్డులన్నీ ఇప్పటికే ఎల్పీఎం నంబర్లతో అప్డేట్ చేశారు. ఆ గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు వీటి ద్వారానే నిర్వహిస్తున్నారు. రెవెన్యూ శాఖ రీ సర్వే పూర్తయిన గ్రామాల వివరాలతో ఇప్పటికే వెబ్ల్యాండ్–2 ఆన్లైన్ పోర్టల్ను అందబాటులోకి తెచ్చింది. ఆ రికార్డుల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్వేర్ను అనుసంధానించారు. సర్వే పూర్తయ్యే గ్రామాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఆ గ్రామాల్లో ఎల్పీఎం ఆధారిత రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. త్వరలో మరో 2 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తవుతోంది. ఆ గ్రామాలను కూడా వెబ్ల్యాండ్–2కి మార్చనున్నారు. ఇలా విడతల వారీగా రాష్ట్రమంతా వెబ్ల్యాండ్–2కి మారిపోతుంది. భవిష్యత్తులో ఎల్పీఎం నంబర్ల ద్వారానే భూముల్ని గుర్తిస్తారు. -
AP: ఆస్తుల రిజిస్ట్రేషన్లు సులభతరం.. స్పెషల్ సాఫ్ట్వేర్ ‘కార్డ్ ప్రైమ్’
సాక్షి, అమరావతి: ఇది టెక్నాలజీ యుగం. అన్ని పనులు ఆన్లైన్లోనే, అరచేతిలోనే నిమిషాల్లో అయిపోతున్నాయి. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. వేచి ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ వైపు నడిపిస్తోంది. కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ (కార్డ్)ను ఆధునీకరించి కార్డ్ 2.0కు రూపకల్పన చేస్తోంది. ‘కార్డ్ ప్రైమ్’ పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తోంది. దీని ద్వారా స్టాంపు పేపర్లు, సంతకాలతో పనిలేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. డాక్యుమెంట్ను ఎవరికివారే ఆన్లైన్లో తయారు చేసుకుని, ఆన్లైన్లోనే చలానా (స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు) కట్టి, ఒక టైం స్లాట్ను (అపాయింట్మెంట్) బుక్ చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, లేదా గ్రామ, వార్డు సచివాలయానికి వెళితే అక్కడ వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. కొత్త విధానంలో సులభంగా రిజిస్ట్రేషన్లు ప్రస్తుత విధానంలో డాక్యుమెంట్ తయారీ, చలానా కట్టడం వంటివన్నీ రిజిస్ట్రేషన్ల శాఖతో సంబంధం లేకుండా బయట జరుగుతున్నాయి. వీటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇస్తే అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇదో పెద్ద ప్రహసనం. కార్డ్ ప్రైమ్ విధానంలో చాలా తక్కువ సమయంలో సులభంగా రిజిస్ట్రేషన్లు ప్రక్రియ పూర్తవుతుంది. కేవలం బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర వేయడానికి 5 నుంచి 10 నిమిషాలు ఉంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బయట జరిగే పనిని సులభంగా ఆన్లైన్లో చేసుకోవచ్చు. దీన్ని పబ్లిక్ డేటా ఎంట్రీ ఇంటిగ్రేషన్ అంటారు. అంటే వినియోగదారులే ఆన్లైన్లో డాక్యుమెంట్ తయారు చేసుకోవచ్చు. ఆస్తి వివరాలు, పేరు, ఆధార్, సాక్షులు వంటి సమాచారాన్ని ఆన్లైన్లో ఎంటర్ చేస్తే వెంటనే ఆస్తి మార్కెట్ విలువ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలు ఎంత కట్టాలో చూపిస్తుంది. ఆ సొమ్మును ఆన్లైన్లో చెల్లించొచ్చు. ఆఫ్లైన్, స్టాక్హోల్డింగ్ ద్వారా కూడా చలానా కట్టొచ్చు. అనంతరం రిజి్రస్టేషన్కి టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ సమయానికి సబ్ రిజి్రస్టార్ కార్యాలయం లేదా గ్రామ/వార్డు సచివాలయానికి వెళితే అక్కడ అప్లికేషన్లో నమోదు చేసిన ఆధార్ వివరాలను సరి చూస్తారు. బయోమెట్రిక్ ద్వారా వినియోగదారుని వేలిముద్ర తీసుకుంటారు. రిజిస్ట్రేషన్తోపాటే సబ్ డివిజన్, మ్యుటేషన్ ఇదంతా అయిన తర్వాత ఆ ఆస్తిని సబ్ డివిజన్ చేయాల్సి వస్తే వెంటనే చేస్తారు. పాత విధానంలో రిజి్రస్టేషన్ పూర్తయ్యాక దాన్ని రెవెన్యూ శాఖలో సబ్ డివిజన్ చేయించడం ఓ పెద్ద ప్రహసనం. కార్డ్ ప్రైమ్లో రిజిస్ట్రేషన్ సమయంలోనే సబ్ డివిజన్ (అవసరమైతే) పూర్తవుతుంది. వ్యవసాయ భూములైతే మ్యుటేషన్ కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. దానికోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. రెవెన్యూ రికార్డుల్లో పేరు కూడా వెంటనే మారిపోతుంది. ఇందుకోసం కార్డ్ 2.0ని రెవెన్యూ శాఖ వెబ్ల్యాండ్ సాఫ్ట్వేర్కి అనుసంధానం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్లు డాక్యుమెంట్ను ప్రింట్ తీసి ఇస్తారు. గతంలో మాదిరిగా స్టాంప్ పేపర్ల అవసరం ఉండదు. వినియోగదారుడు కోరుకొంటే స్టాంప్ పేపర్లపై ప్రింట్ ఇస్తారు. ఈ విధానంలో వినియోగదారుడు ఎక్కడా సంతకం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ–సైన్తోనే పని పూర్తవుతుంది. సులభం.. పారదర్శకం.. కార్డ్ ప్రైమ్ ద్వారా రిజిస్ట్రేషన్ల విధానం మరింత సులభమవుతుంది. మొత్తం ప్రక్రియ ఆన్లైన్లోనే పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్లు చాలా తక్కువ సమయంలో సులభంగా, పారదర్శకంగా జరుగుతాయి. అవకతవకలకు ఆస్కారం ఉండదు. ప్రభుత్వ అనుమతితో త్వరలో దీన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. – వి. రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. ఇది కూడా చదవండి: ఏపీకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వరద.. టీడీపీకి షాకిచ్చిన రిపోర్ట్! -
ఓవైపు ధరణి.. మరోవైపు బట్వాడా సమస్యలు.. అధికారుల తీరు గిట్లుండాలే!
రాష్ట్రంలో భూముల లావాదేవీలు జరిగి నెలలు గడుస్తున్నా రైతులకు పట్టాదారు పాస్బుక్లు అందడం లేదు. ఇదేమిటని రెవెన్యూ కార్యాలయాలకు వెళితే తపాలా శాఖ ఆపేసిందని.. అక్కడికి వెళితే రెవెన్యూశాఖ నుంచి తమకు రానేలేదని చెప్తుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు వాస్తవం ఏమిటంటే.. లక్షల కొద్దీ పాస్బుక్కులు రెవెన్యూ కార్యాలయాల్లోనే గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని తపాలాశాఖ ద్వారా రైతులకు బట్వాడా చేసేందుకు సంబంధించిన చార్జీలను రెవెన్యూ శాఖ చెల్లించకపోవడమే దీనికి కారణం. పాస్బుక్ల ముద్రణ, బట్వాడా కోసం రైతుల నుంచే రూ.300 వసూలు చేస్తున్న రెవెన్యూ శాఖ.. తపాలా శాఖకు చార్జీలు చెల్లించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: భూముల రిజిస్ట్రేషన్లు అయ్యాయి.. పాస్బుక్ల ముద్రణ, తపాలా ద్వారా ఇంటికి చేర్చేందుకు బట్వాడా ఖర్చును రైతులు అప్పుడే రెవెన్యూ శాఖకు చెల్లించారు. కానీ నెలలు గడుస్తున్నా పాస్బుక్ మాత్రం చేతికి అందడం లేదు. ఒకరిద్దరు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది రైతులకు పాస్బుక్లు అందాల్సి ఉంది. ఎప్పుడో రైతుల ఇళ్లకు చేరాల్సి ఉన్న ఈ పాస్బుక్లు రెవెన్యూ శాఖ కార్యాలయాల్లోని బీరువాల్లో మూలుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి. ఇప్పటికే ధరణి సమస్యలు గందరగోళంతో రైతులు ఇబ్బంది పడుతుండగా.. ఇప్పుడు పాస్బుక్లు రాకపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చెల్లింపులు లేక బకాయిలు.. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతుల నుంచి రిజిస్ట్రేషన్ సమయంలోనే రూ.300 చొప్పున రెవెన్యూ శాఖ వసూలు చేస్తోంది. ఆ మొత్తంతో పాస్బుక్ను ముద్రించి, తపాలా శాఖ ద్వారా రైతుల ఇళ్లకు పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ములో ఒక్కో పాస్బుక్కు రూ.40 చొప్పున తపాలాశాఖకు చార్జీగా చెల్లించాలి. కానీ ఏడాది నుంచి ఈ చెల్లింపుల్లో రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. తపాలా శాఖ పాస్బుక్లను ఠంచనుగా బట్వాడా చేస్తున్నా.. అందుకు సంబంధించిన చార్జీలను ఎప్పటికప్పుడు చెల్లించడం లేదు. అప్పుడప్పుడు ఎంతో కొంత మొత్తం ఇస్తూ వస్తోంది. దీనితో బకాయిలు రూ.3 కోట్ల వరకు చేరుకున్నాయి. చార్జీల సొమ్ము చెల్లించాలని తపాలా శాఖ ఎన్నిసార్లు కోరినా రెవెన్యూ శాఖ నుంచి స్పందన లేదు. అయినా ఇప్పుడు కాకున్నా తర్వాత అయినా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో తపాలా అధికారులు బట్వాడాను కొనసాగిస్తూ వచ్చారు. ఆడిట్ అభ్యంతరాలతో.. ఇంతగా బకాయిలు పేరుకుపోతున్నా.. ఇంకా సేవలు ఎలా అందిస్తున్నారంటూ తపాలా శాఖను అంతర్గత ఆడిట్ అధికారులు ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తపాలా శాఖ బకాయిల వసూలుపై దృష్టిపెట్టింది. బకాయిలు చెల్లించకుంటే ఏప్రిల్ ఒకటి నుంచి బట్వాడా నిలిపేస్తామని రెవెన్యూ శాఖకు తేల్చి చెప్పింది. అయినా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించలేదు. దీంతో తపాలాశాఖ ఏప్రిల్ ఒకటి నుంచి పాస్బుక్ల బట్వాడాను నిలిపేసింది. ఇకపై పాస్బుక్లను పంపవద్దని స్పష్టం చేసింది. అప్పటి నుంచి రెవెన్యూ కార్యాలయాల్లోనే లక్షల సంఖ్యలో పాస్బుక్లు పేరుకుపోయాయి. తప్పుడు సమాచారంతో అటూ ఇటూ.. పాస్బుక్కులు అందకపోవడంలో తప్పు తమది కాదని.. తపాలా శాఖనే దగ్గరపెట్టుకుని పంపటం లేదంటూ కొందరు అధికారులు తప్పుడు సమాచారం ఇస్తుండటంతో రైతులు పోస్టాఫీసులకు వెళ్తున్నారు. అసలు పాస్ పుస్తకాలు తమ వద్దకు రానేలేదని, రెవెన్యూ అధికారుల వద్దనే ఉంటాయని తపాలా సిబ్బంది స్పష్టం చేస్తుండటంతో మళ్లీ రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. ఇదంతా గందరగోళంగా మారిపోయింది. చార్జీల బకాయిలు, పాస్బుక్ల బట్వాడా నిలిపివేత అంశాలపై రెవెన్యూ, పోస్టల్ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా.. స్పందించేందుకు నిరాకరించారు. ఇంతకు ముందు రవాణాశాఖలోనూ.. గతంలో డ్రైవింగ్ లైసెన్సుల విషయంలోనూ ఇదే తరహాలో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. డ్రైవింగ్ లైసెన్స్ బట్వాడా కోసం వాహనదారుల నుంచి ఫీజులు వసూలు చేసిన రవాణాశాఖ.. తపాలా శాఖకు ఆ చార్జీలను చెల్లించలేదు. ఎన్నిసార్లు అడిగినా రవాణాశాఖ స్పందించకపోవటంతో.. గతేడాది తపాలా శాఖ డ్రైవింగ్ లైసెన్సుల బట్వాడాను నిలిపేసింది. అప్పట్లో ఆ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో.. రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పందించారు. ట్రాన్స్పోర్టు అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు బకాయిల్లోంచి దాదాపు రూ.కోటి వరకు చెల్లించేలా చర్యలు చేపట్టారు. దానితో తపాలా శాఖ బట్వాడాను పునరుద్ధరించింది. ఇప్పుడు రెవెన్యూ శాఖ వంతు వచ్చింది. -
వీడిన ‘షరతుల’ చెర
భూమి(తల) రాత మార్పు నాలుగైదు తరాల నుంచి వారసత్వంగా వచ్చిన ఆ భూమి ఉన్నట్టుండి ప్రభుత్వ భూమిగా మారిపోయింది. చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో కష్టపడి అలాంటి భూమిని కొనుక్కుని, రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు అన్యాయమైపోయారు. ఆ భూమిలో పంటలు పండిస్తూ సంతోషంగా ఉన్న రైతులు ఒక్కసారిగా కుదేలైపోయారు. తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలా వేలాది మంది రైతులకు అన్యాయం జరిగింది. ఈ సమస్యలను వైఎస్ జగన్ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించింది. బ్రిటీష్ కాలం నుంచి రైతుల చేతుల్లో ఉండి, రిజిస్ట్రేషన్లు కూడా జరిగిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని.. ఆ జాబితా నుంచి వాటిని తొలగించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 17,730 సర్వే నంబర్లకు సంబంధించి 33 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసేసింది. మోడు వారిన సుమారు 50 వేల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసివేశారు. కోడూరు మండలంలో 9,600 ఎకరాలను తొలగించారు. బొల్లికొండ ఫణికుమార్ – సాక్షి, అమరావతి: ఆర్ఎస్ఆర్లో షరతులు గల పట్టా అని ఉన్న 33 వేల ఎకరాల భూములను 2016లో తెలుగుదేశం ప్రభుత్వం 22ఏ (1)ఇ జాబితాలో చేర్చడంతో రైతులు కుదేలయ్యారు. 1910లో బ్రిటీష్ ప్రభుత్వం ఈ భూములను రైతులకు వేలం ద్వారా ఇచ్చినట్లు రెవెన్యూ శాఖ భావిస్తోంది. వేలం కాదు రైతులకు అసైన్డ్ చేసిందనే వాదన కూడా ఉంది. ఏదైనా వందేళ్లకు ముందు నుంచే ఆ భూములు రైతుల చేతుల్లో ఉన్నాయి. వారికి పట్టాలుండటంతోపాటు,ఆర్ఎస్ఆర్లో వారి పేర్లు నమోదయ్యాయి. అప్పటి నుంచి శిస్తు కడుతూనే ఉన్నారు. అవసరానికి వాటిని అమ్ముకున్నారు. రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. బ్రిటీష్ హయాం నుంచి లావాదేవీలున్న ఆ భూములను 2016 మే 5న జీఓ ఎంఎస్ నెంబర్ 196 ద్వారా టీడీపీ ప్రభుత్వం 22ఏ(1)ఇ కేటగిరీలో పెట్టేసింది. అప్పటి వరకు సర్వ హక్కులతో ఏళ్ల తరబడి ఆ భూములను అనుభవించిన రైతులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. బ్యాంకు రుణాలు కూడా ఆగిపోయాయి. అప్పటికే బేరం కుదుర్చుకున్న వారు కొనడానికి ముందుకు రాలేదు. కొందరైతే కొంత డబ్బు తీసుకుని భూమిని వదులుకున్నారు. తమ కూతుళ్లకు ఆ భూమిని ఇచ్చిన తండ్రులు కొందరు అల్లుళ్లకు సమాధానం చెప్పలేక నానా బాధలు పడ్డారు. గత ప్రభుత్వం ఆ భూములపై పంట నష్టం కూడా ఇవ్వలేదు. తహశీల్దార్ నుంచి కలెక్టర్ వరకు, ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకు అనేక మంది చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ధర్నాలు చేసినా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కనికరించలేదు. దీంతో వేలాది రైతు కుటుంబాలకు తీరని కష్టంగా మారింది. జగన్ రాకతో మంచి రోజులు 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారిలో ఆశలు చిగురించాయి. తమ సమస్యను వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు చెప్పుకున్నారు. అప్పటికే ఈ సమస్యపై పోరాడిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని సీఎం ఆదేశించడంతో రెవెన్యూ శాఖ షరతులు గల పట్టా భూములపై ప్రత్యేకంగా దృష్టి సారించి అధ్యయనం చేసింది. వందేళ్ల నుంచి రైతులు అనుభవిస్తున్న భూములను 22ఏ కేటగిరీలో చేర్చడం తప్పని నిర్ధారించింది. ఒకవేళ ప్రభుత్వం రైతులకు అసైన్డ్ చేసిందనుకున్నా.. 1954కు ముందే అది జరిగింది కాబట్టి నిరభ్యంతరంగా వాటిపై రైతులకు హక్కులు ఉంటాయని తేల్చింది. దీంతో ప్రభుత్వం వాటిని రిజిస్ట్రేషన్ల చట్టం 1908 22ఏ(1)ఇ కేటగిరీ నుంచి తొలగిస్తూ 2022 అక్టోబర్ 7న జీఓ ఎంఎస్ నంబర్ 667ను జారీ చేసింది. గత ఏడాది అక్టోబర్ 20న అవనిగడ్డలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్.. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. బ్యాంకు రుణాలు వస్తున్నాయి. ఆ భూములను సర్వ హక్కులతో రైతులు అనుభవిస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఈ షరతుల బారిన పడిన ఏ రైతును కదిలించినా జగన్ ప్రభుత్వం తమకు చేసిన మేలు మరచిపోలేమని భావోద్వేగంతో చెబుతున్నారు. నా జీవితాన్ని నిలబెట్టారు.. షరతులు గల పట్టా పేరుతో నా లాంటి వేల మంది రైతుల జీవితాలను గత ప్రభుత్వం తలకిందులు చేస్తే, ప్రస్తుత సీఎం జగన్ మళ్లీ జీవితాలు ఇచ్చారు. నాకు 7.21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. మా తాత అల్లపర్తి రామబ్రహ్మం నుంచి మా నాన్న రాధాకృష్ణకు, ఆయన నుంచి నాకు ఆ భూమి వచ్చింది. 1920 నుంచి ఆ భూమిని మా కుటుంబం సాగు చేసుకుంటోంది. అప్పటి నుంచి శిస్తు కట్టాం. అవసరమైనప్పుడు బ్యాంకుల్లో తనఖా పెట్టాం. ఏటా పంట రుణాలు తీసుకున్నాం. మూడు తరాల నుంచి మాకున్న భూమిని 2016లో ఉన్నట్టుండి ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. బ్యాంకు రుణం కోసం వెళితే ప్రభుత్వ భూమి కాబట్టి ఇవ్వమన్నారు. పంట దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. తనఖా పెట్టడానికి, అమ్ముకోవడానికి అవకాశం లేదు. భూమి చేతిలోనే ఉంది.. కానీ ఎందుకూ పనికిరానిదిగా మారిపోయింది. నా కూతురు పెళ్లి చేసినప్పుడు ఉన్న భూమిలో కొంత ఆమెకు ఇచ్చా. అది విలువ లేనిదంటూ ఆమె ఇబ్బందులు ఎదుర్కొంది. ఎంత మంది చుట్టూ తిరిగామో లెక్కలేదు. మేం పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో వైఎస్ జగన్ ఆపద్భాందవుడిలా మమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పుడు సర్వ హక్కులూ వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. – అల్లపర్తి హరి మోహనరావు, భావదేవరపల్లి, నాగాయలంక మండలం, కృష్ణా జిల్లా మా పొలం మాకు దక్కింది కోడూరు మండలం మాచవరంలో సర్వే నంబర్ 446/ఏలో నాకు 83 సెంట్ల పొలం ఉంది. 2006లో బడే వాసుదేవరావు నుంచి కొనుగోలు చేశాం. రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఏడాది క్రితం నా భర్తకు గుండె సమస్య రావడంతో బైపాస్ చేయాలని చెప్పారు. రూ.6 లక్షలు అవసరమవడంతో పొలం అమ్ముదామని బేరం పెడితే ఇది రిజిస్ట్రేషన్కు పనికిరాదన్నారు. కో ఆపరేటివ్ సొసైటీ రుణం కోసం వెళ్లినా ఇవ్వలేదు. పంట నష్టం కూడా ఇవ్వలేదు. చాలా బాధపడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చాక మా పొలాన్ని మాకు దక్కేలా చేశారు. షరతులు గల పట్టా నుంచి తీసి దానిపై మాకు పూర్తి హక్కు కల్పించారు. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వం మేలు మరచిపోము. – సనకా గోవర్ధన, వి.కొత్తపాలెం, కోడూరు మండలం పనికి రాదన్న భూమికి విలువ వచ్చింది నా తండ్రి సనకా కృష్ణమూర్తి నాకు 2.20 ఎకరాలు ఇచ్చారు. 2003లోనే దాన్ని నా పేరుతో రిజిష్టర్ చేసి అప్పగించారు. అప్పటి నుంచి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ అన్ని హక్కులతో ఉపయోగించుకున్నాం. 2018లో పెద్ద రుణం (ఎల్టీ లోన్) కోసం బ్యాంకుకు వెళితే ఈ భూమి 22ఏ జాబితాలో ఉందని, రాదని చెప్పారు. చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు దాన్ని సరి చేశారు. జగన్ ప్రభుత్వానికి ఎంతో రుణ పడి ఉంటాం. పనికిరాదన్న మా భూమికి తిరిగి విలువ కల్పించారు. – రేపల్లె నాగరాజ, వి.కొత్తపాలెం, కోడూరు మండలం ఎంతో సంతోషంగా ఉన్నాం 2001లో మా గ్రామంలోని సర్వే నంబర్ 226/1, 228/1లో 3.31 ఎకరాలు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. 2017 తర్వాత అందులో ఒక ఎకరం మా అబ్బాయి పేరు మీద మార్చాలని వెళితే ఇది 22–ఏ జాబితాలో ఉన్నందున కుదరదన్నారు. చాలా మంది చుట్టూ తిరిగాం. ఎవరూ పట్టించుకోలేదు. అన్నం పెట్టే భూమిని ఇలా చేశారేంటని చాలా బాధ పడ్డాం. ఇప్పుడు దాన్ని సరి చేశారు. అమ్ముకోవడానికి, నా కొడుకు పేర రాయడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సంతోషంగా ఉంది. – చిట్టిప్రోలు రామ్మోహనరావు, లింగారెడ్డిపాలెం, కోడూరు మండలం, కృష్ణా జిల్లా -
నిషేధిత జాబితా (22A)పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వివరణ
సాక్షి, తిరుపతి: భూముల రిజస్ట్రేషన్ కు సంబంధించిన నిషేధిత జాబితా (22A)పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మంగళవారం వివరణ ఇచ్చారు. గత ఐదు రోజులకు ముందు తిరుపతిలో భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి గందరగోళం ఏర్పడిందని తెలిపారు. కొంతమంది బాధితులు తన దగ్గరకు వచ్చి జరిగిన విషయాన్ని తెలియజేశారని చెప్పారు. ఒక బాధ్యత గల శాసనసభ్యుడుగా బాధితుల ముందరే ముఖ్యమంత్రి కార్యాలయంతోను, ఐ.జి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ వారితోను, ఎండోమెంట్ కమిషనర్ గారితోను మాట్లాడానని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు ‘సమస్య గురించి నేను మాట్లాడిన తర్వాత వారు టి.టి.డీ అధికారులకు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కు తగిన ఆదేశాలు ఇచ్చారు. టి.టి.డి జె.ఇ.ఓ, ఎస్టేట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని సమావేశపరచి సమస్యను వెను వెంటనే సరిదిద్దమని ఆదేశిస్తూ.. అందుకు సంబంధించి ఒక లేఖను జె.ఇ.ఓ గారి ద్వారా ఎండోమెంట్ కమిషనర్ గారికి రాయించడం కూడా జరిగింది. టి.టి.డి. కూడా జరిగిన పొరబాటును సరిదిద్దే ప్రక్రియ చేపట్టింది. వేగవంతంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్యను పరిష్కరించి రిజిస్ట్రేషన్ లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాది. నేను ఎప్పుడూ ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేసేవాడినే కానీ స్వప్రయోజనాల కోసం పనిచేసే వాడిని కాదు. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తమ రాజకీయ స్వలాభం కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు చేసే అవాస్తవ ప్రచారం నమ్మొద్దు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా నేను ఎంతకైనా పోరాడే వ్యక్తినీ. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది’అని భూమన పేర్కొన్నారు. -
నిషేధం ఉన్నా రిజిస్ట్రేషన్లు చేశారు: రఘునందన్రావు
సాక్షి, హైదరాబాద్: హఫీజ్పేటలోని సర్వే నంబర్ 78కి సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయడానికి వీల్లేదని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) 2007లో జీవో నంబర్ 863 జారీ చేయడంతోపాటు 2012లో సర్క్యులర్ జారీ చేసినా రెవెన్యూ అధికారులు వందలాది రిజిస్ట్రేషన్లు చేశారని, ఎన్ఓసీలు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు ఆరోపించారు. అలాగే ఆయా భూముల్లో నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు మంజూరు చేశారన్నారు. నిబంధనలున్నవి సామాన్యులు, పేదలకేనా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారికి లేఖ రాశారు. శుక్రవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ లేఖను విడుదల చేశారు. ఓ నగల వ్యాపారి ఎగ్గొట్టిన రూ. 119 కోట్ల రికవరీలో భాగంగా అతను తనఖా పెట్టిన ఆ సర్వే నంబర్లోని 8 ఎకరాలను బ్యాంకులు వేలం వేసేందుకు ప్రయతి్నస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్లి అడ్డుకున్న అధికారులు.. వారికి నచి్చన సంస్థలకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్నారు. చదవండి: 'దక్షిణాదిన కేసీఆర్.. ఉత్తరాదిలో కేజ్రీవాల్.. చీల్చే పని వీళ్లదే..' -
Telangana: కొత్త రెవెన్యూ చట్టం.. రెండేళ్లయినా బాలారిష్టాలే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. 1971 నాటి ఆర్వోఆర్ చట్టం స్థానంలో 2020 అక్టోబర్ 30 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఇంకా బాలారిష్టాలను దాటని పరిస్థితి. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ విషయంలో కొత్త చట్టంతో మేలు జరిగినా.. అదే సమయంలో భూముల సమస్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం చట్టంలో మరిన్ని మార్పులు చేయాల్సి ఉందని, స్పష్టమైన అధికారాలను కల్పించి రెవెన్యూ యంత్రాంగాన్ని పటిష్టం చేసినప్పుడే ఈ చట్టం మంచి ఫలితాలు ఇస్తుందని పేర్కొంటున్నారు. కొత్త చట్టం లక్ష్యం ఇదీ.. రాష్ట్రంలో మొత్తం 124 రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఇందులో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం భూసంబంధిత అంశాల్లో చాలా ప్రధానమైంది. 1971 నుంచి 2020 అక్టోబర్ 29 వరకు అమల్లో ఉన్న ఈ చట్టానికే రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. భూముల మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయడం.. భూసంబంధ సమస్యలన్నీ పరిష్కరించడం.. రెవెన్యూ పాలనలో పారదర్శకత తీసుకురావడం.. రెవెన్యూ యంత్రాంగానికి ఉన్న విచక్షణాధికారాలు ఎత్తివేసే విధంగా మార్పులు చేయడం లక్ష్యంగా కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించింది. మరి ఏం జరిగింది? ఈ చట్టం అమల్లోకి వచ్చిన రెండేళ్లలో రైతులకు జరిగిన ప్రయోజనం ఏమిటంటే.. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలు వేగంగా జరిగి పాసు పుస్తకాలు త్వరగా చేతికి అందడమే. రిజిస్ట్రేషన్ల తర్వాత గతంలోలా నెలల తరబడి మ్యుటేషన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. రికార్డు పూర్తిగా కంప్యూటర్లో నిక్షిప్తమవుతోంది. కానీ ఈ చట్టం పరిధిలోకి వచ్చే ధరణి పోర్టల్ కారణంగా సమస్యలు భారీగా పెరిగాయి. 2006లో వచ్చిన కోనేరు రంగారావు కమిటీ నివేదిక ప్రకారం 2012– 13లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అందిన దర ఖాస్తుల ప్రకారం ప్రతి గ్రామంలో 50 నుంచి 100 వరకు భూసమస్యలు ఉండగా.. అవి ఇప్పుడు 200 వరకు చేరాయన్నది ఓ అంచనా. సిద్దిపేట జిల్లా లోని ఓ గ్రామంలో దరఖాస్తులు స్వీకరిస్తే 277 భూసంబంధిత సమస్యల దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గతంలో ఉన్న ఆర్డీవో, జేసీ కోర్టులు రద్దు కావడంతో భూసమస్యలు వస్తే సివిల్ కోర్టులకు వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. ఇక ధరణి పోర్టల్లో నమోదవుతున్న సమస్యలను పరిష్కరించే అధికారాలు చ ట్టం ప్రకారం కలెక్టర్లకు లేవు. అయినా వారు పరిష్కరిస్తున్నారు. కానీ లక్షలకొద్దీ సమస్యలను 33 మంది కలెక్టర్లు పరిష్కరించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు. ఇక కొత్త చట్టంలో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఎలాంటి నియమం పొందుపరచలేదని, దీంతో దాదాపు 9లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్లో పడ్డాయని తెలుస్తోంది. ఆ చట్టాల అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి ఇప్పటివరకు రాష్ట్రంలో నాలుగు ఆర్వోఆర్ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాల అమలు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆర్వోఆర్ చట్టం మాత్రమే కాకుండా మిగతా 123 చట్టాలను కూడా మార్చి ఒకే చట్టాన్ని అమల్లోకి తేవాలి. అప్పుడే భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుంది – భూమి సునీల్కుమార్, భూచట్టాల నిపుణుడు ఎన్నో రకాల సమస్యలతో.. ఇక భూయజమాని బయోమెట్రిక్ లేకుండా రికార్డుల్లో మార్పులు జరగవని, కొత్త చట్టం అమలుతో కోర్ బ్యాంకింగ్ తరహాలో రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటవుతుందని ప్రభుత్వం చెప్పింది. కానీ భూయజమానికి తెలియకుండానే రికార్డులు మారిన ఘటనలు అనేకం కనిపించాయి. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్–బి కింద నమోదు చేసిన సుమారు 10లక్షల ఎకరాల భూముల సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇనాం, పీవోటీ కేసులు, 38(ఈ) కింద రక్షిత కౌలుదారులకిచ్చే సర్టిఫికెట్, ఎల్టీఆర్ (భూబదలాయింపు చట్టం) అధికారాలను ఈ చట్టం తమకు కల్పించలేదని రెవెన్యూ యంత్రాంగం చెప్తోంది. గత చట్టంలో రెవెన్యూ సిబ్బందికి ఉన్న అధికారాలను కొత్త చట్టం ద్వారా ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటోంది. ఇప్పుడేం చేయాలి? కొత్త చట్టం ద్వారా రాష్ట్రంలోని భూసమస్యల పరిష్కారానికి వెంటనే కొన్ని మార్పులు చేయాల్సి ఉందని భూచట్టాల నిపుణులు చెప్తున్నారు. ఆర్వోఆర్ చట్టం కింద రాసుకునే రికార్డు (ధరణి రికార్డు)ను సవరించే అధికారాన్ని క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించాలని.. ఈ అధికారాలు ఇప్పుడున్న అధికారులకు అప్పగించడమా లేక ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడమా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆర్వోఆర్ చట్టంలో నియమాన్ని అత్యవసరంగా చేర్చాలని, 1971 ఆర్వోఆర్ చట్టంలో ఉన్న సెక్షన్ 5(ఏ)ను యథాతథంగా కొత్త చట్టంలోకి సంగ్రహించాలని.. ఈ చట్టం కింద ధరణిలో మార్పులను గ్రామాలకు పంపి సవరించాలని స్పష్టం చేస్తున్నారు. -
చాలా రిచ్.. కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి.. ఎక్కడో తెలుసా?
విదేశాల్లో పెంపుడు జంతువుల పేర్ల మీద కోట్ల ఆస్తులు వీలునామా రాసిన ఘటనలు విన్నాం. కానీ మనదేశంలో కోతుల పేరు మీద భూమి ఉండటం అరుదే. మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని ఉప్లా గ్రామంలో కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి ఉంది. ఈ విషయం గ్రామ పంచాయతీ రికార్డుల్లో స్పష్టంగా రాసి ఉంది. అటవీ శాఖ మొక్కలు నాటిన ఆ భూమిలో శిథిలావస్థలో ఉన్న ఓ ఇల్లు కూడా ఉంది. ఈ భూమి కోసం గొడవలవుతున్నాయి. నగరాల్లో గజం జాగ కొనాలంటే గగనమవుతోంది. అలాంటిది కోతులకు 32 ఎకరాల భూమి ఎలా వచ్చింది? అసలు జంతువుల పేరు మీద రిజిస్టర్ ఎలా చేశారు? ఎవరు రిజిస్టర్ చేశారు? అనేక సందేహాలు వస్తున్నాయి కదా! ‘కానీ.. ఎవరు రిజిస్టర్ చేశారు? ఎలా చేశారు?’అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదని చెబుతున్నాడు ఆ గ్రామ సర్పంచ్ బప్పా పడ్వాల్. అక్కడ కోతుల పేరుమీద భూమి ఉండటమే కాదు, వాటికి ఎనలేని గౌరవం కూడా ఉంది. ఉప్లా గ్రామవాసులు కోతులకు ఒకప్పుడు ఇంకా ఎక్కువ మర్యాద ఇచ్చేవారు. వేడుక ఏదైనా కోతులకు ప్రత్యేక స్థానం ఉండేది. పెళ్లిళ్లు అయితే.. ముందు వాటికి కానుకలు ఇచ్చిన తరువాతే వేడుక మొదలయ్యేది. ఇప్పుడు ఆ ఆచారాన్ని తక్కువ మంది పాటిస్తున్నారు. అయినా ఇప్పటికీ... కోతులు ఇంటిముందుకొస్తే ఆహారం మాత్రం కచ్చితంగా పెడతారు. -
భూ హక్కుకు.. శ్రీరామరక్ష!
సాక్షి, అమరావతి: భూముల హక్కుదారుల భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులేస్తోంది. భూమిపై కచ్చితమైన యాజమాన్య హక్కులను నిర్థారించేందుకు సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ధ్రువీకరించిన భూ యాజమాన్య హక్కుల(కన్ఫర్మ్డ్ టైటిల్ విధానం) వివరాలతో ప్రత్యేక రిజిస్టర్ల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భూ హక్కు యాజమాన్య చట్టంలో కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా కీలక మార్పులు చేసింది. కొత్తగా రూపొందించిన భూ హక్కు యాజమాన్య చట్టానికి శాసనసభ ఆమోదం తెలిపింది. వివాదాల పరిష్కారానికి సరికొత్త మార్గం పలు వివాదాలతో ప్రస్తుతం భూముల యాజమాన్యం అత్యంత సంక్లిష్టంగా మారిన విషయం తెలిసిందే. వివాదాలు లేకుండా ఉన్న కచ్చితమైన భూ హక్కుదారుల వివరాలు తెలుసుకోవడం క్లిష్టంగా మారింది. కన్ఫర్మ్డ్ టైటిల్ విధానంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) సాయిప్రసాద్ చెప్పారు. దేశంలో భూమిపై హక్కుల్ని నిర్థారించే అధికారం సివిల్ కోర్టులకు మాత్రమే ఉంది. ఒక వ్యక్తి అంతా సక్రమంగా ఉందని భావించి భూమి కొనుగోలు చేశాక, దానిపై తనకూ హక్కు ఉందని ఎవరైనా కోర్టుకు వెళితే అది వివాదంలో కూరుకుపోతోంది. అన్ని ఆధారాలు పరిశీలించి సివిల్ కోర్టు చేసిన నిర్థారణే ఇలాంటి కేసుల్లో అంతిమం. ఆ భూమిపై పలానా వ్యక్తికి మాత్రమే హక్కు ఉందని కచ్చితంగా చెప్పే వ్యవస్థ రెవెన్యూ శాఖలో లేదు. రెవెన్యూ రికార్డులు, ఆస్తుల్ని రిజిస్టర్ చేసే విధానం కూడా ఇలాంటి వివాదాలకు పరష్కారాలు సూచించేలా లేదు. వీటన్నింటికీ కన్ఫర్మ్డ్ టైటిల్ విధానం పరిష్కారం చూపనుంది. భూ యాజమాన్య హక్కుల రిజిస్టర్లు భూముల రీ సర్వే జరుగుతున్న క్రమంలో ప్రతి గ్రామంలో ధ్రువీకరించిన భూ యాజమాన్య హక్కుల రిజిస్టర్లు తయారవుతాయి. ఆ రిజిస్టర్లలో ఆ గ్రామానికి చెందిన పక్కా యాజమాన్య హక్కులున్న భూముల వివరాలుంటాయి. ఎవరైనా ఆ భూములపై వివాదాలు సృష్టించేందుకు కోర్టుకెళ్లినా.. ఈ రిజిస్టర్ల ఆధారంగా కోర్టు వాటిని కొట్టేస్తోంది. దీనివల్ల భూ యజమానులకు భద్రత ఏర్పడుతుంది. ఇందుకోసమే అనేక మార్పులతో కొత్త భూ హక్కు యాజమాన్య చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో ఉన్న స్థిరాస్తుల రికార్డులను తయారు చేసి వాటిని పక్కాగా నిర్వహిస్తారు. ఈ హక్కుల రికార్డుల ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేందుకు వీలవుతుంది. భూములకు సంబంధించిన డిజిటల్ రికార్డులు తయారవుతాయి. ఈ రికార్డుల నిర్వహణ బాధ్యతలు చూసేందుకు కొత్తగా రాష్ట్ర స్థాయిలో భూ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయనున్నారు. దీని చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి హోదాకు తగ్గని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ సంస్థ భూమి హక్కుల రియల్ టైమ్ డేటాను తయారు చేసి వాటిని నిర్వహిస్తుంది. హామీతో కూడిన హక్కుల యాజమాన్య విధానం అమల్లోకొస్తుంది. -
‘ధరణి’ దారికొచ్చేనా..? రెండేళ్లయినా పరిష్కారం కాని సమస్యలు
సాక్షి,మేడ్చల్ జిల్లా: రాష్ట్రంలో భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 2020 అక్టోబర్ 20న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పోర్టల్ను ప్రారంభించారు. పైసా లంచం చెల్లించకుండా పారదర్శకంగా భూ సమస్యలు పరిష్కారమయ్యేలా ధరణి పోర్టల్ను రూపొందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే అదే పోర్టల్ పెద్ద సమస్యగా మారింది. ధరణితో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని భావిస్తే కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో 50 శాతం ఫిర్యాదులు ధరణి పోర్టల్కి సంబంధించినవే వస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం బాధితులు నెలల తరబడి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం కొన్ని కొత్త ఆప్షన్లు ధరణిలో పొందుపర్చినా అవసరమైనవి లేకపోవడంతో భూమి కొనుగోళ్లు, అమ్మకాలు, మ్యూటేషన్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ధరణి సమస్యలపై తొలుత తహసీల్దార్ రికార్డులను పరిశీలించి సరైన నివేదికను కలెక్టర్కు పంపిస్తే పరిష్కారం లభిస్తోంది. అయితే తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్కు నివేదికలు పంపించడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. ఇందుకు పోర్టల్లోని సాంకేతిక లోపాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల సర్కారు కొన్ని మాడ్యూల్స్కు అవకాశం కల్పించినా అమల్లో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదు. పని చేయని కొత్త ఆప్షన్.. ప్రభుత్వం ఇటీవల టీ ఎం–33 (పాసు పుస్తకాల్లో డేటా కరెక్షన్) ఆప్షన్ ద్వారా చేర్పులు, మార్పులు చేసేందుకు అవకాశం కల్పించింది. విస్తీర్ణంలో హెచ్చుతగ్గుల సవరణకు రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే తహసీల్దార్ పరిశీలన చేసి కలెక్టర్కు పంపించాల్సి ఉంది. అయితే ఈ ఆప్షన్ సరిగా పనిచేయనందున ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితి మారింది. దీంతో దరఖాస్తుదారులకు ఆరి్థక ఇబ్బందులు తప్పడం లేదు. మీసేవాలో దరఖాస్తు చేసుకునేందుకు రూ.1500 వరకు ఖర్చు అవుతోందని, అయినా పని కావడం లేదని ఓ రైతు వాపోయాడు. ఈసీ ధ్రువపత్రాల జారీకి అవకాశం కల్పించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్డేట్ చేయించినా సిస్టమ్లో జనరేట్ కావడం లేదు. నిషేధిత జాబితా(పీవోబీ) మాడ్యుల్లోని భూముల పరిస్థితి సైతం ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కొనుగోలుదార్లకు ఇబ్బందులు.. ధరణి పోర్టల్ ప్రారంభ సమయంలో తలెత్తిన లోపాలను సవరించే క్రమంలో భూ లబ్ధిదారులకు తిప్పలు తప్పట్లేదు. కొందరు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ భూమి జాబితాలో పట్టా భూములు, సర్వే నంబర్లలో లోపాలతో ఎన్నో ఏళ్లుగా ఉన్న భూములను అవసరానికి అమ్ముకోలేని దుస్ధితి ఏర్పడింది. గతంలో అమ్మిన వారి పేరుపైనే పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తుండడంతో కొనుగోలుదార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా పలు రకాల కారణాలు చెప్పి అధికారులు తిరస్కరిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు అమ్ముకోలేక పోతున్నాం గత కొన్నేళ్లుగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కుందనపల్లిలో 20 మంది కలిసి ఇంటి స్థలాలు తీసుకున్నాం. గోధుమకుంటలో ఇదే సర్వే నంబర్తో ఉన్న వ్యవసాయ భూమి నిషేధిత జాబితాలో ఉండటంతో మా ఇంటి స్థలాలను సైతం అదే జాబితాలో చేర్చారు. దీంతో క్రయవిక్రయాలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాం. – శ్రీనివాస్రావు, దమ్మాయిగూడ మొర పెట్టుకున్నా పరిష్కారం లేదు ఏన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తన మూడు ఎకరాల వ్యవసాయ భూమిలోని 25 గుంటలు ధరణి పోర్టల్లో నమోదు కాలేదు. సరి చేయాలని మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకుని తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. – ఎన్.కృష్ణయాదవ్, కీసర మండలం -
అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు.. నిషేధిత భూములనూ వదలని వైనం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అడ్డుగోలుగా రిజిస్ట్రేషన్ల దందా సాగించారు. నిబంధనలతో నిమిత్తం లేదు. ఫీజు టూ ఫీజ్ చెల్లించి ఆపైన భారీగా ముట్టచెప్పితే చాలు ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్ల చేస్తా రు. రెడ్మార్క్లో ఉన్నా, నిషేధిత భూములైనా, నాన్ లేఅవుట్ అయినా ఇలా ఏ భూమి అయినా కా సులు ఇస్తే ఉమ్మడి పశ్చిమగోదావరిలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. జిల్లాలోని 9 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గడిచిన మూడేళ్లలో 500కుపైగా ఈ తరహా రిజిస్ట్రేషన్లు జరిగాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖపై వరుస ఫిర్యాదులు అందుతుండటంతో ప్రభు త్వం సీరియస్గా తీసుకుంది. దీనిలో భాగంగా విజి లెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమగ్ర దర్యాప్తు నిర్వహించగా ప్రతి సబ్ రిజిస్ట్రా్టర్ కార్యాలయాల్లో పదుల సంఖ్యలో అడ్డగోలు రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అవినీతికి చిరునామాగా.. జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అవినీతికి చిరు నామాగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉండే భూములకు డాక్యుమెంట్లు సృష్టించి మరీ రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ప్రభుత్వం 22ఏ, రెడ్మార్క్, నిషేధిత భూములు, నాన్ లేఅవుట్ సర్వే నంబర్లు అ న్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపి ఆ రిజిస్ట్రేషన్లను చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది. నిషేధిత భూములు, 22ఏ భూములు కలెక్టర్ అనుమతితో నిషేధిత జాబితా నుంచి తొలిగించిన తరువాత మాత్రమే సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించాలి. అయితే జిల్లాలో భిన్నంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రధానంగా ఏలూరు, పాలకోడేరు, ఉండి, వీరవాసరం, మొగల్తూరు, నరసాపురం, పాలకొల్లు, అత్తిలి, భీమవరం సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పదుల సంఖ్యలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా నిర్ధారించారు. మరీ ముఖ్యంగా కోర్టు వివాదాల్లో ఉన్న భూములను కూడా రిజిస్ట్రేషన్లు చేశారు. దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ 2019 నుంచి 2022 వరకు పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించింది. దీనిలో భాగంగా అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిషేధిత భూముల జాబితాను తీసుకుని ఆ జాబితాలోని నంబర్లతో జరిగిన రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. దాదాపు మూడు నెలలకుపైగా విజిలెన్స్ అధికారులు శ్రమించి పూర్తిస్థాయిలో రికార్డులు పరిశీలించారు. అయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనేక అక్రమాలు జరిగినట్లు తేలింది. సగటున 30కి పైగా.. ప్రధానంగా నాన్లేఅవుట్ భూముల్లో ప్లాట్ల కొనుగోలుపై ప్రభుత్వం నిషేధం విధించింది. నాన్లేఅవుట్ను ముందుగా ల్యాండ్ కన్వర్షన్ చేసి సంబంధిత రుసుం చెల్లించి డీటీసీపీ నుంచి అనుమతి తీసుకుని అప్రూవ్ లేఅవుట్గా మార్చి విక్రయాలు చేయాలి. అయితే దీనికి విరుద్ధంగా నాన్ లేఅవుట్లల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. నిషేధిత భూములు, నాన్లేవుట్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా మొగల్తూరు, నరసాపురం, అత్తిలి, భీమవరం, ఏలూరులో అత్యధికంగా జరిగాయి. ఈ ఐదు కార్యాలయాల్లో సగటున 30కుపైగా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్ధారించారు. మొత్తంగా 9 కార్యాలయాల్లో 500లకుపైగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయగా, భీమవరంలోనే ఎక్కువగా జరిగినట్టు సమాచారం. భారీ గోల్మాల్ ఏలూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అయితే వట్లూరు గ్రామంలో ఒక ఎన్ఆర్ఐకు చెందిన 8 ఎకరాల భూమి విషయంలో భారీ గోల్మాల్ జరిగినట్టు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా ఎకరా నుంచి 5 ఎకరాలలోపు నాన్లేఅవుట్లు వేసి పదుల సంఖ్యలో వ్యక్తులకు విక్రయించి రిజిస్ట్రేషన్లు చేయించేశారు. దీనిపై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రత్యక్షంగా గండికొట్టారు. 500లకుపైగా డాక్యుమెంట్లల్లో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమగ్ర విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు సమాచారం. అలాగే కొందరు సబ్రిజిస్ట్రార్లు, కొన్ని కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లపైనా చర్యలకు సిఫార్సు చేశారు. (క్లిక్: ఏలూరులో ఏసీబీ సోదాలు.. రికార్డుల తనిఖీ) -
జూన్ నాటికి రూ.109 కోట్లతో రిజిస్ట్రేషన్స్
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో భూ రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతున్నాయి. గతంలో కరోనా వల్ల కొంత వెనుకబడినా ఈ ఏడాది మాత్రం రిజిస్ట్రేషన్స్ దూకుడు కొనసాగుతోంది. రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకువస్తుండడంతో మొదటి మూడు నెలల త్రైమాసికంలో రూ.2 కోట్ల రాబడిని రిజిస్ట్రేషన్ శాఖ రాబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరంగాలకు చేయూతనిస్తుండడంతో రిజిస్ట్రేషన్స్కు సంబంధించి క్రయవిక్రయాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత వేగంగా రిజిస్ట్రేషన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రాబడి పెరుగుతోంది. జిల్లాలోని కందుకూరు, అల్లూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, కావలి, కోవూరు, ముత్తుకూరు, పొదలకూరు, రాపూరు, ఉదయగిరి, వింజమూరు, నెల్లూరు, నెల్లూరులోని స్టౌన్హౌస్పేట, బుజబుజనెల్లూరులలో మొత్తం 15 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కాగా ఏప్రిల్ నుంచి జూన్ నెల మొదటి త్రైమాసికంలో టార్గెట్ను ఆ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ మూడు నెలలకు గాను 15 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రూ.107 కోట్లు టార్గెట్ రావాల్సి ఉంది. కాగా రూ.109 కోట్ల టార్గెట్ను పూర్తి చేయడం గమనార్హం. 37 వేల రిజిస్ట్రేషన్స్ జిల్లాలోని 15 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధిచి గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పరిశీలిస్తే 16 వేల డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ కాగా, కేవలం రూ.60 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. గతేడాది కరోనా ప్రభావంతో రాబడి తగ్గిందని తెలుస్తోంది. కానీ ఈ ఏడాది 37,700 డాక్యుమెంట్స్ రిజి స్ట్రేషన్స్ కాగా, రూ.109 కోట్ల రాబడిని రిజి స్ట్రేషన్స్ శాఖ రాబట్టడం గమనార్హం. నెల్లూరు ముందజ.. రాపూరు వెనుకంజ రిజిస్ట్రేషన్స్ పరంగా జూన్ వరకు పరిశీలిస్తే 15 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో నెల్లూరు ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయం రూ.40.79 కోట్లతో ముందంజలో ఉండగా రాపూరు కార్యాలయం రూ.53.58 లక్షలతో వెనుకంజలో ఉంది. మిగిలిన కార్యాలయాలు కూడా అన్నింటిలో రాబడిలో దూకుడుగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం చిన్నా, పెద్ద పరిశ్రమలతోపాటు ఇతర నిర్మాణ రంగానికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తుండడంతో క్రయవిక్రయదారులు ముందుకువస్తున్నారు. అన్నివర్గాల ప్రజలు క్రయవిక్రయాలు చేస్తుండడంతో రిజిస్ట్రేషన్స్ ద్వారా రాబడి పెరుగుతోంది. ప్రధానంగా పెండింగ్లో ఉన్న నాన్ టీడీసీపీ లేఅవుట్లకు కూడా ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో కొనుగోలుదారులకు ఇబ్బందులు లేకుండాపోయాయి. రానున్న రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్స్ మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు – 15 మొదటి త్రైమాసికంలో రాబడి – రూ.109 కోట్లు అన్నివిధాలుగా సేవలు అందిస్తున్నాం జిల్లాలోని 15 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో వినియోగదారులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నాం. అన్నివర్గాల ప్రజలకు సంబంధించి, ఎలాంటి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నా, చిన్నచిన్న సాంకేతి సమస్యలు వస్తే తప్ప, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. – కిరణ్కుమార్, డీఐజీ, రిజిస్ట్రేషన్స్ -
దారికొచ్చిన ‘ధరణి’..! వెబ్సైట్లో కొత్త ఆప్షన్లు
మోర్తాడ్ బాల్కొండ/నిజామాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, తక్షణ మ్యుటేషన్ కోసం రూపొందించిన ధరణి వెబ్సైట్లో కొత్త ఆప్షన్లను ఇచ్చారు. ఫలితంగా కొంత కాలంగా పరిష్కారం కాని అనేక సమస్యలకు దారి చూపడానికి అవకాశం ఏర్పడిందని అధికార యంత్రాంగం చెబుతుంది. ధరణి వెబ్సైట్ అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర కాలం అవుతుంది. కొన్ని ఆప్షన్లను ఇవ్వడంతో కేవలం డిజిటల్ పట్టా పాసు పుస్తకం ఉండి ఎలాంటి తప్పు లు లేని భూమి పట్టా మార్పిడి మాత్రమే జరిగింది. చదవండి👉 Teenmar Mallanna: బీజేపీకి తీన్మార్ మల్లన్న గుడ్ పార్ట్–బీలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించి పట్టా పాసు పుస్తకాలను జారీ చేయడం, పట్టా మార్పిడి చేయడం వీలు పడలేదు. కొన్ని ఆప్షన్లు ఇచ్చి ప్రధాన ఆప్షన్లను ఇవ్వకపోవడంతో భూముల పట్టా మార్పిడి జరగకపోవడం, వివాదాలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. ధరణిలో తాజాగా పాస్ బుక్కులలో పేర్ల మార్పు, భూమి స్వభావం, వర్గీకరణ, భూమి రకం, విస్తీర్ణం లెక్కలను సరి చేయడం, మిస్సింగ్ సర్వే నంబర్లను గుర్తించి వాటిని ఎక్కించడం, సబ్ డివిజన్ల చేర్పు, నేషనల్ ఖాతా నుంచి పట్టా భూమి మార్పు, భూమి అనుభవంలో మార్పులకు అవకాశం ఏర్పడింది. ఇలా పలురకాల ఆప్షన్లను ఇవ్వడంతో అనేక సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి మా ర్గం సుగమమైందని తహసీల్దార్లు చెబుతున్నారు. చదవండి👉🏻 దయాకర్కు నోటీసులు.. మదన్మోహన్కు హెచ్చరిక కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం ధరణిలో ఇచ్చిన కొత్త ఆప్షన్లను పరిశీలిస్తున్నాం. గతంలో పెండింగ్లో ఉన్న సమస్యలను ఎంత మేరకు పరిష్కరించవచ్చో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. కొత్త ఆప్షన్లతో ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. – శ్రీధర్, తహసీల్దార్, మోర్తాడ్ -
‘మామూలు’ ఇస్తే.. ఆ ఒక్కటీ సరైపోతుందని హింట్
సాక్షి, ఆదిలాబాద్: ఓ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్.. ఎర్ర చందనం అక్రమ రవాణాకు భారీగా లంచం తీసుకుంటాడు. డబ్బంతా లెక్కబెట్టిన తర్వాత ఒక్కటి తగ్గింది అంటాడు.. అన్నీ సరిగానే ఉన్నాయి కదా అని చెప్పినా.. ఒక్కటి తగ్గింది అంటూ టార్చర్ పెడతాడు.. అచ్చం ఇలాగే ఉంది ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల తీరు. భూమి రిజిస్ట్రేషన్ కోసం అన్ని పత్రాలు సక్రమంగా తీసుకుని వెళ్లినా.. ఒక్కటి తగ్గింది అంటూ కొర్రీలు పెడుతున్నారు. డాక్యుమెంట్పైనే కోడ్ రాసి డాక్యుమెంట్ రైటర్ ద్వారా ఏం తగ్గిందో హింట్ ఇస్తారు. ఆమేరకు ముట్టజెబితే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సాఫీగా అయిపోతుంది. లేదంటే అంతే.. ఆంగ్ల అక్షరమే కోడ్.. ఆంగ్ల అక్షర రూంలో ‘ఏ’ అంటే రూ.వెయ్యి, ‘బీ’ అంటే రూ.2 వేలు, ‘సీ’ అంటే రూ.3 వేలు, ‘డీ’ అంటే రూ.4 వేలు, ‘ఇ’ అంటే రూ.5 వేలు.. ఏ పక్కన ఒక జీరో పెడితే అది రూ.10 వేలు, బీ పక్కన జీరో పెడితే రూ.20 వేలు, సీ పక్కన జీరో పెడితే రూ.30 వేలు.. ఇలా ఆదిలాబాద్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో కోడ్ భాషలో లంచం వసూలు చేసుకుంటూ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. డబ్బులు గుంజేందుకు ఎత్తులు గతంలో పేదలు సాగు చేసుకునేందుకు ఇచ్చిన అసైన్డ్ భూములు వెంచర్లుగా మారి ప్లాట్లుగా విక్రయాలు జరిపే క్రమంలో వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) జారీ చేశారు. అవి అప్పుడు హోదాలో ఉన్న వివిధ రెవెన్యూ అధికారుల ద్వారా జారీ అయ్యాయి. వీటికి సంబంధించి పలుమార్లు ప్లాట్లు చేతులు మారి రిజిస్ట్రేషన్ కూడా జరిగాయి. ఇప్పుడు ఎవరైనా ఎన్ఓసీ ఉన్న ప్లాట్కు సంబంధించి రిజిస్ట్రేషన్కు వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్పై రిజిస్ట్రేషన్ అధికారులు డబ్బులు గుంజేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఈ ఎన్ఓసీ విషయంలో జిల్లా అధికారుల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని, వాళ్ల నుంచి మాకు మళ్లీ క్లియరెన్స్ రాలేదని, జాబితా పంపలేదని.. ఇలా రకరకాలుగా చెప్పడం ద్వారా రిజిస్ట్రేషన్కు వచ్చిన పార్టీని డైలమాలో పడేస్తారు. ఒకవేళ తాము డాక్యుమెంట్పై రాత ద్వారా సూచించిన విధంగా డబ్బులిస్తే రిజిస్ట్రేషన్ అయిపోతుందని చెబుతారు. ఇలా వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చేందుకు ఉద్దేశించిన నాలా కన్జర్వేషన్, ఇండ్ల రిజిస్ట్రేషన్కు సంబంధించి మున్సిపల్ సంబంధిత పత్రాలు, ఇలా అనేక రకాలుగా డాక్యుమెంట్కు ఏదో ఒక అభ్యంతరం చూయించి పార్టీ నుంచి డబ్బులు వసూలు చేయడం ద్వారా ఆదిలాబాద్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల తీరు హద్దు మీరిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరికంటే జలగలే నయమన్న పరిస్థితి పలువురిలో వ్యక్తమవుతోంది. వసూళ్లకు దళారులు సాధారణంగా ఎస్ఆర్ఓ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లకు ప్రవేశం లేదు. అయితే పార్టీలు డాక్యుమెంట్ రైటర్లను మొదట దస్తావేజు రూపొందించేందుకు ఆశ్రయిస్తారు. అదే సమయంలో ఈ డాక్యుమెంట్ రైటర్ దాన్ని రూపొందించిన తర్వాత సబ్రిజిస్ట్రార్ దగ్గరికి పంపించినప్పుడు పరిశీలన చేసిన తర్వాత దాంట్లో ఏదో ఒక లోపం చూపిస్తూ ఆంగ్ల అక్షరం రాసి పంపిస్తారు. కోడ్ పద్ధతిలో డాక్యుమెంట్పై రావాల్సిన లంచం రూపం చెప్పిన తర్వాత దానికి పార్టీ ‘సై’ అంటే సబ్రిజిస్ట్రార్కు సంబంధించిన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు రంగంలోకి దిగుతారు. ఆ ఆంగ్ల అక్షరం మేరకు లంచం డబ్బులు వసూలు చేస్తారు. ఆ తర్వాతే ఆ డాక్యుమెంట్ మళ్లీ సబ్రిజిస్ట్రార్ టేబుల్పైకి వెళ్తుంది. ఇదంతా రోజూ మామూలుగా జరిగే తతంగమే. ఏసీబీకి పట్టుబడినా తీరు మారలే.. ఆదిలాబాద్లో ప్రస్తుతం ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్న ఓ అధికారి గతంలో ఇలాగే లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో శాఖ పరంగా సర్వీస్ రిమూవల్ జరిగిందనే ప్రచారం సాగింది. అయితే రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని దీనినుంచి బయటపడ్డాడని శాఖలో చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ ఆ అధికారి తీరు మారలేదు. ప్రస్తుతం సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ కోడ్ పద్ధతిని అమలులోకి తీసుకొచ్చి యథేచ్ఛగా వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ప్రతీరోజు ఈ అధికారి లక్షల రూపాయలు లంచం రూపంలో వసూలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. చేతులెత్తేసిన రిజిస్ట్రార్ ఆదిలాబాద్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమాలపై కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఇటీవల జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్రను కలిసి ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే జిల్లా రిజిస్ట్రార్ మా టలు వారిని విస్తుపోయేలా చేశాయి. ప్రధానంగా ఆదిలాబాద్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రెగ్యులర్ సబ్రిజిస్ట్రార్లు పనిచేసేందుకు ముందుకు రావడం లేదని, పనిచేసేవారిని ఇక్కడ ఉన్నవారు పనిచేయనివ్వడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం చేస్తున్న వారితోనే వ్యవస్థను నడిపియ్యాల్సి వస్తుందని చెప్పారు. దీంతో అక్కడ వ్యవస్థ పరమైన లోపమా? లేనిపక్షంలో జిల్లా రిజి స్ట్రారే ఇలాంటి అక్రమాలకు పాల్పడే అధికారులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడా? అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ‘సాక్షి’ జిల్లా రిజిస్ట్రార్ ఫణీంద్రను వివరణ కోరేందుకు గురువారం సాయంత్రం ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
చనిపోయిన వ్యక్తి లేచొచ్చాడా?
నగరంలోని సర్వే నెం.173లో మూడు ఎకరాలపైనే ఉన్న భూమిని 143 గజాల భూమిగా చూపి రిజిస్ట్రేషన్ చేశారు. గమ్మత్తైన విషయమేమంటే ఆధార్ కార్డులో తండ్రి పేరు మార్చి రిజిస్ట్రేషన్ చేయడం గమనార్హం. సాక్షి, నిజామాబాద్: జిల్లాలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లకు పై ఉదంతాలే నిదర్శనం. ముగ్గురు రాజకీయ నాయకులు, రెవెన్యూ సిబ్బంది, ఆధార్ సెంటర్ నిర్వాహకులు, ఉద్యోగ సంఘం నాయకుడు కలిసి భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్తో కలిసి పేదల భూములకు ఎసరు పెట్టారు. అలాగే, సర్కారు ఆదాయానికి గండి కొట్టారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ అధికారే మాఫియా అవతారం ఎత్తి అక్రమాలకు లైసెన్స్ ఇవ్వడం గమనార్హం. సస్పెండైన ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ అక్రమాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అక్రమ సంపాదనకు దండిగా అలవాటు పడిన ఆ అధికారి ఏడాది వ్యవధిలోనే రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 50 ఏళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయడం, లేని వారసులు ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి భూములు ఇతరులకు కట్టుబెట్టిన భారీగా దండుకున్నట్లు తెలిసింది. నగరంలోని కంఠేశ్వర్ ఏరియాలో గల సర్వే నెం.268లో 2.11 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం స్థలాన్ని కేవలం 110 గజాలుగా చూపి ఇటీవల వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. విచిత్రమేమిమంటే ఈ భూమి యజమాని బంటు ఎర్రన్న 1973లో చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు 2004లోనే డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. అయితే కొంత మంది అక్రమార్కులు కలిసి 2.11 ఎకరాల భూమిని కాజేయాలని ప్లాన్ చేశారు. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్తో కుమ్మక్కై బంటు ఎర్రన్న తన భూమిని ఇతరులకు విక్రయించినట్లు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అయితే, 50 ఏళ్ల క్రితం చనిపోయిన ఎర్రన్న గత సెప్టెంబర్ 3న తన భూమిని ఇతరుల పేరిట ఎలా రిజిస్ట్రేషన్ చేశారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. విచారణలో నిగ్గుతేలేనా..? సస్పెండైన ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడిన సదరు అధికారి తనకేమీ తెలియదన్నట్లుగా ఆ శాఖ డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ ఎదుట అయామక చక్రవర్తిగా నటించినట్లు ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు, తన సస్పెన్షన్ను ఎత్తి వేయించుకునేందుకు రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులతో హైదరాబాద్లో పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు, తన ముఠా సభ్యులు తనను కాపాడతారన్న ధీమాతో ఉన్నట్లు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది చెబుతున్నారు. -
‘మాన్సాస్’లో మరో మాయ
సాక్షి, అమరావతి: హైకోర్టు ఆదేశాలతో వివిధ ఆలయాలు, సత్రాలకు సంబంధించిన భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో ఉంచేందుకు దేవదాయ శాఖ కసరత్తు చేస్తున్న రోజులవి. 2016 ఏప్రిల్ 11వ తేదీ.. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని ధర్మపురి రెవెన్యూ గ్రామ పరిధిలో గల 474.44 ఎకరాల భూములు మాన్సాస్ ట్రస్టుకు చెందనవిగా పేర్కొంటూ అప్పటి ట్రస్టు ఈవో ఆ జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కు నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం జిల్లా అసిస్టెంట్ అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ ద్వారా ఆ భూములకు ఎటువంటి ప్రైవేట్ రిజిస్ట్రేషన్లు జరగడానికి వీలు లేకుండా నిషేధిత జాబితాలో చేర్చాలంటూ లేఖ రాశారు. ఇది జరిగిన ఏడాదికే.. 2017 ఏప్రిల్ 19వ తేదీన ధర్మపురి రెవెన్యూ గ్రామంలో మాన్సాస్ ట్రస్టు భూములుగా నిర్ధారించిన 474.44 ఎకరాల భూములలో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ జనరల్కు అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ లేఖ రాశారు. అవి ట్రస్టు భూములని పేర్కొన్నప్పుడు, అందులో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదని తిరిగి లేఖ రాసినప్పుడు దేవదాయ శాఖ కమిషనర్గా ఉన్నది ఒక్కరే. మొత్తంగా ఏదో మాయ చేసినట్టుగా.. ట్రస్టు ఆస్తుల జాబితా నుంచి బాగా ఖరీదైన 145.78 ఎకరాల భూములు ఎగిరిపోయాయి. మాన్సాస్ ట్రస్టుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 14,418 ఎకరాల భూములుండగా.. 2015–16, 2018–19లలో 150 ఎకరాలను మెడికల్ కళాశాల–ఆస్పత్రి పేరుతో విక్రయించేసిన బాగోతం ఇప్పటికే వెలుగు చూసిన విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా కొత్తవలస, చిప్పాడ, బాకురపాలెం, డాబా గార్డెన్స్, సంతపేటలో ఉడా ద్వారా ఆ 150 ఎకరాలను విక్రయించగా రూ.120 కోట్లు వచ్చిందని ట్రస్టు లెక్క చూపించింది. సింహచలం శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం, మాన్సాస్ ట్రస్టు భూములకు సంబంధించి టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు నేపథ్యంలో దేవదాయ శాఖ అధికారులు పాత రికార్డులు పరిశీలన చేయగా ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. చట్టాలను, కోర్టు ఉత్తర్వులను, దేవదాయ శాఖ నిబంధనలను తోసిరాజని అధికారం దన్నుతో ఈ కుంభకోణానికి తెరలేపినట్టు రికార్డుల పరిశీలనలో తేలింది. ఆ కమిటీ తీర్మానం ప్రకారమే.. అశోక్గజపతిరాజు చైర్మన్గా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన కుటుంబరావు సభ్యుడిగా ఉన్న ముగ్గురు సభ్యులతో కూడిన ట్రస్టు బోర్డు 2017 ఫిబ్రవరిలో ధర్మపురి రెవెన్యూ పరిధిలో ట్రస్టు పేరిట ఉండే 145.78 ఎకరాలు ట్రస్టువి కావంటూ ట్రస్టు ఈవో అప్పటి దేవదాయశాఖ కమిషనర్కు లేఖ రాయడం, ఆ వెనువెంటనే ఆ భూములకు రిజిస్ట్రేషన్లకు వీలు కల్పిస్తూ అప్పటి దేవదాయ శాఖ కమిషనర్ నిరభ్యంతర సర్టిఫికెట్ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. ట్రస్టు చైర్మన్గా ఆయన బాధ్యతలు చేపట్టాకే.. 2014 జూన్–2019 మే మధ్య రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ సమయంలోనే మాన్సాస్ ట్రస్టు చైర్మన్గా అశోక్గజపతిరాజు బాధ్యతలు చేపట్టిన ఏడాదికే ఈ భూ మాయ చోటుచేసుకోవడం విశేషం. అంతకుముందు మాన్సాస్ ట్రస్టు చైర్మనుగా ఉన్న ఆనంద గజపతిరాజు 2016 మార్చిలో మరణించారు. దీంతో టీడీపీ తరఫున ఎంపీగా కొనసాగుతున్న అశోక్గజపతిరాజును ట్రస్టు చైర్మనుగా నియమిస్తూ 2016 ఏప్రిల్ 7న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అప్పటి సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా మెలిగిన కుటుంబరావును ట్రస్టు నిర్వహణ కమిటీలో సభ్యుడిగా నియమిస్తూ అదే 2016 ఏప్రిల్ 7వ తేదీన ప్రభుత్వం మరో ఉత్తర్వు ఇచ్చింది. అప్పట్లో ట్రస్టు నిర్వహణకు ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీలో ఇద్దరు ప్రముఖ టీడీపీ నేతలే ఉన్నారు. వీరి నియామకం జరిగిన రోజుల్లోనే దేవదాయ శాఖ అధికారులు విజయనగరం కార్పొరేషన్ పరిధిలో ట్రస్టు పేరిట 474.44 ఎకరాలుందని నిర్ధారించారు. ఏడాదికల్లా అందులో 145.78 ఎకరాలు ట్రస్టువి కాదని తేల్చడం గమనార్హం. -
రిజిస్ట్రేషన్లకు లైన్క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు సోమవారం నుంచి యథాతథంగా జరగనున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్టేట్ డాటా సెంటర్ (ఎస్డీసీ)లో ఉన్న ప్రధాన సర్వర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యను గుర్తించి పరిష్కరించడంతో రిజిస్ట్రేషన్ లావాదేవీలకు ఇబ్బంది తొలగిపోయింది. రెండు రోజులుగా ఈ సమస్య పరిష్కారానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులతోపాటు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థల బృందం చేసిన ప్రయత్నాలు ఆదివారం మధ్యాహ్నానికిగానీ ఫలించలేదు. దీంతో ఐదు రోజులుగా నెమ్మదించిన రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు మళ్లీ సోమ వా రం నుంచి ఊపందుకోనున్నాయి. ఆదివారం మధ్యాహ్నమే సమస్యను పరిష్కరించి రాష్ట్రం లోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల నెట్వర్క్ను పరిశీలించారు. అంతా సజావుగా పనిచేస్తుండడంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలు మునుపటిలాగానే కొనసాగుతాయని ఉన్నతాధికారులు వెల్లడించారు. సర్వర్ మొరాయించడంతో ఐదు రోజులుగా పెండింగ్లో పడిన లావాదేవీలతోపాటు సోమవారం బుక్ చేసుకునే స్లాట్లకు సంబంధించిన లావాదేవీలను కూడా చేపడతామని వెల్లడించారు. వామ్మో.. సాఫ్ట్వేర్ రాష్ట్రంలోని 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను ఐదు రోజులపాటు ఇబ్బంది పెట్టిన సమస్య చాలా చిన్నదని, అయితే దాన్ని గుర్తించడానికే సమయం పట్టిందని తెలుస్తోంది. ఎస్డీసీలో ఉన్న ప్రధాన సర్వర్ రాష్ట్రంలోని అన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను సమన్వయం చేస్తుంది. ఈ సర్వర్ ద్వారానే డాటా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ డాటా ట్రాన్స్ఫర్ చేసేందుకు రూపొందించిన సాఫ్ట్వేర్లోని ఒక ఫైలు కరప్ట్ అయిందని సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కార్డ్ అప్లికేషన్ ఓపెన్ కాలేదు. రెండు రోజులుగా ఎంత కుస్తీ పడుతున్నా ఈ ఫైల్ను గుర్తించలేకపోయారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో సాఫ్ట్వేర్ నిపుణుల టీం ప్రతి ఫైలును చెక్ చేయడంతో ఈ కరప్ట్ ఫైల్ దొరికింది. దీన్ని సరిచేయడంతో సమస్య పరిష్కారమైంది. -
ధరణి పోర్టల్లో కొత్త తిప్పలు..‘మార్ట్గేజ్’.. మారట్లే!
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల మార్ట్గేజ్ వ్యవహారం ధరణి పోర్టల్లో క్లిష్టతరమైంది. తనఖా పెట్టిన భూములను ఆ తనఖా విడిపించిన తర్వాత కూడా క్రయ, విక్రయ లావాదేవీలు జరుపుకునేందుకు ధరణి పోర్టల్ అనుమతించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత కూడా తమను డిఫాల్టర్లుగా చూపిస్తున్నారని వాపోతున్నారు. ఒక రైతు తన భూమిని బ్యాంకులు లేదా ఇతర సంస్థల వద్ద తనఖా పెట్టి తన అవసరాల కోసం రుణం తీసుకోవచ్చు. ఈ క్రమంలో సదరు భూమిని తమ వద్ద తనఖా పెట్టినట్టు ఆ భూమిని బ్యాంకులు మార్ట్గేజ్ చేసుకుంటాయి. ఈ మార్ట్గేజ్ డీడ్ను రెవెన్యూ వర్గాలు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఆ తనఖాకు చట్టబద్ధత లభిస్తుంది. అలాంటి భూమిని ఇతరులకు అమ్ముకునే అవకాశం, లేదా మరోచోట తనఖా పెట్టే అవకాశం ఉండదు. అయితే, తీసుకున్న రుణాన్ని తిరిగి బ్యాంకులు లేదా ఇతర సంస్థలకు చెల్లించినప్పుడు రైతు ఆ మార్టిగేజ్ డీడ్ను రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా విడుదల చేసేందుకు రీకన్వేయన్స్ డీడ్ పేరుతో మరో రిజిస్ట్రేషన్ లావాదేవీ చేయాల్సి వస్తుంది. ఇలా రీకన్వేయన్స్ డీడ్ చేసుకునేంతవరకు ధరణి పోర్టల్ సహకరిస్తోందని, ఆ తర్వాతే తంటాలు వస్తున్నాయని రైతులు అంటున్నారు. ఒకసారి తనఖా పెట్టి విడిపించుకున్న భూమిని అమ్ముకునేందుకు వెళితే ఆ భూమి ఇంకా తనఖాలోనే ఉందని ధరణి పోర్టల్ చూపుతోందని వాపోతున్నారు. సాంకేతిక సమస్య వల్లనే... ఈ విషయమై రెవెన్యూ వర్గాలు స్పందిస్తూ రీకన్వేయన్స్ డీడ్ ఆప్షన్ను ప్రభుత్వం ధరణి పోర్టల్లో ఇచ్చిందని, అయితే డీడ్ వచ్చినా ఆ భూమి తనఖాలోనే ఉన్నట్టు చూపిస్తుండటం కేవలం సాంకేతిక సమస్య మాత్రమేనని అంటున్నాయి. దీన్ని భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయ స్థాయిలోనే పరిష్కరించి తమకు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు చెపుతున్నారు. అయితే, రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ భూముల్లో 10 శాతం వరకు భూములు పలు సందర్భాల్లో తనఖాకు వెళతాయని అంచనా. ముఖ్యంగా తోటల పెంపకందారులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరం కనుక అదే భూమిని తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకుని తర్వాత ఆ రుణం తీర్చేస్తారు. కానీ, రుణం తీర్చిన తర్వాత కూడా సాగు భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
కరోనా వేళా ఆగని రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: కరోనా ఉధృతి వేళ రాష్ట్రంలో ఆస్తుల క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు సాధారణ రోజులతో పోలిస్తే కొంతమేర తగ్గినా.. ఇబ్బందులను అధిగమించి ఇబ్బడిముబ్బడిగానే జరిగాయి. ఆస్తుల క్రయ, విక్రయ లావాదేవీల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ ఏప్రిల్, మే నెలల్లో రూ.650.37 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నిర్దేశిత లక్ష్యం మేరకు ఆ రెండు నెలల్లో రూ.1,125.12 కోట్లు ఆదాయం ఆర్జించాల్సి ఉంది. కరోనా కల్లోలం సృష్టించడంతో రిజిస్ట్రార్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేయక లక్ష్యం మేరకు ఆదాయం రాలేదు. అయినా.. లక్ష్యంలో 57.80 శాతం రెవెన్యూ సాధించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆదాయం గణనీయంగా పెరిగింది. గతేడాది ఈ రెండు నెలల్లో కేవలం రూ.186.46 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రూ.463.91 కోట్ల అధిక ఆదాయం వచ్చింది. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రణాళిక ప్రకారం జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లడం ద్వారా ఆదాయాన్ని పెంచగలిగారు. 1,91,696 రిజిస్ట్రేషన్లు ఈ రెండు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,91,696 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 23,674 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. తూర్పు గోదావరి జిల్లాలో 21,197, పశ్చిమగోదావరి జిల్లాలో 16,756 రిజిస్ట్రేషన్లు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో అతి తక్కువగా 6,950 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. రెవెన్యూ పరంగా చూస్తే (నిర్దేశిత లక్ష్యం మేరకు).. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా రూ.39.98 కోట్లు (లక్ష్యంలో 73.94%), ఆ తర్వాత నెల్లూరులో రూ.40.29 కోట్లు (లక్ష్యంలో 70.49 శాతం), కర్నూలులో రూ.51.63 కోట్లు (లక్ష్యంలో 70.05 శాతం) ఆదాయం లభించింది. శ్రీకాకుళంలో అతి తక్కువగా రూ.14.10 కోట్లు (లక్ష్యంలో 42.43 శాతం) ఆదాయం వచ్చింది. అనంతపురం జిల్లాలోనూ తక్కువగా రూ.35.02 కోట్లు (లక్ష్యంలో 46.83 శాతం) రెవెన్యూ వసూళ్లు జరిగాయి. ఉద్యోగులు కష్టపడ్డారు కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కాలంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు కష్టపడి పనిచేశారు. రాష్ట్రంలో ఆరుగురు ఉద్యోగులు కరోనా బారినపడి మృతి చెందారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ ధైర్యంగా పనిచేసిన ఉద్యోగులకు అభినందనలు. – ఎంవీ శేషగిరిబాబు, కమిషనర్ అండ్ ఐజీ, రిజిస్ట్రేషన్ల శాఖ -
తారాజువ్వలా ఎగిరిన రియల్ ఎస్టేట్
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్, రిజిస్ట్రేషన్లకు సెలవులతో నేలచూపులు చూసి కుదేలైన స్థిరాస్తి రంగం మూడు నెలల్లోనే తిరిగి తారాజువ్వలా పైకిలేచింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర శివార్లలో పెద్ద ఎత్తున పుంజుకున్న రియల్ వ్యాపారాల కారణంగా గత ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలల్లో భారీ సంఖ్యలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్ రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో ఏడాది కాలంలో జరిగిన కార్యకలాపాల్లో సగం మేరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే జరగడం విశేషం. ముఖ్యంగా శివార్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారితో పోటెత్తాయి. భూమిపై పెట్టుబడిని ఆదాయ వనరుగా మధ్యతరగతి వర్గాలు భావిస్తుండడంతో పాటు రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) లాంటి ప్రతిపాదనలు, కరోనా వైరస్ నేర్పిన పాఠంతో కాంక్రీట్ జంగిల్ను వదిలి ప్రశాంతత కోసం శివార్లలోని విల్లాలు, ఫామ్ హౌస్ల వైపు సంపన్నులు మొగ్గు చూపుతుండడం ఇందుకు కారణాలని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రంగారెడ్డిలో అత్యధిక లావాదేవీలు రిజిస్ట్రేషన్ల గణాంకాలను పరిశీలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.4 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇందులో సగం కంటే ఎక్కువగా రూ.2,503 కోట్ల వరకు రంగారెడ్డి, మేడ్చల్ రిజిస్ట్రేషన్ జిల్లాల నుంచే రావడం గమనార్హం. ఇక, ఈ రెండు జిల్లాల పరిధిలో జరిగిన లావాదేవీలను విశ్లేషిస్తే రంగారెడ్డిæ జిల్లా పరిధిలో ఏడాది కాలంలో 1.7లక్షల లావాదేవీలు జరిగితే చివరి మూడు నెలల్లో 88 వేలకు పైగా లావాదేవీలు జరిగాయి. మేడ్చల్ జిల్లా పరిధిలో ఏడాది కాలంలో లక్షకు పైగా డాక్యుమెంట్లు నమోదు కాగా, మూడు నెలల్లో 58 వేలకు పైగా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగడం విశేషం. ట్రిపుల్ ఆర్ ‘భూమ్’ నగరాన్ని చుట్టుముట్టి 340 కిలోమీటర్లకు పైగా ఏర్పాటు కానున్న ఆర్ఆర్ఆర్ ప్రతిపాదనలు ఒక్క సారిగా స్థిరాస్తి రంగ స్వరూపాన్ని మార్చివేశాయి. హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే ఏడు జిల్లాల్లో ఈ రహదారి ఏర్పాటవుతుందన్న అంచనాతో శివార్లలో రియల్ కార్యకలాపాలు గత రెండు నెలలుగా జోరందుకున్నాయి. భూముల ధరలు అమాంతం పెంచేసినా, భవిష్యత్తులో మరింత పెరుగుతాయనే ఆశతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఆర్ఆర్ఆర్ చుట్టూ ఉన్న భూముల కొనుగోళ్లపై దృష్టి పెట్టాయి. ఈ ట్రిపుల్ ఆర్ ఏర్పాటు పూర్తయితే దీని చుట్టూ పారిశ్రామికాభివద్ధి జరుగుతుందని, రానున్న ఐదారేళ్లలో భూములకు మరింత డిమాండ్ వస్తుందనే ఆలోచనతో ఎక్కువ మంది ఈ ప్రాంతంపై ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు నగర శివార్లలో లగ్జరీ విల్లాలపై కూడా సంపన్న వర్గాల్లో ఆసక్తి పెరిగింది. కనీసం రూ.3 కోట్ల నుంచి రూ.10 కోట్ల విలువ గల విల్లాల కొనుగోలుపై వ్యాపారవేత్తలు, ఎన్నారైలు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గండిపేట, గోపన్పల్లి, నార్సింగి, తుక్కుగూడ, మహేశ్వరం తదితర ప్రాంతాల్లో విల్లాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగిన తీరు వెల్లడిస్తోంది. ఊతమిస్తున్న అభివృద్ధి ఐటీ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ చుట్టూ జరుగుతున్న అభివృద్ధి కూడా రియల్ రంగానికి కొత్త ఊపు తెస్తోంది. ముఖ్యంగా ఐటీ అభివృద్ధితో పాటు పరిశ్రమల విస్తరణ, నగరానికి దగ్గర్లోనే యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి, వరంగల్–హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్, బెంగళూరు జాతీయ రహదారిపై ఎలక్ట్రానిక్ గూడ్స్ క్లస్టర్, లాజిస్టిక్ హబ్లు లాంటివి ఏర్పాటవుతుండడంతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో విరివిగా వెంచర్లు, టౌ¯న్షిప్లు ఏర్పాటు చేస్తున్నారు రియల్ వ్యాపారులు. భారీ బహుళ జాతి సంస్థలు కూడా తమ కార్యాలయాలను గ్రేటర్లో ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుండడంతో నివాస ప్రాంతాల కోసం నగర శివార్లలో పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. దీంతో భూములు, విల్లాలు, అపార్ట్మెంట్లు, రిసార్టుల క్రయ విక్రయ లావాదేవీలు భారీ ఎత్తున పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ లావాదేవీలు నగర శివార్లలోనే ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి తోడు కోవిడ్ మొదటి దశ తర్వాత మధ్యతరగతి వర్గాలు సొంత ఇళ్లను సమకూర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.శివార్లలోని ఉప్పల్, మేడ్చల్, ఘట్కేసర్, పోచారం, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, కుత్బుల్లాపూర్, దుండిగల్, మహేశ్వరం, ఆదిభట్ల, బడంగ్పేట్, మణికొండ, శంకరపల్లి, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. -
భూమి పాస్బుక్లో తప్పులా? ఇలా సవరించుకోండి
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో 9 రకాల సవరణలకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. పాస్ పుస్తకాల్లో తప్పులు నమోదైన తర్వాత వాటిని సరి చేసుకునేందుకు ఇప్పటివరకు అవకాశం లేకపోగా, అందులో కొన్నింటి పరిష్కారానికి ఆప్షన్లిచ్చింది. ఆధార్ నమోదులో తప్పులు, ఆధార్ వివరాలు సమర్పించకపోవడం, తండ్రి లేదా భర్త పేరులో తప్పులు, కులం మార్పు, సర్వే నంబర్ మిస్సింగ్, పాస్ పుస్తకాల్లో భూమి రకం మార్పు లాంటి అంశాలకు ఆప్షన్లు ఇచ్చింది. కొత్త పాస్ పుస్తకాల మంజూరుకు బయోమెట్రిక్ తప్పనిసరి కావడంతో రాష్ట్రంలోని మీ–సేవ కేంద్రాలకు వెళ్లి సవరణల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీసీఎల్ఏ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. కలెక్టర్ల పరిశీలన అనంతరం.. మీ-సేవ కేంద్రాల్లో ఈ మార్పుల కోసం చేసుకున్న దరఖాస్తులు నేరుగా కలెక్టర్లకు వెళ్తాయని, వారు పరిశీలించిన అనంతరం దరఖాస్తును ఆమోదిం చడం లేదా తిరస్కరించడం జరుగుతుందని సీసీఎల్ఏ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆమోదం పొందిన దరఖాస్తుల విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియ జేసి తదుపరి చర్యలు వివరిస్తారని తెలిపారు. కాగా, వీటితో పాటు ధరణిలో రిజిస్ట్రేషన్ల కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే కొలిక్కి తేవాలని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) అమల్లో ఉన్న సాంకేతిక ఇబ్బందులు, కంపెనీలకు పాసుపుస్తకాల జారీ ప్రక్రియ, లీజు బదిలీ, రద్దు, సరెండర్, అమ్మకపు సర్టిఫికెట్లు, కన్వేయన్స్ డీడ్ విస్తీర్ణంలో తేడాలు, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లకు, మైనర్లకు పాసు పుస్తకాల్లాంటివి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వీటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని, 10 రోజుల్లో ధరణి పోర్టల్ పూర్తి స్థాయిలో గాడిలో పడుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. -
‘రేట్లు’ పెంచేశారు.. అంతా వారి ఇష్టారాజ్యమే..!
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కె.శ్రీను స్థానికంగా ఓ వెంచర్లో 160 గజాల ఓ ప్లాటు కొనుగోలు చేశాడు. ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం ప్లాటు విలువ రూ.1.20 లక్షలు. ఈ ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల రూపంలో రూ.8,100 చెల్లించాడు. అయితే ఈ ప్లాటు రిజిస్ట్రేషన్ చేయించినందుకు మధ్యవర్తికి చెల్లించిన ఫీజు రూ.6,500. డాక్యుమెంట్ ప్రిపరేషన్తో పాటు త్వరగా పని పూర్తి చేయించినందుకు ఈ మొత్తం చెల్లించినట్లు శ్రీను చెబుతున్నాడు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్కు చెందిన సి.రమేశ్ మండల పరిధిలో 150 చదరపు గజాల ఖాళీ స్థలం కొనుగోలు చేశాడు. రెండ్రోజుల క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కార్యాలయం సమీపంలోని మధ్యవర్తిని సంప్రదించాడు. నిబంధనల ప్రకారం సదరు ప్లాటుకు స్టాంపు డ్యూటీతో పాటు ఇతర ఫీజుల కోసం రూ. 10,200 చెల్లించాడు. డాక్యుమెంట్ ప్రిపరేషన్ తదితర ప్రక్రియల కోసం రూ.5 వేలు మీడియేటర్కు చెల్లించడంతో రిజి్రస్టేషన్ కార్యాలయంలో అరగంటలో ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించిన ఫీజులో దాదాపు సగభాగం మీడియేటర్కు చెల్లించుకోవాల్సి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర (నాన్ అగ్రికల్చర్) ఆస్తుల రిజిస్ట్రేషన్లలో మధ్యవర్తులు దోచుకుంటున్నారు. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ కూడా ధరణి పోర్టల్ ద్వారా నిర్వహించాలనుకున్నా... ఆధార్, ఇతర సమాచార సేకరణకు హైకోర్టు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల రిజి్రస్టేషన్కు పాత విధానాన్నే కొనసాగిస్తోంది. దీంతో గత నాలుగు నెలలుగా నిలిచిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు జోష్ వచ్చింది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుంటున్న మధ్యవర్తులు... ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్పైనా పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. పాత విధానం రిజిస్ట్రేషన్లలో డాక్యుమెంట్ తయారీ మొదలు.. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫైల్ మూవ్మెంట్, డాటా ఎంట్రీ, ఫొటో క్యాప్చర్, సంతకాల ప్రక్రియ వరకు అంతా మధ్యవర్తుల కనుసన్నల్లోనే నడుస్తుండడంతో అమ్మకం, కొనుగోలుదారులు నేరుగా కార్యాలయంలో సంప్రదించే పరిస్థితి లేకుండా పోయింది. (చదవండి: ఓటీపీ చెబితేనే రేషన్) ‘రేట్లు’పెంచేశారు... పాత రిజిస్ట్రేషన్ విధానంలో డాక్యుమెంట్ ప్రిపరేషన్ ప్రక్రియ అమ్మకం, కొనుగోలుదారుకు కాస్త ఇబ్బందే. ఈ క్రమంలో కార్యాలయం సమీపంలో ఉన్న మధ్యవర్తులను (డాక్యుమెంట్ రైటర్లను) ఆశ్రయించక తప్పదు. దాంతో ప్రభుత్వానికి చెల్లించే వివిధ రకాల డ్యూటీల మొత్తానికి దాదాపు సమాన ఫీజును మీడియేటర్లు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు రిజి్రస్టేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వానికి రూ.5 వేలు ఫీజు చెల్లిస్తే... మధ్యవర్తికి కూడా రూ.5 వేలు చెల్లించాల్సి వస్తోంది. స్టాంపు డ్యూటీ రూ.10 వేలు ఉంటే... మీడియేటర్కు రూ.6,500 చొప్పున లేదా వారు చెప్పినంత చెల్లించాల్సిందే. ప్రతి సబ్ రిజిస్టార్ కార్యాలయ పరిధిలో ఉన్న మీడియేటర్లంతా ఉమ్మడిగా ధరలు నిర్ధారించి వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ వసూళ్ల ప్రక్రియ ఏళ్లుగా ఉన్నప్పటికీ... ప్రభుత్వం తాజాగా వ్యవసాయేతర ఆస్తులకు ధరణి పోర్టల్లో రిజి్రస్టేషన్ల విధానాన్ని నిలిపివేసి పాత పద్ధతికి గ్రీన్ సిగ్నల్ ఇచి్చనప్పటి నుంచి వసూళ్ల తీరు మారింది. ఇదివరకు రూ.2 వేలు తీసుకునే మీడియేటర్... ఇప్పుడు రూ.3 వేల నుంచి రూ.5 వేలు తీసుకుంటున్నాడు. అన్నిచోట్లా ఇదేరకమైన దోపిడీ కనిపిస్తోంది. గత నాలుగు నెలలుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడంతో నష్టపోయిన మీడియేటర్లు... ఇప్పుడు ఈ రకంగా ‘రేట్లు’ పెంచేసి ఆదాయాన్ని భర్తీ చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. జాడలేని నిఘా... రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పని జరగదనే విషయం తెలిసిందే. అయితే ఈ మీడియేటర్ల ఆగడాలను పట్టించుకునే వారే లేరు. మీడియేటర్ల వసూళ్లకు చెక్పెట్టని ఎస్ఆర్ఓ అధికారులు... మరింత ప్రోత్సహిస్తుండడంతో తిరుగులేకుండా పోతోంది. ఎందుకంటే మధ్యవర్తుల వసూళ్లలోంచి... అధికారులకు ప్రతి డాక్యుమెంట్పై నిరీ్ణత మొత్తం ముడుతుందనేది బహిరంగ రహస్యమే. ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన ధరణి పోర్టల్ రిజి్రస్టేషన్లలో మధ్యవర్తుల ప్రమేయం దాదాపు లేదు. పోర్టల్ తెరిచి దరఖాస్తును పూరించి సబి్మట్ చేసి స్లాట్ తేదీని ఎంపిక చేసుకుంటే రిజి్రస్టేషన్ సులువుగా పూర్తయ్యేది. వ్యవసాయ భూముల రిజి్రస్టేషన్ అంతా ధరణి ద్వారా జరుగుతుండడంతో అమ్మకం, కొనుగోలుదారులకు మధ్యవర్తుల బెడద తప్పింది. మా దృష్టికి రాలేదు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. లీగలైజ్డ్ డాక్యుమెంట్ రైటర్స్పై చర్యలు తీసుకునే అంశం మా పరిధిలో ఉంటుంది. కానీ ఇక్కడ లీగలైజ్డ్ రైటర్స్ లేరు. ఇది పూర్తిగా కార్యాలయం బయట జరిగే అంశం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకునే అంశంపై సంబంధిత అధికారులకు సిఫారసు చేస్తా. – మధుబాబు, సబ్ రిజిస్ట్రార్, ఇబ్రహీంపట్నం -
9 రోజులు.. రూ.383 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. మూడు నెలల విరామం తర్వాత ఈనెల 21 నుంచి రాష్ట్రంలోని 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభమైన ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ ఖజానా కళకళలాడుతోందని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈనెల 21 నుంచి 31 వరకు మొత్తం 9 పనిదినాల్లో ఏకంగా రూ.383 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ముఖ్యంగా ఎల్ఆర్ఎస్ నిబంధనలో కొంత సడలింపు ఇచ్చిన రెండ్రోజుల్లోనే ఏకంగా 20 వేలకు పైగా లావాదేవీలు జరగ్గా, రూ.170 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఇంత పెద్ద మొత్తంలో మార్చి నెల తర్వాత ఈ నెలలోనే రూ.400 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ల ఆదాయం వచ్చిందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద కరోనా దెబ్బతో పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన మూడు నెలల తర్వాత కార్యకలాపాలు ప్రారంభం కావడంతో పెండింగ్లో ఉన్న లావాదేవీలను పూర్తి చేసుకునేందుకు వస్తున్న ప్రజలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. అయితే, ఎల్ఆర్ఎస్ నిబంధనకు సడలింపు ఇవ్వడంతో కొత్త సంవత్సరంలోనూ రిజిస్ట్రేషన్లు భారీగానే జరుగుతాయని ఆ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (చదవండి: సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం ) ఈ ఏడాది రూ.5,500 కోట్ల వరకే.. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తుందని వార్షిక బడ్జెట్లో అంచనా వేయగా, కరోనా దెబ్బకు ఆ అంచనాలు కుదేలయ్యాయి. దీనికి తోడు మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఇప్పటివరకు ఈ ఏడాది కేవలం రూ.1,864 కోట్లు మాత్రమే సమకూరాయి. అయితే, ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో నెలకు రూ.1,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని, మొత్తం మీద ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.5,500 కోట్ల వరకు రావచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. -
తెలంగాణలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పాత పద్ధతిలోనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. సోమవారం నుంచి యథావిధిగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.ప్రస్తుతానికి కార్డు (CARD) పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ముందస్తు స్లాట్ బుకింగ్ నిలిపివేశారు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి కేటాయించిన తేదీల్లో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. స్లాట్ బుకింగ్లు ఎవరూ అడగవద్దని.. కార్డు పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగంగా కొనసాగాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకూడదని ఆదేశించారు. కాగా, వ్యవసాయేతర లావాదేవీల నమోదు 2020 డిసెంబర్ 14 న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆధార్ వివరాలు అడగకుండా మాన్యువల్కు మార్పులు చేసే దాకా స్లాట్ బుకింగ్ను ఆపాలని గురువారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో పాత పద్దతిలో రిజిస్ట్రేషన్లు జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు స్పష్టతనిచ్చింది. ధరణి పోర్టల్లో కాకుండా పాత విధానంలో రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్లను ఆపాలని తామెప్పుడూ ఆదేశించలేదని తెలిపింది. ధరణి వెబ్పోర్టల్లో ఆస్తుల నమోదు కొరకు ప్రభుత్వం చేస్తున్న సమా చార సేకరణ చట్టబద్దమని తేలిన తర్వాతే కొత్త విధానం (ధరణి పోర్టల్)లో రిజిస్ట్రేషన్లు చేసుకో వచ్చని, అప్పటిదాకా పాత విధానాన్నే కొనసాగిం చాలని పేర్కొంది. ధరణిలో వ్యవసాయ, వ్యవసా యేతర ఆస్తులు నమోదు చేసుకోవాలని, ఇందుకు ఆధార్ నంబర్, కులం, కుటుంబసభ్యుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు గోపాల్శర్మ, కె.సాకేత్లు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ‘ఏ ప్రభుత్వమూ శాశ్వతం కాదు. వస్తుంటాయి, పోతుంటాయి. అయితే ప్రభుత్వాలు చేసే చట్టాలు, విధానాలు రాజ్యాంగబద్దంగా ఉండాలి. అప్పుడే ఆ చట్టాలు న్యాయసమీక్షలో నిలబడతాయి. ధరణి పోర్టల్లో ఆస్తుల నమోదుకు సంబంధించి ప్రభు త్వం అనుసరిస్తున్న విధానం రాజ్యాంగబద్ధమా అన్నదే మా సందేహం. యజమానుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఎక్కడ భద్రపరుస్తారు? ఎవరి పర్యవేక్షణలో ఉంటుంది? ఆ సమాచారం లీక్ అయితే అందుకు బాధ్యులు ఎవరు? అప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. ఈ అంశాలన్నీ చట్టంలో స్పష్టంగా పేర్కొనాలి. ఇంత పెద్దఎత్తున సమాచారం సేకరించేటప్పుడు... దాని చట్టబద్దతపై ప్రజల సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంద’ని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తప్పనిసరి అంటే ఎలా ? వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులను తప్పని సరిగా ధరణి పోర్టల్లో నమోదు చేసుకోవాలనడం రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ – 300ఎ’కు విరుద్ధం. కుటుంబసభ్యుల వివరాలు, ఆధార్ నంబర్లు, కులం లాంటి సున్నితమైన సమాచారం అడుగుతున్నారు. ఈ సమాచారం లీక్ కాదన్న ప్రభుత్వ హామీని నమ్మలేం... అని ధర్మాసనం పేర్కొంది. సమాచార సేకరణకు సంబంధించి ప్రభుత్వం అక్టోబరులో మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ, పంచాయతీలకు సంబంధించి మూడు వేర్వేరు జీవోలు జారీచేసిందని, ఈ రోజే అవి తమకు ఇచ్చారని, వాటినీ సవాల్ చేస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాది డి. ప్రకాశ్రెడ్డి చెప్పారు. ఈ పిటిషన్లపై తాము కౌంటర్లు దాఖలు చేస్తామని ఏజీ నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. -
‘తెలంగాణ ధరణి’ పేరుతో నకిలీ యాప్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన ధరణి వెబ్సైట్కు లింక్ చేస్తూ నకిలీ యాప్ సృష్టించిన ఇద్దరు కర్ణాటక వాసులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరు ఆ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారానే పోస్ట్ చేసినట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ శనివారం తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన ధరణి వెబ్సైట్లో భూ రికార్డులు, పహాణీ, ఫామ్ బీ–1, తదితరాలు పొందుపరిచింది. సర్కారు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి మొబైల్ యాప్ను రూపొందించలేదు. దీన్ని గమనించిన కర్ణాటకలోని బసవకల్యాణం ప్రాంతానికి చెందిన ప్రేమ్ మూలే, మహేశ్ కుమార్ ధండోటే ఓ మొబైల్ యాప్ రూపొందించారు. దీనికి ‘ధరణి తెలంగాణ ల్యాండ్ రికార్డ్స్’అనే పేరు పెట్టారు. గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ను చూసిన అనేక మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. నిందితులు యూట్యూబ్ ద్వారా యాప్ తయారీ నేర్చుకుని, దానిని క్లిక్ చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ధరణి వెబ్సైట్కు లింకు అయ్యేలా మాత్రమే డిజైన్ చేయగలిగారు. అంతకు మించి ఇందులో ఏ వివరాలూ పొందుపరచలేదు. ఈ యాప్ విషయం ఇటీవల తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ దృష్టికి వచ్చింది. దీంతో సంబంధిత అధికారులు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ భద్రంరాజు రమేశ్, ఎస్సై వెంకటేశం దర్యాప్తు చేశారు. గూగుల్ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ప్రేమ్, మహేశ్ ఈ యాప్ను రూపొందించినట్లు గుర్తించారు. దీంతో అక్కడకు వెళ్ళిన ప్రత్యేక బృందం నిందితులను అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
ధరణి: కులం వివరాలు అడగడం లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రజల వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల హక్కుల పరిరక్షణ, పారదర్శకత కోసమే ధరణి వెబ్పోర్టల్ను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ హైకోర్టుకు నివేదించారు. ప్రజల ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వం ఈ విధానానికి రూపకల్పన చేసిందని, ప్రజల ఆస్తుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని వివరించారు. భూరికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పరిపాలనాపరమైన సంస్కరణలను తెచ్చిందని వివరించారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఆధార్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన ఏమీ లేదని, ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఆర్థికసాయం అందిస్తున్న నేపథ్యంలో ఆధార్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు. కులం వివరాలు అడగడం లేదని, పథకాల అమలులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్న వివరాలను మాత్రమే అడుగుతున్నామని తెలిపారు. ధరణి పోర్టల్ కోసం ఆధార్, కులం వివరాలు అడగడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది గోపాల్ శర్మ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సోమేష్కుమార్ శనివారం కౌంటర్ దాఖలు చేశారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా కోటీ ఆరు లక్షల ఆస్తులు నమోదు చేసుకున్నారు. ఇందులో 12,751 పంచాయతీల్లో 59 లక్షలు, 140 మున్సిపాలిటీల్లో 22 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో 25 లక్షల ఆస్తుల వివరాలను నమోదు చేశారు. 1971 తెచ్చిన భూయాజమాన్య హక్కులు, పట్టాదారు పాసు పుస్తకం చట్టాన్ని రద్దు చేసి మరింత పారదర్శకత పెంచేలా నూతన చట్టాన్ని తెచ్చాం. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం మున్సిపాలిటీ, రెవెన్యూ, జీహెచ్ఎంసీ చట్టాలను సవరించాం. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్కు గతంలో కాకుండా సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కలిసి ఉంటారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్ అయ్యేలా రూపకల్పన చేశాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా గతంలో లోపభూయిష్టంగా ఉండేది. ప్రస్తుత విధానంలో బయోమెట్రిక్ ద్వారా ఎటువంటి అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన అన్ని చర్యలు తీసుకున్నాం. అవినీతికి ఆస్కారం లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. సేకరించిన వివరాలు డేటా సెంటర్లో భద్రంగా ఉన్నాయి. ఈ వివరాలు తెలుసుకునే అవకాశం ఉండదు. బహిరంగంగా ఎవరికీ కనిపించవు. రికార్డుల్లో తప్పులు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించి సవరించుకోవచ్చు. సంక్షేమ పథకాల అమలులో భాగంగానే ఆధార్ వివరాలు అడుగుతున్నాం. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలి’అని కోరారు. ఈ పిల్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. 23న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు లేనట్లే! ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ పడింది. 23న ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుండగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అనుసరించాల్సిన పద్ధతులపై హైకోర్టులో కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. రిజిస్ట్రేషన్లపై కోర్టు స్టే విధించింది. ఈ అంశాన్ని 23న హైకోర్టు మరోసారి విచారించనుంది. హైకోర్టు నుంచి అనుమతి వస్తే తప్ప రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించే అవకాశం లేదు. ఈ కారణాల వల్ల 23 నుంచి ప్రారంభం కా వాల్సిన రిజిస్ట్రేషన్లు మరో 3, 4 రోజులు వాయిదా పడే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
29న ‘ధరణి’ ప్రారంభోత్సవం
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి’పోర్టల్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ముహూర్తా న్ని ఖరారు చేసింది. ఈ నెల 29న మధ్యా హ్నం 12.30కు సీఎం కేసీఆర్ ఈ పోర్టల్ను ప్రారంభించనున్నారు. ఈ నెల 25న దసరా రోజున ధరణి పోర్టల్ను ప్రారంభించాలని తొలుత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాగా, సాంకేతిక సమస్యలు, వరద సహాయక చర్యల్లో అధికారులు నిమగ్నం కావడంతో ముహూర్తాన్ని 29కు మార్చారు. ఆ రోజు నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసా య భూముల రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నా యి. ప్రస్తుతానికి సాగుభూముల రిజి స్ట్రేషన్లే ప్రారంభించనున్న సర్కారు.. రాష్ట్ర వ్యాప్తంగా 570 మండ లాల్లో దీనికి శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్లో వ్యవసాయ భూములు లేనం దున.. దీని నుంచి మినహాయించారు. -
అన్నీ సవ్యంగా ఉంటే అరగంటలో పాస్బుక్
సాక్షి, హైదరాబాద్: దసరా నుంచి ‘ధరణి’పోర్టల్ అందుబాటులోకి రానుంది. కేవలం అరగంటలోపే రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తయి పట్టాదారు పాస్పుస్తకం రైతు చేతికందనుంది. రిజి్రస్టేషన్ సహా రెవెన్యూ రికార్డుల అప్డేషన్, మ్యుటేషన్ (హక్కు బదలాయింపు) అక్కడికక్కడే పూర్తి కానున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన భూ హక్కులు, పాస్పుస్తకాల చట్టం–2020తో ఇది సాధ్యం కానుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీళ్లలో చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఆ మేరకు ప్రయోగాత్మకంగా రిజి్రస్టేషన్ల ప్రక్రి యను పరిశీలించింది. సాంకేతిక సమస్యలను కూడా అధిగమించడంతో విజయదశమి నుం చి తహసీళ్లలో రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా ఊపింది. రిజిస్ట్రేషన్కు దరఖాస్తు పూరించ డం నుంచి స్లాట్ బుకింగ్ వరకు వివిధ దశల్లో సమాచారాన్ని క్రయ, విక్రయదారులు ఆన్లైన్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. పారదర్శకంగా, సులభతరంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రి య జరిగేలా, దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసే లా రెవెన్యూశాఖ ధరణి పోర్టల్ను రూపొందించింది. డాక్యుమెంట్ రైటర్లతో పనిలేకుండా.. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు స్లాట్ బుక్ చేసుకొని రిజి్రస్టేషన్ కోసం తహసీల్కు వెళ్లేలా ఈ ప్లాట్ఫామ్ను తీర్చిదిద్దింది. ఆన్లైన్ పరిజ్ఞానంలేని రైతులు మాత్రం మళ్లీ డాక్యుమెంట్ రైటర్లనో, ఈ–సేవ కేంద్రాల్లో వేరే ఎవరి సాయమో పొందాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అంతేగాకుండా రిజి్రస్టేషన్ సమయంలో పాన్కార్డు నంబర్ను నమోదు చేయాలి. లేనిపక్షంలో ఫారం 60, 61 డిక్లరేషన్ సమరి్పంచాల్సి వుంటుంది. హైదరాబాద్ మినహా 570 తహసీళ్లలో ఈ నెల 25వ తేదీ నుంచి సాగు భూముల రిజి్రస్టేషన్లు తహసీళ్లలో జరుగనున్నాయి. వారసత్వ బదిలీ, క్రయవిక్రయాలు, భాగపంపిణీ, బహుమతి, కోర్టు డిక్రీ ద్వారా వచ్చే హక్కులకు సంబంధించి రిజి్రస్టేషన్లు తహసీల్దార్లు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సాగు భూములు లేని హైదరాబాద్ జిల్లాను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో ఈ రిజి్రస్టేషన్ల ప్రక్రియను దసరా నాడు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయాలకు సాంకేతిక, మౌలిక వసతులను కలి్పంచడమే గాకుండా... గత రెండు రోజులుగా రిజి్రస్టేషన్ల నిర్వహణపై తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లు, ఆపరేటర్లకు శిక్షణ కూడా ఇచి్చంది. ప్రమాణపత్రం తప్పనిసరి క్రయ, విక్రయదారులిద్దరూ రిజిస్ట్రేషన్ సమయంలో ప్రమాణపత్రం (అఫిడవిట్) సమరి్పంచాల్సి ఉంటుంది. ఇందులో పరస్పర అంగీకారం మేరకే లావాదేవీలు జరిగినట్లు ఇద్దరు తమ సమ్మతిని తెలియజేయాల్సివుంటుంది. క్రయ, విక్రయదారులు చేయాల్సింది ఇది ► ధరణి పోర్టల్లోకి వెళ్లి స్లాట్బుక్ చేసుకోవాలి. ► రైతుల మొబైల్ నంబర్కు వచి్చన ఓటీపీని నమోదు చేయాలి. ► రిజి్రస్టేషన్ దరఖాస్తు పూర్తి చేయాలి. ► రైతు పాస్బుక్కు సంబంధించిన సమాచారం, సర్వే నంబర్ల వివరాలు, ఆ భూమి మార్కెట్ వ్యాల్యూ, భూమి సరిహద్దులను... ధరణి పోర్టల్లోనే దరఖాస్తులో నమోదు చేయాలి. ► క్రయ విక్రయదారుల పేర్లు, ఆధార్ నంబర్, కుటుంబసభ్యుల వివరాలు, వయస్సు, వృత్తి, కులం, పాన్కార్డు నంబర్ లేదా ఫారం 60, 61, ఇతర వివరాలు ఇంగ్లి‹Ùలో నమోదు చేయాలి. ► తద్వారా లభించిన వివరాల సంక్షిప్త పట్టిక మేరకు ఈ–చలాన్ జనరేట్ చేసుకోవాలి. ఆన్లైన్లోనే రిజి్రస్టేషన్ ఫీజులను చెల్లించాలి. ► సాక్షుల వివరాలు నమోదు చేయాలి. ► ఈ అన్ని వివరాలతో రూపొందించిన దస్తావేజును ధరణి పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్పుడు క్రయ, విక్రయదారులు కోరుకున్న సమయం మేరకు స్లాట్బుక్ అవుతుంది. ఈ మేరకు ధరణిలోనే ఆన్లైన్ రసీదు కూడా వస్తుంది. దీంతో క్రయ, విక్రయదారుల పని పూర్తవుతుంది. రెవెన్యూ అధికారులు ఏం చేస్తారంటే.. ⇒ రసీదు జారీ అయిన వెంటనే రెవెన్యూ అధికారుల పని మొదలవుతుంది. ⇒ డీఈవో (డేటా ఎంట్రీ ఆపరేటర్) లాగిన్ ద్వారా... సాక్షుల పరిశీలన, నమోదు పూర్తయిన వెంటనే రిజిస్ట్రేషన్ లావాదేవీలకు అవసరమైన అందరి వ్యక్తుల బయోమెట్రిక్, ఫొటోలను డీఈవో ఆన్లైన్లో తీసుకుంటారు. ⇒ ఆ తర్వాత తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజి్రస్టార్ లాగిన్ ద్వారా ఆ రిజి్రస్టేషన్కు సంబంధించిన దరఖాస్తు, స్టాంపు డ్యూటీ వివరాలు, బయోమెట్రిక్, ఈ–చలాన్ తదితర వివరాలను పరిశీలించి రిజి్రస్టేషన్కు అనుమతి ఇస్తారు. ⇒ తహసీల్దార్ అనుమతించిన మరుక్షణమే దస్తావేజుకు నంబర్ కేటాయించబడుతుంది. ⇒ మళ్లీ డీఈవో ద్వారా ఎండార్స్మెంట్ జరుగుతుంది. అప్పుడు సదరు దస్తావేజు స్కానింగ్ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియతో రిజి్రస్టేషన్ డాక్యుమెంట్ తయారవుతుంది. ఈ డాక్యుమెంట్ను డీఈవో ధరణి పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ⇒ మళ్లీ తహసీల్దార్ లేదా జాయింట్ సబ్ రిజి్రస్టార్ తన లాగిన్ ద్వారా మ్యుటేషన్, డిజిటల్ సంతకం ప్రక్రియను పూర్తి చేస్తారు. ⇒ ఇది పూర్తయిన వెంటనే డాక్యుమెంట్ ప్రింట్ ఆప్షన్ నొక్కడంతో సదరు రిజి్రస్టేషన్కు సంబంధించిన కొత్త పాస్పుస్తకం వస్తుంది. దీంతో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. -
జోరందుకున్న ఎల్ఆర్‘ఎస్’
సాక్షి, హైదరాబాద్: లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులు జోరందుకున్నాయి. ప్లాట్ల యజమానుల నుంచి అనూహ్య స్పందన రావడంతో దరఖాస్తుల సంఖ్య 5 లక్షలు దాటింది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 5,15,591 దరఖాస్తులు రాగా.. గ్రామ పంచాయతీల పరిధిలో 1,94,996, మున్సిపాలిటీల పరిధిలో 2,09,895, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 1,10,700 దరఖాస్తులు ఉన్నాయి. దరఖాస్తు రుసుం రూపంలోనే ప్రభుత్వానికి రూ.52.37 కోట్ల ఆదాయం వచ్చింది. నగర, పట్టణాల శివార్లలోని గ్రామాల్లో వెలిసిన అక్రమ వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన యజ మానులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుం టున్నారు. దీంతో గ్రామ పంచాయతీల పరిధిలో సైతం పట్టణాలకు దీటుగా అప్లికేషన్లు వస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెడుతూ గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అక్రమ, అనధికార లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ప్రధానంగా వ్యక్తిగత ప్లాట్ల యజమానులు భారీగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకుం టున్నారు. ప్లాట్ల యజమానుల నుంచే 4 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా, లే–అవుట్ల క్రమబద్ధీకరణకు వేలల్లోనే దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు గడువు అక్టోబర్ 15తో ముగియనుంది. ఆలోగా మరో 5 లక్షలకు పైనే దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరిస్తే క్రమబద్ధీకరణ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్లకుపైనే ఆదాయం వచ్చే అవకాశముంది. -
పల్లె స్పందించలే!
సాక్షి, హైదరాబాద్ : సర్కారు భారీగా ఆశలు పెట్టుకున్న అక్రమ, అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు ప్రజల నుంచి స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. దర ఖాస్తుల సమర్పణకు గడువు సమీపిస్తున్నా గ్రామ పంచాయతీల్లో వీటి సంఖ్య లక్ష కూడా దాటలేదు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయ తీల్లో ఎల్ఆర్ఎస్ అర్జీలు పది లక్షలు దాటుతా యని అంచనా వేసిన పంచాయతీరాజ్ శాఖ.. తాజా పరిణామాలతో అప్రమత్తమైంది. అనధి కార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ అనివార్య మని ప్రచారం చేస్తూ... దరఖాస్తు చేసుకోక పోతే భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోకతప్పదని హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పి స్తోంది. ఈ క్రమంలోనే స్థల యజమానులు దరఖాస్తులు చేసుకునేలా కింది స్థాయి సిబ్బం దిని పురమాయిస్తోంది. గ్రామాల వారీగా అక్రమ లేఅవుట్ల జాబితా, స్థలాల వివరాలను సేకరించిన పంచాయతీ కార్యదర్శులు.. స్థల యజమానులకు ఎల్ఆర్ఎస్పై అవగాహన కల్పించడంలో తలమునకలయ్యారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్లు చేసి మరీ.. స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోమంటూ అభ్యర్థిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు 15వ తేదీ వరకు గడువుంది. ఇప్పటివరకు 94,886 దరఖాస్తులు! స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి గత నెల 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 26వ తేదీలోపు రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలకు క్రమబద్ధీకరణ వర్తిస్తుందని ప్రకటించింది. అంతేగాకుండా అదే రోజు నుంచి ఎల్ఆర్ఎస్ లేని స్థలాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జీఓ 131 జారీ చేసిన సర్కారు.. ఇకపై స్థలాల క్రయవిక్రయాలకు ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అని, క్రమబద్ధీకరించుకోకపోతే భవన నిర్మాణ అనుమతులు కూడా రావని స్పష్టం చేసింది. ఈ మెలికతో ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వస్తాయని అంచనా వేసింది. ఇప్పటివరకు నగర పాలక సంస్థ, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోనే ఎల్ఆర్ఎస్ స్కీమ్ను వర్తింపజేసిన ప్రభుత్వం.. తొలిసారిగా గ్రామ పంచాయతీల పరిధిలోని అక్రమ, అనధికార లేఅవుట్లలో కొనుగోలు చేసిన స్థలాలకు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఖజానాకు కాసుల వర్షం కురుస్తుందని అంచనా వేసినా.. ప్రస్తుతం దాఖలైన దరఖాస్తుల సంఖ్యను పరిశీలిస్తే ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని ఆర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటి వరకు గ్రామ పంచాయతీల్లో 94,886 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వాస్తవానికి జిల్లాలు, మండలాల పునర్విభజనతో గ్రామీణ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగం పుంజుకుంది. మారుమూల ప్రాంతాల్లోనూ అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పది లక్షలు దాటుతాయని పంచాయతీరాజ్ శాఖ అంచనా వేసింది. కాగా, దరఖాస్తుల స్వీకరణతో ప్రభుత్వానికి రూ.10.03 కోట్ల ఆదాయం లభించింది. ప్లాట్ ఓనర్ అయితే రూ.1,000, లేఅవుట్ యజమానికైతే రూ.10 వేలను ప్రాసెసింగ్ ఫీజుగా నిర్దేశించడంతో ఈమేరకు రాబడి సమకూరింది. ఇందులో ప్లాట్లకు సంబంధించి రూ.9.74 కోట్లు, లేఅవుట్లకుగాను రూ.28.80 లక్షల ఆదాయం వచ్చింది. కాగా, ఈ రెండింటిలో 517 లక్షల చదరపు గజాల స్థలం క్రమబద్దీకరణకుగాను స్థల యజమానులు దరఖాస్తు చేసుకున్నారు. రంగారెడ్డి టాప్..ఆసిఫాబాద్ లాస్ట్ రాష్ట్ర రాజధాని పరిసర జిల్లాల్లో అడ్డగోలుగా అక్రమ లేఅవుట్లు వెలిసినట్లు తాజాగా ఆయా జిల్లాల్లో నమోదైన దరఖాస్తుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. జిల్లా కేంద్రాలు, నగర. పురపాలక సంస్థల శివార్లలోనే అనధికార లేఅవుట్లు అత్యధిక స్థాయిలు పుట్టుకొచ్చాయి. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా రంగారెడ్డి 24,178 వచ్చాయి. ద్వితీయ, తృతీయ స్థానాల్లో యాదాద్రి 15,467, సంగారెడ్డి 14,356 జిల్లాలున్నాయి. ఆ తర్వాత మేడ్చల్ 13,755 దరఖాస్తులు నమోదయ్యాయి. అతితక్కువగా దరఖాస్తులు వచ్చినవాటిలో ఆసిఫాబాద్ జిల్లా 145, మహబూబాబాద్ 157, జగిత్యాల 232, నారాయణపేట 272, ములుగు 286 ఉన్నాయి. -
రిజిస్ట్రేషన్లు ప్రారంభం అక్టోబర్లోనే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభ మయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవ కాశాలు కనిపిస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే ఆలోచనతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల కసరత్తులు పూర్తి చేసిన తర్వాతే పటిష్ట పద్ధ తిలో ఈ ప్రక్రియను ప్రారంభించాలనే ఆలో చనతో ఉందని, వచ్చే నెలలోనే రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా భూరికార్డులకు సంబంధించి వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరా లను సమన్వయ పరుచుకోవడం, ధరణి వెబ్ సైట్ను అప్డేట్ చేయడం జరగాలి. రెవెన్యూ చట్టం అమలుపై నూతన మార్గదర్శకాలు వెలు వడాలి. దీంతో పాటు భూముల రిజిస్ట్రేషన్లపై రాష్ట్రంలోని అన్ని మండలాల తహసీల్దార్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉందని, భూముల మార్కెట్ విలువల సవరణ కసరత్తు పూర్తి చేయాలని, అదే విధంగా కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేర్ పూర్తిస్థాయిలో అందు బాటులోకి రావాల్సి ఉందని, ఈ నేపథ్యంలోనే మరికొంత సమయం పడుతుందని సచి వాలయ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేసి పది రోజులు దాటుతున్నందున... మరో పది, పదిహేను రోజుల్లో అందుబాటులోకి తెస్తామని, అక్టోబర్ మొదటి వారంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యే అవకాశముందని అంటున్నాయి. సవరణ... ఆధునీకరణ ఇక, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి కూడా చాలా కసరత్తు చేయాల్సి ఉంది. ముఖ్యంగా భూముల మార్కెట్ విలువలను సవరించాల్సి ఉంది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ భూముల విలువల సవరణ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గతంలోనే సబ్రిజిస్ట్రార్లు, రెవెన్యూ వర్గాల నుంచి భూముల మార్కెట్విలువలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. అయితే ప్రస్తుత విలువలు, సవరించాల్సిన విలువల విషయంలో పారదర్శకత లోపించిందనే కారణంతోనే మార్కెట్ విలువల సవరణ కసరత్తును ప్రభుత్వం థర్డ్ పార్టీకి అప్పగించినట్టు రిజిస్ట్రేషన్ వర్గాలు చెపుతున్నాయి. సరళీకరణ, హేతుబద్ధీకరణ కోణంలో మార్కెట్ విలువలను సవరించాలని, అవసరమైన చోట్ల తగ్గించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతమున్న మార్కెట్ విలువలను సవరించి ఆరేళ్లు దాటుతున్నందున కనీసం 100 నుంచి 300 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాలు, హైవేల చుట్టుపక్కల ప్రాంతాలు, ఇండ్లు, బహుళ అంతస్తుల భవనాలు, కాంప్లెక్సులు, పారిశ్రామిక ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువలను పెంచే దిశలో కసరత్తు జరుగుతోంది. అల్పాదాయ ఆఫీసుల ఎత్తివేత దీంతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ పునర్వ్యవస్థీకరణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో అతి తక్కువ లావాదేవీలు జరిగి, స్వల్ప ఆదాయం వచ్చే సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎత్తివేయాలని, అదే విధంగా అత్యధిక ఆదాయం వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కొన్ని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను రెండు లేదా మూడుగా విభజించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని 25వరకు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలను ఎత్తివేసి అర్బన్ ప్రాంతాల్లో పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, పనిలోపనిగా సబ్రిజిస్ట్రార్ల బదిలీ ప్రక్రియను కూడా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇక, రాష్ట్రంలోని ప్రతి మండలంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరగనుండగా, ఈ మేరకు డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థను కూడా ఆధునీకరించాలని, వారికి పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికే అవకాశం కల్పించాలని, భవిష్యత్తులో జరిగే డాక్యుమెంట్ల రూపకల్పనలో తప్పులు జరిగితే వారినే బాధ్యులను చేయాలని, అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రంలోని 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద డాక్యుమెంట్ రైటర్లుగా పనిచేస్తున్న వారి విద్యార్హత, అనుభవానికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటే తప్ప అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. పని విభజన కోసం.. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్దార్లే చేయాల్సి ఉంటుంది. వ్యవసాయేతర భూములు, ఇతర భవనాలు, స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో ఉన్న ఇతర కార్యకలాపాలను సబ్రిజిస్ట్రార్లు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రికార్డుల సమన్వయం, వాటిని ధరణి వెబ్సైట్తో పాటు కొత్త సాఫ్ట్వేర్లో ఇమిడ్చే పనిలో ప్రభుత్వ వర్గాలున్నాయి. దీనికి తోడు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి తహసీల్దార్లకు శిక్షణ ప్రారంభం కానుంది. ఇది ముగిసేలోపు ధరణి వెబ్సైట్ను కొత్త రెవెన్యూ చట్టానికి అనుగుణంగా అప్డేట్ చేయాల్సి ఉంది. -
మేం ఎలా చేయగలం?
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో లేఅవుట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారం తలనొప్పిగా మారుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దూకుడుతో అడ్డగోలుగా పుట్టుకొస్తున్న ఈ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ మున్సిపల్ అధికారులు మెలికపెడుతుండటం, రిజిస్ట్రేషన్ చేయడం వరకే తమ పని అని, ఆ లేఅవుట్ అక్రమమో,సక్రమమో తామెలా తేలుస్తామని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా లేఅవుట్ల రిజిస్ట్రేషన్లలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇరు శాఖల మధ్య సమన్వయలోపం, కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం లేఅవుట్ల విషయంలో కఠినంగా ఉం డాలని నిబంధనలు చెబుతుండటం, రిజి స్ట్రేషన్ చేయకూడని లేఅవుట్లను మున్సిపల్ శాఖ సరిగా గుర్తించలేకపోవడం, రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ మున్సిపల్ వర్గాల నుంచి లేఖలు వచ్చిన చోట్ల రిజిస్ట్రేషన్ల శాఖ ఆ మున్సిపాలిటీల పరిధిలో లేఅవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి కూడా గండి పడుతోంది. అయితే, ఈ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ మున్సిపల్ శాఖను కోరినా మొన్నటి వరకు ఎన్నికల బిజీలో ఉన్న పురపాలక శాఖ ఇంకా స్పందిచనట్లు తెలుస్తోంది. పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు 15–20 ఏళ్లుగా లే అవుట్ల వ్యాపారం రియల్ వ్యాపారులకు కాసులు కుమ్మరిస్తోంది. అయితే, వీరు అనుమతులు తీసుకోకపోవడం, నిబంధన లు పాటించకపోవడంతో కొనుగోలుదారులు నష్టపోవాల్సి వస్తోంది. డీటీసీపీ, హెచ్ఎండీఏ లాంటి సంస్థల అనుమతుల్లేకుండానే అంతస్తుల మీద అంతస్తులు రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీంతో కొత్త మున్సిపల్ చట్టంలో లేఅవుట్లపై కఠిన నిబంధనలు విధించారు. స్పష్టత ఇవ్వండి: ఈ అక్రమ లేఅవుట్ల విషయంలో తామెలా ముందుకెళ్లాలన్న దానిపై చట్టపరంగా ఉన్న సానుకూలతలు తెలుపుతూ స్పష్టత ఇవ్వాలని రిజిస్ట్రేషన్ల శాఖ మున్సిపల్ ఉన్నతాధికారులను కోరినట్లు తెలుస్తోంది. మున్సిపల్ కమి షనర్ల నుంచి లేఖలు రావడం ప్రారంభం కాగానే రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఈ లేఖను పురపాలక శాఖకు పంపగా, మొన్నటివరకు ఎన్నికల హడావుడిలోనే ఉన్న మున్సిపల్ అధికారులు దీనిపై ఇంకా స్పష్టతనివ్వలేదు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 250 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు గుర్తించారు. ఈమేరకు ఆ వివరాలు ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల నోటీస్ బోర్డుల్లో డిస్ప్లే చేయడంతో పాటు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు 15 మందితో యాక్షన్ టీం కూడా తయారు చేశారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మున్సిపల్ వర్గాలు కార్యాచరణ చేపట్టాల్సి ఉంది. కొత్త చట్టం ఏం చెబుతోందంటే! కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం పట్టణాలు, నగరా ల్లో లేఅవుట్లు ఏర్పాటు చేసి ప్లాట్లు, ఫ్లాట్ల రూపంలో అమ్మాలంటే నిర్దేశిత ఫార్మాట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తాత్కాలిక లేఅవుట్ ప్లాన్కు మున్సిపల్ అధికారులు 21 రోజుల్లోగా అనుమతిస్తారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ లాంటి ప్రాధికార సంస్థలు అనుమతించిన లేఅవుట్లనే రిజిస్ట్రేషన్ అధికారు లు రిజిస్టర్ చేయాలి. ఈ విషయంలోనే మున్సిపల్ కమిషనర్ల పేరిట రిజిస్ట్రేషన్ల శాఖకు లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై లేఖలు వెళ్తున్నాయి. మున్సిపల్ అధికారుల నుంచి వెళ్తున్న లేఖల విషయంలో గందరగోళం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబు తున్నారు. కొన్ని మున్సిపాలిటీల నుంచి వస్తున్న ఇలాంటి లేఖలతో పాటు ఏ సర్వే నంబర్లో లేఅవుట్లు రిజిస్ట్రేషన్ చేయొద్దో ఖచ్చితంగా ప్రస్తావిస్తున్నారని, కొన్నిచోట్ల లేఖ లురాసి వదిలేస్తున్నారని చెబుతున్నారు. లేఖలు వచ్చిన మున్సిపాలిటీల్లో ఏ లేఅవుట్ అక్రమమో, ఏ లేఅవుట్ సక్రమమో తామెలా గుర్తిస్తామని అంటున్నారు. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఏదైనా స్థలం, భూమి లేదా భవనాన్ని రిజిస్టర్ చేయడం వరకే తమ బాధ్యత అని చెబుతున్నారు. ఒకవేళ డెవలపర్లను లేఅవుట్ అనుమతులు చూపెట్టా లని అడిగినా నకిలీ అనుమతులు చూపెడితే వాటిని గుర్తించలేమంటున్నారు. ఏదేమైనా తమ మున్సిపాలిటీ/ కార్పొరేషన్ పరిధిలో అక్రమ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ లేఖలు వచ్చిన అన్ని మున్సిపాలిటీల్లో 10 రోజుల నుంచే పూర్తిగా కొత్త లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశామని వారు చెబుతున్నారు. -
తెలంగాణ భూ చట్టం!
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం అమలుతోపాటు రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రస్తుతం అమ ల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తున్న సర్కారు.. కొత్త చట్టం అమల్లో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది. కొత్త రెవెన్యూ చట్టానికి ‘తెలంగాణ భూ చట్టం’గా నామకరణం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న రెవెన్యూ చట్టాలను ఏకీకృతం చేసేందుకు ప్రస్తుతం మనుగడలో ఉన్న చట్టాలతోపాటు కొత్త చట్టం తీరుతెన్నులు ఎలా ఉండాలనే కోణంలో కలెక్టర్ల నుంచి సమాచారాన్ని కోరింది. అసైన్డ్, ఇనాం, రక్షిత, కౌలుదారు, ప్రభుత్వ భూములు ఇలా ఒక్కో కేటగిరీకి సంబంధించి కలె క్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకుంది. కొత్త చట్టం రూపకల్పనపై నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నిపుణుల అభిప్రాయాన్ని కూడా కోరింది. వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయాలా లేక ఇతర శాఖల్లో విలీనం చేయాలా అనే అంశం పైనా సర్కారు కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ముందు మూడు మార్గాలు..! ప్రస్తుతం అమలులో ఉన్న 124 చట్టాలు/నియమాలను ఒకే గొడుగు కిందకు తేవడంతోపాటు కాలం చెల్లిన వాటిని తొలగించడం, గజిబిజిగా ఉన్న చట్టాలను సరళతరం చేస్తూ ఒకే చట్టం తీసుకువస్తారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టైటిల్ గ్యారంటీ చట్టం అమలు అంశాన్ని పరిశీలిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 1999లో అప్పటి రెవెన్యూ మంత్రి దేవేందర్గౌడ్ 196 చట్టాలను ఏకీకృతం చేస్తూ ‘ఏపీ ల్యాండ్ రెవెన్యూ కోడ్’ను ప్రవేశపెట్టడమేగాకుండా రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం ఫైలును ఢిల్లీకి పంపారు. తరువాత ఆ ఫైలు అటకెక్క గా రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా రెవెన్యూ కోడ్ను రూపొందించాలనే అభిప్రాయాన్ని రెవెన్యూ వర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్... ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్–2019ను ప్రవేశపెట్టాలనే వాదన కొందరు అధికారుల్లో వినిపిస్తోంది. ఈ కోడ్ ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల స్థానంలో ఒకే చట్టం అందుబాటులోకి రానుంది. ఈ రెండింటితోపాటు భూ పరిపాలనకు మూలాధారంగా భావించే ల్యాండ్ రెవెన్యూ యాక్ట్–1907ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ చట్టానికి రూపకల్పన చేస్తే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చ సాగుతోంది. భూ పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశించే ఈ పాత చట్టం కొలబద్ధగా కొత్త చట్టం రూపొందించడం ఉత్తమమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు... కొత్త చట్టానికి తుదిరూపు ఇచ్చేందుకు పలు మార్గాల్లో అభిప్రాయ సేకరణ జరుపుతున్న ప్రభుత్వం.. న్యాయపరమైన అవరోధాలు రాకుండా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం నిపుణుల అభిప్రాయాలను తీసుకుంది. పీఓటీ, ఇనాం, రక్షిత కౌలుదారు, భూ ఆక్రమణ, భూ దురాక్రమణ, ఎల్టీఆర్, అసైన్డ్, సర్వే, హద్దులు తదితర అంశాలపై సమాచారాన్ని సేకరించింది. మరోవైపు రెవెన్యూశాఖలో కొందరు ఉద్యోగుల అవినీతిపై గుర్రుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. వీఆర్వో, వీఆర్ఏల రెవెన్యూ సేవలకు ఫుల్స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు కనబడుతోంది. ఇదే అంశంపై శాసనసభ సాక్షిగా స్పష్టమైన సంకేతాలిచ్చారు. అయితే వారిని పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలలో విలీనం చేయలా లేదా పనితీరు, మెరిట్ ఆధారంగా రెవెన్యూలోనే సర్దుబాటు చేయాలా? అనే దానిపై కొత్త చట్టంలో స్పష్టత రానుంది. అలాగే బ్రిటిష్ కాలంలో శిస్తు వసూలు చేయడానికి నియమించిన కలెక్టర్ల వ్యవస్థను ఇప్పటికీ కొనసాగిస్తుండటాన్ని తప్పుబడుతున్న సీఎం.. కలెక్టర్ల హోదాను పునఃనిర్వచించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హోదాల మార్పు కలెక్టర్లకే పరిమితం చేయకుండా ఆర్డీఓ, తహసీల్దార్లకు కూడా వర్తింపజేసే అవకాశం ఉంది. -
డొంక కదులుతోంది
అమలాపురం టౌన్: లేని భూములకు నకిలీ రికార్డులు సృష్టించి బ్యాంక్ నుంచి రూ.1.50 కోట్ల రుణాన్ని కాజేసిన ఘటనపై జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఈ భూ మాయజాలంపై డొంక కదులుతోంది. ప్రాథమికంగా ఈ తప్పిదానికి బాధ్యులని భావిస్తున్న సూత్రధారి అమలాపురం రూరల్ మండలం కామనగరువు వీఆర్వో ప్రశాంత్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ టోకరా వెలుగు చూసినప్పటి నుంచి ఆ వీఆర్వో అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. లేని 53 ఎకరాలకు అధికారికంగా ధ్రువీకరిస్తూ పత్రాలు జారీ చేసిన అప్పటి అమలాపురం తహసీల్దార్, ప్రస్తుతం కాకినాడ కలెక్టరేట్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న బేబీ జ్ఞానాంబకు వారం రోజుల్లో దీనిపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇక అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో భూమి రికార్డులను కంప్యూటర్లో నకిలీ పత్రాలను తయారు చేసిన కంప్యూటర్ ఆపరేటర్ వంశీపై క్రిమినల్ కేసు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ నుంచి గురువారం ఉత్వర్వులు జారీ అయ్యాయి. ఒక పథకం ప్రకారం జరిగిన ఈ భూ మాయలో భారీ రుణం ఇచ్చిన అమలాపురం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారుల పాత్రపైనా జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు దృష్టి పెట్టి పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. తొలుత ఆ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్కు ఇక్కడ జరిగిన పరిణామాలపై లేఖ రాయాలని జిల్లా కలెక్టర్ అమలాపురం ఆర్డీవోను ఆదేశించారు. బ్యాంక్కు నకిలీ పత్రాలు సమర్పించిన అసలు సూత్రధారి ఉప్పలగుప్తానికి చెందిన మోటూరి బలరామమూర్తికి ఒకేసారి రూ.1.50 కోట్ల రుణం ఇలా ఇచ్చారనే కోణంలో కూడా బ్యాంక్ ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించే పనిలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. అలాగే నకిలీ పత్రాలతో అడ్డగోలుగా అంతటి రుణాన్ని ఇచ్చిన హెచ్డీఎఫ్సీ అమలాపురం శాఖపై విచారణ జరపాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ షణ్ముఖరావును జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి ఆదేశించారు. దీనిపై షణ్ముఖరావు ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారులతో మాట్లాడారు. నకిలీ పత్రాలతో రుణం ఇచ్చిన డాక్యుమెంట్లను తమకు చూపించాలని కోరారు. అయితే ఆ డాక్యుమెంట్లు తమ హెడ్ క్వార్టర్ ముంబైలో ఉన్నాయని బ్యాంక్ అధికారులు బదులిచ్చారు. తక్షణమే వాటిని ఇక్కడికి రప్పించాలని ఆయన చెప్పడంతో ముంబై నుంచి వాటిని రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక లేని భూములకు కళ్లు మూసుకుని ఈసీ, తనఖా రిజిస్ట్రేషన్ చేసిన అమలాపురం రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందిపైనా జిల్లా రెవెన్యూ అధికారులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రార్ ఉన్నతాధికారులు కూడా ఈ భూ మాయపై చాపకింద నీరులా విచారణ చేస్తున్నారు. ఇలా పలు కోణాల్లో జిల్లా రెవెన్యూ అధికారులు ఈ నకిలీ భూమి రికార్డుల మోసాలపై ఉచ్చు బిగిస్తూ బాధ్యులపై చర్య తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
తిరుపతిలో రిజిస్ట్రేషన్ల కుంభకోణం?
తిరుపతిలోని హథీరాంజీ మఠం భూములను ఇష్టారాజ్యంగా కబ్జాచేశారు. గత ఐదేళ్ల కాలంలో కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు పప్పూబెల్లంలా పంచుకుతినేశారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అడ్డదారుల్లో రిజిస్ట్రేషన్లు చేసి జేబులు నింపుకునేశారు. సర్వే నం.13లోనే 110 ఎకరాలకు సంబంధించి సుమారు 602 అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై కూలంకుషంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాక్షి, తిరుపతి : తిరుపతి రూరల్ మండలం అవిలాల పరిధిలో వందలాది ఎకరాలు హథీరాంజీ మఠం భూములు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు హథీరాంజీ మఠం భూములపై దృష్టి సారించారు. ఆ భూములను ఐదుగురు వ్యక్తులు కలిసి పంచుకునేశారు. ప్లాట్లు వేసి అమ్మకానికి పెట్టారు. కొనుగోలుదారులు రిజి స్ట్రేషన్ స్థలాలు కావాలని అడగడంతో అక్రమార్కులు సబ్రిజిస్టార్ కార్యాలయంలో కొందరిని సంప్రదించారు. అక్రమార్కులకు రిజిస్టార్ కార్యాలయంలోని కొందరు అధికారులు తోడవడంతో విక్రయాలు సులభతరమయ్యాయి. అడ్డదారిలో రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని అడ్డదిడ్డంగా మఠం భూములను రిజిస్ట్రేషన్ చేసి అమ్మి సొమ్ముచేసుకోవడం ప్రారంభించారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. 2014వ సంవత్సరం నుంచి 2019 మధ్య కాలంలో తిరుపతి రూరల్ పరిధిలోని సర్వే నంబర్ 13, 14, 15, 17, 18లోని 275 ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఒకే ఒక్క సర్వే నెంబర్ 13లో మాత్రమే 110 ఎకరాలకు సంబంధించి 602 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో తేలింది. మిగిలిన సర్వే నంబర్లలో మరో 165 ఎకరాలకు సంబంధించి 500 వరకు రిజిస్ట్రేషన్లు చేపినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే అడ్డదారిలో 1,102 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. చేతులు మారిన కోట్ల రూపాయలు మఠం భూముల క్రయవిక్రయాల్లో టీడీపీ నాయకులు, అప్పటి రెవెన్యూ, సబ్ రిజిస్టార్ కార్యాలయంలోని కొందరు, ట్రాన్స్కోలో పనిచేసే మరికొందరు కుమ్ముక్కై కోట్ల రూపాయలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని శ్రీవారి కైంకర్యాల కోసం కేటాయించిన మఠం భూములను ఇష్టానుసారంగా అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఈ అక్రమాలు అధికం కావడంతో ఇటీవల రెవెన్యూ, పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన తాత్కాలిక గృహాలను తొలగించినట్లు తెలుస్తోంది. అమ్మి సొమ్ముచేసుకున్న వారు మాత్రం పరారీలో ఉంటే.. అక్రమార్కుల ధన దాహానికి అప్పులుచేసి కొనుగోలు చేసుకున్న సామాన్యులు మాత్రం బలయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారించి.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారినుంచి డబ్బులు వసూళ్లు చేసి స్థలాలు కొనుగోలుచేసి మోసపోయిన సామాన్యులకు తిరిగి ఇప్పించమని కోరుతున్నారు. చేసుకుని అడ్డదిడ్డంగా మఠం భూములను రిజిస్ట్రేషన్ చేసి అమ్మి సొమ్ము చేసుకోవడం ప్రారంభిం చారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. 2014వ సంవత్సరం నుంచి 2019 మధ్య కాలం లో తిరుపతి రూరల్ పరిధిలోని సర్వే నంబర్ 13, 14, 15, 17, 18లోని 275 ఎకరాల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు అందినట్లు తెలిసింది. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఒకే ఒక్క సర్వే నెంబర్ 13లో మాత్రమే 110 ఎకరాలకు సంబంధించి 602 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు విచారణలో తేలింది. మిగిలిన సర్వే నంబర్లలో మరో 165 ఎకరాలకు సంబంధించి 500 వరకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే అడ్డదారిలో 1,102 రిజిస్ట్రేషన్లు జరిగి నట్లు గుర్తించారు. చేతులు మారిన కోట్ల రూపాయలు మఠం భూముల క్రయవిక్రయాల్లో టీడీపీ నాయకులు, అప్పటి రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు, ట్రాన్స్కోలో పనిచేసే మరికొందరు కుమ్మక్కై కోట్ల రూపాయలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ పాత్ర కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని శ్రీవారి కైంకర్యాల కోసం కేటాయించిన మఠం భూములను ఇష్టానుసారంగా అమ్మి సొమ్ముచేసుకున్నారు. ఈ అక్రమాలు అధికం కావడంతో ఇటీవల రెవెన్యూ, పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా నిర్మించిన తాత్కాలిక గృహాలను తొలగించినట్లు తెలుస్తోంది. అమ్మి సొమ్ము చేసుకున్న వారు మాత్రం పరారీలో ఉంటే అక్రమార్కుల ధన దాహానికి అప్పులుచేసి కొనుగోలు చేసుకున్న సామాన్యులు మాత్రం బలయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు విచారించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారినుంచి డబ్బులు వసూలు చేసి స్థలాలు కొనుగోలు చేసి మోసపోయిన సామాన్యులకు తిరిగి ఇప్పించమని కోరుతున్నారు. -
పాస్బుక్స్ లేకుండానే రిజిస్ట్రేషన్!
సాక్షి, యాదగిరిగుట్ట(నల్గొండ) : పాస్పుస్తకాలు లేకుండానే తమ భూమిని వేరేవారి పేరుమీద ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావని యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లికి చెందిన ఓ కుటుంబం సబ్ రిజిస్ట్రార్ను నిలదీశారు. ఈ సంఘటన మంగళవారం గుట్ట సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గౌరాయపల్లికి చెందిన బైరా ఎల్లయ్య, సిద్ధమ్మలకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమారుడు వెంకటేష్ ఇటీవల మరణించాడు. దీంతో పెద్ద కోడలు యాదమ్మ పిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటుంది. ఎల్లయ్యకు గ్రామంలోని 267, 268, 269 సర్వేనంబర్లలో 4ఎకరాల 9 గుంటల భూమి ఉంది. ఈ భూమిని పంచాలని వృద్ధులైన ఎల్లయ్య–సిద్దమ్మ దంపతులను పెద్ద కోడలు అడగడంతో చిన్న కుమారుడు సిద్ధులుతో పాటు సమానంగా పంచి, మిగిలిన భూమిని తాము, ఆడ పిల్లలకు ఇస్తానని చెప్పారు. దర్శనానికి వచ్చి.. గతనెల రోజుల క్రితం వృద్ధుడైన ఎల్లయ్యను కోడలు యాదమ్మ హైదరాబాద్కు తీసుకెళ్లింది. గత శనివారం ఉదయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దర్శనానికి తీసుకొచ్చింది. అక్కడ అతడి దగ్గర ఉన్న జీరాక్స్ భూమి పత్రాలను తీసుకొని, సబ్ రిజిస్ట్రేషన్ వద్ద ఓ డ్యాక్యుమెంట్ కార్యాలయంలో రిజిస్టేషన్ ప్రాసెస్ను పూర్తి చేసింది. అనంతరం కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి సహాయంతో 4.9 ఎకరాల్లో 2.5ఎకరాల భూమిని యాదమ్మ తన పేరున చేసుకుంది. రిజిస్ట్రేషన్ పెండింగ్లో పెట్టాలని వినతి.. ఇది తెలుసుకున్న ఎల్లయ్య భార్య సిద్ధమ్మ, బిడ్డలు కనకమ్మ, రజిత, అనితలు అదే రోజు సాయంత్రం అధికారుల వద్దకు వచ్చి యాదమ్మ జీరాక్స్ పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్ చేసుకుందని, దానిని పెండింగ్లో పెట్టాలని, 4.9 ఎకరాలకు సంబంధించిన ఒరి జినల్ పాస్పుస్తకాలు, టైటిల్ డీడీలు తమ వద్ద ఉ న్నాయని వినతిపత్రం ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్న మరో సారి ఎల్లయ్య భార్య, కుమార్తెలు కార్యాలయానికి వచ్చి జీరాక్స్ పేపర్లతో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారని, మీరు ఎంత లంచం తీసుకున్నారని, కార్యాలయంలో పని చేసే నవీన్ అనే వ్యక్తే డాక్యుమెంట్ దగ్గరుండి తయారు చేశారని ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకొని బాధితుల వద్ద సమాచారం సేకరించి శాంతిపజేశారు. ఇదే విషయమై సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ వివరణ అడగగా.. ఎల్లయ్య పెద్ద కొడలు యాదమ్మ గత శనివారం సర్వే నంబర్ 267, 268, 269లో ఉన్న 4.9 ఎకరాల భూమిలో 2.5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డాక్యుమెంట్ తీసుకువచ్చారని, అందులో జీరాక్స్ ఉన్న విషయాన్ని అంతగా గమనించలేదన్నారు. ఈ విషయమై ఎల్లయ్య భార్య సిద్ధమ్మ, ముగ్గురు కూతుర్లు వచ్చారు. జిరాక్స్ పత్రాలతో, తమ నాన్నను మోసం చేసి యాదమ్మ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుందని, దానిని నిలిపివేయాలని వినతి ఇచ్చారు. ప్రస్తుతం దానిని పరిశీలిస్తున్నామని, ఈ విషయంలో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని సబ్ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. -
రూటు మార్చెన్..!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాలనాపరంగా రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. పారదర్శకతకు పెద్దపీట వేయాలని యోచిస్తున్న ఆ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సదరు కార్యాలయాల నుంచి పొందాలంటే పడే ప్రయాస నుంచి విముక్తి కలిగేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు అమర్చగా.. ప్రస్తుతం స్థిరాస్తి క్రయ విక్రయాలు పూర్తయిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్ల కోసం దళారుల ప్రమేయం లేకుండా.. కార్యాలయాల చుట్టూ తిరగకుండా నేరుగా కొనుగోలుదారుడికే ధ్రువపత్రాలు అందేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని.. రిజిస్ట్రార్ కార్యాలయంలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి కొనుగోలుదారుడి మొబైల్ నంబర్కు ఓటీపీ వచ్చేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. రిజిస్ట్రేషన్ సమయంలో సదరు వ్యక్తులు తమకు సంబంధించిన సెల్ నంబర్, చిరునామా తదితర వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వాటి ఆధారంగా ఓటీపీ(వన్టైమ్ పాస్వర్డ్) నంబర్ వారికి పంపిస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొనుగోలుదారుడి సెల్కు ఓటీపీ వస్తుంది. దానిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చూపిస్తే వారికి సంబంధించిన డాక్యుమెంట్లను వెంటనే ఇచ్చేస్తారు. జిల్లాలో మొత్తం 9 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఖమ్మంలో రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్ కార్యాలయం, ఎంవీ అండ్ ఆడిట్ కార్యాలయం ఉన్నాయి. వీటితోపాటు సత్తుపల్లి, కల్లూరు, మధిర, వైరా, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో భూముల క్రయ విక్రయాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్లు నిత్యం జరుగుతుంటాయి. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంబంధిత వ్యక్తులకు స్కానింగ్ అనంతరం డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చే ప్రక్రియలో కొనుగోలుదారులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం ప్రవేశ పెట్టిన ఈ పద్ధతి ద్వారా నేరుగా కొనుగోలుదారుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి డాక్యుమెంట్లు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇబ్బందులు తొలగించేందుకే.. భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న అనంతరం డాక్యుమెంట్లు తీసుకోవడం ఇప్పటివరకు కొనుగోలుదారులకు కొంత ఇబ్బందికరంగా ఉండేది. అయితే వీటిని నివారించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఇకపై తమ దస్తావేజుల కోసం డాక్యుమెంట్ రైటప్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్లు సిద్ధం కాగానే కొనుగోలుదారుడి సెల్కు వన్టైం పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. ఓటీపీ నంబర్ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్కు సంబంధిత వ్యక్తి చూపిస్తే డాక్యుమెంట్లను నేరుగా తీసుకోవచ్చు. వాస్తవానికి ఆన్లైన్లో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం అందుబాటులో ఉన్నా.. ఎక్కువ శాతం మంది ఇప్పటికీ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లను ఆశ్రయిస్తున్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే రిజిస్ట్రేషన్ అనంతరం నాలుగు లేదా వారం రోజులకు కానీ స్కాన్ అయిన డాక్యుమెంట్లు తిరిగి రావడం లేదు. ఈలోగా సంబంధిత కొనుగోలుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగి డాక్యుమెంట్లు ఎప్పుడు వస్తాయో అర్థం కాని పరిస్థితి ఉండేది. దీంతో మధ్యవర్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఆధారపడి కొనుగోలుదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే సదరు వ్యక్తుల ఫోన్కు ఎస్ఎంఎస్ వచ్చేలా ఏర్పాటు చేశారు. తాజాగా రిటర్న్ డాక్యుమెంట్ కోసం కూడా ఎస్ఎంఎస్ ఇస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రక్రియ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలులోకి వచ్చింది. దీంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ చేయించుకున్న కొనుగోలుదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి. పారదర్శకతకు పెద్దపీట.. రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పారదర్శకత ఉండేలా ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసమే కొత్త చర్యలకు ఆ శాఖ శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానం ద్వారా కొనుగోలుదారులకు చాలా ఉపయోగకరం కానున్నది. తమ డాక్యుమెంట్ల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూ కాలాన్ని వృథా చేసుకోకుండా.. తమ సెల్కు డాక్యుమెంట్లు తీసుకోమని ఓటీపీ వచ్చినప్పుడు కార్యాలయానికి వెళ్లి నేరుగా డాక్యుమెంట్లు తీసుకోవచ్చు. కార్యాలయానికి వెళ్లి సబ్ రిజిస్ట్రార్కు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఫోన్ నంబర్కు వచ్చిన ఓటీపీ నంబర్ను చూపించినట్లయితే.. సబ్ రిజిస్ట్రార్ ఓటీపీని సరిచూపి డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చేస్తారు. అలాగే ఓటీపీ విధానం వల్ల రెండు విధాలుగా లాభం కూడా ఉంటుంది. గతంలో డాక్యుమెంట్లను డాక్యుమెంట్ రైటర్ ద్వారా కొనుగోలుదారులు తీసుకునే వారు. దీనివల్ల సబ్ రిజిస్ట్రార్కు సంబంధిత డాక్యుమెంట్లు ఎవరు తీసుకెళ్లింది సమాచారం ఉండేది కాదు. అయితే ప్రస్తుతం నేరుగా సబ్ రిజిస్ట్రార్ చేతుల మీదుగానే డాక్యుమెంట్లు అందజేస్తుండడంతో ఆయనకు కూడా డాక్యుమెంట్లు సంబంధిత వ్యక్తులకు అప్పగించినట్లు తెలిసి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డాక్యుమెంట్లు అందజేసినట్లయితే కొన్ని డాక్యుమెంట్లు స్కాన్ కాకుండానే కొనుగోలుదారులకు అందజేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఓటీపీ విధానం వల్ల డాక్యుమెంట్ స్కాన్ చేసిన అనంతరం సంబంధిత కొనుగోలుదారుడికి ఓటీపీ వెళ్తుంది. దీనివల్ల ప్రతి డాక్యుమెంట్ స్కాన్ చేసినట్లుగా గుర్తించవచ్చు. ఓటీపీ చూపితే చాలు.. స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో కొనుగోలుదారులు సులువుగా తమ డాక్యుమెంట్లను పొందేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ కొత్త చర్యలు ఇటీవలే ప్రారంభించింది. ఈ విధానంతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్లు సంబంధిత కొనుగోలుదారులు ఒకటి, రెండు రోజుల్లో తీసుకోవచ్చు. డాక్యుమెంట్లు స్కాన్ అయిన వెంటనే కొనుగోలుదారుడి సెల్కు ఓటీపీ వస్తుంది. దీనిని సబ్ రిజిస్ట్రార్కు చూపించినట్లయితే డాక్యుమెంట్లు ఇచ్చేస్తారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ విధానంలో పారదర్శకత ఉన్నట్లు అవుతుంది. – అడపా రవీందర్, సబ్ రిజిస్ట్రార్ -
శ్రీరామా.. నీవే దిక్కు!
షాద్నగర్ రూరల్: ఆ భూములను స్థానిక రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు. కౌలుదారు హక్కు కలిగి భూమి శిస్తు చెల్లిస్తూ పంటలు పండించుకుంటున్నారు. అయితే, ఆ భూములు శ్రీ సీతారామస్వామి దేవాలయానికి చెందినవని రెవెన్యూ రికార్డుల్లో నమోదైంది. ఇది తెలుసుకున్న రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన దేవాదాయ శాఖ అధికారులను రైతులు అడ్డుకున్నారు. తమకు బతుకుదెరువు అయిన భూములను వదులుకోబోమన్నారు. ఫరూఖ్నగర్ మండలం రంగంపల్లి గ్రామంలో రాజోలి లక్ష్మణ్రావుకు కొన్నేళ్ల క్రితం 351 నుంచి 401 సర్వే నంబర్లలో సుమారు 140 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గ్రామ రైతులు సాగుచేసుకుంటూ పట్టాదారు అయిన రాజోలి లక్ష్మణ్రావుకు శిస్తులు చెల్లించే వారు. కాలక్రమేణ రాజోలి లక్ష్మణ్రావు సదరు భూమిని చేవెళ్ల డివిజన్ షాబాద్ మండల పరిధిలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయానికి దూపదీప నైవేద్యాల కోసం రాసినట్లు గ్రామస్తులు తెలిపారు. 1960 సంవత్సరం వరకు రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములు రాజోలి లక్ష్మణ్రావు పేరు పైనే ఉన్నాయి. ఆ తర్వాత శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందినవని రికార్డులు చెబుతున్నాయి. 1960 నుంచి 2012 వరకు రెవెన్యూ రికార్డుల్లో రైతులు కౌలుదారులుగా ఉన్నారు. ఆ తర్వాత 2012 నుంచి దేవాదాయశాఖ భూములుగా మారి కౌలుదారులుగా ఉన్న రైతుల పేర్లు రికార్డుల్లో కనిపించడం లేదు. న్యాయం కోసం రైతుల పోరాటం రాజోలి లక్ష్మణ్రావు పేరు పైన ఉన్న భూములు దేవాదాయ శాఖకు చెందినవిగా రెవెన్యూ రికార్డుల్లో మార్పు జరగడంతో రైతులు పోరాటం ప్రారంభించారు. ఈ విషయమై 2007లో ఓఆర్సీలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. నిజానికి ఈ భూములు దేవాదాయ శాఖకు చెందినవా కావా అని తెలియజేయాలని హై కోర్టు దేవాదాయ శాఖ అధికారులను కోరింది. దీంతో రైతులు అప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ అధికారులను సంప్రదించి ఈ భూములకు సంబందించిన వివరాలను ఇవ్వాలని కోరారు. రెండు జిల్లాల్లోనూ ఈ భూములు దేవాదాయ శాఖకు సంబంధించినవి కావని అధికారులు తెలిపారు. దీంతో హైకోర్టు రైతులు సాగు చేస్తున్న భూములకు ఓఆర్సీలు ఇవ్వాలని అప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆర్డీఓను ఆదేశించింది. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన జాప్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓఆర్సీ రాకపోవడం, ఆర్డీఓలో రైతులకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో వారు రంగారెడ్డి జిల్లా జేసీ వద్దకు అప్పీలుకు వెళ్లారు. ఇటీవల జేసీ వద్ద కూడా రైతులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో రైతులు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. భూముల స్వాధీనానికి అధికారుల యత్నం జాయింట్ కలెక్టర్ ఇచ్చిన తీర్పుతో రంగంపల్లి గ్రామశివారులోని భూములు రంగారెడ్డి జిల్లాషాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి సంబందించినవని దేవాదాయ శాఖ అధికారులు గత పది రోజుల క్రితం భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకొని భూమిలో పాతిన బోర్డులను తొలగించారు. భూములను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో దేవాదాయ శాఖ అధికారులు వెనుదిరిగారు. ఊరు కనుమరుగుకానుంది! గ్రామంలో 100 కుటుంబాలు ఉండగా దాదాపుగా 700 జనాభా ఉంది. ఆ గ్రామస్తులకు వ్యవసాయ మే జీవనాధారం. గ్రామ శివారులోని 140 ఎకరా ల భూమిని సాగుచేస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. ఈ గ్రామంలోని 90శాతం రైతులకు పట్టా భూములు లేవు. దీంతో ఆ గ్రామ రైతులు లక్ష్మణ్రావుకు చెందిన ఈ భూమిలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తాము నిర్మించుకున్న ఇళ్లు కూడా ఈ భూముల్లో ఉన్నాయని, అధికారులు భూ ములను స్వాధీనం చేసుకుంటే ఊరే ఖాళీ అవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడు పోతే ఎక్కడ ఉండాలి కూలీ పనులు చేస్తూ వచ్చిన డబ్బులను కూడ బెట్టి ఉండడానికి వంద గజాల స్ధలంలో ఇల్లు కట్టుకున్నాం. మేము కట్టుకున్న ఇళ్ళ స్ధలాలు సీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందినవని అధికారులు చెబుతున్నారు. మేము వ్యవసాయం చేసుకొని జీవనోపాధిని పొందుతున్న భూములు కూడా దేవాలయం భూములే అంటున్నారు. మేము చదువుకోకపోవడంతో భూములకు సంబంధించిన రికార్డులను తెలుసుకోలేకపోతున్నాం. వందల ఏళ్ళ నుంచి సాగుచేస్తున్న భూములు ఇప్పుడు దేవాలయం భూములు అంటే మేము ఎలా బతికేది. సర్వే చేసిన తర్వాత ఇళ్లను కూడా ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారు. ఇళ్లు పోతే మేము ఎక్కడ జీవించాలి. అధికారులే న్యాయం చేయాలి ఆ భూములే మాకు జీవనాధారం ప్రస్తుతం దేవాలయ భూములుగా చెబుతున్న పొలాన్ని కొన్ని సంవత్సరాలుగా సాగుచేస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా పట్టాదారుడి పేరు మీద ఉన్న పొలాల్లో తాము కౌలుదారులుగా ఉన్నాం. ఆ పొలాలు ఇప్పుడు దేవాలయం భూములని చెబుతున్నారు. భూములు స్వాధీనం చేసుకుంటే మేము జీవనోపాధిని కోల్పోతాం. – పురుగుల ఎల్లయ్య, రైతు, రంగంపల్లి నిబంధల ప్రకారం భూములు ఆలయానికి చెందినవి రెవెన్యూ రికార్డుల ప్రకారం రంగంపల్లిలోని భూములు శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి చెందినవి జిల్లా జాయింట్ కలెక్టర్ ఇటీవల తీర్పు ఇచ్చారు. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లాం. గ్రామస్తులు అడ్డుకొని గొడవ చేశారు. దీంతో భూములు ఖాళీ చేసేందుకు వారికి కొద్ది సమయం ఇచ్చాం. – శ్రీనివాసశర్మ, ఈఓ, శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం, షాబాద్ మండలం -
నిఘా నీడలో.. ‘రిజిస్ట్రేషన్’
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కార్యాలయ కార్యకలాపాలు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూనుకుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూములకు సంబంధించి రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.. నిత్యం కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు.. ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా.. అనే విషయాలను ఏరోజుకారోజు తెలుసుకునేందుకు వీలుగా రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ.. జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజువారీగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లు, కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు వీలు కలుగుతుంది. జిల్లావ్యాప్తంగా 9 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. ఖమ్మంలోని రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్స్ కార్యాలయం, ఎంవీ అండ్ ఆడిట్ కార్యాలయం ఉన్నాయి. వీటితోపాటు సత్తుపల్లి, కల్లూరు, మధిర, వైరా, ఖమ్మం రూరల్, కూసుమంచి మండలాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో భూముల క్రయవిక్రయాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అయితే వీటిని రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా.. ఎవరూ మోసపోకుండా ఉండేందుకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఆస్తులు అమ్మే క్రమంలో దొంగ సంతకాలు పెట్టకుండా.. నకిలీ డాక్యుమెంట్లు చూపించకుండా ఉండేందుకు.. క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ల సమయంలో దళారుల ప్రమేయాన్ని అరికట్టేందుకు నిఘాను కట్టుదిట్టం చేసింది. కార్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు.. రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల అక్రమాలు జరగకుండా ఉండేందుకు వీలు కలుగుతోంది. రాష్ట్ర శాఖకు అనుసంధానం.. జిల్లావ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాష్ట్ర శాఖ ఐజీ కార్యాలయానికి అనుసంధానం చేశారు. దీనిద్వారా రాష్ట్రంతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో జరుగుతున్న కార్యకలాపాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర శాఖలోని అధికారులు తెలుసుకునే వీలుంటుంది. ఏ ప్రాంతం నుంచి అయినా ఫిర్యాదులు వచ్చినట్లయితే ఆ సమయంలో జరిగిన రిజిస్ట్రేషన్ను రాష్ట్ర శాఖ కార్యాలయంలోనే పరిశీలించి.. చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ల తీరును కూడా పరిశీలించేందుకు ఉన్నతాధికారులకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చిన వారికి ఏదైనా అనుమానం ఉన్నట్లయితే ఆరోజు జరిగిన రిజిస్ట్రేషన్కు సంబంధించిన సీసీ పుటేజీని కూడా కట్ చేసి ఆయా వ్యక్తులకు అందజేయనున్నారు. నిత్యం నిఘా.. జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండేసి చొప్పున సీసీ కెమెరాలు, ఒక టీవీ, కంప్యూటర్ను రాష్ట్ర శాఖ ఏర్పాటు చేయించింది. టీసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన పుటేజీ మొత్తం ఆయా కేంద్రాలతోపాటు రాష్ట్ర ఐజీ కార్యాలయంలో నిక్షిప్తమై ఉంటుంది. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే అక్కడ పుటేజీని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేవైసీ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్న శాఖ మరో అడుగు ముందుకేసి రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే కార్యకలాపాలను సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టనున్నారు. అలాగే క్రయ, విక్రయదారులు కేవైసీ(ఆధార్ నంబర్) ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనిద్వారా కంప్యూటర్లో వారి ఆధార్ నంబర్ నమోదు చేయగా.. క్రయ, విక్రయదారులకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారులకు అందుబాటులో ఉంటుంది. దీంతో వారు ఆ భూములు, ఆస్తులకు సంబంధించిన వారా..? కాదా..? అనే విషయాలను తెలుసుకుని రిజిస్ట్రేషన్లు పకడ్బందీగా చేసే వీలు కలుగుతుంది. కేవైసీ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రతి పని పారదర్శకంగా జరిగేందుకు వీలు కలిగింది. పకడ్బందీగా నిర్వహించేందుకు.. జిల్లాలోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్లను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేవైసీ ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించిన రాష్ట్ర శాఖ అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై నిఘా ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలు కలిగింది. – అడపా రవీందర్, సబ్ రిజిస్ట్రార్ -
డబుల్ బారెల్ గన్తో బెదిరింపులు
నేరేడ్మెట్: భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో డబుల్ బారెల్ గన్తో బెదిరించిన సంఘటనలో నేరేడ్మెట్ పోలీసులు 8మందిని అరెస్టు చేసి, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ పేర్కొన్నారు. శనివారం నేరేడ్మెట్ సీఐ నర్సింహ్మాస్వామితో కలిసి ఏసీపీ మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఏసీపీ తెలిపిన మేరకు.. నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని మధురానగర్లో రామ్నర్సింహకు సిమెంట్ దుకాణం ఉంది. మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామంలో రామ్నర్సింహభార్య పేరుతో 14వేల చదరపు గజాల స్థలం ఉంది. గత ఏడాది సెప్టెంబర్లో అమీర్పేట్ నర్సింహులు మధ్యవర్తిగా మణికొండకు చెందిన పొలిశెట్టి పెండ్యాలలో ఉన్న భూమి కొనుగోలుకు సిమెంట్ వ్యాపారి రామ్నర్సింహతో రూ.7కోట్లకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఒప్పందం సమయంలో 25శాతం ప్రకారం రూ.1కోటి నగదు, మరో కోటి బ్యాంకు ద్వారా పొలిశెట్టి చెల్లించాడు. మరో 25శాతం గత ఏడాది డిసెంబర్లో, ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ సమయంలో మిగితా 50శాతం డబ్బులు చెల్లిస్తానని పొలిశెట్టి ఒప్పందం సందర్భంగా చెప్పాడు. వాయిదా ప్రకారం డబ్బులు చెల్లించాలని రామ్నర్సింహ పలుసార్లు అడిగినా ఇప్పుడుఅప్పుడూ అంటూ పొలిశెట్టి కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సుమారు 8గంటల ప్రాంతంలో తనతోపాటు మరో 7మంది అనుచరులను వెంట బెట్టుకొని రెండు ఇన్నోవా కార్లలో మధురానగర్లోని సిమెంట్ దుకాణం వద్దకు వచ్చాడు. ఆ సమయంలో రామ్నర్సింహ దుకాణంలో లేరు. గుమాస్తా పాండును పొలిశెట్టి, అనుచరులు ‘మీ సార్ ఎక్కడ...భూమి రిజిస్ట్రేషన్ చేయకుంటే బాగుండద’ని.. డబుల్ బారెల్ గన్తో భయభ్రాంతులకు గురి చేశారు. గుమాస్తా వెంటనే యజమానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అనంతరం రామ్నర్సింహ తన న్యాయవాది ద్వారా 100కు ఫోన్ చేశాడు. వెంటనే పెట్రోలింగ్,నేరేడ్మెట్ పోలీసులు రంగంలోకి దిగి సిమెంట్ దుకాణం వద్ద ఉన్న పొలిశెట్టితోపాటు అతని అనుచరులు చెగూరి నర్సింహ, చంద్రమణి త్రిపాఠి(యూపీ లైసెన్స్–ఆయుధం కలిగిన వ్యక్తి), రామకిషన్,సునీల్కుమార్, బాలకిషన్, యూసుఫ్ఖాన్, ముక్తార్(బౌన్సర్లు)లను అదుపులోకి తీసుకున్నారు. భూయజమాని ఫిర్యాదు మేరకు బెదిరింపులు, ఆరŠమ్స్సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 8మందిని అరెస్టు చేసి, ఆయుధంతోపాటు 6రౌండ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. బంజారాహిల్స్ ఠాణాలో గన్ గురించి రిపోర్టు చేసినట్టు నిందితుడు తెలిపారని, అసలు లైసెన్స్ ఉందా లేదా?అని విచారణ చేస్తున్నామని, ఉంటే రద్దు చేయాలని పై అధికారులకు లేఖ రాస్తామని ఏసీపీ వివరించారు. -
పట్టా భూములకు రిజిస్ట్రేషన్ బంద్
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్) : ఇల్లు కట్టాలన్నా.. పెళ్లి చేయాలన్నా.. డబ్బుతో కూడుకున్న వ్యవహారం. వీటికి తోడు కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు.. ఇవన్నీ తీరాలంటే పేద రైతులు తమ పొలాలను అమ్ముకోవడమే ఏకైక మార్గం. కష్టాలో ఉన్న రైతులు అత్యవసర సమయంలో పట్టా భూములను అమ్ముకుందామంటే వారికి పెద్ద చిక్కే వచ్చి పడింది. శంషాబాద్ మండలంలోని బహదూర్గూడలో ఉన్న పట్టా భూముల రిజిస్ట్రేషన్లను కొన్ని నెలల నుంచి నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 1 నుంచి 76 వరకు ఉండగా.. కేవలం సర్వేనంబర్లు 28, 62లో 650 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. మిగతా సర్వే నంబర్లలో రైతులకు సుమారు 600 ఎకరాల పట్టా భూములుండగా.. వాటిలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇక్కడి భూములు మొదటి నుంచి వివాదాస్పదంగా మారడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. రైతులకు వారి భూములకు సంబంధించిన పట్టా పాస్బుక్లు, టైటిల్ డీడ్లు కూడా అందజేశారు. అయితే కొన్నేళ్ల కిందటి నుంచి ఈ భూములకు మ్యూటేషన్ను కూడా నిలిపివేశారు. నకిలీ డాక్యుమెంట్ల రద్దుతో.. సర్వే నంబర్లు 28, 62లోని ప్రభుత్వ భూములకు నకిలీ సర్వే నంబర్లు వేసి అక్రమార్కులు పత్రాలు సృష్టించారు. ఈ భూముల్లో పెద్ద ఎత్తున వెంచరు చేసి అమ్మకానికి పెట్టారు. విషయం వెలుగు చూడడంతో అధికారులు ఈ భూములకు సంబంధించిన నకిలీ పత్రాల సేల్ డీడ్లను గత అక్టోబరులో రద్దు చేశారు. ఇక్కడి నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. బహదూర్గూడలో సర్వే నంబర్లు వివాదాస్పదం కావడంతో పాటు వెబ్ పహాణీలో రైతుల వివరాలు నమోదు చేయలేదు. దీంతో స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పట్టా భూములకు రిజిస్ట్రేషన్ను నిలిపివేశారు. వెంచరులోని ప్లాట్లకు దర్జాగా రిజిస్ట్రేషన్లు.. గ్రామంలోని పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు నిరాకరిస్తున్న అధికారులు ఇక్కడ వెలసిన అక్రమ వెంచర్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. జీఓ 111 పరిధిలో వెంచర్లు చేయడం నిషేధం. కానీ ఇక్కడ వెంచర్లు వేసి రియల్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ చేయడం లేదు. మాకు సర్వే నంబర్లు 73, 14లో రెండు ఎకరాల పట్టా భూమి ఉంది. మా అన్న కూతురు పెళ్లీడుకు వచ్చింది. భూమి అమ్ముకుని పెళ్లి చేద్దామంటే రిజిస్ట్రేషన్ నిలిపి వేశారు. ఎవరూ కొనడానికి రావడం లేదు. -మల్లేష్, బహదూర్గూడ, శంషాబాద్. వెబ్ పహాణీలో వివరాలు లేనందుకే.. వెబ్ పహాణీలో రైతుల వివరాలు లేకపోవడంతోనే రిజిస్ట్రేషన్ను నిలిపివేస్తున్నాం. రైతుల వద్ద పాస్బుక్లు, టైటిల్ ఉన్నా నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేదు. వెంచర్లలో గజాల చొప్పున ప్లాట్లు ఉంటాయి కాబట్టి వాటికి వెబ్ పహాణీతో సంబంధం ఉండదు. - ఎంఏ.నయీం, సబ్ రిజస్ట్రార్, శంషాబాద్. రీ సర్వే చేయాల్సి ఉంది బహదూర్గూడ భూములకు మొదటి నుంచి సర్వే నిర్వహించ లేదు. ఇక్కడ మొత్తం 1250 ఎకరాల భూములుండగా.. ఇందులో 650 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవి. మిగతావి రైతుల పట్టా భూములు. వీటికి సర్వే నిర్వహించి కొత్త సర్వే నంబర్లు ఇచ్చిన తర్వాత వెబ్ పహాణీలో నమోదు చేస్తాం. వచ్చే నెలలో భూములను సర్వే చేసేందుకు కృషిచేస్తాం. - సురేష్కుమార్, తహసీల్దార్, శంషాబాద్. -
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ పత్రాలు
బద్వేలు: ఇళ్లు, భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన దస్తావేజు నకల్లు, చరిత్ర తెలిపే ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ) కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. కొంతమేర అవగాహన, కంప్యూటరు పరిజ్ఞానం ఉంటే సులువుగా వీటిని పొందవచ్చు. పైసా ఖర్చు లేకుండా ఇంటి నుంచే ఈసీలు, సీసీలు పొందే అవకాశాన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఈ నెల ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఈసీకి 30 ఏళ్ల లోపు అయితే రూ.220, 30 సంవత్సరాలు పైబడితే రూ.520, దస్తావేజు నకళ్ల కోసం రూ.220 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు ఆన్లైన్లో వీటిని పొందే అవకాశం కల్పించారు. పొందడం ఇలా...: ఆన్లైన్లో ఉచితంగా ఈసీలు, సీసీలు తీసుకోవావడానికి కంప్యూటర్, ఇంటర్న్ట్ సౌకర్యం ఉంటే చాలు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్.ఏపీ.జీఓవీ.ఇన్ అని టైపు చేయాలి. అప్పుడు ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ అధికార వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ♦ వెబ్సైట్ కిందిభాగంలో కుడివైపున ‘న్యూ ఇంటెంటివిస్’ కింద ఆన్లైన్ ఈసీ, ఆన్లైన సీసీ, డాక్యుమెంట్ ప్రిపరేషన్ అనే అప్షన్లు కనిపిస్తాయి. వీటిపై క్లిక్ చేస్తే పబ్లిక్ ఆన్లైన్ సర్వీసు అని వస్తుంది. ♦ దీనిపై క్లిక్ చేస్తే యూజర్ ఐడీ, పాస్వర్డు ఆప్షన్లు వస్తాయి. అందులో నాట్ ఏ మెంబరు? పై క్లిక్ చేస్తే సిటిజన్ రిజిస్ట్రేషన్ అని ఓపెన్ అవుతుంది. అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పేరు, యూజర్ ఐడీ, పాస్వర్డు, సెల్ నెంబరు, ఆధార్ నెంబరు, ఈ–మెయిల్, అడ్రస్ వంటి వివరాలు టూపు చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం సెల్ఫోన్కు వచ్చిన వన్టైమ్ పాస్వర్డును నమోదు చేసి యూజర్ ఐడీ సహాయంతో లాగిన్ అవ్వాలి, ♦ అనంతరం ‘పబ్లిక్ ఆన్లైన్ సర్వీసుకు వెళ్లి యూజర్ ఐడీ, పాస్వర్డుతో లాగిన్కాగానే పబ్లిక్ ఆన్లైను పేరుతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన ఎన్కంబరెన్స్ (ఈసీ), సర్టిఫైడ్ కాపీ (దస్తావేజులు, నకళ్లు), డాక్యుమెంట్ ప్రిపరేషన్స్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మనకు కావాల్సిన సర్వీసుపై క్లిక్ చేసి పూర్తి వివరాలను నింపి సబ్మిట్ చేయాలి. ♦ ఉదాహరణకు సర్టిఫైడ్ కాపీ (సీసీ)లోకి వెళ్లాలంటే జిల్లా, ప్రాంతం, డాక్యుమెంట్ నెంబరు, సంవత్సరం వివరాలను ఎంటర్ చేస్తే అప్పుడు, డీడ్ పర్టిక్యూలర్ ఆఫ్ డాక్యుమెంట్ అని వస్తుంది. దీనిపై క్లిక్ చేస్తే సెల్కు వన్టైమ్ పాస్వర్డు వస్తుంది. దీన్ని ఎంటర్ చేస్తే సర్టిఫైడ్ కాపీ రిసీవ్డ్ అని ఓపెన్ అవుతుంది. అనంతరం కావాలంటే దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. లేదంటే క్లిక్ ఆప్షన్ నుంచి ఈసీలు, నకళ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. . ♦ 1983 నుంచి ఆన్లైన్లో ఉన్న ఈసీలు వస్తాయి. అంతకుముందువి కావాలంటే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి సొమ్ము చెల్లించి పొందవచ్చు. ♦ సర్టిఫైడ్ కాపీ నకళ్లు 1999 నుంచి ఆన్లైన్లో ఉన్నాయి. అంతకుముందువి కావాలంటే రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి నగదు చెల్లించి పొందాల్సి ఉంటుంది. ♦ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని ముందుగా వ్యవసాయ భూముల క్రయ దస్తావేజులు (సేల్) అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ సైట్ ఎర్రర్ చూపిస్తోంది. త్వరలో సౌకర్యం అందుబాటులోకి రానుంది. ♦ ప్రీ రిజిస్ట్రేషన్ దస్తావేజు ప్రిపరేషన్కు ఆధార్ వివరాలు తప్పనిసరిగా అందజేయాలి. -
రెవె‘న్యూ’పాలన
రిజిస్ట్రేషన్ల శాఖ అధికారాలకు త్వరలోనే కత్తెర పడనుంది. పాలనా సంస్కరణల్లో భాగంగా ఈ శాఖ పరిధి, అధికారాలను కుదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విభాగం నిర్వహిస్తున్న విధుల్లో ఎక్కువ భాగం పనులను రెవెన్యూశాఖకు బదలాయించాలని సంకల్పించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూ రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ ముగియడంతో త్వరలోనే కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడానికి ప్రభుత్వ సన్నాహాలు చేస్తోంది. మార్చి 11న జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో పాస్ పుస్తకాలను జారీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే అదే రోజు నుంచి రెవె‘న్యూ’ పాలనకు తెరలేవనుంది. ఇప్పటి వరకు ప్రత్యేక విభాగంగా వ్యవహరించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆ రోజు నుంచి కొత్త రూపు సంతరించుకోనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధి తగ్గనుంది. ఇకపై ఎక్కడైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉందో దాని పరిధి ఆ మండలానికే పరిమితం కానుంది. మిగతా చోట్ల తహసీల్దార్లే రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారు. భూముల క్రయ విక్రయాల బాధ్యతలను వారే చూస్తారు. సగం చోట్ల ఖాళీ! ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని సగం మండలాల్లో రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను తహసీల్దార్లే పర్యవేక్షించే పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుత రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో 45 మండలాలకుగాను కేవలం 22 మంది సబ్రిజిస్ట్రార్లు మాత్రమే ఉన్నారు. దీంతో వీరు మినహా మిగతా మండలాల బాధ్యతలు తహసీల్లార్ద నెత్తిన పడనున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో పరిగి, వికారాబాద్, కొడంగల్, తాండూరులో మాత్రమే రిజిస్ట్రేషన్ ఆఫీసులున్నాయి. దీంతో ఇవి ప్రతి రోజూ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లతో కిటకిటలాడుతాయి. ఇకపై ఇవి కేవలం ఆయా నియోజకవర్గ కేంద్రాలకే పరిమితం కానున్నాయి. అయితే, అదే రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ప్రభుత్వ ఆదాయంలో సగం ఇక్కడి నుంచే వస్తోంది. ప్రధాన ఆదాయార్జన శాఖగా చెప్పుకునే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ భూములు, స్థలాలు, ఇతర దస్తావేజుల నమోదుతో జిల్లాలో ఇబ్బడిముబ్బడిగా రాబడి లభిస్తోంది. రాజధాని పరిసరాల్లోనే ఉండడం, నగరీకరణ నేపథ్యంలో జిల్లాలో స్థిరాస్తిరంగం బలంగా ఉంది. దీంతో ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోళ్లు, అగ్రిమెంట్లు సహా ఇతరత్రా డాక్యుమెంట్ల నమోదులోనూ తెలంగాణలోనే ప్రథమ స్థానంలో ఉంది. తాజా నిర్ణయంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిని సంబంధిత మండలానికే పరిమితం చేసినా మిగతా మండలాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ల భారం తహసీల్దార్లను ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఉదాహరణకు యాచారం, మంచాల, కందుకూరు, ఆమనగల్లు, కొత్తూరు, నందిగామ, మొయినాబాద్, కడ్తాల, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో తహసీల్దార్ల ఇతర పనులపై ప్రభావం పడనుంది. అదే సమయంలో భూ వివాదాలు కూడా ఎక్కువే కావడంతో ఈ కొత్త విధులు తమ మెడకు ఎక్కడ చిక్కుకుంటాయోననే ఆ మండలాల తహసీల్దార్లు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు పట్టణ నియోజకవర్గాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అధికంగా ఉన్నందున వీటిని పునర్విభజించే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ల విధులను దాదాపుగా రెవెన్యూశాఖకు బదలాయిస్తుండడంతో జిల్లా రిజిస్ట్రార్ బాధ్యతలేమిటనేది చర్చనీయాంశంగా మారింది. -
శూన్య మాసంలోనూ సూపర్
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో దూసుకుపోతోంది. గత రెండు నెలలుగా లక్షల సంఖ్యలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ లావాదేవీలు ఆ శాఖకు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. శూన్యమాసం అయినప్పటికీ డిసెంబర్, జనవరి నెలలమధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరగడంతో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్టు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా డిసెంబర్లో అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగి రూ.430 కోట్లకు పైగా ఆదాయం రావడం గమనార్హం. రికార్డుస్థాయి ఆదాయం డిసెంబర్నెల ఆదాయం రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో ఎప్పు డూ ఒక్క నెలలో రూ.400 కోట్లకు మించి ఆదాయం రాలేదు. లక్షకు లోపు మాత్రమే రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగేవి. కానీ, డిసెంబర్ నెలలో మాత్రం ఒక లక్షా 8వేలకు పైగా లావాదేవీల ద్వారా రూ.430 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం. ఇదే ఊపు జనవరిలోనూ కొనసాగుతోంది. ఈనెలలో ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం ఈ నెలలో ఇప్పటివరకు 42,286 లావాదేవీలు జరగ్గా, రూ.151.16 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం కేవలం డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారానే రాగా, ఆన్లైన్ ఈ–చలాన్ల ద్వారా మరో రూ.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.4వేల కోట్లు దాటుతుందని అంచనా. ఇప్పటివరకు ఈ ఏడాది 8,50,148 లావాదేవీలు జరగ్గా, రూ. 3,440.58 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలలకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఈసారి లక్ష్యాన్ని మించుతుందని అంచనా వేస్తున్నారు. మంచిరోజులు కాకపోయినా.. డిసెంబర్ 16 నుంచి శూన్యమాసం ప్రారంభమైంది. సంక్రాంతి దాటేంతవరకు ఉండే ఈ మాసంలో శుభ కార్యాలకు మెజార్టీ ప్రజలు ఇష్టపడరు. అయినా, రిజిస్ట్రేషన్ లావాదేవీలు పోటెత్తుతుండడం గమనార్హం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ శుభ కార్యం కాదని, ఆషాఢమాసంలో బంగారం ఎక్కువగా కొన్నట్టు ఓ పనయిపోతుందిలే అనే భావనలో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, గతంలో మాదిరిగా శూన్యమాసం సెంటిమెంట్ను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో పంట భూముల రిజిస్ట్రేషన్లు అంతగా లేకపోయినా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని, ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. సొంత సర్వర్తో వేగంగా లావాదేవీలు.. సాంకేతికంగా శాఖాపరమైన మార్పులు కూడా ఆదాయాభివృద్ధికి కారణమవుతున్నాయని అంటున్నారు. ఇటీవలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్ నుంచి విడిపోయి ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ, హైదరాబాద్ గచ్చిబౌలిలో అతి పెద్ద సర్వర్ను కూడా ఏర్పాటు చేసుకుని దానిని రాష్ట్రంలోని 141 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానం చేసింది. దీంతో గతంలో మాదిరిగా సాంకేతిక సమస్యల వల్ల రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో అంతరాయం కలగడం లేదని, చకచకా ప్రక్రియ ముగిసిపోతుండడంతో మరిన్ని లావాదేవీలు నమోదు చేస్తున్నామని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. -
రిజిస్ట్రేషన్లన్నీ వీడియో రికార్డింగ్
- నవంబర్ 1 నుంచి కొత్త విధానం - బలవంతపు రిజిస్ట్రేషన్లు, పోలీసు కేసులు, బోగస్ వ్యక్తులకు చెక్ - సీసీ కెమెరాలతో క్రయ, విక్రయ లావాదేవీలన్నీ రికార్డు - ప్రక్రియ పూర్తయ్యాక కొనుగోలుదారులకు సీడీ రూపంలో అందజేత - భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తితే సాక్ష్యంగా వినియోగం సాక్షి, హైదరాబాద్: మల్లిక్ అనే వ్యక్తి తారక్ నుంచి రెండు ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. వారి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు మొత్తం డబ్బు చెల్లించాడు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మల్లిక్ పేరిట భూమి రిజిస్ట్రేషన్ కూడా అయింది. కానీ నాలుగు నెలల తర్వాత పోలీస్స్టేషన్ నుంచి మల్లిక్కు పిలుపు వచ్చింది. మల్లిక్ తనను బెదిరించి తన రెండెకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, తన భూమి తనకు ఇప్పించాలని తారక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది తెలుసుకున్న మల్లిక్.. ఇంటికి వెళ్లి ఒప్పందం పత్రాలు తెచ్చాడు. కానీ పోలీసులు వాటిని నమ్మలేదు. ‘అలాంటి కాగితాలు ఎన్నయినా సృష్టించొచ్చు కదా.. బెదిరించి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావ్’ అని ప్రశ్నించడంతో మల్లిక్ తెల్లబోయాడు. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో ఎదురవుతున్న ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డబుల్ రిజిస్ట్రేషన్లు, బోగస్ వ్యక్తులు, బలవంతపు రిజిస్ట్రేషన్ల పేరిట తలెత్తుతున్న సమస్యలకు దీనితో పరిష్కారం లభిస్తుందని భావిస్తోంది. దీనిని వచ్చే నవంబర్ ఒకటో తేదీ నుంచే అమలు చేయాలని.. కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ భరోసా కల్పించేందుకు ఆ వీడియోలను సీడీ రూపంలో అందజేయాలని నిర్ణయించింది. అంతా పక్కాగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇప్పటివరకు విక్రేతలు, కొనుగోలుదారులు, సాక్షులు కేవలం సంతకాలు పెట్టడం, వేలిముద్రలు వేయడానికే పరిమితమవుతున్నారు. కానీ కొత్త విధానం అమల్లోకి వచ్చాక విక్రయించేవారు తాను ఫలానా భూమి లేదా ఆస్తిని కొనుగోలుదారుడికి ఇష్టపూర్వకంగానే అమ్ముతున్నానని.. అందుకు సంబంధించిన సొమ్ము కూడా తనకు అందిందని చెప్పాల్సి ఉంటుంది. ఇలా చెప్పే సమయంలో కొనుగోలుదారులు, సాక్షులు, రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది అక్కడే ఉంటారు. ఈ మొత్తం దృశ్యాన్ని సీసీ కెమెరాలో రికార్డు చేస్తారు. అందులోనే తేదీ, సమయం కూడా నమోదవుతాయి. మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఆ వీడియో దృశ్యాలను సీడీలోకి నింపి కొనుగోలుదారులకు అందజేస్తారు. ఇందుకోసం ప్రతి సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకటి కార్యాలయంలో, మరోటి రికార్డుల కోసం వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. ఇప్పటికే 30 కార్యాలయాలకు సీసీ కెమెరాలు అందాయి. మిగతా వాటికి అక్టోబర్ 15 లోగా పంపుతామని, నవంబర్ 1 నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తేస్తామని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. పారదర్శకంగా ఉండేలా చర్యలు సీసీ కెమెరాల ద్వారా క్రయ, విక్రయాలు జరిపేవారితోపాటు రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది వ్యవహారశైలి కూడా రికార్డవుతుందని.. తద్వారా సిబ్బంది పనితీరు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో విక్రేతలు స్వచ్ఛందంగానే అమ్ముతున్నారా లేక బలవంతంగా వ్యవహరిస్తున్నాడా అన్న అంశాలను వారి వ్యవహార శైలిని బట్టి తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు. కొనుగోలుదారులకు భరోసాతోపాటు సాక్ష్యంగా ఉపయోగించుకునే ఆలోచనతో కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్టు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ వి.శ్రీనివాసులు తెలిపారు. ఇందుకు అవసరమైన సాంకేతిక ఏర్పాట్లను పూర్తిచేస్తున్నామని, నవంబర్ 1 నుంచి అమలు చేస్తామని చెప్పారు. -
భూఅక్రమాలపై ఏసీబీ కన్ను
► రాజంపేటలో జోరుగా భూ అక్రమాలు ► రికార్డుల కోసం వచ్చిన అధికారులు ► క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లపై ఆరా ► కాసులు కురిపిస్తున్న భూ వ్యవహారాలు ► కోట్లాది విలువచేసే సర్కారు భూములు ధారాదత్తం రాజంపేట: రాజంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోజరిగిన భూ అక్రమాలపై ఎసీబీ కన్నుపడింది. మండల పరిధిలో రూ.కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. రికార్డుల టాంపరింగ్, కబ్జాలు ఇలా ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారుల్లో భూ బకాసురులు అక్రమ వ్యవహారాలకు తెరతీశారు. రికార్డులు తారుమారు, టాంపరింగ్ చేసి తమవి అన్నట్లుగా చిత్రీకరించుకోవడం రాజంపేటలో అధికం కావడంతో నిజమైన భూబాధితులు అధికారుల అవినీతికి అడ్డుకట్టవేసేందుకు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. ఈనేపథ్యంలోనే ఏసీబీ అధికారులు మంగళవారం తహసీల్దారు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సందర్శించారు. అక్కడి అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ స్థలాలను కట్టబెట్టి...కోట్లు లాభర్జన: తహసీల్దారు కార్యాలయంలో కొందరు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా భూ బకాసురులకు కట్టబెడుతున్నారు. ఇందుకు కొంతమంది అధికారులు ఇప్పటికే కోట్లాది రూపాయలు వెనుకేసుకున్నట్లుగా ఆరోపణలు వెలుడుతున్నాయి. ఓ రెవెన్యూ అధికారి బాధ్యతలు తీసుకున్నప్పటి నుం చి కోట్లాది రూపాయలు భూ కుం భకోణంకు పాల్పడినట్లుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినప్పటికి ఏమీ చేయలేని నిస్సహాయíస్థితిలో రెవెన్యూ ఉన్నతాధికారులు ఉండిపోయారు. అధికార పార్టీ అండదండలతో భూ అక్రమ వ్యవహారాలను తమ్ముళ్లకు అనుకూలంగా వ్యవహారిస్తూ రూ.కోట్లు వెనుకవేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు వీఆర్వోలు కూడా భూ బకాసురు లకు అంతర్గత మద్దత్తు ఇస్తూ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఏసీబీ ఆరాతో రెవెన్యూ అధికారుల్లో వణుకు ఏసీబీ అధికారులు తహసీల్దారు కార్యాలయానికి రావడంతో కొందరు అధికారుల్లో వణుకుపుట్టింది. అలాగే ప్రభుత్వ భూములను కూడా రికార్డులు మార్చేసి రాజం పేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిష్టర్లు కూడా చేయించుకున్నారంటే ఎంత పక్కాగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు సహకారం లేకుంటే ఇది సాధ్యమయ్యే పని కాదని భూ బాధితులు చెబుతున్నారు. తాళ్లపాక, ఊటుకూరు, వెంకటరాజంపే ట, బోయనపల్లె, అన్నమయ్య థీం పార్కు ఏరియా, బైపాస్ రహదారి, చక్రాలమడుగు ఏరియా, ఎస్ఆర్పాళెం(పుల్లంపేట మండలం), రాయచోటి రోడ్డు తదితర ప్రాంతాల్లో భూ అక్రమ వ్యవహారాలు కోట్లరూపాయలు సాగినట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా యి. పైవాటిలో కొన్నింటికి సంబంధించి భూ రికార్డులలో గోల్మాల్ చేసినట్లు ఏసీబీ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఇంటిస్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం ఎక్కడాలేదనే రాజంపేట రెవెన్యూ అధికారులు మాత్రం బడాబాబులు, అధికారపార్టీ నేతలకు మాత్రం దగ్గరుండి సాగు, ఇంటి స్థలాలను చూపించి.. వారి వద్ద నుంచి కొంత మొత్తం తీసుకొని కట్టబెడుతున్నారు. గత మూడేళ్లుగా కొనసాగిన ప్రభుత్వ భూ అక్రమ వ్యవహారం ఎట్టకేలకు ఏసీబీని కూడా తాకింది...ఏసీబీ అధికారులు ఏ క్షణానైనా దాడి చేయవచ్చనే భయాందోళన రెవెన్యూ వర్గాల్లో హాట్టాఫిక్గా మారింది. రికార్డుల కోసం.. ఏసీబీ అధికారులు మండల రెవెన్యూ కార్యాలయాల్లో రికార్డుల కోసం ఆయాశాఖల అధికారులను సంప్రందించినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు గత కొంతకాలంగా రాజంపేటలో జరుగుతున్న భూ అక్రమ వ్యవహారాలపై నిఘా ఉం చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక భూ అక్రమ వ్యవహా రాలు అధికమయ్యాయి. ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించడం లాంటివి స్థానిక రెవెన్యూ అధి కారుల సహకారంతో చేపట్టినట్లు ఆరోపణలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. ప్ర«భుత్వ భూములను తమవి అన్నట్లుగా రికార్డులు సృష్టించుకొని అందులో రియల్ వ్యాపారం చేస్తున్నారు. -
అనూహ్యం.. అతలాకుతలం
► కేంద్రం వరుస షాక్లతో ► రాష్ట్రం బెంబేలు ► రూ.2000 కోట్ల మేరకు పన్నుల వాటాకు గండి ► నోట్ల రద్దుతో ఆదాయ అంచనాలు తలకిందులు సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన రాష్ట్రం... ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి కుదుట పడుతోంది. జిల్లాల ఏర్పాటుతో రియల్ వ్యాపారం ఊపందుకుంది. భూముల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఇక ఆర్థిక లోటు ఉండదు అనుకుంటున్న తరుణంలో పెద్ద నోట్ల రద్దు, కేంద్ర నిధుల్లో కోత ఆర్థిక శాఖను కలవరపెడుతోంది. పెద్ద నోట్ల రద్దుతో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర ఆర్థిక శాఖను అతలాకుతలం చేస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపారం స్తంభించడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం ఊహించనంతగా పడిపో యింది. భవిష్యత్తులో వ్యాట్ పెరుగుతుందనే భరోసా ఉన్నప్పటికీ నగదు లావాదేవీలతో సంబంధమున్న వ్యాపారాలన్నీ స్తబ్దుగా ఉన్నాయి. కొత్త జిల్లాలతో రియల్ వ్యాపారం ఊపందుకుంటున్న తరుణంలో నోట్ల రద్దు ప్రభావం ఒక్కసారిగా దెబ్బతీసిందని ప్రభుత్వం భావిస్తోంది. భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా భారీగా ఆదాయం పెరుగుతుందని ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసుకుంది. కానీ కేంద్రం నిర్ణయంతో అంచనాలు తలకిందులయ్యాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నోట్ల రద్దు పరిణామాలు ఇప్పటికిప్పుడు అంచనా వేసే పరిస్థితి లేదని, కొంతకాలం గడిస్తే రాష్ట్రాలకు వచ్చే ఏయే పన్నులు పెరిగే అవకాశముంది, ఏయే పన్నులు తగ్గే పరిస్థితి ఉందని స్పష్టత వస్తుందని చెబుతున్నారు. కేంద్రానికి లేఖ రాసే యోచన.. ఇదే తరుణంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలో కోత పెట్టడం పుండు మీద కారం చల్లినట్ల యింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి పన్నుల వాటా కింద రూ.13,995 కోట్లు వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. నెలసరి వా యిదాల్లో కేంద్రం ఈ నిధులు విడుదల చేస్తుంది. ఏడాది చివర్లో పన్నుల ద్వారా కేంద్రానికి వచ్చే రాబడికి అనుగుణంగా నిధుల్లో కోత వేస్తుంది. ఈసారి ఆర్థిక సంవత్సరం మధ్యలోనే 48 శాతం కోత విధించింది. దీంతో దాదాపు రూ.2,000 కోట్ల మేరకు పన్నుల వాటాను కేంద్రం కత్తిరించే అవకాశం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కలేసింది. నోట్ల రద్దు ప్రభావానికి తోడు పన్నుల ద్వారా రావాల్సిన రాబడి తగ్గటంతో ఈ నెలలో ఖర్చులకు సరిపడే ఆదాయం సమకూరుతుందా.. లేదా... అని ఆర్థిక శాఖ మల్ల గుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఈ పరిణామాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. గవర్నర్ నరసింహన్కు నివేదించారు. తాజా పరిణామాలతో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అహ్మద్నదీమ్ సిద్దిపేట జోన్: రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ భూసేకరణ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా శాఖపరమైన సంస్కరణలను తాత్కాలికంగా చేపట్టినట్లు రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ అహ్మద్ నదీమ్ అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రిజర్వాయర్ల కోసం 25 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. సంబందిత సేకరణ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను రైతులకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా వేగవంతంగా చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు అందులో బాగంగా తాత్కలికంగా సేకరణ భూముల రిజిస్ట్రేషన్ల కోసం 5 కేంద్రానలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కోన్నారు. కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి, తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహడ్, సిద్దిపేట మండలం ఇమాంబాద్లో సెప్టెంబర్ 1 నుంచి తాత్కలిక రిజిస్ట్రేషన్ కేంద్రాలు పనిచేస్తాయన్నారు. -
నిలుపుదల చట్టవిరుద్ధం!
రాజధాని ప్రాంతంలో రిజిస్ట్రేషన్ల ఆపివేత చెల్లదు ప్రభుత్వ పెద్దల ఒత్తిడివల్లే మెమో జారీ కోర్టుకెళితే అధికారులే ఇరుక్కుంటారు న్యాయ, రెవెన్యూ నిపుణుల స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో భూములు, స్థలాల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం చట్ట విరుద్ధమని న్యాయ, రెవెన్యూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)కు సమీకరణ కింద భూములివ్వని రైతులను వాటిని అమ్ముకోకుండా అరికట్టి ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వ పెద్దలు ఇలా చట్ట విరుద్ధ ప్రక్రియకు తెరలేపారని అభిప్రాయపడ్డారు. రైతులను టార్గెట్ చేస్తూ రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో స్థిరాస్తుల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు ఆపడం అన్యాయమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని ప్రాంతంలో సీఆర్డీఏ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) లేనిదే భూములు, స్థలాల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు చేసేందుకు సబ్ రిజిస్ట్రార్లు నిరాకరిస్తున్నారు. దీంతో భూములు, స్థలాలు అమ్ముకోవాలనుకునే వారు ఇబ్బంది పడుతున్నారు. ‘ఎన్ఓసీ లేనిదే రిజిస్ట్రేషన్ చేయరాదంటే రిజిస్ట్రేషన్లు ఆపివేసినట్లే. ఎందుకంటే భూములు అమ్ముకోవాలనుకుంటున్న రైతులెవరికీ సీఆర్డీఏ నిరభ్యంతర పత్రం ఇవ్వదు. అందువల్ల వారు భూములు అమ్ముకోవడానికి అవకాశం ఉండదు. ఈ దురుద్దేశంతోనే ఎన్ఓసీ నిబంధన అమలు చేయాలని రిజిస్ట్రేషన్ అధికారులపై కీలక నేత ద్వారా ఒత్తిడి తెప్పించింది.’ అని రెవెన్యూ శాఖలో చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి అధికారం ఉన్నా.. ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు నిలిపివేసే అధికారం చట్టపరంగా ప్రభుత్వానికి ఉంటుంది. అయితే రాజధానికి భూసమీకరణ ప్రక్రియ ఆరంభించకముందైతే విశాల ప్రయోజనాల కోసం రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు జీవో ఇస్తే ఎవరూ తప్పుబట్టడానికి ఆస్కారం ఉండేదికాదు. అప్పట్లో సీఆర్డీఏ ప్రతిపాదన మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఈమేరకు ప్రతిపాదన పంపగా రిజిస్ట్రేషన్లు ఆపివేస్తే భూముల ధరలు పడిపోతాయనే సాకు చూపించి ప్రభుత్వం దీన్ని పక్కన పడేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా అసెంబ్లీలో ఈ విషయం ప్రకటించారు. అందువల్ల ఇప్పుడు రిజిస్ట్రేషన్ల నిలిపివేత ఉత్తర్వులిస్తే విమర్శలు వస్తాయని సర్కారు పెద్దలు భయపడి దొడ్డిదారిన రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు చర్యలు తీసుకున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. జరిగిందేమిటి? పూలింగ్ కింద భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతున్నందున తాము ఎన్ఓసీ జారీ చేస్తే మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలని సీఆర్డీఏ షరతుతో ప్రతిపాదన పంపింది. దీని ప్రకారం వెంటనే మెమో జారీ చేయాలని అక్కడి రిజిస్ట్రేషన్ శాఖ అధికారిపై కీలక మంత్రి ఒత్తిడి తెచ్చారు. నిస్సహాయ స్థితిలో అక్కడి అధికారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మెమో జారీ చేశారు. ‘రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ లేదా షరతులు విధిస్తూ మెమో ఇచ్చే అధికారం ప్రభుత్వానికి తప్ప ఎవరికీలేదు. ఎవరైనా కోర్టుకు వెళితే ఈ మెమో నిలవదు. దీన్ని జారీ చేసిన అధికారి ఇరుక్కుంటారు. అయితే కీలక నేత మౌఖిక ఆదేశాలను కాదనే సాహసం చేయలేకే అధికారి మెమో జారీ చేసి ఉండవచ్చు.. ఇలా అధికారులను పావులుగా వాడుకోవడం సర్కారు పెద్దలకు సరికాదు..’ అని సచివాలయంలో రెవెన్యూశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎలాంటి మెమో పంపలేదు ఈ విషయమై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా రాజధాని ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు ఆపివేయాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు పంపలేదని స్పష్టం చేశారు. జిల్లా రిజిస్ట్రార్ మెమో ఇచ్చి ఉంటే తమకు తెలియదని వారు తెలిపారు. -
ప్లాట్లు...పాట్లు
► రాజధాని రైతుల్లో గందరగోళం ► కేటాయింపులపై స్పష్టత కరువు ► కాగితాల్లోనే పంపిణీ !? ► నేటి నుంచి భూముల రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు రాజధాని ప్రాంత రైతుల్లో గందరగోళం నెలకొంది. ప్లాట్ల కేటాయింపుపై ప్రభుత్వ యంత్రాంగానికీ స్పష్టత లేదు. ఈనెల చివరినాటికి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విషయంపై రైతులు మాత్రం ఏ ఆప్షన్లు తీసుకోవాలో అర్థం కాక తలలుపట్టుకుంటున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటే.. ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. ఒకపక్క ప్లాట్ల కేటాయింపులు ఆలస్యం అవుతుంటే.. రాజధాని ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్లపై సర్కారు ఆంక్షలు విధించింది. శుక్రవారం నుంచి ఎన్ఓసీ లేకుండా రిజిస్ట్రేషన్లూ జరపరాదని అధికారులకు ఆదేశాలిచ్చింది. సాక్షి, అమరావతి : రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాలకు చెందిన 22 వేల మంది రైతులు 32 వేల ఎకరాల భూములను భూసమీకరణ పథకం కింద ఇచ్చారు. వారికి తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్ల విషయంలో అటు రైతుల్లో.. అటు అధికారుల్లో గందరగోళం నెలకొనడంతో ప్లాట్ల కేటాయింపు వాయిదా పడుతూ వచ్చింది. గత నెలలో ప్లాట్ల కేటాయింపు విధానాన్ని ప్రకటించి జాయింట్, సింగిల్ ప్లాట్ల కోసం ఆప్షన్లు ఇవ్వాలని రైతులను కోరినా పెద్దగా స్పందించలేదు. గడువు ముగిసే నాటికి 22 వేల మందికి గాను కేవలం 6,992 మంది రైతులు ఆప్షన్లు ఇచ్చారు. మిగిలినవారు ఆప్షన్లకు దూరంగా ఉండిపోయారు. భూములు తీసుకున్న రైతులకు డిసెంబర్లోనే ప్లాట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పింది. ఆ తరువాత సంక్రాంతికని పేర్కొంది. అదీ కాకపోయేసరికి మార్చిలో ఇస్తామని తెలిపింది. మరికొద్దిరోజుల తరువాత ఏప్రిల్, ఆ తరువాత మే నెలలో అని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ప్రస్తుతం జూన్ అన్నారు. ఈ నెలలోనూ పది రోజులు గడచిపోయాయి. అయినా ప్లాట్ల కేటాయింపులో స్పష్టత లేదు. ఈనెల చివరి నాటికి నోటిఫికేషన్ ఇస్తామని అధికారులు చెపుతున్నారు. అది కూడా తుళ్లూరు మండలం నేలపాడు గ్రామానికి సంబంధించిన రైతులకు మాత్రమే ప్లాట్లకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగితాల్లోనే ప్లాట్లు నేలపాడులో రైతులకు చూపెట్టబోయే ప్లాట్లు కాగితాల్లో మాత్రమే ఉంటాయి. క్షేత్రస్థాయిలో ఆ భూములు ఎక్కడొస్తాయనేది ఎవ్వరికీ తెలియదు. దగ్గరగా రావొచ్చు.. దూరంగా ఇవ్వొచ్చు. ఈ విషయాలపై స్పష్టత లేదని తెలుస్తోంది. ప్లాట్ల కేటాయింపు విషయంలో మొదట్లో అధికారులు జాయింట్ ప్లాట్ల విషయాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో గందరగోళం నెలకొంది. దీంతో ప్లాట్ల కేటాయింపునకే బ్రేక్ పడింది. పెద్దల కోసం ఇలాంటి ప్రతిపాదనలు తెచ్చి ప్లాట్ల పంపిణీ మొత్తాన్ని గందరగోళంగా మార్చేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు ప్లాట్ల కేటాయింపులోఆప్షన్లను తెరపైకి తెచ్చారు. దీనిపై అధికారులు పదేపదే ఒత్తిడి తెచ్చినా రైతులు స్పందించకపోవటం గమనార్హం. రైతులిచ్చిన భూములను ప్రభుత్వం ఖాళీగా వదిలేసింది. నిబంధనల ప్రకారం అయితే రైతులు ఇచ్చిన భూములను చదును చేసి లేఅవుట్లు వేయాల్సి ఉంది. ఆ దిశగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. భూములను చదును చేసే ప్రక్రియను కాంట్రాక్టర్లకు కట్టబెట్టినా ఫలితం కనిపించలేదు. చదును పనులు పూర్తయితే తప్ప లేఅవుట్లుగా మార్చి రైతులకిచ్చే పరిస్థితి లేదు. అర్థంకాని ఆప్షన్లు... రైతుల్లో అయోమయం ప్లాట్ల కేటాయింపు విషయంలో ప్రభుత్వం నాలుగు ఆప్షన్లు ప్రకటించినట్లు తెలిసింది. అందులో సుమారు 200 గజాలు ఇచ్చిన వారికి జీ+2, 200 నుంచి వెయ్యి గజాలలోపు వారికి జీ+3, వెయ్యి నుంచి రెండువేలలోపు గజాలు ఇచ్చిన వారికి జీ+7, 2 వేల నుంచి 5 వేల లోపు ఇచ్చిన వారికి జీ+11 అని ప్రకటించినట్లు తెలిసింది. వీటిలో ఏ ఆప్షన్లు తీసుకోవాలో రైతులకు అర్థంకాని పరిస్థితి నెల కొంది. ఒకవేళ ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటే రాబోయే రోజుల్లో నష్టపోయే ప్రమాదం ఉందనే ఆలోచనతో రైతులు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేయరాదని ఆదేశాలిచ్చింది. 29 గ్రామాల పరిధిలో భూములకు సంబంధించి ఎటువంటి లావాదేవీలూ జరపరాదని రిజిస్ట్రేషన్ అధికారులకు గట్టిగా ఉత్తర్వులిచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యానికి రైతులను బలిపశువులను చేయటం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లుండవ్
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్ణయం సాయంత్రం 5 గంటల వరకే చెక్ స్లిప్పులు రిజిస్ట్రేషన్ శాఖలో నేటినుంచి నూతన నిబంధనలు ఏలూరు (ఆర్ఆర్ పేట) : రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రిజిస్ట్రేషన్ విధానంలో బుధవారం నుంచి నూతన నిబంధనల అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. రిజిస్ట్రేషన్ సందర్భంగా ఇచ్చే చెక్ స్లిప్పులను సాయంత్రం 5 గంటలకే నిలుపుదల చేయాలనేది వీటిలో ప్రధాన నిబంధన కాగా.. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ-చలాన్ విధానాన్ని అమలు చేయాలని రెండో నిబంధనగా విధించారు. రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు అందుకు సంబంధించిన ఫీజును బ్యాంకుల్లోనే చెల్లించాల్సి వచ్చేది. కొత్త నిబంధన ప్రకారం కక్షిదారులు తమ బ్యాంక్ ఖాతాల నుంచి నెట్ బ్యాంకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే వెసులుబాటు కలుగుతుంది. ఐతే దీని కోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీని ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రతీ లావాదేవీకి రూ.1,100 అదనంగా చెల్లిం చాల్సి ఉంటుంది. నివేదిక ఇచ్చిన సబ్ రిజిస్ట్రార్ల సంఘం నూతన విధానాలకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్ల సంఘం ప్రభుత్వానికి ఓ నివేదిక సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే డాక్యుమెంట్ చెక్ స్లిప్పులు ఇవ్వాలని సూచిం చింది. ఆ తరువాత సర్వర్ నిలిపివేయడం ద్వారా తమ శాఖలో జరిగే వైట్ కాలర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని పేర్కొంది. సాయంత్రం 5 గంటలకు సర్వర్లను నిలిపివేస్తే కంప్యూటర్లు డాక్యుమెంట్ చెక్ స్లిప్పులను తీసుకోవని, రిజిస్ట్రేషన్లు మాత్రం రాత్రి 10 గంటల వరకూ చేసుకునే అవకాశం ఉంటుందని ఆ నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కొత్త నిబంధనల్ని బుధవారం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. సర్వర్పైనా ఒత్తిడి తగ్గుతుంది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంట్రల్ సర్వర్పై రాష్ట్రంలోని 13 జిల్లాల సమాచార భారం ఒకేసారి పడుతుండటంతో కంప్యూటర్లు తరచూ మొరాయిస్తున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే.. సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు తప్ప ఈ ప్రక్రియలో జాప్యానికి తావుండదని చెబుతున్నారు. మరోవైపు సర్వర్ సామ ర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. సబ్ రిజిస్ట్రార్లకు తగ్గనున్న పనిభారం జిల్లాలో రెండు జిల్లా రిజిస్ట్రార్ కార్యాల యాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, భీమవరం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిద్వారా ప్రతిరోజూ సుమారు 300 నుంచి 500 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ రిజిస్ట్రేషన్లు చేస్తూ ఉంటారు. దశమి, ఏకాదశి, కొన్ని పర్వదినాల్లో ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 100 నుంచి 150 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అవుతుం టాయి. దీనిని ఆసరా చేసుకుని కొంతమంది దళారులు సబ్ రిజిస్ట్రార్లపై ఒత్తిడి తెచ్చి అక్రమాలకు పాల్పడేట్టు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఎక్కు వ రిజిస్ట్రేషన్లు జరిగితే పర్సంటేజీలు భారీగా వస్తాయనే ఆశతో అర్ధరాత్రి వరకూ రిజిస్ట్రేషన్లు చేస్తుంటారనే అపప్రద కూడా ఉంది. డాక్యుమెంట్లు పూర్తయ్యాక వాటిని పరిశీలించాల్సిన కొం దరు అధికారులు చూసీచూడనట్టు వది లేస్తున్నారు. కీలకం కానున్న డేటా ఎంట్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్ల నిర్లిప్తత కారణంగా రిజిస్ట్రేషన్లలో తప్పులు దొర్లుతున్నాయి. డాక్యుమెంట్ నంబర్లతోపాటు కక్షిదారుల పేర్లలోనూ తప్పులు నమోదవుతున్నాయి. వాటిని సరిచేసుకోవడానికి తిరిగి అదే శాఖకు చార్జీలు చెల్లించి, ఒకటి రెండు వారాలు తిరిగితే గాని పని పూర్తికాని పరిస్థితి నెలకొంది. చెక్ స్లిప్పులను 5 గంటలకే నిలుపుదల చేస్తే వారిపై పని ఒత్తిడి తగ్గి డేటా ఎంట్రీ సక్రమంగా జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ రోజు దస్తావేజులు ఆ రోజే పని ఒత్తిడి కారణంగా ఇప్పటివరకూ క్రయదారులకు దస్తావేజులను ఇవ్వడానికి దాదాపు మూడు నుంచి వారం రోజులు పట్టేది. కొత్త విధానంతో ఏ రోజు దస్తావేజులు ఆ రోజే క్రయదారులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. సమయ పాలనపై చైతన్యం వస్తుంది. సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల పనిభారం తగ్గుతుంది. - పి.విజయలక్ష్మి, జిల్లా రిజిస్ట్రార్, ఏలూరు -
సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు
► ఐదెకరాల్లోపు ఉంటే ఉచితంగానే.. జూన్ 2 నుంచి 10 వరకు అవకాశం ► రికార్డులు సరిచేయండి: జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ ► దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లో మ్యుటేషన్ పూర్తి కావాలి ► అధికారులు అవినీతికి పాల్పడినా, నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు ► భూ వ్యవహారాలకు కలెక్టరేట్లో ప్రత్యేక అధికారి.. ► జూన్ 30లోగా అసైన్డ్ భూముల వివరాలను సేకరించండి ► ప్రతి జిల్లాలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు జరపాలి ► ఒక్కో జిల్లాకు రూ.30 లక్షలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూ వివాదాలన్నీ పరిష్కరించి భూమి రికార్డులను సరిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. సాదా బైనామాల(తెల్ల కాగితంపై చేసుకునే భూక్రయవిక్రయాలు)పై గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన భూముల లావాదేవీలన్నింటినీ జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు రిజిస్టర్ చేయాలని సూచించారు. 2014 జూన్ 2 నాటికి సాదా బైనామాలపై ఉన్న ఐదెకరాల లోపు భూమిని ఉచితంగా రిజిస్టర్ చేసి, పేరు మార్పిడి(మ్యుటేషన్) చేయాలని చెప్పారు. ఈ వివరాలన్నీ కంప్యూటరీకరించాలని ఆదేశించారు. సోమవారమిక్కడ ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, సీసీఎల్ఏ రేమండ్ పీటర్, వివిధ శాఖల సీనియర్ అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూవివాదాల పరిష్కారానికి సంబంధించి సీఎం పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ‘‘హెచ్ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా), ఇతర మున్సిపల్ ప్రాంతాలు మినహా గ్రామీణ ప్రాంతాల్లో సాదా బైనామాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరగాలి. భూముల వ్యవహారంలో అవినీతికి, నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’’ అని సీఎం ఆదేశించారు. వారసత్వంగా సంక్రమించిన భూములకు సంబంధించి మ్యుటేషన్ చేసేందుకు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, డబ్బులు ఇవ్వనిదే పని జరగడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. ఇకపై పేరు మార్పిడి (పౌతి)కి దరఖాస్తు వచ్చిన పది రోజుల్లోగా పని పూర్తి కావాలని, 11వ రోజున కలెక్టరేట్కు వివరాలు పంపాలన్నారు. భూవిక్రయం జరిగి రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లో పేరు మార్పిడి జరగాలని, 16వ రోజు వివరాలు కలెక్టరేట్కు అప్లోడ్ చేయాలని స్పష్టంచేశారు. ఈ వ్యవహారాలు చూసేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. నాలా పన్ను దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలన్నారు. మీ సేవా కేంద్రాల్లోనే పన్ను కట్టి, దరఖాస్తు చేసుకుంటే ఈ పని జరగాలని పేర్కొన్నారు. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను ఎక్కువగా వాయిదాలు వేయకుండా త్వరగా పరిష్కరించాలని సూచించారు. అసైన్డ్ భూముల వినియోగంపై ఆరా రాష్ట్రంలో అసైన్డ్ భూములు చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయని సీఎం అభిప్రాయపడ్డారు. వాటిని తిరిగి నిరుపేదలకు అప్పగించాలని, లేదా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. అసైన్డ్ భూముల వివరాలను జూన్ 30లోగా సేకరించాలని ఆదేశించారు. ‘‘అసైన్దారులే భూమిని సాగుచేసుకుంటే(కాస్తు) ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా వ్యవసాయం చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తాం. లేకుంతే తిరిగి పేదలకు పంపిణీ చేద్దాం..’’ అని సీఎం చెప్పారు. ఘనంగా అవతరణ దినోత్సవం జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ పతాకావిష్కరణ చేయాలి. అన్ని కార్యాలయాలు విద్యుత్ దీపాలతో అలంకరించాలి. ప్రజలకు స్వీట్లు పంచాలి. అనాథ శరణాలయాలు, అంధ పాఠశాలలు, ఆసుపత్రుల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయడంతోపాటు మాంసాహారం అందించాలి. ఉపాధి హామీ కూలీలకు పండ్లు, స్వీట్లు ఇవ్వాలి. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గొప్పగా గౌరవించాలి. హోటల్స్, మాల్స్, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో ఉత్సవ వాతావరణం కనిపించాలి. గుడులు, మసీదులు, చర్చిల్లో తెలంగాణ ప్రజల సంక్షేమానికి, వానల కోసం ప్రత్యేక పూజలు చేయాలి. అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి ఉత్సవం నిర్వహించాలి. కవి సమ్మేళనాలు నిర్వహించాలి. ప్రతి జిల్లాకు రూ.30 లక్షల చొప్పున ఉత్సవాల నిర్వహణకు నిధులు ఇస్తున్నాం. హైదరాబాద్లో జరిగే ప్రధాన ఉత్సవానికి ప్రతి జిల్లా నుంచి 50 మంది ప్రముఖులను పంపాలి. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ నియామక పత్రం అందించాలి...’’ అని సీఎం కలెక్టర్లకు సూచించారు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు ప్రజా సంక్షేమం కోసం చేసే కార్యక్రమాల్లో అవినీతిని నిరోధించాలని, కల్యాణలక్ష్మితో పాటు ఇతర కార్యక్రమాల్లో లబ్ధిదారులకు అందించే సాయాన్ని చెక్కు రూపంలో స్థానిక ఎమ్మెల్యేల ద్వారా అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. కల్యాణలక్ష్మి చెక్కులను ఆడపిల్ల తల్లికి అందించాలని, పెళ్లికి ముందే ఈ సాయం అందించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు స్థానికంగా టెండర్లు ‘‘డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఎక్కడికక్కడే టెండర్లు పిలవాలి. స్థానికులతో కట్టించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇసుకను ఉచితంగా అందించాలి..’’ అని సీఎం చెప్పారు. కృష్ణా పుష్కరాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పుష్కర ఘాట్లు, పార్కింగ్ ప్లేస్లు, అప్రోచ్ రోడ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని, నదిలో పడవలు, ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. జోగులాంబ దేవాలయం దగ్గర ఘనంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పదో తరగతి పూర్తి చేసిన అనాథ విద్యార్థులకు ఎలాంటి పరిమితి లేకుండా రెసిడెన్షియల్ స్కూళ్లో చేర్పించాలని ఆదేశించారు. పత్తికి ప్రత్నామ్నాయాన్ని ప్రోత్సహించండి ‘‘వాతావరణం చల్లబడినా ఎండా కాలం అయిపోలేదు. తాగునీటి సరఫరాతో పాటు ఇతర కార్యక్రమాలన్నీ కొనసాగించాలి. వచ్చే ఖరీఫ్కు ఇప్పట్నుంచే సిద్ధం కావాలి. పత్తికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులను ప్రోత్సహించాలి’’ అని సీఎం అధికారులకు సూచించారు. ‘‘సోయాబీన్ విత్తనాలను ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచాలి. డిమాండ్ మేరకు ఇతర విత్తనాలు, అవసరమైనంత డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉంచాలి. మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణం వ్యవసాయ క్షేత్రాల్లో వేగంగా పూర్తి చేయాలి..’’ అని పేర్కొన్నారు. -
ఇక బోగస్ రిజిస్ట్రేషన్లు రద్దు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు, స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అక్రమాలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. విలువైన భూములను తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి బోగస్ రిజిస్ట్రేషన్లతో సామాన్యులు ఎన్నో ఇబ్బందులెదుర్కొంటున్నారు. వీటివల్ల భూవివాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారసత్వంగా వస్తున్న స్థలాలు అక్రమార్కుల పాలవడంతో ఆత్మహత్యలు చేసుకున్నవారెందరో ఉన్నారు. తప్పుడు పత్రాలతో జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతో కబ్జారాయుళ్ల ఆటలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొందరు కేటుగాళ్లు ఇతరుల ఆస్తులను తప్పుడు పత్రాలతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. బోగస్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రపతి ఆమోదం అవసరం తప్పుడు పత్రాలతో జరిగే రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర రిజిస్ట్రేషన్ చట్టాలనే రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. బోగస్ రిజిస్ట్రేషన్ల వల్ల మోసపోయినవారికి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం న్యాయస్థానాలను ఆశ్రయించడమే. ఈ నేపథ్యం లో తప్పుడు రిజస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతిలో మధ్యప్రదేశ్ సర్కారు ఇలాంటి అధికారాన్ని గతంలోనే పొందింది. ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా సంబంధిత ఫైల్ను సిద్ధం చేసింది. న్యాయశాఖ పరిశీలన అనంతరం ఈ ఫైల్ను కేంద్ర హోంశాఖ అమోదానికి పంపనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలి పారు. కేంద్ర హోంశాఖ ఆమోదం తరువాత రాష్ర్టపతి ఆమోదం పొందాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్రం సుముఖత బోగస్ రిజస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాలను రాష్ట్రాలకు ఇస్తే అధికారంలో ఉండే పార్టీ ఇతర పార్టీలకు చెందిన వారిని వేధించే అవకాశం ఉంటుందనే భావనతో కేంద్రం గతంలో ఈ వెసులుబాటు కల్పించలేదు. అయితే, ప్రస్తుతం ఇందుకు సముఖంగానే ఉంది. ఈ మేరకు చట్టంలో సవరణలు తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ సవరణలకు సమయం పడుతుందని, అందుకే మధ్యప్రదేశ్ తరహాలో ఈ అధికారం పొందడానికి ప్రయత్నిస్తున్నామని అధికార వర్గాలు వెల్లడించాయి. -
పెరిగిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
♦ రాష్ట్రంలో పుంజుకున్న భూముల రిజిస్ట్రేషన్లు ♦ ఆర్నెల్లలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం రూ.1,636.17 కోట్లు ♦ గతేడాది కన్నా 31.33 శాతం అధికంగా రాబడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లక్ష్యాన్ని చేరలేక చతికిలపడిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, ఈ ఏడా ది తొలి ఆర్నెల్లలో దూకుడు బాగానే పెంచింది. ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు రూ.1,636.17 కోట్ల రాబడి సాధించింది. గతేడాదితో పోల్చితే 31.83 శాతం (రూ.395.10 కోట్లు) ఆదాయం పెరిగింది. జిల్లాల వారీగా చూస్తే దాదాపు అన్ని జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా పెరగడం ఆ శాఖ ఉన్నతాధికారులకు ఊరట కలిగిస్తోంది. జిల్లాల వారీగా సెప్టెంబర్ నెల వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చిన ఆర్నెల్ల ఆదాయాన్ని పరిశీలి స్తే.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో గతేడాది (రూ.604.25 కోట్లు) కన్నా రూ.246.03 కోట్ల ఆదాయం అదనంగా వచ్చింది. ఆ తర్వాత గతేడాది(రూ.234.05కోట్లు) కన్నా రూ.40 కోట్ల అదనపు ఆదాయంతో హైదరాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. పెరుగుదల విషయానికి వస్తే.. నల్లగొండ జిల్లాలో గతేడాది(రూ.58.78కోట్లు) కన్నా 56.14 శాతం, అత్యల్పంగా నిజామాబాద్ జిల్లాలో గతేడాది (రూ.33.71కోట్లు) కన్నా 11.16 శాతం అధికంగా ఆదాయం నమోదైంది. రెండేళ్లకోమారు రిజిస్ట్రేషన్ ధరలను సమీక్షించడం సాధారణ విషయమే అయినప్పటికీ ఈ ఏడాది ప్రభుత్వం భూముల విలువను పెంచలేదు. గతంలో మాదిరిగానే ఈసారీ ప్రభుత్వం భూముల విలువను పెంచితే రిజిస్ట్రేషన్ల ఆదాయం మరింత పెరిగుండేదని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏపీకన్నా తెలంగాణే బెటర్! రాష్ట్ర పునర్విభజన అనంతరం.. ఆంధ్రప్రదేశ్లో భూముల ధరలు ఆకాశాన్నంటడం కూడా తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏపీలో రాష్ట్ర అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించకపోతుండడంతో.. భూములపై పెట్టుబడులు పెట్టేందుకు కొద్దినెలలు వేచి చూసిన జనం తమ పెట్టుబడులకు తెలంగాణనే అనువైనదిగా భావించారు. తెలంగాణలో ఉంటున్నవారి కొనుగోలు శక్తి పెరగ డంతో పాటు భూముల ధరలు అన్నివర్గాలకు అందుబాటులో ఉన్నాయని రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు. విభజన అనంతరం తెలంగాణలో భూముల ధరలు తగ్గకున్నా, ఆంధ్రప్రదేశ్లో కన్నా తక్కువగా ఉండడం కూడా తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగడానికి కారణాలుగా చెబుతున్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఎలాగుంటుందోనన్న సందేహంతో కూడా కొన్నాళ్లు వేచిచూసిన ప్రజలు, ప్రభుత్వం స్థిరమైనదిగా అనిపించడంతో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అయితే.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ప్రతినెలలోనూ బాగానే పెరుగుతుండగా, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో మాత్రం పెరుగుదల ఓ మోస్తరుగా ఉంది. వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో గతేడాది సెప్టెంబరు కన్నా, ఈ ఏడాది సెప్టెంబరు నెలలో రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. -
చీకటి జీవోతో చిక్కిన ఆదాయం
పీఎన్ కాలనీ:చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకున్నా.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రభుత్వ ఖజానాకు కోట్లలోనే నష్టం వాటిల్లింది. భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ఇటీవల జారీ చేసిన జీవో నెం.398 వల్ల జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.3.70 కోట్ల మేరకు ఆదాయం తగ్గిపోయింది. మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో ఆర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలోని భూములకు తప్ప ఇతర భూముల రిజిస్ట్రేషన్లు నిషేధిస్తూ గత ఏడాది నవంబర్ 29న ప్రభుత్వం 398 నెంబర్తో ఒక జీవోను విడుదల చేసింది. దీని ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాలోనూ భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు బాగా తగ్గిపోయాయి. జిల్లాలో గత నవంబరులో 2,792 రిజిస్ట్రేషన్లు జరగ్గా రిజిస్ట్రేషన్ల శాఖకు * 3,63,20,292 ఆదాయం సమకూరింది. అయితే జీవో నెం. 398 ప్రభావంతో డిసెంబరులో రిజిస్ట్రేషన్ల సంఖ్య సుమారు వెయ్యి వరకు తగ్గిపోయింది. ఆ నెలలో 1754 రిజిస్ట్రేషన్లు జరగ్గా 3,26,15,158 రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. జనవరి మొదటి వారంలోనూ ఇదే పరిస్థితి. ఎట్టకేలకు కళ్లు తెరిచిన ప్రభుత్వం ఈ నెల ఐదో తేదీన 398 జీవోను రద్దు చేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరే జీవో అమల్లో ఉన్న కాలంలో తమ శాఖకు సుమారు 3.70 కోట్ల ఆదాయం తగ్గిపోయిందని, ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం తగ్గడం గతంలో ఎప్పుడూ జరగలేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. యథావిధిగా రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి గత సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయని వారు వెల్లడించారు. జీవో వెలువడిన నాటి నుంచి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో జీవోను రద్దు చేయాలని రియల్టర్లు, డాక్యుమెంట్ రైటర్లు ప్రభుత్వానికి పలు దఫాలు లేఖలు రాయడంతోపాటు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ఎప్పుడూ రద్దీగా కళకళలాడుతూ ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్లు లేక బోసిపోయాయి. సిబ్బంది ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం 398 జీవోను రద్దు చేయడంతో రిజిస్ట్రేషన్ల శాఖకు మళ్లీ పూర్వపు కళ వచ్చింది. -
జీవో 398 రద్దు!
* ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ * రిజిస్ట్రేషన్లకు తొలగనున్న ఆటంకాలు * కొనుగోలుదారులు, స్థిరాస్తి వ్యాపారులకు ఊరట సాక్షి, హైదరాబాద్: యజమానుల స్థిరాస్తి విక్రయ హక్కులను హరించే జీవో 398 రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయించింది. ప్రజలకు ఇబ్బందికరంగా మారిన ఈ జీవోను రద్దు చేసి పాత విధానంలోనే భూములు, స్థలాల రిజిస్ట్రేషన్లు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కార్యదర్శి సాయిప్రసాద్ ఆదేశించారు. వ్యవసాయ భూములకు రెవెన్యూ అధికారుల సబ్ డివిజన్ నివేదిక, వ్యవసాయేతర ఖాళీ స్థలాలకు లేఅవుట్ అప్రూవల్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేయాలంటూ నవంబర్ 28వ తేదీన జారీ చేసిన చీకటి జీవో 398 తీవ్ర వివాదం రేపటం విదితమే. దీనివల్ల ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. జీవోకు వ్యతిరేకంగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతోపాటు దీన్ని రద్దు చేయాలంటూ ప్రజాప్రతినిధులు, సబ్ రిజిస్ట్రార్స్ సంఘం, స్థిరాస్తి వ్యాపారుల సంఘం ప్రతినిధులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. జీవో రద్దు చేయాలంటూ అధికార పక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల నుంచి ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలోఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో జీవోను రద్దు చేస్తామని ప్రకటించిన సీఎం దీనిపై సమీక్షించాలని సాయిప్రసాద్ను ఆదేశించారు. దీంతో ఈ అంశంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో సాయిప్రసాద్ సమీక్షించారు. ఈ జీవోవల్ల అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇబ్బందిపడుతున్న విషయం వాస్తవమేనని, రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంవల్ల రాబడి కూడా పడిపోయిందని అధికారులు వివరించారు. ఆరోగ్య కారణాల వల్ల రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్పీ సింగ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఒకటి రెండు రోజుల్లో జీవో రద్దుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జీవో రద్దయితే లేఅవుట్ అప్రూవల్లేని ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లకు అవరోధం తొలగిపోనుంది. కొనుగోలు అగ్రిమెంటు చేసుకుని ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఊరట కలిగించనుంది. -
ఆంధ్రాలో భారీగా రిజిస్ట్రేషన్ల ఆదాయం
* సెప్టెంబర్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చింది రూ. 255 కోట్లు * పన్నుల ద్వారా ఆదాయం రూ. 2,747 కోట్లు * ఈ ఆర్థిక ఏడాది సెప్టెంబరు వరకు రూ. 24,070 కోట్ల ఆర్జన * గతేడాది ఇదే కాలంలో వచ్చింది రూ. 22,557 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన అనంతరం ఆంధ్రప్రదేశ్లో భూముల క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. ఇందుకు ప్రబల నిదర్శనం రాష్ట్రం విడిపోయిన తరువాత వరుసగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు మూడు నెలల పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పెరగడమే. సెప్టెంబర్ నెలలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.255 కోట్లు వచ్చింది. జూలై నెలలో 250 కోట్ల రూపాయలు ఆదాయం రాగా, ఆగస్టు నెలలో 213 కోట్లు సమకూరింది. ఈ ఏడాది సెప్టెంబర్లో పన్నుల ద్వారా 2,747 కోట్ల రూపాయల ఆదాయం రాగా గత ఏడాది సెప్టెంబర్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాకు 58 శాతం మేర ఆదాయం లెక్క కడితే 2,854 కోట్ల రూపాయల ఆదాయం పన్నుల రూపంలో వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మే వరకు ఆంధ్రాకు 58 శాతం, జూన్ నుంచి రాష్ట్రం విడిపోయాక సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్ను ఆదాయం లెక్క కడితే 24,070 కోట్ల రూపాయలు వచ్చింది. ఇదే గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 58 శాతం మేర లెక్క కడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22,557 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇదే తరహాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు పన్నేతర ఆదాయం 2,246 కోట్ల రూపాయలు రాగా గత ఆర్థిక సంవత్సరంలో 2,165 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం బాగా ఉన్నప్పటికీ పన్నేతర ఆదాయం పెద్దగా రావడం లేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నా యి. పన్నేతర ఆదాయం పెంచుకోవడానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
తెలంగాణ రెవిన్యూ పై ఖుష్
-
తెలంగాణ ఖజానా భేష్
* జూలైలో అంచనాలను మించిన రాష్ర్ట ఆదాయం * పన్ను, పన్నేతర వసూళ్లు రూ. 3822 కోట్లు * వ్యాట్, మద్యం ఆదాయం మెరుగు * పడిపోయిన రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం * రాష్ర్ట విభజన ప్రభావం అంతంతే! సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజన నేపథ్యంలో తెలంగాణ ఆదాయంపై నెలకొన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. విభజన తర్వాత ఆదాయం తగ్గుపోతుందన్న వాదనలు తప్పని రుజువయ్యాయి. తెలంగాణ ప్రాంత ఆదాయ వనరుల్లో ఎలాంటి లోటు లేదని తాజాగా తేలింది. జూలై నెలలో ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ నిధులు ఖజానాకు రావడమే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఇప్పటివరకు తెలంగాణ ఆదాయాన్ని అంచనా వేశారు. అంతేతప్ప ఈ ప్రాంతం నుంచి ఎంత ఆదాయం వస్తుందన్న కచ్చితమైన లెక్కలు లేవు. తాజాగా ఈ విషయంలో స్పష్టత వచ్చింది. అన్ని రకాల పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జూలైలో తెలంగాణకు వచ్చిన ఆదాయాన్ని అధికారులు నిర్ధారించారు. రాష్ర్ట ఆదాయం ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉన్నట్లు తేల్చారు. ఈ ఒక్క నెల ఆదాయం రూ. 3822 కోట్లుగా తేలింది. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో ఎంత ఆదాయం వస్తుందో అర్థంకాక అధికారులు మొదట్లో హైరానా పడ్డారు. రాష్ర్ట విభజన తర్వాత నిత్యం ఖజానాకు జమ అవుతున్న ఆదాయంపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తూ వచ్చారు. తాజాగా వచ్చిన అధికారిక లెక్కలతో స్పష్టత వచ్చింది. వ్యాట్, ఎక్సైజ్ ఆదాయం బాగానే ఉన్నా.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం ఆశించిన మేరకు రాలేదని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే ఆదాయమే తెలంగాణ రాష్ట్రానికి ఆధారం కావడంతో.. ఈ రెండు జిల్లాలపై అధికారులు ఎక్కువగా దృష్టి పెట్టారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక హైదరాబాద్ శివార్లలో ఆశించిన స్థాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు సాగని కారణంగా.. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెద్దగా లేనట్లు సమాచారం. అదీకాక గత నెలలో బిల్డర్లు సిమెంట్ కొనుగోళ్లు ఆపేయడంతో నిర్మాణ రంగంలో పనులు మందగించాయి. దీంతో గృహ నిర్మాణ రంగంలో ఆశించిన పురోగతి లేదు. అయితే మొత్తంగా మాత్రం కొత్త రాష్ర్ట ఆదాయం సంతృప్తికరంగానే ఉన్నట్లు సమాచారం. జూన్లో వచ్చిన ఆదాయంతో పోల్చినా జూలైలో ఆదాయం పెరిగినట్లు ఓ అధికారి వివరించారు. -
ఏపీలో రిజిష్ట్రేషన్ల బాదుడుకు రంగం సిద్ధం
-
'ఆ రెండు జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు మేం ఆపలేదు'
కృష్ణా, గుంటూరు జిల్లాలలో భూముల రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం నిలిపివేయలేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఆ జిల్లాల మధ్య రాజధాని ఏర్పడితే ధరలు పెంచుకోవడం కోసం వ్యాపారులే రిజిస్ట్రేషన్లు చేసుకోవడం లేదని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో కేఈ కృష్ణమూర్తి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆ రెండు జిల్లాల మధ్యే రాజధాని ఏర్పాటవుతుందంటూ ప్రచారం జరగడంతోత వ్యాపారులు ధరలు విపరీతంగా పెంచారని చెప్పారు. భూమల ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అందులో భాగంగా ప్రభుత్వ పరిమితిని దాటిన వారిపై జరిమాన విధిస్తామని అన్నారు. ప్రభుత్వ భూముల వివరాలన్నీ సాధ్యమైనంత త్వరగా వెబ్సైట్లో పెడుతున్నామని వివరించారు. రైతులకు కొత్త పాసు పుస్తకాలు మంజూరు చేస్తామని చెప్పారు. త్వరలో 20 లక్షల మంది లబ్దిదారులకు 25 వేల ఎకరాల భూమి పంపిణీ చేస్తామని ఈ సందర్బంగా కేఈ కృష్ణమూర్తి తెలిపారు. -
భూమి రిజిస్ట్రేషన్లు మూడు రోజులు బంద్ !
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన పుణ్యమాని జిల్లాలో మూడు రోజుల పాటు భూమి రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. విభజన నేపథ్యంలో ఉమ్మడి ఖాతా ను ఈ నెల 30వ తేదీతో ముగిస్తున్నారు. దీంతో కొత్తగా ఏర్పాటు కానున్న సీమాం ధ్రా (ఆంధ్రప్రదేశ్) రాష్ట్రానికి కొత్త ఖాతాను రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రారంభించనుంది. ఈ పరిస్థితుల్లో ఈ నెల 31 నుంచి జూన్ రెండో తేదీ వరకు రిజిస్ట్రేషన్లకి సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు స్తంభించిపోనున్నాయి. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రం స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఆధికారు లు జిల్లాలకు, సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశారు. దీని కారణంగా జిల్లాలో సుమారు రెండు కోట్ల రూపాయలు విలువలు చేసే లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉంది. వేసని సీజన్ లో అధికంగా భూముల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయి. అయితే ఈ మూడో రోజుల పాటు వీటి రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి. అలాగే రైతుల వ్యయవసాయ భూములతో పాటుగా, ఇళ్ల స్థలాలు, ఇతర భూములు, రిజిస్ట్రేషన్లు, అందుకు సంబంధించిన సర్టిఫికెట్ ఆఫ్ కాపీస్ (సీసీలు), అన్ క్రాంబిరేషన్ ధ్రువపత్రాలు (ఈసీలు) రిజిస్ట్రార్ వివాహాలు, కొత్త సంస్థల ఏర్పాటుకి సంబంధించిన రిజిస్ట్రేషన్లు, గతంతో రిజిస్ట్రేషన్ పొందిన నకల్లు తదితర వ్యవహారాలు ఆగిపోతాయి. మీ-సేవా కేంద్రాల ద్వారా అందజేసే ధ్రువపత్రాలు కూడా ఆ మూడు రోజుల పాటు అందుబాటులో ఉం డవు. కొత్త ఖాతా వచ్చిన తరువాత మాత్ర మే ఈ వ్యవహారాలన్ని నడుస్తాయి. జిల్లాలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో పాటు 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నా యి. వీటిలో రోజుకి సుమారుగా రూ. 70 లక్షలు మేర ఆర్థిక లావాదేవీలు జరగుతాయి. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన ఖాతాను ఈనెల 30 సాయంత్రం ఆరు గంటలతో మూసివేయనున్నారు. తిరిగి జూన్ రెండో తేదీన కొత్త ఖాతాతో కార్యాలయాలు పని చేస్తాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.