lecturer
-
వరంగల్ లో వెలుగులోకి కీచక లెక్చరర్ బాగోతం
-
వరంగల్ ఏకశిలా కాలేజీలో కీచక లెక్చరర్!
సాక్షి, వరంగల్: నగరంలో మరో కీచక లెక్చరర్ నిర్వాకం బయటపడింది. కొత్తవాడలోని ఏకశిలా జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని పట్ల లెక్చరర్ రమేష్ అసభ్యంగా ప్రవర్తించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.యాజమాన్యానికి సమాచారం అందించిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం.. రమేష్ను కావాలనే తప్పిస్తున్నారని బంధువులు మండిపడుతున్నారు. కీచక టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఇష్టారాజ్యంగా 'సర్దుబాటు'
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ఇష్టానుసారంగా బదిలీలు చేపట్టి బోధనను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఇదే విధానాన్ని సాంకేతిక విద్యలోనూ అమలు చేసింది. సర్దుబాటు బదిలీల పేరుతో లెక్చరర్లను ఏకంగా రీజియన్లు దాటించేసింది. దీంతో దాదాపు 20 రోజులైనా లెక్చరర్లు.. తాము బదిలీ అయిన స్థానాలకు వెళ్లకపోవడంతో పాలిటెక్నిక్ కాలేజీల్లో బోధన కుంటుబడింది. జోన్ స్థాయిలో చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను ఏకంగా రీజియన్లను దాటించేయడంతో పలువురు లెక్చరర్లు సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయగా.. మరికొందరు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.అక్టోబర్లో చేపట్టాల్సిన సర్దుబాటు ప్రక్రియను డిసెంబర్లో చేపట్టడమే కాకుండా.. సాంకేతిక విద్య డైరెక్టరేట్ చేపట్టిన సర్దుబాటు బదిలీలు సైతం సక్రమంగా లేకపోవడంతో లెక్చరర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 200 మంది లెక్చరర్లను బదిలీ చేయగా.. సగం మందికి పైగా పోస్టుల్లో చేరకపోవడం గమనార్హం. ఫిర్యాదు చేసిన వారికి బెదిరింపులు! పాలిటెక్నికల్ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల కాలపరిమితి అక్టోబర్తో ముగిసింది. అలాగే గతంలో ఇచి్చన డిప్యుటేషన్లు కూడా పూర్తయ్యాయి. నవంబర్లో తరగతులు ప్రారంభమయ్యేలోగా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలి. అంటే సర్దుబాటు బదిలీలు అక్టోబర్లోనే చేపట్టాలి. కానీ సాంకేతిక విద్య డైరెక్టరేట్ అధికారులు ఈ నెల మొదట్లో పాలిటెక్నిక్ కాలేజీల ప్రిన్సిపాల్స్పై తాము చెప్పిన విధంగా వర్క్లోడ్ నివేదిక తెప్పించుకున్నారు.వెంటనే 2వ తేదీన ఆఘమేఘాలపై దాదాపు 200 మందిని సర్దుబాటు బదిలీ చేశారు. ఈ పోస్టులను జోన్ స్థాయిలోనే సర్దుబాటు చేయాలి. కానీ రీజియన్లను మార్చేయడంపై లెక్చరర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర వర్సిటీ రీజియన్లోని తిరుపతి జిల్లా చంద్రగిరి పాలిటెక్నిక్ కాలేజీలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ను.. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి పాలిటెక్నిక్ కాలేజీకి, మరొకరిని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాలేజీకి బదిలీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని వారిని ఆదేశించారు. అయితే, 60 కి.మీ పరిధిలో చేపట్టాల్సిన సర్దుబాటును ఏకంగా 900 కి.మీ దూరానికి చేయడంతో బాధితులు తమ పోస్టుల్లో చేరకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన సాంకేతిక విద్య డైరెక్టరేట్ సిబ్బంది.. ఫిర్యాదు చేసిన వారిని బెదిరించినట్లు సమాచారం. దీంతో కొందరు బాధిత లెక్చరర్లు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితి మరీ ఘోరంప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితిని మరీ దారుణంగా మార్చేశారు. వీరికి వారంలో రెండు, మూడు రోజులు ఒక కాలేజీ చొప్పున విధులు వేస్తుండడం గమనార్హం. ఇలా వారంలో రెండు, మూడు కాలేజీలు మారుస్తుండడంతో వారు ఏ కాలేజీలో పనిచేస్తున్నారో తెలియని దుస్థితి నెలకొంది. వీరిని కూడా గుంటూరు నుంచి పాడేరుకు, చీపురుపల్లికి బదిలీ చేయడం విమర్శలకు దారి తీసింది. ఈ ప్రక్రియతో అకడమిక్ పరంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైలెవల్ కమిటీ చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను.. కిందిస్థాయి సిబ్బందే నివేదిక తయారు చేయడం, దాన్నే డైరెక్టర్ ఆమోదించడంతో సమస్యలు వచ్చాయని సమాచారం. -
లెక్చరర్ కుర్చీ కింద బాంబు.. విద్యార్థుల ప్రతీకారం..
విద్యా బుద్ధులు నేర్పించే గురువు పట్ల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు దారుణానికి ఒడిగట్టారు. మహిళా లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబును అమర్చారు. ఆ తర్వాత ఏమైందంటే?పోలీసుల కథనం ప్రకారం.. హర్యానాకు చెందిన కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 13 నుంచి 15 విద్యార్థుల్ని మహిళా సైన్స్ లెక్చరర్ మందలించారు. దీంతో కోపోద్రికులైన విద్యార్థులు లెక్చరర్పై ప్రాంక్ పేరుతో ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు.ఫైర్ క్రాకర్స్ తరహాలో పేలే రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేసిన లెక్చరర్ కూర్చునే కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చాలని అనుకున్నారు. బాంబు తయారు చేసేందుకు యూట్యూబ్ వీడియోల్ని చూశారు. అనంతరం వీడియోల్లో చూపించినట్లుగా రిమోట్ కంట్రోల్ బాంబును తయారు చేశారు. ముందస్తు ప్లాన్ ప్రకారం.. పాఠాలు చెప్పేందుకు క్లాస్ రూమ్కి వచ్చే లెక్చరర్ చైర్లో కూర్చున్నప్పుడు బాంబు పేల్చేందుకు సిద్ధమయ్యారు. రిమోట్ కంట్రోల్తో బాంబు పేల్చే పనిని క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థికి అప్పగించారు. చైర్ కింద బాంబును అమర్చి సైలెంట్గా క్లాస్ రూమ్లో కూర్చున్నారు. లెక్చరర్ గదిలోకి రావడం.. అటెండెన్స్ తీసుకుని పాఠాలు చెప్పేందుకు చైర్లో కూర్చున్నారు. వెంటనే క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థి తన చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్తో బాంబును పేల్చాడు. అదృష్టవశాత్తూ.. పేలుడు ఘటనలో మహిళా లెక్చరర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.ఈ ఘటనపై బాధిత మహిళా లెక్చరర్కు తోటి లెక్చరర్లు మద్దతుగా నిలిచారు. ఇలాంటి ఆకతాయి పనులు పునరావృతం కాకుండా ఉండేలా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు తయారీ, ఎంతమంది విద్యార్థులు ఈ ఆకతాయి పనులు చేశారు వంటి వివరాల్ని సేకరించారు. అనంతరం మహిళా లెక్చరర్ తిట్టడం వల్లే విద్యార్థులు యూట్యూబ్ వీడియోలు చూసి బాంబును తయారు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు.దీంతో విద్యార్థలుపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. బాంబు ఘటనలో ప్రమేయం ఉన్న 13 నుంచి 15 మంది విద్యార్థుల తల్లిదండ్రలుకు సమాచారం అందించారు. అయితే పిల్లలు చేసిన ఆకతాయి పనికి వారి తల్లిదండ్రులు సదరు మహిళా లెక్చరర్కు క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలాంటి ఆకతాయి పనులు చేయకుండా చూసుకుంటామని కోరారు. పిల్లల్ని హెచ్చరించారు.తల్లిదండ్రుల విజ్ఞప్తితో విద్యార్థులపై కేసులు, విచారణతో పేరుతో ఇబ్బంది పెట్టొద్దని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆకతాయి విద్యార్థుల్ని వారం రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నరేష్ మెహతా తెలిపారు. -
గురు పూజోత్సవం స్పెషల్..
షాబాద్: పల్లె అనంతరెడ్డి.. హైతాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్.. చిన్నప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు.. పలక, బలపం కొనిచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ సమయంలోనే అతని గురువులు సాయం చేశారు. అన్నీ సమకూర్చారు. దీన్నే అనంతరెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నారు. పేద విద్యార్థుల కోసం తన జీతంతోపాటు జీవితాన్ని అంకితం చేశారు.‘నేను విధుల్లో చేరినప్పుడు కొండాపూర్ యూపీఎస్ శిథిలమైన గదుల్లో కొనసాగుతోంది. 1 నుంచి 7వ తరగతి వరకు 150 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో స్కూల్ ఆవరణలో తడకలు వేయించి పాఠాలు చెప్పా. ఆ తర్వాత ప్రభుత్వ నిధులు, దాతల ద్వారా రూ.70 లక్షలతో ఏడు రూమ్లు నిర్మించాం. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతో మరో రూ.30 లక్షలు పెట్టి సకల సౌకర్యాలు సమకూర్చాం. కరోనాలో పేద ప్రజలకు రూ.60 లక్షల విలువైన నిత్యావసరాలు పంపిణీ చేశాం. స్మార్ట్ ఫోన్లు, టీవీలు ఇప్పించి విద్యార్థులకు డిజిటల్ బోధన కొనసాగించాను.పూర్వపు విద్యార్థులు అనంతరెడ్డికి బహుమతిగా ఇచ్చిన బుల్లెట్ బండి..హైసూ్కల్గా అప్గ్రేడ్ చేయించా. ప్రస్తుతం అక్కడ 1,100 మంది చదువుతున్నారు’అని అనంతరెడ్డి చెబుతున్నప్పుడు ఆయన కళ్లల్లో అనంతమైన సంతృప్తి కనిపించింది. తర్వాత అక్కడి నుంచి ఆయన హైతాబాద్ పాఠశాలకు బదిలీ అయ్యారు. అంతేకాదు.. నిరుపేద విద్యార్థులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచి్చనప్పుడూ తన వంతు సాయాన్ని అందిస్తూ అనంతరెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆటపాటలతో పాఠాలు..సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కవిత టీచర్ క్లాసంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఎందుకంటే.. ఆమె ఆటపాటలతో పాఠాలను చెప్పేస్తారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం పెద్దరాజమూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కవిత.. విద్యార్థులకు ఇంటి వద్ద లభించే కాగితం, అట్టముక్కలను తక్కువ ఖర్చుతో వివిధ రూపాల్లోకి మార్చి వాటి ద్వారా క్లాసులు బోధిస్తున్నారు.గణితంలో ఎక్కాల చట్రం, స్నేక్ ల్యాడర్ గేమ్, నంబర్స్, అల్ఫాబెట్స్ కాన్సెప్ట్ గేమ్ పేరుతో విద్యార్థులను ఆకట్టుకుంటూ వారికి అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నారు. నేలపై చుట్టూరా విద్యార్థులను కూర్చోబెట్టుకొని ప్రతి అంశంపై బొమ్మల ద్వారా బోధిస్తున్నారు. అంతేకాదు.. గణితం, సైన్స్, తెలుగు వంటి సబ్జెక్ట్లకు సంబంధించి విద్యార్థులకు బోధిస్తున్న అంశాలను, టీచింగ్ లెరి్నంగ్ మెటీరియల్ను ఇన్స్టా గ్రాం, యూట్యూబ్ చానల్ ద్వారా అందరికీ తెలియజేస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.మా‘స్టారు’.. శేషగిరి సారు..బషీరాబాద్: నెల జీతం కోసం పనిచేసే వారు కొందరుంటే.. అందులో కొంత మొత్తాన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టి పాఠాలు చెప్పే సార్లు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారే శేషగిరి సారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్గౌడ్తండాలో ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన సేవలతో విద్యార్థులు, గ్రామస్తుల మనసు గెలుచుకున్నారు. 2018లో మంతన్గౌడ్ స్కూల్కు వచ్చిన ఆయన గత జూలై వరకూ పనిచేశారు.మట్టిగణపతులను చేయిస్తున్న శేషగిరిఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సాధారణ బదిలీల్లో వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. దీంతో మా సారు మాకే కావాలి.. అంటూ గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్కు వినతిపత్రంఅందజేశారు. ఆయన రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పనిచేసి పాఠశాల రూపురేఖలు మార్చేశారు. స్కూల్ ఆవరణలోనే కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి కూరగాయలు పండించి, వాటిని మధ్యాహ్న భోజనం కోసం వాడేలా చేశారు. ఆత్మరక్షణ కోసం విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పించారు.అంతేకాదు.. ఏటా విద్యార్థులను విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లి, చారిత్రక ప్రదేశాలను చూపించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం.. మట్టితో వినాయకులను తయారు చేయించి గ్రామంలో ఇంటింటా మట్టి వినాయకులే ప్రతిష్టించేలా మార్పు తీసుకొచ్చారు. సమ్మర్ క్యాంపులు నిర్వహించడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి, పిల్లల విషయంలో జాగ్రత్తలు బో ధించేవారు. అందుకే సారు బదిలీ అయ్యారనేసరికి. ఊరంతా కదిలివచ్చింది. కన్నీరు రాల్చింది.శేషగిరి, ఉపాధ్యాయుడు -
ప్రమోషన్లకు ఆటంకంగా 'టెట్' అలజడి!
నిర్మల్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. టెట్ ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన తప్పనిసరి అని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలియడంతో ప్రమోషన్లకు ఆటంకంగా మారింది. జిల్లాలో గత అక్టోబర్లో ఉపాధ్యాయ ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోగా తాజాగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2011లో టెట్ నిర్వహణ మొదలు కాగా కొన్నేళ్లకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రతీ ఉపాధ్యాయుడికి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే ఇది రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఫలితంగా 1996 నుంచి 2008 వరకు పలు దఫాలుగా నిర్వహించిన డీఎస్సీల్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో చాలామందికి టెట్ అర్హత లేదు. ఇలాంటి వారందరి ప్రమోషన్ వ్యవహారం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, మరోవైపు జూనియర్లు తమకు ప్రాధాన్యం లభించనుందని 2012, 2017 ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ అర్హత ద్వారా ఎంపికై న ఎస్జీటీ, ఎస్ఏ ఉపాధ్యాయ వర్గాల్లో కొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ అర్హత నియమావళి కలిగి ఉన్నవారే నూతన నియామకాలకై నా, ప్రమోషన్లకై నా అర్హులవుతారని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ సంఘం జిల్లా నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా అర్హతలు పొందుతూనే ఉండాలన్నదే వారి అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్సీటీఈ తీసుకున్న నిర్ణయంతో వాస్తవానికి ఉపాధ్యాయ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ అక్టోబర్లో జరగాల్సి ఉండగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో మధ్యంతరంగా నిలిచిపోయింది. తాజాగా ఎన్సీటీఈ ఇచ్చిన ఉత్తర్వులపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై సీనియర్ ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ నెల 11న రాష్ట్రస్థాయి సమీక్షలో ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులు ముఖ్యమంత్రితో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమీక్షలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోననే ఉత్కంఠ సీనియర్ ఉపాధ్యాయుల్లో కొనసాగుతోంది. టెట్ నిబంధన సరికాదు డీఎస్సీలు అమలు పరిచినప్పటినుంచి కాకుండా 2011 నుంచి ఈ టెట్ అర్హత పరీక్ష మొదలైంది. ఈ నిబంధన ప్రమోషన్లలో ప్రవేశపెట్టడం సరైంది కాదు. దీంతో సీనియర్ ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. 25 ఏళ్లుగా ఒకే కేడర్లో పనిచేస్తున్న వారు ఉద్యోగోన్నతి వస్తుందని భావిస్తున్న తరుణంలో వారి ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయమిది. ఈ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి సడలింపు నిర్ణయం తీసుకోవాలి. – నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆరేళ్ల సమయంతో సడలింపు ఇవ్వాలి ఎన్సీటీఈ నిబంధనల మేరకు ప్రాథమిక స్థాయిలో బోధించే వారు టెట్ పేపర్–1, ఉన్నత స్థాయిలో బోధించే వారికి పేపర్–2 పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని నిబంధన ఉన్న మాట వాస్తవమే. కానీ.. ఇదివరకే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారికి ప్రమోషన్లలో దీన్ని వర్తింపజేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ వర్తింపజేయాలనుకున్నా కనీసం ఆరేళ్ల సడలింపునిస్తూ ప్రమోషన్లు చేపట్టాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. – విజయ్కుమార్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇవి చదవండి: పంచాయతీ పోరుకు బ్రేక్..! పార్లమెంట్ ఎన్నికల తర్వాతే.. -
హెచ్సీయూలో కొలువుదీరిన కొత్త భవనాలు
రాయదుర్గం, శంషాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నూతనంగా నిర్మాణం చేసిన అయిదు భవనాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. రూ.81.27 కోట్ల వ్యయంతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, సరోజినీ నాయు డు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్(అనుబంధం)కు భవనాలతో పాటు లెక్చర్ హాల్ కాంప్లెక్స్–3 భవనాన్ని ఆదివారం మహబూబ్నగర్ నుంచి వర్చువల్గా పీఎం ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ, యూజీసీ మంజూరు చేసిన నిధులతో వీటి నిర్మాణం పూర్తి చేశారు. ఈ భవనాల నిర్మాణంతో ఆయా విభాగాల విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడమే కాకుండా సమావేశాల నిర్వహణ, తరగతుల నిర్వహణకు అవసరమైన లెక్చర్ హాల్–3 కూడా అందుబాటులోకి వచ్చింది. -
చదువురానివారు నాయకులైతే దేశం బాగుపడదు.. అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: అనకాడమీ సంస్థకు చెందిన ఒక లెక్చరర్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన విద్యార్థులతో వచ్చే ఎన్నికల్లో చదువుకున్న వారికి ఓటు వేయమని అభ్యర్ధించాడు. దీంతో ఆ సంస్థ క్లాస్రూమ్ వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకునే వేదిక కాదని చెబుతూ అతడిపై వేటు వేసింది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ లెక్చరర్ చెప్పిన దాంట్లో తప్పేముందన్నారు. కరణ్ సంగ్వాన్ అనకాడమీలో లెక్చరర్గా పని చేస్తున్నారు. ఈయనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ ద్వారా ఆయన తన విద్యార్థులకు ఎన్నికల్లో విద్యావంతులైన అభ్యర్థులకు మాత్రమే ఓటు వేయాలని ఓ వీడియోలో కోరారు. దీంతో ఆగ్రహించిన ఆ సంస్థ సహ యజమాని రోమన్ సైనీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై వేటు వేస్తున్నట్లు ప్రకటిస్తూ X వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై సంగ్వాన్ స్పందిస్తూ.. గత కొద్ది రోజులుగా నాకు సంబంధించిన ఒక వీడియో వివాదాస్పదంగా మారింది. నా తోపాటు జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధపడుతున్న నా విద్యార్థులు కూడా ఆ వీడియో వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 19న దానిపై వివరణ ఇస్తానని వెల్లడించారు. సంస్థ సహ యజమాని రోమా సైనీ X వేదికగా ఏమని రాశారంటే.. మా సంస్థకు చాలా కచ్చితమైన నియమ నిబంధనలున్నాయి. విద్యార్ధులకు నిశ్పాక్షిక జ్ఞానాన్ని అందించడమే మా కర్తవ్యం. క్లాస్రూమ్ అనేది వ్యక్తిగత అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునే వేదిక కాదు. అవి విద్యార్ధులపై తప్పుడు ప్రభావం చూపుతాయి. సంస్థ నిబంధనలను ఉల్లంఘించినందుకు కారం సంగ్వాన్ ను విధుల నుండి తొలగించామని తెలియజేశారు. ఈ ఉదంతంపై సాక్షాత్తు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందిస్తూ.. చదువుకున్న వ్యక్తికి ఓటు వేయమని అడగడం కూడా తప్పేనా? ఎవరైనా నిరక్షరాస్యులు ఉంటే వారిని నేను వ్యక్తిగతంగా గౌరవిస్తాను. కానీ ప్రజాప్రతినిధులు నిరక్షరాస్యులు కాకూడదు. ఇసి సైన్స్ అండ్ టెక్నాలజీ దూసుకెళ్తోన్న తరం. చదువురాని వారి ఆధునిక భారత దేశాన్ని నిర్మించలేరని అన్నారు. क्या पढ़े लिखे लोगों को वोट देने की अपील करना अपराध है? यदि कोई अनपढ़ है, व्यक्तिगत तौर पर मैं उसका सम्मान करता हूँ। लेकिन जनप्रतिनिधि अनपढ़ नहीं हो सकते। ये साइंस और टेक्नोलॉजी का ज़माना है। 21वीं सदी के आधुनिक भारत का निर्माण अनपढ़ जनप्रतिनिधि कभी नहीं कर सकते। https://t.co/YPX4OCoRoZ — Arvind Kejriwal (@ArvindKejriwal) August 17, 2023 ఇది కూడా చదవండి: నెహ్రూ గొప్పదనం ఆయన పేరులో లేదు.. రాహుల్ గాంధీ -
లెక్చరర్ కారుకు నిప్పు
అనంతపురం: నగరంలోని అశోక్నగర్లో గురువారం అర్ధరాత్రి కలకలం రేగింది. ఓ ఇంటి ముందు ఆపి ఉంచిన కారుకు దుండగులు నిప్పుపెట్టడంతో బాధితులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వన్టౌన్ సీఐ రెడ్డెప్ప వివరాలమేరకు.. స్థానిక ఎస్ఎస్బీఎన్ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తున్న చంఽద్రశేఖరరెడ్డి కుటుంబం అశోక్నగర్లోని హరిహర ఆలయం సమీపంలో నివాసం ఉంటోంది. రోజువారిగానే ఇంటి ముందు కారు (క్రెటా)ను పార్క్ చేశారు. అయితే అర్ధరాత్రి 1 గంట సమయంలో కారు మంటల్లో తగలబడుతూ కనిపించింది. మంటలను ఆర్పిన అనంతరం చూడగా కారు కింద చెత్తాచెదారాన్ని వేసి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. ఎవరో కావాలనే ఈ పని చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే తమకు ఎవరితోనూ శతృత్వం లేదని చంద్రశేఖర్ చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
అప్పుడు పాచి పని చేసింది.. ఇప్పుడు లెక్చరర్గా రాణిస్తోంది
పిల్లల చదువుల కోసం ఇళ్లలో పాచిపనులు చేసిన మధు ఇప్పుడు కాలేజీలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా పాఠాలు చెబుతోంది. ఒకప్పుడు ఇంగ్లిష్ చదువులు మీరేం చదువుతారని పిల్లలకు అడ్మిషన్ ఇవ్వలేదు. అలాంటి ఆమె పిల్లలు ఇప్పుడు ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తున్నారు. ఈ విజయం ఒక్కరోజుతో రాలేదు. ప్రతిరోజూ పోరాటమే అని వివరిస్తారు రాజస్థాని భిల్వారా నివాసి మధు. ఆమె గురించి అడిగితే సక్సెస్ని ఏ విధంగానైనా కష్టపడి సాధించుకోవచ్చు అని చెబుతుంది. ‘‘మేం ఆరు మంది తోబుట్టువులం. మా నాన్న చనిపోయినప్పుడు నాకు నాలుగేళ్లు. ఎన్నో ఇక్కట్ల మధ్య పెరిగాను. ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక పెళ్లయింది. నా భర్త ఒక కంపెనీలో వర్కర్గా పనిచేసేవాడు. అతని జీతం ఇంటి అవసరాలకు ఏ మాత్రం సరిపోయేది కాదు. పిల్లలు పుట్టాక ఇంకా సమస్యలు పెరిగాయి. దీంతో కుట్టుపని మొదలు పెట్టాను. కొంత కాలానికి మా ఆయనకు కీళ్లనొప్పులు వచ్చి, ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయన చేస్తున్న పనిని వదిలేయాల్సి వచ్చింది. దీంతో ఇంటి ఆర్థిక పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. ఈ కష్టకాలంలో దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ వారి స్కూల్కు దగ్గరలో కుట్టుమిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చాడు. అక్కడ కూర్చొని కుట్టుపని చేసేదాన్ని. అక్కడ బ్యాగులు, కవర్లు తయారు చేయడం మొదలుపెట్టినప్పుడు, ఆ స్కూల్ టీచర్ ఒకరు నేను చాలా త్వరగా వర్క్ నేర్చుకుంటానని గమనించారు. నా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవాలని కాన్వెంట్ స్కూల్లో చేర్పించడానికి వెళితే, ‘మీరు చదువుకోలేదు, స్కూల్ ఫీజులు కూడా కట్టలేరు, అడ్మిషన్ ఇవ్వలేం’ అన్నారు. ఈ విషయం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ నేను కుట్టుపని చేస్తున్నప్పుడు బ్యాగుల తయారీ గురించి తెలుసుకోవడానికి ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేవారు. ఆ సమయంలో పిల్లలతోపాటు నన్ను కూడా చదువుకోమని ప్రోత్సహించారు. అందుకు తగిన దూరవిద్య ఫామ్స్ కూడా తెచ్చి ఇచ్చారు. దీంతో పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో, నేను కుట్టుమిషన్ దగ్గరే చదువుకునేదాన్ని. రోజూ ఉదయాన్నే నాలుగిళ్లలో పనులు చేయడం, కుట్టుమిషన్పై బ్యాగులు కుట్టడం, ఖాళీ సమయంలో డిగ్రీ పుస్తకాలు చదవడం... ఇలాగే నడిచేది. అడ్డంకిగా మారిన పరిస్థితులు నేను పట్టుదలగా చదువుకోవడం చూసిన గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కూడా నన్ను ప్రోత్సహించేవారు. పిల్లలు కూడా నాకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చేవారు. అయితే, మా అత్తగారు ఆపేవారు. మామగారికి మా బంధువులు వెక్కిరిస్తున్నారని చెప్పేవారు. ఆమె సాయంత్రం పూట ఎక్కడకు వెళ్తుందో, ఎక్కడి నుండి వస్తుందో అని విపరీతపు మాటలు రకరకాలుగా మాట్లాడుకునేవారు. కానీ, నా భర్త వాటన్నింటినీ పట్టించుకోవద్దని చెప్పేవారు. నేను ఎం.ఏ. పరీక్షలు రాస్తున్నప్పుడు మా మామగారు చనిపోయారు. దీంతో చదువును వదులుకునే పరిస్థితి వచ్చింది. కానీ, స్కూల్ టీచర్ శైలజ వచ్చి మా అత్త గారికి నచ్చచెప్పి, నన్ను చదువు కొనసాగించమని ప్రోత్సహించ డంతో ఆ పరిస్థితి నుంచి గట్టెక్కాను. లెక్చరర్గా చేస్తూనే.. మొదటిసారి నెట్లో అర్హత సాధించడంతో అంతా ఆశ్చర్యపోయారు. పొలిటికల్ సైన్స్లో ఎం.ఏ. పూర్తిచేసి, పీహెచ్డీకి అడ్మిషన్ తీసుకున్నాను. పిల్లలు పెద్దవడంతో డబ్బు అవసరం కూడా పెరిగింది. దీంతో పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా చేరాను. నెలకు ఆరువేల రూపాయలు వచ్చేవి. వాటితోనే ఇల్లు గడవదని, టైలరింగ్ పనులు చేస్తూనే ఉండేదాన్ని. కానీ, మనం అనుకున్నవి అన్నీ జరగవు కదా. మా వారి ఆరోగ్యం మరీ క్షీణించడంతో ట్రీట్మెంట్ నెలలపాటు కొనసాగింది. దీనిని తట్టుకుంటూనే నా జీవన పోరాటం చేస్తూనే ఉన్నాను. నా కూతురు ఐఐటీలో సీటు సంపాదించి, మాస్టర్స్ కూడా చేసింది. కొడుకు ఇంకా చదువుకుంటున్నాడు. నాలుగిళ్లలో పనిచేసుకునే నేను ఇప్పుడు లెక్చరర్గా ఉద్యోగం చేస్తున్నాను. నా భర్తను అనారోగ్యం నుంచి కాపాడుకున్నాను. పిల్లలు మంచి చదువులు చదువుకుంటూ ఉన్నత అవకాశాలను అందుకుంటున్నారు. త్వరలోనే మంచి ఉద్యోగాల్లో వారిని చూడబోతున్నాను’’ అని ఆనందంగా వివరించే మధు జీవనపోరాటంలో విజయం ఒక్కరోజుతో సాధ్యం కాలేదని, ప్రతిరోజూ కఠోరశ్రమ చేస్తే వచ్చిందని చెబుతోంది మధు. -
మహిళా లెక్చరర్కు వేదింపులు.. కాలేజీ సమీపంలోనే దాడి..
అన్నానగర్ (తమిళనాడు): మహిళా అధ్యాపకురాలిని లైంగికంగా వేధించిన అధ్యాపకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మదురై జిల్లా తిరుమంగళం సమీపంలోని కప్పలూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో మదురైకి చెందిన ఓ మహిళ తాత్కాలిక లెక్చరర్గా పని చేస్తున్నారు. ఉసిలంబట్టికి చెందిన రఘుపతి (42)కూడా అదే కళాశాలలో తాత్కాలిక లెక్చరర్గా పని చేస్తున్నాడు. అతను ఆమెను తరచూ లైంగికంగా వేధిస్తున్నాడు. గతనెల 26న కళాశాల సమీపంలో అతను మహిళా లెక్చరర్పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎదురు తిరిగిన ఆమెను చంపుతానని బెదిరించాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రఘుపతిని పోక్సో చట్టం కింద ఆదివారం అరెస్టు చేశారు. -
ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న లెక్చరర్..
లక్నో: తాను అడిగిన ఫార్చునర్ కారును కట్నంగా ఇవ్వలేదని పెళ్లినే రద్దు చేసుకున్నాడు ఓ ప్రభుత్వ కళాశాల లెక్చరర్. ఈ వివాహం తనకు వద్దని పెళ్లికుతూరుకు మెసేజ్ చేసి చెప్పాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. పెళ్లికొడుకుపై కేసు పెట్టారు. ఉత్తర్ప్రదేశ్ ఘాజియాబాద్లో ఈ ఘటన జరిగింది. పెళ్లికొడుకు పేరు సిద్ధార్థ్ విహార్. ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. అయితే తనకు కట్నంగా ఫార్చునర్ కారు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం వాగన్ఆర్ కారును బుక్ చేశారు. ఈ విషయం తెలిసిన పెళ్లికొడుకు కుటుంబసభ్యులు తమకు ఫార్చునర్ కారే కావాలని పట్టుబట్టారు. కానీ పెళ్లికూతురు కుటుంబం మాత్రం వాగన్ఆర్ మాత్రమే ఇప్పిస్తామని చెప్పింది. దీంతో ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వధువుకు మేసేజ్ ద్వారా తెలియజేశాడు వరుడు. మరో ఘటనలో పెళ్లికొడుకు నచ్చలేదని.. అంతకుముందు ఉత్తర్ప్రదేశ్ ఇటావాలో కూడా ఓ పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. పెళ్లిమండపంలో దండలు మార్చుకున్న తర్వాత ఓ పెళ్లికూతురు అనూహ్యంగా పెళ్లి రద్దు చేసుకుంది. అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పెళ్లి చూపుల్లో తాను చూసిన అబ్బాయి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న అబ్బాయి వేరని వధువు చెప్పింది. ఈ అబ్బాయి నల్లగా ఉన్నాడని, తనకు నచ్చలేదని పేర్కొంది. ఇక చేసేదేమీ లేక పెళ్లికొడుకు కుటుంబం కూడా పెళ్లిని రద్దు చేసుకునేందుకు అంగీకరించింది. అయితే తాము పెళ్లికూతురుకు పెట్టిన నగలు తిరిగి ఇవ్వలేదని వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి ఏర్పాట్లకు రూ.లక్షలు ఖర్చు అయ్యాయని తెలిపారు. చదవండి: స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు -
విద్యార్థిపై ‘నారాయణ’ లెక్చరర్ ప్రతాపం
సాక్షి, పటమట (విజయవాడ): విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో విద్యార్థిని అధ్యాపకుడు కాలితో తన్నిన ఘటనను మరువక ముందే నగరంలోని నారాయణ కళాశాలలోనూ ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. మార్కులు తక్కువ వచ్చాయని ఓ విద్యార్థిని లెక్చరర్ తీవ్రంగా కొట్టారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థికి మార్కులు తక్కువ వచ్చాయి. అయితే, మార్కులు ఎందుకు తగ్గాయంటూ ప్రసాదరావు అనే లెక్చరర్ శుక్రవారం మధ్యాహ్నం సదరు విద్యార్థిని చితకబాదారు. ఈ దృశ్యాన్ని మరో విద్యార్థి తన సెల్ఫోన్లో చిత్రీకరించడం గమనించిన ఆ లెక్చరర్, కళాశాల ప్రతినిధి కోటితో కలిసి అతన్ని(చిత్రీకరిస్తున్న విద్యార్థి) తీవ్రంగా కొట్టారు. అంతేగాక వారిద్దరినీ వేరే తరగతి గదిలోకి తీసుకెళ్లి.. బెదిరించడమేగాక సెల్ఫోన్ లాక్కొని పగులకొట్టారు. జరిగిన ఘటనను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు చెప్పగా, వారు పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మహేంద్ర చెప్పారు. చదవండి: (ఇదీ చరిత్ర.. ఇవీ నిజాలు: ఎన్టీఆర్.. చంద్రబాబు.. అలనాటి నగ్నసత్యాలు) -
వీడియో: శ్రీ చైతన్య కాలేజీలో షాకింగ్ ఘటన.. మరీ ఇంత దారుణమా?
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తరగతి గదిలో మాట్లాడాడని ఓ విద్యారి్థని అధ్యాపకుడు చెంపలు వాయించడంతో పాటు, కాలితో తన్నిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని శ్రీ చైతన్య కళాశాల భాస్కర్ భవన్ క్యాంపస్లో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించడంతో జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు, చైల్డ్లైన్ వారు కూడా రంగంలోకి దిగారు. ఇంటర్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక కళాశాలకు వెళ్లి విచారించారు. విద్యార్థి ఇయర్ఫోన్స్లో పాటలు వింటుంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో క్షణికావేశంలో అలా చేసినట్లు అధ్యాపకుడు చెబుతుండగా.. తమ అబ్బాయి వద్ద ఫోన్లేదని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు. అధ్యాపకుడ్ని కళాశాల యాజమాన్యం శుక్రవారం తొలగించినట్లు ఆర్ఐవో తెలిపారు. Sri chaithanya Bhaskar bhavan #Vijayawada.@ysjagan@AndhraPradeshCM@APPOLICE100 pic.twitter.com/yKyAKzvHdJ — 𝐇𝐚𝐫𝐢𝐤𝐫𝐢𝐬𝐡𝐧𝐚 𝐁𝐡𝐞𝐞𝐦𝐚𝐧𝐢 (@hari_bheemani) September 16, 2022 -
వేములవాడ: సాంఘిక డిగ్రీ కాలేజీ ఘటనపై కలెక్టర్ ఆగ్రహం
-
మారుమూల రైతు కుటుంబంలో పుట్టి.. లెక్చరర్ నుంచి డిప్యూటీ కలెక్టర్గా..
మారుమూల గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టారు. లెక్చరర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. మొక్కవోని దీక్షతో డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగారు. సంకల్పం బలంగా ఉంటే లక్ష్యసాధన కష్టం కాదని నిరూపించారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు నగరికి చెందిన మహేష్ అలకాటూరు. నగరి: మండలంలోని నంబాకం గ్రామానికి చెందిన గోపాల్రెడ్డి, సరోజమ్మ దంపతుల కుమారుడు మహేష్ గ్రూప్–1 పరీక్షలో ప్రతిభ కనబరిచి డిప్యూటీ కలెక్టర్గా అర్హత సాధించి అందరిచేత మన్ననలు అందుకున్నారు. నంబాకం ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించిన ఈయన 6వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రైవేటు కళాశాలల్లో చదువుకున్నారు. 2011లో వెంకటేశ్వర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2013లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్గా చేరారు. అయితే కలెక్టర్ కావాలన్న చిన్నప్పటి కలను సాకారం చేసుకునేందుకు సివిల్స్కు తర్ఫీదయ్యారు. 2016లో సివిల్స్ రాసినా మెయిన్స్ క్లియర్ కాలేదు. లెక్చరర్గా విధులు నిర్వహిస్తూ ఉన్న తక్కువ సమయంలో ఏకాగ్రతతో పట్టు వదలకుండా సివిల్స్కు ప్రిపేర్ అయ్యారు. ఫోన్ ద్వారా ఆన్లైన్లోని మెటీరియల్నే చదివారు. 2018లో సివిల్స్ పరీక్ష రాశారు. అయితే కోర్టు వివాదాల కారణంగా నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. ఇంతలో 2022లో సత్యవేడు పాలిటెక్నిక్ కళాశాలకు బదిలీపై వెళ్లారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో మహేష్ డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ఈయన భార్య స్వాతి నగరి మున్సిపాలిటీ, కాకవేడు సచివాలయంలో అడ్మిన్గా ఉన్నారు. చదవండి: (Rapthadu: ఆర్టీఓగా ఎంపికైన రైతు బిడ్డ) సాధనతోనే సాధ్యం సాధించాలన్న తపన ఉంటే తప్పక సివిల్స్లో మంచి ఫలితాలు పొందవచ్చు. లెక్చరర్గా పనిచేస్తూనే ఉన్న సమయంలో ఆన్లైన్లో ఎన్సీటీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుని చదివారు. అలాగే ఆన్లైన్లో ఇగ్నో పుస్తకాలు, ప్రీమెటీరియల్స్ సివిల్స్లో రాణించడానికి ఎంతో ఉపయోగపడింది. చేతిలోని ఫోన్ నాకు మెటీరియల్గా మారింది. నిరంతర సాధన, ఏకాగ్రత ఉండి బేసిక్స్పై పట్టు పెంచుకుంటే సివిల్స్లో రాణించవచ్చు. న్యూస్ రీడింగ్ తప్పనిసరి. నా లక్ష్యాన్ని అర్థం చేసుకుని నా వెన్నంట ఉన్న భార్య స్వాతి అందించిన సహకారం, ప్రోత్సాహం నా విజయానికి ఎంతో ఉపయోగపడింది. –మహేష్, నంబాకం గ్రామం, నగరి మండలం. -
లెక్చరర్ పాడుబుద్ధి.. అధిక మార్కులు వచ్చేలా చూస్తానంటూ..
తంబళ్లపల్లె(అన్నమయ్య జిల్లా): విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ లెక్చరర్పై పోక్సో కేసు నమోదైంది. వివరాలు.. ఎస్వీయూ సంస్కృత విభాగంలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న మాధవరెడ్డిని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ఓ డిగ్రీ కాలేజీలో పరీక్షల పరిశీలకుడిగా నియమించారు. అధిక మార్కులు వచ్చేలా చూస్తానంటూ మంగళవారం విద్యార్థినితో మాధవరెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, ములకలచెరువు సీఐ షాదిక్ అలీ, ఎస్ఐ శోభారాణి.. మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆరోపణలు నిర్ధారణ కావడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లైన వారానికి పుట్టింటికొచ్చి అదృశ్యం.. ఇక్కడే అసలు ట్విస్ట్! -
బిగ్గరగా మాట్లాడుతోందని ఆ లెక్చరర్ను ఏం చేశారంటే?
మహిళలు ఉద్యోగాల్లో చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు. అది ఆఫీసు బాస్ కారణంగానే లేక తోటి ఉద్యోగుల కారణంగానో సమస్యలు ఎదుర్కొవల్సి వస్తుంటుంది. అయితే కొంతమంది మరీ పైశాచికంగా ఒక మహిళా మంచిగా పనిచేస్తున్నప్పటికీ ఏవో సాకులు చూపుతూ ఆమెను ఇబ్బందులకు గురిచేయడమే లేక తొలగించాలని చూస్తారు. అచ్చం అలాంటి సమస్య ఎదుర్కొంది.. ఇక్కడోక లెక్చరర్. పైగా కోర్టు మెట్లెక్కి మరీ ఆ సంస్థకు సరైన బుద్ధి చెప్పింది ఎలాగో తెలుసా!. అసలు విషయంలోకెళ్తే.. యూకేలోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఫిజిక్స్ లెక్చరర్ డాక్టర్ అన్నెట్ ప్లాట్ని అన్యాయంగా తొలగించారు. పైగా ఆమె స్వరం చాలా పెద్దదని, చాలా బిగ్గరగా మాట్లాడుతోందంటూ ఆరోపణలు చేసి మరీ ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో ఆమె ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె కోర్టులో.. "యూనివర్సిటీ తన పట్ల పక్షవాత ధోరణి చూపిస్తోంది. సహజంగానే నాది పెద్ద స్వరం. పైగా నా స్వరం పెద్దగా ఉండటానికి యూరోపియన్ యూదు నేపథ్యం కూడా ఒక కారణం. అంతేకాదు ఈ కారణాన్ని సాకుగా చూపి తన సహ ఉద్యోగులు తన పట్ల చూపిస్తున్న వైఖరికి తట్టుకోలేక తాను చికిత్స నిమిత్తం వైద్యుడిని ఆశ్రయించాను. పైగా నేను దాదాపుగా మూడు దశాబ్దాలుగా(29 సంవత్సారాలు నుంచి) ఫిజిక్స్ విభాగంలో లెక్చరర్గా పనిచేస్తున్న నన్ను కేవలం బిగ్గరగా మాట్లాడుతున్నానంటూ తొలగించారు. అంతేకాదు నా తొలగింపుకు యూనివర్సిటీలో ఉన్న కొంతమంది సీనియర్ ఉద్యోగులు, హెచ్ఆర్ వాళ్ల మూసభావనలే కారణం’’ అని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఎక్సెటర్ విశ్వవిద్యాలయం పీహెచ్డీ విద్యార్థులతో ఆమె వ్యవహరించిన తీరు కారణంగానే తొలగించినట్లు తెలిపింది. దీంతో కోర్టు ఆమె తొలగింపుకు స్వరం, నేపథ్యంతో సంబంధం లేదంటూ కొట్టిపారేసింది. పైగా ఆమెను తొలగించటం అన్యాయం అని తీర్పు ఇవ్వడమే కాక విశ్వవిద్యాలయాన్ని ఆమెకు నష్ట పరిహారంగా రూ.కోటి రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. దీంతో విశ్వవిద్యాలయం ప్రతినిధి ఈ తీర్పు సరైనది కాదనడమే కాక, ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ కోర్టు నిర్ణయంపై అప్పీలు చేస్తున్నామని తెలిపారు. (చదవండి: ఆడమ్ ఆలోచన.. ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్గా గిన్నిస్ రికార్డు!) -
హెల్మెట్ పెట్రోల్ ట్యాంక్పై పెట్టి ప్రయాణం.. మృత్యు రూపంలో వచ్చిన మరో బైక్
సాక్షి, ఖమ్మం (కొణిజర్ల): అనుకోని ప్రమాదం ఆ ఇంట విషాదాన్ని నింపింది. ఖమ్మంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న తల్లాడ మండలం రెడ్డిగూడెంకు చెందిన మోదుగు కృష్ణయ్య (44) రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందారు. బండికున్న హెల్మెట్ ధరించి ఉంటే..బతికేవాడేమో అంటూ అయినవారు కన్నీరు పెడుతున్నారు. ఆదివారం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో చిట్టీ డబ్బులు తీసుకుని తన బైక్పై..అత్తగారి ఊరు ముదిగొండ మండలం మేడేపల్లికి వెళ్తున్న క్రమంలో కొణిజర్ల ఏపీజీవీబీ వద్ద రోడ్డు దాటుతుండగా మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కృష్ణయ్య కింద పడిపోగా తల రోడ్డుకు గుద్దుకుని తీవ్రంగా గాయపడ్డారు. అయితే..హెల్మెట్ ఉన్నప్పటికీ ధరించకుండా బండి ట్యాంక్పై ఉంచి ఖాళీగా వస్తున్నారు. చదవండి: (స్వప్నతో నిషాంత్ వివాహం.. తల్లిదండ్రులకు తెలిసి..) ఒకవేళ హెల్మెట్ పెట్టుకుని ఉంటే తల భాగం సురక్షితంగా ఉండేదని, మరణం సంభవించి ఉండేది కాదని పలువురు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన కాసేపటికే వైరా నుంచి ఖమ్మం వెళ్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రమాదస్థలిలో ఆగి మానవత్వం చాటారు. కృష్ణయ్యతో పాటు గాయపడిన మరో ద్విచక్రవాహనదారుడు, కొణిజర్లకు చెందిన చింతల వీరేందర్ను తన ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణయ్య సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఐదు నెలలుగా కృష్ణయ్య మేడేపల్లిలో ఉంటున్నారు. ఈ దుర్గటనతో మృతుడి భార్య అశ్విని, పిల్లలు మోజెస్బెన్నీ, సాత్విక కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదంపై కొణిజర్ల ఎస్సై టీవై.రాజు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చదవండి: (సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం) -
ఫలానా చోటికే బదిలీ చేయాలని ఉద్యోగి పట్టుబట్టజాలడు
న్యూఢిల్లీ: ఉద్యోగి ఫలానా ప్రాంతానికే బదిలీ చేయాలని పట్టుబట్టజాలడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూపీకి చెందిన మహిళా లెక్చరర్ వేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధబోస్ల ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ‘ఒక ఉద్యోగి/ ఉద్యోగిని తనను ఫలానా చోటికే బదిలీ చేయాలనీ లేదా బదిలీ చేయరాదని పట్టుబట్టకూడదు. యాజమాన్యమే అవసరాలను అనుగుణంగా బదిలీలను చేపడుతుంది’అని పేర్కొంది. అమ్రోహాలోని కళాశాలలో పనిచేస్తున్న మహిళా లెక్చరర్ తనను గౌతమ్బుద్ధ నగర్లోని కళాశాలకు బదిలీ చేయాలని అధికారులను కోరగా తిరస్కరించారు. దీనిపై ఆమె అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్లుగా అమ్రోహాలో పనిచేస్తున్న ఆమె, గతంలో 2000–2013 వరకు దాదాపు 13 ఏళ్లపాటు గౌతమబుద్ధ నగర్లో పనిచేసినట్లు గుర్తించిన హైకోర్టు తిరిగి అక్కడికే బదిలీ చేయాలని కోరడం సరికాదని పేర్కొంది. పనిచేసిన ప్రాంతానికే తిరిగి బదిలీ చేయాలని పట్టుబట్టరాదంటూ పిటిషన్ను కొట్టివేసింది. -
మార్కులు తక్కువచ్చాయని విద్యార్థులపై దారుణం
సాక్షి, రాజమండ్రి: కరోనా వైరస్ కాలంలోను తల్లిదండ్రులు ధైర్యం చేసి మరీ విద్యార్థులను కళాశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కులు, ర్యాంకుల కోసం కొన్ని కాలేజీలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ ఓ లెక్చరర్ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఆన్సర్ పేపర్లు ఇస్తూ ఆగ్రహంతో విద్యార్థులను దారణంగా కొట్టాడు. మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులను విక్షణరహితంగా దండించాడు. భయంతో విద్యార్థులు తరగతి గదిలో లెక్చరర్కు దూరంగా వెళ్లినా వారిమీదికి విరుచకపడి మరీ జుట్ట పట్టుకొని చేయిచేసుకున్నాడు. వచ్చిన మార్కులను విద్యార్థులకు చూపిస్తూ ఇలా తక్కువ మార్కులు వస్తే ఎలా? అంటూ ఆవేశంతో విద్యార్థులను కొట్టాడు. అయితే ఈ వీడియోను అదే తరగతి గదిలో ఉన్న ఓ విద్యార్థి సెల్ఫోన్లో రికార్డు చేయగా ఆ వీడియో తాజాగా బయటపడింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చదువుకోవాలని కాలేజీ పంపితే లెక్చరర్ అనుషంగా ప్రవర్తించడం ఏంటని యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళ వ్యక్తం చేసున్నాయి. చదవండి: ప్రిన్సిపల్పై విద్యార్థి దాడి -
ఏలూరులో అధ్యాపకుడి ఆత్మహత్య
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ పరిధిలోని కార్మెల్ డీఎడ్ కళాశాలలో దేవదానం అనే అధ్యాపకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల మూడో అంతస్తులో పురుగుల మందు తాగి తనువు చాలించాడు. మృతదేహాన్ని పరిశీలించి చూడగా నాలుగు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనిపిస్తోంది. కళాశాలకు సెలవులు కావడంతో ఎవరూ గుర్తించలేదు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్బోర్డ్ అధికారిపై దాడి చేసిన లెక్చరర్
-
మహిళను కాపాడిన లెక్చరర్
కావలిరూరల్: అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మహిళను ప్రాణాలకు తెగించి ఓ అధ్యాపకుడు కాపాడారు. పట్టణంలోని జనతాపేటకు చెందిన మాదవరపు మహేష్ కో ఆపరేటీవ్ కళాశాలలోని తన గురువు విశ్రాంత ప్రిన్సిపల్ రత్నజోసెఫ్ ఇంటికి వచారు. ఆ సమయంలో రత్నజోసెఫ్ ఇంటి ఎదురుగా మిద్దెపైన ఉన్న మందా వెంకటేశ్వరరావు ఇంటి నుంచి కేకలు వినిపిస్తున్నాయి. వీధిలోని వారంతా అక్కడ గుమికూడి చూడగా వంట గదిలో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయి. వెంకటేశ్వరరావు భార్య అన్నపూర్ణ మంటలను దాటుకొని బయటకు రాలేక భయంతో కేకలు వేస్తూంది. అక్కడికి చేరుకున్న వారు అగ్నిమాపకశాఖ వారికి సమాచారమందించి చూస్తూ నిలబడిపోయారు. అయితే ప్రమాదాన్ని గ్రహించిన మహేష్ వెంటనే మిద్దె మీదకు వెళ్లి తలుపులు నెట్టివేసి లోనికి వెళ్లాడు. అయితే మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఫ్రిజ్కు అంటుకుంటున్నాయి. అత్యంత వేగంగా అన్నపూర్ణను చాకచక్యంగా పక్కకు తప్పించి గ్యాస్ సిలిండర్ను నెట్టేయడంతో అది పక్కకు పడిపోయింది. బెడ్షీటును తడిపి గ్యాస్ సిలిండర్పై వేయడంతో మంటలు ఆరిపోయాయి. గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ను ఆఫ్ చేసి సిలిండర్ కిందకి తీసుకువెళ్లాడు. అగ్నిమాపక శాఖ సిబ్బంది గ్యాస్ సిలిండర్ను పరిశీలించి పూర్తిగా ప్రమాదం తప్పిందని నిర్ధారించారు. మహేష్ ప్రాణాలకు తెగించి ఈ సాహసం చేసి అన్నపూర్ణను కాపాడటతో పలువురు అభినందించారు. -
దారి తప్పిన ప్రొఫెసర్కు గుణపాఠం చెప్పిన అమ్మాయిలు
-
ఇంటర్ విద్యార్థినిపై లెక్చరర్ కీచకపర్వం
-
వాట్సప్ గ్రూప్లో లెక్చరర్ అశ్లీల పోస్టులు
భాగ్యనగర్కాలనీ: బ్రిగ్గింగ్ టు గెదర్ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూపులో చిన్నారుల పట్ల అసభ్యకరంగా పోస్ట్లు పెడుతున్న ఓ వ్యక్తిని గురువారం కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కుషాల్ అలియాస్ పవర్ నిజాంపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అతను క్రియేట్ చేసిన గ్రూపులో చిన్నారులను అశ్లీల పదజాలంతో పోస్టులు పెడుతున్నాడని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్చుతరావుకు సమాచారం అందింది. దీంతో ఆయన వెంటనే కుషాల్పై కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా పోస్ట్లు పెట్టినట్లు లె లియటంతో కుషాల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారం
సాక్షి,బెంగళూరు : పాఠాలు చెబుతానంటూ విద్యార్థినిపై లెక్చరర్ తరచూ అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన జిల్లాలోని సాగర పట్టణంలో వెలుగు చూసింది. శివమొగ్గ పట్టణంలోని పీయూ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్న ప్రకాశ్ సాగర పట్టణంలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో తరచూ బస్సులో తనతో పాటు శివమొగ్గ పాఠశాలకు వెళుతున్న పదో తరగతి విద్యార్థినితో పరిచయం పెంచుకున్న ప్రకాశ్ ఇంటికి వస్తే పాఠాలు చెబుతానంటూ నమ్మించాడు. పాఠాల కోసం ఇంటికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్న ప్రకాశ్ విద్యార్థినిపై గతకొద్ది కాలంగా తరచూ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం విద్యార్థిని అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు సాగర పోలీసులు ప్రకాశ్ను అరెస్ట్ చేశారు. -
కాలేజీలోనే లెక్చరర్పై కాల్పులు
ఛండీగఢ్ : హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి.. లెక్చరర్పై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో లెక్చరర్ మృతిచెందారు. సోనిపట్ జిల్లాలోని ఖార్ఖోడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థిని తుపాకీతో లెక్చరర్ రాజేష్ సింగ్పై కాల్పులు జరిపినట్లు సమాచారం. విద్యార్థి పరారీలో ఉన్నాడని.. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఘటనకు గల కారణాలు, మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. మరో ఘటనలో... గుర్గ్రామ్ లో బాద్షాపూర్లో నివసించే దంపతులపై గుర్తు తెలియని ఆగంతకులు కాల్పులు తెగబడ్డారు. ఈ దాడిలో భర్త తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. ఇక స్వల్ప గాయాలతో బయటపడిన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో టిల్లు అనే రౌడీ షీటర్ హస్తం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న టిల్లు కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు. #Haryana: Married couple shot at by unknown bike-borne assailants in #Gurugram's Badshahpur in early morning hours today; husband died on way to hospital, wife suffered injuries & is currently out of danger. pic.twitter.com/eFxxYP2AJ5 — ANI (@ANI) 13 March 2018 -
సంస్కృతాన్ని ద్వితీయభాషగా కొనసాగించాలి
సుభాష్నగర్(నిజామాబాద్ అర్బన్): సంస్కృతంను ద్వితీయ భాషగా కొనసాగించే వరకూ స్పాట్ వ్యాల్యూయేషన్ను బహిష్కరిస్తున్నామని సంస్కృత అధ్యాపకుల అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. ఈమేరకు గురువారం జిల్లా ఇంటర్ విద్యాధికారి దాసరి ఒడ్డెన్నకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తాము గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్లో సంస్కృతంను ద్వితీయ భాషగా బోధిస్తూ జీవనాన్ని సాగిస్తున్నామన్నారు. కానీ ఇటీవల కాలంలో ఇంటర్లో ద్వితీయ భాష సంస్కృతం విషయంలో తెలుగు తప్పనిసరి అని, ఫస్ట్క్లాస్ నుంచి ఇంటర్ వరకు తెలుగు ద్వితీయ భాషగా ఉంటుందని పేర్కొనడంతో తామంతా భయాందోళనకు గురవుతున్నామని పేర్కొన్నారు. ఉద్యోగ అబధ్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కావున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంస్కృతం ద్వితీయ భాషగా కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేసేవరకూ స్పాట్ వ్యాల్యూయేషన్ను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. -
పని ఎక్కువ.. జీతం తక్కువ..
శాతవాహనయూనివర్సిటీ: ప్రైవేటు ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది. చెప్పుకునేందుకు అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల హోదా అయినా.. సమయానికి వేతనాలు అందని దుస్థితి. ‘వారికేం.. వేలల్లో సంపాదిస్తారు..’ అనే పేరు తప్ప.. నెల గడిచినా.. జీతం ఎప్పుడొస్తుందోనని ఎదురుచూపులు తప్పడం లేదు. ఫీజు బకాయిల సాకుతో యాజమాన్యాలు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో కొందరికి ఇల్లు గడవడమే గగనమవుతోంది. ‘బాగా’నే ఇస్తున్నట్లు రికార్డుల్లో రాసుకుంటున్న యాజమాన్యాలు.. ఇచ్చేది మాత్రం అందులో 25శాతానికి మించడం లేదు. పరీక్షల్లో ఇన్విజిలేషన్ చేసినందుకు అధ్యాపకులకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెలల తరబడి పెండింగ్ జిల్లాలో మొత్తం 15 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఇందులో 13 ప్రైవేట్వే.. డిగ్రీ కళాశాలలు 129 ఉండగా 104 ప్రైవేట్వే.. వీటిలో మొత్తం 10వేలకుపైగా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో కొన్నిమాత్రమే క్రమం తప్పకుండా అధ్యాపకులకు వేతనాలు ఇస్తున్నాయి. మిగితా వాటిలో రెండు, మూడునెలలపాటు పెండింగ్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. డిగ్రీలో 80 శాతం కళాశాలలు సమయానికి జీతాలివ్వడం లేదనే అపవాదు ఉంది. ఇంక్రిమెంట్ల విషయంలోనూ సరైన సమయానికి ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. రికార్డుల్లో నాలుగురెట్లు వేతనాలు సక్రమంగా చెల్లించని కొన్ని కళాశాలలు అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం ప్రతినెలా వేతనాలు చెల్లిస్తున్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. వేతనాలు తీసుకుంటున్నట్లు ఉద్యోగుల నుంచి సంతకాలు తీసుకుంటున్నాయి. సంతకం పెట్టకపోతే ఉద్యోగం పోతుందనే భయంతో ఎదురుప్రశ్నించలేకపోతున్నారు. రికార్డుల్లో చూపించే వేతనాలు మాత్రం వాస్తవంగా వారికి చెల్లించే వేతనాలతో పొల్చితే మూడు, నాలుగు రెట్లు ఉంటున్నాయి. ఈ మేరకు వేతనాల రిజిస్టర్లు సాధరణరోజుల్లో, అ«ధికారుల తనిఖీలకు సంబంధించి వేరువేరుగా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంజినీరింగ్ కళాశాలల్లో కొన్ని మూడు నుంచి ఆర్నెల్లకోమారు మాత్రమే జీతాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఒక కళాశాలకు చెందిన అధ్యాపకుడిని ఇంక్రిమెంట్లు వస్తాయా..? వేతనాలు నెలనెలా ఇస్తారా..? అని అడిగితే ‘ఇంక్రిమెంట్ల సంగతి దేవుడెరుగు.. వేతనాలు నెలనెలా ఇస్తే అదే మహాభాగ్యం అంటూ నిట్టూర్చాడు. రెమ్యూనరేషన్కూ ఎసరు ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించినప్పుడు.. ఇంటర్నల్ ప్రయోగపరీక్షలు నిర్వహించినప్పుడు అధ్యాపకులకు కొంత రెమ్యూనరేషన్ వస్తుంది. ఈ మొత్తాన్నీ ఇవ్వకుండా యాజమాన్యాలే మింగేస్తున్నాయని చర్చ అధ్యాపకుల్లో జరుగుతోంది. మరోవైపు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సంతకాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా ఏళ్ల తరబడి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ముఖం చాటేస్తున్న ప్రముఖ కళాశాలలు ఉన్నాయంటే అతిశయోక్తికాదు. తనిఖీ అధికారులు పరీక్షల విభాగం జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ సమయానికి రావడం లేదన్న సాకుతో ఉద్యోగులకు నెలనెలా జీతాలివ్వడం లేదని తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఇవ్వడం లేదు –గోపాల్, లెక్చరర్ జిల్లా వ్యాప్తంగా పలు కళాశాలల్లో జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో బతుకు బండి నడపడం చాలా ఇబ్బందిగా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్తో సంబంధం లేకుండా కళాశాల యాజమాన్యాలు జీతాలివ్వాలి. అలాగే ఇంటర్నల్, చివరి పరీక్షలకు సంబంధించిన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలి. -
త్వరలో ఓయూలో అధ్యాపక ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్
హైదరాబాద్: ఓయూలో ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం శనివారం తెలిపారు. జూలై నాటికి అధ్యాపక ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి పర్మనెంట్ అధ్యాపకుల కొరతను తగ్గించనున్నట్లు చెప్పారు. ఓయూలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 415 అధ్యాపక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. పలు విభాగాలలో సబ్జెక్టుల వారీగా రూలాఫ్ రిజర్వేషన్లు, ఇతర అంశాలను క్షుణ్నంగా పరిశీలించి త్వరలో(వచ్చే నెల) నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. -
లెక్చరర్ వేధింపులు- విద్యార్థి ఆత్మహత్య
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లింగాలపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని చాపా కృష్ణ ప్రియాంక(19) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె భద్రాచలంలో చదువుకుంటున్న ప్రైవేట్ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు వేధించడంతో ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా రు. లింగాలపల్లికి చెందిన చాపా సుబ్బారావు, అరుణల పెద్ద కుమార్తె కృష్ణ ప్రియాంక భద్రాచలంలోని ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తల్లి అనారోగ్యంగా ఉండటం తో శనివారం ఇంటికి వచ్చి.. ముభావంగా గడిపింది. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. తల్లిదండ్రులు సత్తుపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సోమ వారం తెల్లవారుజామున మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జలకం ప్రవీణ్ తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం మధిర: యూనిట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతోందని ఉపాధ్యాయురాలు మందలించడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా మధిరలో సోమవారం జరిగింది. ఆత్కూరుకు చెందిన బొడ్డు దివ్య తన అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ మధిరలోని టీవీఎం పాఠశాలలో టెన్త్ చదువుతోంది. సోమవారం దివ్య యూనిట్ పరీక్ష రాస్తుండగా.. ఆమె కూర్చున్న చోట స్లిప్ ఉండటాన్ని టీచర్ గుర్తించారు. స్లిప్ను, దివ్య సమాధాన పత్రాన్ని పరిశీలించగా.. చేతిరాత పోలి ఉండటంతో టీచర్ మందలించారు. మనస్తాపానికి గురైన దివ్య మధ్యాహ్నం గ్రామానికి వెళ్లి ఖాళీ పురుగు మందు డబ్బాలో నీళ్లు పోసు కుని తాగింది. టీచర్ జరిగిన çఘటనను హెచ్ఎం నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. దివ్య తాతయ్య ఫ్రాన్సిస్కు హెచ్ఎం ఫోన్ చేసి.. సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దివ్య మధిర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
విద్యార్థులను చితక బాదిన లెక్చరర్
-
లెక్చరర్గా మారిన ఎమ్మెల్యే రోజా
-
రోడ్డు ప్రమాదంలో అధ్యాపకుడి మృతి
ప్రిన్సిపాల్కు తీవ్రగాయాలు వేమగిరి హైవేపై ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు కడియం (రాజమహేంద్రవరం రూరల్) : వేమగిరి తోట సమీపంలో హైవేపై సోమవారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో కొత్తపేట వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ అధ్యాపకుడు కోసూరి శ్రీనివాసరావు (56) అక్కడికక్కడే మృతి చెందారు. కాలేజీ ప్రిన్సిపాల్ సీఎల్ నాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ కారులో వస్తుండగా వేమగిరి వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని వీరి కారు ఢీకొట్టింది. పోలీసుల కథనం ప్రకారం రాజమహేంద్రవరం పీఅండ్టీ కాలనీకి చెందిన శ్రీనివాసరావు కొత్తపేట డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నారు. రోజూ రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద మోటారు సైకిల్ను పెట్టి బస్సులో కొత్తపేట వెళుతుంటారు. సోమవారం తిరిగి వచ్చేటప్పుడు రాజమహేంద్రవరం తిలక్ రోడ్డు ప్రాంతానికి చెందిన కాలేజీ ప్రిన్సిపాల్ నాయుడి కారులో బయలుదేరారు. వెనుక సీట్లో కూర్చున్నారు... ప్రిన్సిపాల్ నాయుడు కారు నడుపుతుండగా, అతడి పదేళ్ల కుమారుడు బాలు ముందు సీట్లో కూర్చున్నాడు. వెనుక సీట్లో ఎడమవైపున శ్రీనివాసరావు కూర్చున్నారు. లారీని బలంగా ఢీకొనడంతో కారు ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జయింది. నాయుడు, బాలు కారులో ఇరుక్కుపోయారు. స్థానికులు పోలీస్లకు సమాచారం ఇచ్చి సహాయక చర్యలు చేపట్టారు. కారు ఎడమవైపు ముందు సీట్లో కూర్చున్న బాలు.. లారీ ఛాసిస్ ఎత్తు కంటే కారు ఎత్తు తక్కువగా ఉండడంతో నేరుగా లారీని ఢీకొట్టినప్పటికీ ప్రాణాపాయం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. లేకుంటే అతడికి కూడా పెను ప్రమాదం సంభవించేందని వివరించారు. వాహనాన్ని నడుపుతున్న నాయుడు కూడా కారులో ఇరుక్కుపోయారు. స్థానికులు వారిని బైటకు తీశారు. అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందారు. 108 అంబులెన్స్లో నాయుడు, బాలును రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దక్షిణ మండలం డీఎస్పీ పి.నారాయణరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కడియం ఎస్సై కె.సురేష్బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా ప్రమాద ఘటన సమాచారాన్ని కాలేజీకి, వారి కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేశారు. బాధితుల కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీటి పర్యవంతమయ్యారు. రైల్వే ట్రాక్ దాటుతున్న యువకుడు... అనపర్తి : స్థానిక బాలుర ఉన్నత పాఠశాల వైపున గల రైల్వే గేటు వద్ద సోమవారం ట్రాక్ దాటుతున్న యువకుడిని రైలు ఢీకొనడంతో అతడు దుర్మరణం చెందాడు. సామర్లకోట రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ డి.అప్పారావు కథనం ప్రకారం మండలంలోని పీరా రామచంద్రపురానికి చెందిన చాట్ల సురేష్బాబు (25) వస్తున్న రైలును గమనించక రైల్వే గేటు వద్ద ట్రాక్ దాటుతున్నాడు. దీంతో కాకినాడ-షిరిడీ ఎక్స్ప్రెస్ సురేష్బాబును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేష్ మృతదేహం ఛిద్రమైంది. ఈ ఘటనపై అనపర్తి రైల్వే సిబ్బంది సమాచారంతో çసంఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మండపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్సీ తెలిపారు. అనారోగ్యంతో గిరిజనుడు... వీఆర్పురం (రంపచోడవరం) : కిడ్నీ సంబంధిత వ్యాధి బారిన పడిన గిరిజన యువకుడు బురకా శిరమయ్య (43) సోమవారం మృతి చెందాడు. అన్నవరం గ్రామానికి చెందిన శిరమయ్య కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం అతడు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అతడి పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆదివారం అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు. సోమవారం మృతదేహాన్ని స్వగ్రామం అన్నవరం తీసుకువచ్చారు. చింతూరు ప్రభుత్వాస్పత్రిలో కిడ్నీకి సంబంధించిన డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి ఉంటే భర్త బతికేవాడని మృతుడి భార్య చిన్నమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. మృతుడికి కుమారై, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
అధ్యాపకురాలికి పీహెచ్డీ ప్రదానం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ) : జేఎ¯ŒSటీయూ ఇంజినీరింగ్ కళాశాల ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ చట్టి సన్యాసలక్షి్మకి ఆంధ్రా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రదానం చేసింది. ‘స్రక్చరల్, మేగ్నేటిక్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్వెస్టగేష¯Œ్స ఆ¯ŒS ఆంటిమొనో అండ్ నియోబియయ్ డొపడ్నానోక్రిస్టలీ¯ŒS నికెల్ జింగ్ ఫెర్రైట్స్’ అంశంపై దశాబ్దకాలంగా చేసిన పరిశోధనలో ప్రతిపాదించిన అంశాలను వర్సిటీ ఆమోదించినట్టు ఆమె మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ వీసీ జి.నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆమె పీహెచ్సీని అందుకున్నారు. వర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ పీఎస్ బంగారురాజు నేతృత్వంలో ఆమె ఈ పరిశోధన చేశారు. ఈ నూతన ఆవిష్కరణ వల్ల మెక్రో ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో మైక్రోవేవ్ డివైజర్స్, కంప్యూటరియా మెమరీ ఎలిమెంట్స్, వైద్యరంగంలో డీప్ బై¯ŒS స్టిమ్యులేష¯ŒS వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడుతుందన్నారు. మతిమరుపు లక్షణాల గుర్తింపు, సూచనలు, కేన్సర్ ట్రీట్మెంట్లో ఈ పరిశోధన దోహదపడుతుందని ఆమె వివరించారు. దశాబ్ది కాలంగా చేసిన కృషి ఫలించిందని, ఆమె భర్త, విశాఖ గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల మేథమెటిక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేవీఎస్ శర్మ తెలిపారు. -
జేన్టీయూకే అధ్యాపకుడికి యంగ్సైంటిస్ట్ అవార్డు
బాలాజీచెరువు (కాకినాడ) : ఆంధ్రప్రదేశ్ సైన్స్ కాంగ్రెస్ అవార్డులో భాగంగా ప్రతి సంవత్సరం అందజేసే యంగ్సైంటిస్ట్ అవార్డు 2016కు జేఎన్టీయూకే కెమికల్ సైన్స్ అధ్యాపకుడు డాక్టర్ ఆర్.శ్రీనివాసులు ఎంపికయ్యారు. ఈ సంవత్సరం ఆగస్టు 25వ తేదీన గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్రవ్యాప్తసైన్స్ స పోటీలలో పాల్గొనగా శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఒకరితో పాటు జేఎ¯ŒSటీయూ కాకినాడ వర్సిటీ నుంచి శ్రీనివాసులు కెమికల్ సైన్స్ విభాగంలో ఎంపికయ్యారు. అవార్డును విజయవాడలో సోమవారం జరిగిన సై¯Œ్సకాంగ్రెస్ అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సైంటిస్ట్ ఏ.వి.రామారావు చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డుతో పాటు పదివేల రూపాయల బహుమతి తీసుకున్నారు. -
గుంటూరు జిల్లాలో లెక్చరర్ దారుణ హత్య
-
ఇంటర్ విద్యార్థిని చితకబాదిన లెక్చరర్
-
ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుడి హత్య
చిలకలూరిపేట రూరల్: మండలంలోని బొప్పూడి– మురికిపూడి గ్రామాల మధ్య రామచంద్రాపురం శివారులో ఇంజినీరింగ్ అధ్యాపకుడు హత్యకు గురయ్యాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బొప్పూడి– మురికిపూడి గ్రామాల మధ్య వ్యక్తి హత్య జరిగిందని ఆదివారం పోలీసులకు సమాచారం అందడంతో çఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహానికి సమీపంలో బీరుబాటిల్, సెల్ఫోన్ సిమ్కార్డు లభించింది. సిమ్ ఆధారంగా మృతిచెందింది చిలకలూరిపేట పట్టణానికి చెందిన నెల్లి రమణ (34)గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రమణ నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి నుంచి ఇంటికి రాలేదు. మృతుడికి భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ యు.శోభన్బాబు తెలిపారు. కాగా, మృతిచెందిన రమణ చిట్టీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. శనివారం సాయంత్రం చిట్టీ డబ్బుల కోసం బొప్పూడి వెళుతున్నట్లు సోదరునికి తెలిపి, ఇద్దరు వ్యక్తులతో ద్విచక్రవాహనంపై వెళ్లినట్లు తెలుస్తోంది. -
బాగ్దాద్ డాక్టర్ అంటూ భారీ మోసం
హైదరాబాద్ : వెబ్సైట్ వేదికగా బాగ్దాలో ప్రముఖ డాక్టర్గా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు నగరానికి చెందిన ఓ లెక్చరర్కు ఎర వేశాడు. 'ఖరీదైన పార్శిల్' పేరు చెప్పి రూ.34.5 లక్షలు దండుకున్నాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి నగరంలోని బేగంపేటలో ఉన్న ఓ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తోంది. ఆమె ఈ ఏడాది ఓ మాట్రిమోనియల్ సైట్లో రిజిస్టర్ చేసుకుంది. ఈ ప్రొఫైల్ను లైక్ చేసిన ఓ వ్యక్తి..ఆమెతో సంప్రదింపులు ప్రారంభించాడు. ఆన్లైన్ చాటింగ్ ద్వారా తాను బాగ్దాద్లో పనిచేస్తున్న ప్రముఖ వైద్యుడినంటూ పరిచయం చేసుకున్నాడు. అనంతరం వివాహానికి సమ్మతమంటూ సందేశం ఇచ్చాడు. పెళ్ళి కోసం అక్కడ నుంచి తిరిగి వచ్చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. పూర్తిగా ఆ మాయగాడి మాటల వల్లో పడిన ఆ యువతి అవన్నీ నిజమని నమ్మారు. తాను బాగ్దాద్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే హైదరాబాద్లో భారీ ఆస్పత్రి నిర్మాణం చేపడతానని, అందుకు అవసరమైన నిధులు తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తాను రావడానికి ముందే తన వద్ద ఉన్న డబ్బును వజ్రాలు, బంగారం రూపంలోకి మార్చి ఎయిర్ కార్గో పార్శిల్ రూపంలో పంపిస్తున్నానంటూ నమ్మబలికాడు. ఈ ఏడాది మర్చిలో ఓ పార్శిల్ను పంపించానంటూ సందేశం ఇచ్చాడు. ఇది జరిగిన రెండుమూడు రోజులకు ముంబై నుంచి కస్టమ్స్ అధికారి చేస్తున్నట్లు బాధితురాలికి ఓ ఫోన్ వచ్చింది. బాగ్దాద్ నుంచి భారీ పార్శిల్ వచ్చిందంటూ చెప్పిన సదరు అధికారి.. దాన్ని క్లియర్ చేయడానికి పన్ను రూపంలో కొంత చెల్లించాలంటూ చెప్పారు. ఆ యువతి ఆ మాటలు నమ్మడంతో ఓ బ్యాంకు ఖాతా నంబర్ ఇచ్చి అందులో నగదు డిపాజిట్ చేయించారు. ఇలా దాదాపు మూడు నెలల పాటు వివిధ ఫోన్ నంబర్ల నుంచి అనేక విభాగాల పేర్లతో ఫోన్లు రావడం, బాధితురాలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేయడం జరిగింది. మొత్తమ్మీద పది బ్యాంకు ఖాతాల్లో రూ.34.5 లక్షలు డిపాజిట్ చేసిన లెక్చరర్ చివరకు తాను మోసపోయానని గ్రహించింది. దీంతో సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేసిన అధికారులు బాధితురాలు నగదు డిపాజిట్ చేసిన పది బ్యాంకు ఖాతాలు గుజరాత్, ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి సైబర్ నేరగాళ్ళు బ్యాంకు ఖాతాలను బోగస్ వివరాలు, నకిలీ చిరునామాలతోనో, దళారుల్ని ఏర్పాటు చేసుకునే తెరుస్తారని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితుల్ని గుర్తించడానికి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. వివిధ మాట్రిమోనియల్ సైట్స్లో ఉన్న వ్యక్తుల ప్రొఫైల్స్ను చూసిన వెంటనే నమ్మవద్దనీ, ఎవరినీ నేరుగా కలవకుండా, పూర్వాపరాలు పరిశీలించకుండా వ్యక్తిగత వివరాలు చెప్పడం, నగదు డిపాజిట్ చేయడం, ఆర్థిక లావాదేవీలు వద్దని హెచ్చరిస్తున్నారు. -
గొలుసు చోరీ
నిజామాబాద్ కైం: ఉమెన్స్ కళాశాల లెక్చరర్ మెడలో నుంచి చైన్ను లాక్కెళ్లారు దుండగులు. మూడో టౌన్ ఎస్సై–2 వెంకట్ కథనం ప్రకారం.. నీలకంఠనగర్కు చెందిన అనసూయ కంఠేశ్వర్ ఉమెన్స్ కళాశాలలో లెక్చరర్. రెండు రోజుల క్రితం గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్ను కలిసేందుకు గిరిరాజ్ కళాశాలకు ఆటోలో వచ్చింది. కళాశాల ముందు ఆటో దిగి లోనికి నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు ఓ రాయితో ఆమె కాలిపై విసిరారు. దాంతో ఆమె ఏమైందోనని చూసేకునే లోపు ఆమె మెడలోనున్న మూడు తులాల బంగారు గొలుసును తెంపుకొని పారిపోయారు. బిత్తరపోయిన ఆమె తెరుకుని కేకలు పెట్టేసరికి దొంగలు అక్కడి నుంచి క్షణల్లో మాయం అయిపోయారు. అనంతరం అక్కడి స్థానికులు ఆమె వద్దకు చేరుకోగా వారికి జరిగిన విషయం తెలిపింది. సంఘటన అనంతరం లెక్చరర్ దిగులుపడుతూ ఇంటికి చేరుకుంది. బంధుమిత్రుల సలహా మేరకు బాధితురాలు సోమవారం మూడో టౌన్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ంది. -
ఏఎన్యూ అధ్యాపకుడికి అంతర్జాతీయ అవార్డు
ఏఎన్యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎంహెచ్ఆర్ఎం విభాగాధిపతి, యూనివర్సిటీ సెంటర్ ఫర్ హెచ్ఆర్డీ కో–ఆర్డినేటర్ డాక్టర్ నాగరాజుకు అంతర్జాతీయ ఉత్తమ పరిశోధన పత్రం అవార్డు లభించింది. ఏఎన్యూ రిజిస్ట్రార్ ఆచార్య కే జాన్పాల్ అవార్డును శనివారం అందజేశారు. టాంజానియా దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ ముజిమ్బీచిన, యూనివర్సిటీ ఆఫ్ జాన్జిబార్లు సంయుక్తంగా ‘ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ’ అనే అంశంపై ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఏఎన్యూ నుంచి డాక్టర్ నాగరాజు పాల్గొన్నారు. ఆయన ‘ ద రోల్ ఆఫ్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఐఐసీటీస్ ఫర్ ససై ్టనబుల్ డెవలప్మెంట్ కమ్యూనికేషన్ యాన్ ఎంపరికల్ స్టడీ) అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించారు. దీనికి ఉత్తమ పరిశోధన పత్రం అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నాగరాజును విభాగ అధ్యాపకులు డాక్టర్ తులసీదాస్, యూనివర్సిటీ అధికారులు అభినందించారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్ ఆత్మహత్యాయత్నం
– పెట్రోల్ తాగి.. ఆపై ఒంటిపై పోసుకుని.. – నిప్పంటించుకుంటుండగా అడ్డుకున్న సహచరులు – ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని ఆరోపణలు – మోత్కూరులో ఘటన మోత్కూరు: ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేకపోతున్నాని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. బాధిత లెక్చరర్తో పాటు సహచర లెక్చరర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండల కేంద్రానికి చెందిన ఎం.మల్లిఖార్జున్ జనరల్ఫౌండేషన్ కోర్సు ఓకేషనల్ (జీఎఫ్సీ) కాంట్రాక్ట్ లెక్చరర్గా మర్రిగూడ కాలేజీలో 13 సంవత్సరాలుగా పనిచేశాడు. మూడేళ్ల క్రితం బదిలీపై వచ్చి మోత్కూరు జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. మల్లికార్జున్ గురువారం ఉదయం కళాశాలకు చేరుకుని ప్రిన్సిపాల్ తన బాండ్ను రెన్యూవల్కు పంపడంలేదని మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే మల్లిఖార్జున్ తన బైక్లో ఉన్న పెట్రోల్ బాటిల్తీసి కొంత తాగి శరీరంపై పోసుకునిఅగ్గిపుల్లతో నిప్పంటించుకోబోయాడు. గమనించిన తోటి లెక్చరర్లు అతడిని అడ్డుకున్నారు. అనంతరం 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. మూడు సంవత్సరాలుగా ఇంటర్పబ్లిక్ వార్షిక, సప్లమెంటరీ పరీక్షల రెమ్మునరేషన్ కోసం విధులు నిర్వహించిన వారితో ప్రిన్సిపాల్ ఎక్వీటెన్స్లో సంతకాలు చేయించుకుని డబ్బులు చెల్లించలేదని మల్లిఖార్జున్తో పాటు పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆరోపించారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ల్చెరర్స్ను పలు రకాలుగా వేధింపులకు గురిచేస్తున్న ఇన్చార్జీ ప్రిన్సిపాల్ చొప్పరి పరమేశ్ను సస్పెండ్ చేయాలని కోరుతూ గురువారం కళాశాల ఆవరణలో ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సాయంత్రం ప్రిన్సిపాల్ తన కారులో వెల్లిపోతుండగా లెక్చరర్లు అడ్డుకుని ఘెరావ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి వి.కొండల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పేరుమాల్ల రాజులు మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ పరమేశ్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను, అధ్యాపకులను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్పై కఠిన చర్యతీసుకోవాలన్నారు. మల్లిఖార్జున్ అనే లెక్చరర్ను ప్రిన్సిపాల్ మానసికంగా వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. మహిళా లెక్చరర్లపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రెన్యూవల్ బాండ్కోసం ఒక్కో లెక్చరర్ వద్ద రూ. 10వేలు ప్రిన్సిపాల్ డిమాండ్ చేశాడని ఆరోపించారు. విచారణ జరిపి తగు చర్య తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె.అన్సారీ, జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడు విజయ్కుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫయాజ్, నర్సిరెడ్డి, పరుశరాములు, వెంకట్రెడ్డి, శ్వేత, మంజుల, వై.నర్సిరెడ్డి, శ్యామ్, లింగస్వామి, నర్సింహ్మ ఉన్నారు. వేధించలేదు : ప్రిన్సిపాల్ కాంట్రాక్ట్ లెక్చరర్లను వేధించడంలేదని , విధులు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పడంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రిన్సిపాల్ పరమేశ్ తెలిపారు. ప్రిన్సిపాల్ అని కూడా చూడకుండా తిరుగుబాటు ధోరణిలో మల్లికార్జున్ అనే లెక్చరర్ మాట్లాడాడని చెప్పాడు. అటెండెన్స్, బయోమెట్రిక్ విధానం ద్వారా జరుగుతున్నందున ఎవ్వరి రెన్యూవల్ బాండ్లు ఆపడం లేదని చెప్పారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్ ఆత్మహత్యాయత్నం
– పెట్రోల్ తాగి.. ఆపై ఒంటిపై పోసుకుని.. – నిప్పంటించుకుంటుండగా అడ్డుకున్న సహచరులు – ప్రిన్సిపాల్ వేధింపులే కారణమని ఆరోపణలు – మోత్కూరులో ఘటన మోత్కూరు: ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేకపోతున్నాని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మోత్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. బాధిత లెక్చరర్తో పాటు సహచర లెక్చరర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం మండల కేంద్రానికి చెందిన ఎం.మల్లిఖార్జున్ జనరల్ఫౌండేషన్ కోర్సు ఓకేషనల్ (జీఎఫ్సీ) కాంట్రాక్ట్ లెక్చరర్గా మర్రిగూడ కాలేజీలో 13 సంవత్సరాలుగా పనిచేశాడు. మూడేళ్ల క్రితం బదిలీపై వచ్చి మోత్కూరు జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నాడు. మల్లికార్జున్ గురువారం ఉదయం కళాశాలకు చేరుకుని ప్రిన్సిపాల్ తన బాండ్ను రెన్యూవల్కు పంపడంలేదని మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే మల్లిఖార్జున్ తన బైక్లో ఉన్న పెట్రోల్ బాటిల్తీసి కొంత తాగి శరీరంపై పోసుకునిఅగ్గిపుల్లతో నిప్పంటించుకోబోయాడు. గమనించిన తోటి లెక్చరర్లు అతడిని అడ్డుకున్నారు. అనంతరం 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు. మూడు సంవత్సరాలుగా ఇంటర్పబ్లిక్ వార్షిక, సప్లమెంటరీ పరీక్షల రెమ్మునరేషన్ కోసం విధులు నిర్వహించిన వారితో ప్రిన్సిపాల్ ఎక్వీటెన్స్లో సంతకాలు చేయించుకుని డబ్బులు చెల్లించలేదని మల్లిఖార్జున్తో పాటు పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆరోపించారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ల్చెరర్స్ను పలు రకాలుగా వేధింపులకు గురిచేస్తున్న ఇన్చార్జీ ప్రిన్సిపాల్ చొప్పరి పరమేశ్ను సస్పెండ్ చేయాలని కోరుతూ గురువారం కళాశాల ఆవరణలో ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సాయంత్రం ప్రిన్సిపాల్ తన కారులో వెల్లిపోతుండగా లెక్చరర్లు అడ్డుకుని ఘెరావ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి వి.కొండల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పేరుమాల్ల రాజులు మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ పరమేశ్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను, అధ్యాపకులను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్పై కఠిన చర్యతీసుకోవాలన్నారు. మల్లిఖార్జున్ అనే లెక్చరర్ను ప్రిన్సిపాల్ మానసికంగా వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. మహిళా లెక్చరర్లపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రెన్యూవల్ బాండ్కోసం ఒక్కో లెక్చరర్ వద్ద రూ. 10వేలు ప్రిన్సిపాల్ డిమాండ్ చేశాడని ఆరోపించారు. విచారణ జరిపి తగు చర్య తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.కె.అన్సారీ, జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడు విజయ్కుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫయాజ్, నర్సిరెడ్డి, పరుశరాములు, వెంకట్రెడ్డి, శ్వేత, మంజుల, వై.నర్సిరెడ్డి, శ్యామ్, లింగస్వామి, నర్సింహ్మ ఉన్నారు. వేధించలేదు : ప్రిన్సిపాల్ కాంట్రాక్ట్ లెక్చరర్లను వేధించడంలేదని , విధులు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పడంతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రిన్సిపాల్ పరమేశ్ తెలిపారు. ప్రిన్సిపాల్ అని కూడా చూడకుండా తిరుగుబాటు ధోరణిలో మల్లికార్జున్ అనే లెక్చరర్ మాట్లాడాడని చెప్పాడు. అటెండెన్స్, బయోమెట్రిక్ విధానం ద్వారా జరుగుతున్నందున ఎవ్వరి రెన్యూవల్ బాండ్లు ఆపడం లేదని చెప్పారు. -
అనుమానాస్పద స్థితిలో లెక్చరర్ మృతి
రైల్వే ట్రాక్ పక్కన మృతదేహం జేబులో రెండు పేజీల లేఖ లభ్యం రైల్వేగేట్ : వరంగల్ సమీపంలోని ధర్మారం రైల్వేట్రాక్ సమీపంలో ఓ పాలిటెక్నిక్ లెక్చరర్ మృతదేహం బుధవారం ఉదయం లభ్యమైంది. వరంగల్ జీఆర్పీ సీఐ స్వామి కథనం ప్రకారం.. హన్మకొండలోని నయీంనగర్కు చెందిన ఎ¯ŒS. క్రిష్ణమోహ¯ŒS(44) పరకాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్లో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో అతడు బుధవారం ఉదయం ధర్మారం వద్దగల రైల్వేట్రాక్ పక్కన చనిపోయి ఉండడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం వద్ద లభించిన ఐడీ కార్డు ఆధారంగా అతడు లెక్చరర్గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడి భార్య సంధ్యారాణి అలియాస్ దివ్య సంఘటన స్థలానికి చేరుకొని వినాయకుడి ప్రసాదం పంచిపెడుతానని ఇంటి నుంచి వచ్చి ఇలా చనిపోయావా అంటూ విలపించింది. పోలీసులు పంచనామా చేసి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. ఇదిలా ఉండగా కృష్ణమోహ¯ŒS మరణం అనుమానాస్పదంగా ఉన్నట్లు పలువురు చర్చించుకున్నారు. రైలుగాని, మరేదైనాగాని ఢీకొన్న దాఖలాలు ఆయన శరీరం మీద లేకపోవడంతో ఏదైనా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ ‘బీపీ పెరుగుతుంది.. వెరికోస్ ప్రాబ్లం ఉంది.. నాకు నడుం, మెడ నొప్పి తీవ్రంగా ఉంది. అయినా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాను. నేను శారీరక వికలాంగుడినని బంధువులు, మిత్రులు అంటున్నారు. నా తల్లిదండ్రులు, పిల్లలు దైవ స్వరూపులు. నా పనే నాకు దైవం, తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనాదక్షతను నా తల్లిదండ్రులు చూడలేకపోయారు. కేసీఆర్ అంకిత భావానికి ముగ్దుడనైన నేను అనేక పనులు చేస్తున్నాను. మూడు టెక్టŠస్ బుక్స్ రాసి పబ్లిష్ అయ్యేందుకు ఆయనే స్ఫూర్తి(కేసీఆర్). కేసీఆర్ వలన ఇంకా వంద సంవత్సరాలు పురోగమిస్తుంది. ఇది సత్యం.. నా భార్య, కేసీఆర్ నా జీవిత మార్గదర్శకాలు. – క్రిష్ణమోహ¯ŒS గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్’ అని సూసైడ్ నోట్లో రాసి ఉందని జీఆర్పీ సీఐ స్వామి వెల్లడించారు. -
డిగ్రీ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్ల రెన్యూవల్కు ఉత్తర్వులు
విద్యారణ్యపురి : తెలంగాణ రాష్ట్రంలోని ఐదు, ఆరో జోన్ల పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను రెన్యూవల్ చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.ఈమేరకు హన్మకొండలోని ఉన్నతవిద్య ఆర్జేడీ డాక్టర్ బి.దర్జన్కు ఉత్తర్వులు అందాయి. ఆయా జోన్లలో మెుత్తం 860 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వివిధ సబ్జెక్టులలో గత విద్యా సంవత్సరంలో బోధన చేసి ఈ విద్యాసంవత్సరంలో కొనసాగుతున్న కాంట్రాక్టు లెక్చరర్లు తమ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సెప్టెంబర్ 3 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభు త్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, జేసీ, కళాశాల ప్రిన్సిపాల్లతో కూడిన కమిటీ ఆయా దరఖాస్తులను పరిశీలించి రెన్యూవల్ చేస్తుందని అందులో ప్రస్తావించారు. గత విద్యా సంవత్సరంలో పనిచేసి ఇప్పుడు డిస్టర్బ్ అయిన అధ్యాపకులకు సంబంధించిన దరఖాస్తులను ప్రిన్సిపాల్స్ ఉన్నత విద్య ఆర్జేడీ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. ఆయా దరఖాస్తులలో వివిధ సబ్జెక్టులలో ఎక్కడైనా జిల్లాల్లో ఖాళీగా ఉంటే అక్కడికి వారిని నియమించే అవకాశాలు ఉంటాయి. -
అధ్యాపకుడి దుర్మరణం
ఇబ్రహీంపట్నం : లారీ ఢీకొన్న ప్రమాదంలో జాకీర్హుసేన్ కళాశాల తెలుగు అధ్యాపకుడు నాగ సురేష్బాబు మృతిచెందాడు. స్థానిక కేరళా హోటల్ సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కళాశాల నుంచి బయటకు వచ్చిన అనంతరం తన బంధువుల ఇంటికి వెళ్లిన సురేష్బాబు రాత్రి 10.30 గంటల సమయంలో తన బైకుపై గొల్లపూడిలోని తన ఇంటికి బయలు దేరాడు. కొద్ది సేపటికే లారీ ఢీకొనడంతో ఆయన మృతిచెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
వీఎస్యూలో బోధనా సిబ్బందిని నియమించాలి
నెల్లూరు (టౌన్) విక్రమ సింహపురి విశ్వవిద్యాయంలో పూర్తిస్థాయిలో బోధించేందుకు అధ్యాపకులు నియమించాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆది త్యసాయి డిమాండ్ చేశారు. స్థానిక ఎన్జీఓ హోమ్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. గత ఎనిమిదేళ్లలో విద్యార్థులకు బోధనకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాలేదన్నారు. ఏ ఏడాదికేడు కాంట్రాక్టు అధ్యాపకుల విధులను రెన్యువల్ చేస్తూ బోధనకు ఇబ్బం దులు లేకుండా చూసేవారని చెప్పా రు. ప్రస్తుతం కాంట్రాక్టు అధ్యాపకులను నిలిపివేసిన నేపథ్యంలో సమస్య నెలకొందని తెలిపారు. ఈ విషయం హైకోర్టులో ఉన్నందున వీసీ, రిజిస్ట్రార్లు గెస్ట్ ఫ్యాకల్టీ పేరు తో కొత్తవారిని తీసుకునేందుకు కొత్త ప్రయత్నానికి తెరలేపారని ఆరోపించారు. కాంట్రాక్టు అధ్యాపకులను కాకుండా గంటల ప్రకారం చెప్పే వారిని తీసుకోవాడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అనేక ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను విధుల నుంచి తొలగించడం దారుణమన్నారు. వీసీ, రిజిస్ట్రార్ తుగ్లక్ పాలనతో వర్సిటీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. -
‘ప్రేమ’ విషాదం
ప్రియురాలికి మరో వ్యక్తితో పెళ్లి జరిగిందని మనస్థాపం చెందిన ప్రియుడు రాఘవేంద్ర ఆత్మహత్య చేసుకోగా, విషయం తెలుసుకున్న ప్రియురాలు అను సైతం నీవు లేని జీవితం నాకెందుకంటూ బలవన్మరణానికి పాల్పడింది. బెంగళూరు : ప్రియురాలికి మరో వ్యక్తితో వివాహం జరిగిందని మనస్థాపం చెందిన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడగా ఈ విషయం తెల్సిన ప్రియురాలు సైతం బలవన్మరణానికి పాల్పడింది. నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు...హాసన్కు చెందిన రాఘవేంద్ర (28) ఏడేళ్ల కిత్రం బెంగళూరుకు చేరుకుని క్యాబ్ డ్రైవర్ పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విజయనగర్కు చెందిన అను (26) అనే యువతితో రాఘవేంద్రకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అను ఇక్కడి ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తోంది. ఇదిలా ఉంటే అను తల్లిదండ్రులు వీరి పెళ్లికి వ్యతిరేకించి ప్రశాంత్ అనే వ్యక్తితో అనుకు వివాహం జరిపించారు. అంతకు ముందు తమ ప్రేమ వ్యవహారం గురించి రాఘవేంద్ర ప్రశాంత్కు చెప్పినా అతను పెడచెవిన పెట్టి అనును పెళ్లి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన రాఘవేంద్ర డెత్నోట్ రాసి శుక్రవారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు రాత్రి అను రాఘవేంద్ర మొబైల్కు ఫోన్ చేయడంతో అక్కడే ఉన్న పోలీసులు జరిగిన ఘటనను వివరించారు. దీంతో మనో వేదనకు గురైన అను శనివారం ఉదయం తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లికి ముందే వరకట్న దాహానికి బలి..
వరంగల్ : పెళ్లి కాకుండానే వరకట్న దాహానికి ఓ యువతి బలైంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత అదనపు కట్నం కోసం వేధించడంతో లెక్చరర్గా పనిచేస్తున్న మమత అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం ఎలుగుబల్లికి చెందిన వెంకటరమణ, ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన మమత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తిరుపతిలో పీజీ చేస్తున్నప్పటి నుంచి ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. మమత పీజీ పూర్తయ్యాక వరంగల్లో అధ్యాపకురాలిగా పనిచేస్తుండగా వెంకటరమణ వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. పెద్దల అంగీకారంతో గత ఏడాది నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచీ మమతకు కష్టాలు మొదలయ్యాయి. అదనంగా కట్నం ఇవ్వకపోతే ఇంకో పెళ్లి చేసుకుంటానని వెంకటరమణ వేధించేవాడు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో మమత లోలోపల కుమిలిపోయేది. మారతాడేమోనని ఏడాది కాలంగా ఎదురు చూసింది. అయినా వైద్యుడైన వెంకటరమణలో ఏ మార్పు రాకపోవడంతో మనస్థాపానికి గురైంది. మానసిక సంఘర్షణను తట్టుకోలేక పురుగుల మందు తాగింది. వరంగల్ ఎజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. పోస్టుమార్టం అనంతరం మమత మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
లెక్చరర్ ఆత్మహత్య
బోడుప్పల్ (హైదరాబాద్) : జీవితంపై విరక్తి చెంది ఓ మహిళా లెక్చరర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్కు చెందిన శంకరయ్య కుమార్తె నాగమణి(35)కి కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన నర్సింహాచారితో వివాహం అయ్యింది. వీరికి 14 సంవత్సరాల కుమారుడున్నాడు. నర్సింహాచారి రెండు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. దీంతో కొంత కాలంగా నాగమణి బోడుప్పల్ బృందావన్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని తల్లిదండ్రులకు దగ్గరలో ఉంటోంది. కుమారుడిని చదివించుకుంటూ స్థానిక ఎస్ఆర్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తోంది. అయితే శుక్రవారం కుమారుడు బంధువుల ఇంటికి వెళ్లగా రాత్రి 11 గంటల సమయంలో నాగమణి ఫ్యాన్కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం స్థానికులు గమనించి మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. తనకు బతకాలని లేదని, తన కుమారుడిని బాగా చూసుకోవాలని చెప్పి సూసైడ్ నోట్లో రాసినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు -
టీచర్ ను మోసగించిన విద్యార్థినికి జైలు!
స్వలాభం కోసం ఓ విద్యార్థిని ఏకంగా ఉపాధ్యాయురాలినే టార్గెట్ చేసింది. అనారోగ్యం, బాధలు, కష్టాలు వంటి అనేక అసత్యాలతో నమ్మించి మోసంచేసింది. కార్న్ వాల్ కు చెందిన 22 ఏళ్ళ ఎలిసా బియాంకో.. తన ఉపాధ్యాయురాలు... 49 ఏళ్ళ సాలీ రెట్టాలక్ దయాగుణాన్నిగ్రహించి క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించింది. నకిలీ ప్రేమను చూపించి, విషాదగాధను వినిపించి మైండ్ గేమ్ ఆడుకుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు సృష్టించి వారి జీవితాలను నాశనం చేసి, చివరికి జైలుపాలయ్యింది. ఎవరో తన వెంట పడుతున్నారని, తల్లిదండ్రులు సరిగా చూడటం లేదని, క్యాన్సర్ వల్ల కేవలం మూడు నెలలే బతుకుతానని ఎన్నో అబద్ధాలు చెప్పి, రెట్టాలక్ చూపించిన జాలినే ఆయుధంగా చేసుకొని, ఏకంగా ఆమె ఇంటికే మకాం మార్చేసింది. క్యాన్సర్ చికిత్స పేరున ప్రతిరోజూ ఆస్పత్రికి దింపుతున్న రెట్టాలక్ కళ్ళుగప్పి ఓ కేఫ్ లో కూర్చొని నకిలీ బ్యాండేజ్ లు వేసుకుంటూ కాలం గడిపింది. బియాంకో వేసిన నాటకాలకు రెట్టాలక్ పడిపోయింది. అంతేకాదు ఆమె ఖర్చులకు కష్టం అవుతుందని పని కూడ ఇప్పించింది. అయితే అన్నం పెట్టిన చేతినే నరికిన చందాన.. మరో అడుగు ముందుకేసిన బియాంకో... ఓ కన్సల్టెంట్ ఫిజీషియన్ జాన్ పేరున తప్పుడు ఈ మెయిల్ అడ్రస్ తో మెయిల్స్ ఇస్తూ.. గొంతు మార్చి ఫోన్లు చేస్తూ వారిద్దరూ దగ్గరయ్యేలా చేసింది. రకరకాల నాటకాలాడుతూ బియాంకో.. రెట్టాలక్ కాపురంలో నిప్పులు పోసింది. వారి కుటుంబం విచ్ఛిన్నం అయ్యేలా చేసింది. డాక్టర్ క్యారెక్టర్ ద్వారా తన క్యాన్సర్ ముదిరినట్లు చెప్పింది. తనపై జాలి మరింత పెరిగేలా చేసుకొంది. 2013 లో తనకు రోగం ముదిరిపోయిందని, ఇదే తన ఆఖరి పుట్టిన రోజని చెప్పి... పార్టీకోసం రెట్టాలక్ దగ్గర డబ్బు కూడ గుంజింది. దీంతో బియాంకో బాధను చూడలేని రెట్టాలక్ డాక్టర్ (లవర్ జాన్) ను కలసి ట్రీట్ మెంట్ గురించి మాట్లాడదామని ప్రయాణమైంది. తీరా డాక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించడంతో కారు ప్రయాణంలో ఆ క్యారెక్టరే లేదని నిజం చెప్పిన బియాంకో... ఏకంగా రెట్టాలక్ ను కారునుంచి బయటకు గెంటి చంపేందుకు ప్రయత్నించింది. దీంతో అసలు బండారం బయట పడింది. రెట్టాలక్ కోర్టుకు జరిగిన కథ వివరించడంతో బియాంకోకు రెండు సంవత్సరాల ఎనిమిది నెలల జైలు శిక్ష వేశారు. ఎలీసా బియాంకో అవసరానికో అబద్ధం చెబుతూ సాలీ రెట్టాలక్ జీవితాన్నే నాశనం చేసింది. 16 ఏళ్ళ వయసులో కార్న్ వాల్ లోని సెయింట్ ఆస్టెల్ కాలేజ్ లో ఆరోగ్య, సామాజిక సంరక్షణ కోర్సులో చేరిన బియాంకో.. 2009 లో ట్యూటర్ గా వచ్చిన సాలీ రెట్టాలక్ తో పరిచయం పెంచుకుంది. నిజానికి ఇటువంటి వింత, భయంకరమైన కేసులను ఎప్పుడూ తమ జీవితంలో చూడలేదని క్లిస్టఫర్ హార్వే క్లార్క్ సహా పలువురు న్యాయమూర్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. -
టెన్త్ విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన
* విద్యార్థినిని లాడ్జికి తీసుకొచ్చిన వైనం * దాడిచేసి పట్టుకున్న పోలీసులు సూర్యాపేట/ కూసుమంచి: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. విద్యా ర్థినిని లాడ్జికి తీసుకొచ్చి పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా నేలకొం డపల్లి మండలం మండ్రాజుపల్లికి చెందిన నెల్లూరి నాగేశ్వరరావు ఆరేళ్లుగా మండలంలోని నేలపట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇతను విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. నేలపట్ల గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని(15)తో కొంతకాలంగా చనువు గా ఉంటూ ఆమెను లొంగదీసుకున్నాడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం సెలవుదినం కావడంతో సదరు విద్యార్థిని తన స్నేహితులతో కలసి కూసుమంచి శివాలయానికి వెళ్లింది. అక్కడి నుంచి ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు మాయమాటలు చెప్పి తన వెంట సూర్యాపేటకు తీసుకెళ్లాడు. ఇక్కడి లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు లాడ్జిపై దాడులు నిర్వహించగా నిందితుడు పరారయ్యాడు. విద్యార్థినిని సూర్యాపేటలోని ఏరియా ఆస్పత్రి కి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరు పరిచారు. కాగా విద్యార్థిని తల్లి ఫిర్యా దు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాల ఎదుట ధర్నా కీచక ఉపాధ్యాయుడు నాగేశ్వరరావును విధుల నుంచి తొలగించాలని, అతడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఖమ్మం జిల్లా నేలపట్ల గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం గ్రామంలోని ఆ పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. విద్యార్థులు కూడా తరగతులు బహిష్కరించారు. కీచక ఉపాధ్యాయుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. -
ఏసీబీ వలలో టీటీడీ లెక్చరర్
తిరుపతి క్రైం: ఓ కాంట్రాక్టు లెక్చరర్ వద్ద లంచం తీసుకుంటూ మంగళవారం టీటీడీ లెక్చరర్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శంకర్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని ఎస్జీఎస్ డిగ్రీ కళాశాలలో పెద్ద రెడ్డెప్పరెడ్డి కంప్యూటర్ సైన్స్(ఎమ్మెస్సీ) విభాగాధిపతి(హెచ్ఓడీ)గా పనిచేస్తున్నారు. అక్కడే కాంట్రాక్టు లెక్చరర్గా బాలాజీ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బాలాజీ 2014-15కు సంబంధించిన జీతాల ఫైల్ను హెచ్ఓడీకి అందించారు. 8 నెలలకు కలిపి మొత్తం రూ.81వేలు రావాల్సి ఉంది. ఈ డబ్బు రావాలంటే హెచ్ఓడీ ఆ ఫైల్పై సంతకం పెట్టి టీటీడీ జేఈవోకు పంపిస్తారు. అక్కడ నుంచి అకౌంట్స్ సెక్షన్కు చేరుతుంది. అక్కడ ఆమోదం పొంది తిరిగి కాలేజీ ప్రిన్సిపాల్కు చేరాలి. అయితే ఆ ఫైల్ పంపించాలంటే రూ.40 వేలు చెల్లించాలని పెద్దరెడ్డెప్పరెడ్డి డిమాండ్ చేశారు. బాలాజీ ఎంత బతిమాలినా కూడా తగ్గించుకోలేదు. చివరకు రూ.31 వేలు చెల్లిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్డెప్పరెడ్డిని అరెస్టు చేశారు. అతని వద్ద రూ.31 వేలు స్వాధీనం చేసుకుని నెల్లూరు కోర్టుకు తరలించారు. -
అమ్మడు లెక్చరర్ , బాబు స్టూడెంట్
చెన్నై : రేసుగుర్రం, శ్రీమంతుడు చిత్రాలు భారీ విజయంతో జోరుమీదున్న భామ శ్రుతి హాసన్. దీంతో మరో తెలుగు సినిమా పాత్ర కోసం అపుడే కసరత్తు మొదలుపెట్టిందిట. శ్రీమంతుడు సినిమా తరువాత తెలుగులో చేస్తున్న ఈ మలయాళ రీమేక్ లో శ్రుతి... లెక్చరర్ పాత్ర పర్ఫెక్షన్ కోసం తెగ తాపత్రయపడుతోందిట. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకధాటిగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ప్రేమమ్' తెలుగు రీమేక్కి సైన్ చేసింది. 'మంజు' అనే టైటిల్ దాదాపు ఖరారైన ఈ చిత్రంలో శ్రుతి లెక్చరర్ పాత్రను పోషించబోతోంది. 'సాయి పల్లవి' అనే క్యారెక్టర్కు స్పెషల్ మేకోవర్ ప్లాన్ చేస్తోందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. శ్రీమంతుడు తరువాత తెలుగులో చేస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్కు జోడిగా అక్కినేని నాగ చైతన్య లీడ్ రోల్లో నటిస్తున్నాడు. నాగ చైతన్య స్టూడెంట్గా శ్రుతి లెక్చరర్గా కన్పించనున్నారు. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. అటు మలయాళ ' ప్రేమమ్'లో సెకండ్ హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తెలుగులో కూడా యాక్ట్ చేస్తోంది. -
గురువును పెళ్లాడటం... తప్పు కాదా?!
జీవన గమనం నేనొక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాను. నేను చేస్తోన్న ఉద్యోగం నాకు సుఖాన్నిస్తోంది. కానీ నా నమ్మకాలకు వ్యతి రేకంగా పని చేస్తేనే ఆ ‘సుఖం’ నాకు లభి స్తోంది. ఇలా నమ్మకాలకి, మరింత సుఖపడ టానికి మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు ఎలా సమన్వయపరచుకోవాలి? ఏదో ఒకదాన్ని వదులుకోవాల్సిందేనా? - నన్నపనేని, సామర్లకోట ‘నా నైతిక విలువల్ని వదులుకోవాలా, సుఖాన్ని వదులుకోవాలా’ అన్నది మీ ప్రశ్న. హోటల్లో ఇడ్లీ తింటున్నప్పుడు పక్క వాడి పూరీని చూసి, తప్పు నిర్ణయం తీసు కున్నామేమో అని బాధపడితే ఇడ్లీ ఏ మాత్రం సంతృప్తినివ్వదు. మీ ఉద్యోగం మీకు సుఖాన్నిస్తోంది కానీ సంతృప్తినివ్వ ట్లేదని రాశారు. ఒక పని సంతృప్తినివ్వక పోవడానికి కారణం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి - శారీరకంగా మనం ఆ పని చేయలేకపోయినప్పుడు. ఉదాహరణకి, రోగంతో బలహీనమైన వ్యక్తి రైల్వే కూలీగా పనిచేస్తే చాలా బాధపడవలసి ఉంటుంది. రెండోది - మానసికంగా ఆ పని ఇష్టం లేకపోయినప్పుడు. ఉదాహర ణకి, సృజనాత్మకత ఉన్న ఒక కళాకారిణి బ్యాంక్లో రొటీన్ ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు చాలా నిరాసక్తత ఆవహి స్తుంది. మూడోది - చేస్తున్న పనికి, సిద్ధాంతాలకు నిరంతర ఘర్షణ జరుగుతున్నప్పుడు. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కూడా లంచాలు, కమీషన్లు ఉంటాయి. మీ సమస్య మూడోదే అనుకుంటున్నాను. నైతిక విలువల పట్ల నమ్మకం ఉన్న వ్యక్తికి, పక్క సీట్లో కూర్చుని లంచాలు తీసుకుం టున్న వ్యక్తి రోజురోజుకీ ధనవంతుడవడం చూసి... ‘తనకున్న నైతిక విలువ గొప్పదా ధనం విలువ గొప్పదా’ అన్న సంఘర్షణ మొదలవుతుంది. మీ సమస్య ఇదే అయితే ముందొక నిర్ణయం తీసుకోండి. సుఖం అనేది రెలిటివ్ టర్మ్. దానికి అంతు లేదు. డబ్బు నిశ్చయంగా సుఖాన్ని స్తుంది. కానీ ఆనందాన్ని ఇస్తుందన్న గ్యారంటీ లేదు. ప్రస్తుతం మీకు బతకటానికి లోటు లేదు కదా! నిరంతరం ‘నేను చాలా మంచివాడిని, అందుకే నాకిన్ని బాధలు’ అని మనసులో సంఘర్షిస్తూ ఉంటే ఆనందం ఎప్పటికీ దొరకదు. నేను నైతిక విలువలు కోల్పో మని మిమ్మల్ని ప్రోత్సహించట్లేదు. ఘర్షణను వదులుకుని జీవించమని చెప్తున్నానంతే. లంచం పొందడానికి వీలున్న కుర్చీలో కూర్చుని కూడా నిజాయితీగా బతికేవాడి మొహంలో ఉండే ప్రశాంతత, విలువలు కోల్పోయిన వ్యక్తి ముఖంలో ఉండదు. కష్టపడి సంపాదించే డబ్బు సంతృప్తినిస్తుంది. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట. నేను డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాను. మా కాలేజీలో ఒక లెక్చెరర్ దగ్గర సాయంత్రం ట్యూషన్ చెప్పించుకుంటున్నాను. ఓ రోజు ఆయన ఒంటరిగా ఉన్న నా దగ్గరకు వచ్చి నేనంటే ఇష్టమని చెప్పారు. నేనేం మాట్లాడ లేదు. గురువును ప్రేమించడం తప్పు అని నా ఉద్దేశం. కానీ ఆయన తనకే దురుద్దేశం లేదని, నేను కూడా సెటిలయ్యాక మా పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి చేసుకుంటానంటున్నారు. ఆయనను నమ్మాలా? లేక నో చెప్పాలా? - సుజిత, నకిరేకల్ ఇందులో ‘నమ్మటం’ అన్న ప్రసక్తి ఎక్కడుంది? మీ అభ్యంతరం కేవలం ఆయన మీ ‘గురువు’ అన్నదొక్కటే అయితే, మిగతా అన్ని విషయా ల్లోనూ ఆయన కరెక్టుగా ఉంటే.. ఏమాత్రం సంశయించకుండా వివాహం చేసుకోవచ్చు. అయినా గురువును పెళ్లాడటం తప్పు అని ఎక్కడా రాసి లేదు. ఈ రోజుల్లో బీటెక్ పాసయిన కుర్రాళ్లే తర్వాతి సంవత్సరం లెక్చెరర్స్గా మారు తున్నారు. మీ ఉత్తరాన్ని బట్టి అతను మంచివాడిలానే కనిపిస్తున్నాడు. వయ సులో ఎక్కువ తేడా లేకపోతే నిరభ్యంత రంగా పెళ్లి చేసుకోవచ్చు. బెస్టాఫ్ లక్. నేను ఎమ్మెస్సీ చదువుతున్నాను. కానీ నాది ఇంకా చిన్నపిల్లల మనస్తత్వమే అని అందరూ అంటుంటారు. మా నాన్న అయితే ఎక్కడ పడితే అక్కడే తిట్టేస్తుంటారు. నాకు చాలా బాధనిపిస్తోంది. నిజానికి ఏ పని ఎలా చక్క బెట్టాలో నాకు తెలియదు. అందుకే అందరూ అనేది నిజమేనేమో, నాకంత జ్ఞానం లేదేమో అనిపిస్తోంది. హాస్టల్లో ఉండి చదివితే మైండ్ మెచ్యూరవుతుందని విన్నాను. నేనెప్పుడూ హాస్టల్లో లేను. అందుకే నా మైండ్ ఎదగలేదా? - సునీల్, అనంతపురం ఒక తాగుబోతు తండ్రి కన్నా, పిల్లల్ని సరిగ్గా పెంచలేని తండ్రి నికృష్టుడు అని ఎక్కడో చదివాను. ఎదిగిన పిల్లల్ని అందరి ముందూ తిడితే వాళ్ల మనస్తత్వంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రతి తండ్రీ తెలుసుకోవాలి. మీకు జ్ఞానం లేక పోవడానికి (కనీసం మీరు అలా అను కుంటూ ఉండడానికి) కారణం మీ తండ్రి ఒక్కరే కాకపోవచ్చు. ఏదేమైనా, హాస్టల్లో ఉండి చదువుకుంటే మైండ్ మెచ్యూర్ అవుతుందనుకోవడం నూరుపాళ్లూ నిజం కాదు. మీరు ఎలానూ మరికొంత కాలానికి ఉద్యోగంలో ప్రవేశిస్తారు. అప్పుడు సహజంగానే ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది. చదువు ఆఖరి దశలో ఇల్లు వదిలి హాస్టల్లో చేరితే కొత్త సమస్యలు రావచ్చు. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా కొంతకాలం ఆగండి. - యండమూరి వీరేంద్రనాథ్ -
లెక్చరర్పై దాడి
కళాశాలకు వెళ్తున్న లెక్చరర్పై గుర్తుతెలియని దుండగులు దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం జరిగింది. కళాశాలలో ఎలక్ట్రానిక్స్ లెక్చరర్ చిట్టెం విజయరాజు ఈరోజు ఉదయం కళాశాలకు వస్తున్న తరుణంలో ముఖానికి ముసుగులు వేసుకున్న ఇద్దరు యువకులు ఇనుప రాడ్లతో ఆయన మీద దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గ మనించిన కొందరు విద్యార్థులు దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నించే లోపే పరారయ్యారు. లెక్చరర్ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చే స్తున్నారు. -
విద్యార్థినిపై లెక్చరర్ కీచక పర్వం
కర్నూలు: జిల్లా బనగానపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఓ లెక్చరర్ కీచకపర్వానికి తెరతీశాడు. తండ్రి వయస్సున్న లెక్చరర్ ఓ ఇంటర్ విద్యార్థినిని లైంగికంగా వేధిస్తూ పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడ్డాడు. ఆ విద్యార్థిని ఎన్నిసార్లు తిరస్కరించినా అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆ లెక్చరర్కు దేహ శుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. సదరు లెక్చరర్పై ఇదివరకు కూడా ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. విద్యార్థినులతో ఆయన వ్వవహర శైలిపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ విద్యార్థినిపై కీచక లెక్చరర్ అకృత్యం...
ఒంగోలు(ప్రకాశం): గురువే ప్రత్యక్ష దైవం అంటారు. అలాంటి పవిత్రమైన ఆ గురువు స్థానానికి తీరని మచ్చను తెచ్చాడో కీచక లెక్చరర్. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే.. దారితప్పి ప్రవర్తించాడు. పాఠాలు చెప్పాల్సిన పంతులు ఇంటర్ విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థిని నిరాకరించడంతో ఇంటర్ ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించి రూమ్కు తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దాంతో ఆమె తనను పెళ్లిచేసుకోవాలంటూ లెక్చరర్ను నిలదీసింది. అందుకు మొదట్లో పెళ్లికి సరేనన్న.. చివరకు లెక్చరర్ మోహం చాటేశాడు.. అతడి మాటలు నమ్మిన విద్యార్థిని చివరకు మోసపోయానని తెలుసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని లింగసముద్రం మండలంలో వెలుగుచూసింది. అయితే తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థిని పోలీసులను ఆశ్రయించింది. కీచక లెక్చరర్పై ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితురాలు వాపోయింది. ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు లెక్చరర్ను అరెస్ట్ చేయలేదంటూ విద్యార్థినీ ఆవేదనను వెలిబుచ్చింది. -
150అవర్స్ నాన్స్టాప్ టీచింగ్
-
గిన్నిస్ రికార్డుకు గురిపెట్టిన లెక్చరర్
జహీరాబాద్ (మెదక్): బోధనపై అమితాసక్తి ఉన్న ఓ లెక్చరర్... 150 గంటల పాటు నిరంతరాయంగా బోధించేందుకు సిద్ధమయ్యారు. గిన్నిస్ రికార్డుల పుస్తకంలో తన పేరును లిఖించుకునేందుకు సంసిద్ధులయ్యారు. మెదక్ జిల్లా జహీరాబాద్లోని వశిష్ట డిగ్రీ కళాశాలలో కామర్స్ లెక్చరర్గా పని చేస్తున్న బి.మారుతిరావు... అదే కళాశాలలో సోమవారం (ఈనెల 9వ తేదీ) ఉదయం 7.30 గంటలకు ప్రారంభించి, 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు లెక్చర్లు ఇవ్వనున్నారు. 150 గంటల పాటు సుదీర్ఘంగా ట్యాక్సేషన్, అకౌంట్స్, కాస్ట్ అక్కౌంట్స్పై సెమినార్ నిర్వహించనున్నారు. ఇలా సుదీర్ఘ సమయం పాటు బోధన మారుతిరావుకు కొత్త కాదు. 2006లో ఆయన తొలిసారిగా 12 గంటల పాటు ఇలాంటి ప్రయత్నం చేశారు. నాటి నుంచి ఏటా బోధన సమయాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. 2013లో 75 గంటల పాటు సెమినార్ నిర్వహించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. సోమవారం నుంచి నిర్వహించనున్న 150 గంటల సెమినార్కు బీకాం, సీఏ, ఐసీడబ్ల్యూఏ విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులు హాజరు కానున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. భోజనం సమయంలో అరగంట, అల్పాహారం సమయంలో పావుగంట మాత్రమే విరామం ఉంటుందని... సెమినార్లో చెప్పే అంశాలను విని, ప్రశ్నలకు ఉత్తమ సమాధానాలిచ్చే విద్యార్థికి బహుమతి ప్రదానం చేస్తామని లెక్చరర్ మారుతిరావు తెలిపారు. -
మేలుకొలుపు
రొటీన్ కథలకు భిన్నంగా సామాజిక అంశాలనే చిత్రాలుగా మలిచాడు ఎ.బద్రి. తీసింది షార్ట్ ఫిల్ములే అయినా... చెప్పదలుచుకుంది సూటిగా, సుత్తి లేకుండా చెప్పి ఆలోచింపజేశాడు. ఆ చిత్రాలను మనమూ ‘షార్ట్’గా చూసేద్దాం రండి... ముందడుగు వేసి చూద్దాం ఓటు వేయరు గానీ... ప్రభుత్వ బాధ్యత గురించి గంటలు గంటలు చెప్పేస్తుంటారు చాలామంది. తమ కనీస బాధ్యతను విస్మరించి... పక్కవాడికి దాన్ని పదే పదే గుర్తు చేస్తుంటారు. అలాంటిదే ఈ షార్ట్ ఫిల్మ్ కూడా. ఓటు వేయడం దండగంటూ రూమ్ మేట్కు నూరిపోస్తుంటాడు ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి. ప్రధాన బాధ్యతైన ఓటు వేయకుండా దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల గురించి ప్రశ్నిస్తుంటాడు. ఇది సరైన పద్ధతి కాదనే విషయం చివరకు ఇద్దరు చిన్న పిల్లల సంభాషణల ద్వారా అతనికి అర్థమవుతుంది. ఆలోచనా ధోరణి మారుతుంది. ఈ కథనాన్ని ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు. అనుకున్న మెసేజ్ను జనాల్లోకి పాస్ చేయడంలో సఫలమయ్యాడనే చెప్పాలి. సిగ్గు లేదా..! గతుకుల రోడ్లు... కాయకష్టం చేస్తున్న బడి వయసు చిన్నారులు... ఫుట్పాత్పై దీనమైన బతుకులు... ఇంటి నుంచి కాలు పెడితే చాలు నిత్యం కనిపించే దృశ్యాలే ఇవి. సామాన్యుడిని అన్నీ కలచివేసేవే. ఇలా చూసి బాధపడితే ప్రయోజనం ఏముంటుంది! మనవల్ల కాదనుకుని వదిలేస్తే ఈ పరిస్థితిలో మార్పు ఎప్పుడు వస్తుంది! ఈ ప్రశ్నలన్నింటికీ ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఓ పరిష్కారం చూపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. భద్రి వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా... షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్న తన అభిరుచి కొనసాగిస్తున్నాడు. మూస కథలు, చిత్రాలకు భిన్నంగా సమాజానికి అంతో ఇంతో సందేశాన్నిస్తున్నాడు. - ఓ మధు ది లేట్ కమర్స్ పంక్చ్యువాలిటీ పాటించడాన్ని గిల్టీగా ఫీల్ అవుతారు నేటి స్టూడెంట్స్. పైగా కాలేజీకి లేట్గా వెళ్లడమంటే అదో పెద్ద క్రెడిట్ వాళ్లకి. చేతిలో బుక్స్ లేకుండా, సెల్ ఫోన్ మాట్లాడుతూ, లేట్గా వచ్చి క్లాస్లోకి పర్మిషన్ అడిగి, లెక్చరర్ని ఏదో ఒకటి అనడం బాగా అలవాటయిపోయిన విద్యార్థులపై సెటైరికల్గా ఈ లఘుచిత్రాన్ని రూపొందించాడు శ్రవణ్ కొత్త. ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా అడుగు పెట్టిన లెక్చరర్కి ఎదురైన చేదు అనుభవాన్ని కథగా మలుచుకుని తీశాడు ఈ షార్ట్ ఫిల్మ్. ఆలస్యంగా వచ్చిన ప్రతి విద్యార్థీ ఏదో ఒక సాకు చెప్పి లోపలకు వచ్చి కూర్చుంటాడు. చివరికి అందరూ క్లాస్కి వచ్చేసరికి పీరియడ్ అయిపోతుంది. కథనం... డైలాగ్స్ బాగున్నాయి. ‘బీయింగ్ లేట్ టు క్లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ నాలెడ్జ్’ అనే మెసేజ్తో చిత్రం ముగుస్తుంది. బిగ్స్క్రీన్పై మక్కువ ఉన్నా అవకాశాలు దొరక్క పోవడంతో తనలోని క్రియేటర్ను ఇలా షార్ట్ ఫిల్మ్స్తో సంతృప్తి పరుస్తున్నాడు శ్రవణ్. ప్రస్తుతం నగరంలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. - డా. వైజయంతి ఇండివిడ్యువల్ టాలెంట్ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్లంటే ఇప్పుడు యూత్లో యమ క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం. మెయిల్ టు sakshicityplus@gmail.com -
లెక్చరర్పై విద్యార్థుల దాడి
అన్నవరం : అల్లరి చేయవద్దని మందలించిన లెక్చరర్పై ఇద్దరు విద్యార్థులు మరో ఇద్దరితో కలిసి దాడి చేసిన ఘటన గురువారం అన్నవరంలోని శ్రీసత్యదేవ జూనియర్ కళాశాలలో జరిగింది. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం స్కూలు విద్యార్థినుల ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలను తిలకిస్తున్న ఆ జూనియర్ కళాశాల ఇంటర్(హెచ్ఈసీ) విద్యార్థులు మిరియాల నూకరాజు, కొల్లు తాతాజీ ఆటలాడుతున్న విద్యార్థినులను, అక్కడ ఉన్న వ్యాయామ టీచర్లను కామెంట్ చేశారు. ఇది గమనించిన కళాశాల బోటనీ లెక్చరర్ మలిరెడ్డి వేంకటరాజు ఆ విద్యార్థులను మందలించి అక్కడ నుంచి వెళ్లిపొమ్మని హెచ్చరించి పంపేశారు. దీనిని అవమానంగా భావించిన విద్యార్థులు నూకరాజు, తాతాజీ తమ స్వగ్రామం రౌతులపూడి మండలం డి.జగన్నాథపురం వెళ్లి వారి అన్నలు మిరియాల అప్పలరాజు, కొల్లు లోవరాజును తీసుకుని గురువారం మధ్యాహ్నం కళాశాలకు వచ్చారు. ఆ సమయంలో లెక్చరర్ వేంకటరాజు స్టాఫ్రూమ్లో ఉండగా ఆయనను దుర్బాషలాడుతూ ఆ నలుగురూ దాడి చేశారు. అప్పుడు కళాశాలలో ఉన్న ఇతర లెక్చరర్లు, విద్యార్థినులు వారిని అడ్డుకోగా, వారినీ తోసేశారు. ఆ దాడిలో వేంకటరాజుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. లెక్చరర్ ఫిర్యాదుతో ఆ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నవరం పోలీసుస్టేషన్ అడిషనల్ ఎస్ఐ వై.వి.రామ్మోహనరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన ఉపాధ్యాయుడు!
అధ్యాపకుడికి దేహశుద్ధి కంబాలచెరువు (రాజమండ్రి) : విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన అధ్యాపకుడికి ఆమె బంధువులు దేహశుద్ధి చేసిన సంఘటన రాజమండ్రి ఆర్యాపురంలోని ప్రగతి కళాశాలలో శనివారం చోటుచేసుకుంది. బాధిత విద్యార్థిని, ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మల్లయ్యపేటకు చెందిన బి.తేజశ్రీ అదే కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఆమె తరగతి గదిలో తన స్నేహితులతో మాట్లాడుతోంది. దీనిని చూసిన కామర్స్ అధ్యాపకుడు కల్యాణ్ ఆమెను పిలిచి చితకబాదాడు. విద్యార్థిని అని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టాడు. కళాశాల విడిచిపెట్టిన తర్వాత ఇంటికెళ్లిన ఆమె ఈ విషయాన్ని తన తండ్రి రాంబాబుకు తెలిపింది. అతడితో పాటు బంధువులు కళాశాలకు వెళ్లి ఈ సంఘటనపై అధ్యాపకుడిని నిలదీశారు. అతడిని త్రీ టౌన్ పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లి.. పోలీసులకు సంఘటనను వివరించారు. దీనిపై మాట్లాడుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చంటూ కళాశాల ప్రిన్సిపాల్ మురళి నచ్చజెప్పాడు. దీంతో బాధితురాలి బంధువులు శనివారం ఉదయం కళాశాలకు చేరుకుని.. ఆ అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అధ్యాపకుడికి దేహశుద్ధి చేశారు. రాజమండ్రి అన్ఎయిడెడ్ కళాశాలల అసోసియేషన్(రూకా) నాయకులు అక్కడకు చేరుకుని, ఆందోళనకారులతో మాట్లాడారు. బాధిత విద్యార్థినిని వేరే కళాశాలకు మార్పు చేసి, రెండేళ్లపాటు విద్యాఖర్చులు భరిస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి కారకుడైన అధ్యాపకుడిని విధుల్లోంచి తొలగించారు. -
ఆసుపత్రిలోనే లెక్చరర్ను విచారిస్తున్న పోలీసులు
ఏలూరు: చీటింగ్ కేసులో కటకటాలపాలైన సీఆర్ రెడ్డి కళాశాల లెక్చరర్ గౌస్ మొయిద్దీన్ను ఎట్టకేలకు జిల్లా పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. వైద్యులు, లాయర్ల సమక్షంలో గౌస్ను పోలీసులు విచారిస్తున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలోని స్పెషల్ రూంలో గౌస్ను పోలీసులు విచారిస్తున్నారు. తనకు తీవ్ర అనారోగ్యంగా ఉదంటూ గురువారం అటు పోలీసులను, ఇటు వైద్యులను ముప్ప తిప్పలు పెట్టిన గౌస్ను శుక్రవారం ఉదయం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గౌస్ మొయిద్దీన్ స్థానిక సీఆర్ రెడ్డి కళాశాలలో పోలిటికల్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన పోలీసు ఉన్నతాధికారులో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి వద్ద నుంచి భారీ ఎత్తున్న నగదు తీసుకునే వాడు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పలు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉద్యోగం ఇప్పించకుండా నగదు అడిగితే బెదిరించడంతో పలువురు నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించార. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న పోలీసులు గౌస్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా పలు విలువైన డాక్యుమెంట్లుతోపాటు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
లెక్చరర్ కేసులో హైడ్రామా
-
లెక్చరర్ కేసులో హైడ్రామా
ఏలూరు: చీటింగ్ కేసులో కటకటాలపాలైన సీఆర్ రెడ్డి కళాశాల లెక్చరర్ గౌస్ మొయిద్దీన్ కేసులో హైడ్రామా చోటు చేసుకుంది. గౌస్ మొయిద్దీన్ కస్టడీలోకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు నిమిత్తం పోలీసులు గురువారం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాదాపు మూడు గంటలపాటు గౌస్కు ఆసుపత్రిలో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరింత మెరుగైన వైద్య పరీక్షల కోసం గౌస్ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని స్థానిక ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సూచించారు. గౌస్ను గుంటూరు తరలిస్తే కస్టడి సమయం పూర్తిగా వైద్య పరీక్షలకే సరిపోతుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు మళ్లీ మేజిస్ట్రేట్ను ఆశ్రయించనున్నారు. గౌస్ కస్టడీలోకి తీసుకునేందుకు తమకు మరింత సమయం కావాలని పోలీసులు మేజిస్ట్రేట్కు విన్నవించనున్నారు. గౌస్కు వైద్య పరీక్షలు నిర్వహించి.... ఈ రోజు సాయంత్రం నుంచి నవంబర్ 1 వతేదీ వరకు కస్టడీలోకి తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్ పోలీసులను బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. గౌస్ మొయిద్దీన్ స్థానిక సీఆర్ రెడ్డి కళాశాలలో పోలిటికల్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన పోలీసు ఉన్నతాధికారులో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి వద్ద నుంచి భారీ ఎత్తున్న నగదు తీసుకునే వాడు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పలు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉద్యోగం ఇప్పించకుండా నగదు అడిగితే బెదిరించడంతో పలువురు నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించార. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న పోలీసులు గౌస్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా పలు విలువైన డాక్యుమెంట్లుతోపాటు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పరిచయాలే పెట్టుబడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చీటింగ్ కేసులో కటకటాల పాలైన లెక్చరర్ గౌస్ మొహియిద్దీన్ బాగోతాలు తవ్వేకొద్దీ బట్టబయలవుతున్నాయి. కాలేజీలో పాఠాలు చెప్పుకునే ఉద్యోగానికి బదులు పైరవీలు, బ్రోకరేజీ పనుల్లో ఆరితేరిన గౌస్ సమాంతరంగా పోలీస్ వ్యవస్థనే నడిపించినట్టు తేటతెల్లమవుతోంది. ఐపీఎస్ అధికారులతో గల సన్నిహిత సంబంధాలే పెట్టుబడిగా సెటిల్మెంట్లు, దందాలకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. తాజాగా పోలీసుల దర్యాప్తులో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పైసా పెట్టకుండానే ‘సిరిసంపద’లో పావలా వాటా ప్రకాశం జిల్లా సింగరాయకొండ కేంద్రంగా సిరిసంపద ప్రాపర్టీస్ పేరుతో గతంలో బోర్డు తిప్పేసి కేసులు ఎదుర్కొంటున్న సంస్థ గతేడాది తిరిగి సిరిసంపద ఎస్టేట్ వెంచర్ను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రకాశం జిల్లాకు చెందిన వ్యాపారులతోపాటు పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన బిల్డర్ వెంకటరత్నం కూడా పెట్టుబడులు పెట్టారు. గత అనుభవాల దృష్ట్యా సంస్థ ద్వారా జరిగే క్రయ విక్రయాల సందర్భంగా ఏర్పడే సమస్యలను పరిష్కరించడానికి పోలీస్ శాఖలో పలుకుబడి కలిగిన ఓ పైరవీకారుడి అవసరాన్ని గుర్తించారు. ఇందులో భాగంగానే పోలీస్ బాస్లకే బాస్గా వ్యవహరించిన గౌస్ మొహియిద్దీన్కు పైసా పెట్టుబడి లేకుండానే ఆ సంస్థలో 25 శాతం వాటాతోపాటు మేనేజింగ్ పార్టనర్ హోదా, చెక్ పవర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సంస్థ ఒంగోలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటవుతుందంటూ 50 ఎకరాలకు పైగా భూములను విక్రయించి పలువుర్ని ముంచే సినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారాలపై ‘పశ్చిమ’ పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ‘సిరిసంపద’ పేరుతో చేసిన మోసాలపై ఆరా తీస్తున్నారు. ఇందుకోసం పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాట వినని పోలీసులకు ముప్పుతిప్పలు ఏలూరు రేంజ్ పరిధిలో ఏ పని కావాలన్నా గౌస్ను ఆశ్రయించని పోలీస్ అధికారులు లేరంటే నమ్మశక్యం కాదు. తన దగ్గరకు రాకపోయినా.. తాను చెప్పిన కేసులు నమోదు చేయకపోయినా ఆ అధికారులను గౌస్ ముప్పుతిప్పలు పెట్టేవాడని అంటున్నారు. ఒక ఎస్సై పదోన్నతికి అడ్డుగా ఉన్న చార్జి మెమోను అప్పటి ఎస్పీ తొలగిస్తే.. వెంటనే లా అండ్ ఆర్డర్ డీజీకి చెప్పి ఆ ఎస్సైకు చార్జి మెమో కొనసాగేలా చేశారంటే గౌస్ హవా ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఓ సీఐ పదోన్నతి ప్యానెల్లో చేరే సమయంలో రేంజి డీఐజీ చేత అకస్మికంగా ఆ సీఐ పనిచేస్తున్న స్టేషన్ను తనిఖీ చేయించి.. ఓ కేసు వ్యవహారాన్ని బయటకు తీయించి సస్పెండ్ చేయించారు. ఏలూరు డీఎస్పీగా చే రిన ఓ అధికారి తన దగ్గరకు రాకపోవడంతో డ్రాప్ అయిన ఎస్సీ, ఎస్టీ కేసును బయటకు తీయించి.. ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా డీజీపీకి అతనిపై ఫిర్యాదులు చేసి 5నెలలు కూడా కాకుం డానే ఏలూరు నుంచి బదిలీ చేయించారన్న ఆరోపణలున్నాయి. ఇక తన వర్గానికి చెందిన ఓ అధికారి ఏలూరు రేంజ్ డీజీఐగా పనిచేసిన కాలంలో పోలీస్ శాఖలో గౌస్ ఆడింది ఆట.. పాడింది పాటగా సాగిందని చెబుతారు. ఆ అధికారి ద్వారా ఎంతో మందికి పనిష్మెంట్లు ఇప్పించడం, వాటిని తొల గింప చేయడం, పదోన్నతులు, బదిలీలు ఇలా ఒకమేమిటి అన్ని తానై పోలీస్ బాస్గా వ్యవహరించేవాడని పోలీస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కాల్డేటాతో బయటపడనున్న జాతకాలు గౌస్కు ఇద్దరు మాజీ డీజీపీలతో సన్నిహిత సంబంధాలున్నట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారత దేశానికి చెందిన ఓ మాజీ డీజీపీ రాష్ట్ర పోలీస్ బాస్గా ఉన్నప్పుడు పోలీస్ శాఖలో గౌస్ చక్రం తిప్పేవాడని చెబుతారు. సదరు అధికారిని మిల్క్బాయ్ అని పలకరించేంతటి చనువుందంటే గౌస్ హవా ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక మన రాష్ట్రానికే చెందిన ఓ మాజీ డీజీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో సన్నిహితంగా మెలిగినా.. ఆ తర్వాత ఆయన కుటుంబ విషయాలపై తప్పుడు ప్రచారం చేయడంతో గౌస్ నిజ స్వరూపాన్ని గుర్తించి చివరకు దూరం పెట్టారని అంటారు. కొంతకాలం వరకు లా అండ్ డీజీగా కీలకంగా వ్యవహరిం చిన తన సామాజిక వర్గానికే చెందిన మరో డీజీ కూడా గౌస్కు అత్యంత సన్నిహితుడిగా చెబుతారు. వీరే కాకుండా గతంలో రాయలసీమ ఐజీగా పనిచేసిన ఒక సీనియర్ ఐపీఎస్, గుంటూరు రేంజ్ ఐజీగా పనిచేసిన మరో ఐపీఎస్, ప్రకా శం, నెల్లూరు జిల్లాల్లో పనిచేసిన ఐపీఎస్ అధికారులు మొత్తం సుమారు 15 మంది ఐపీఎస్లు ఇతనికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వివిధ పనులు చేసినట్టు ఆరోపణలున్నాయి. పనులు చేయించుకోవడానికి గౌస్ వారి బలహీనతలపై దృష్టి సారించి అడ్డదారులు తొక్కినట్టు చెబుతున్నారు. గౌస్ అరెస్ట్ తరువాత సదరు ఐపీఎస్ అధికారులంతా ‘పశ్చిమ’ పోలీసులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. కేసునుంచి గౌస్ను బయట పడేసేందుకు విశ్వప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. మరోవైపు ఐపీఎస్లతో పరిచయాల పేరుతో మోసగించిన గౌస్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసేందుకు జిల్లా ఎస్పీ కె.రఘురామ్రెడ్డి అతడి కాల్ డేటాను సేకరించే పనిలో పడ్డారు. రెండు, మూడేళ్ల కాల్ డేటాను సేకరించడం ద్వారా గౌస్ ఏ ఐపీఎస్ అధికారితో మాట్లాడి పనులు చేయించుకున్నాడో బయటకు రానుంది. తమ కేసు పరిధి వరకు విచారించి.. మిగిలిన కాల్ డేటా అంశాలపై ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎస్పీ డాక్టర్ కె.రఘురామ్రెడ్డి చెబుతున్నారు. -
లెక్చరర్ నివాసంలో పోలీసులు ముమ్మర తనిఖీలు
ఏలూరు: సీఆర్ రెడ్డి కళాశాల లెక్చరర్ గౌస్మొహిద్దీన్ నివాసంలో గత రాత్రి నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో రియల్ ఎస్టేట్కు వ్యాపారానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన నివాసంలో గురువారం ఉదయం కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఓ నిరుద్యోగి నుంచి లెక్చరర్ గౌస్మొహిద్దీన్ రూ. 15 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఎస్సై ఉద్యోగం ఇప్పించకపోవడంతో సదరు నిరుద్యోగి గౌస్మొహిద్దీన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఆ క్రమంలో తీసుకున్న మొత్తం నగదులో రూ. 3 లక్షలు తిరిగి నిరుద్యోగికి ఇచ్చేశాడు. మిగత సొమ్ము కూడా ఇవ్వాలని నిరుద్యోగి డిమాండ్ చేశాడు. అందుకు గౌస్ ససేమిరా అనడంతో... సదరు నిరుద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు సర్చ్ వారెంట్తో గౌస్ నివాసాన్ని తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదికాక ఒంగోలు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటవుతుందంటూ రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడినట్లు గౌస్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే సీనియర్ ఐపీఎస్ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. దీనిని అసరాగా చేసుకుని ఎస్ఐ, సీఐ బదిలీలు, ప్రమోషన్లలో గతంలో గౌస్ కీలక పాత్ర షోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఆర్ రెడ్డి కాలేజీలో గౌస్మొహిద్దీన్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా పని చేస్తున్నారు. -
అధ్యాపకుడిపై చేయి చేసుకున్న విద్యార్థి
సంజీవరెడ్డినగర్: కళాశాలకు ఆలస్యంగా వస్తున్నావేమిటని అడిగిన పాపానికి అధ్యాపకుడిపై విద్యార్థి చేయి చేసుకున్నాడు. అధ్యాపకుడు నెట్టి వేయడంతో కిందపడిపోయిన విద్యార్థికి గాయాలయ్యాయి. ఇద్దరూ పరస్పరం ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్ఐ సుదర్శన్రెడ్డి కథనం ప్రకారం... కార్మికనగర్ సమీపంలోని బ్రహ్మశంకర్నగర్కు చెందిన నర్సింహ కుమారుడు ఎస్ఆర్నగర్లోని లెజెండ్ సీఎ కళాశాలలో చదువుతున్నాడు. సోమవారం ఉదయం కాలేజీకి ఆలస్యంగా వచ్చిన అతడిని అధ్యాపకుడు యాడం తరుచూ ఎందుకు ఆలస్యంగా వస్తున్నావని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన విద్యార్థి లెక్చరర్ యాడంపై చేయి చేసుకున్నాడు. ఆయన నెట్టివేయడంతో కిందపడిన విద్యార్థికి స్పల్పగాయాలయ్యాయి. ఈ విషయం అతను తన తండ్రి నర్సింహకు చెప్పడంతో అతను కళాశాలకు వచ్చి గొడపడి.. లెక్చరర్పై చేయి చేసుకున్నాడు. దీంతో కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇరువురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్ధినిపై లెక్చరర్ లైంగిక వేధింపులు
-
మట్టి మాఫియా దూకుడుకు చిన్నారి బలి
కైకలూరు, న్యూస్లైన్ :‘మమ్మీ..తొందరగా పదండి.. నానమ్మ చేసే ఉగాది పచ్చడి తినాలి.. డాడీ.. ఈ రోజు సన్డే.. స్కూల్లేదు..తొందరగా రా..’ అంటూ కుమార్తె కోరడంతో ఊరికి ప్రయాణమైన ఆ కుటుంబంపై వి ధి చిన్నచూపు చూసింది.వారు ప్రయాణిస్తున్న మోటార్సైకిల్ పైకి మట్టి మాఫియాకు చెందిన ట్రాక్టర్ యమపాశంలా దూసుకువచ్చి చిన్నారి ప్రాణాలు బలిగొంది. పోలీసులతోపాటు పలువురిని కంటతడి పెట్టించిన ఈ హృదయ విదారక ఘటన ఆదివారం ఉదయం పల్లెవాడ చర్చి వద్ద జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎన్నార్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న దారపురెడ్డి ఫణికుమార్ స్వగ్రామం ఏలూరు సమీపంలోని వట్లూరు. ఆరేళ్ల కిందట భార్గవిని వివాహం చేసుకున్నారు. వీరి ఏకైక కుమార్తె లక్ష్మీశర్వాణి(4) యూకేజీ చదువుతోంది. ఉగాదికి స్వగ్రామం రావాలని ఫణికుమార్ తల్లిదండ్రులు కోరడంతో భార్య, కుమార్తెతో కలిసి ఆదివారం ఉదయం మోటార్సైకిల్ పై బయలుదేరాడు. పల్లెవాడ గ్రామంలోని చర్చి వ ద్దకు రాగానే వదర్లపాడు నుంచి వస్తున్న మట్టి ట్రా క్టర్ బైక్ను ఢీకొట్టింది. దీంతో ఆ ముగ్గురూ కింద పడిపోయారు. చిన్నారి తలకు బలమైన గాయమైంది. ఫణికుమార్ దంపతులు కూడా గాయపడ్డారు. ఆ స మయంలో వెనుక వస్తున్న చేపల రైతు ఉద్దరాజు రా మరాజు, డ్రైవర్ కారులో వారిని హుటాహుటిన కైకలూరు ప్రైవేటు అస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షించి లక్ష్మీశర్వాణి అప్పటికే చనిపోయిందని ని ర్ధారించారు. కైకలూరు సీఐ డి.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి బాలికను ప్రభుత్వాస్పత్రికి తరలిం చారు. చిన్నారి చనిపోయిన విషయాన్ని తల్లిదండ్రులకు ముందుగా చెప్పలేదు. బంధువులు వచ్చిన త ర్వాత ఈ విషయాన్ని చెప్పారు. దీంతో వారి రోదనలు మిన్నంటాయి.‘ఇది కల అయితే ఎంత బాగుం డు’ అంటూ ఫణికుమార్ దంపతులు రోదించడం అందరి హృదయాలను కలిచివేచింది. పోస్టుమార్టం అనంతరం పాప మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. పల్లెవాడ ప్రాంతంలో చేపల చెరువుల్లో మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కొందరు వ్యక్తులు నిబం ధన లు ఉల్లంఘించి వీటిని తవ్వుతూ ఇష్టారాజ్యంగా తర లిస్తున్నారని, ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. -
అలిగి వెళ్లి.. శవమై తేలింది
కంభం రూరల్, న్యూస్లైన్ : పరీక్ష పేపర్ ఆలస్యంగా ఇవ్వబోగా లెక్చరర్ మందలించడంతో ఇంటి నుంచి అలిగి వెళ్లిన విద్యార్థిని ఆదివారం శవమై తేలింది. వివరాలు.. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న రవళి గత శుక్రవారం జరిగిన యూనిట్ పరీక్షలో పేపర్ సమయానికి ఇవ్వలేదు. రవళిని మందలించిన లెక్చరర్.. ఆమె రాసిన పేపర్ తీసుకోకుండానే వెళ్లిపోయాడు. మనస్తాపం చెందిన రవళి (16) మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్లింది. తన వద్ద ఉన్న విలువైన వస్తువులను ఇంట్లో ఉంచి నేరుగా కంభం చెరువు కట్టకు వెళ్లింది. ఎవరూ గమనించని సమయంలో పెద్దకంభం తూము వద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలియని రవళి తల్లిదండ్రులు కుమార్తె కోసం తెలిసిన చోటల్లా వెతికారు. బంధువులను వాకబు చేసినా ఆమె ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో రవళి బంధువులు శనివారం కళాశాలకు వెళ్లి ప్రిన్సిపాల్, లెక్చరర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమార్తె కనిపించకపోవడానికి లెక్చరరే కారణమని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచారు. రవళి ఆచూకీ తెలిసేంత వరకూ ఆందోళన చేస్తామని నాయకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కంభ చెరువులో ఎవరిదో మృతదేహం ఉందని ఆదివారం ఉదయం ప్రచారం జరిగింది. బంధువులు వెళ్లి మృతదేహాన్ని చూసి రవళిదిగా గుర్తించారు. మృతురాలి తల్లిదండ్రులు కుమార్తె మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. ఎస్సై రామకోటయ్య సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ప్రేమించిన యువతితో గొడవపడి లెక్చరర్ ఆత్మహత్య
హైదరాబాద్: భార్య పుట్టింటికి వెళ్లగా ప్రేమించిన యువతితో ఇంట్లో గొడవ పడిన ఓ లెక్చరర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన జాలాది చెన్నకేశవరెడ్డి (33) మోతీనగర్ అవంతినగర్ తోటలో నివాసం ఉంటూ ఎస్ఆర్నగర్ శ్రీచైతన్య కళాశాలలో లె క్చరర్గా పనిచేస్తున్నాడు. అతడికి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం భ్యార్య గర్భవతి కావడంతో ప్రసవం కోసం నెలరోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. కాగా ఆరు సంవత్సరాల క్రితం చెన్నకేశవరెడ్డి తను పనిచేస్తున్న కళాశాలలో చదువుకునే విద్యార్థినిని ప్రేమించాడు. ప్రస్తుతం ఆమె బీ.టెక్ చదువకుంటుంది. శుక్రవారం రాత్రి ఆ యువతిని ఇంటికి పలిపించుకుని తనతో సరిగా ఉండటం లేదని గొడవకు దిగాడు. ఇద్దరిమధ్య మాటామాట పెరిగి గొడవ పెద్దది అయ్యింది. ఆమె ముందే తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని రక్షించే ప్రయత్నంలో ఆమె చేతిరెండు వేళ్లకు గాయాలు అయ్యాయి. అనంతరం విషయాన్ని చెన్నకేశవరెడ్డి సోదరుడికి తెలుపింది. అతను వచ్చి పోలీసులకు ఫిర్యాదుచేశాడు . ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.