Love story movie
-
వాలెంటైన్ డే స్పెషల్.. ఈ ప్రేమకథ చిత్రాలు మీ కోసమే!
ప్రతి మనిషికి ప్రాణం ఉన్నట్లే .... ప్రతి మనసుకు ఓ ప్రేమకథ ఉంటుంది. ఒకరి ప్రేమ సఫలం... మరొకరిది విఫలం... ఇంకొకరిది త్యాగం... ఇలా ఒక్కో ప్రేమకథది ఒక్కో ముగింపు. మరి.. రానున్న ప్రేమకథా చిత్రాల్లో ఏ కథ ముగింపు ఎలా ఉంటుందో వెండితెర పైనే చూడాలి. ‘పడ్డారండి ప్రేమలో మరి..’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం కొందరు హీరోలు–హీరోయిన్లు ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. సైనికుడి ప్రేమకథ... ‘ఛత్రపతి’, ‘మిర్చి’, ‘బాహుబలి’, ‘సలార్’... ఇలా యాక్షన్ చిత్రాలే కాదు.. ప్రభాస్ కెరీర్లో ‘వర్షం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘రాధేశ్యామ్’ వంటి ప్రేమకథా చిత్రాలు కూడా ఉన్నాయి. తాజాగా ప్రభాస్ మరో ప్రేమకథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 2022లో ‘సీతారామం’ వంటి బ్లాక్బస్టర్ ప్రేమకథను ఇచ్చిన హను రాఘవపూడి మరో ప్రేమకథను రెడీ చేశారు. పీరియాడికల్ లవ్స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తారని టాక్. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇందులో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్గా నటిస్తారనీ టాక్. అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఫ్యాంటసీ హారర్ ఎలిమెంట్స్తో పాటు ఓ మంచి లవ్ట్రాక్ కూడా ఈ చిత్రంలో ఉందట. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్దీ కుమార్ హీరోయిన్లు. మరో లవ్స్టోరీ... ‘లవ్స్టోరీ’ (2021) చిత్రం తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కలిసి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మరో ప్రేమకథా చిత్రం ‘తండేల్’. నాగచైతన్యతో ‘ప్రేమమ్’ వంటి లవబుల్ సినిమా తీసిన చందు మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరంలకు చెందిన మత్స్యకారులు 2018లో గుజరాత్కు వలస వెళ్లి, సముద్రంలో చేపల వేటను కొనసాగిస్తుంటారు. ఓ 24 మంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు బందీలుగా చిక్కుతారు. వీరిలో ఓ మత్స్యకారుడి వివాహం జరిగి ఏడాది మాత్రమే అవుతుంది. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఆ మత్స్యకారుడు పాకిస్తాన్లో బందీ కాబడతాడు. ఈ వ్యక్తి జీవితం ఆధారంగా ‘తండేల్’ను ప్రేమకథప్రాధాన్యంగా తీస్తున్నారు మేకర్స్. ప్రేమికులే శత్రువులయితే... విడిపోయిన ప్రేమికులు శత్రువులుగా ఎదురుపడితే అనే కాన్సెప్ట్తో రూపొందుతున్న లవ్స్టోరీ మూవీ ‘డెకాయిట్’. ‘ఒక ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. అడివి శేష్, శ్రుతీహాసన్ జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాతో కెమెరామేన్ షానీ డియోల్ దర్శకుడిగా మారారు. రెండు ప్రేమకథల్లో... గత ఏడాది ‘బేబీ’ అనే లవ్స్టోరీ మూవీతో హిట్ అందుకున్నారు హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవీ చైతన్య (విరాజ్ మరో లీడ్ రోల్ చేశారు). ఈ ‘బేబీ’ జోడీ రిపీట్ అవుతోంది. ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాకు కథ అందించగా, రవి నంబూరి దర్శకుడిగా పరిచయం కానున్నారు. అలాగే మరో లవ్స్టోరీ ‘డ్యూయెట్’ కూడా చేస్తున్నారు ఆనంద్ దేవరకొండ. ఈ ఎమోషనల్ లవ్స్టోరీ ఫిల్మ్లో రితికా సింగ్ కథానాయిక. మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకత్వం వహిసున్నారు. ఇలా ఒకేసారి రెండు ప్రేమకథా చిత్రాల్లో నటిస్తున్నారు ఆనంద్ దేవరకొండ. డబుల్ లవ్... డీజే టిల్లు ఓ డిఫరెంట్ లవర్. పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమలో తేడా వస్తే ప్రేయసినైనా జైలుకు పంపిస్తాడు. అలాంటి డీజే టిల్లు మళ్లీ లవ్లో మునిగాడు. మరి.. ఈసారి అతని లవ్స్టోరీ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలంటే మార్చి 29వరకు ఆగాల్సిందే. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం ‘టిల్లు స్క్వేర్’. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘డీజే టిల్లు’కి సీక్వెల్గా ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు ‘తెలుసు కదా’ అనే లవ్స్టోరీ కూడా చేస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డ. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లు. లైలా లవ్వు... ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి.. దేవుడా!’, ‘పాగల్’ వంటి లవ్స్టోరీ చిత్రాల్లో నటించారు విశ్వక్ సేన్. ఈ యంగ్ హీరో రీసెంట్గా మరో లవ్స్టోరీకి పచ్చజెండా ఊపారు. ఆ సినిమా పేరు ‘లైల’. ఈ సినిమాలో తానే టైటిల్ రోల్ చేస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తానని ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు విశ్వక్. దిల్ రుబా... కెరీర్లో తొలి సినిమానే ‘రాజావారు రాణిగారు’ వంటి లవ్స్టోరీ చేశారు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’, ‘సమ్మతమే’, ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాల్లో మంచి లవ్ట్రాక్ ఉంది. ఇప్పుడు ఈ యంగ్ హీరో ఓ కంప్లీట్ లవ్స్టోరీ సినిమా చేస్తున్నారు. విశ్వ కరుణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ అని తెలిసింది. ఈ సినిమాకు ‘దిల్ రుబా’ టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా లవ్స్టోరీస్ ఎక్కువగా అబ్బాయిల దృష్టి కోణంలో నుంచి వస్తుంటాయి. ఓ అమ్మాయి తన ప్రేమకథను చెబితే ఎలా ఉంటుంది? అనే అంశం ఆధారంగా వస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. ‘చి.ల.సౌ’ వంటి సినిమా తీసిన నటుడు– దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ కొత్త లవ్స్టోరీకి దర్శకుడు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ∙అభిషేక్ పచ్చిపాల, నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వంలో అర్షద్ తన్వీర్, ప్రకాశ్ ధర్మపురి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా నుంచి తాజాగా ‘నువ్వంటే ఇష్టం’ అనే పాటను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విడుదల చేశారు. యస్. కె భాజీ ఈ సినిమాకు స్వరకర్త. ఇంద్ర , కోమల్ నాయర్, దీపు, స్వాతి శర్మ, ఇమ్రాన్, షీతల్ భట్ లీడ్ రోల్స్ చేసిన చిత్రం ‘ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని ‘నా కల..’ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ విడుదల చేశారు. లక్ష్మణ్ జెల్ల దర్శకత్వంలో చంద్ర ఎస్. చంద్ర, డా. విజయ రమేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. శ్రవణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ ప్రేమికల దినోత్సవం (ఫిబ్రవరి 14) సందర్భంగా ఇప్పటికే విడుదలైన కొన్ని ప్రేమకథా చిత్రాలు మళ్లీ రిలీజ్ కానున్నాయి. ఆ వివరాలు... ►సిద్ధార్థ్, షామిలీ హీరోహీరోయిన్లుగా ఆనంద్ రంగ దర్శకత్వం వహించిన ‘ఓయ్!’ (2009), దుల్కర్ సల్మాన్– మృణాళ్ ఠాకూర్ జోడీగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతారామం’ (2022), గత ఏడాది విడుదలైన ‘బేబీ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సూర్య ద్విపాత్రాభినయం చేసిన తమిళ చిత్రం ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ (2008) తెలుగు అనువాదం సైతం రీ రిలీజ్ అవుతోంది. ఇలా మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. -
అందమైన ప్రేమకథతో రానున్న ప్రభాస్..!
-
పెద్ద హీరోలను మినహాయించి నన్నే ఎందుకు..? చైతూ
-
ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.. నాగచైతన్య ఎమోషనల్ ట్వీట్
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై నేటికి(సెప్టెంబర్ 24) ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ నాగచైతన్య ఓ ట్వీట్ చేశాడు. ‘ఇలాంటి స్పెషల్ చిత్రాన్ని నాకు అందించిన చిత్ర యూనిట్కి, బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ చిత్రం నాకెన్నో విషయాలను నేర్పించింది. ‘లవ్స్టోరీ’ సినిమా జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను’అని చైతన్య ట్వీట్ చేశాడు. (చదవండి: సలార్’ షురూ.. పుట్టెడు శోకంలోనూ షూటింగ్కి ప్రభాస్ హాజరు) కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి 2021లో బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరి’ మూవీని రూపొందించారు. ఇందులో అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్గా చైతూ, పెద్దింటి అమ్మాయి మౌనికగా సాయి పల్లవి అద్భుతంగా నటించి మెప్పించారు. Thank you so much to the entire team and audience for making this one special ! A film that taught me in so many ways .. memories I will always cherish https://t.co/gGWbzmZbT0 — chaitanya akkineni (@chay_akkineni) September 24, 2022 -
ఈ ఏడాది మారుమోగిన టాప్ 5 సాంగ్స్ ఇవే
2021 చార్ట్ బస్టర్స్ నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సినిమాల సంఖ్య తగ్గినా ప్రతి చిత్రంలోనూ ఒక పాట యూట్యూబ్ రికార్డ్స్ ను టార్గెట్ చేసింది. ఏడాది అంతా రిపీట్ మోడ్ లో పెట్టుకుని విన్నారు ఆడియెన్స్. ఆ సాంగ్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం. సాయి పల్లవి ‘సారంగ దరియా’ యూట్యూబ్ లో సాయి పల్లవి సాంగ్స్ అంటే రికార్డ్స్ కు కేరాఫ్ అడ్రస్ అనే మాట స్థిరపడిపోయింది. ఈ ఏడాది సారంగ దరియాతో అలాంటి సెన్సేషన్ సృష్టించింది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల డైరెక్టర్ చేసిన లవ్ స్టోరీలోని ఈ సాంగ్ యూట్యూబ్ లో 4.5 కోట్లకు పైగా వ్యూస్ అందుకుంది. అదరగొట్టిన ‘బుల్లెట్ బండి’ సినిమా సాంగ్స్ కు తెలంగాణ ఫోక్ సాంగ్స్ గట్టి పోటీని ఇస్తున్నాయి. వ్యూస్ విషయంలో స్టార్ హీరోస్ సాంగ్స్ ను మించిపోతున్నాయి. బుల్లెట్ బండి అలాంటి రేర్ రికార్డ్ నెలకొల్పింది. మ్యారేజ్ ఈవెంట్ లో తప్పక వినిపించే పాటగా మారింది. మోహనా భోగరాజు సింగింగ్ సెన్సేషన్ గా మారింది. లవర్స్ ఫేవరేట్ సాంగ్గా ‘ఒకే ఒక లోకం నువ్వే’ శ్రీనివాస నాయుడు డైరెక్ట్ చేసిన రొమాంటిక్ డ్రామా శశి. మార్చిలో థియేటర్స్ లో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపకపోయినా యూట్యూబ్ లో మాత్రం ఈ సినిమాలోని ‘ఒకే ఒక లోకం నువ్వే’ సాంగ్ సూపర్ హిట్ అయింది. ఏకంగా 150 మిలియన్ కు పైగా వ్యూస్ అందుకుంది. చంద్రబోస్ రాసిన ఈ పాటను సిడ్ శ్రీరామ్ పాడాడు. మనసు దోచిన ‘శ్రీవల్లీ’ పుష్ప తెలుగు వర్షన్ సాంగ్స్ లో శ్రీవల్లీ ఎక్కువగా వ్యూస్ అందుకుంది. ఈ పాట 100 మిలియన్ కు పైగా వ్యూస్ అందుకుని మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు పరుగులు తీస్తోంది. చంద్రబోస్ లిరిక్స్ అందించగా సిద్ శ్రీరామ్ ఆలపించాడు. అలాగే ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా మావా’కూడా యూట్యూబ్ని షేక్ చేస్తోంది. ‘లాహే లాహే’ చిరు నటిస్తున్న కొత్త చిత్రం ఆచార్య. ఈ మూవీ నుంచి ఇప్పటికీ రెండు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. వాటిల్లో లాహే లాహే రికార్డ్ స్థాయిలో వ్యూస్ అందుకుంది. 2021లో యూట్యూబ్ ను షేక్ చేసింది.రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు మణిశర్మ సంగీతం అందించాడు. హారిక నారాయన్, సాహితీ చాగంటి కలసి పాడారు. యూట్యూబ్ లెక్కల ప్రకారం ఈ సాంగ్ వ్యూస్ 100 మిలియన్ దాటాయి. -
మహేశ్ బాబును లాభాల బాట పట్టించిన ‘లవ్స్టోరీ’
సాయి పల్లవి, నాగచైతన్యల ‘లవ్స్టోరీ’ మూవీ రికార్డ్ స్టాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. విడుదలై దాదాపు నెల రోజులు అవుతున్నా ఈ మూవీ ఇప్పటికె థియేటర్లో ఆడుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 24 విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. కరోనా కాలంలో కూడా ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టించిన చిత్రం లవ్స్టోరీ రికార్డు సృష్టించింది. ఇక తొలి రోజు అయితే ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్’ అనిపించింది. చదవండి: కోర్టును ఆశ్రయించిన సమంత సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇందులో సాయి పల్లవి డ్యాన్స్, నాగ చైతన్య తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. దీంతో అందరూ థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటికే థియేటర్లో ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో లవ్స్టోరీ దర్శక-నిర్మాతలకే కాదు థియేటర్ల యాజమాన్యాలకు సైతం లాభాలు తెచ్చిపెడుతోంది. త్వరలో ఈ మూవీ ఆహాలో విడుదలవుతున్నప్పటికీ ఈ మూవీని థియేటర్లో చూసేందుకు ఇప్పటికీ కూడా పలువురు టికెట్స్ బుక్ చేసుకుంటున్నారట. చదవండి: నాగబాబుపై తీవ్ర విమర్శ వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు ఈ క్రమంలో ‘లవ్స్టోరీ’ ఓ థియేటర్కు అయితే ఏకంగా కోటీ రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇంతకి ఆ థియేటర్ ఎదో తెలుసా? అదే మన సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెందిన ఏఎంబీ(AMB) సినిమాస్ మల్టీప్లెక్స్. సెకండ్ వేవ్ తర్వాత ఈ మల్టీప్రెక్స్లో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి చిత్రంగా లవ్స్టోరీ నిలిచిందట. ఇప్పటివరకు ఏఎమ్బీ థియేటర్లో 251 షోలు నిర్వహించగా.. 48,233 మంది వీక్షించారట. ఏఎంబీ మల్టీప్లెక్స్లో కోటి రూపాయల వసూళ్లు సాధించిన చిత్రాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పొచ్చు. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే కలెక్షన్లను సాయి పల్లవి-నాగ చైతన్యల ‘లవ్స్టోరీ’ చిత్రం రాబట్టడం విశేషం. చదవండి: ఘనంగా ముక్కు అవినాష్ పెళ్లి, ‘బ్లండర్ మిస్టేక్’ అంటూ వీడియో బయటికి! -
మలయాళంలోకి 'లవ్ స్టోరీ'.. టైటిల్ ఏంటో తెలుసా?
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంట శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్స్టోరీ’. సెకండ్ వేవ్ తరువాత థియేటర్లకు పెద్ద సంఖ్యలో జనాలను రప్పించిన సినిమా ఇది. సెప్టెంబర్ 24వ తేదీన విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. ఎంతోమంది మనసులను దోచుకుంది. కథా కథనాలే కాకుండా పాటలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంత మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా త్వరలోనే మలయాళీ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ ‘ప్రేమ తీరం’ని ఈ నెల 29వ తేదీన అక్కడ విడుదల చేయనున్నారు. కాగా కేరళలోనూ ‘ప్రేమమ్’ సినిమాతో సాయిపల్లవికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో అక్కడ సైతం ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చదవండి: ‘లవ్స్టోరి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ట్రైలర్ అదిరిందిగా.. -
ఈవారం ఓటీటీ, థియేటర్లలో అలరించబోయే చిత్రాలివే
కరోనా ప్రభావం తగ్గి ఆడియన్స్ ఇప్పుడిప్పుడే థియేటర్ల వైపు కదులుతున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్స్ విడుదలై మంచి విజయాన్ని సాధించగా, మరికొన్ని విడుదలైయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే మరి కొన్ని డెరెక్ట్ ఓటీటీ రిలీజ్కి, ఇంకొన్ని ఇటీవలే థియేటర్లలో విడుదలై ఇప్పుడు ఓటీటీల్లో ప్రేక్షకులని అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ వారం ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమాలపై ఓ లుక్ వేయండి. ‘అసలేం జరిగింది’ యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అసలేం జరిగింది’. శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్వీఆర్ దర్శకత్వం వహించగా, ఎక్స్డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఓ అదృశ్య శక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రమని, 1970- 80ల్లో తెలంగాణలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం పేర్కొంది. ‘నాట్యం’ ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా పరిచయమవుతూ, సొంతంగా నిర్మిస్తున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 22న థియేటర్లో విడుదల కానుంది. భరతనాట్యం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కమల్కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మేనన్లు తదితరులు నటించారు. మధుర వైన్స్.. కొత్త నటీనటులు సన్నీ నవీన్, సీమా చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మధురవైన్స్’. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి జయకిషోర్ దర్శకత్వం వహించారు. అక్టోబరు 22న ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్యానికి బానిసైన ఓ యువకుడిగా సన్నీ నవీన్, అసలు మద్యం అన్న, అది తాగే వాళ్లన్నా అసహ్య పడే ఓ యువతిగా సీమా చౌదరి నటించారు. అలాంటి వీళ్లద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది.. మద్యం కారణంగా వారిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేదే ఈ చిత్రం కథ. నాగచైతన్య-సాయి పల్లవిల ‘లవ్స్టోరీ’ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయి పల్లవి తెరకెక్కించిన చిత్రం ‘లవ్స్టోరీ’. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య నటన సాయిపల్లవి డ్యాన్స్ ప్రేక్షకుల తెగ ఆకట్టుకుంది. ఇక హీరోహీరోయిన్ల కెమిస్ట్రీకి వారి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. లాక్డౌన్ తర్వాత తెరుచుకున్న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ను తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు రాబోతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబరు 22న సాయంత్రం 6గంటల నుంచి ‘లవ్స్టోరీ’ అందుబాటులో ఉంటుందని ‘ఆహా’ ఇటీవల వెల్లడించింది. ‘హెడ్స్ అండ్ టేల్స్’ సునీల్, సుహాస్ చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిచిన చిత్రం ‘హెడ్స్ అండ్ టేల్స్’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేదే ఈ చిత్రం కాథాంశం. -
ఓటీటీలో ‘లవ్స్టోరి’.. విడుదల ఎప్పుడంటే
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్స్టోరి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత నెలలో(సెప్టెంబర్ 24) విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్హిట్ టాక్ సొంతం చేసుకుంది. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్’ అనిపించింది. కాగా, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ సరికొత్త ట్రైలర్ని విడుదల చేసింది. సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరి’ మూవీని రూపొందించారు. ఇందులో అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్గా చైతూ, పెద్దింటి అమ్మాయి మౌనికగా సాయి పల్లవి అద్భుతంగా నటించి మెప్పించారు. -
90 రోజులు 20 కొత్త సినిమాలు, ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు
ఒరిజినల్ తెలుగు కంటెంట్తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఓటీటీ సంస్థ ‘ఆహా’. ఎప్పటికప్పుడు సరికొత్త షోలు.. కొత్త కొత్త సినిమాలతో పాటు ఒరిజినల్ వెబ్ సిరీస్లతో దూసుకుపోతుంది. సందర్భాన్ని బట్టి ప్రేక్షకులను ఆకట్టుకొనే పనిలో ఉండే ఆహా ఇప్పుడు దసరాను టార్గెట్ చేసి వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ఆహా వీడియో దసరా పండగ సందర్భంగా ఇప్పుడు నాన్ స్టాప్ వినోదాల పండుగకి సిద్దం అయ్యింది. మొత్తం 12 వారాలు, 90 రోజులు, 20 కొత్త సినిమాలు.. షోలతో.. ఆహా ప్రేక్షకులను చూపు తిప్పుకోనికుండా చేసేందుకు ప్రణాళిక సిద్దం చేసుకుంది. చదవండి: కుటుంబంతో మాల్దీవుల్లో వాలిపోయిన అల్లు అర్జున్, వీడియో వైరల్ దసరా నుండి సంక్రాంతి పండుగ వరకూ అదిరిపోయే నాన్ స్టాప్ 100 శాతం తెలుగు వినోదాల పండుగ మీ ఆహాలో సిద్దం అంటూ ముందుకొస్తోంది. మొత్తం 90 రోజుల పాటు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు కొత్త సినిమాలు, కొత్త షోలు, వెబ్ సీరిస్ల ఫుల్ షెడ్యుల్తో ఆహా రెడీ అవుతోంది. ఇంకా విడుదల కానీ సినిమాలతో పాటు ఈ మూడు నెలల్లో వచ్చే కొత్త సినిమాలు కూడా ఈ షెడ్యూల్లో ఉండటం విశేషం. ముఖ్యంగా ఇందులో అఖిల్ అక్కినేని-పూజ హెగ్డేల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, నాగ చైతన్య-సాయి పల్లవిల లవ్ స్టోరీ, నాగ శౌర్య లక్ష్య, రాజ్ తరుణ్ అనుభవించు రాజా, వరుణ్ తేజ్ గని చిత్రాలతో పాటు ఇంకేన్నో తాజా తాజా సీరిస్లు, షోలు కూడా ఉన్నాయి. దీంతో బుల్లితెర ప్రేక్షకులు సినిమా జాతర కోసం సిద్దమవుతున్నారు. చదవండి: దసరా పండగకు థియేటర్లో, ఓటీటీలో సందడి చెయబోతున్న చిత్రాలు 12 వారాలు... 90 రోజులు... 20 కొత్త సినిమాలు, షోలు! 🎥 ఈ దసరా నుండి సంక్రాంతి వరకు అదిరిపోయే నాన్ స్టాప్ 100% తెలుగు వినోదాల పండగ, మీ అహలో!🧡 సిద్ధమా!!!https://t.co/whilkXuvEA#CelebrateWithAHA🥳 pic.twitter.com/TTbmVrS3OG — ahavideoIN (@ahavideoIN) October 10, 2021 -
ChaySam Divorce: బాధ కలిగించింది.. చైతు చాలా కూల్: రాజీవ్ కనకాల
Rajeev Kanakala About Chaysam Divorce: టాలీవుడ్లో ప్రస్తుతం ఎక్కడ చూసిన నాగ చైతన్య-సమంతల విడాకుల గురించే టాక్ నడుస్తోంది. నాలుగేళ్ల క్రితం(2017) పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న చై-సామ్.. టాలీవుడ్లో క్యూట్ కపుల్గా గుర్తింపు పొందారు. ఎలాంటి వివాదాలు లేకుండా నాలుగేళ్లుగా కలిసి ఉన్న ఈ ప్రేమ.. ఒక్కసారిగా విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించడంతో చై-సామ్ల అభిమానులు షాక్కు గురయ్యారు. వాళ్లు ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఎవరు? అంటూ మీడియా, సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఇక సినీ ప్రముఖులు కూడా చై-సామ్ విడాకులపై స్పందిస్తున్నారు. కొంతమంది సమంతకు మద్దతుగా మాట్లాడితే.. మరికొంతమంది చైతూకి అండగా నిలుస్తున్నారు. ఇక తాజాగా నాగ చైతన్య- సమంత విడాకులపై నటుడు రాజీవ్ కనకాల కూడా స్పందించారు. (చదవండి: అందుకే సమంత దూరం జరిగింది : మాధవీలత) నాగ చైతన్య, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా రూపొందిన 'లవ్ స్టోరీ' మూవీలో రాజీవ్ నెగెటివ్ పాత్రలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సక్సెస్, ఆ సినిమా షూటింగ్ తాలూకు విశేషాలను ఓ యూట్యూబ్ చానల్కు పంచుకున్న రాజీవ్ కనకాల.. చై-సామ్ విడాకులపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. నాగ చైతన్య- సమంత విడాకుల ఇష్యూ అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం అని, దాని గురించి ఏం మాట్లాడలేం అని చెప్పాడు. అయితే వారిద్దరు విడిపోవడం తనను బాధ కలిగించిందని చెప్పాడు. వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం సరికాదన్నాడు. రియల్ లైఫ్లో మాత్రం నాగ చైతన్య చాలా కూల్ పర్సన్ అని, ఆయన ఎక్కడా విసుగు చెందే మనస్తత్వం కాదని తెలిపాడు. సెట్లో అందరితో సరదాగా ఉంటూ తన పని తాను చెసుకొని వెళ్లేవాడని చెప్పుకొచ్చాడు. -
‘లవ్స్టోరీ’ చిత్రం చూసి భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యాంకర్ సుమ
Anchor Suma Comments Husband Rajeev Kanakala Over Love Story Movie: ప్రముఖ యాంకర్ సుమ కనకాల ‘లవ్స్టోరీ’ మూవీ చూసి ఎమోషనల్ అయ్యింది. ఈ మూవీ చూసిన అనంతరం ఆమె ట్వీట్ చేస్తూ తన భర్త రాజీవ్ కనకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేగాక ‘లవ్స్టోరీ’ మూవీ టీంపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు సుమ ట్వీట్ చేస్తూ.. ‘కొందరూ నటులు పాత్రలో లీనమై నటిస్తారు. అసలు ఆ పాత్ర తన కోసమే పుట్టిందా! అన్నట్లు నటిస్తారు. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. నా భర్త రాజీవ్ కూడా అలాంటి అద్భుతమైన నటులలో ఒకరు. అలాంటి ఒక అద్భుతమైన పాత్రలో నటించిన రాజీవ్కు శుభాకాంక్షలు. ఈ రోల్ చేయడానికి నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు. కానీ ఈ పాత్ర ద్వారా నువ్వు ఎంతో మంది జీవితాలను ఇంపాక్ట్ చేశావు’ అంటూ రాసుకొచ్చింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే అలాగే ‘లవ్స్టోరీ చిత్రంలో ఇలాంటి సెన్సిబుల్ లైన్ తీసుకుని సెన్సీటీవ్గా చూపించిన శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. అలాగే నాగ చైతన్య, సాయి పల్లవిలు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ చూస్తూ నా కళ్లు తిప్పుకోలేక పోయాను, రెప్పలు కొట్టకుండా అలానే చూస్తుండిపోయాను. దీంతో నా కళ్లు అలసిపోయాయి’ అంటూ తనదైన శైలిలో చమత్కరించింది. అలాగే మూవీ టీం మొత్తానికి సుమ శుభాకాంక్షలు తెలిపింది. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు.. కాగా ఈ చిత్రంలో రాజీవ్ కనకాల తన సొంత అన్న కూతురిని చిన్నప్పుడు లైంగికంగా వేధించిన పాత్రలో నటించాడు. సాధారణంగా ఇలాంటి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ డైరెక్టర్ శేఖర్ కమ్ములను నమ్మి ఆయన ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే లవ్స్టోరీ సక్సెస్ మీట్లో రాజీవ్ క్యారెక్టర్పై శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఇలాంటి పాత్ర చేయడానికి రాజీవ్ ఒప్పుకున్నాడంటే ముందు ఆయన భార్య సుమ కనకాలకు హ్యాట్సాఫ్ చెప్పాలి. మా మూవీకి ఇంతటి ఆదరణ లభించిందంటే దానికి ముఖ్య కారణం రాజీవ్’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. There are a very few actors who can make us so deeply involved with their performance and my dearest hubby Rajeev Kanakala @RajeevCo is one among them. Congratulations to you for such a wonderful role, I know you felt bad doing the character but you have impacted many lives (1/3) pic.twitter.com/ucL5mI3t90 — Suma Kanakala (@ItsSumaKanakala) September 30, 2021 -
నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే: శేఖర్ కమ్ముల
Sekhar Kammula: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్స్టోరీ’సినిమా కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది. అసలు లవ్స్టోరీ సినిమా కథ ఎలా మొదలైంది? ఆర్మూర్, బాన్సువాడ, నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లోనే షూటింగ్ చేయడానికి కారణం ఏంటి? బాలీవుడ్లో సినిమా ఎప్పుడు ఉండబోతుంది?లవ్స్టోరీ రిలీజ్ అనంతరం శేఖర్ కమ్ముల అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలను సత్తితో 'గరం గరం ముచ్చట్లు'లో చూసేయండి.. -
శేఖర్ కమ్ములతో గరం సత్తి ముచ్చట్లు
-
ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించారు: నాగ చైతన్య
Naga Chaitanya Love Story Movie: అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘లవ్స్టోరీ’ మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 24న(శుక్రవారం) విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. భారత్లోనే కాకుండా అమెరికా థియేటర్లలో కూడా ‘లవ్స్టోరీ’ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో మూవీ టీం లవ్స్టోరీ సక్సెస్ మీట్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య ఆనందం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. హీరోయిన్ సాయి పల్లవి, డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పాటు మిగతా సినిమా క్రూడ్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన ‘లవ్స్టోరీ’ టీంకు కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చాడు. చదవండి: ‘లవ్స్టోరీ’: ముద్దు సీన్పై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు కాగా ఈ సినిమాలో నాగ చైతన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన దళిత యువకుడి పాత్రలో కనిపించాడు. తన స్వయం శక్తితో ఎదిగి జుంబా మాస్టర్గా చై నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక అగ్ర వర్గానికి చెందిన యువతిగా సాయి పల్లవి నటించింది. ఇందులో ఆమె ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న అమ్మాయిగా కనిపించింది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఆమె డ్యాన్స్కు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబులు సైతం ఫిదా అయి సాయి పల్లవిని ప్రశంసించారు. చదవండి: బూతులు తిడుతూ పెద్దపెద్ద రాళ్లతో దాడి చేశారు: పోసాని వాచ్మెన్ భార్య Team #lovestory !! Thank you so much .. you guys have given me memories for a lifetime .. pic.twitter.com/oMbfgwJk0M — chaitanya akkineni (@chay_akkineni) September 30, 2021 -
‘లవ్స్టోరీ’: ముద్దు సీన్పై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు
కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న థియేటర్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘లవ్స్టోరీ’. మహమ్మారి కాలంలో కూడా అధిక శాతం ప్రేక్షకులను థియేటర్లోకి రప్పించిన చిత్రంగా లవ్స్టోరీ మార్క్ తెచ్చుకుంది. శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదలైన ఈ చిత్రం భారత్లోనే కాదు అమెరిక బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇందులో సాయి పల్లవి డ్యాన్స్, నాగ చైతన్య నటనకు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఈ మూవీ వరుసగా సక్సెస్, మ్యాజికల్ సక్సెస్ మీట్ వేడుకులను కూడా జరుపుకుంది. ఈ మూవీ సక్సెస్తో హీరోహీరోయిన్లు వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా మారారు. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి లవ్స్టోరీ విశేషాలను పంచుకుంది. అయితే ఈ సినిమాలో ఓ చోట సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య లిప్లాక్ సీన్ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్.. హీరోకు ముద్దు పెట్టి పరుగెత్తుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో ఈ ముద్దు సీన్పై సాయి పల్లవి స్పందిస్తూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఆ సన్నివేశంలో నాగచైతన్యను నేను నిజంగా ముద్దు పెట్టుకోలేదు. కెమెరామెన్ ఆ సన్నివేశాన్ని నిజం అనిపించేలా కెమెరా యాంగిల్ పెట్టి సెట్ చేశారు. ఎందుకంటే ముద్దు సన్నివేశాల్లో నేనేప్పుడు నటించలేదు. సినిమాకు డేట్స్ ఇచ్చేటప్పుడే ఇలాంటి సీన్లలో నటించనని డైరెక్టర్లకు ముందే స్పష్టం చేస్తాను. అలాగే ఈ సినిమాలో ముద్దు సీన్లో నటించమని డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. పాత్ర బాగుంటే పర్ఫార్మెన్స్ దానికదే ఉత్తమంగా వచ్చేసిస్తుందనేది నా అభిప్రాయం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. -
చైతూ, శేఖర్పై ప్రశంసలు కురిపించిన నాగార్జున
‘‘దేశంలో కోవిడ్ మరణాలు తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. భారత ప్రభుత్వం కానీ, ప్రత్యేకించి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు, తెలంగాణ సీఎం కేసీఆర్గారు మంచి నిర్ణయాలు తీసుకుని కరోనా నివారణకు చర్యలు తీసుకున్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీపై కరోనా ప్రభావం కాస్త ఎక్కువ ఉంది. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో థియేటర్లు తెరవలేదు. తెలంగాణలో 100 శాతం, ఆంధ్రాలో అక్కడి పరిస్థితులను బట్టి 50 శాతం థియేటర్లు తెరిశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడూ మమ్మల్ని మంచి చూపే చూశాయి’’ అన్నారు నాగార్జున. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్స్టోరీ’. కె. నారాయణ్దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలైంది. హైదరాబాద్లో నిర్వహించిన ‘మ్యాజికల్ సక్సెస్ మీట్ ఆఫ్ లవ్ స్టోరీ’లో నాగార్జున మాట్లాడుతూ –‘‘కొన్ని వారాల క్రితం విడుదలైన ఓ హిందీ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు నాలుగు కోట్లు షేర్ వస్తే.. ‘లవ్స్టోరీ’కి ఏడు కోట్లు వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కోటి నమస్కారాలు. శేఖర్ సెన్సిటివ్ డైరెక్టర్.. కానీ అదొక్కటే సరిపోదు. దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో బ్యాలెన్స్ చేసి తీయాలి.. శేఖర్ అది నేర్చుకున్నాడు. చైతన్యను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఈ సినిమా చూశాక ఇంకా సంతోషమేసింది. యాక్టర్ అండ్ స్టార్.. ఇవి రెండూ డిఫరెంట్ పదాలు. చైతూను ఒక స్టార్ యాక్టర్గా తయారు చేశాడు శేఖర్. చైతూ.. బాగా నటించావ్. ఈ సినిమా చూసి నేను నవ్వేలా, ఏడ్చేలా చేశావ్. ‘ప్రేమనగర్’ రిలీజ్ టైమ్లో తుఫాన్, సైక్లోన్ అన్నీ ఉన్నా నాన్నగారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇప్పుడు తుఫాన్, కోవిడ్, సైక్లోన్తో పోరాడి ‘లవ్స్టోరీ’ గొప్ప విజయాన్ని సాధించింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా సక్సెస్ కావడం టాలీవుడ్కు శుభపరిణామం’’ అన్నారు నారాయణ్దాస్ నారంగ్. ‘‘ఈ సినిమా కోసం మూడేళ్లుగా నాతో పాటు ప్రయాణం చేసిన యూనిట్కి థ్యాంక్స్. ఇండస్ట్రీకి చిరంజీవిగారు ఎలా పెద్దగా నిలబడ్డారో మా సినిమాకి కూడా అలాగే నిలబడ్డారు.. ఆయన రాకతో మా సినిమాకి మాంచి కిక్ వచ్చింది’’ అన్నారు శేఖర్ కమ్ముల. నాగచైతన్య మాట్లాడుతూ –‘‘ఆడియన్స్ వస్తారా? రారా? అనే టైమ్లో వారు థియేటర్స్కు వచ్చి మా సినిమాను ఆదరించారు. శేఖర్గారి కంటెంట్ పవర్ ఏంటో సెప్టెంబరు 24న తెలిసింది. సినిమా స్టార్ట్ చేశాక శేఖర్గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోని వారి నిజాయతీ చూసి ఈ సినిమా కోసం ఎంతైనా కష్టపడొచ్చని ఫిక్సైపోయాను’’ అన్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ –‘‘మా తాతగారు ‘అన్నమయ్య’ చూస్తున్నప్పుడు.. ఆత్మ దేవునితో ఐక్యమయ్యే సీన్ని ఏడుస్తూ.. దండం పెడుతూ చూసేవారు. ఆయన యాక్ట్ చేస్తున్నారు తాతయ్యా అనేదాన్ని. నేను ఇండస్ట్రీ వచ్చాక అర్థం అయ్యింది.. ఒక పాత్రను మనం చేస్తే అది నిలిచిపోయేలా చేయాలని నాకు నేర్పిన మీకు (నాగార్జున) థ్యాంక్స్. ‘లవ్స్టోరీ’కి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో అని థియేటర్స్కి వెళ్లా. వారి రియాక్షన్ చూసి కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు. సురేశ్ బాబు, సుద్దాల అశోక్తేజ, భాస్కర భట్ల, పవన్ సీహెచ్, మంగ్లీ, రోల్ రైడా, ఈశ్వరీ రావు తదితరులు పాల్గొన్నారు. -
లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్కి అతిథిగా సుకుమార్?
కరోనా సెకండ్ వేవ్ అనంతరం విడుదలై మంచి విజయం సాధించింది ‘లవ్స్టోరీ’. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతూ దూసుకుపోతోంది. కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికాలో సైతం రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్ధమయ్యింది చిత్రబృందం. ఇందులో భాగంగా మంగళవారం (సెప్టెంబర్ 28న) మ్యాజికల్ సక్సెస్ మీట్ను నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ట్రైడెంట్ హోటల్లో జరిగే ఈ కార్య్రమానికి హీరో నాగార్జునతోపాటు స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారని తెలుస్తోంది. అయితే విడుదలకు ముందే ఎంతో బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. కాగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ రూ. 50 కోట్ల మార్క్ దగ్గర ఉన్నట్లు సమాచారం. కాగా సుకుమార్, నాగచైతన్య కలిసి ‘100% లవ్’ మూవీ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. చదవండి: చైతూకి గేమ్ చేంజర్..ఆమెకు ఎముకలు ఉన్నాయా'? -
మహేశ్ కామెంట్స్పై స్పందించిన సాయి పల్లవి
Sai Pallavi Respond On Mahesh Babu Tweet: నాగ చైతన్య, సాయి పల్లవి ‘లవ్స్టోరీ’ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదలైన ఈ మూవీ ఇండియాలోనే కాదు అమెరిక బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇందులో సాయి పల్లవి డ్యాన్స్, నాగ చైతన్య నటనకు విశేష స్పందన వస్తోంది. దీంతో టాలీవుడ్లో ఎక్కడ చూసినా లవ్స్టోరీ మూవీ గురించే చర్చించుకుంటారు. అంతేగాక లవ్స్టోరీపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తు డైరెక్టర్ శేఖర్ కమ్ముల, హీరోహీరోయిన్లతో పాటు మూవీ టీంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ మూవీపై తన రివ్వూ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: యూఎస్ బాక్సాఫీసు వద్ద ‘లవ్స్టోరీ’ రికార్డు కలెక్షన్స్ ఈ సందర్భంగా ఆయన సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించారు. తన ట్వీట్లో సాయి పల్లవి గురించి బెబుతూ.. ‘ఎప్పటి లాగే సాయి పల్లవి సన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఆమెకు బోన్స్(ఎముకలు) ఉన్నాయా? స్క్రీన్పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం ఇంతవరకు చూడలేదు’ అంటూ రాసుకొచ్చాడు. అది చూసిన సాయి పల్లవి, మహేశ్ కామెంట్స్పై స్పందించింది. మహేశ్ ట్వీట్కు సమాధానం ఇస్తూ.. ‘మీ మాటలు నాకు మరింత ఎనర్జీని ఇస్తున్నాయి. మీ ప్రశంసలకు విధేయురాలిని సార్. నాలో ఉన్న మీ అభిమాని మీరు చేసిన ట్వీట్ను ఇప్పటికీ మిలియన్ టైమ్స్ చదివించింది సార్’ అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరు కూడా ఆమెపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. చదవండి: A R Rahman: 'అవును మహేశ్.. మేమందరం గర్వపడుతున్నాం' Woah🙈 It’s going to take me a while to come back to my senses!!! I’m humbled by your generous words ☺️ Thank you so much Sir 🙈 P.S. The fan girl in me has already read your tweet a million times 🙈 — Sai Pallavi (@Sai_Pallavi92) September 26, 2021 లవ్స్టోరీ సినిమా చూసిన మహేశ్ బాబు ట్వీట్ చేస్తూ.. ‘శేఖర్ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడు. అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా అతనికి గేమ్ చేంజర్ అవుతుంది. ఇక సాయిపల్లవి ఎప్పటిలాగే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈమెకు అసలు బోన్స్(ఎముకలు) ఉన్నాయా? స్క్రీన్పై స్క్రీన్ పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం చూడలేదు. ఇక వన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమే చెప్పాలి. రెహమాన్ సార్ శిష్యుడు అని విన్నాను. రెహమాన్ సర్ గర్వపడే సమయం' ఇది అంటూ లవ్స్టోరీ టీంపై ప్రశంసలు కురిపించాడు. ఆయన ట్వీట్కు ఎఆర్ రెహమాన్ కూడా స్పందిస్తూ ధన్యవాదలు తెలిపిన సంగతి తెలిసిందే. చదవండి: 'లవ్స్టోరీ' సినిమాపై మహేశ్బాబు రివ్యూ -
యూఎస్ బాక్సాఫీసు వద్ద ‘లవ్స్టోరీ’ రికార్డు కలెక్షన్స్
సాయి పల్లవి, నాగచైతన్యల ‘లవ్స్టోరి’ మూవీ రికార్డ్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ తొలి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్’ అనిపించింది. తాజాగా ఈ మూవీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అమెరికాలో లవ్స్టోరీ విడుదలైన 3 రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ల (రూ.7 కోట్ల 37 లక్షలు) వసూళ్లు రాబట్టింది. ఆదివారం రాత్రి వరకు 2021లో అత్యధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా లవ్స్టోరీ నిలిచింది. చదవండి: Pushpa: ‘పుష్ప’ షూటింగ్ జరిగిన లొకేషన్ని షేర్ చేసిన మేకర్స్ ఓ తెలుగు సినిమా మూడు రోజుల్లో యూఎస్లో 1 మిలియన్ల డాలర్లోకి వెళ్లడమంటే సాధారణ విషయం కాదు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా రికార్డుల స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా లవ్స్టోరీ నిలిచింది. మూడు రోజుల్లో యూఎస్లో 1 మిలియన్ల డాలర్ల క్లబ్లోకి లవ్స్టోరీ చేరటం విశేషం. దీంతో లవ్స్టోరీ 2 మిలియన్ల డాలర్ల మైల్స్టోన్ దిశగా వెళ్లడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఫిల్మ్ దునియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు తొలిరోజు లవ్స్టోరీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లను వసూళ్లు చేసిందట. ఒక యూఎస్లోనే 2.9 కోట్ల కలెక్షన్లను రాబట్టి, సెంకడ్ వేవ్ తర్వాత ఇంత భారీ ఓపెనింగ్ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా లవ్స్టోరి నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు అటుఇటుగా రూ. 6 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల మాట. చదవండి: మహేశ్ బాబు ట్వీట్కి రిప్లై ఇచ్చిన ఏ.ఆర్.రెహమాన్ -
గరం గరం వార్తలు 27 September 2021
-
'లవ్స్టోరీ' సినిమాపై మహేశ్బాబు రివ్యూ
Mahesh Babu Comments On Love Story Movie: టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఇప్పుడు 'లవ్ స్టోరీ' మూవీ టాపిక్కే వినిపిస్తోంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్స్టోరి’ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్స్టార్ మహేశ్ బాబు లవ్స్టోరీపై రివ్యూ ఇచ్చారు. చదవండి : డిన్నర్ పార్టీలో ఎమోషనల్ అయిన నాగార్జున 'శేఖర్ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడు. అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా అతనికి గేమ్ చేంజర్ అవుతుంది. ఇక సాయిపల్లవి ఎప్పటిలాగే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈమెకు అసలు బోన్స్(ఎముకలు) ఉన్నాయా? స్క్రీన్పై స్క్రీన్ పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం చూడలేదు. ఇక వన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమే చెప్పాలి. రెహమాన్ సార్ శిష్యుడు అని విన్నాను. రెహమాన్ సర్ గర్వపడే సమయం' ఇది అంటూ లవ్స్టోరీ టీంపై మహేశ్ ప్రశంసలు కురిపించాడు. చదవండి : Love Story Review: ‘లవ్స్టోరి’ మూవీ రివ్యూ @Sai_Pallavi92 sensational as always... does the lady have any bones??? Haven't seen anyone dance like this ever on screen!!! Moves like a dream 🤩🤩🤩 — Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2021 @pawanch19.. you'll be hearing a lot more of him... what a music score... Just sensational! Heard he's a disciple of @arrahman.. Rahman sir, you'll be proud of him. — Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2021 -
డిన్నర్ పార్టీలో ఎమోషనల్ అయిన నాగార్జున
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్స్టోరి’ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. ఫిల్మ్ దునియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 10 కోట్లను వసూళ్లు చేసినట్లు సమచారం. దీంతో లవ్స్టోరీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్లో ఫుల్ బిజీగా ఉంది. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన అమీర్ ఖాన్కు అక్కినేని కుటుంబం గ్రాండ్గా డిన్నర్ పార్టీ ఇచ్చింది. చదవండి: Ali Home Tour: కమెడియన్ అలీ 'హోమ్ టూర్' చూశారా? నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ములతో పాటు మరికొందరు ఈ పార్టీలో పాల్గొన్నారు. అందరూ కలిసి కేక్ కట్ చేసి సక్సెస్ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అమీర్ఖాన్తో నాగార్జున ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇక లవ్స్టోరీ సినిమా విడుదలైన సెప్టెంబర్ 24నే 50 సంవత్సరాల క్రితం ఏఎన్నార్ నటించిన ‘ప్రేమ్నగర్’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. లవ్స్టోరీ మూవీ సైతం సక్సెస్ సాధించడంతో నాగార్జున ఒకింత ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య ఆ సినిమాలో బాలరాజు అనే తెలుగు ఆర్మీ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఈ సందర్భంగా గతంలో ఏఎన్నార్ కూడా బాలరాజు పేరుతో తీసిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకొని నాగార్జున భావేద్వేగానికి లోనయ్యారు. చదవండి : Love Story Box Office: రికార్డు స్థాయిలో ‘లవ్స్టోరి’ కలెక్షన్స్ Love Story Review: ‘లవ్స్టోరి’ మూవీ రివ్యూ -
బాక్సాఫీస్ వద్ద ‘లవ్స్టోరి’ప్రభంజనం.. ఫస్ట్డే కలెక్షన్స్ ఎంతంటే?
Love Story Movie First Day Collections: సాయి పల్లవి, నాగచైతన్యల ‘లవ్స్టోరి’మూవీ రికార్డ్ కలెక్షన్స్తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా సెంకడ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని బడా సినిమా నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ తొలి రోజే రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి ‘వావ్’ అనిపించింది. (చదవండి: ‘లవ్స్టోరి’ మూవీ రివ్యూ) ఫిల్మ్ దునియాలో వినిపిస్తున్న సమాచారం మేరకు తొలిరోజు లవ్స్టోరీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 10 కోట్లను వసూళ్లు చేసిందట. ఒక యూఎస్లోనే 2.9 కోట్ల కలెక్షన్లను రాబట్టి, సెంకడ్ వేవ్ తర్వాత ఇంత భారీ ఓపెనింగ్ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా లవ్స్టోరి నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు అటుఇటుగా రూ.6 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల మాట. ఒక్క నైజాం నుంచే 3 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చిందట. సీడెడ్ నుంచి కోటికి పైగా షేర్ వచ్చింది. వెస్ట్, గుంటూరు ఏరియాల్లో, ఒక్కో సెగ్మెంట్ నుంచి అరకోటికి పైగా షేర్లు వచ్చినట్లు తెలుస్తోంది. లవ్స్టోరి మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 32.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్ర హక్కులు 16.8 కోట్ల రూపాయలకు సేల్ అయ్యాయని టాక్. నైజాం ఏరియాలో 11 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని అంటున్నారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.36 కోట్ల దాకా లాభాలను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఆ టార్గెట్ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి. -
Love Story Review: ‘లవ్స్టోరి’ మూవీ రివ్యూ
టైటిల్ : లవ్స్టోరి నటీనటులు : నాగ చైతన్య , సాయి పల్లవి, ఈశ్వరీరావు తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాతలు : కె. నారాయణ్దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు దర్శకత్వం: శేఖర్ కమ్ముల సంగీతం : పవన్ సీహెచ్ సినిమాటోగ్రఫీ : విజయ్.సి.కుమార్ ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది : సెప్టెంబర్ 24, 2021 సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇపుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్స్టోరి సినిమా చేశాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు నేడు( సెప్టెంబర్24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ‘లవ్స్టోరి’ ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. ‘లవ్స్టోరీ’కథేంటంటే? అణగారిన సామాజిక వర్గానికి చెందిన రేవంత్(నాగ చైతన్య) ఏదైనా బిజినెస్ చేయాలని నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు వస్తాడు. అక్కడ ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జుంబా డ్యాన్స్ సెంటర్ నడుపుతుంటాడు. రేవంత్ గ్రామానికే చెందిన మౌనిక(సాయి పల్లవి) బిటెక్ పూర్తిచేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగం లభించకపోవడంతో రేవంత్ జుంబా సెంటర్లో పార్ట్నర్గా జాయిన్ అవుతుంది. ఇలా భిన్నమైన సామాజిక వర్గాలు కలిగిన రేవంత్, మౌనికల మధ్య స్నేహం ఏర్పడుతుంది. అది కాస్త నిదానంగా ప్రేమగా మారుతుంది. ఈ ప్రేమ విషయాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకున్నప్పుడు మధ్యలో కులం అడ్డు వస్తుంది. ఇక్కడ నుంచి వారిద్దరి ప్రేమ కథా వ్యవహారం ఎలా నడిచింది? కులాల అడ్డంకి దాటుకొని చివరకు మౌనిక, రేవంత్ ఎలా ఒకటయ్యారు? అనేదే మిగిలిన కథ. ఎలా చేశారంటే.. ? రేవంత్ పాత్రలో నాగచైతన్య ఒదిగిపోయాడు. ముఖ్యంగా డ్యాన్స్ విషయంగా చైతూ చాలా మెరుగయ్యాడు. గత చిత్రాలకు భిన్నంగా ఈ మూవీలో కష్టమైన స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇక మౌనిక పాత్రలో సాయి పల్లవి ఎప్పటి మాదిరే పరకాయ ప్రవేశం చేసింది. సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టమైన స్టెప్పులను ఈజీగా వేసి అదరగొట్టేసింది. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరూ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తెరపై రేవంత్, మౌనిక పాత్రలు మాత్రమే కనిపిస్తాయి తప్ప చైతూ, సాయి పల్లవిలు అస్సలు కనిపించరు. హీరో తల్లిపాత్రలో ఈశ్వరీరావు తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. మౌనిక బాబాయి నరసింహం పాత్రలో రాజీవ్ కనకాల మెప్పించాడు. నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ తనది. హీరోయిన్ తల్లిగా దేవయాని, ఎస్సైగా ఉత్తేజ్ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరి’ మూవీని రూపొందించారు. ఇవి రెండూ సున్నితమైన అంశాలు. వీటి గురించి మాట్లాడేందుకు ఇప్పటికీ చాలా మంది సంకోచిస్తున్నారు. ఆయా సమస్యలపై వచ్చిన కథనాలు చదివితే చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. అలాంటి సున్నితమైన పాయింట్ని తీసుకొని, తెరపై అతి సున్నితంగా చూపించాడు శేఖర్ కమ్ముల. పాత్రల నేపథ్యం చాలా నేచురల్గా ఉంటుంది. సినిమాల్లో కొన్ని ఎమోషన్స్ బాగా ఎలివేట్ చేసినా.. స్లోగా సాగే సీన్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్లో హీరో, హీరోయిన్స్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ సినిమాటిక్గా అనిపిస్తాయి. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్గా సాగుతుంది, సెకండాఫ్ వచ్చేసరికి కథలో ఎమోషన్స్ ఎక్కువైపోతాయి. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం పవన్ సీహెచ్ సంగీతం. పాటలతో పాటు నేపథ్యం సంగీతం కూడా అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్స్కి ప్రాణం పోశాడు. విజయ్.సి.కుమార్ సినిమాటోగ్రఫి చాలా బాగుంది. పల్లెటూరి విజువల్స్ని తెరపై అందంగా చూపించాడు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్లో కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బ్యానర్ స్థాయికి తగినట్లుగా ఉంది. మొత్తంగా చెప్పాలంటే ‘లవ్స్టోరి’ ఓ మంచి సందేశాత్మక చిత్రం. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
నాగ చైతన్య - సాయి పల్లవి ‘సెన్సిబుల్’ లవ్ స్టోరీ
-
‘లవ్ స్టోరీ’ మూవీ ట్విటర్ రివ్యూ
టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఇప్పుడు లవ్ స్టోరీ మూవీ టాపిక్కే వినిపిస్తోంది. ప్రేక్షకుల్లో అదో రకమైన ఆసక్తి. సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇపుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ సినిమా చేశాడు. కె. నారాయణ్దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 24)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. (చదవండి: Love story Review: చైతూ, సాయిపల్లవిల ‘లవ్స్టోరీ’ హిట్టా? ఫట్టా?) ఇలా భారీ అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్తో హైదరాబాద్లోని థియేటర్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 900పైగా థియేటర్లలలో ఈ మూవీ విడుదలైంది. ఇక ఇప్పటికే అమెరికా లాంటీ దేశాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలను ఈ మూవీలో బాగా చూపించారని టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ పంచి, సెకండాఫ్ వచ్చేసరికి సరికి కథపై గ్రిప్పింగ్ తీసుకొచ్చి బాగా ప్రెజెంట్ చేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య, సాయి పల్లవిల నటన అయితే అదిరిపోయిందట. సాయి పల్లవి డాన్స్, మ్యూజిక్ స్పెషల్ అసెట్ టాక్ వినిపిస్తోంది. అయితే రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారని, సినిమాలో చెప్పుకోదగిన కొత్త సన్నివేశాలు ఎక్కడా కనిపించలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #LoveStory movie getting avg reviews..saying that ending is abrupt.They all have watched movie with high expectations.Lets reduce the expectations and prepare our mind for abrupt climax..Then surely will enjoy it😍😍 — Sreeram (@sreeram0106) September 24, 2021 #LoveStory seriou emotional Lead pair @chay_akkineni and @Sai_Pallavi92 are the soul.Chaitu’s acting 👌bgm and songs 😍 sensitive topics raise chesaru but abruptly ended. One time watch! — akhil_maheshfan2 🔔 (@Maheshfan_1) September 24, 2021 #LoveStory Overall an Average Emotional Love Story! NC and Sai Pallavi were great on the screen together! The life of the film is the Music and BGM. Movie had some good moments that were vintage SK but some repetitive scenes that were boring as well. Rating: 2.75/5 — Venky Reviews (@venkyreviews) September 23, 2021 Review & Ratting : #LoveStory Music., LEAD pairs ., 👍 LoveStory is predictable drama .., offers nothing new expect few sequences & fresh music keeps us HOOK !! Have to wait & see how family audience receives . (2.5/5) https://t.co/rxPYriHs7k — Inside talkZ (@Inside_talkZ) September 24, 2021 Too many emotions . . Lead pair done their best . Kammula sir inkoncham gattiga work cheyalsindi. . — Super⭐️ Fan 🦁 (@Ravianenenu) September 24, 2021 Burning issue in the society is being dealt sensibly by Kammula. — TrackTollywood (@TrackTwood) September 23, 2021 #LoveStory Blockbuster 💥💥 Super 1St half ❤ Excellent Second Half 🔥🔥 Class Movie Tho #NagaChaitanya Mass Chupisthadu pakka 💥💥💥💥 Families Tho theatre's Housefulls avuthayi pakka 👍💥 — Balaji (@BaluPKfan) September 24, 2021 #LoveStoryreview : Amazing script. Fantastic acting from Chay and Sai Pallavi. Entire love track was very fresh as you’d expect from Sekhar Kammula. A little dragged second half but a solid message. 3/5 #LoveStory Worth watching in theatres. 👍🏼👍🏼 — Chaitanya Somavajhala (@ChaitanSrk) September 24, 2021 #LoveStory Review... Slow Start But Great End 👏 👉 @chay_akkineni & @Sai_Pallavi92 Nailed The Show 😍 & Dance Moves Are Top Notch💥 👉 @sekharkammula Dealed With sensitive In his way 👌 👉 Music & Bgm Are Soul Of The Movie 🕶#LoveStoryreview #NagaChaitanya #SaiPallavi pic.twitter.com/iFqGphRlpP — NEW UPDATES (@OTTGURUJINITHIN) September 24, 2021 Movie BoxOffice ResultDepends On How Audience Accepts Last 30Mins👍#LoveStory #LoveStoryReview #NagaChaitanya #SaiPallavi #SekharKammula #Cinee_WorlddReview #Cinee_Worldd pic.twitter.com/PFoVjcCE6o — cinee worldd (@Cinee_Worldd) September 24, 2021 BLOCKBUSTER 💥💥💥#loveStory #LoveStoryReview — Akhileeyyy (@iamkrzzy__45) September 24, 2021 #LoveStoryReview 1st Half Report: #LoveStory 1st Half as a whole did not seem to be in the range that the fans were expecting. Some high moments, BGM and songs are entertaining here and there. https://t.co/qrMfDrwxYw#LoveStoryOnSep24th #NagaChaitanya #saipallavi https://t.co/AdikWVGlf5 — Daily Culture (@DailyCultureYT) September 23, 2021 #LoveStory Decent 1st Half 👌 B G M 👍@chay_akkineni & @Sai_Pallavi92 👍 https://t.co/s4B7M9dX3N — koti ! 🎬🎥 (@koti7711) September 24, 2021 Just finished watching #LoveStory @chay_akkineni @Sai_Pallavi92 Wow 🤩! Just brilliant. #Sekhar Kammula Best at storytelling! @chay_akkineni well done 👍🏻 broh! — HK (@khs3737) September 24, 2021 -
అందుకే ఈ సినిమా హిట్టవ్వాలనుకుంటున్నా!
‘‘లవ్స్టోరీ’ సినిమాపై యూనిట్ అంతా చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తి స్థాయిలో థియేటర్లకు రావడం లేదు. వారందర్నీ మా సినిమా థియేటర్లకు రప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నాగచైతన్య. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కిన చిత్రం ‘లవ్స్టోరీ’. కె. నారాయణ్దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు. ►కరోనా లాక్డౌన్ వల్ల సినిమా ఇండస్ట్రీ బాగా ఇబ్బందుల్లో పడింది. మళ్లీ మునుపటి రోజులు రావాలని, పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాను. ‘లవ్స్టోరీ’ సినిమా మా కోసం కాకున్నా చిత్రపరిశ్రమకు మంచి బూస్ట్ ఇచ్చేందుకు అయినా హిట్ కావాలనుకుంటున్నాను. ‘లవ్స్టోరీ’లో తెలంగాణ యాస కోసం కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశాం.. డబ్బింగ్ చెప్పే టైమ్కు లాక్డౌన్ వచ్చింది. దీంతో ఈ యాస మరింత స్పష్టంగా నేర్చుకునేందుకు వీలు దొరికింది. ►శేఖర్ కమ్ములగారిలో సినిమా పట్ల నిజాయతీ, అంకితభావం నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. ఆయనతో పని చేసేవారికి ఎంతో ఉపయోగం. శేఖర్గారి చిత్రాల్లో రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. సమాజానికి, వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రాలంటే నాకూ ఆసక్తే. కమర్షియల్ సినిమాల్లో ఎవరైనా పెద్ద సందేశం ఇస్తారు. కానీ లింగ వివక్ష, కుల వివక్ష వంటి సమస్యలను చూపించడం గొప్ప విషయం. వాటిని ఈ సినిమాలో చూపించారు. ‘మజిలీ’ సినిమాతో నాకు కొంచెం సంతృప్తి దొరికింది.. ‘లవ్స్టోరీ’ చిత్రం పూర్తి స్థాయి సంతృప్తి ఇచ్చింది. మహిళలకు సంబంధించిన ఓ సెన్సిటివ్ ఇష్యూను శేఖర్గారు ఈ చిత్రంలో పల్లవి అనే పాత్ర ద్వారా చెప్పారు. ఆయనతో పని చేసిన తర్వాత నటుడిగా, వ్యక్తిగా ఎదిగాను. అందుకే ఆయనతో ఎప్పుడూ ప్రయాణం చేయాలనిపిస్తోంది. ►ప్రేక్షకుల ఆలోచనా విధానం మారింది.. వాస్తవానికి దగ్గరగా ఉన్న సినిమాలను బాగా ఆదరిస్తున్నారనే విషయాన్ని నేను, సుకుమార్గారు మాట్లాడుకున్నాం. ఆయన కూడా ‘రంగస్థలం’ నుంచి ఇదే తరహాలో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పారు. ప్యాన్ ఇండియా మార్కెట్ గురించి నాకు తెలియదు. ప్యాన్ ఇండియా కోసం స్క్రిప్ట్ రాస్తే ప్రాంతీయ విషయాలు మిస్ అవుతాం. ►ఆమిర్ ఖాన్గారితో ‘లాల్సింగ్ చద్దా’ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం 45 రోజులు ఆయనతో చేసిన ప్రయాణం నాకు చాలా ప్లస్ అయింది. ఇండస్ట్రీకొచ్చిన ఈ 12ఏళ్లలో నేర్చుకున్నదాని కంటే ఎక్కువే నేర్చుకున్నాను. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘థ్యాంక్యూ’ చిత్రం పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అలాగే ‘బంగార్రాజు’లో నటిస్తున్నాను. శేఖర్గారి గత చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు ఎక్కువ పేరొచ్చింది. కానీ ‘లవ్స్టోరీ’లో సాయిపల్లవితో పాటు నా పాత్రకు కూడా సమాన ప్రాధాన్యం ఉంది. ఇద్దరికీ మంచి పేరొస్తుంది. సాయిపల్లవి మంచి నటి, డ్యాన్సర్. డ్యాన్స్ విషయంలో నేను చాలా టేక్స్ తీసుకున్నాను. సాంగ్ షూట్ అంటే నాకు గతంలో భయంగా ఉండేది. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా నుంచి శేఖర్ మాస్టర్, నా కాంబినేషన్ బాగా వర్కవుట్ అవుతోంది. ‘లవ్స్టోరీ’ చిత్రంలోనూ నాతో మంచి స్టెప్పులు వేయించారాయన. -
అందుకే 'లవ్స్టోరీ' చూడాలనే క్యూరియాసిటీ పెరిగింది.
Reasons To Watch Love Story Movie: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘లవ్స్టోరీ’ ఒకటి. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న మూవీ ఇది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్24న ప్రేక్షకల ముందుకు రానుంది. లవ్స్టోరీతో థియేటర్లకు పూర్వ వైభవం వస్తుందని సినీ ప్రముఖులు సైతం భావిస్తున్నారు. లవ్స్టోరీ సినిమా చూసేందుకు ఉన్న ప్రధాన కారణాలను ఓసారి పరిశీలిస్తే.. సాయి పల్లవికి సమానంగా.. సాయి పల్లవికి నటిగానే కాకుండా, మంచి డ్యాన్స్ర్గానూ పేరుంది. అందుకు తగ్గట్లుగానే ప్రతీ సినిమాలో అంతకంతకు ఢిపరెంట్ డ్యాన్స్ స్టెప్స్తో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. అయితే సాయిపల్లవికి సమానంగా నాగ చైతన్య డ్యాన్స్ ఉండనుందని ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మూవీలో సాయి పల్లవి కంటే నాగ చైతన్య డ్యాన్స్ చూసేందుకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. సెన్సిటివ్ సబ్జెక్ట్ లవ్స్టోరీ సినిమా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. కులం, పరువు హత్య లాంటి సెన్సిటివ్ అంశాలను తెరపై ఎలా చూపించారన్నది చాలామందిలో ఉన్న క్యూరియాసిటీ. శేఖర్ కమ్ముల స్టైల్ ఫీల్గుడ్ సినిమాలు తెరకెక్కించడంలో శేఖర్ కమ్ములది ఢిఫరెంట్ స్టైల్. ఆయన డైరెక్షన్లో వచ్చిన ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ వంటి సినిమాలు ఎప్పుడూ చూసినా అదే ఫ్రెష్ ఫీల్ కలుగుతుంది. ఇదే ఆయన సినిమాల్లో మ్యాజిక్. అలాంటిది లవ్స్టోరీగా మన ముందుకు వస్తున్నారంటే కశ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పొచ్చు. చైతూ-పల్లవిల కెమిస్ట్రీ నాగ చైతన్య, సాయి పల్లవి ఈ సినిమా కోసం తొలిసారి నటించారు. ట్రైలర్లో చూపించినట్లుగా ఇద్దరి మధ్యా వచ్చే డైలాగ్స్, కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా వర్కవుట్ అవుతుందని చాలామంది సినీ ప్రేక్షకుల ఫీలింగ్. జుంబా డ్యాన్సర్గా నాగ చైతన్య ఈ సినిమాలో నాగ చైతన్య గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదటగా చెప్పుకోవాల్సింది ఆయన డ్యాన్స్. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే, ఈ మూవీలో సాయి పల్లవి కంటే నాగ చైతన్య డ్యాన్స్ పైనే ఫోకస్ పెరిగింది. ఈ సినిమాలో చైతూ జుంబా డ్యాన్సర్గా కనిపించడం, తెలంగాణ యాస టచ్ చేయడంతో మరింత ఆసక్తి పెరిగింది. -
పెళ్లెప్పుడు... అని అడిగేవారు: సాయి పల్లవి
‘‘సమాజంలో మహిళలపై జరిగే దాడులు విని, చదివి బాధపడతాను. మనం ఏం చేయలేమా? అనుకుంటాను. ‘లవ్ స్టోరీ’లో మౌనిక పాత్ర చేస్తున్నప్పుడు కనీసం నా సినిమా ద్వారా అయినా నా వాయిస్ చెప్పగలిగాను అనే సంతృప్తి కలిగింది’’ అని సాయిపల్లవి అన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్స్టోరీ’. కె. నారాయణ్దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సాయిపల్లవి చెప్పిన విశేషాలు. డ్యాన్స్ చేయాలంటేనే నాకు భయం వేస్తుంటుంది. ‘రౌడీ బేబీ..’ పాట కష్టంగా అనిపించింది. ‘ఎమ్సీఏ’ చిత్రంలో ‘ఏవండోయ్ నానిగారు..’ పాటకు బాగా కష్టపడ్డా. వెనక్కి వంగి డ్యాన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. వెన్నెముక దెబ్బతిందేమో? అనుకునేదాన్ని. ►శేఖర్ కమ్ములగారి నుంచి ‘లవ్స్టోరీ’కి పిలుపు వచ్చినప్పుడు కచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యాను. కథలో మౌనిక పాత్ర విన్న తర్వాత నటించాలనే కోరిక ఇంకా గట్టిగా కలిగింది. మౌనిక తన డ్రీమ్స్ను ఫాలో అవుతుంది. నేను ఎందులో తక్కువ? అనే ఆత్మవిశ్వాసం మౌనిక పాత్రలో కనిపిస్తుంది. ►మన కుటుంబంలో, సమాజంలో లింగ వివక్షను చూస్తుంటాం. ఈ సమస్యలను టచ్ చేస్తూ ఆలోచింపజేసేలా ‘లవ్స్టోరీ’ని తీశారు శేఖర్ కమ్ముల. మా సినిమా చూశాక ప్రేక్షకుల్లో కచ్చితంగా ఒక ఆలోచన కలుగుతుందనే నమ్మకం ఉంది. ►మనలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు, మాస్టర్స్ కాదు.. కానీ సాధించాలనే విల్ పవర్ ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నాగచైతన్య, నా క్యారెక్టర్ ద్వారా చెప్పించారు. నాగచైతన్యతో వర్క్ చేయడం చాలా కంఫర్ట్గా అనిపించింది. ►చిరంజీవి సార్కు పెద్ద మనసుంది.. అందుకే నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావని కితాబిచ్చారు. నాతో డ్యాన్స్ చేయాలని ఉందని సరదాగా అన్నారు. నా డ్యాన్స్ చూసి ప్రేక్షకులు సంతోషపడితే అదే చాలు. నాకంటే బాగా డ్యాన్స్ చేసేవాళ్లు ఉంటారు. చాన్స్ వస్తే వాళ్లూ నిరూపించుకుంటారు. ►‘ఫిదా, లవ్స్టోరీ’ సినిమా షూటింగ్స్ దాదాపు పల్లెటూరిలోనే జరిగాయి. అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు మరచిపోలేను. ‘పెళ్లెప్పుడు చేసుకుంటావ్.. అమ్మానాన్న ఏం చేస్తారు?’ ఇలాంటి వ్యక్తిగత విషయాలు అడిగేవారు. ‘లవ్స్టోరీ’ షూటింగ్ పూర్తయ్యాక తిరిగి వచ్చేస్తుంటే వారు పండించిన పసుపును బహుమానంగా ఇచ్చారు. -
ఆ విధంగా నాకీ సినిమా ఓ కొత్త అనుభవం!
‘‘నేనే కాదు.. ప్రతి ఒక్కరూ చరిత్రలో నిలిచిపోయే సినిమాలనే తీయాలనుకుంటారు. అందుకే నేను పాత్రలను ప్రేమిస్తూ కథ రాసుకుంటాను. ప్రతి సినిమాను, అందులోని ప్రతి సన్నివేశాన్ని ఇంతకన్నా బాగా ఎవరూ తీయలేరన్నట్లుగా భావించి తెరకెక్కించడానికి ప్రయత్నిస్తాను. ఓ పదేళ్ల తర్వాత కూడా నా సినిమాలను నా పిల్లలు చూడగలిగేలా, వారు గర్వంగా ఫీలయ్యేలా తీయడానికి కష్టపడుతుంటాను. ఇలాగే ‘లవ్స్టోరీ’ తీశాను. నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లవ్స్టోరీ’. కె. నారాయణ్దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల చెప్పిన విశేషాలు. ►‘లవ్స్టోరీ’ ఓ మంచి ఫీల్గుడ్ ఎంటర్టైనర్. ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండాల్సిన రొమాన్స్, ప్రేమ.. ఇలా అన్ని అంశాలు ఉంటాయి. ఈ చిత్రంలో కుల వివక్ష, స్త్రీ వివక్ష అనే రెండు బలమైన అంశాలను బ్యాలెన్స్ చేస్తూ చూపించాను. జనరల్గా నా సినిమాల్లో కొత్తవారు ఎక్కువగా ఉంటారు. కానీ ‘లవ్స్టోరీ’లో ప్రేక్షకులకు ఎక్కువగా తెలిసిన ఆర్టిస్టులే ఉంటారు. ఆ విధంగా ఈ సినిమా నాకు కొంత కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ►‘లీడర్’ చిత్రంలో కుల వివక్షపై ఓ చిన్న సీన్ ఉంది. ఆ సన్నివేశం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ పాయింట్నే కొంచెం ఎక్కువగా చూపిస్తూ ‘లవ్స్టోరీ’ తీశాం. శతాబ్దాలుగా ఉన్న కుల వివక్ష సమస్యలకు ఎవరు పరిష్కారాలు చూపించారు? అది మన దౌర్భాగ్యమే. ఒకటో తరగతి పుస్తకాల్లోనే మనమంతా ఒక్కటే అని ఉంటుంది. ఇది చెప్పడానికి ఇంకా ఎన్ని సినిమాలు రావాలి? ఇంకా ఎంత సాహిత్యం కావాలి? కుల వివక్ష గురించి పరిష్కార మార్గాలు కాదు కానీ .. నాకు తెలిసింది, నాకు వచ్చింది నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాను. అలాగే సమాజంలో స్త్రీల పట్ల కనిపించే వివక్ష చూపించాం. ‘లవ్స్టోరీ’ చూసిన అమ్మాయిల్లో కొందరైనా ఇది మా కథ అని స్ఫూర్తి పొందినట్లయితే మేం విజయం సాధించినట్లే. ►లాక్డౌన్ వల్ల ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ చిత్రనిర్మాతలు నాకు బలాన్ని ఇచ్చారు. వేరే నిర్మాతలు అయితే ఓటీటీకి ఇచ్చేసేవారేమో. వీరికి థియేటర్స్ ఉన్నాయని కాదు... సినిమాను థియేటర్స్లో చూడాలని, ప్రేక్షకులకు చూపించాలని తపన. లాక్డౌన్ ప్రతి ఇంట్లో ఏదో రకమైన విషాదాన్ని నింపింది. ఈ సమయంలోనే మా నాన్నగారు దూరమయ్యారు. ►‘లవ్స్టోరీ’లో తెలంగాణ కుర్రాడు రేవంత్ పాత్రలో నాగచైతన్య, మౌనిక పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. జుంబా డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్గా కనిపిస్తాడు చైతు. తెలంగాణలోని ఆర్మూర్ బ్యాక్డ్రాప్లో కథ సాగుతుంది. ఈ సినిమా కోసం చైతూయే కాదు చిత్రయూనిట్ అందరూ చాలా కష్టపడ్డారు. తెలంగాణ యాస, మేనరిజమ్, డ్యాన్స్ వంటి అంశాల్లో చైతూ స్పెషల్ కేర్ తీసుకున్నాడు. కొత్త చైతూను చూస్తారు. సాయిపల్లవి మంచి పెర్ఫార్మర్. ‘ఫిదా’లోలానే ఈ సినిమాలోనూ తను బాగా చేసింది. అయితే ‘ఫిదా’లో సాయిపల్లవి చేసిన ‘భానుమతి’ పాత్రకు మౌనిక పాత్ర డిఫరెంట్గా ఉంటుంది. మౌనిక క్యారెక్టర్లో ఓ స్ట్రగుల్ కనిపిస్తుంది. ఆమె క్యారెక్టర్లో షేడ్స్ ఉన్నాయి. ►అక్కినేని నాగేశ్వరరావుగారి ‘ప్రేమ్నగర్’ విడుదలైన రోజునే ‘లవ్స్టోరీ’ విడుదలవుతోందని నాగార్జునగారు అన్నారు. ‘ప్రేమ్నగర్’ సక్సెస్ అయిన దాంట్లో 30 శాతం మా సినిమా సక్సెస్ అయినా నేను హ్యాపీ ఫీలవుతాను. ►నా తర్వాతి చిత్రం ధనుష్తో ఉంటుంది. ముందుగా తెలుగు, తమిళ భాషల్లో అనుకున్నాం. కానీ ఓటీటీల వల్ల ఆడియన్స్ రీచ్ ఎక్కువగా ఉంది. హిందీలో కూడా ధనుష్కు మంచి మార్కెట్ ఉంది. అందుకే మల్టీలాంగ్వేజ్ ఫిల్మ్గా తీస్తున్నాం. రానా హీరోగా నా డైరెక్షన్లో వచ్చిన ‘లీడర్’కు సీక్వెల్ చేస్తాను. -
ఈ వారం బాక్సాఫీస్ పోటీలో ‘లవ్ స్టోరీ' వర్సెస్ ‘మరో ప్రస్థానం'
ఈ వారం రెండు తెలుగు సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. చాలా కాలం తరువాత థియేటర్లకు అనుమతులు ఇవ్వడంతో ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతున్నాయి. చాలా సినిమాలు ఓటీటీకే పరిమితం కాగా, కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. అలా రిలీజ్ కాబోతున్న సినిమాల్లో నాగచైతన్య ‘లవ్స్టోరీ కాగా రెండో సినిమా మరో ప్రస్థానం. లవ్స్టోరీ సినిమాను భారీగా ప్రమోషన్ చేస్తున్నారు. ఆదివారం లవ్స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు, అమీర్ ఖాన్ కూడా హాజరయ్యారు. ఇప్పటికే సినిమా పాటలు, ట్రైలర్కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఇదిలా ఉంటే, లవ్స్టోరీ రిలీజ్ అవుతున్న రోజునే తనీష్ ‘మరోప్రస్థానం' సినిమా కూడా రిలీజ్ కాబోతున్నది. విలన్ బృందం వరస హత్యలు చేస్తుండగా, వాటిపై స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి వాటిని సీక్రెట్ కెమెరాలో షూట్ చేస్తారు హీరో బృందం. ఆ కెమెరా విలన్లకు దొరుకుంది. ఆ తరువాత ఏం జరిగింది అనే ఆసక్తికరమైన అంశంలో థ్రిల్లింగ్గా కథను తెరకెక్కించారు. జానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్నది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కింది. రియల్ టైమ్లోనే రీల్ టైమ్ సినిమాగా తెరకెక్కించారు. చదవండి: భీమ్లా నాయక్: పవర్ ఫుల్ డైలాగ్తో బెదిరించిన రానా పోర్నోగ్రఫీ కేసు: శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు బెయిల్ -
‘లవ్స్టోరీ’ ప్రీరిలీజ్ ఈవెంట్: చిరుతో కలిసి స్టెప్పులు వేసిన సాయిపల్లవి
-
సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు
‘‘కరోనా సమయంలో ఏదైనా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయమంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఓ బటన్ నొక్కి, దాని గురించి విష్ చెబితే అయిపోతుంది. అయితే ఇలా వచ్చి కళాభిమానుల్ని, ప్రేక్షకుల్ని కలుసుకుంటూ ఈ క్లాప్స్ వింటూ ఆ సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు’’ అని హీరో చిరంజీవి అన్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ స్టోరి’. కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఆదివారం జరిగిన ‘లవ్ స్టోరీ అన్ ప్లగ్డ్’ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ–‘‘నారాయణ్ దాస్గారితో 1980 నుంచి నాకు మంచి సంబంధాలున్నాయి. వారి అబ్బాయి సునీల్ నారంగ్ తండ్రికి మించిన తనయుడయ్యాడు. ‘లవ్ స్టోరీ’ అనగానే చాలా ఆసక్తి కలిగింది.. ఎందుకంటే ప్రేమకథా చిత్రాలు చూసి చాలా రోజులైంది. నా మిత్రుడు నాగార్జున కొడుకు నాగచైతన్య వెరీ కూల్ బాయ్. యంగ్స్టర్స్ అంతా ఎగసి పడుతుంటారు.. కానీ ఎప్పుడూ కంపోజ్డ్గా ఉంటాడు చైతన్య. కూల్ ఫాదర్కి (నాగా ర్జున) కూల్ సన్ నాగచైతన్య. తను నిలకడగా వెళుతుంటాడు.. అది ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. నా మిత్రుడు ఆమిర్ఖాన్, నాగచైతన్య నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. సాయిపల్లవిని తొలిసారి మా వరుణ్ తేజ్ ‘ఫిదా’చిత్రంలో చూశాను. ఆ సినిమా రిలీజ్ అయ్యాక వరుణ్ వచ్చి, ‘డాడీ.. డ్యాన్స్ ఎలా చేశాను నేను’ అన్నాడు. ‘సారీ రా.. నేను నిన్ను చూడలేదు.. సాయిపల్లవిని మాత్రమే చూశా’ అన్నాను. నా సినిమాలో చెల్లెలి పాత్ర కోసం సాయిపల్లవిని అడిగారు.. అయితే తను కుదరదు అంది.. నేను కూడా అదే కోరుకున్నా. ఎందుకంటే అంత మంచి డ్యాన్సర్తో నేను డ్యాన్స్ చేయాలనుకుంటాను కానీ ‘చెల్లెమ్మా’ అని పిలవగలనా?.. పిలవలేను. నా పక్కన రొమాంటిక్ హీరోయిన్గా చేయగలిగితే ఓకే. శేఖర్ కమ్ముల ఎవరి వద్దా పనిచేయకపోయినా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయ్యాడు. ‘లవ్ స్టోరీ’ ప్రేక్షకులను అలరిస్తుందనడంలో నో డౌట్’’ అన్నారు. హీరో ఆమిర్ఖాన్ మాట్లాడుతూ – ‘‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూసి, బాగుందని చైతూకు(నాగచైతన్య) మెసేజ్ చేశా. నా ‘లాల్సింగ్ చద్దా’ చిత్రంలో తను నటించారు. నా సినిమా సెట్స్లో చైతన్యను ఫస్ట్టైమ్ చూసినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా అనుబంధం ఉన్న ఫీలింగ్ కలిగింది. చైతూ చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు, సంస్కారవంతుడు. ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని థియేటర్స్లోనే చూస్తాను. ముంబయ్లో థియేటర్స్లో స్క్రీనింగ్కు ఇబ్బందులు ఉంటే అధికారుల అనుమతితో ప్రత్యేక స్క్రీనింగ్లో అయినా చూస్తాను’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ–‘‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూస్తుంటే నాగ చైతన్య, సాయి పల్లవి బాగా నటించారని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలు విడుదల చేసేందుకు చాలా మంది నిర్మాతలు భయపడతున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయి. తమ సినిమాను థియేటర్లోనే విడుదల చేసేందుకు ముందుకొచ్చిన ‘లవ్ స్టోరీ’ నిర్మాతలకు అభినందనలు. ఇండస్ట్రీపై ఆధారపడి ఎంతో మంది కార్మికులు జీవిస్తున్నారు. వాళ్లు బాగుండాలంటే సినిమా అన్ని సెక్టా ర్లలో పుంజుకోవాలి’’ అన్నారు. ‘‘ఈ వేడుకకి వచ్చిన చిరంజీవి, ఆమిర్ ఖాన్గార్లకు థ్యాంక్స్. నాగచైనత్య, సాయిపల్లవి, శేఖర్ కమ్ములతో పాటు మా ‘లవ్ స్టోరీ’ చిత్ర యూనిట్కి అభినందనలు’’ అన్నారు కె. నారాయణ్ దాస్ నారంగ్. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘మీరు(చిరంజీవి) నాకు ఆన్స్క్రీన్ మెగాస్టార్. ఆఫ్ స్క్రీన్ మెగా హ్యూమన్ బీయింగ్. కరోనా కష్టకాలంలో మీరు ఇండస్ట్రీకి సపోర్ట్ చేసిన తీరు స్ఫూర్తిదాయకం. ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ చూసి, అభినందించి ఈ వేడుకకు వస్తానని ఆమిర్ఖాన్గారు వచ్చారు. ‘లాల్సింగ్ చద్దా’ సినిమా కోసం 45 రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. ఆ సమయంలో ఆమిర్గారి నుంచి నేను నేర్చుకున్న విషయాలు నాకు జీవితాంతం ఉపయోగపడతాయి. ‘లవ్ స్టోరీ’ లో ఇంతలా పెర్ఫార్మ్ చేశానంటే అందుకు కారణం శేఖర్ కమ్ములగారే. సినిమాను థియేటర్స్లో విడుదల చేస్తున్నందుకు మా నిర్మాతలకు ధన్యవాదాలు. యాభైఏళ్ల క్రితం తాతగారి (అక్కినేని నాగేశ్వరరావు) ‘ప్రేమ్నగర్’ సినిమా విడుదలైన తేదీనే ‘లవ్స్టోరీ’ వస్తోంది.. అన్నీ రాసిపెట్టినట్లుగా అనిపిస్తోంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు శరత్ మరార్, భరత్ నారంగ్, అభిషేక్ అగర్వాల్, కెమెరామెన్ విజయ్ సి.కుమార్, సంగీత దర్శకుడు పవన్ సి.హెచ్, ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్, పాటల రచయితలు భాస్కర భట్ల, సురేంద్ర, ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా, నటి ఈశ్వరీ రావు తదితరులు పాల్గొన్నారు. ‘‘కొన్ని దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమ సక్సెస్ రేట్ మహా అయితే 20శాతం. ఈమాత్రం దానికే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందనుకుంటారు. కానీ, కష్టాలు పడేవారు, సాధక బాధకాలు అనుభవించే వారు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ప్రత్యక్షంగా వేల మంది, పరోక్షంగా లక్షల మంది ఉన్నారు. ఇలాంటి వారంతా కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప ఓ నలుగురైదుగురు హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కలిస్తే కాదు. కరోనా సమయంలో షూటింగ్స్ ఆగిపోవడంతో కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది ప్రత్యక్షంగా చూశాం. ఏ విపత్తు వచ్చినా సాయానికి ముందుండేది మా సినిమా ఇండస్ట్రీనే అని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజున సంక్షోభంలో పడిపోయింది.. సినిమా నిర్మాణం ఖర్చు పెరిగిపోయింది.. ఈ వేదికగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను మా విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ – చిరంజీవి -
సాయి పల్లవి నా సినిమాను తిరస్కరించింది: చిరంజీవి
Chiranjeevi At Love Story Pre Release Event: సాయిపల్లవి తన సినిమాను తిరస్కరించిందని చిరంజీవి అన్నారు. 'లవ్స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘భోళా శంకర్’ సినిమాలో నాకు చెల్లెలిగా సాయిపల్లవిని అడిగితే ముందు ఆమె తిరస్కరించిందని, అయితే ఆమె నో చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగిందని పేర్కొన్నారు. 'సాయి పల్లవి డ్యాన్స్ ఎంతో అద్భుతంగా చేస్తుంది. అలాంటి అమ్మాయితో డ్యాన్స్ స్టెప్పులేయాలనుకుంటా తప్పా అన్నయ్యా అని పిలిపించుకోవాలనుకోలేదు' అంటూ చమత్కరించారు. సారంగదరియా పాట తనకు ఎంతో నచ్చిందని, ఈ పాట కోసమే సినిమాను రెండు-మూడు సార్లు అయినా చూస్తానన్నారు. ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. 'చాలామంది ఎంగ్ స్టర్స్ ఎగిరెగిరి పడుతుంటారు. కానీ నాగ చైతన్య ఎప్పుడూ కామ్గా, కంపోసుడ్గా ఉంటాడు. మా తమ్ముడు నాగార్జున లానే.. కూల్ ఫాదర్కి కూల్ సన్' అని చిరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తనకు రీమేక్ చిత్రాలంటే చాలా భయమని, అందుకే ఆ సినిమాకు నో చెప్పానని సాయి పల్లవి పేర్కొంది. తనకు మరో అవకాశం ఇవ్వాలంటూ చిరంజీవిని కోరింది. ఈ సందర్భంగా స్టేజ్పై చిరుతో సాయిపల్లవి వేసిన స్టెప్పులు హైలెట్గా నిలిచాయి. -
'ఏపీ ప్రభుత్వం ఆలోచన సరైనదే'
‘‘అతి తక్కువ ధరకే ప్రేక్షకులకు వినోదం పంచుతున్నది సినిమా మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో ఆన్లైన్లో టిక్కెట్ల అమ్మకం విధానం తీసుకురావాలనే ప్రభుత్వ ఆలోచన సరైనదే. దేశం మొత్తం ఆన్లైన్ టిక్కెట్ విధానం తీసుకురావాలి. అప్పుడే ఎంత వసూళ్లు వస్తున్నాయన్నది నిర్మాతకు తెలుస్తుంది.. ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వస్తుంది’’ అని నిర్మాత కె. నారాయణ్ దాస్ నారంగ్ అన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్స్టోరీ’. కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కె. నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ- ‘‘లాక్డౌన్లో మా ‘లవ్స్టోరీ’ సినిమాకి చాలా ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి.. అయితే ఇలాంటి సినిమాను థియేటర్లోనే చూడాలని ఇన్ని రోజులు వేచి చూశాం. అన్ని ప్రేమ కథలు ఒక్కటే. అయితే ప్రేక్షకులకు దాన్ని ఎలా చూపించామన్నదే ముఖ్యం. మా ‘లవ్స్టోరీ’ సినిమాలో ప్రేమకథతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది’’ అన్నారు. పి. రామ్మోహన్ రావు మాట్లాడుతూ -‘‘1987లో ఎగ్జిబిటర్గా నా కెరీర్ మొదలైంది. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్, ఆ తర్వాత నిర్మాతగా మారాను. 15 సినిమాలు నిర్మించాను. వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లో తొలిసారి ‘లవ్స్టోరీ’ సినిమా నిర్మించాం.. మరిన్ని నిర్మిస్తాం. ‘లవ్స్టోరీ’ తో శేఖర్ కమ్ముల, మాకు మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అందుకే ఆయనతో ధనుష్ హీరోగా మరో సినిమా చేస్తున్నాం. ఆ తర్వాత కూడా మరో సినిమా శేఖర్తో చేస్తాం. కరోనా వల్లనే ‘లవ్స్టోరీ’ సినిమా విడుదల ఆలస్యమైంది. ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్ల ధరల విషయంలో ఈ నెల 20న జరిగే సమావేశంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రాలో థియేటర్లకు రాత్రి 10గంటల వరకే పర్మిషన్ ఉంది. ఆ సమయంలోపు రోజుకు నాలుగు ఆటలు వేసేలా ప్రయత్నాలు చేస్తున్నాం. ‘తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ చైర్మన్గా నేను ఉన్నప్పుడు తెలంగాణలోనూ ఆన్లైన్లో టిక్కెట్ విక్రయాలు జరిపితే బాగుంటుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను.. ప్రస్తుతం 80శాతం థియేటర్లు ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయిస్తున్నాయి. నాగచైతన్యతో మా బాండింగ్ చాలా బాగుంది.. అందుకే ఆయనతో మరో సినిమా చేయనున్నాం. మా బ్యానర్స్లో దాదాపు 10 సినిమాలు చేస్తున్నాం. కమల్హాసన్గారు నారాయణ దాస్కి చాలా క్లోజ్.. ధనుష్ సినిమా చర్చల కోసం చెన్నై వెళ్లినప్పుడు కమల్గారిని కూడా కలిశాం. ఇప్పటినుంచి వచ్చే ఏడాది ఆఖరు వరకు మేం 10 సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటున్నాం. నాగశౌర్య చిత్రాన్ని నవంబర్లో, నాగార్జునగారి చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత సుధీర్బాబు, ధనుష్, శివ కార్తికేయన్ సినిమాలు చేస్తా’’ అన్నారు. -
సమంత ట్వీట్కి రిప్లై ఇచ్చిన నాగ చైతన్య
Naga Chaitanya Thanks Wife Samantha: నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లవ్స్టోరీ. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదలైన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 5మిలియన్లకు పైగా వ్యూస్తో యూట్యూబ్లో ట్రెండింగ్లో నిలిచింది. ఇక నాగచైతన్య భార్య సమంత సైతం ట్రైలర్పై స్పందించిన సంగతి తెలిసిందే. 'విన్నర్.. లవ్స్టోరీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్' అంటూ సమంత ట్వీట్ చేసింది. దీనిపై నాగ చైతన్య స్పందిస్తూ..'థ్యాంక్యూ సామ్' అంటూ తన తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక లవ్స్టోరీలో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటించిన సంగతి తెలిసిందే. Thanks Sam !! https://t.co/XDI4gAOjmR — chaitanya akkineni (@chay_akkineni) September 14, 2021 -
Love Story: రేవంత్, మౌనికల ప్రేమకథకు ముహూర్తం ఫిక్స్
రేవంత్, మౌనికల ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రావడానికి తేదీ కుదిరింది. నిజానికి వీరి ప్రేమకథ ఎప్పుడో తెరకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. రేవంత్ పాత్రలో నాగచైతన్య, మౌనిక పాత్రలో సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కె. నారాయణ్దాస్ నారంగ్, పి. రామ్మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘తప్పనిసరి పరిస్థితుల వల్ల ఇన్నాళ్లూ మా ‘లవ్ స్టోరీ’ని వాయిదా వేస్తూ వచ్చాం. సినిమాని చూపించడానికి మంచి సమయం కోసం ఎదురు చూశాం. ఆ టైమ్ వచ్చింది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వరరావు. -
మరోసారి వాయిదా పడిన ‘లవ్స్టోరీ’, మూవీ టీం వివరణ
ప్రస్తుతం టాలీవుడ్లో విడుదల కాబోయే పెద్ద సినిమాల్లో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ‘లవ్స్టోరీ’ ఒకటి. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లోనే విడుదల చేయాలని చిత్ర బృందం గట్టిగా నిర్ణయించుకుని ఇంతకాలం వెయిట్ చేశారు. ఇక పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోవడంతో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. తీరా ఆ తేదీ రానే వచ్చింది. కానీ లవ్స్టోరీ మాత్రం థియేటర్లోకి రాలేదు. దీంతో ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. చదవండి: ‘ఆ రెండు సినిమాలు తీయకపోతే నా జీవితానికి అర్థం లేదు’ ఈ నేపథ్యంలో మరోసారి ‘లవ్స్టోరీ’ మూవీని వాయిదా వేసినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్లో రిలీజ్ డేట్తో కూడిన పోస్టర్ను షేర్ చేస్తూ.. ‘కొన్ని అనివార్య కారణాల వల్ల మూవీని వాయిదా వేయాల్సి వచ్చింది. ఎప్పుడెప్పుడూ లవ్స్టోరీ మీకు అందించాలా అని మేము కూడా ఆసక్తిగా ఉన్నాం. ఈ మేరకు సెప్టెంబర్ 24 ప్రపంచ వ్యాప్తంగా మూవీని విడుదల చేయబోతున్నాం’ అంటూ మేకర్స్ స్పష్టం చేశారు. కాగా కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ దేవయాని కీలక పాత్ర పోషించగా.. రావు రమేశ్ .. పోసాని కృష్ణ మురళి ముఖ్యమైన ప్రధాన పాత్రలు పోషించారు. #LoveStory from 24th September, 2021 in theatres near you. Good Luck @chay_akkineni 👍#NagaChaitanya pic.twitter.com/rCH90xMavQ — Subba Raju (@SubbarajuSiva) September 10, 2021 -
‘నాని సినిమాల్లోనే హీరో.. నిజ జీవితంలో పిరికివాడు’
సాక్షి, హైదరాబాద్: నాని నటించిన టక్ జగదీష్ ప్రాజెక్ట్ను ఓటీటీల్లో విడుదల చేయడంపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ చిత్రం ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్పై చర్చించేందుకు థియేటర్ల యజమానులు శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా థియేటర్ల యజమానులు మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల లవ్స్టోరీ సినిమా విడుదల అవుతున్న రోజే నాని టక్ జగదీష్ ఓటీటీలో రావడం వల్ల అందరం నష్టపోతామని అన్నారు. రేపు కూడా ఇలానే చేస్తే భవిషత్తులో నిర్మాతలకు తాము డబ్బులు కట్టమని అన్నారు. చదవండి: టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్పై నాని కామెంట్స్ పండుగల సమయంలో కొత్త సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని, థియేటర్లో లవ్ స్టోరీ విడుదలకు తెలంగాణ ఎగ్జిబిటర్లుమద్దతు పలికారు. టక్ జగదీశ్ నిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు, హీరో నానికి భవిషత్తు మేము ఏంటో చూపిస్తామన్నారు, తిమ్మరుసు ఆడియో వేడుకలో హీరో మాట్లాడిన తీరును బట్టి చూస్తే ఓటీటీ వాళ్ళు రూ. 4 కోట్లు ఎక్కువ ఇచ్చి తీసుకున్నట్లు తెలుస్తుందన్నారు, ‘సినిమా లేకుండా మనం లేమని, సినిమా మన సంస్కృతిలో భాగం నాని అన్నాడు. మరి ఇప్పుడు ఆయన ఓటీటీ లో సినిమా చేస్తున్నాడు. హీరో నాని సినిమాల్లోనే హీరో.. నిజ జీవితం లో పిరికివాడు’ అని పేర్కొన్నారు. చదవండి: ఆ సీన్ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన హీరోయిన్, వీడియో వైరల్ ఇదిలా ఉండగా నాని టక్ జగదీష్, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాలతో టాలీవుడ్లో ఓటీటీ, థియేటర్ల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాలు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీటిలో నాని టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ కానుండగా.. లవ్ స్టోరీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. -
Nani Tuck Jagadish: థియేటర్ల యాజమానుల అసంతృప్తి
కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా.. సినిమా థియేటర్లపై భారీ ప్రభావాన్ని చూపించింది. కోవిడ్ సెకండ్వేవ్ కారణంగా మూతపడ్డ థియేట్లు గత నెల 23 నుంచి తెరుచుకున్నప్పటికి పెద్ద సినిమాలేవి ఇంకా విడుదల కాలేదు. ఇప్పటికే జూలై 30న విడుదలైన తిమ్మరసు చిత్రం మంచి విజయం సాధించగా, రీసెంట్గా విడుదలైన ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా మంచి వసూళ్లు సాధించింది. కరోనా నిబంధనల మేరకు 50 శాతం ఆక్యూపెన్సీతో ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కాగా, వినాయక చవితికి వంద శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడనున్నాయి. ఈ క్రమంలో వచ్చే నెలలో విడుదల కాబోయే నాని టక్ జగదీష్, శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాల కారణంగా టాలీవుడ్లో ఓటీటీ, థియేటర్ల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాలు వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే వీటిలో నాని టక్ జగదీష్ ఓటీటీలో రిలీజ్ కానుండగా.. లవ్ స్టోరీ థియేటర్లలో విడుదలవుతుంది. ఈ క్రమంలో నాని నటించిన టక్ జగదీష్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ను ఓటీటీల్లో విడుదల చేయడంపై ఎగ్జిబిటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ చిత్రం ఓటీటీలో విడుదల చేయడంపై థియేటర్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్పై చర్చించేందుకు థియేటర్ల యజమానులు శుక్రవారం మధ్యాహ్నం భేటీకానున్నారు. (చదవండి: టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్పై నాని కామెంట్స్) ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి హిట్ చిత్రాల దర్శకుడైన శివ నిర్వాణకు ‘టక్ జగదీష్’ సినిమా.. హ్యాట్రిక్ చిత్రం. పవర్ ఫుల్ కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా చిత్ర టీజర్ కూడా తెలియజేసింది. రీతూ వర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లు. జగపతిబాబు, నాజర్ వంటి వారితో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్ అయ్యేలా ఈ చిత్రం రూపొందింది. టీజర్ విడుదల తర్వాత సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. బిగ్ స్క్రీన్పై చూడాల్సిన సినిమా అయినప్పటికి.. నిర్మాతలు ఓటీటీ బాట పట్టారు. ఈ నిర్ణయం పట్ల థియేటర్ల యజమానులు అసంతృప్తిగా ఉన్నారు. (చదవండి: ఓటీటీలోకి టక్ జగదీష్! అప్పుడే అంత లాభమా?) -
వినాయక చవితికి థియేటర్లో సందడి చేసే భారీ చిత్రాలివే!
కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై ఎంతగా పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది మార్చిలో విధించిన లాక్డౌన్ కారణంగా 9 నెలల పాటు సినీ పరిశ్రమతో పాటు థియేటర్లు మూత పడ్డాయి. ఆ తర్వాత పాక్షికంగా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రజలు బిగ్స్క్రిన్పై సినిమా చూసేందుకు భయపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటికి ప్రతి పండగలసందర్భంగా విడుదలయ్యే సినిమాల సందడి లేకుండా పోయింది. దీంతో ఓటీటీలోనే సినిమాలు చూడ్సాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే థియేటర్లు మెల్లిగా తెరుచుకుంటున్నాయి. వరసగా సినిమాలు థియేటర్లో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత మళ్లీ పండగ కళ తెచ్చేందుకు పెద్ద సినిమాలు రెడీ అవుతున్నాయి. నాని టక్ జగదీష్, నాగ చైతన్య లవ్ స్టోరీ, రానా విరాట పర్వం, సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్, నాగశౌర్య వరుడు కావలెను, గోపిచంద్ సీటీమార్ వంటి సినిమాలు వినాయక చవితి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్లో ఆర్ఆర్ఆర్ వంటి భారీ బడ్జెట్ చిత్రం ఉన్న నేపథ్యంలో ఆ లోపే ఈ హీరోలు తమ సినిమాలను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. కాగా ఇటీవల టక్ జగదీశ్, సీటీమార్, లవ్స్టోరీతో పాటు మరిన్ని చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ప్రేక్షకులు అయోమంలో పడ్డారు. ఈ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలన్ని కూడా థియేటర్లోనే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే జూలై 30న విడుదలైన తిమ్మరసు చిత్రం మంచి విజయం సాధించగా, రీసెంట్గా విడుదలైన ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమా మంచి వసూళ్లు సాధించింది. కరోనా నిబంధనల మేరకు 50 శాతం ఆక్యూపెన్సీతో ప్రస్తుతం థియేటర్లు ఓపెన్ కాగా, వినాయక చవితికి వంద శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడనున్నాయి. ఈ క్రమంలో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ నెలలో పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. -
OTT: ఓటీటీకి లవ్స్టోరీ, టక్ జగదీశ్, సీటీమార్, డీల్ ఎంతంటే!
కరోనా కారణంగా మూతపడిన థియేటర్లు ఈ మధ్యే మళ్లీ తెరుచుకున్నాయి. అయినప్పటికి నిర్మాతలు ఓటీటీలోనే తమ సినిమాలను విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా సినిమాల విడుదల తేదీలను ప్రకటించడం లేదు. అంతేగాక ఇప్పుడు కొన్ని సినిమాలను ఓటీటీలోనే విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయారు కొందరు నిర్మాతలు. తమ సినిమాలు థియేటర్స్లో విడుదలై సూపర్ హిట్ సాధించి వసూలు చేసే మొత్తం కంటే కూడా ఓటీటీ సంస్థలు ఇంట్రటెస్టింగ్ ఆఫర్స్తో ముందుకొస్తున్నాయి. దీంతో ఓటీటీలోనే తమ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే వెంకటేష్ నటించిన నారప్ప సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో మరిన్ని సినిమాలు కూడా ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్దమవుతున్నాయంటూ వస్తున్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ తాజా బచ్ ప్రకారం యేయే సినిమాలు ఓటీటీ ఎంత ఆఫర్లు పలుకుతున్నాయో ఓ సారి ఇక్కడ ఓ లుక్కేయండి. సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ డీల్ వెంకటేశ్ దృశ్యం 2 డిస్నీ హాట్ స్టార్ 36 కోట్లు నితిన్ మాస్ట్రో డిస్నీ హాట్ స్టార్ 28 కోట్లు శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్తో చర్చలు 39 కోట్లు నాని టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ వీడియో 37 కోట్లు గోపీచంద్ సీటీమార్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు 16 కోట్లు అంచనా శర్వానంద్ మహా సముద్రం నెట్ఫ్లిక్స్తో చర్చలు 21 కోట్లు ఇవే కాక మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్లు కూడా ఓటీటీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోడానికి సిద్ధమైనట్లు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. ఇఫ్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ పుంజుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అందుకే అప్పటి వరకు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను ఆపకుండా ఓటీటీకే ఇచ్చేయాలని చూస్తున్నారు నిర్మాతలు. -
యూట్యూబ్ను షేక్ చేస్తున్న సాయి పల్లవి ‘సారంగదరియా’ సాంగ్
యూట్యూబ్ను షేక్ చేసిన సాయిపల్లవి సాంగ్స్ అనగానే అప్పట్లో రౌడీ బేబీ, ఇప్పట్లో సారంగదరియా పాటలే గుర్తొస్తాయి. ఈ పాటల్లో మత్తుందో, సాయి పల్లవి స్టెప్పుల్లో కిక్కుందో తెలీదు గానీ ఇవి రెండూ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘లవ్స్టోరీ’ సినిమాలోని సారంగదరియా పాట ఇప్పటికే యూట్యూబ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దాని కుడి భుజం మీద కడువా.. అంటూ సాగిపోయిన ఈ జానపదం విడుదలైన మరుక్షణం నుంచే వేగం పెంచేసింది. సాయి పల్లవి నాచురల్ అందానికి తోడు ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ ఈ పాటకు మేజర్ అట్రాక్షన్గా నిలవడంతో ఈ పాట వరుసగా రికార్టులను సొంతం చేసుకుంటోంది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను మంగ్లీ ముగ్ధ మనోహరంగా ఆలపించింది. తెలంగాణ జానపదానికి తోడు పవన్ అద్భుత సంగీతం తోడవ్వడంతో ఈ పాట తక్కువ సమయంలోనే లక్షలాది మందిని ఆకర్షించింది. ఫిబ్రవరి 28న రిలీజైన ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్లో ట్రెండ్ అవుతూ తాజాగా 250 మిలియన్ల(25 కోట్లు) వ్యూస్తో దుమ్మురేపుతోంది. విడుదలైన 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు సాధించగా 32 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ పాట ఇప్పుడు 250 మిలియన్ల వ్యూస్ సాధించింది. తెలంగాణ నేపథ్యంలో సాగే ఓ విభిన్నమైన ప్రేమ కథతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఈ ‘లవ్ స్టోరీ’ మూవీ ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించారు. It is overwhelming!!#SarangaDariya is the fastest Tollywood's lyrical song to hit 250 million views on YouTube 💥💃🥳 Thank you for all the love - https://t.co/4Q16GiS2er#LoveStory @chay_akkineni @sai_pallavi92 @sekharkammula @pawanch19 #Suddalaashokteja @iamMangli @SVCLLP pic.twitter.com/vgADwGRbqk — Aditya Music (@adityamusic) June 22, 2021 -
నాగ చైతన్య, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’పై క్లారిటీ
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్ స్టోరీ’. నారాయణ్దాస్ కె నారంగ్, పి. రామ్మోహన్రావు నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతూ, సాధారణ పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఈ నెల చివరి నుంచి 50 శాతం సిట్టింగ్తో థియేటర్స్ ఓపెన్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో ‘లవ్స్టోరీ’ సినిమా విడుదలపై పలు వార్తలు సోసల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. థియేటర్లు ఓపెన్ అయిన వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేస్తారా లేక మరికొన్ని రోజులు ఆగుతారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ విడుదలపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపారు. 'థియేటర్లలో రోజుకు 3 షోలను మాత్రమే అనుమతిస్తే, మాత్రం మా సినిమా రిలీజ్ చేయాలనీ అనుకోవట్లేదు. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే విడుదల గురించి ఆలోచిస్తాం. జూలై రెండో వారం తర్వాత మాత్రమే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నా అభిప్రాయం. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాం’.. అని సునీల్ నారంగ్ వెల్లడించారు. చదవండి: భార్యకు నటుడి సర్ప్రైజ్; థాంక్యూ అంటూ భావోద్వేగం ఆ సీక్వెల్కు చిట్టి ఓకే చెప్పిందా? -
‘లవ్స్టోరీ’.. యాభై శాతమైనా ఓకే?
థియేటర్లు తెరుచుకున్న వెంటనే ‘లవ్స్టోరీ’ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందని తెలిసింది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. నారాయణ్దాస్ కె నారంగ్, పి. రామ్మోహన్రావు నిర్మించారు. ఈ ఏడాది ఏప్రిల్లో విడుదల కావాల్సిన ‘లవ్స్టోరీ’ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ సినిమాను థియేటర్స్ ఓపెన్ చేసిన వెంటనే విడుదల చేయాలనుకుంటున్నారట. థియేటర్స్లో వందశాతం సీటింగ్ సామర్థ్యం వచ్చేంతవరకు ఎదురు చూడకుండా యాభై శాతానికే అనుమతులు వచ్చినా సరే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ‘లవ్స్టోరీ’ నిర్మాతలు అనుకుంటున్నారని సమాచారం. జూలై చివర్లో లేదా ఆగస్టులో థియేటర్ల తాళాలు తెరుచుకుంటాయని భోగట్టా. వెంటనే ‘లవ్స్టోరీ’ థియేటర్స్కి వచ్చే చాన్స్ ఉంది. -
సారంగదరియా, ఇది మామూలు క్రేజ్ కాదయా..
యూట్యూబ్ను షేక్ చేసిన సాయిపల్లవి సాంగ్స్ అనగానే అప్పట్లో రౌడీ బేబీ, ఇప్పట్లో సారంగదరియా పాటలే గుర్తొస్తాయి. ఈ పాటల్లో మత్తుందో, సాయి పల్లవి స్టెప్పుల్లో కిక్కుందో తెలీదు గానీ ఇవి రెండూ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట తాజాగా యూట్యూబ్లో 200 మిలియన్ల వ్యూస్ సాధించింది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను మంగ్లీ ముగ్ధ మనోహరంగా ఆలపించింది. తెలంగాణ జానపదానికి తోడు పవన్ అద్భుత సంగీతం తోడవ్వడంతో ఈ పాట తక్కువ సమయంలోనే లక్షలాది మందిని ఆకర్షించింది. ఫిబ్రవరి 28న రిలీజైన ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు సాధించి 'అల వైకుంఠపురములో' చిత్రంలోని బుట్టబొమ్మ, రాములో రాములా పాటల పేరిట ఉన్న రికార్డులను తిరగరాసింది. 32 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు ఏకంగా 200 మిలియన్ల వ్యూస్ మైలురాయిని అందుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించారు. #SarangaDariya from #LoveStory is now the fastest 200 million+ viewed Lyrical in Tollywood 🔥💃🔥 ►https://t.co/4Q16GiS2er@chay_akkineni @sai_pallavi92 @sekharkammula @pawanch19 #Suddalaashokteja @iamMangli @SVCLLP @AsianSuniel #AmigosCreations @adityamusic @GskMedia_PR pic.twitter.com/XTsJ40od1z — Aditya Music (@adityamusic) May 24, 2021 చదవండి: మూడేళ్లలో రూ.5 కోట్లు పోగొట్టుకున్న సాయి పల్లవి! ‘సారంగ దరియా’ సాంగ్ తెలుగు లిరిక్స్.. మీ కోసం -
శేఖర్ కమ్ములకు కోపం వస్తే... సీక్రెట్ చెప్పిన చై.. నవ్వులే నవ్వులు
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఖాలీ సమయంలో దొరకడంతో ఈ మూవీ ప్రమోషన్స్ మొదలెట్టాడు శెఖర్ కమ్ముల. అందులో భాగంగా హీరో రానా హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘నం.1 యారి’షోలో ‘లవ్స్టోరీ’ టీమ్ సందడి చేసింది. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమయ్యే ఈ షోలో శేఖర్ కమ్ముల గురించి హీరో చైతన్య, హీరోయిన్ సాయిపల్లవి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సెట్లో ఆయన ఎలా ఉంటాడు. కోపం వస్తే ఏం చేస్తాడు తదితర విషయాలను బయటపెట్టారు. శేఖర్ కమ్ముల ప్రత్యేక ఏంటని సాయిపల్లవిని అడగ్గా.. ఆయన విషయంలో తాను కొంచెం పొసెసీవ్ అని చెప్పింది. నేను సెట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చైని మెచ్చుకుంటే నేను శేఖర్ కమ్ములగారి వైపు కోపంగా చూస్తుంటా. అసలు నాకు సంబంధం లేని విషయాల్లో కూడా ఆయనకు సలహాలు ఇస్తాను. ఆయన దానికి ఎలా స్పందిస్తారా..? అని ఎదురుచూస్తుంటా’అని సాయిపల్లవి చెప్పింది. ఇక శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. తాను ఎవరిని ఎక్కువగా పొగడనని, గుడ్ అని చెప్పానని, నచ్చకపోతే మానిటర్ దగ్గర నుంచి వెళ్లిపోతానని శేఖర్ చెబుతుండగా నాగచైతన్య కల్పించుకొని ‘దాదాపు గుడ్ అంటారు. ఈ మధ్య ‘యాక్’అనే పదం కూడా నేర్చుకున్నాడు’ అని అనడంలో అంతా ఘొల్లున నవ్వారు. ఇక రానా స్పందిస్తూ.. ఇది కొత్త పదం అని, తాను మాత్రం ‘యాక్’ అనిపించుకునేంత దారుణంగా ఎప్పుడూ చేయలేదనడంతో షోలో నవ్వులు పూశాయి. -
సాయి పల్లవి పేరులో ‘సాయి’ ఎలా చేరిందో తెలుసా?
తన డాన్స్తో, నటనతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి. మలయాళం చిత్రం ‘ప్రేమమ్’ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ..తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్పోజింగ్కు దూరంగా ఉంటూ కేవలం తన నటనతోనే లక్షలాది మంది అభిమానులను సంపాధించుకుంది. ఈ రోజు(మే 9) ఈ నేచురల్ బ్యూటీ పుట్టిన రోజు. నేటితో ఈ భామ 29వ పడిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా సాయి పల్లవి గురించి.. సాయిపల్లవిది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోటగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె, చెల్లెలు పూజ కవల పిల్లలు. కోయంబత్తూరు లో పాఠశాల విద్యనభ్యసించింది. తల్లి ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. ఎనిమిదో తరగతిలో ఉండగా ఈమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత మీరా జాస్మిన్ క్లాస్మేట్గా కస్తూరి మాన్ అనే మరో సినిమాలో నటించింది. ఇలా వరుస సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. తండ్రి సలహా మేరకు జార్జియాకి వెళ్లి వైద్యవిద్యను అభ్యసించింది. సూపర్ హిట్తో టాలీవుడ్ ఎంట్రీ తమిళ దర్శకుడు అల్ఫోన్సో తెరకెక్కించిన 'ప్రేమమ్' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ వయ్యారి భామ. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగులో ‘ఫిదా’ సినిమా చేసింది. ఇందులో అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది పల్లవి. ఈ సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత తెలుగులో సాయిపల్లవికి అవకాశాలు క్యూకట్టాయి. నానితో ఎంసీఏ చిత్రంలో నటించింది. అందులో కూడా సాయిపల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇలా తెలుగులో దూసుకెళ్తూనే.. తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటించిన‘మారి-2’తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమెకు కోలీవుడ్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పొచ్చు. మారి-2, దియా అనే తమిళ హార్రర్ మూవీతో పాటు సూర్యతో కలిసి నటించిన 'ఎన్జికే' చిత్రం కూడా భారీ ఫ్లాప్ని మూటగట్టుకున్నాయి. టాలీవుడ్లో మాత్రంలో ఒక్క ‘పడి పడి లేచే మనసు’ తప్ప అన్ని సినిమాలు సూపర్ హిట్టే. ప్రస్తుతం ఈ నేచురల్ బ్యూటీ తెలుగులో ‘విరాట పర్వం’ సినిమా చేస్తుంది. రానా హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. నక్సలైట్స్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రికార్డులన్నీ సాయిపల్లవికే సొంతం సాయిపల్లవి, ధనుష్ జంటగా నటించిన ‘మారి-2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ యూట్యూబ్లో 1.14 బిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి రికార్డు సృష్టించింది. యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సాధించి సాంగ్గా ‘రౌడీ బేబీ’ రికార్డుకెక్కింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన 'ఫిదా' చిత్రంలోని 'వచ్చిండే' సాంగ్ 300 మిలియన్ల వ్యూస్ దాటింది. ఇక తాజాగా లవ్స్టోరీ 'సారంగదరియా' సాంగ్ 17.6 మిలియన్ వ్యూస్ దాటింది. సౌత్లో ఒక హీరోయిన్ పాటకు ఇంతటి ఆదరణ రావడం ఒక్క సాయి పల్లవికే సొంతం. -
తెలుగు సినిమా నిండా ఎన్నో విఫల ప్రేమలు
-
రికార్డు సృష్టిస్తున్న సాయిపల్లవి పాట
సినిమా విజయంపై పాటలు కూడా ప్రభావం చూపుతాయి. గతంలో చాలా సినిమాలు పాటల వల్లే విజయాన్ని సొంతం చేసుకున్నాయి. స్టోరీ యావరేజ్గా ఉన్నా.. పాటలు బాగుంటే చాలు సినిమా సేఫ్ జోన్కి వెళ్లడం ఖాయం. ప్రేక్షకులను థియేటర్స్కి తీసుకురావడంలో సాంగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే దర్శక, నిర్మాతలు పాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇటీవల వచ్చిన పాటల్లో ‘సారంగ దరియా’కి బాగా ఆదరణ లభించింది. మంగ్లీ గాత్రం, సాయిపల్లవి స్టెప్పులకు తెలుగు ప్రజలు ఫిదా అయ్యారు. తెలంగాణ జానపదం కావడం, సుద్దాల అశోక్ తేజ లిరిక్స్కి, పవన్ అద్భుత సంగీతం తోడవ్వడంతో ఈ పాట అతి తక్కువ సమయంలోనే లక్షలాది మందిని ఆకర్షించింది. తాజాగా ఈ పాట యూట్యూబ్లో 150 మిలియన్ల వ్యూస్, 1.2 మిలియన్ల లైకులను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అతి తక్కువ సమయంలోనే తమ సినిమా పాటకు 150 మిలియన్ల వ్యూస్ రావడం పట్ల ‘లవ్స్టోరీ’ యూనిట్ హర్షం వ్యక్తం చేస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన చిత్రం "లవ్స్టోరీ". రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. పవన్ సీహెచ్ సంగీతం అందించారు. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించారు. -
‘సారంగ దరియా’ సాంగ్ తెలుగు లిరిక్స్.. మీ కోసం
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్స్టోరీ’. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటిగా ఈ మూవీలోని ‘నీ చిత్రం చూసి’ అనే పాటను విడుదల చేశారు. ఆ పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటీవల మరో పాట ‘సారంగ దరియా’ను చిత్రం బృందం విడుదల చేయగా.. ఆ పాట యూట్యూబ్ను షేక్ చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రేక్షకుల మదిలో మారుమోగుతున్న ‘సారంగ దరియా’ పాట లిరిక్స్ మీ కోసం.. పల్లవి: దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా.. దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా చరణం: కాళ్ళకు ఎండీ గజ్జెల్.. లేకున్నా నడిస్తే ఘల్ ఘల్.. కొప్పులో మల్లే దండల్.. లేకున్నా చెక్కిలి గిల్ గిల్.. నవ్వుల లేవుర ముత్యాల్.. అది నవ్వితే వస్తాయ్ మురిపాల్.. నోట్లో సున్నం కాసుల్.. లేకున్నా తమల పాకుల్.. మునిపంటితో మునిపంటితో.. మునిపంటితో నొక్కితే పెదవుల్.. ఎర్రగా అయితదిర మన దిల్ చురియా చురియా చురియా.. అది సుర్మా పెట్టిన చురియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా !! దాని కుడీ భుజం!! చరణం: రంగేలేని నా అంగీ.. జడ తాకితే అయితది నల్లంగి మాటల ఘాటు లవంగి.. మర్లపడితే అది శివంగి తీగలు లేని సారంగి.. వాయించబోతే అది ఫిరంగి గుడియా గుడియా గుడియా.. అది చిక్కీ చిక్కని చిడియా.. అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా.. దాని సెంపలు ఎన్నెల కురియా.. దాని సెవులకు దుద్దులు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా దాని నడుం ముడతలే మెరియా.. పడిపోతది మొగోళ్ళ దునియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా.. దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా చిత్రం : లవ్ స్టోరీ సంగీతం : పవన్ సీహెచ్ రచన: సుద్దాల అశోక్ తేజ గానం : మంగ్లీ -
చై, సాయి పల్లవి ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్: 'లవ్స్టోరీ' వాయిదా
లవ్స్టోరీ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావడం లేదంలూ ఆ మధ్య వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై చిత్రబృందం స్పందిస్తూ.. ఈ సినిమా విడుదల విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని, ముందుగా చెప్పిన డేట్కే రిలీజ్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ ప్రేమకథ త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుందని చై, సాయిపల్లవి అభిమానులు తెగ సంతోషపడిపోయారు. కానీ అంతలోనే చిత్రయూనిట్ ప్లేటు ఫిరాయించింది. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని లవ్స్టోరీ రిలీజ్ను వాయిదా వేస్తున్నట్లు గురువారంనాటి మీడియా సమావేశంలో ప్రకటించింది. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. Safety first! Keeping the increase of COVID cases in mind team #LoveStory gives an official announcement of postponing the release of the film. New release date to be announced soon.https://t.co/tfk6Vwhbku@chay_akkineni @sai_pallavi92 @sekharkammula @SVCLLP #AmigosCreations pic.twitter.com/FDFfIsrOov — GSK Media (@GskMedia_PR) April 8, 2021 శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందిన చిత్రం "లవ్స్టోరీ". రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రలు పోషించారు. పవన్ సీహెచ్ సంగీతం అందించారు. కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించారు. చదవండి: సింగర్ కోమలిపై ఫైర్ అవుతున్న నెటిజన్లు -
సారంగదరియా వివాదం.. శేఖర్ కమ్ముల భావోద్వేగం..
క్లాసిక్ చిత్రాలతో హిట్ కొట్టే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఎలాంటి కమర్షయల్ ఎలిమెంట్స్ లేకున్నా విజయవంతమైన సినిమాలు తీయడంలో ఆయనది ప్రత్యేక స్టైల్. ఆయన రూపొందించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ట్రైలర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్న శేఖర్ కమ్ముల తాను డైరెక్ట్ చేసిన సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటగా ఫిదా మూవీని మహేశ్బాబు, రామ్చరణ్లకు చెప్పానని, వాళ్లు ఆ కథను రిజెక్ట్ చేశారని దీంతో ఆ ప్రాజెక్ట్ వరుణ్తేజ్ దగ్గరకు వెళ్లిందని పేర్కొన్నారు. ఇక తన ఫస్ట్ మూవీ ఆనంద్ తనకు ఎంతో స్పెషల్ అని, ఈ సినిమా చిరంజీవి నటించిన 'శంకర్ దాదా' ఒకే రోజు రిలీజ్ అయ్యాయని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా రిలీజైన వారం తర్వాత పలువురు పొగడ్తలతో ముంచేశారని, ఆ సినిమా సూపర్హిట్ అవుతుందనే నమ్మకం తనకు ముందు నుంచీ ఉందని పేర్కొన్నాడు. ఇక లవ్స్టోరి సినిమాలోని సారంగదరియా వివాదంపై స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: చిత్రం సీక్వెల్.. మరో ఉదయ్కిరణ్ దొరికేశాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్, ఆ వార్తల్లో నిజం లేదు -
మరోసారి ‘సారంగ దరియా’ వివాదం..
లవ్స్టారీ సినిమాలోని ‘సారంగ దరియా’ పాట గత కొన్ని రోజులుగా యూట్యూబ్ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. "దాని కుడి భుజం మీద కడువా... దాని కుత్తెపు రైకలు మెరియా.." అంటూ సాగే ఈ పాట అంతలా మార్మోగిపోతోందీ. యూట్యూబ్లో విడుదలైన కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించి అన్ని రికార్డులు సృష్టించింది. సింగర్ మంగ్లీ పాడిన ఈ పాటలోని మాస్ బీట్, సాయి పల్లవి ఎనర్జిటిక్ డాన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ప్రేక్షకులు సైతం ఈ పాటకు స్టెప్పులేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.అయితే 'సారంగ దరియా..' ఎంత పెద్ద హిట్ అయ్యిందో అదే స్థాయిలో వివాదమూ చుట్టుముట్టింది. పల్లెల్లో ఉన్న ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది తానేనంటూ గాయని కోమలి పేర్కొన్న సంగతి తెలిసిందే. పిలిచిన ప్రతీ చానెల్ వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఓ బుల్లితెర నిర్వహించిన షోలో కోమలి మరోసారి సారంగదరియా పాటను ఆలపించింది. 'లవ్ స్టోరీ' సినిమాలో తన పాట పెట్టుకున్నందుకే హిట్ అయ్యిందని పేర్కొంది. తాజాగా దీనికి సంబంధించిన ఫ్రోమోను విడుదల చేశారు. ఇది చూసిన నెటిజన్లు కోమలిపై దుమ్మెత్తిపోస్తున్నారు. సారంగ దరియా పాటకు న్యాయం చేసింది సింగర్ మంగ్లీ అని, తన వల్లే పాట హిట్ అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు. మంగ్లీ ఈ పాటకు జీవం పోసింది కాబట్టే సారంగ దరియా అంత సక్సెస్ అయ్యిందని, అసలు మీ వాయిస్ సాయ్ పల్లవికి సూట్ అయ్యేది కాదని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. చదవండి : 'డైరెక్టర్ శేఖర్కమ్ముల న్యాయం చేస్తానని మాటిచ్చారు' సారంగదరియా.. 100 మిలియన్ల వ్యూస్! -
సారంగదరియా.. స్పీడు మామూలుగా లేదయా..
"దాని కుడి భుజం మీద కడువా... దాని కుత్తెపు రైకలు మెరియా.." ఈ పాట జనాలకు ఎంతమేరకు అర్థమవుతుందో తెలీదు కానీ.. ఎవరి నోట విన్నా, ఎవరి ఫోన్ రింగయినా ఇప్పుడు ఇదే పాట. అంతలా మార్మోగిపోతోందీ సాంగ్. అచ్చమైన జానపదాన్ని రంగరించి పోసినట్లున్న దీన్ని అక్కున చేర్చుకున్నారు తెలుగు ప్రజలు. అందుకే ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా ప్రజలు దీన్ని అమితంగా ఆదరించారు. ఈ నేపథ్యంలో సారంగదరియా పాట తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. యూట్యూబ్లో విడుదలైన కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. ఓ తెలుగు పాట ఇంత త్వరగా ఈ రికార్డును సాధించడం చాలా అరుదైన విషయమని చెప్తున్నారు సినీపండితులు. ఇక ఈ సాంగ్ కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు సాధించి అల వైకుంఠపురములో చిత్రంలోని బుట్టబొమ్మ, రాములో రాములా పాటల పేరిట ఉన్న రికార్డులను తిరగరాసింది. పవన్ సీహెచ్ సంగీతానికి తోడు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం మంగ్లీ మధుర గానంతో 'సారంగదరియా..' అద్భుత హిట్గా నిలిచింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఫిదా భామ సాయి పల్లవి ఓ రకంగా నెమలి నాట్యం చేసిందని చెప్పవచ్చు. మొత్తానికి లవ్ స్టోరీ సినిమాకు ఈ సాంగ్ బాగానే ప్లస్ అవుతోంది. మరి ఏప్రిల్ 16న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరిస్తారో చూడాలి! చదవండి: సారంగదరియా.. ఇప్పట్లో ఆగేట్లు లేదయా.. -
ఈ సారి సాయి పల్లవి కాదు మంగ్లీ స్టెప్పులేసింది!
సాయి పల్లవి ఆట పాట అంటే ఏ రేంజ్లో ఉంటుందో 'సారంగదరియా' సాంగ్ ద్వారా మరోసారి రుజువైంది. విడుదలైన మరుక్షణం నుంచే ఈ పాట యూట్యూబ్ని షేక్ చేస్తూ, మునుపటి రికార్డులను తిరగ రాస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. సింగర్ మంగ్లీ పాడిన ఈ పాటలోని మాస్ బీట్, సాయి పల్లవి ఎనర్జిటిక్ డాన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రేక్షకులు కూడా ఈ పాటకు స్టెప్పులేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మంగ్లీ కూడా 'సారంగదరియా' పాటకు స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది కాస్తా వైరల్ అవుతోంది.. మంగ్లీ ఎంత హుషారుగా పాట పాడిందో అంతే హుషారుగా స్టెప్పులేసింది. సాయి పల్లవి వేసిన స్టెప్పులతో ఆకట్టుకుంటూ ఆమెను రీప్లేస్ చేసింది. దీంతో ఈ వీడియో చూసిన వారు.. 'మీరు పాడిన పాటకి మీరే డ్యాన్స్ చేయడం.. పాటకు ఇంకా కొత్తదనం వచ్చినట్టుంది' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలల్లో లైక్లు, కామెంట్లు వస్తున్నాయి. కాగా 'లవ్ స్టోరీ' సినిమాలోని 'సారంగదరియా' సాంగ్ బయటకు వచ్చినప్పటి నుంచి దాని చుట్టూ వివాదం అలుముకున్న సంగతి తెలిసిందే. ఇది తన పాటు అంటూ కోమలి అనే మహిళ మీడియా ముందుకు రావడం తర్వాత అదే విషయాన్ని చిత్ర దర్శకుడు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. ఏదేమైనా ఈ పాట మాత్రం నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రాబోతున్న 'లవ్ స్టోరీ' మూవీకి కావాల్సినంత పబ్లిసిటీని క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి. ( చదవండి : ఆ క్రెడిట్.. డబ్బులు కోమలికే! ) -
గుడిలో ‘సారంగదారియా’.. టిక్టాక్ స్టార్ డ్యాన్స్పై ట్రోలింగ్
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది తమ టాలెంట్ని ప్రపంచానికి చూపిస్తున్నారు. లైకులు, షేర్లు, కామెంట్లు పెట్టి టాలెంట్ని ఉన్నవారిని ఎంకరేజ్ చేయడంతో పాటు సెలబ్రిటీని చేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా టిక్టాక్ యాప్ ద్వారా చాలా మంది తమలో దాగిఉన్న నటనను, డాన్స్ను ప్రపంచానికి తెలియజేశారు. భారత్లో ఈ యాప్ బ్యాన్ కావడంతో యూట్యూబ్, ఇన్స్ట్రాగ్రామ్ వైపుకు మళ్లీ.. తమ ప్రతిభతో అభిమానుల మన్ననలు పొందుతున్నారు. అయితే టాలెంట్ని ఎంకరేజ్ చేసే ఈ అభిమానులే.. తేడా వస్తే ట్రోల్స్తో విరుచుకుపడతారు. ఈ విషయం సినీప్రముఖులకు బాగా తెలుసు. అందుకే కొంచెం పేరున్న సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉంటారు. తాజాగా ఓ టిక్టాక్ స్టార్కు కూడా ఇదే ఎదురైంది. తన డాన్స్తో లక్షలాధి అభిమానులను సంపాదించుకున్న దీపికా పిల్లి అనే టిక్టాక్ స్టార్.. అదే డాన్స్ వల్ల తాజాగా ట్రోలింగ్కి గురైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్స్టోరీ’ సినిమా నుంచి సారంగదారియా అనే పాట విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చాలామంది ఈ పాటకు తమదైన స్లైల్లో స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీపికా పిల్లి కూడా ఇలా డ్యాన్స్ చేసి తన ఇన్స్ట్రాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఆ పాటకు ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేసినప్పటికీ.. నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. దానికి కారణం ఆమె డాన్స్ చేసింది గుడిలో.ఇలాంటి పాటకు గుడిలో డ్యాన్స్ చేయడం ఏంటని కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే చాలామంది నెటిజన్లు మాత్రం దీపికా డ్యాన్స్ను మెచ్చుకుంటున్నారు. సాయిపల్లవి కంటే అద్భుతంగా చేసిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ డ్యాన్సింగ్ అంటు కామెంట్లు పెడుతున్నారు.దీపికా ప్రస్తుతం ఓ టీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ షోకు యాంకర్ గా చేస్తుంది. View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) -
ఇప్పుడు నాకే అభ్యంతరం లేదు : గాయని కోమలి
నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరి’. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ‘సారంగ దరియా’ పాట యూట్యూబ్లో దుమ్ము రేపుతోంది. అతి తక్కువ సమయంలో యూట్యూబ్లో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన తొలి తెలుగు పాటగా నిలిచింది. మరోవైపు దీనిపై వివాదం కూడా అదే స్థాయిలో నెలకొంది. పల్లెల్లో ఉన్న ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది తానేనంటూ గాయని కోమలి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ పాటను తనతోనే పాడిస్తానని మాటిచ్చి, మోసం చేశారని తన బాధను చెప్పుకుంది. తాజాగా ఈ విషయంపై చర్చించేందుకు గాయని కోమలి..శేఖర్కమ్ములను కలిసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..'సారంగ దరియా పాట విషయంపై ఇకపై తనకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ సినిమాలో అవకాశం ఉంటే నాతో తప్పకుండా పాట పాడిస్తానని మాటిచ్చారు. అంతేకాకుండా ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలోనూ స్టేజీ మీద సారంగ దరియా పాటను నాతోనే పాడిస్తానన్నారు' అని సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు డైరెక్టర్ శేఖర్కమ్ముల సైతం ఈ విషయాన్ని అంగీకరించారు. భవిష్యత్లో తన సినిమాలో జానపద పాట పాడించే అవకాశం వస్తే తప్పకుండా కోమలికి అవకాశం ఇస్తానని తెలిపారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి : ('సారంగదరియా నా పాట, కానీ నాతో పాడించలేదు') (సాయి పల్లవి దెబ్బకు ‘బుట్ట బొమ్మ’ ఔట్!) -
సాయి పల్లవి దెబ్బకు ‘బుట్ట బొమ్మ’ ఔట్!
నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ప్రేమ కావ్యం ‘లవ్ స్టోరి’. ఈ మూవీ విడుదలకు ముందే మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఈ మూవీ విడుదలైన ‘సారంగ దరియా’ అనే పాట యూట్యూబ్ సెన్సెషనల్ అవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాట కొత్త రికార్డును సొంతంగా చేసుకుంది. అతి తక్కువ సమయంలో యూట్యూబ్లో 50 మిలియన్ వ్యూస్ రాబట్టుకుని తొలి తెలుగు పాటగా నిలిచింది. సమంత చేతుల మీదుగా ఫిబ్రవరి 28న విడుదలైన ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ మార్క్ను చేరుకుంది. ఇక ఇటీవల యూట్యూబ్లో వరుసగా రికార్డుల కొల్లగొడుతున్న ‘అలా వైకుంఠపురంలో’ మూవీలోని సూపర్ హిట్ ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాములా’ పాటలు ‘సారంగ దరియా’ తరవాత ఉన్నాయి. ‘బుట్ట బొమ్మ’ పాటకు 50 మిలియన్ వ్యూస్ వచ్చేందుకు 18 రోజులు పట్టగా, ‘రాములో రాములా’ పాటకు 27 రోజులు పట్టింది. అయితే గతంలో ధనుష్తో కలిసి సాయి పల్లవి చేసిన ‘రౌడీ బేబీ’ సాంగ్ మాత్రం 8 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్కు రీచ్ అయి ‘సారంగ దరియా’ కంటే ముందుంది. సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించిన ‘సారంగ దరియా’ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. గాయని మంగ్లీ ఆలపించిన ఈ పాటకు పవన్ సీహెచ్ సంగీతం అందించడంతో సారంగ దరియా అద్భుతమైన తెలంగాణ జానపదం గీతంగా కుదిరింది. కాగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావులు నిర్మాలుగా వ్యవహిరిస్తున్నారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఏప్రీల్ 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: సారంగదరియా.. ఇప్పట్లో ఆగేట్లు లేదయా.. లోదుస్తుల్లో బిగ్బాస్ భామ.. అక్కడ చేతులు వేసిన కుర్రాడు ఆసక్తికర విషయాలు వెల్లడించిన పవన్ స్టైలిష్ట్ -
సారంగదరియా.. ఇప్పట్లో ఆగేట్లు లేదయా..
జానపదానికి మెరుగులు అద్ది అందించిన పాట 'సారంగదరియా..'. సుద్దాల అశోక్ తేజ కలం నుంచి జాలువారిన చరణాలను మంగ్లీ తన గాత్రంతో మరింత మనోహరంగా మలిచింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో అదిరేటి స్టెప్పులేసిన సాయి పల్లవి ఓరకంగా నెమలి నాట్యాన్ని ప్రేక్షకులకు చూపించింది. ఓ పక్క ఈ పాటను వివాదాలు చుట్టుముట్టినప్పటికీ జనాలు మాత్రం దానికి అడిక్ట్ అయిపోయారు. ఇక రెండు వారాల కిందట రిలీజైన ఈ సాంగ్ యూట్యూబ్లో 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అక్కినేని సమంత చేతుల మీదుగా ఫిబ్రవరి 28న విడుదలైన ఈ పాట కేవలం 14 రోజుల్లోనే 50 మిలియన్ల వీక్షణలు దాటి 'అల వైకుంఠపురం' పేరిట ఉన్న పాటల రికార్డును తిరగరాసింది. 50 మిలియన్ల వ్యూస్ మార్క్ను చేరుకునేందుకు 'బుట్ట బొమ్మ..' పాటకు 18 రోజులు పట్టగా రాములో రాములా పాటకు 27 రోజులు పట్టింది. కానీ 'సారంగదరియా..' మాత్రం జస్ట్ 14 రోజుల్లోనే ఆ రికార్డును అందుకోవడం విశేషం. కాగా నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రమే ‘లవ్ స్టోరి’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై కె. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి.కుమార్, సహ నిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వరరావు. చదవండి: సాయి పల్లవి ‘సారంగ దరియా’వచ్చేసింది -
సారంగదరియా నాతో పాడించలేదు: కోమలి భావోద్వేగం
ప్రేక్షకుల టేస్ట్ మారింది. సినిమాలోని మాస్ సాంగ్స్ కన్నా యూట్యూబ్లో వచ్చే జానపదాలకే జై కొడుతున్నారు. ఫలితంగా లక్షలాది వ్యూస్తో జానపద పాటలు మరోసారి ప్రాణం పోసుకుంటున్నాయి. దీంతో వీటికి సినిమాల్లోనూ స్థానం కల్పిస్తున్నారు. అయితే మొదట పాడినవాళ్ల దగ్గర నుంచి అనుమతి తీసుకోవడమే కాక వారికి క్రెడిట్స్ ఇవ్వాల్సిందే. లేదంటే చిక్కులు తప్పవు. తాజాగా లవ్ స్టోరీ సినిమాలో సూపర్ డూపర్ హిట్టైన 'సారంగ దరియా..' పాట మీద కూడా ఇలాంటి వివాదమే మొదలైంది. పల్లెల్లో ఉన్న ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది తానేనంటూ మీడియా ముందుకొచ్చింది కోమలి. అమ్మమ్మ దగ్గర నుంచి ఈ పాట నేర్చుకున్నాని, కానీ ప్రజలకు చేరువ చేసింది తాను కాబట్టి ఈ సాంగ్ తన సొంతమని చెప్తోంది. "రేలారే రేలా ప్రోగ్రాం సమయంలో సుద్దాల అశోక్తేజ నా పాట విన్నారు. లవ్ స్టోరీలో ఈ పాటను వాడుకున్నారని తెలియగానే అశోక్ తేజకు ఫోన్ చేశాను. ఇది ఎవరి సొంతం కాదు, నువ్వు పుట్టకముందే ఈ పాట నా దగ్గరుంది అని చెప్పాడు. కానీ ఈ పాటను ఆయన ఎప్పుడూ వెలుగులోకి తీసుకురాలేదు. సినిమాలో ఈ పాట నాతో పాడించనందుకు బాధేసింది. నా బాధను చూసి నాకు నెక్స్ట్ సినిమాలో అవకాశం ఇస్తానని శేఖర్ కమ్ముల హామీ ఇచ్చారు. కానీ సారంగరదరియా నాతో ఎందుకు పాడించలేదు? ఎందుకు అవకాశమివ్వలేదు? ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు అనేదే నా బాధ" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కాగా ఈ పాట సేకరించింది కోమలి అని సుద్దాల అశోక్ తేజ సైతం అంగీకరించాడు. చదవండి: తస్సాదియ్యా! నాగచైతన్య సినిమాకు అంత బిజినెస్సా? -
తస్సాదియ్యా! నాగచైతన్య సినిమాకు అంత బిజినెస్సా?
సాయిపల్లవి.. ఈ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే పాట 'వచ్చిండే, మెల్ల మెల్లగ వచ్చిండే..' కానీ 'లవ్ స్టోరీ' సినిమా పుణ్యాన ఇప్పుడామె పేరు చెప్తే చాలు 'దాని పేరే సారంగదరియా..' అంటూ ఫోక్ సాంగ్ను గుర్తు చేసుకుంటూ స్టెప్పులేస్తున్నారు. ఆ జానపద పాట, అందులో సాయిపల్లవి డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ ఎన్నిసార్లు చూసినా మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోందని అభిమానులు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. పాటే ఇంత బాగుంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందోనని సినిమా రిలీజ్ అయ్యే ఏప్రిల్ 16 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 'ఫిదా' వంటి బ్లాక్బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఈ 'లవ్ స్టోరీ' మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఆంధ్రా హక్కులు రూ.15 కోట్లకు అమ్ముడుపోగా ఓవర్సీస్ హక్కులు రూ.6 కోట్లకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది. నైజామ్లో కూడా మంచి ధర పలికేది కానీ ఇక్కడ ఆసియన్ మూవీస్ సొంతంగా రిలీజ్ చేస్తుందట. మొత్తంగా ఈ సినిమా అప్పుడే 50 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇవి కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాగా, ఇవి కాకుండా నాన్ థియేటర్ హక్కులు ఉండనే ఉన్నాయి. మరి ఓవరాల్గా ఈ సినిమా ఎంత మార్కెటింగ్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. చదవండి: సాయి పల్లవి ‘సారంగ దరియా’వచ్చేసింది -
అతిథులు వీళ్లేనా బాస్?
బిగ్బాస్ సీజన్ 4 ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. రేపే గ్రాండ్ ఫినాలే. విజేత ఎవరో ప్రకటించే రోజు. ప్రతీ సీజన్ ఫైనల్ ఎపిసోడ్కి హోస్ట్తో పాటు ఎవరో ఒక సెలబ్రిటీ గెస్ట్గా వస్తుంటారు. సీజన్ 3 ఫైనల్కి నాగార్జునతో కలసి చిరంజీవి సందడి చేశారు. ఈసారి నాగార్జునతో పాటు ఫైనల్లో సందడి చేయడానికి ‘లవ్స్టోరీ’ జంట రాబోతున్నారని తెలిసింది. నాగచైతన్య, సాయి పల్లవి ఈ సీజన్ ముఖ్య అతిథులుగా ఫైనల్ ఎపిసోడ్లో పాల్గొంటారట. ‘లవ్స్టోరీ’ సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరే కాకుండా పలువురు హీరోయిన్లు కూడా కనిపిస్తారట. లక్ష్మీ రాయ్, మెహరీన్లతో పాటు ఇంకొంతమంది హీరోయిన్ల స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఉంటుందని తెలిసింది. ∙ -
బర్త్డే స్పెషల్ : నాగ చైతన్య న్యూ లుక్
సాక్షి, హైదరాబాద్: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పల్లెటూరి గెటప్లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. చేతూ పుట్టిన రోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ''లవ్ స్టోరి'' స్పెషల్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లుంగీ, బనియన్తో పల్లెటూరి యువకుడి పాత్రలో నాగ చైతన్య లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కొందరితో స్నేహాలు చాలా బావుంటాయి. చైతూతో అసోసియేషన్ అలాంటిదే.. థ్యాంక్యూ.. హ్యాపీ బర్త్ డే చైతన్య'' అంటూ 'లవ్ స్టోరి'' చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల చేకు శుభాకాంక్షలు తెలిపారు. నాగ చైతన్యకు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు నాగ చైతన్య తన శ్రీమతి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేనితో కలిసి మాల్దీవుల్లో విహారయాత్రలో ఉన్నారు. అయితే తన హబ్బీ పుట్టినరోజు సందర్భంగా, సమంతా బీచ్లో ఎంజాయ్ చేస్తున్న అద్భుతమైన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అంతకుముందు స్కూబా డైవింగ్ కోసం సిద్ధమవుతున్న ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. Some associations are meant to be cherished ...... Thank you .. Happy Birthday Chaitanya ...#HBDNagaChaitanya @chay_akkineni#lovestory #nagachaitanya #saipallavi pic.twitter.com/bfJYFXn4PR — Sekhar Kammula (@sekharkammula) November 23, 2020 . View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) -
ఆర్మూర్లో ‘లవ్స్టోరీ’ చిత్రీకరణ
సాక్షి, నిజామాబాద్ : నాగచైతన్య సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘లవ్స్టోరీ’. షూటింగ్ తిరిగి ప్రారంభం అయిన నేపథ్యంలో నిజామాబాద్లోని ఆర్మూర్లో చిత్ర యూనిట్ సందడి చేసింది. నాగచైతన్య, సాయిపల్లవికి సంబంధించి కొన్ని సన్నివేశాలను ఆర్మూర్లోని నవసిద్ధుల గుట్ట వద్ద చిత్రీకరించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తెలంగాణ యాసలో సంభాషణలు పలకనున్నారు. ఇది వరకే ఫిదా సినిమాలో తెలంగాణ యూసతో సాయిపల్లవి ఆకట్టుకుంది. కరోనా బ్రేక్ తర్వాత ఇటీవలే చిత్రీకరణ తిరిగి ప్రారంభం అయ్యింది. షూటింగ్ కూడా దాదాపు పూర్తయినట్లు సమాచారం. నారాయణ్ దాస్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పవన్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. (బోడకొండలో 'లవ్స్టోరీ' సందడి ) -
బోడకొండలో 'లవ్స్టోరీ' సందడి
-
వైరలవుతున్న సాయి పల్లవి వీడియో
సాక్షి, రంగారెడ్డి : చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ దర్శకుడు శేఖర్కమ్ముల దర్శకత్వంలో ‘లవ్స్టోరీ’ సినిమా సన్నివేశాలు బోడకొండ వాటర్ పాల్స్ వద్ద శనివారం చిత్రీకరించారు. వాటర్ ఫాల్స్లో నాగ చైతన్య – సాయి పల్లవీ ఆడుతున్నట్లు సన్నివేశాలను, అలాగే గుట్టల్లో వారు బైక్పై విహరిస్తున్నట్లు చిత్రీకరించారు. ఈ లవ్ స్టోరీ సినిమాలో ప్రాధానమైన ప్రేమకు సంబంధించి సన్నివేశాలు ఇక్కడే తీశారు. ఈ సినిమా షూటింగ్తో బోడకొండ– చెన్నారెడ్డి గూడ మధ్య ఉన్న గుట్టలు జనసందడిగా మారాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. -
కొరియోగ్రాఫర్ అవతారం ఎత్తనున్న హీరోయిన్?!
సాయి పల్లవి పేరు వినగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది ఆమె డ్యాన్స్. 'ఫిదా'తో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న సాయి పల్లవి డ్యాన్స్ పరంగా తనకు పోటీ వచ్చే హీరోయిన్స్ లేరని నిరూపించుకున్నారు. ఇప్పటికే సాయి పల్లవి ‘రౌడీ బేబి’, ‘పిల్లా రేణుకా’ పాటలకు ఎంత ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఆమెకు ఓ కొత్త బాధ్యత అప్పగించారట. ఎలాంటి డాన్స్ అయినా అలవోకగా చేయగలిగే సత్తా సాయి పల్లవిది. ఆ నమ్మకం తోనే 'లవ్ స్టోరీ'లో ఓ పాట కొరియోగ్రఫీ బాధ్యతలను ఆమె భుజాలపై వేశారట. ఇప్పటికే 90శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘లవ్ స్టోరీ’ సినిమాకు సంబంధించి మరో రెండు వారాల షూటింగ్ పెండింగ్లో ఉంది. ఈ షెడ్యూల్లో ఓ పాటను కూడా చిత్రీకరించాల్సి ఉన్నట్లు సమాచారం. ఇదే పాటకు సాయి పల్లవిని కొరియోగ్రఫీ చేయమని కోరారంట శేఖర్ కమ్ముల. మరికొద్ది రోజుల్లో రామోజీ ఫిలిం సిటీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ కుర్రాడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. -
అమరవీరుల స్థూపం వద్ద సాయిపల్లవి
సాక్షి, హైదరాబాద్ : హీరోయిన్స్లో ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. తన అందమైన నటనకు ఆకర్షించబడని ప్రేక్షకులుండరు. భానుమతిగా ఫిదాతో పరిచయం అయిన సాయి పల్లవి తన సినిమాలలో తన ప్రత్యేకతను చాటుకుంటూ కెరియర్ ని లీడ్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ నాగచైనత్య ‘లవ్ స్టోరీ’, రానా ‘విరాట పర్వం’ సినిమాలో టిస్తోంది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రెండు చిత్రాల యూనిట్ సభ్యులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ స్పెషల్ పోస్టర్లను విడుదల చేశారు. (చదవండి : మే 9.. సినీ అభిమానులకు పండగ రోజు) నక్సలైట్గా సాయిపల్లవి..! వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయి పల్లవి హీరో హిరోయిన్లుగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. 1980 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ మూవీ ఇది. ఇందులో రానా పోలీసాఫీసర్గా కనిపిస్తారు. సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా టీం విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో సాయిపల్లవి నక్సలైట్గా లేదా ఓ పాత్రికేయురాలి పాత్రలో నటించినట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. అందుకు తగినట్టుగానే ఆమె విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు .. లగేజ్ తో అమరవీరుల స్థూపం దగ్గర ఎదురు చూస్తూ కూర్చుంది. ‘అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్తూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది?ఎవరి కోసం ఆమె నిరీక్షణ ?ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్నఅక్షరాలేమిటి?ఆమె పక్కనున్న బ్యాగ్ లో ఉన్నవేమిటి?ఈ ప్రశ్నలకు జవాబులు విడుదల తర్వాతే’అని డైరెక్టర్ వేణు విశ్లేశించిన తీరు ఆకట్టుకుంటుంది. (చదవండి: ‘ఆకాశవాణి’ నుంచి జక్కన్న తనయుడు ఔట్?) వర్షంలో ఆడుతున్న సాయిపల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరోసారి మ్యాజిక్ చేసేందుకు లవ్ స్టోరీ తో సిద్దం అవుతుంది సాయిపల్లవి. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ క్రేజ్ లవ్ స్టోరీ పై అంచనాలను మరింత పెంచింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ‘‘ఏయ్ పిల్లా’’ సాంగ్ కు విశేషమైన స్పందన లభించింది. లవ్ స్టోరీ కి ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. లాక్ డౌన్ తర్వాత అప్పటి పరిస్థితుల్ని బేరీజు వేసుకొని షూటింగ్ ప్లాన్ చేస్తుంది యూనిట్. శేఖర్ కమ్ముల సినిమాలలో కథానాయికలు ఎంత హుందాగా ఉంటారో అందరికీ తెలిసిందే.. భావోద్వేగాలతో నిండుకున్న ప్రేమకథలతో సెల్యులాయిడ్ పై శేఖర్ చేసే మ్యాజిక్ ని మరోసారి రిపీట్ అయ్యేటట్టు కనిపిస్తోంది.హీరోయిన్ సాయిపల్లవి బర్త్ డే సందర్భంగా టీం విడుదల చేసిన పోస్టర్ లో సాయి పల్లవి మరింత అందంగా కనిపించింది. వర్షంలో ఆడుతున్న సాయి పల్లవి స్టిల్ కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తుంది.‘‘లవ్ స్టోరీ’’ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_541241401.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘వి’ డైరెక్టర్తో చైతూ చిత్రం?
నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా మోహన్కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ‘వి’చిత్రం విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత డైరెక్టర్ మరో సినిమాను ప్రకటించలేదు. అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా గురించి అప్డేట్ వస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విభిన్న చిత్రాల డైరెక్టర్ తన తదుపరి చిత్రం అక్కినేని నాగ చైతన్యతో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. వాస్తవానికి నాగచైతన్యతో సినిమా తీయాలని మోహన్కృష్ణ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారని టాలీవుడ్ టాక్. అయితే ఈమధ్య చైతూకు కథ చెప్పగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వకంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంతో నాగచైతన్య బిజీగా ఉన్నారు. సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్న విషయం తెలిసిందే. అన్నీ కుదరితే ‘లవ్ స్టోరీ’ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కె అవకాశం ఉంది. ఇక తన ప్రతీ సినిమాలో హీరోయిజాన్ని కొత్తగా చూపించే ఈ డైరెక్టర్ చైతూను ఎలా చూపిస్తాడో వేచి చూడాల్సిందే. చదవండి: ‘మా కోసం గడపదాటి వచ్చావయ్యా!’ క్రికెటర్ టు స్టూడెంట్! -
‘ఏయ్ పిల్లా..’ వచ్చేస్తుంది
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్ దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘లవ్స్టోరీ’. హోలీ సందర్భంగా ఈ చిత్రం కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఈ చిత్రంలోని ‘ఏయ్ పిల్లా..’ అంటూ సాగే మొదటి పాట పూర్తి లిరికల్ వీడియోను నేడు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. హోలీ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్కి మంచి స్పందన వస్తోంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయనున్నాం’’ అన్నారు. ఈ సినిమాకి సహ నిర్మాత : భాస్కర్ కటకంశెట్టి, సంగీతం: పవన్ సి.హెచ్. -
దుబాయ్ ప్రయాణం
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘లవ్స్టోరీ’. నారాయణ్ దాస్, పి. రామ్మోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ దుబాయ్లో జరగనుంది. ఈ నెల 21 నుంచి నెలాఖరు వరకూ దుబాయ్లో చిత్రీకరణ జరుపుతారు. ఈ షెడ్యూల్లో ఓ పాటను, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట చిత్రబృందం. ఈ సినిమాలో తెలంగాణ కుర్రాడి పాత్రలో కనిపించనున్నారు నాగచైతన్య. వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాకి సంగీతం: పవన్, కెమెరా: విజయ్ సి.కుమార్. -
‘లవ్స్టోరీ’ సినిమా స్టిల్స్
-
ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్స్టోరి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టైటిల్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘ఏయ్ పిల్లా..’ అంటూ సాగే పాట ప్రివ్యూను విడుదల చేశారు. ఇందులో నాగచైతన్యకు ముద్దు పెట్టిన అనంతరం ‘ఏంది ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..’అని సాయిపల్లవి చెప్పే డైలాగ్ హైలెట్గా నిలిచింది. అలాగే నాగచైతన్య, సాయిపల్లవిల మధ్య వచ్చే కొన్ని సీన్లను ఈ మ్యూజికల్ ప్రివ్యూలో ప్రధానంగా చూపెట్టారు. సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్న పవన్ సీహెచ్ మంచి పాటను అందించినట్టుగా అర్థమవుతోంది. కాగా, ఈ చిత్రాన్ని ఎమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ చిత్రం.. వేసవిలో విడుదల కానుంది. -
చైతూ-సాయిపల్లవిల ‘లవ్ స్టోరి’
‘ఫిదా’సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఓ క్రేజీ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ‘వెంకీ మామ’తో హిట్ అందుకున్న నాగచైతన్య, ‘ఫిదా’తో అందరి మనసులను దోచుకున్న సాయి పల్లవిలు ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలై చేసిన నాగచైతన్య ఫస్ట్ లుక్కు విశేష స్పందన వస్తోంది. పక్కా శేఖర్ కమ్ముల స్టైల్లో రూపొందుకుంటున్న ఈ చిత్రంపై టాలీవుడ్ భారీగానే అంచనాలు పెట్టుకున్నాయి. తాజాగా సంక్రాంతి కానుకగా శేఖర్ కమ్ముల టీం సినీ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటిస్తూ.. దానికి సంబంధించిన పోస్ట్ర్ను విడుదల చేసింది. అందరూ భావించినట్టే ఈ చిత్రానికి ‘లవ్ స్టోరి’అనే టైటిల్నే చిత్ర బృందం ఖరారు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. పక్కా ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నారాయణ్దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే సమ్మర్లో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. There isn’t a better title to reflect the essence of this movie! #LoveStory it is❤️@sekharkammula @Sai_Pallavi92 #SreeVenkateswaraCinemasLLP #AmigosCreations @adityamusic#NC19 pic.twitter.com/oZAypqIlpZ — chaitanya akkineni (@chay_akkineni) January 14, 2020 -
ప్రేమ, వినోదం కలగలిసిన టైటానిక్
తమిళసినిమా: టైటానిక్ అనగానే హాలీవుడ్ అద్భుత ప్రేమ కధా చిత్రం గుర్తుకొస్తుంది. అయితే అదే టైటిల్తో కోలీవుడ్లో ఒక వినోదభరిత ప్రేమ కథా చిత్రం తెరకెక్కుతండడం విశేషం. ఇంతకు ముందు కొత్త దర్శకులను పరిచయం చేసి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన తిరు కుమరన్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ అధినేత సీవీ.కుమార్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ఇది. దీని ద్వారా ఎం.జానకీరామన్ అనే నూతన దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు బాలా, సుధా కొంగర, బాలాజీ మోహన్ల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారన్నది గమనార్హం. యువ నటుడు కలైయరసన్, కయల్ ఆనంది, ఆస్నాజవేరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో కాళీవెంకట్, జాంగ్రి మధుమిత, రాఘవ్విజయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తి వినోదభరిత చిత్రంగా ఉన్నా, చిత్రం చూసే ప్రేక్షకుడు చిత్రంలోని పలు సన్నివేశాల్లో తమను చూసుకుంటారన్నారు. ఇప్పటి వరకూ కామెడీ కథా చిత్రాల్లో చూడనటువంటి అచ్చెరువు చెందే సంఘటనలను ఈ టైటానిక్ చిత్రంలో చూస్తారన్నారు. ముఖ్యంగా చిత్ర క్లైమాక్స్ సరి కొత్త అనుభూతిని కలిగిస్తుందని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఇందులో నటుడు సేతన్, దేవదర్శిని, సుధ అతిథి పాత్రల్లో మెరుస్తారని చెప్పారు. దీనికి తెగిడి, సేతుపతి చిత్రాల ఫేమ్ నివాస్ కే.ప్రసన్న సంగీతం, బల్లు చాయాగ్రహణను అందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
గొప్పింటి అమ్మాయి పేదింటి అబ్బాయిని ప్రేమిస్తే..
తమిళసినిమా: గొప్పింటి అమ్మాయి పేదింటి అబ్బాయిని ప్రేమిస్తే జరిగే పరిణామాలెలా ఉంటాయన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ఎన్న తవం సెయ్దేనో. ఒక రాజకీయనాయకుడికి తన ఏకైక కూతురు అంటే వల్లమాలిని ప్రేమ. కూతురి కంటతడి పెడితే అతను తల్లడిల్లిపోతాడు. అలాంటి గారాల కూతురు ఒక సైకిల్ బండిలో ఐస్ అమ్ముకునే కుర్రాడిని ప్రేమిస్తే 40 ఏళ్లుగా పెంచుకుంటూ వచ్చిన తన రాజకీయ పరపతి పోగొట్టుకోవడానికి మనస్కరించని తండ్రి ఎంతగానో ప్రేమించే కన్న కూతురినే కడతేర్చడానికి సిద్ధమైతే? ఆ తరువాత జరిగే పరిణామాలెలా ఉంటాయన్నదే ఎన్న తవం సెయ్దేనో చిత్రం అని ఆ చిత్ర దర్శకుడు మురబాసెలన్ తెలిపారు. చిత్రంలో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయని చిత్ర వర్గాలు తెలిపారు. దర్శకుడు పేరరసు శిష్యుడైన ఈయన మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం ఇది. ఇనైంద కైగళ్ పతాకంపై ఎస్.సెంథిల్కుమార్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైందని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. గజనీమురుగన్ హీరోగానూ, విష్ణుప్రియ కథానాయకిగానూ నటించిన ఇందులో ప్రియామీనన్, పవర్స్టార్ శ్రీనివాసన్, సింగంపులి, మయిల్సామి, ఢిల్లీగణేశ్, ఆర్తీగణేశ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఒక ఐటమ్ సాంగ్లో నటి రిషా నటించింది. దీనికి సంగీతాన్ని దేవగురు, నేపథ్య సంగీతాన్ని పి.చంద్రకాంత్, ఛాయాగ్రహణం నౌషాత్ అందించారు. -
ప్రేమ కథా చిత్రంగా కడసీ బెంచ్ కార్తీ
ఈ తరం ప్రేమ గురించి చర్చించే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం కడైసీ బెంచ్ కార్తీ అని చిత్ర దర్శకుడు రవి భార్గవన్ అంటున్నారు.ఇంతకు ముందు వెల్డన్, ఒరు కాదల్ సెయ్వీర్, తిరురంగా చిత్రాలతో పాటు తెలుగులో రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం కడైసీ బెంచ్ కార్తీ. భారతదేశంలోనే కాకుండా ఆసియాలోని దక్షిణ తూర్పు దేశాల్లోనూ వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్న సుధీర్ పూతోట చిత్ర రంగంలోకి ప్రవేశించి రమారీల్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ఇది. భరత్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా పంజాబ్ మ్యూజిక్ ఆల్బం స్టార్ నటి, ప్రముఖ మోడల్ రూహనీవర్ష నాయకిగా పరిచయం అవుతున్నారు. మరో నాయకిగా కంగనారాయ్ నటిస్తున్న ఈ చిత్రంలో రవిమరియ, జ్ఞానసంబంధం, సనా, సురేఖ, వాణి, దర్శకుడు కాళీ, మూనార్ డేవిడ్, మధురై వినోద్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.అన్భు రాజేశ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ స్మార్ట్ ఫోన్ సంస్కృతి ఎక్కువవుతున్న ఈ నాగరిక ప్రపంచంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. అలాంటి ఈ మోడ్రన్ ప్రపంచంలో స్థిరత్వాన్ని కోల్పోతున్న వాటిలో ప్రేమ ఒకటన్నారు. ప్రేమకు నిజమైన నిదర్శనం ఏమిటీ.అసలు ఈ తరం యువతలో ప్రేమపై నమ్మకం ఉందా?లాంటి పలు అంశాలను చర్చించే చిత్రంగా కడైసీ బెంచ్ కార్తీ ఉంటుందని తెలిపారు. -
ఆ ఏడుపు ఎందుకో..?
వెండితెరపై జరుగుతున్నది నిజం కాదు.. కథ అని తెలిసినా బాగా లీనమైపోయి చూస్తుంటాం. తెరపై తారలు ఏడిస్తే.. ఒక్కొసారి మనం కూడా ఏడ్చేస్తాం. ఇటీవల నయనతార కూడా అలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ విషయంలోకి వస్తే... నయనతారకు మంచి మిత్రుడైన ఆర్య తమ్ముడు సత్య హీరోగా రూపొందిన ‘అమరకావ్యం’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అత్యంత సన్నిహితులకు చూపించారు ఆర్య. ఈ చిత్రం చూసిన తర్వాత నయనతార అరగంటసేపు ఆపకుండా కన్నీళ్లు పెట్టుకున్నారని చెన్నయ్ టాక్. ఈ ప్రేమకథా చిత్రం ఆమెను అంతగా కదిలించింది. ఈ చిత్రం తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసిందని, అందుకే నయనతార అంతగా కదిలిపోయిందన్నది పలువురి అభిప్రాయం. ఈ సినిమా చూసిన ఐదు రోజుల తర్వాత చిత్రదర్శకుడు జీవా శంకర్కి ఫోన్ చేసి, చాలా బాగుందని నయనతార అభినందించారట.