Megha Engineering and Infrastructures
-
రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్తో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాల కల్పనకు సంబంధించి మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో జరుగుతున్న సమావేశాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. రూ.11 వేల కోట్లతో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును తెలంగాణలో మేఘా సంస్థ ఏర్పాటు చేయనుంది. తద్వారా నిర్మాణ దశలో వేయి, నిర్వహణ దశలో 250 ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టులనూ ఈ సంస్థ స్థాపిస్తుంది. తద్వారా పునరుత్పాదక ఇంధనం, సుస్థిర అభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానం చేరేందుకు తోడ్పడుతుంది. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక ప్రదేశాల్లో రూ.3 వేల కోట్లతో వేయి మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను స్థాపిస్తుంది. తద్వారా వచ్చే రెండేళ్లలో ప్రత్యక్షంగా వేయి, పరోక్షంగా మూడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసేలా వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూ.వేయికోట్లతో వెల్నెస్ రిసార్ట్ను మేఘా సంస్థ నెలకొల్పుతుంది. తద్వారా నిర్మాణ దశలో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. మేఘాతో ఒప్పందాలపై మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తంచేశారు. ‘స్కై రూట్’ పెట్టుబడులు రూ.500 కోట్లు హైదరాబాద్ను త్వరలోనే ప్రైవేటు రంగంలో అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ప్రైవేటు రంగంలో రూ.500 కోట్లతో రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కై రూట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్లో ఈమేరకు సీఎం రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన సంస్థ ఆధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడంతోపాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడాన్ని అభినందించారు. స్కైరూట్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెబుతుందని సీఎం అన్నారు. తెలంగాణ, హైదరాబాద్ రైజింగ్ లక్ష్యసాధనలో తాము భాగస్వామ్యం వహిస్తామని స్కై రూట్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన అన్నారు. యూనీలివర్తో ఒప్పందం దావోస్ పర్యటనలో భాగంగా దిగ్గజ కంపెనీ యూనిలీవర్ సంస్థ సీఈఓ హీన్ షూమేకర్, చీఫ్ సప్లై ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్తో సీఎం రేవంత్రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు బృందం చర్చలు జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంఓ ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణలో వ్యాపారం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన యూనీలివర్ బృందానికి రేవంత్ వివరించారు. తెలంగాణలో వినియోగ వస్తువులకు భారీ మార్కెట్ ఉందని, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వాణిజ్య విధానాలు వ్యాపారాలకు అనువుగా ఉంటాయన్నారు. చర్చలు ఫలప్రదం కావడంతో తెలంగాణలో పెట్టుబడులకు యూనిలీవర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్తోపాటు రాష్ట్రంలో బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ యూనిట్ ఏర్పాటుతో ఇతర ప్రాంతాల నుంచి బాటిల్ క్యాప్ల దిగుమతి చేసుకుంటుండగా ఇకపై స్థానికంగా తయారవుతాయి. కాగా, కామారెడ్డిలో అవసరమైన భూమిని కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వివిధ సంస్థలతో సంప్రదింపులు కాలిఫోర్నియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ హార్డ్వేర్, ఏఐ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో పేరొందిన ‘సాంబనోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ’చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు బృందం చర్చించింది. తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివరించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తెలంగాణ పెవిలియన్లో జరిగిన సమావేశంలో శ్రీధర్ బాబు లాజిస్టిక్స్ కంపెనీల్లో పేరొందిన ఎజిలిటీ సంస్థ చైర్మన్ తారెక్ సుల్తాన్ను కలిశారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్ దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాలు ‘ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్’అనే థీమ్తో ప్రారంభమయ్యాయి. శాస్త్ర సాంకేతిక అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా పారిశ్రామిక వ్యూహాల మార్పు, పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంతో రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులతోపాటు ఆయా రంగాలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేలమంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా అమెజాన్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చలు జరపనుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సారథ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. -
మంగోలియాలో మేఘా భారీ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) తాజాగా మంగోలియాలో మరో భారీ ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా అత్యాధునిక ముడిచమురు శుద్ధి కేంద్రాన్ని నిర్మించనుంది. డీల్ విలువ సుమారు రూ. 5,400 కోట్లు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 15 లక్షల టన్నుల ముడిచమురు ఉత్పత్తి చేయనుందని కంపెనీ ప్రకటించింది. మేఘా ఇంజనీరింగ్ ఇప్పటికే మంగోలియాలో రూ.6,500 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులను చేపట్టింది. మంగోలియా రాజధాని ఉలాన్బటోర్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎంఈఐఎల్, మంగోల్ రిఫైనరీ స్టేట్ ఓన్డ్ ఎల్ఎల్సీ మధ్య ఒప్పందం జరిగింది. మంగోలియాలో తొలి గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ రిఫైనరీ నిర్మాణంలో భాగస్వా మ్యం అయినందుకు గర్వంగా ఉందని ఎంఈఐఎల్ ఎండీ పి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. -
ఒలెక్ట్రాకు రూ.10,000 కోట్ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనుబంధ కంపెనీలైన ఒలెక్ట్రా గ్రీన్టెక్, ఈవీ ట్రాన్స్ల కన్సార్షియం భారీ ఆర్డర్ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు (ఎంఎస్ఆర్టీసీ) 5,150 ఎలక్ట్రిక్ బస్లను 24 నెలల్లో సరఫరా చేయాల్సి ఉంటుంది. డీల్ విలువ సుమారు రూ.10,000 కోట్లు అని ఒలెక్ట్రా శుక్రవారం ప్రకటించింది. ఒలెక్ట్రా నుంచి ఈ ఎలక్ట్రిక్ బస్లను ఈవీ ట్రాన్స్ కొనుగోలు చేసి ఎంఎస్ఆర్టీసీకి అందిస్తుంది. కాగా, భారీ ఆర్డర్ నేపథ్యంలో ఒలెక్ట్రా షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో శుక్రవారం 18.02% ఎగసి రూ.1,231.35 వద్ద స్థిరపడింది. -
ఇక ఒలెక్ట్రా ఈ–టిప్పర్స్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్టెక్ భారత్లో తొలిసారిగా తయారు చేసిన 6్ఠ4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్స్కు హోమోలోగేషన్ ధ్రువీకరణ లభించింది. ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈ సర్టిఫికెట్ సాధించింది. రహదారులకు టిప్పర్ అనువైనదో లేదో తెలుసుకునేందుకు పర్వత ప్రాంతాలు, ఎత్తయిన ప్రదేశాలు, మైనింగ్, క్వారీల్లో పరీక్షలు చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. దేశంలోనే మొట్టమొదటి సర్టిఫైడ్ హెవీ డ్యూటీ ఈ–టిప్పర్గా ఇది నిలిచిందని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. 20 ఈ–టిప్పర్ల సరఫరాకై ఒక సంస్థతో చర్చలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. వివిధ వేరియంట్లలో ఈ వాహనాన్ని విడుదల చేస్తామన్నారు. నిర్మాణం, మౌలిక సదుపాయాలు, మైనింగ్, క్వారీ రంగాల్లో ఇది గణనీయమైన మార్పును తేనుందని వివరించారు. -
పెండింగ్ డీల్స్కు మోక్షం.. ఆరు ఒప్పందాలకు సీసీఐ ఆమోదం
న్యూఢిల్లీ: దాదాపు మూడు నెలల విరామం తర్వాత కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) విలీనాలు, కొనుగోలు ఒప్పందాలను పరిశీలించడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆరు డీల్స్కు ఆమోదం తెలిపింది. కీమెడ్లో 20 శాతం వాటాను ప్రైమ్ టైమా లాజిస్టిక్స్ టెక్నాలజీస్ ద్వారా అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని కొనుగోలు చేస్తుండటం, లాంకో అన్పారా పవర్ (ఎల్ఏపీఎల్)ను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందాలు వీటిలో ఉన్నాయి. కీమెడ్ ప్రధానంగా ఔషధాల హోల్సేల్ విక్రయం, పంపిణీ వ్యాపారం చేస్తోంది. అటు హంట్స్మాన్ ఇంటర్నేషనల్ను ఆర్చ్రోమా ఆపరేషన్స్ కొనుగోలు చేయడం, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ వాటాలు దక్కించుకోవడం, హిందుస్తాన్ పోర్ట్స్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) వాటాలు తీసుకోవడానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఉన్నాయి. దీనితో నవంబర్ 3 వరకు పెండింగ్లో ఉన్న డీల్స్ను సీసీఐ క్లియర్ చేసినట్లయింది. సాధారణంగా నిర్దిష్ట పరిమితి దాటిన ఒప్పందాలకు సీసీఐ ఆమోదముద్ర అవసరమవుతుంది. అయితే, 2022 అక్టోబర్ 25న చైర్పర్సన్ అశోక్ కుమార్ గుప్తా రిటైరైన తర్వాత కోరం లేకపోవడంతో సీసీఐ విలీన, కొనుగోలు డీల్స్ పరిశీలన చేపట్టలేదు. ఫలితంగా పలు డీల్స్ పెండింగ్లో పడిపోయిన నేపథ్యంలో కేంద్రం నిర్దిష్ట నిబంధనను అమల్లోకి తేవడంతో పరిశీలన మళ్లీ మొదలైంది. -
‘మేఘా’కు మంగోలియా ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ మౌలిక సదుపాయాల దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) తాజాగా మంగోలియా మార్కెట్లో అడుగుపెట్టింది. దేశీయంగా తొలి గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీని నిర్మించే భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. దీని విలువ 790 మిలియన్ డాలర్లు. మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్వోఏ (లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ)ను అందుకున్నట్లు ఎంఈఐఎల్ తెలిపింది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ (ఈపీసీ) ప్రాతిపదికన ఈ కాంట్రాక్టు కింద ఓపెన్ ఆర్ట్ యూనిట్లు, యుటిలిటీలు, ప్లాంటు భవంతులు, క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు మొదలైనవి నిర్మించాల్సి ఉంటుందని వివరించింది. ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఈ రిఫైనరీలో రోజుకు 30,000 బ్యారెల్స్, ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ముడి చమురును ప్రాసెస్ చేయవచ్చు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) తలపెట్టిన భాగస్వామ్య అభివృద్ధి ప్రయత్నాల్లో భాగంగా, భారత ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలతో మంగోలియా ఈ ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్) ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా వ్యవహరించనుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు, హైడ్రోకార్బన్స్ రంగంలో తమ వ్యాపార విస్తరణ వ్యూహాలకు ఈ ప్రాజెక్టు కీలకంగా ఉండగలదని కంపెనీ తెలిపింది. దీనితో రష్యన్ ఇంధనంపై మంగోలియా ఆధారపడటం తగ్గుతుందని, అలాగే తమ పెట్రోలియం ఉత్పత్తుల అవసరాలను స్వయంగా తీర్చుకునేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. స్థానికంగా చిన్న పరిశ్రమలు, ప్రజల ఉపాధి అవకాశాల వృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది. -
హైదరాబాద్: మేఘా గ్యాస్ ఇక ఎంసీజీడీపిఎల్
-
మేఘా గ్యాస్ ఇక ఎంసీజీడీపిఎల్
హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ పేరు మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (MCGDPL)గా మారింది. దేశంలో వివిధ నగరాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD)ని మేఘా గ్యాస్ ఇప్పటివరకు నిర్వహిస్తోంది. ఇక నుంచి మేఘా గ్యాస్ బదులు ఎంసీజీడీపిఎల్ కంపెనీ ఇక నుంచి అన్ని రకాల అనుమతులున్న అధీకృత సంస్థగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ను చేపడుతుంది. ఇప్పటి వరకు మేఘా గ్రూప్ లో ఒక విభాగంగా ఉన్న మేఘా గ్యాస్కున్న అనుమతులన్నింటినీ ఎంసీజీడీపిఎల్ కి బదిలీ చేయాలంటూ ఎంఈఐఎల్ చేసిన అభ్యర్థనను పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి (PNGRB) ఆమోదించింది. ఇక నుంచి మేఘా గ్యాస్ కు ఉన్న అన్ని కార్యకలాపాలు, పరిపాలనా విధులతో సహా అన్ని వ్యవహారాలు ఎంసీజీడీపిఎల్ కిందకు వస్తాయి. దేశంలోని 10 రాష్ట్రాలు, 62 జిల్లాల్లోని 22 భౌగోళిక ప్రాంతాలలో కంపెనీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ను ఎంసీజీడీపిఎల్ ఇక నుంచి అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్యకలాపాలను మేఘా గ్యాస్ ఇప్పటికే చేపట్టింది. ఇక నుంచి ఎంసీజీడీపిఎల్ వీటిని చేపడుతుంది. ఇప్పటికే 2000 కి.మీ మేర MDPE లైన్ మరియు 500 కి.మీ పైగా స్టీల్ పైప్లైన్లను వివిధ ప్రాంతాలలో మేఘా గ్యాస్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 60కి పైగా సీఎన్జీ స్టేషన్లను దేశంలోని వివిధ ప్రాంతాల్లో కంపెనీ నిర్వహిస్తోంది. 80 వేలకు పైగా గృహాలకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ను అందిస్తున్నది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం కంపెనీ ఇప్పటికే రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. మరో రూ.10,000 కోట్లను వచ్చే ఐదేండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. -
మేఘాకు 12 ‘సిటీ గ్యాస్’ ఏరియాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిటీ గ్యాస్ పంపిణీ (సీజీడీ) ప్రాజెక్టు 11వ రౌండు బిడ్డింగ్లో ఇన్ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) 12 జాగ్రఫికల్ ఏరియాలను (జీఏ)దక్కించుకుంది. వీటిలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లోని ఏరియాలు ఉన్నాయి. పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నియంత్రణ బోర్డు (పీఎన్జీఆర్బీ) శుక్రవారం ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 65 జీఏలకు బిడ్స్ ఆహ్వానించగా 61 ఏరియాలకు బిడ్స్ వచ్చాయి. వీటిలో 52 ఏరియాల ఫలితాలను ప్రకటించారు. ఎన్నికల కారణంగా 9 ప్రాంతాల ఫలితాలను ప్రకటించలేదు. వీటిల్లోనూ మరికొన్నింటిని ఎంఈఐఎల్ దక్కించుకునే అవకాశం ఉంది. తెలంగాణా విషయానికొస్తే జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తిలో సీజీడీ ప్రాజెక్టులో భాగంగా సిటీ గేట్ స్టేషన్, గ్యాస్ సప్లై పైప్లైన్లు.. సిఎన్జీ స్టేషన్లను నిర్మించి, ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు సంబంధించి నల్గొండతో పాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పైప్లైన్ నిర్మించడంతో పాటు 32 సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఈఐఎల్ పేర్కొంది. అటు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాతో పాటు కర్ణాటకలో తుముకూరు, బెల్గావి జిల్లాల్లో మేఘా గ్యాస్ పేరిట గృహ, పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన గ్యాస్తో పాటు వాహనాలకు సీఎన్జీని కూడా అందిస్తున్నట్లు వివరించింది. -
మంచుకొండల్లో అద్భుత నిర్మాణం! ఎంఈఐఎస్ అరుదైన రికార్డు
హైదరాబాద్: మౌలిక రంగ నిర్మాణ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అరుదైన మైలురాయిని చేరుకుంది. 18 కిలోమీటర్ల పొడవైన జొజిలా టన్నెల్స్ మార్గంలో 5 కిలోమీటర్ల మేర సొరంగ నిర్మాణ పనులను పూర్తి చేసింది. రికార్డు స్థాయిలో 14 నెలల్లోనే దీన్ని సాధించినట్టు ఎంఈఐఎల్ ప్రకటించింది. జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్హెచ్ఐడీసీఎల్) నుంచి ఈ ప్రాజెక్టును ఎంఈఐఎల్ సొంతం చేసుకోవడం గమనార్హం. ఆసియాలోనే అతిపెద్ద టన్నెల్ మార్గం అయిన ఇది పూర్తయితే, శ్రీనగర్–లద్దాక్ మధ్య ఏడాది పొడవునా ఎలాంటి అవాంతరాల్లేకుండా రవాణాకు వీలు కలుగుతుంది. జొజిలా టన్నెల్స్ పరిధిలో నీల్గ్రార్ 1, 2, జోజిలా ప్రధాన సొరంగం నిర్మాణాన్ని అననుకూల వాతావరణ పరిస్థితుల్లోనూ వేగంగా అమలు చేస్తున్నట్టు ఎంఈఐఎల్ తెలిపింది. ఇందులో నీల్ గ్రార్ టన్నెల్ 1లో 915 మీటర్లకు గాను మొత్తం పని పూర్తయింది. నీల్ గ్రార్ టన్నెల్ 2 లో 3907 మీటర్లకు గాను 2573 మీటర్ల పని పూర్తయింది. ఇక, జోజిలా ప్రధాన టన్నెల్ లో 13145 మీటర్లకు గాను 1523 మీటర్ల పని పూర్తయింది. మొత్తం 18 కిలోమీటర్ల టన్నెల్ పనులకు 5 కిలోమీటర్ల టన్నెల్ పనులను అతి స్వల్ప వ్యవధిలోనే మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి చేయటం విశేషం. -
స్టాక్ మార్కెట్లో తెలుగు కంపెనీ సత్తా.. ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట
Multibagger Olectra Greentech: స్టాక్ మార్కెట్ అంటేనే ఉత్తరాది పెత్తనం. అందులోనూ గుజరాతీల హవానే ఎక్కువ. ప్రధాన స్టాక్మార్కెట్ ముంబైలో ఉండటంతో మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్కి చెందిన వారి మాటే అక్కడ ఎక్కువగా చెల్లుబాటు అవుతోంది. కానీ వారందరిని తలదన్నెలా లాభాల పంట పండిస్తూ అందరీ దృష్టిని ఆకర్షిస్తోంది తెలుగు వ్యక్తులు స్థాపించిన ఒలెక్ట్రా కంపెనీ. కేవలం ఏడాది వ్యవధిలోనే రూపాయికి పది రూపాయల లాభం చూపించి మల్టీ బ్యాగర్గా గుర్తింపు పొందింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్టెక్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో స్మాల్క్యాప్ కెటగిరిలో ఉన్న ఈ కంపెనీ షేర్లు ఏడాది కాలంగా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గతేడాది 2020 నవంబరు 9న ఈ కంపెనీ ఒక్క షేరు విలువ రూ.59.55 దగ్గర ట్రేడ్ అయ్యింది. సరిగ్గా ఏడాది తిరిగే సరికి 2021 నవంబరు 9 మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి ఈ కంపెనీ ఒక్క షేరు విలువ ఏకంగా రూ.649.90 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే ఏడాది కాలంలో ఏకంగా 991 శాతం షేరు విలువ పెరిగింది. నికరంగా ఒక్కో షేరు ధర రూ.590 పెరిగింది. కోటికి పది కోట్ల రూపాయలు ఏడాది కిందట లక్ష రూపాయలు ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారికి కేవలం ఏడాది వ్యవధిలోనే సుమారు పది లక్షల రూపాయల వరకు లాభం వచ్చినట్టయ్యింది. కోటి రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి పది కోట్ల రూపాయలను అందించింది. ఈ సీజన్లో మల్టీబ్యాగర్ షేర్లలో ఒకటిగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ నిలిచింది. కొత్తగా షేర్ మార్కెట్లోకి వచ్చిన వారికి స్టాక్ మార్కెట్లో లాభాల రుచిని చూపించింది. ప్రభుత్వ ప్రోత్సహకాలు వాతావరణ కాలుష్యం తగ్గించాలనే నినాదం ఎప్పటి నుంచో వినిపిస్తున్నా ఆచరణలో పెట్టింది తక్కువ. కానీ కరోనా సంక్షోభం తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. వాయు కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకానికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. ఫేమ్ 1, ఫేమ్ 2 పేరుతో ఈవీలకు ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో ఈవీలకు ఒక్కసారిగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో ఒలెక్ట్రా ఉండటం ఈ కంపెనీ షేర్లకు వరంలా మారింది. పెట్రోలు ధరలు ప్రభుత్వ విధానాలు సానుకూలంగా ఉండటానికి తోడు చమురు ధరలు సైతం ఒలెక్ట్రా వృద్ధికి పరోక్షంగా సాయం అందించాయి. గత ఏడాది కాలంగా పెట్రోలు, డీజిలు ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతుంటంతో సామాన్యులు సైతం పెట్రోలు, డీజిల్కి ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈవీ రంగంలో రోజుకో స్టార్టప్ వెలుగులోకి వస్తుంది. ఈవీ రంగంలో స్టార్టప్లకే పరిస్థితే ఎంతో ఆశజనకంగా ఉండగా.. 1992 నుంచి మార్కెట్లో ఉన్న ఒలెక్ట్రాకు అది మరింతగా లాభించింది. అందువల్లే ఇన్వెస్టర్లు ఒలెక్ట్రాపై నమ్మకం చూపించారు. ఏడాది కాలంగా షేరు వ్యాల్యూ పెరుగుతున్నా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తూనే ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా హైడ్రోమెకానిక్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా అనే భారీ ప్రాజెక్టులు చేపడుతోంది మేఘా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. తెలుగు వారు స్థాపించిన మేఘా సంస్థ సబ్సిడరీలో ఒకటి ఒలెక్ట్రా గ్రీన్టెక్ కంపెనీ. హైదరాబాద్ కేంద్రంగా 1992లో ఈ సంస్థను స్థాపించారు. పాలిమర్ ఇన్సులేలర్లు, ఎలక్ట్రిక్ బస్సులను ఈ కంపెనీ తయారు చేస్తోంది. మార్కెట్లో చాలా కాలంగా ఉన్నప్పటికీ.. ఇటీవల ఈవీల వాడకం పెరగడంతో ఒక్కసారిగా ఒలెక్ట్రా లైమ్లైట్లోకి వచ్చింది. స్టాక్ మార్కెట్లో ఇప్పటి వరకు దక్షిణాదికి చెందిన ఐటీ, ఫార్మా కంపెనీలే హవా కొనసాగించగా ఇప్పుడు మాన్యుఫ్యాక్చరింగ్ విభాగం నుంచి ఒలెక్ట్రా సంచలనం సృష్టిస్తోంది. చదవండి: ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఒలెక్ట్రాకు 100 బస్సుల ఆర్డర్ -
‘మేఘా’ వితరణ
మంగళగిరి: గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎన్నారై ఆసుపత్రికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ రెండు అంబులెన్స్లను వితరణగా అందజేసింది. ఎంఈఐఎల్ సంస్థ డైరెక్టర్ పి.సుధారెడ్డి బుధవారం అంబులెన్స్ల తాళాలను ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.నరసరాజు, ప్రిన్సిపల్ లక్ష్మిలకు అందజేశారు. ఈ సందర్భంగా సుధారెడ్డి మాట్లాడుతూ.. మేఘా సంస్థ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని నిమ్స్లో క్యాన్సర్ రోగుల కోసం ప్రత్యేకంగా వార్డు నిర్మించామని, పలు ఆసుపత్రులకు అవసరమైన అంబులెన్సులను అందించటంతో పాటు గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎంఈఐఎల్ ప్రతినిధి కొమ్మారెడ్డి బాపిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నారై ఆసుపత్రికి తమ సంస్థ అందజేసిన అంబులెన్స్లలో ఐసీయూకు అవసరమైన సౌకర్యం కల్పించామన్నారు. కార్యక్రమంలో ఎన్నారై ఆస్పత్రి సీఈవో వెంకట ఫణిదర్, ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ కోశాధికారి టీసీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
Yadadri Temple: ‘మేఘా’ 6 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్/యాదాద్రి: యాదాద్రి దేవాలయం విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు బంగారాన్ని విరాళంగా ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేసిన విజ్ఞప్తికి మంచి స్పందన లభిస్తోంది. రెండ్రోజుల వ్యవధిలోనే పలువురు ప్రముఖులు సుమారు 32 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ తరఫున ఆరు కిలోల బంగారం విరాళంగా ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ బి.శ్రీనివాస్రెడ్డి బుధవారం తెలిపారు. ఆరు కేజీల బంగారం లేదా సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో త్వరలో అందజేస్తామని ప్రకటించారు. ప్రతిష్టాత్మక పుణ్యస్థలమైన యాదాద్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచల మేరకు మరింత అందంగా రూపుదిద్దుకుని, దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇలావుండగా సీఎం కేసీఆర్ స్ఫూర్తితో యాదాద్రి విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రెండు కిలోల బంగారాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రణీత్ గ్రూప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు తెలిపారు. అలాగే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎండీ కామిడి నర్సింహారెడ్డి సంస్థ తరఫున 2 కిలోల బంగారాన్ని, ప్రముఖ వ్యాపారవేత్త ఎన్వీ రామరాజు తమ సంస్థ (జలవిహార్) తరఫున కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. విరాళాల కోసం బ్యాంక్ ఖాతా స్వర్ణ తాపడానికి భక్తులు విరాళాలు సమర్పించడానికి బ్యాంక్ అకౌంట్ నంబర్ను దేవస్థానం ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఇండియన్ బ్యాంక్ యాదగిరిగుట్ట శాఖలో ఖాతా తెరిచారు. దాతలు అకౌంట్ నం. 6814884695, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఐడీఐబీ000వై011కు నగదు జమ చేయాలని దేవస్థానం ఈఓ గీతారెడ్డి కోరారు. విరాళాలు పారదర్శకంగా ఉండేందుకు బ్యాంక్ ద్వారానే తీసుకోనున్నామని తెలిపారు. బంగారం విరాళంగా ఇస్తే స్వచ్ఛత విషయంలో తేడాలు ఉండే అవకాశం ఉన్నందున భక్తులు నగదు రూపంలో బ్యాంకులో జమచేయాలని సూచించారు. -
ఐపీవో యోచనలో మేఘా ఇంజనీరింగ్
శ్రీనగర్ నుంచి సాక్షి ప్రతినిధి ఎన్. పార్థసారథి: ఇన్ఫ్రా రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) పబ్లిక్ ఇష్యూకి రావాలనే యోచనలో ఉంది. అలాగే మరిన్ని కొత్త టెక్నాలజీలను కూడా దేశీయంగా అందుబాటులోకి తేవడంపై దృష్టి పెడుతోంది. ఎంఈఐఎల్ ఎండీ పి.వి. కృష్ణారెడ్డి ఈ విషయాలు తెలిపారు. అయితే, ఎప్పట్లోగా ఐపీవోకి రానున్నది, ఎంత మేర నిధులు సమీకరించనున్నది ఆయన వెల్లడించలేదు. మరోవైపు, హైడ్రోజన్ సంబంధ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇటాలియన్ సంస్థతో కలిసి పనిచేస్తున్నామని కృష్ణారెడ్డి చెప్పారు. ఇటీవలే అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకున్నామని వివరించారు. కొత్త తరహా సాంకేతికతలపై సుమారు రూ. 15–20 వేల కోట్ల దాకా ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘మేము ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు, ఆటోల్లాంటివి తయారు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా 1,000కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహిస్తున్నాం. అలాగే ఆన్షోర్, ఆఫ్షోర్ రిగ్గుల తయారీ, ఎక్స్ప్రెస్ వేస్, విద్యుత్ పంపిణీ తదితర రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాం‘ అని కృష్ణారెడ్డి వివరించారు. అటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా తదితర ఖండాల్లో 18 పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామన్నారు. డిజిన్వెస్ట్మెంట్ సంస్థలపై ఆసక్తి.. కేంద్ర పభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా వాటాలు విక్రయిస్తున్న సంస్థలను దక్కించుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు కృష్ణారెడ్డి చెప్పారు. బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, నీలాచల్ ఇస్పాత్ వంటి సంస్థల విషయంలో అర్హత కూడా సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. కొనుగోళ్లకు సంబంధించి అవసరాన్ని బట్టి ఏడాది, రెండేళ్ల వ్యవధిలో రూ. 15,000–20,000 కోట్ల దాకా నిధులు సమీకరించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పా రు. విదేశాల నుంచి సమీకరించే నిధులను భారత్లోనే ఇన్వెస్ట్ చేస్తామని, విదేశాల్లో ఇన్వెస్ట్ చేసే యోచనేదీ తమకు లేదని కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. డెడ్లైన్ కన్నా ముందే జోజిలా టన్నెల్ పూర్తి.. శ్రీనగర్–లేహ్ మధ్యలో నిర్మిస్తున్న వ్యూహాత్మక జోజిలా టన్నెల్ ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువు కన్నా ముందే పూర్తి చేస్తామని కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధితో స్థానికంగా ఉపాధి కల్పనకు, పర్యాటక రంగానికి ఊతం లభించగలదని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో టన్నెల్ ప్రాజెక్టుల అనుభవంతో, కాంపిటీటివ్గా బిడ్ చేసి జోజిలా ప్రాజెక్టు దక్కించుకున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం తమ సంస్థలో 35,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని, వివిధ ప్రాజెక్టుల్లో మూడు లక్షల మంది దాకా పనిచేస్తున్నారని కృష్ణారెడ్డి వివరించారు. తమ ప్రాజెక్టుల అవసరాలకు సంబంధించి చిన్న, మధ్య తరహా సంస్థలతో కూడా కలిసి పనిచేస్తుండటం ద్వారా వాటికి కూడా తోడ్పాటు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని కృష్ణారెడ్డి చెప్పారు. చదవండి: ఒలెక్ట్రాకు మరో 150 బస్ల ఆర్డర్ -
పోలవరం గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం పూర్తి
-
పోలవరం గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం పూర్తి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ఒక్కోక్కటీ పూర్తి చేసుకుంటూ శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుంది. ఓవైపు వరదలు మరో వైపు కరోనా వంటి విపత్కర పరిస్దితులున్నా.. అనుకున్న లక్ష్యం సాధించే దిశగా పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన గ్యాప్-3 నిర్మాణం పూర్తయ్యింది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్ సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి గ్యాప్-3 కాంక్రీట్ పనులను పూర్తి చేశారు. పోలవరం ప్రాజెక్ట్లో కీలకమైన ఈ గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి చేసింది. 153.50 మీ పొడవు, 53.320మీ ఎత్తు, 8.50 మీ వెడల్పుతో గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం పూర్తయ్యింది. దీనికి గాను 23,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని వినియోగించినట్లు అధికారులు తెలిపారు. పోలవరం హెడ్ వర్క్స్లో 3 ఈసీఆర్ఎఫ్ డ్యాంలలో గ్యాప్-3 ఒకటి. గ్యాప్-1, గ్యాప్-2 ఈసీఆర్ఎఫ్లు రాక్ ఫిల్ డ్యామ్లు కాగా గ్యాప్-3 మాత్రం కాంక్రీట్ డ్యామ్. (చదవండి: పోలవరం పనులపై ప్రాజెక్ట్ అథారిటీ సంతృప్తి) గ్యాప్-3 కాంక్రీట్ డ్యామ్ నిర్మాణ పూర్తి సందర్భంగా నిర్వహించిన పూజాకార్యక్రమంలో ఇరిగేషన్ అడ్వైజర్ గిరిధర్ రెడ్డి, ఈఈలు పాండురంగారావు, మల్లిఖార్జునరావు, ఆదిరెడ్డి, డీఈఈ ఎమ్.కె.డి.వి ప్రసాద్, ఏఈఈ శ్రీధర్, మేఘా ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎంలు ఎం.ముద్దుకృష్ణ, దేవ్ మని మిశ్రా, ఏజిఎంలు కె.రాజేష్ కుమార్, క్రాంతి కుమార్, మేనేజర్ మురళి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: Polavaram Project: పోలవరం పనులు భేష్) పోలవరం ప్రాజెక్టు వర్క్ ప్రోగ్రెస్.. ►మేఘా ఇంజనీరింగ్ సంస్ద 2019 నవంబర్ లో పనులు చేపట్టింది. ►ఇప్పటికే కీలకమైన పోలవరం స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం పూర్తైంది. ►స్పిల్ వే లో 3,32,295 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేయడం జరిగింది. ►అదే విధంగా స్పిల్ వేలో అమర్చాల్సిన 48 రేడియల్ గేట్లకు గానూ 42 గేట్లను అమర్చడం జరిగింది. ►మిగిలిన 6గేట్లను త్వరలోనే అమర్చనున్నారు. ►రేడియల్ గేట్లకు అమర్చాల్సిన 96హైడ్రాలిక్ సిలిండర్లకు గానూ 84 సిలిండర్లను అమర్చారు. ►ఇప్పటికే 24పవర్ ప్యాక్ లకు గానూ 24 పవర్ ప్యాక్ లు అమర్చారు. ►ఇప్పటికే అన్ని గేట్లను పైకి ఎత్తి ఉంచడంతో గేట్ల ఏర్పాటు తర్వాత మొదటి సారి అన్ని గేట్ల నుండి గోదావరి వరద దిగువకు ప్రవహిస్తోంది. ►అదేవిధంగా 10రివర్ స్లూయిజ్ గేట్లను అమర్చడంతో పాటు వాటిని ఇప్పటికే పైకి ఎత్తి నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. ►స్పిల్ ఛానెల్లో 2,41,826 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ►అదే విధంగా స్పిల్ ఛానెల్ లో 35 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. ►దీనికి తోడు స్పిల్ ఛానెల్ లో కీలకమైన 1,391మీటర్ల పొడవైన ఎండ్ కటాఫ్ వాల్ నిర్మాణ పనులు సైతం పూర్తి అయ్యాయి. ►ఇంక అప్రోఛ్ ఛానెల్ లో దాదాపు 70లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. ఇది కేవలం 60 రోజుల్లో పూర్తి చేయడం ఓ అద్భుతం. ►కీలకమైన ఎగువ,దిగువ కాఫర్ డ్యామ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ►ఎగువ కాఫర్ డ్యాంలో 33,73,854, క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి అయ్యాయి. ►ఇప్పటికే ఎగువ కాఫర్ డ్యామ్ను 2480మీ పొడవున, 42.5మీటర్ల ఎత్తు కు గానూ పూర్తి స్దాయి ఎత్తున నిర్మాణం పూర్తి అయింది. ►ఇంక దిగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం సైతం దాదాపు 21మీటర్ల ఎత్తులో నిర్మాణం పూర్తి అయింది. దిగువ కాఫర్ డ్యామ్లో ఇప్పటికే 3,15,237 క్యూబిక్ మీటర్ల పనులు పూర్తి అయ్యాయి. ►ఇటీవలే ఎగువ కాఫర్ డ్యామ్ దగ్గర అడ్డుకట్ట వేసి గోదావరి నదీ ప్రవాహాన్ని మళ్ళించడం పూర్తైంది. ►ఇలా అప్రోచ్ ఛానెల్ నుంచి స్పిల్ వే మీదుగా గోదావరి నదిని దాదాపు 6.6కి.మీ మళ్ళించడం జరిగింది. ►ఇప్పటికే గ్యాప్2లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి సంబందించి 11,96,500 క్యూబిక్ మీటర్ల వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తి అయ్యాయి. ►అదేవిధంగా 1,61,310 క్యూబిక్ మీటర్ల శాండ్ ఫిల్లింగ్ పనులు పూర్తి అయ్యాయి. ►ఇంక గ్యాప్-1లో 400మీటర్ల పొడవున ప్లాస్టిక్ కాంక్రీట్ డ్యామ్ నిర్మాణం పూర్తి అయింది. ►గ్యాప్-1లో నేలను గట్టి పరిచేందుకు స్టోన్ కాలమ్స్ పనులు పూర్తి అవ్వగా కీలకమైన డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. ►ఆసియాలో మొదటి సారి ఆధునిక టెక్నాలజీతో గ్యాప్-1లో డీప్ సాయిల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. ►ఇంక కీలకమైన జలవిద్యుత్ కేంద్రానికి సంబందించి కొండ తవ్వకం పనులు దాదాపు పూర్తి అయ్యాయి. ఇప్పటికే 20,31491 క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. ►జలవిద్యుత్ కేంద్రానికి సంబందించి ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు జోరందుకున్నాయి. -
ఈ ఏడాదే ఓఎన్జీసీకి 23 రిగ్గులు: మేఘా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వదేశీ పరిజ్ఞానంతో కంపెనీ తయారు చేసిన రిగ్గు విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తోందని మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గురువారం వెల్లడించింది. మరో రిగ్గు ఓఎన్జీసీకి సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన మీడియా సమావేశంలో కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రిగ్గుల విక్రయం ద్వారా రానున్న రోజుల్లో దేశీయంగా, అంతర్జాతీయంగా రూ.14,800 కోట్ల విలువ గల వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోనున్నామని మేఘా అనుబంధ కంపెనీ, ఆయిల్ రిగ్గుల తయారీలో ఉన్న డ్రిల్ మెక్ చైర్మన్ బొమ్మారెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఓఎన్జీసీకి సరఫరా చేయాల్సిన 47 రిగ్గులలో డిసెంబరుకల్లా 23 అప్పగిస్తామన్నారు. చమురు, ఇంధనం వెలికితీసే రిగ్గులను తొలిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి వినియోగంలోకి తెచ్చిన ఘనత మేఘా ఇంజనీరింగ్ సొంతం చేసుకుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పి.రాజేష్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, కాకినాడతోపాటు ఇటలీ, యూఎస్లోని ప్లాంట్లలో వీటిని తయారు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 70కి పైగా రిగ్గులను ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. 1500 హెచ్పీ సామర్థ్యం గల రిగ్గు అత్యాధునిక హైడ్రాలిక్ వ్యవస్థతో పనిచేస్తుంది. 4,000 మీటర్ల లోతు వరకు సులభంగా, వేగంగా తవ్వుతుందని ఆయిల్ రిగ్స్ డివిజన్ అధిపతి కృష్ణ కుమార్ తెలిపారు. -
ఒలెక్ట్రాకే 50 ఎలక్ట్రిక్ బస్ల సరఫరా ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ అయిన ఒలెక్ట్రా గ్రీన్టెక్ తాజాగా 50 ఎలక్ట్రిక్ బస్ల సరఫరా ఆర్డర్ను చేజిక్కించుకుంది. గుజరాత్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (జీఎస్ఆర్టీసీ) నుంచి ఈ ఆర్డర్ దక్కింది. ఇందులో భాగంగా 10 ఏళ్ల కాలానికిగాను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో బస్లను 12 నెలల్లో జీఎస్ఆర్టీసీకి అందజేస్తారు. మొత్తం ఆర్డర్ బుక్ 1,350 బస్లకు చేరుకుందని ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఎండీ కె.వి.ప్రదీప్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో ఒలెక్ట్రా తయారీ 200 ఈ–బస్లు పరుగెడుతున్నాయని చెప్పారు. 9 మీటర్ల పొడవున్న ఈ బస్లో డ్రైవర్తో కలిపి 34 మంది కూర్చోవచ్చు. ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్ చేస్తే బస్ 180–200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 3–4 గంటల్లోనే చార్జింగ్ పూర్తి కావడం విశేషం. చదవండి : రష్యాలో ప్రాజెక్టులు,15 బిలియన్ డాలర్లు దాటిన భారత్ పెట్టుబడులు -
పోలవరంలో మరో కీలక ఘట్టానికి శ్రీకారం
సాక్షి, అమరావతి/దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో కీలక ఘట్టానికి రాష్ట్ర ప్రభుత్వం తెర తీసింది. ప్రాజెక్టులో అంతర్భాగమైన 960 మెగా వాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులను వేగవంతం చేసింది. ఈ కేంద్రంలో అత్యంత కీలకమైన 12 ప్రె జర్ టన్నెళ్ల తవ్వకం పనులను శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు వద్ద మేఘా సంస్థ ప్రారంభించింది. పోలవరం హె డ్ వర్క్స్ (జలాశయం) పనులతోపాటు జలవిద్యు త్ కేంద్రం పనులను రివర్స్ టెండరింగ్లో దక్కిం చుకున్న మేఘా సంస్థ.. జలవిద్యుత్ కేంద్రం పనులను మార్చి 30న ప్రారంభించింది. ఈ పనుల్లో ఇప్పటికే 18.90 లక్షల క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం పనులను పూర్తిచేసింది. జలవిద్యుత్ కేం ద్రం పునాది పనులను జలవనరుల శాఖ అదికారులు పర్యవేక్షిస్తుండగా.. విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను జెన్కో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున మూడు వేల టీఎంసీల మేర గోదావరి జలాలు సముద్రం లో కలుస్తున్నాయి. ఈ వరద నీటిని ఒడిసి పట్టి.. ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు భారీగా వి ద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలి పేందుకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. జలవిద్యుత్ కేంద్రం పనితీరు ఇలా.. పోలవరం ప్రాజెక్టు హెడ్వర్క్స్లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్)కు ఎడమ వైపున జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్లో 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లలో 960 మెగాగాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం 35.52 మీటర్ల నుంచి నీటిని ప్రెజర్ టన్నెళ్ల ద్వారా పంపిస్తారు. టన్నెళ్లకు దిగువన కెప్లాన్ టర్బైన్లను ఏర్పాటుచేస్తారు. అధిక ఒత్తిడితో ఎత్తు నుంచి నీరు పడినప్పుడు వర్టికల్ కెప్లాన్ టర్బైన్లు వేగంగా తిరగడంవల్ల విద్యుత్ ఉత్పత్తవుతంది. ఇందుకోసం 145 మీటర్ల పొడవున 9 మీటర్ల వ్యాసంతో 12 ప్రెజర్ టన్నెళ్లను తవ్వే పనులను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది. ఈ టన్నెళ్లకు చివరన తక్కువ వ్యాసంతో ఇనుప పైపులను తొడిగి.. భూ ఉపరితలానికి ఆరు మీటర్ల దిగువన వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను ఏర్పాటుచేస్తారు. ప్రెజర్ టన్నెళ్ల వైపు నీటిని మళ్లించడానికి వీలుగా 206 మీటర్ల పొడవున 294 మీటర్ల వెడల్పుతో జలాశయం నుంచి అప్రోచ్ ఛానల్ తవ్వుతారు. దీని ద్వారా ప్రెజర్ టన్నెళ్లకు నీటిని విడుదల చేయడం ద్వారా వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను తిరిగేలా చేసి.. విద్యుదుత్పత్తి చేస్తారు. టర్బైన్ల నుంచి దిగువకు వచ్చిన నీటిని టెయిల్ రేస్ ఛానల్ ద్వారా ఈసీఆర్ఎఫ్కు దిగువన నదిలోకి కలుపుతారు. ఈ వర్టికల్ కెప్లాన్ టర్బైన్లను భోపాల్కు చెందిన బీహెచ్ఈఎల్ సంస్థ తయారుచేస్తోంది. ఈ విద్యుత్ కేం ద్రంలో వినియోగిస్తున్న టర్బైన్లు ఆసియాలోనే అత్యంత పెద్దవి. ప్రెజర్ టన్నెల్ తవ్వకం పనుల ప్రారంభోత్సవంలో జెన్కో ఎస్ఈ ఎస్. శేషారెడ్డి, ఈఈలు ఎ. సోమయ్య, సి. హనుమ, ఎలక్ట్రికల్ ఈ ఈ వై. భీమధనరావు, ఇరిగేషన్ ఈఈ పాండురంగారావు, మేఘా ఇంజినీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎం ముద్దుకృష్ణ, ఏజిఎం క్రాంతికుమార్, కోఆర్డినేటర్ ఠాగూర్చంద్ పాల్గొన్నారు. హిమాలయ విద్యుత్ కేంద్రాల స్థాయిలో.. హిమాలయ నదుల్లో నీటి లభ్యత అధికంగా ఉండటంవల్ల వాటిపై నిర్మించే జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ అధికంగా ఉత్పత్తవుతుంది. అలాగే, గోదావరి నదిపై ఎగువన మహారాష్ట్రలో జైక్వాడ్ డ్యామ్ నుంచి దిగువన ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వరకూ అతిపెద్ద నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు పోలవరం ఒక్కటే. దీని సామర్థ్యం 194.6 టీఎంసీలు. పోలవరం వద్ద నీటి లభ్యత అధికంగా ఉండటంవల్ల హిమాలయ నదులపై ఉన్న విద్యుత్ కేంద్రాలకు దీటుగా పోలవరం విద్యుత్ కేంద్రంలోనూ కరెంట్ను ఉత్పత్తి చేయవచ్చునని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అంతరాయాలు లేకుండా కారుచౌకగా విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా రాష్ట్రంలో భారీఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారని.. అలాగే ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడడానికి అది దోహదం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా. ఇవీ చదవండి: ఏపీ: దేశంలోని తొలి ప్రయోగం.. వాట్సాప్.. రైతుల హేట్సాఫ్ -
ఒలెక్ట్రా గ్రీన్టెక్ ఎండీగా కె.వి. ప్రదీప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ అయిన ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్టెక్ నూతన ఎండీగా వెంకటేశ్వర ప్రదీప్ కారుమూరు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. కొత్త బాధ్యతల్లో మూడేళ్లపాటు ఉంటారు. సివిల్ ఇంజనీర్ అయిన ప్రదీప్.. వ్యాపార అభివృద్ధి, ప్రాజెక్టుల అమలు, ఈపీసీ, విమానయాన రంగాల్లో 22 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. భారత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ బస్ తయారీ సంస్థకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అత్యంత అధునాతన, పర్యావరణ అనుకూల ఈ–బస్లను ప్రవేశపెట్టడంలో భాగస్వామ్యం అవుతామని వివరించారు. ఆర్డర్ బుక్ 1,325 బస్లు.. ప్రస్తుతం ఒలెక్ట్రా ఖాతాలో 1,325 బస్లకు ఆర్డర్ ఉంది. ఇందులో 87 యూనిట్లు డెలివరీ చేశారు. కొత్తగా 300 బస్ల కాంట్రాక్టుకుగాను లోయెస్ట్ బిడ్డర్గా కంపెనీ నిలిచింది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. మరిన్ని టెండర్లలో పాలుపంచుకునే పనిలో కంపెనీ నిమగ్నమైంది. కాగా, జూన్ త్రైమాసికంలో ఒలెక్ట్రా రూ.5.65 కోట్ల నికరలాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.3.62 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ 86 శాతం అధికమై రూ.41.15 కోట్లు సాధించింది. ఇందులో ఈ–బస్ విభాగం వాటా రూ.23.36 కోట్లు ఉంది. విద్యుత్ పంపిణీకి అవసరమైన సిలికాన్ రబ్బర్/కంపోజిట్ ఇన్సులేటర్స్ తయారీలో ఒలెక్ట్రా గ్రీన్టెక్ దేశంలో అతిపెద్ద కంపెనీ. -
‘మేఘా’ 75 ఎంటీల మెడికల్ ఆక్సిజన్ వితరణ
ముత్తుకూరు: కరోనా బాధితులకు వైద్య చికిత్స కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థ సీఎస్సార్ ఫండ్స్తో రూ.1.65 కోట్ల విలువైన 75 ఎంటీ (మెట్రిక్ టన్ను)ల మెడికల్ ఆక్సిజన్ను జిల్లాకు అందించినట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు తెలిపారు. మేఘా సంస్థ ద్వారా శుక్రవారం ఒక్కోటి 25 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కలిగిన మూడు ట్యాంకర్లు రైలు మార్గంలో అదాని కృష్ణపట్నం పోర్టుకు చేరాయి. వీటికి కలెక్టర్ చక్రధర్బాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మేఘా సంస్థను అభినందించారు. సీఎం వైఎస్ జగన్ తీసుకొన్న ప్రత్యేక శ్రద్ధతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీలు హరేంద్రప్రసాద్, బాపిరెడ్డి, పోర్టు సీఈవో సతీష్ చంద్రరాయ్, మేఘా ప్రతినిధులు నారాయణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
సింగపూర్ నుంచి ఏపీకి మూడు ఆక్సిజన్ ట్యాంకర్లు
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల అవసరాల నిమిత్తం మూడు క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను ప్రభుత్వానికి ఉచితంగా అందించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్. ఒక్కో ఆక్సిజన్ ట్యాంక్ నుంచి 1. 40 కోట్ల లీటర్ల ఆక్సిజన్ సామర్ధ్యం ఉన్న మూడు క్రయోజెనిక్ ట్యాంకర్లను సింగపూర్ నుంచి దిగుమతి చేసుకుంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు సింగపూర్లో బయలుదేరిన భారత వైమానికదళ ప్రత్యేక విమానం రాత్రి ఏడు గంటలకు పశ్చిమబెంగాల్ లోని పానాగఢ్ వైమానిక స్థావరానికి మూడు క్రయోజెనిక్ ట్యాంకులతో చేరుకుంది. క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను విమానం నుంచి దించిన వెంటనే ప్రత్యేక వాహనాల్లో 35 కిలోమీటర్ల దూరంలోని దుర్గాపూర్ ఉక్కు కర్మాగారానికి తరలించారు. ఆ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన విషయం తెలిసిందే. మూడు క్రయోజెనిక్ ట్యాంకర్లలో ఆక్సిజన్ నింపిన తరువాత అవి ఆంధ్ర ప్రదేశ్ కు బయలుదేరతాయి. ఆక్సిజన్ ట్యాంకులు రైలు మార్గం ద్వారా బుధవారం రాత్రికి లేదా గురువారం ఉదయానికి రాష్టానికి చేరుకుంటాయని ఎంఈఐఎల్ వైస్ ప్రెసిడెంట్ పి. రాజేశ్రెడ్డి తెలిపారు. ఇప్పటికే 11 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులను తెలంగాణా ప్రభుత్వానికి మేఘా ఇంజనీరింగ్ ఉచితంగా థాయిలాండ్ నుంచి దిగుమతు చేసుకుని అందించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు సింగపూర్ ప్రభుత్వం సమన్వయంతో త్వరితగతిన ట్యాంకర్లు దిగుమతి కావడానికి కృషి చేశాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అందించే మూడు ట్యాంకర్ల ద్వారా 4. 20 కోట్ల లీటర్ల ఆక్సిజన్ ను సరఫరా చేయవచ్చు. ఈ క్రయోజనిక్ ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు తగిన విధంగా వినియోగించుకుంటుంది. మన రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తీసుకువచ్చి నేరుగా ఆసుపత్రులకు ఇవి అందచేస్తాయి. అదే సమయంలో అవసరాన్ని బట్టి నేరుగా ఆసుపత్రులకు సరఫరా చేసే విధంగా కూడా ఈ ట్యాంకర్లను ఉపయోగిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల కమిటీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు దృష్టి లో ఉంచుకొని ఆక్సిజన్ సరఫరాకు క్రయోజనిక్ ట్యాంకర్స్ ను సింగపూర్ నుండి మేఘా ఇంజనీరింగ్ దిగుమతి చేసుకుంది. దేశంలో సరిపడా ఆక్సిజన్ ఉన్నా దాన్ని సరఫరా చేయడానికి అవసరమైన ట్యాంకులు, రవాణా లాంటి సదుపాయాలు లేకపోవడంతో అవసరమైన వారికి అందడం లేదు. మన దేశంలో ఒక్కొక్క క్రయోజనిక్ ట్యాంకర్ తయారు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాలంతో పోటీ పడి ట్యాంకర్లను సిద్ధం చేయాలి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ గాలించి సింగపూర్ నుండి 3 క్రయోజనిక్ ట్యాంకర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం మేఘా ఇంజనీరింగ్ దిగుమతి చేసుకుంది. కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా ఎంఈఐఎల్ భావిస్తోంది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తోంది. కరోనా సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ఆక్సిజన్ కొరత అధికమవుతున్నప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. అందులో భాగంగానే సంస్థ ఉన్నతస్థాయి యాజమాన్యమే కాకుండా మొత్తం యంత్రాంగం ఇదే పనిలో నిమగ్నమైంది. -
కరోనా: తమిళనాడుకు మేఘా సహాయం
దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా పేషంట్లను ఆదుకునేందుకు వివిధ ప్రభుత్వాలకు సహాయసహకారాలు అందిస్తున్న విధంగానే హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ. తాజాగా తమిళనాడు వ్యాప్తంగా ఉచితంగా 2500 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మదురైలో కేవలం 72 గంటల్లోనే 500 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను, బెడ్స్ను, ఆస్పత్రులకు వివిధ మౌళిక సదుపాయాలను కల్పించిన ఎంఈఐఎల్, తమిళనాడు వ్యాప్తంగా కరోనా బాధితుల కోసం ఉచితంగా ఆస్పత్రులలో ఆక్సిజన్ బెడ్స్ను ఏర్పాటు చేస్తోంది. మేఘా ఇంజనీరింగ్ తో పాటు తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి రియల్టర్స్ సంస్థ ఇందులో భాగస్తులయ్యాయి. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని నేరుగా పర్యావేక్షిస్తున్నారు. చెన్నైలో 1070 ఆక్సిజన్ బెడ్లు గ్రేటర్ చెన్నై పరిధిలోని ఆసుపత్రులలో 1070 ఆక్సిజన్ బెడ్ల ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ యుద్ధపాత్రిపదికన పనులు చేస్తోంది. వీటితో పాటు ఇరోడ్ జిల్లాలో 200, వెల్లూరు 250, అంబూరు 100, నట్టారం వళ్లి 100, మెలిశ్వరం 100, అయ్యపాకం 200, శోలింగార్ 50, వనియంబాడిలో 100, వల్లఝాలో 100 ఆక్సిజన్ పడకల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 660 బెడ్లను సిద్ధం చేసిన ఎంఈఐఎల్ రాబోయే రోజుల్లో 2500 బెడ్ల ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఐఎల్) తనవంతు సహాయంగా తమిళనాడుకు ఆక్సిజన్ బెడ్లను అందిస్తోంది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. మేఘాకు సేవల్లో పాలు భాగస్తులైన క్రెడాయ్, జి రియల్టర్స్ మధురై ప్రభుత్వ ఆసుపత్రి (తోప్పూర్ జిహెచ్) లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ 500 స్కేలబుల్ ఆక్సిజనేటెడ్ బెడ్ సౌకర్యాలను మే 21 ప్రారంభించారు. ఇందులో 200 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 300 పడకలు త్వరలో ప్రజల ఉపయోగం కోసం అందుబాటులో ఉంచనున్నారు. మేఘా సంస్థ చొరవతో ప్రజలకు ఉచిత చికిత్సను అందిస్తున్నారు. జి స్క్వేర్ రియల్టర్స్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, క్రెడాయి మదురై జిహెచ్ వద్ద 72 గంటల రికార్డు సమయంలో 500 ఆక్సిజన్ బెడ్ సౌకర్యాలను ఏర్పాటు చేశాయి. జి స్క్వేర్ రియల్టర్ తో కలిసి మేఘా ఇంజనీరింగ్ సంస్థ చెన్నై అన్నా నగర్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఒమాండురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కొక్కటి 100 ఆక్సిజనేటెడ్ పడకలను ఏర్పాటు చేశారు. కరోనా సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ఆక్సిజన్ కొరత అధికమవుతున్నప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు మేఘా యాజమాన్యం కృషి చేస్తోంది. అందులో భాగంగానే సంస్థ ఉన్నతస్థాయి యాజమాన్యమే కాకుండా మొత్తం యంత్రాంగం ఇదే పనిలో నిమగ్నమయ్యింది. కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నామని ఎంఈఐఎల్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కోవిడ్ రోగులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడం కోసం ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు. క్రెడాయ్ తమిళనాడు అధ్యక్షుడు సురేష్ కృష్ణ మాట్లాడుతూ, “సిఎస్ఆర్ పథకంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, లైఫ్ స్టైల్ (చెన్నై), ఒలింపియా, టిఎన్ ఇస్పాట్ పరిషత్ లిమిటెడ్, తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం వంటి అనేక సంస్థలు తమిళనాడు ప్రజల కోసం ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. కేవలం 72 గంటల తక్కువ వ్యవధిలో మేఘా సంస్థ పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది” జి స్క్వేర్ రియల్టర్స్ ప్రమోటర్ బాలా మాట్లాడుతూ, “మానవ జీవితం కంటే మరేమీ ముఖ్యమైనది కాదు. మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) - జి స్క్వేర్ సంస్థలు కలిసి ప్రభుత్వానికి అండగా నిలబడడం గర్వంగా ఉందన్నారు. ఈ ఆసుపత్రులను తమిళనాడు అంతటా ఏర్పాటు చేయడానికి గౌరవ ఆరోగ్య మంత్రి, తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి తమ పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయన్నారు” బాధ్యతగా కోవిడ్ బాధితులను ఆదుకుంటున్నాం: బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేసి గుర్తింపు పొందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ సంస్థ కోవిడ్ కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు బాధ్యతగా ముందుకు వచ్చిందని ఆ సంస్థ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదేశాల మేరకు రాష్ర్టంలో 2500 పడకల ఆక్సిజన్ బెడ్ల ఆసుపత్రులను యుద్ధ ప్రతిపాదికన ఏర్పాటు చేస్తున్నామన్నారు. మదురైలో కేవలం 72 గంటల్లోనే 200 పడకల ఆక్సిజన్ బెడ్స్ ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అందచేశామన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి రియల్టర్స్ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి 200 పి.ఎస్.ఏ ప్లాంట్లు ఏర్పాటు చర్యలు ప్రారంభించినట్లు బి.శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. అలాగే క్రయోజనిక్ ట్యాంకుల తయారీ కూడా ప్రారంభించినట్లు చెప్పారు. ఇందుకు డిఆర్డీవో, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్న సంగతిని గుర్తు చేశారు. తొలిసారిగా తెలంగాణకు థాయిలాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేసి ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. చదవండి: జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై రహస్య విచారణ -
ఆక్సిజన్ సరఫరాకు ముందుకొచ్చిన ఎంఈఐఎల్
సాక్షి, హైదరాబాద్ : కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లోని ప్రఖ్యాత నిమ్స్, అపోలో, సరోజినిదేవి వంటి ఆస్పత్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఆక్సిజన్ అందించమని అభ్యర్థనలు వచ్చాయి.. వచ్చిందే తడవుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజన్ సిలిండర్లను భారీ స్థాయిలో ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ సేకరణ కోసం భద్రాచలంలోని ఐటీసీ, హైదరాబాద్లోని డిఆర్డివోతో ఆఘమేఘాల మీద ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా కోవిడ్ రోగులు ఆక్సిజన్ సమస్యతో సతమతమవుతున్నారు. ఆక్సిజన్ అందక రోజుకు కొన్ని వందల మంది కోవిడ్ మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థల సహకారంతో ఆక్సిజన్ అవసరమయ్యే అన్ని హాస్పిటల్స్కు ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ ప్రభుత్వం సహకారంతో వివిధ హాస్పిటల్స్ కు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయనుంది. కోవిడ్ రోగుల అవసరాలకు అనుగుణంగా నిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఆక్సిజన్ బెడ్లను పెంచుతూ పోతోంది. ప్రస్తుతం 180 నుంచి 500 బెడ్లకు పెంచారు. పెంచిన బెడ్లకు అనుగుణంగా నిమ్స్ లో రోజుకు 50 బి.టైప్ మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లు (ఒక్కొక్క సిలిండర్ 7000 లీటర్లు) ఏర్పాటు అవసరం అవుతుందని నిమ్స్ డైరెక్టర్ డా. మనోహర్ ఎంఈఐఎల్ సంస్థకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అలాగే సరోజిని దేవి కంటి ఆసుప్రతికి రోజుకు దాదాపు 200 సిలిండర్లను అందించబోతుంది మేఘా సంస్థ. ఇక అపోలో హాస్పిటల్స్కు ప్రతి రోజు 100 సిలిండర్లు, కేర్ హైటెక్ కు 50 సిలిండర్లను సరఫరా చేయనుంది. ఇక భవిష్యత్తులో ఆసుపత్రుల నుంచి వచ్చే ఆక్సిజన్ విజ్ఞప్తి మేరకు సరఫరా చేసేందుకు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు మేఘా ఇంజనీరింగ్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. చదవండి: షిప్పింగ్ కార్పొరేషన్ వేటలో మేఘా డీఆర్డీవో టెక్నాలజీ సహకారంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ 30 నుంచి 40 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కొక్క ప్లాంటు నుంచి నిమిషానికి 150 నుంచి 1000 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ మొత్తాన్ని డి.ఆర్.డి.వో కల్నల్ బి.ఎస్. రావత్, డా. రాఘవేంద్ర రావు పర్యవేక్షించనున్నారు. మొత్తానికి డి.ఆర్.డి.వో సహకారంతో మేఘా ఇంజనీరింగ్ 35 లక్షల లీటర్ల ఆక్సిజన్ మేఘా సంస్థ ఆస్పత్రులకు సరఫరా చేస్తుంది. ఈ మేరకు ఆయా హాస్పిటల్ నుంచి అభ్యర్థనలు వచ్చాయి. వీటికి అనుగుణంగా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసి సరఫరా చేయనుంది మేఘా సంస్థ. ఇక భద్రాచలం ఐటీసీ నుంచి రోజుకు 30 మెట్రిక్ టన్నుల క్రయోజనిక్ ఆక్సిజన్ ను తీసుకొని ఎంఈఐఎల్ సంస్థ లిక్విడ్ ఆక్సిజన్ గా మార్చనుంది. ఇందుకు అనుగుణంగా భద్రాచలం ఐటీసీ దగ్గర ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ క్రయోజనిక్ ఆక్సిజన్ లభ్యమవుతోంది. స్పెయిన్లో ఉన్న ఎంఈఐఎల్కు సంబంధించి కర్మాగారం నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను దిగుమతి చేసేందుకు సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. అక్కడి ఫ్యాక్టరీ నుంచి 10 నుంచి 15 ట్యాంకులను ఇక్కడి ఆక్సిజన్ నిల్వ, సరఫరా అవసరాల నిమిత్తం ఉపయోగించుకునేందుకు యుద్ధ ప్రాతిపాదికన తీసుకువచ్చేందుకు ఆసక్తి చూపింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసింది. అదే సమయంలో ఎంఈఐఎల్ కు సంబంధించిన నగర శివారులోని పరిశ్రమల్లో క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను యుద్ధ ప్రతిపాదికన తయారు చేసి అందించేందుకు కూడా సంసిద్ధత తెలిపింది. ఇందుకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్ లతో పాటు డాక్యుమెంట్లను ప్రభుత్వానికి అందించనుంది. ప్రభుత్వ పరిశీలన, అనుమతి అనంతరం వాటి తయారీకి వెంటనే రంగంలోకి దిగుతుంది. -
షిప్పింగ్ కార్పొరేషన్ వేటలో మేఘా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో (ఎస్సీఐ) ప్రభుత్వ వాటా కొనుగోలుకు శక్తి కలిగిన కంపెనీల జాబితాలో హైదరాబాద్కు చెందిన మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్టక్చర్ (ఎంఈఐఎల్) నిలిచింది. ఎంఈఐఎల్తోపాటు యూఎస్కు చెందిన సేఫ్సీ, ఎన్నారై రవి మెహరోత్రా నేతృత్వంలోని కన్సార్షియం షార్ట్ లిస్ట్ అయిన జాబితాలో ఉన్నాయి. ఎస్సీఐలో ప్రభుత్వ వాటా కొనుగోలుకు ఆసక్తి కనబరిచిన ఈ మూడు కంపెనీలు టెక్నికల్, ఫైనాన్షియల్ ప్రమాణాల విషయంలో అర్హత సాధించాయి. షిప్పింగ్ కార్పొరేషన్లో కేంద్ర ప్రభుత్వం తనకున్న 63.75% వాటాను విక్రయిస్తోంది. ఈ వాటాను దక్కించుకున్న సంస్థ సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం ఆ తర్వాత మరో 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. 1961 అక్టోబరు 2న ఏర్పాటైన ఎస్సీఐ.. భారత్లో అతిపెద్ద షిప్పింగ్ కంపెనీగా ఎదిగింది. సరుకు, ప్రయాణికుల రవాణా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ పెద్ద ఎత్తున బల్క్ క్యారియర్లు, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, ప్రొడక్ట్ ట్యాంకర్స్, కంటైనర్ వెసెల్స్, ప్యాసింజర్/కార్గో వెసెల్స్, ఎల్పీజీ, అమోనియా క్యారియర్లను సొంతంగా కలిగి ఉంది. డిసెంబరు త్రైమాసికంలో షిప్పింగ్ కార్పొరేషన్ రూ.841 కోట్ల టర్నోవర్పై రూ.103 కోట్ల నికరలాభం ఆర్జించింది. కంపెనీ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 0.43 % ఎగసి రూ.115.75 వద్ద స్థిరపడింది. -
రూ.5,000 కోట్లతో ‘మేఘా గ్యాస్’ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా గ్యాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 16 జిల్లాల్లో పైపుల ద్వారా సహజ వాయువును (పీఎన్జీ) గృహాలకు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేయనుంది. ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ ధర 35–40 శాతం తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక వాహనాల కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) స్టేషన్లను సైతం ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టు కోసం సంస్థ రూ.5,000 కోట్లు వెచ్చించనుంది. ఇందులో ఇప్పటికే రూ.1,100 కోట్లు ఖర్చు చేసింది. 2019లో మొదలైన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను మేఘా గ్యాస్ 2026కి పూర్తి చేయాల్సి ఉంటుంది. 2021 డిసెంబర్ నాటికి.. మేఘా గ్యాస్ 7 జియోగ్రాఫికల్ ఏరియాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను చేపట్టింది. మూడు రాష్ట్రాల్లోని 16 జిల్లాలు దీని కింద కవర్ అవుతున్నాయి. 2026 కల్లా పైపుల ద్వారా దాదాపు 11 లక్షల గృహాలకు సహజ వాయువు సరఫరా చేయాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, కర్ణాటకలోని బెల్గాం, తూముకూరు ఏరియాలు పూర్తి అయ్యాయి. ఈ మూడు యూనిట్స్ కింద 62,000 గృహాలకు కనెక్షన్లు ఇచ్చారు. తెలంగాణలోని నల్లగొండ యూనిట్ ఇటీవలే కార్యరూపం దాల్చింది. ఇక రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ ఏరియాలు 2021 డిసెంబరుకల్లా పూర్తి చేయాలన్నది కంపెనీ లక్ష్యం. వచ్చే ఆరేళ్లలో ఈ ఏడు యూనిట్స్లో మొత్తం 250 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని ఎంఈఐఎల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ హెడ్ పి.వెంకటేశ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇందులో 25 స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రత్యక్షంగా 1,000 మంది, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
పోలవరంలో మరో ముఖ్య ఘట్టం
సాక్షి, అమరావతి: పోలవరం స్పిల్ వే పనుల్లో మరో కీలక ఘట్టం మొదలైంది. స్పిల్ వే గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను అమర్చే ప్రక్రియను మేఘా సంస్థ సోమవారం ప్రారంభించింది. ఈ హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను జర్మనీకి చెందిన మాంట్ హైడ్రాలిక్ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు. జర్మనీ నుంచి సంస్థ ఇంజనీర్లు పోలవరానికి చేరుకుని గేట్లకు సిలిండర్ల బిగింపు పనులను పర్యవేక్షిస్తున్నారు. వరద పోటును తట్టుకునేలా... పోలవరం పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 అడుగులు కాగా గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరాక మిగులు జలాలను స్పిల్ వే ద్వారా దిగువకు విడుదల చేస్తారు. 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజీకి గోదావరి నుంచి 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. గోదావరి చరిత్రలో ఇప్పటివరకూ వచ్చిన గరిష్ట వరద ప్రవాహం అదే. పోలవరం జలాశయం భద్రత దృష్ట్యా గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్ వే నిర్మాణ డిజైన్లను కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించింది. ఆ మేరకు 1,128 మీటర్ల పొడవున స్పిల్ వేను నిర్మిస్తున్నారు. స్పిల్ వే పిల్లర్లకు 25.72 అడుగుల నుంచి 45.72 అడుగుల మధ్య 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను అమర్చాలి. ఇప్పటికే 29 గేట్లను అమర్చారు. ఒక్కో గేటు బరువు 300 టన్నులు ఉంటుంది. పోలవరం ప్రాజెక్టులోకి నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరాక వరదను దిగువకు విడుదల చేయాలంటే గేట్లను ఎత్తాలి. వరద ప్రవాహం తగ్గాక నీటిని గరిష్ట స్థాయిలో నిల్వ చేయాలంటే గేట్లను దించాలి. ఇలా గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ఒక్కో గేటుకు కుడి వైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి చొప్పున రెండు హైడ్రాలిక్ సిలిండర్లను అమర్చాలి. తాజాగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. గేట్లు, హైడ్రాలిక్ సిలిండర్ల అమరిక ఇలా.. ► భారీ క్రేన్లతో ఆర్మ్ గడ్డర్లను ఎత్తి పిల్లర్లలో నిర్మించిన ట్రూనియన్ బీమ్కు బిగిస్తారు. రెండు పిల్లర్ల ట్రూనియన్ బీమ్ బ్రాకెట్లకు ఒక్కోదానికి నాలుగు ఆర్మ్ గడ్డర్ల చొప్పున బిగిస్తారు. రెండు పిల్లర్లకు బిగించిన ఆర్మ్ గడ్డర్స్ను హారిజాంటల్ గడ్డర్లతో అనుసంధానం చేస్తారు. ► భారీ క్రేన్ల సహకారంతో ఎనిమిది స్కిన్ ప్లేట్లను ఎత్తి రెండు పిల్లర్లకు అమర్చిన ఆర్మ్ గడ్డర్స్, హారిజాంటల్ గడ్డర్స్ మధ్య ఎగువన నాలుగు స్కిన్ ప్లేట్లు(ఎలిమెంట్స్), దిగువన నాలుగు స్కిన్ ప్లేట్లను అతికిస్తారు. స్కిన్ ప్లేట్ల మధ్య ఖాళీ ప్రదేశాలు లేకుండా వెల్డింగ్ చేస్తారు. దీంతో ఒక గేటు సిద్ధమవుతుంది. ► పిల్లర్లకు 45 మీటర్ల ఎత్తు వద్ద డౌన్ స్ట్రీమ్ (స్పిల్ వేకు దిగువ) వైపు కార్దానిక్ అరైంజ్మెంట్కు బిగిస్తారు. రెండు పిల్లర్లకు ఏర్పాటు చేసిన కార్దానిక్ అరైంజ్మెంట్.. గేటు అడుగున ఉన్న హారిజాంటల్ గడ్డర్కు అమర్చిన బ్రాకెట్ మధ్య స్పిల్ వేకు ఇరువైపులా డౌన్ స్ట్రీమ్లో ఒక్కొక్కటి 215 టన్నుల సామర్థ్యంతో కూడిన రెండు హైడ్రాలిక్ సిలిండర్లను బిగిస్తారు. స్పిల్ వే పిల్లర్లకు 55 మీటర్ల స్థాయిలో ఏర్పాటు చేసిన పవర్ ప్యాక్లతో కార్దానిక్ అరైంజ్మెంట్ను అనుసంధానం చేస్తారు. ప్రతి రెండు గేట్లకు ఒకచోట ఈ పవర్ ప్యాక్లను అనుసంధానం చేస్తూ స్పిల్ వే బ్రిడ్జిపై కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తారు. గేట్లను ఎత్తాలకున్నప్పుడు కంట్రోల్ రూమ్ వద్దకు వెళ్లి పవర్ ప్యాక్ స్విచ్ ఆన్ చేస్తారు. గేటుకు అడుగున హారిజాంటల్ గడ్డర్కు ఇరు వైపులా బిగించిన హైడ్రాలిక్ బ్రాకెట్కు అమర్చిన హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ సహకారంతో గేటుపైకి లేస్తుంది. నిమిషానికి అర మీటర్ చొప్పున గేటు పైకి లేస్తుంది. దించాల నుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తారు. పిల్లర్ 45 మీటర్ల స్థాయిలో కార్దానిక్ అరైంజ్మెంట్కు అమర్చిన హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల సహాయంతో గేటు కిందకు దిగుతుంది. ► జర్మనీ నుంచి ఇప్పటికే 70 సిలిండర్లు పోలవరానికి చేరుకున్నాయి. మిగిలిన 26 సిలిండర్లు మార్చి 15లోగా పోలవరానికి చేరుకుంటాయి. ఒకవైపు ఇప్పటికే అమర్చిన 29 గేట్లకు సిలిండర్లను బిగిస్తూ మరోవైపు మిగిలిన 19 గేట్లను బిగిస్తూ వాటికి సిలిండర్లను అమరుస్తారు. ఈ ప్రక్రియను ఏప్రిల్లోగా పూర్తి చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. -
పోలవరం: మరో కీలక ఘట్టానికి శ్రీకారం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం పర్యటన అనంతరం నిర్మాణపు పనుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అరుదైన పద్ధతిలో పోలవరం ప్రాజెక్ట్ హైడ్రాలిక్ క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రక్రియ ప్రారంభించింది. అలాగే ప్రాజెక్ట్లోని కీలకమైన 48 గేట్ల ఏర్పాటు కోసం అవసరమైన ఆర్మ్స్ (ఇరుసు) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ముందుగా స్పిల్వేకి కీలకమైన గేట్ల అమరికను అధికారులు ప్రారంభించారు. గేట్లను లిఫ్ట్ చేసే ఆర్మ్ గడ్డర్ల అసెంబ్లింగ్ను మొదలుపెట్టారు. ఈ మేరకు గురువారం ఉదయం మేఘా సంస్థ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 45 పిల్లర్కు ఆర్మ్ గడ్డర్ను అనుసంధానం చేశారు. గేట్లు అమర్చేందుకు కీలకమైన ఆర్మ్ గడ్డర్ కీలకమైనవని ప్రాజెక్ట్ సీఈ సుధాకర్ బాబు తెలిపారు. వచ్చే సంవత్సరం మే చివరి నాటికి పూర్తిస్థాయిలో 48 గేట్లకు సంబంధించిన పనులను పూర్తి చేస్తామన్నారు. నిర్ధేశించిన సమయానికి పనులు పూర్తి చేస్తామని దానికి సంబంధించి అధికారులు, మెగా సంస్థ ప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.(చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్) ఆర్మ్ గడ్డర్ల ఉపయోగం ఒక్కో గేటుకు ఎనిమిది ఆర్మ్ గడ్డర్లు ఉంటాయి. అదే విధంగా నాలుగు హారిజాంటల్ గడ్డర్లు ఉంటాయి. కుడి పక్కన నాలుగు, ఎడమ పక్కన నాలుగు ఆర్మ్ గడ్డర్లు ఉంటాయి. వీటిని ఆర్మ్ అసెంబ్లింగ్ అంటారు. ఆర్మ్ అసెంబ్లింగ్ మొత్తం31టన్నులు ఉంటుంది. మొత్తం 12 గడ్డర్లు ఉంటాయి. ఇలా 48 గేట్లుకు సంబంధించి 384 ఆర్మ్ గడ్డర్లు,192 హారిజాంటల్ గడ్డర్లు ఉంటాయి. ఒక్కో ఆర్మ్ గడ్డర్ 16మీటర్లు పొడవు ఉంటుంది. ఆర్మ్ గడ్డర్లు, హారిజాంటల్ గడ్డర్లు అసెంబ్లింగ్ చేసిన తరువాత స్కిన్ ప్లేట్ అమర్చుతారు. ఈ ఆర్మ్ గడ్డర్లు సాయంతో గేట్లకు సంబంధించిన స్కిన్ ప్లేట్ను పైకి లేపుతారు. ఎంత ఎత్తుకు గేటును లేపాలనుకుంటే అంత ఎత్తులో లేపడానికి ఈ ఆర్మ్ గడ్డర్లు ఉపయోగపడతాయి. ఇక గేట్లు ఎత్తడానికి, దించడానికి ఈ ఆర్మ్ గడ్డర్లే ఆధారం. ట్రూనియన్ గడ్డర్లకు ప్రిస్ట్రెస్సింగ్ చేసి ఈ ఆర్మ్ గడ్డర్లు ఏర్పాటు చేస్తారు. గేట్ స్కిన్ ప్లేట్ లిప్ట్ చేయడానికి ఒక్కోగేటుకు 8 స్కిన్ ప్లేట్లు ఉంటాయి. వీటిని అన్నింటిని ఒక్కటిగా చేస్తే గేటు తయారు అవుతుంది. గేట్లును ఎత్తడానికి హైడ్రాలిక్ సిలిండర్లు సాయంతో లిప్ట్ చేస్తారు. మొత్తం 48 గేట్లుకుగానూ 96 హైడ్రాలిక్ సిలిండర్లు అవసరం అవుతాయి. ఒక్కోగేటు 20.835 మీటర్లు ఎత్తు,15.96 మీటర్లు వెడల్పు ఉంటుంది. మొత్తం గేట్లు నిర్మాణానికి 18వేల టన్నుల స్టీల్ వినియోగిస్తారు. ఒక్కో గేటు 275 టన్నుల బరువు ఉంటుంది. -
లక్ష్యం దిశగా పోలవరం ప్రాజెక్ట్ పనులు
సాక్షి, అమరావతి: ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా.. ఆ కుట్రలను అధిగమించి పోలవరం ప్రాజెక్ట్ పనులు లక్ష్యం దిశగా వెళుతున్నాయి. వరదలు వచ్చినా, తుఫానులు అల్లకల్లోలం సృష్టించినా, కోవిడ్ మహమ్మారి భయపడుతున్నా అక్కడ మాత్రం పనులు ఆగడం లేదు. రేయింబవళ్లు చకచకా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలకు మేఘా సంస్థ శక్తి సామర్థ్యాలు తోడు కావడంతో అసాధ్యమల్లా అనతికాలంలోనే సుసాధ్యం కానుంది. ప్రపంచంలో అతిపెద్ద స్పిల్ వే, అధునాతన సాంకేతిక పద్ధతుల్లో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. చదవండి: పరుగులు పెడుతున్న పోలవరం పనులు పోలవరం ప్రపంచంలోనే ఒక బృహత్తర ప్రాజెక్టు. 50 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా తట్టుకునేలా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రాజెక్ట్ లోని ప్రధానమైన స్పిల్ వే డ్యాం, కాఫర్ డ్యాం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రపంచ స్థాయి ప్రమాణాలను పాటిస్తూ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం ఆంధ్రప్రదేశ్ లో 7లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందివ్వడంతో పాటు తాగునీటి, పారిశ్రామిక అవసరాలను తీర్చడంతో పాటు జల విద్యుత్ ను ఉత్పత్తి చేయడం. చదవండి: కేంద్ర కేబినెట్ ఆమోదంతోనే పోలవరం ప్రాజెక్టుకు నిధులు అతి పెద్ద ప్రాజెక్టుగా చరిత్రలో... 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపు పని ప్రారంభమైంది. దాదాపు పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి అనుమతులన్నీ ఆయన హయాంలోనే వచ్చాయి. వైఎస్సార్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పోలవరం కుడి కాలువకి సంబంధించిన ప్రధానమైన పనులన్ని పూర్తి అయ్యాయి. ఆయన మరణానంతరం ఈ ప్రాజెక్ట్ పనులు ముందుకు కదలలేదు. తదనానంతరం రాష్ట్ర విభజన జరగడం, కేంధ్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. కానీ 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక తన స్వప్రయోజనాల కోసం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు. అంతేగాక పోలవరం ప్రాజెక్టును తానే కడతానని కేంద్ర ప్రాజెక్టుని రాష్ట్ర ప్రాజెక్టుగా మార్చి రాష్ట్ర రైతాంగం నోట్లో మట్టి కొట్టారు. ఆయన హయాంలో పోలవరం పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ జాప్యం వలన ప్రాజెక్టు వ్యయం మరింతంగా పెరిగి రాష్ట్రానికి గుదిబండగా మారింది. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పోలవరం పనులు ముందుకు సాగాలంటే రివర్స్ టెండరింగ్ విధానంతో పాటు ద్వారా రాష్ట్ర ఖజనాకు ఆదాయాన్ని మిగుల్చుతు పోలవరం నిర్మాణ పనుల మహత్తర కార్యాన్ని మేఘా కంపెనీకి అప్పగించారు. ఈ ప్రాజెక్ట్ లో అన్నీ భారీవే, అరుదైనవే... పోలవరంలో అన్నీ అరుదైన, భారీవే. స్పిల్ వే 50 లక్షల క్యూసెక్కులతో 1.18 కిలోమీటర్ల పొడవైన నిర్మాణం, 55 మీటర్ల ఎత్తుతో 51 బ్లాకులు, నదీ గర్భంలో మూడు (ఈసిఆర్ఎఫ్ గ్యాప్..1,2,3) రాతి, మట్ట కట్ట నిర్మాణాలు, ఈ మూడింటి పొడవు 2.35 కిలోమీటర్లు. ఇవి అరుదైన, అతిపెద్ద నిర్మాణాలు. స్పిల్ వే వైపు అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం ఎంత పెద్ద వంటే 50 లక్షల క్యూసెక్కులు ప్రవహించేలా నిర్మిస్తున్నారు. అప్రోచ్ ఛానెల్ 2.31 కిలోమీటర్ల పొడవు, స్పిల్ ఛానెల్ మరింత పెద్దది. ఇది 1000 మీటర్ల (1 కి.మి) వెడల్పు, 2.94 కిలోమీటర్ల పొడవు, పైలెట్ ఛానెల్ 1000 మీటర్ల వెడల్పు, 1000 మీటర్ల పొడవు. ప్రపంచాన్ని కరోనా కబళిస్తున్న, ప్రకృతి వైపరిత్యాల వలన తీవ్రమైన వరదలు సంభవించిన మొక్కవోని దీక్షతో పనులు కొనసాగించి పోలవరం ప్రాజెక్టు కి ఒక రూపు తీసుకు వచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వం. అతి కొద్ది సమంలోనే పోలవరం ప్రాజెక్టు యొక్క కాంక్రీట్ పనులను చాలా వరకు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో నిరూపించారు. అధునాతన భారీ రేడియల్ గేట్లు ప్రపంచంలోనే భారీ వరద నీరు ప్రవహించే విధంగా నిర్మిస్తున్న స్పిల్వే లో భారీ గేట్లు ఏర్పాటు కానున్నాయి. మొత్తం 48 గేట్లు హైడ్రాలిక్ పద్ధతిలో మేఘా సంస్థ ఏర్పాటు చేయనుంది. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ స్వరూపం ఆగమ్య గోచరంగా ఉండగా, ముఖ్యమంత్రి రంగంలోకి దిగాక అనతికాలంలోనే 28 మీటర్లు ఎత్తుగా ఉన్నా పియర్ పిల్లర్లను 52 మీటర్ల ఎత్తు వరకు నిర్మించారు. మొత్తం 192 గడ్డర్స్ పూర్తి చేసి, 84 గడ్డర్లను స్పిల్ వే పై అమర్చడంతో పాటు మిగిలిన బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన షట్టరింగ్ పనులను శరవేగంగా చేస్తున్నారు. పియర్ పిల్లర్ల పై 250 మీటర్ల పొడవైన కాంక్రీట్ స్లాబ్ నిర్మాణము పూర్తి చేశారు. వీటి తో పాటే ప్రాజెక్ట్ లో కీలకమైన ట్రన్నియన్ బీమ్స్ ని అత్యాధునిక యంత్ర సామగ్రితో అమర్చుతున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి కావాలని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటే వారి ఆశలు నెరవేర్చే విధంగా త్వరలోనే పోలవరం ఫలాలు అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఒక యజ్జంలా ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్దేశించిన సమయంలోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని మేఘా కృత నిశ్చయంతో ఉంది. -
పరుగులు పెడుతున్న పోలవరం పనులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ కలల ప్రాజెక్ట్ పోలవరం. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాష్ట్రంలో సగం జనాభాకు సాగు, తాగునీటి సమస్యలు ఉండవు. దశాబ్ధాలుగా ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలన్నది ప్రజల చిరకాల వాంచ. దీన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించగా.. ఇప్పుడు ఆయన కుమారుడు సీఎం జగన్ పూర్తి చేస్తున్నారు. మధ్యలో వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఏటీఎంలా వాడేశాడన్న అపవాదును మూటగట్టుకున్నారు. ఇక అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా ఏకంగా పోలవరం పూర్తి చేస్తాం అంటూ అసెంబ్లీలో తొడగొట్టారు. కానీ పూర్తి చేసి చూపించలేకపోయారు. పోలవరానికి రూ.2,234.288 కోట్లు విడుదల స్వయంగా దేశ ప్రధాని మోదీ కూడా చంద్రబాబు ప్రభుత్వం పోలవరంను ఏటీఎంలా వాడేసిందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో పోలవరం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండేవి. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక.. పోలవరం పనులు మేఘా చేపట్టాక వాయువేగంతో పనులు నడుస్తున్నాయి. కరోనా వచ్చినా.. వరదలు ముంచెత్తినా పనులు మాత్రం ఆగకుండా కమిట్ మెంట్ తో సాగుతున్నాయి. రాత్రి పూట కూడా పనులు జరుగుతున్నాయి. అత్యంత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే యూనిక్యూ మెషీన్లను పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆ సంస్థ వాడుతూ పనులు పూర్తి చేస్తోంది. డెడ్ లైన్ లోపల ప్రాజెక్ట్ పూర్తి చేయాలని పట్టుదలతో ముందుకెళుతోంది. ఏపీ వాదనకు పీపీఏ మద్దతు పోలవరం పనులను చంద్రబాబు సర్కార నత్తకు నడక నేర్పేలా చేస్తే.. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రాజెక్ట్ను చిరుత వేగంతో పూర్తి చేస్తోంది. మేఘా ఇంజనీరింగ్ సంస్ద ఈ సంవత్సర కాలంలో స్పిల్ వేను శరవేగంతో పూర్తి చేస్తోంది. అంతకు ముందు పియర్స్ ఎత్తు సరాసరి 28 మీటర్లు ఉంటే.. ఇప్పుడు 52 మీటర్లు కు నిర్మాణం పూర్తి కావడం విశేషంగా చెప్పొచ్చు. ఇప్పటికే 171 గడ్డర్లు నిర్మాణం పూర్తి అయ్యింది. గడ్డర్లు నిర్మాణం పూర్తి అవ్వడమే కాకుండా దాదాపు 84 గడ్డర్లును స్పిల్ వే పియర్స్ పై పెట్టి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించింది. 10పియర్స్ పై బ్రిడ్జి శ్లాబు నిర్మాణం దాదాపు 250మీటర్లు పూర్తి అయ్యింది. మిగతా పియర్స్ మీద గడ్డర్ల ఏర్పాటుతో పాటు, షట్టరింగ్ వర్క్, స్టీల్ అమరిక ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గేట్లు ఏర్పాటులో కీలకమైన ట్రూనియన్ భీంల నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 20 ట్రూనియన్ భీంల నిర్మాణం పూర్తయ్యింది. పూర్తి అయిన ట్రూనియన్ భీంల దగ్గర గేట్లు ఏర్పాటుకు సంబందించిన ప్రిలిమినరీ పనులు జరుగుతున్నాయి.స్పిల్ వేలో ఇప్పటి వరకు 1,94,944 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్పిల్ ఛానెల్ లో 1,10,033 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని,10,64,417 క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వకం పనులు ఇప్పటివరకు పూర్తయ్యాయి.అయితే జూన్ నుండి స్పిల్ ఛానెల్లోకి వరద నీరు రావటంతో పనులు నిలిచిపోయాయి. వరద నీరు తోడటం ప్రారంభించి త్వరలోనే మట్టి తవ్వకం పనులు,కాంక్రీట్ పనులు ప్రారంభించనున్నారు. ఈ సీజన్ లో పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించారు. గ్యాప్-1 ఢయా ఫ్రంవాల్ నిర్మాణ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. 2కాలమ్స్ నిర్మాణ పనులు కూడా పూర్తి అయ్యాయి. గ్యాప్-3లో మట్టి తవ్వకం పనులు,కొండ రాయి తవ్వకం పనులు పూర్తి అయ్యాయి. కీలకమైన 902కొండ తవ్వకం పనులను 1,88,623 క్యూబిక్ మీటర్లు పూర్తి అయ్యాయి. వరదల వల్ల పాడైపోయిన ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులును సైతం వేగం చేసింది మేఘా సంస్థ. కరోనా కాలంలో.. గోదావరి ఉగ్రరూపంతో పొంగుతున్న సమయంలోనూ ఏపీ ప్రభుత్వం, మేఘా సంస్థ పోలవరంను పరుగులు పెట్టిస్తుండడం విశేషంగా మారింది. గడువులోపు పూర్తి చేసి తరతరాల నిర్లక్ష్యానికి చెక్ పెట్టాలని యోచిస్తున్నాయి. ముఖ్యమంత్రి పట్టుదల.. మేఘా పనితనంతో ఏపీ ప్రజల చిరకాల వాంచ, కలల ప్రాజెక్ట్ పూర్తి అవుతోంది. సకాలంలోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి సిద్ధం అవుతోంది. -
కీలక రోడ్డు నిర్మాణాలు చేపట్టిన మేఘా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ మౌళిక సదుపాయాల సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ’ పాలుపంచుకుంటోంది. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్టులు పూర్తిచేసిన ఆ సంస్థ ఏపీలోని అత్యంత కీలకమైన ప్రాజెక్టులు చేపట్టింది. ఉత్తర భారతానికి, దక్షిణ భారత్ కు కీలకమైన ఏపీలోని రహదారులను నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రెండు కీలకమైన ఈ రహదారులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించనుంది. వీటిని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షత వహించారు. పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రెండు రోడ్ల నిర్మాణంతో రవాణా వాహనాలకు సమయం, ఇంధనం ఆదా కానున్నాయి. 16వ నెంబర్ జాతీయ రహదారిలో భాగంగా చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు బైపాస్ రోడ్ నిర్మాణం ఎంఈఐఎల్ చేపట్టింది. ఇది 30 కిలోమీటర్ల పొడవున్న ఆరు లేన్ల రహదారి. ఈ రోడ్ నిర్మాణం పూర్తి అయితే వాహన దారులు, ముఖ్యంగా రవాణా వాహనాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, కోల్ కతా నుంచి వచ్చే వాహనాలు విధిగా విజయవాడ నగరం గుండా చెన్నై వెళ్లాలి. ఈ బైపాస్ రోడ్ నిర్మాణం పూర్తి అయితే హైదరాబాద్, కోల్ కతా నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు ఇక నేరుగా వెళ్లవచ్చు. అలాగే నాయుడుపేట-రేణిగుంట 71వ నెంబర్ జాతీయ రహదారి ని మేఘా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ రహదారి రెండు లేన్లలో మాత్రమే ఉంది. వాహనాల రద్దీ వల్ల నిత్యం ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్తో అటు వాహన దారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన పుణ్యక్షేతం తిరుమలకు వెళ్లే రహదారుల్లో ఇది కీలక మైంది. ఈ 57 కిలోమీటర్ల ఆరు లేన్ల రోడ్ నిర్మాణం పూర్తి అయితే అటు తిరుమలకు, ఇటు చెన్నై, అటు బెంగళూరు, రేణిగుంట విమానాశ్రయం, శ్రీకాళహస్తి దేవాలయంపై వెళ్లేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. నాయుడుపేట, రేణిగుంత జాతీయ రహదారిలోని నాయుడుపేట, రేణిగుంట, శ్రీకాళహస్తి, ఏర్పేడు పట్టణాలకు బైపాస్ రోడ్డును ఎంఈఐఎల్ నిర్మిస్తోంది. జాతీయ రహదారి ప్రోజెక్టుల శంకుస్థాపన సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో రోడ్లు కీలక పాత్ర పోషిస్తాయి అన్నారు. ఆంధ్ర ప్రదేశ్లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం తన వంతు సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఏపీ రహదారుల సమస్యలపై త్వరలో కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమావేశం అవుతామని, హైవేలపై రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల నెట్వర్క్ అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు. ఇప్పటికే పలు ముఖ్యమైన జాతీయ రహదారుల ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని వాటిని ఆమోదించటంతో పాటు, తాము ప్రతిపాదించే మరికొన్నింటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని వివరించారు. -
మేఘా ‘జోజిలా’ టన్నెల్ పనులు ప్రారంభం
న్యూఢిల్లీ: శ్రీనగర్ లోయ, లేహ్ను అనుసంధానించేందుకు ఉద్దేశించిన జోజిలా టన్నెల్ నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. నిర్దేశించుకున్న షెడ్యూల్ కన్నా ముందుగా నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తి కాగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇ¯Œ ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) పోటీ సంస్థల కన్నా అత్యంత తక్కువగా కోట్ చేసి ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. ఎంఈఐఎల్ రూ. 4,509.5 కోట్లకు బిడ్ వేసింది. సుమారు 14.15 కి.మీ. పొడవుండే ఈ టన్నెల్ను షెడ్యూల్ ప్రకారం ఆరేళ్లలో పూర్తి చేయాలి. ఇది పూర్తయితే ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్గా నిలుస్తుంది. శ్రీనగర్–లేహ్ మధ్య ప్రయాణ సమయం 3 గం.ల నుంచి 15 నిమిషాలకు తగ్గిపోతుంది. శ్రీనగర్–కార్గిల్–లేహ్ జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తున ఉండటంతో ఇది వ్యూహాత్మక ప్రాజెక్టుగా మారింది. సాధారణంగా శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్–లేహ్ మధ్య మార్గాన్ని మూసేయాల్సి ఉంటోంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడాది పొడవునా ప్రయాణాలకు వీలవుతుంది. -
ఆసియాలోనే పొడవైన టన్నెల్ పనులు ప్రారంభం
న్యూఢిల్లీ: ఆసియాలోని అతి పొడవైన జోజిలా టన్నెల్ పనులను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రారంభించారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లో రవాణాకు ఉపయోగపడేలా ఈ టన్నెల్ ను మేఘా ఇంజినీరింగ్ నిర్మిస్తోంది. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఈ రహదారి ఏర్పాటవుతోంది. కార్గిల్ ప్రాంతాన్ని కాశ్మీర్ లోయతో కలిపేలా జోజిలా టన్నెల్ పనులను ఎంఈఐఎల్ చేపట్టింది. ఈ సొరంగం పొడవు 14.15 కి.మీ.లు కాగా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనది. ఇది ఆసియా రెండు దిశలలో పొడవైన సొరంగం. ‘ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేయడంలో ఎంతో పేరుగాంచిన ఎంఈఐఎల్ ఈ రహదారిని నిర్మాణ పనులను కూడా నాలుగేళ్ళలోనే పూర్తి చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పాలని’ కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా ఈ సొరంగ నిర్మాణం పూర్తయితే లద్దాఖ్, శ్రీనగర్ మధ్య ఏడాది పొడవునా ప్రయాణించవచ్చు. ఈ రెండింటి మధ్య ప్రయాణం దాదాపు 3.30 గంటలు పడుతుంది ఈ రహదారి నిర్మాణంతో 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. 11,578 అడుగుల ఎత్తులో ఉన్న జోజిలా పాస్ లో మంచు కారణంగా స్తంభించింది. జోజిలా సొరంగం నిర్మాణంతో శ్రీనగర్, లేహ్ మధ్య సంవత్సరమంతా కనెక్టివిటీతో జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రాంతాల ఆర్థిక, సామాజిక- సాంస్కృతిక ఏకీకరణకు ఈ రహదారి దోహదపడుతుంది. (చదవండి: ‘చనిపోయాడు.. కానీ ఆత్మ విడిచిపెట్టలేదు’) దాదాపు 33 కిలోమీటర్ల జోజిలా రహదారిని 2 విభాగాలుగా నిర్మిస్తున్నారు. మొదటి విభాగంలో 18.63 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేసి నిర్మించాలి. రెండో విభాగంలో జోజిల్లా టన్నెల్ ను 14.15 కిలోమీటర్ల మేర రెండు రహదారుల లైన్ గా 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తు నిర్మిస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థ దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతనమైన రీతిలో క్లిష్టమైన పరిస్థితిలో ఈ టన్నెల్, రహదారిని నిర్మిస్తోంది. యూరోపియన్ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత అధునాతన భద్రతా వ్యవస్థతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఎమెర్జెన్సీ లైటింగ్, ఆటోమెటిక్ లైటింగ్, మెసేజ్ సిగ్నలింగ్, ఎమెర్జెన్సీ టెలిఫోన్, రేడియా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గంలో గంటకు 80 కి.మి. వేగంతో ప్రయాణించవచ్చు. జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ నుంచి లడఖ్ లేహ్ ప్రాంతానికి ఉన్న రహదారి ఏడాది పొడవునా వాహనాలు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండడం లేదు. ముఖ్యంగా శీతాకాలంలో ఆరు నెల్లపాటు శ్రీనగర్- లడఖ్ రహదారిని పూర్తిగా మూసివేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మిలటరీకి సంబంధించిన వాహనాలు కూడా ప్రయాణించలేకపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసాలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే వ్యయంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. The watershed moment in the road history of the UTs of Jammu & Kashmir & Ladakh is finally here. Today virtually initiated the 'ceremonial blast' of #ZojilaTunnel in the presence of MoS @Gen_VKSingh Ji,... pic.twitter.com/iYMKdOzlNM — Nitin Gadkari (@nitin_gadkari) October 15, 2020 -
‘ప్రైవేటు రైళ్ల’ కోసం కంపెనీల క్యూ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాణికుల ప్రైవేటు రైలు సర్వీసుల కోసం పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ప్రైవేటు రైళ్ల నిర్వహణకు తమకు తగిన అర్హతలు ఉన్నాయని నిరూపించుకునేందుకు (రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్) దరఖాస్తులను ఆహ్వానించగా.. 12 క్లస్టర్లకు 15 కంపెనీల నుంచి మొత్తం 120 దరఖాస్తులు దాఖలైనట్టు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. వీటిల్లో ఒక్కటి మినహా మిగిలినవన్నీ భారతీయ కంపెనీలే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా కూడా పాల్గొన్నది. పీపీపీ విధానంలో.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద దేశవ్యాప్తంగా 12కు పైగా క్లస్టర్లలో 140 మార్గాల్లో (రానుపోను) 151 అధునాతన రైళ్లను ఎంపికైన సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే నెట్వర్క్పై ప్రయాణికుల రైళ్ల నిర్వహణకు ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ఇదే మొదటిసారి. మొత్తం మీద రూ.30,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్(ఆర్ఎఫ్క్యూ) అన్నది మొదటి దశ. ఈ దశలో తగిన అర్హతలు కలిగిన సంస్థలను రైల్వే శాఖ ఎంపిక చేస్తుంది. వీటి నుంచి రెండో దశలో.. ప్రతిపాదనలను (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్/ఆర్ఎఫ్పీ) ఆహ్వానిస్తుంది. ‘‘దరఖాస్తుల మదింపు ప్రక్రియను రైల్వే శాఖ వేగంగా పూర్తి చేస్తుంది. అర్హత సాధించిన కంపెనీలకు ఆర్ఎఫ్పీ పత్రాలు 2020 నవంబర్ నాటికి అందుబాటులో ఉంటాయి. 2021 ఫిబ్రవరి నాటికి అన్ని క్లస్టర్ల కేటాయింపును పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాము’’ అని రైల్వే శాఖ ప్రకటించింది. సికింద్రాబాద్ క్లస్టర్కు 10 దరఖాస్తులు సికింద్రాబాద్ క్లస్టర్కు 10 దరఖాస్తులు వచ్చాయని రైల్వే శాఖ తెలిపింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్తోపాటు.. జీఎంఆర్ హైవేస్ లిమిటెడ్, ఐఆర్సీటీసీ, అరవింద్ ఏవియేషన్, బీహెచ్ఈఎల్, కన్స్ట్రక్షన్స్ వై ఆక్సిలర్ డీ ఫెర్రోక్యారైల్స్, ఎస్ఏ, క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 3, గేట్వే రైల్ ఫ్రయిట్ లిమిటెడ్, ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, ఎల్అండ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, మాలెంపాటి పవర్ ప్రైవేటు లిమిటెడ్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, సాయినాథ్ సేల్స్ అండ్ సర్వీసెస్, వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్ సంస్థలు ఆర్ఎఫ్క్యూలు సమర్పించాయి. -
మేఘా చేతికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్).. ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దక్కించుకుంది. హిమాలయాల్లోని జమ్మూకాశ్మీ ర్–లద్దాఖ్లోని జోజిల్లా పాస్ టన్నెల్ నిర్మాణ టెండర్లలో కంపెనీ లోయెస్ట్ బిడ్డర్గా నిలిచింది. నేషనల్ హైవేస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫైనాన్స్ బిడ్లను శుక్రవారం తెరిచింది. ప్రాజెక్టు వ్యయం రూ.4,509.50 కోట్లు. మొత్తం పనిని దాదాపు 33 కిలోమీటర్ల మేర 2 విభాగాలుగా చేపట్టాల్సి ఉంటుంది. మొదట 18.50 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేయాలి. 2 కిలోమీటర్లు, 0.5 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగ మార్గాలను (టన్నెల్స్) నిర్మించాలి. అలాగే జోజిల్లా టన్నెల్ను 14.15 కిలోమీటర్ల మేర రెండు వరుసల్లో రోడ్డును 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తులో గుర్రపు నాడా ఆకారంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతన రీతిలో, క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సిహెచ్.సుబ్బయ్య తెలిపారు. ప్రాజెక్టును 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి లద్దాఖ్ లేహ్ ప్రాంతంలో ఉన్న రహదారిని ఏడాదిలో 6 నెలలపాటు పూర్తిగా మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్కు రహదారి టన్నెల్ నిర్మించాలని గతంలోనే ప్రతిపాదించారు. అయితే ఆచరణలో మొదటి అధ్యాయం ఇప్పటికి సాధ్యం అయ్యింది. మొత్తం మూడు సంస్థలు పోటీపడ్డాయి. -
పోలవరంలో మరో ముందడుగు
సాక్షి, అమరావతి: దశాబ్ధాల ఆంధ్రప్రదేశ్ కల నెరవేరబోతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పోలవరం ప్రాజెక్ట్పై దృష్టి సారించారు. ఆ కలను ఇప్పుడు పట్టుదలతో నెరవేర్చబోతున్నారు. పోలవరంలో భారీ గేట్లను చురుగ్గా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అరుదైన హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు పనిచేసేలా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ పద్ధతిలో గేట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన గిడ్డర్ల బిగింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. (నిర్లక్ష్యమే కారణం) ఇందుకోసం నిన్న పూజలు నిర్వహించి సూచన ప్రాయంగా పనులు ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి మొత్తం గిడ్డర్ల ప్రక్రియ మొదలైంది. వీటిని ఏర్పాటు చేసిన తరువాత హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే గేట్లను బిగిస్తారు. దీనివల్ల వరదలు వచ్చినా రాకపోయినా గేట్ల నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది. వానాకాలం వచ్చినా.. గోదావరి వరద పొంగినా పనులు ఆగకుండా పనులు చేపట్టారు. ప్రపంచంలోనే ఎవరూ చేయడానికి సాహసించని అద్భుతమైన టెక్నాలజీతో పోలవారాన్ని పరుగులు పెడుతున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద గడ్డర్లు ఏర్పాటు పోలవరంలో ఈ వానాకాలం అత్యధిక వరద వస్తుంటుంది. ఈ వరద కారణంగా గోదావరిలో ప్రాజెక్టులు కట్టడం చాలా కష్టమయ్యేది.. అందుకే కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేసింది. పనులు ఆగకుండా వానాకాలం వరదలోనూ పనులు చేసేలా ప్లాన్ చేసింది. పోలవరంకు ఉన్న మొత్తం గేట్లకు (48) సంబంధించిన గడ్డర్ల బిగింపు పని 45-46 బ్లాకులోని పిల్లర్ల మీద మొదటి గడ్డర్ ను అమర్చటం మేఘా సంస్ధ నిపుణులు, నీటిపారుదల అధికారులు పర్యవేక్షణలో ప్రారంభమయ్యింది. ఒక్కో గడ్డర్ సామర్థ్యం ఎంత పెద్దదంటే ఒక్కొక్క దాని బరువు 62 టన్నులు. అత్యంత క్లిష్ట, కీలకమైన పని ఇది. ఇక ప్రాజెక్టులోని స్పిల్ వే లోని 52 బ్లాక్స్ కు సంబంధించిన పియర్స్ నిర్మాణం పూర్తి కావచ్చింది. స్పిల్వే పియర్స్ పై గడ్డర్లు ఏర్పాటు చేస్తే స్పిల్ ఛానల్ పనులలో సింహ భాగం పూర్తి అయినట్లే. ప్రస్తుతం ఇవి 52 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. బల్లపరుపు నేలపై కాంక్రీట్ వేయటం, రికార్డులు సాధించటం పెద్ద గొప్ప కాదు. ఇరుకైన పియర్స్ పై కాంక్రిటింగ్, అదీ బహుళార్ధసాధక ప్రాజెక్ట్ నియమనిబంధనలకు అనుగుణంగా చేయటం అనేది క్లిష్టమైంది. అంతటి క్లిష్టమైన పనిని కూడా పోలవరంలో పూర్తి చేస్తున్నారు. స్పిల్ వే మొత్తం దూరం 1.2 కిలో మీటర్లు. ఇది ప్రపంచంలోనే పెద్దది. ఇంతవరకూ చైనాలోని త్రీ గార్జెస్ డ్యాంలో 47 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తే ఇక్కడ 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా పోలవరంలో స్పిల్ వే నిర్మిస్తున్నారు. జలాశయంలో నీటిని నిల్వ చేసి వరద వచ్చినప్పుడు కిందకు విడుదల చేసేందుకు కీలకమైనదే స్పిల్వే. స్పిల్వే పనిచేయాలంటే గేట్ల నిర్వహణ ముఖ్యమైనది. గేట్లు పనిచేయడానికే గడ్డర్లు ఉపయోగపడతాయి. వాటిపై హాయిస్ట్ వ్యవస్థను ఏర్పాటుచేసి తద్వారా గేట్లను నియంత్రిస్తారు. బరువు 62 టన్నులు.. భారీ గడ్దర్లు.. పోలవరం స్పిల్వే పియర్స్ పై 196 గడ్డెర్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కో గడ్దర్ బరువు 62 టన్నులు. ఇప్పటికే 110 గడ్డర్లు స్పిల్ వే పై ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయి. కేవలం రెండునెలల్లో వీటిని సిద్ధం చేశారు. మిగిలిన వాటిని సిద్ధం చేస్తున్నారు. ఒక్కొక్క గడ్డర్ పొడవు దాదాపు 22.5 మీటర్లు ఉంటుంది. ఒక్కో గడ్దర్ తయారీకి 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 10 టన్నుల స్టీల్ ను వినియోగించారు. మొత్త 196 గడ్డెర్లకు గాను 1960 టన్నుల స్టీల్, 4900 టన్నుల కాంక్రీట్ ను వినియోగించారు. స్పిల్ వే పై గడ్డెర్లను ఒక క్రమ పద్దతిలో ఇంజినీర్ల పర్యవేక్షణలో ఏర్పాటు చేసేందుకు నెల రోజు సమయం పడుతుంది. గడ్డర్ల ఏర్పాటు అనంతరం ఇనుప రాడ్లతో జల్లెడ అల్లుతారు. ఆ తరువాత దానిపై కాంక్రీట్ తో రోడ్ నిర్మిస్తారు. ఈ పనులన్నీ పూర్తి అయితే గేట్లు బిగింపు మినహా మిగిలిన ప్రధాన పనులు అన్ని పూర్తి అయినట్లే. అంటే స్పిల్ వే పనులు దాదాపు పూర్తి అయినట్లే. స్పిల్ వే లో ఒక వైపు గడ్డెర్లు ఏర్పాటు చేస్తూనే మిగిలిన పనులు చేసుకునేందుకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మాణ సంస్థ మేఘా చర్యలు తీసుకుంటోంది. గడ్డెర్ల ఏర్పాటుకు రెండొందల టన్నుల బరువు మోసే క్రేన్ ను వినియోగిస్తున్నారు. ఒక్కో గడ్దర్ రెండు మీటర్ల ఎత్తు ఉంటుంది. గడ్డెర్ల ఏర్పాటు, రోడ్ నిర్మాణం పూర్తి అయితే గోదావరికి ఎంత వరద వచ్చినా పనులు నిరాటంకంగా చేసుకోవచ్చు. ఇప్పుడా పనులు పోలవరంలో విజయవంతంగా పూర్తవుతున్నాయి. జెట్ స్పీడుతో పోలవరం పనులు.. పోలవరం పనులను మేఘా సంస్థ జెట్ స్పీడుతో చేపడుతోంది. ఏపీ ప్రజల సాగు, తాగు, విద్యుత్ అవసరాల కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టును త్వరితంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలనుసారంగా పనులను వాయువేగంతో ఉరకెలేత్తిస్తోంది. మేఘా సంస్థ జూన్ చివరి నాటికి స్పిల్ వే లో 1. 41 లక్షల క్యూబిక్ మీటర్లు, స్పిల్ ఛానల్ లో 1,11 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని, జల విద్యుత్ కేంద్రం ఫౌండేషన్ లో 3. 10 లక్షల క్యూబిక్ మీటర్లు, మట్టి తీసే పని 10. 64 లక్షల క్యూబిక్ మీటర్లు, రాయి తొలిచే పనులు 1.14 లక్షల క్యూబిక్ మీటర్లు, వైబ్రో కంప్యాక్షన్ పనులు 10. 86 లక్షల క్యూబిక్ మీటర్లు పని చేసింది. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలనే దృఢమైన సంకల్పంతో పనులు సాగుతున్నాయి. ముఖ్యమంత్ర కల సాకారం దిశగా.. ఇలా ఏపీ కలల ప్రాజెక్టు వడివడిగా సాగుతోంది. వానాకాలంలోనూ పనులు ఆగకుండా నడుస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ వాడుతో కాంట్రాక్ట్ సంస్థ మేఘా పనులు పూర్తి చేస్తోంది. వచ్చే ఏడాదిలోనే ఏపీ ప్రజల తాగు, సాగునీటి అందించేలా ప్రాజెక్టు పరుగులు పెడుతోంది. -
రక్షణ రంగంలోకి.. మేఘా
సాక్షి, హైదరాబాద్: మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాలకు పైగా విస్తరించిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) తాజాగా రక్షణ రంగంలో అడుగుపెడుతోంది. దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలను, వివిధ పరికరాలను తయారు చేసేందుకు ఎంఈ ఐఎల్కు అనుమతిస్తూ కేంద్ర హోం, వాణిజ్య పారిశ్రామిక మంత్రిత్వ శాఖలు ఉత్తర్వులు జారీ చేశాయి. వివిధ దశల్లో రూ.500 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఈ సంస్థ ఆయుధాలు, రక్షణ రంగ పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేం దుకు అనుమతి పొందింది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020కి అనుగుణంగా రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, వాహనాలు, విడి పరికరాలు, సాయుధ సంపత్తి ఉత్పత్తి చేసేందుకు అనుమతి కోరుతూ ఎంఈఐఎల్ దరఖాస్తు చేసుకోగా, కేంద్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఉత్పత్తులు ఇవే... ఎంఈఐఎల్ ఏర్పాటు చేసే డిఫెన్స్ పరిశ్రమలో యుద్ధట్యాంకులు వాటికి సంబంధించిన విడి పరికరాలు, తేలికపాటి యుద్ధ వాహనాలు, ఆర్మర్డ్ ఇంజనీర్ వెహికిల్స్, ఆర్మర్డ్ రికవరీ వెహికిల్స్ను ఉత్పత్తి చేయనుంది. అలాగే సైనికులను తీసుకువెళ్లే వాహనాలు (ఏపీసీ) ఇన్ఫ్యాన్ట్రీ కంబాట్ వెహికిల్స్ (ఐసీవీ), సాయుధ బహుళ వినియోగ వాహనాలు, మైన్ లేయింగ్ వెహికిల్స్, బ్రిడ్జ్ లేయింగ్ వెహికిల్స్, అన్ని ప్రాంతాల్లోనూ తిరగలిగే తేలికపాటి యుద్ధ వాహనాలు (ఏసీటీవీ) మొదలైనవి ఉత్పత్తి చేయనుంది. మిస్సయిల్స్, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్, మిషన్ గన్స్, రాకెట్లు, ఫిరంగులు (క్యానన్), మిస్సయిల్స్ వ్యవస్థను ఉపయోగించడానికి అనుకూలమైన ఎక్యూప్మెంట్ను కూడా ఉత్పత్తి చేయనుంది. దేశంలో నిర్మాణ, మౌలిక వసతుల రంగంతో చమురు–ఇంధన వాయువు, విద్యుత్, సౌర విద్యుత్, విమానయాన రంగంలో విస్తరించిన మేఘా ఇంజనీరింగ్Š సంస్థ ఈ పరిశ్రమ ద్వారా రక్షణ రంగంలో అడుగుపెడుతోంది. ఇప్పటికే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రంగంలో.. మేఘా గ్రూప్కి చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఐకామ్ టెలి లిమిటెడ్ ఇప్పటికే దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివిధ విభాగాలకు శాస్త్రసాంకేతిక రంగాల్లో సహాయసహకారాలు అందిస్తోంది. óఐకామ్ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్తో పాటు విద్యుత్ ప్రసారం, సౌర రంగాల్లో కూడా నిమగ్నమై ఉంది. అధునాతన కమ్యూనికేషన్ రేడియోలు, జామర్లు, ఈడబ్ల్యూ షెల్టర్స్, యాంటినాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కంటెయినర్లు, విండ్ ప్రొఫైల్స్ రాడర్లను అభివృద్ధి చేసి సరఫరా చేస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశంలోనే తొలిసారిగా ఐకామ్ తయారు చేసిన మొబైల్ వైరాలజీ ల్యాబ్ గత ఏప్రిల్ నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే. మేకిన్ ఇండియాలో భాగస్వామ్యం.. దేశీయంగా ఆధునిక రక్షణ పరికరాలను తయారు చేయడానికి అవసరమైన అనుమతులన్నింటిని ఎంఈఐఎల్ పొందిందని సంస్థ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బొమ్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్లో అత్యాధునిక శాస్త్రసాంకేతిక సామర్థ్యంతో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కల, లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని.. ఆయన లక్ష్యంలో మేఘా గ్రూప్ కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని శ్రీనివాస్ తెలిపారు. -
రక్షణ ఆయుధాల రంగంలోకి మేఘా
సాక్షి, హైదరాబాద్ : మౌలిక వసతులు, నిర్మాణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలకు పైగా విస్తరించిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) తాజాగా దేశ రక్షణకు సంబంధించిన ఆయుధాలను, వివిధ పరికరాలను తయారు చేసేందుకు అనుమతులు సంపాదించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు వాణిజ్య పారిశ్రామిక శాఖల నుంచి ఆదేశాలు జారీ చేశాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఇందుకు సంబంధించిన పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ మంత్రిత్వ శాఖలు అనుమతులిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా విధానంలో భాగంగా డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీ 2020కి అనుగుణంగా రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, వాహనాలు, విడి పరికరాలు, సాయుధ సంపత్తి ఉత్పత్తి చేసేందుకు అనుమతి కోరుతూ ఎంఈఐఎల్ దరఖాస్తు చేసుకుంది.. వివిధ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సంస్థ శక్తి-సామర్థ్యాలను పరిశీలించిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఈ అనుమతులను జారీ చేసింది. వివిధ దశల్లో 500 కోట్ల పెట్టుబడితో మేఘా గ్రూప్ ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. దేశంలో నిర్మాణ, మౌలిక వసతుల రంగంలో అడుగుపెట్టి ఆ తరువాత చమురు-ఇంధన వాయువు, విద్యుత్, సౌరవిద్యుత్, విమానయాన రంగంలో విస్తరించిన మేఘా ఇంజనీరింగ్ తాజాగా ఈ పరిశ్రమతో దేశ రక్షణకు సంబంధించిన పరికరాల ఉత్పత్తి రంగంలో ప్రవేశిస్తోంది. మేఘా గ్రూప్కి చెందిన పూర్తి అనుబంధ సంస్థ అయిన ఐకామ్ టెలి లిమిటెడ్ ఇప్పటికే దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వివిధ విభాగాలకు శాస్త్ర-సంకేతిక రంగాల్లో సహాయ-సహకారాలు అందిస్తున్న విషయం విదితమే. ఐకామ్ సంస్థ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ కమ్యునికేషన్ తో పాటు విద్యుత్ ప్రసారం పంపిణీ, సౌర రంగల్లో కూడా నిమగ్నమై ఉంది. ఇప్పటికే ఈ సంస్థ అధునాతన కమ్యూనికేషన్ రెడియోలు, జామర్లు, ఈడబ్లూ షెల్టర్స్, యాంటినాలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కంటెయినర్లు, విండ్ ప్రొఫైల్స్ రాడర్లను అభివృద్ధి చేసి సరఫరాలో నిమగ్నమయి ఉంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఐకామ్ తయారు చేసిన మొబైల్ వైరాలజీ ల్యాబ్ను గత ఏప్రిల్ నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎంఈఐఎల్ ఏర్పాటు చేసే డిఫెన్స్ పరిశ్రమలో యుద్ధ ట్యాంకులు వాటికి సంబంధించిన విడి పరికరాలు, తేలికపాటి యుద్ధవాహనాలు, ఆర్మర్డ్ ఇంజనీర్ వెహికిల్స్, ఆర్మర్డ్ రికవరీ వెహికిల్స్ను ఉత్పత్తి చేయనుంది. అదే విధంగా సైనికులను తీసుకువెళ్లే వాహనాలు (ఏపిసి) ఇన్ఫ్యాన్ట్రీ కంబాట్ వెహికిల్స్ (ఐసివి), సాయుధ బహుళ వినియోగ వాహనాలు, మైన్ లేయింగ్ వెహికిల్స్, బ్రిడ్జ్ లేయింగ్ వెహికిల్స్, అన్ని ప్రాంతాల్లోనూ తిరగలిగే తేలిక పాటి యుద్ధ వాహనాలు (ఏసిటివి) మొదలైనవి ఉత్పత్తి చేయనుంది. అదే విధంగా మిస్సయిల్స్, మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్, మిషన్ గన్స్, రాకెట్లు, ఫిరంగులు (క్యానన్), మిస్సయిల్స్ వ్యవస్థను ఉపయోగించడానికి అనుకూలమైన ఎక్విప్మెంట్ను కూడా ఉత్పత్తి చేయనుంది. మేఘా ఇంజనీరింగ్...... దేశ, విదేశాల్లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ పూర్తి చేసింది. సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం, సహజ-చమురు , తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పంపిణీ, రోడ్డు మార్గాల ఆధునీకరణ, విస్తరణ విమానాయన రంగాలో ఎన్నో విజయాలు సాధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఎత్తిపోతల పథకం హంద్రీనీవా సుజల స్రవంతిని నిర్మించింది. ఈ ప్రాజెక్ట్లో భాగంగా మేఘా అత్యంత సుదూర ప్రాంతాలకు, ఎత్తైన ప్రాంతానికి నీటిని హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా పంపింగ్ చేస్తోంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం, పట్టిసీమ, నంబులపూలకుంట (ఎన్పీకుంట) విద్యుత్ సబ్ స్టేషన్ ను రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత ’మేఘా‘ది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆంధ్రప్రదేశ్ లోని 50 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, గుజరాత్ లో 10 మెగావాట్ల అరుదైన కెనాల్ టాప్ సోలార్ ప్రాజెక్టు ఎంఇఐఎల్ నిర్మించి రికార్డ్ నెలకొల్పింది. కృష్ణా-పెన్నా, కృష్ణా-గోదావరి, గోదావరి-ఏలేరు, నర్మద- క్షిప్రా - సింహస్థ ఇలా దేశంలో ఐదు నదులను మొదటి సారిగా అనుసంధానం చేసింది. హైదరాబాద్ సిటీ తాగునీటి కష్టాలను దూరం చేయడానికి ఆసియాలోనే అతిపెద్ద తాగునీటి పథకాన్ని ఎంఇఐఎల్ నిర్మించడం మరో ఘనత. దేశంలోనే తొలిసారిగా అత్యంత పెద్దదైన వెస్ట్రన్ యూపి పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ (WUPPTCL) విద్యుత్ సరఫరా (పవర్ ట్రాన్స్మిషన్) వ్యవస్థను నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ దేశంలో 29 రాష్ట్రాల్లో విద్యుత్ ఉత్పాధక సామర్థ్యంతో పోలిస్తే ఈ సరఫరా వ్యవస్థ 5వ స్థానంలో ఉంటుంది. ప్రపంచంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్ నైపుణ్యాలను దేశంలో అనేక ప్రాజెక్టు లను తొలిసారిగి ప్రవేశపెట్టింది. ఎన్పీకుంట విద్యుత్ సబ్ స్టేషన్, పట్టిసీమ ప్రాజెక్ట్ను ఏడాదిలోనే పూర్తిచేసినందుకు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. -
పోలవరం పనుల్లో వేగం.. వారి కోసం ప్రత్యేక రైళ్లు
సాక్షి, అమరావతి: కరోనా సంక్షోభంలోనూ పోలవరం పనులు పరుగులు పెడుతున్నాయి. పనులను మెరుపు వేగంతో ‘మేఘా’ పరుగులు పెట్టిస్తోంది. కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా కార్మికులు వలస వెళ్లిపోతున్నారు. అయినా పోలవరంలో మాత్రం ఎక్కడా ఆ ప్రభావం లేకుండా చూస్తోంది ఆ సంస్థ. ప్రాజెక్ట్లోని ప్రధానమైన పనులకు ఆటంకం రాకుండా అధిగమిస్తోంది. స్పిల్వే, స్పిల్ ఛానెల్, అప్రోచ్ చానెల్, పైలెట్, చానెల్స్, ఎర్త్కమ్ ర్యాక్ఫిల్ డ్యాం 1,2,3(గ్యాప్లు) ప్రాంతాలతో పాటు గతంలో పూర్తిగా నిలిచిపోయిన జల విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులు సైతం మొదలయ్యాయి. అప్పట్లో ఉత్తుత్తి ప్రకటనలు చంద్రబాబు హయాంలో పోలవరంలో ఏదో జరిగిపోతోందని ఉత్తుత్తి ప్రకటనలు వచ్చాయి. 2018లోనే ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని ఏకంగా అసెంబ్లీలో ప్రకటనలు చేశారు కానీ ఆచరణలో మాత్రం నిజం చేయలేకపోయారు. నిర్మాణ పనులన్నీ నత్తనడకన సాగాయి. నాడు స్పిల్వే, కాఫర్ డ్యాం పనులు కొంత మేరకు జరగడం నహా మిగిలిన పనులేవి ప్రారంభించనేలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ప్రభుత్వం పట్టిన పనులను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచారు. దాని వల్ల వ్యయం తగ్గించడంతో పాటు (ప్రభుత్వానికి ఆదా) అన్ని పనులు ముమ్మరం అయ్యే విధంగా చర్యలు చేపట్టారు. త్రీ గాడ్జెస్ కన్నా ఎక్కువ ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్వే పోలవరం ప్రాజెక్ట్లో అంతర్భాగంగా ఉంది. దీన్ని చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ లక్ష్యం మేరకు ప్రణాళికబద్ధంగా పనులు సాగిస్తోంది. ఈ ప్రాజెక్ట్లో 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించే విధంగా స్పిల్వే నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్గా పరిగణించే చైనాలోని త్రిగాడ్జేస్ జలాశయ స్పిల్వే వరద నీటి విడుదల సామర్థ్యం 47 లక్షల క్యూసెక్కులు. దానికన్నా పోలవరం ప్రాజెక్ట్ 3 లక్షల క్యూసెక్కుల అధిక సామర్థ్యంతో మేఘా ఇంజనీరింగ్ నిర్మిస్తోంది. 2019 నవంబర్లో మేఘా పనులను ప్రారంభించింది. చదవండి: కాళేశ్వరంలో ‘మేఘా’ పవర్! అప్పటికే జలాశయ నిర్మాణ ప్రాంతంలో ముందు, వెనకా (గత ప్రభుత్వం సరైన ఇంజనీరింగ్ పద్ధతిలో నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల ) వరద నీరు చేరింది. దాని వల్ల దాదాపు 4 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికే అధిక సమయం పట్టింది. ఆ తరువాత జనవరిలో పనులు వేగవంతమయ్యాయి. నిర్మాణ పనులకు వేసవి కాలం ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలలు కీలకమైనవి. కానీ కరోనా కష్టాలతో దేశ వ్యాప్తంగా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మందగించాయి. పోలవరం నిర్మాణంపై కూడా ఈ ప్రభావం కొంత పడింది. పోలవరం నుంచి కార్మికుల వలస అతిపెద్ద ప్రాజెక్ట్ కావడంతో వేల మంది కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో 2 వేల మంది కార్మికులు తమ సొంత రాష్ట్రాలైన బీహార్, జార్ఞండ్, ఒరిస్సాకు వెళ్లిపోయారు. దాని వల్ల అతికొద్ది మంది కార్మికులు, సిబ్బందితోనే పనులు చేయించాల్సి వచ్చింది. అయినా పనులు ఆగిపోకుండా ముందుకు సాగాయి. ఇందులో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మేఘా ఇంజనీరింగ్ సంస్థ సమర్థంగా వ్యవహరించాయి. పనులల్లో స్పిల్వే, స్పిల్ ఛానెల్, జల విద్యుత్ కేంద్రం, మట్టి, రాతి పనులు ఈ కాలంలో చెప్పుకోదగ్గ స్థాయిలోనే జరిగాయి. నవంబర్-డిసెంబర్ల్లో నీటి సమస్య వల్ల పనులు నెమ్మదిగా జరిగాయి. నవంబర్లో 206, డిసెంబర్లో 5,628 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయి. జనవరి నుంచి పనులు ఊపందుకున్నాయి. ఆ నెలలో 20,639 ఘనపు మీటర్లు, ఫిబ్రవరిలో 32,443, మార్చిలో 36,129 ఘనపు మీటర్ల స్పిల్వే, స్పిల్ చానెల్ కాంక్రీట్ పనులు జరిగాయి. ఏప్రిల్, మే నెలలో కరోనా ప్రభావం పోలవరంపై పడకుండా అటు నిర్మాణ సంస్థ, ఇటు ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించాయి. చదవండి: పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపు ప్రత్యేక జాగ్రత్తలతో... కరోనాతో ప్రాజెక్ట్లకు ఒక్క కార్మికుల సమస్యలే కాదు... మిగిలిన ఇబ్బందులు వచ్చాయి. సిమెంట్, స్టీల్ ఇతర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపింది. రవాణా వ్యవస్థ ఏప్రిల్, మేల్లో స్తంభించిపోయింది. ప్రాజెక్ట్కు అవసరమైన ముడిసరుకు చేరకపోవడంతో అనేక అవరోధాలు ఎదురయ్యాయి. పనులు అనుకున్న స్థాయిలో చేయలేకపోయారు. ప్రభుత్వ యంత్రాంగం, కంపెనీ సిబ్బంది దానిని అధిగమించడానికి శతవిధాలా ప్రయత్నించాల్సి వచ్చింది. కార్మికుల కోసం జిల్లా వైద్య సిబ్బంది, మేఘా సంస్థ ప్రత్యేకంగా వైద్యసిబ్బందితో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసింది. కార్మికులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. ఇంజనీర్లు, మేఘా సిబ్బంది శ్రమ గత ప్రభుత్వంలో స్పిల్ ఛానల్ పనులు అస్సలు జరగలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ పనిని ప్రారంభించింది. ఏప్రిల్లో స్పిల్వే కాంక్రీట్ పని 18,714 ఘ.మీ, స్పిల్ ఛానెల్ 9,511 ఘ.మీ కాంక్రీట్ పని జరిగింది. మొత్తం మీద 28,225 ఘ.మీ కాంక్రీట్ పనిని పూర్తిచేశారు. మే నెలలో అంతకన్నా దాదాపు రెట్టింపు పని జరిగింది. స్పిల్ వే 10909, స్పిల్ ఛానెల్లో 42354 ఘ.మీ చొప్పున జరిగాయి. మొత్తం మీద 53263 ఘనపు మీటర్ల పనిని మేలో చేశారు. ప్రాజెక్ట్ పనులు ప్రారంభించినప్పటి నుంచి అంతకు ముందు ఏ నెలలోనూ చేయనంతగా మే నెలలో కరోనాని సైతం ఎదుర్కొని ఆ మేరకు పనిచేశారంటే ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. నవంబర్ నుంచి ఇప్పటివరకు (జూన్ 8, 2020) 2,01,025 ఘ.నపు మీటర్ల స్పిల్ వే, స్పిల్ ఛానెల్ పనులు జరిగాయి. మేఘా చేపట్టాకే... వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పిల్ వే క్రీట్ పనులు కొనసాగించడంతో పాటు ప్రధానమైన ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం (3 గ్యాపులు) నిర్మించడానికి అవసరమైన మట్టి పటుత్వ పరీక్షలు (వైబ్రో కంప్యాక్షన్ పనులు) మేఘా ఇంజనీరింగ్ సంస్థ చేపట్టింది. అలాగే స్పిల్ ఛానెల్ పనులు మొదలయ్యాయి. ఇందులో ప్రధానంగా మట్టి తవ్వకం ఊపందుకుంది. స్పిల్ ఛానెల్కు సంబంధించిన కాంక్రీట్ బ్లాక్ నిర్మాణం కూడా క్రియాశీల దశకు చేరుకుంది. ఫిబ్రవరిలో ఈ పనులును మేఘా ఇంజనీరింగ్ ప్రారంభించగా ప్రతినెలా పని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఇప్పటికీ (జూన్ 08,2020) 2,01,025 ఘనపు మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తిచేసింది. వేగంగా పవర్ హౌస్ పనులు పవర్ హౌస్ నిర్మాణ పనులు గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిలిచిపోయాయి. 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని పోలవరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించాలి. ఇందుకోసం ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12 వర్టికల్ కప్లాంగ్ టర్బైన్లను ఏర్పాటు చేయాలి. కానీ ఈ పని చంద్రబాబు ప్రభుత్వ కాలంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం దీనికి కూడా ప్రాధాన్యత ఇవ్వడంతో జల విద్యుత్ కేంద్ర నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం (బ్లాస్టింగ్) పనులు ఊపందుకున్నాయి. తిరిగి వస్తున్న కార్మికులు ప్రభుత్వం, మేఘా సంస్థపై నమ్మకంతో పోలవరంలో పనిచేసి స్వరాష్ట్రాలకు వెళ్లిన కార్మికులు తిరిగి వస్తూ పనుల్లో చేరుతున్నారు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికి ఎలాగైనా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్న మేఘా సంస్థ దాదాపు 2000 మంది కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా తిరిగి వెనక్కు తీసుకొచ్చింది. ఇలా వచ్చినవారికి ఇతర సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. అలాగే ప్రత్యేక మెడికల్ టీం ఏర్పాటు చేసి అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తరువాతనే పనుల్లోకి అనుమతిస్తున్నారు. పనిచేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో పనులను మరింత వేగవంతం చేయనున్నారు. అనుకున్న పనులను పూర్తి చేసి వర్షాకాలం మొదలై వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా పనులు చేసేలా మేఘా సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
తెలంగాణ సాగునీటి కల సాకారం
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలోనే అత్యధికంగా వరిని పండించే రాష్ట్రంగా తెలంగాణ నేడు రికార్డులకు కెక్కించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగునీటి కోసం కొట్లాడిన ప్రాంతం నేడు జలకళతో సస్యశ్యామలమైంది. నిధులు.. నీళ్లు.. ఉద్యోగాలే ఏజెండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు నీటికోసం భగీరథ ప్రయత్నం చేశారు. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎన్నో ఇంజనీరింగ్ కంపెనీలు ముందుకొచ్చినా ముఖ్యమంత్రి దృష్టిని ఆకర్షించింది మాత్రం మేఘా (MEIL). ఈ కంపెనీ రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసింది. కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. దీని ద్వారా 3763 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి వచ్చింది. పుష్కలంగా గోదావరి జలాలు.. ఒకప్పుడు నీటిగోసను అనుభవించిన తెలంగాణ నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారింది. ముఖ్యమంత్రి ఆలోచనకు తోడు ఎంఈఐఎల్ అహోరాత్రుల కృషి ఫలితంగానే ఇది సాధ్యపడింది. నీటి ప్రాజెక్టులు కట్టాలంటే దశబ్దాలు పడుతాయన్న అపఖ్యాతిని దూరంచేసేలా మేఘా కంపెనీ మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం విశేషం. ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకంలో అత్యధిక పంపింగ్ కేంద్రాలను పూర్తిచేసి తన ఇంజనీరింగ్ శక్తిసామర్థ్యాలు, నైపుణాన్ని చాటుకుంది. కేవలం నాలుగేళ్ళ సమయంలో దాదాపు నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్హౌస్లను నిర్మించడమే కాకుండా వాటిని పంపింగ్ ద్వారా వినియోగంలోకి(ఆపరేషన్, మెయిన్టెనెన్స్) తీసుకొచ్చింది. రికార్డు స్థాయిలో పూర్తి.. మేఘా సంస్థ దీనిని ఓ నీటి ప్రాజెక్టుగా కాకుండా తమకు దక్కిన గౌరవంగా భావించి ఓ సవాల్గా తీసుకొని పూర్తి చేసింది. కేవలం నాలుగేళ్లలో ప్రపంచంలోని అతి భారీనీటి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసింది. ముఖ్యమంత్రి పట్టుదలకు తోడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎలక్ట్రోమెకానికల్ ఇంజనీరింగ్ సంస్థలు బీహెచ్ఈఎల్, ఆండ్రిజ్, జైలం, ఏబిబి, క్రాంప్టన్ గ్రేవ్స్, వెగ్ లాంటి సంస్థలు ఇందులో భాగస్వామ్యం పంచుకున్నాయి. ప్రపంచంలో తొలిసారిగా ఇక్కడ భారీస్థాయిలో బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని నాలుగేళ్ళ క్రితం ప్రభుత్వం ప్రారంభించింది. పనులు ప్రారంభించిన మూడేళ్ళలోనే లింక్1, లింక్2లో ఎత్తిపోతల కేంద్రాలు వినియోగంలోకి వచ్చాయి. ఇంజనీరింగ్ చరిత్రలో అద్భుతం కాళేశ్వరం.. ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలోనే మేఘా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా నిలిచింది. తాజాగా ప్యాకేజ్14లోని పంప్హౌస్ను వినియోగంలోకి తేవడం ద్వారా 3,763మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం వినియోగంలోకి రానుంది. నీటి పారుదల రంగంలో దాదాపు 618 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసేలా భారీ ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకుంది. సాగునీటి అవసరాల కోసం ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికాలోని కొలరాడోలో మాత్రమే భారీ ఎత్తిపోతల పథకం ఉంది. ఆ తర్వాత లిబియాలోని గ్రేట్ మ్యాన్మేడ్ రివర్ రూపుదిద్దుకుంది. ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వేరపోయేలా రికార్డు సమయంలో కాళేశ్వరం పనులు పూర్తయ్యాయి. భూగర్భంలో కొత్త లోకం మొత్తం పంపింగ్ కేంద్రాల్లో అత్యధిక భాగం భూగర్భంలో నిర్మించినవే. అత్యధిక సామర్థ్యం కలిగిన పంపింగ్ కేంద్రాలు భూగర్భంలోనివే. ఇందులో మేఘా ఇంజనీరింగ్ నిర్మించిన గాయత్రి (ప్యాకేజ్8), అన్నపూర్ణ (ప్యాకేజ్10), రంగనాయక సాగర్ (ప్యాకేజ్11), మల్లన్నసాగర్ (ప్యాకేజ్12) భూగర్భంలో నిర్మించినవే. ప్రధానంగా గాయత్రి పంప్హౌస్ నిర్మాణం కోసం భూగర్భంలో 2.3ఘనపు మీటర్ల మట్టిని తొలిసి బయటకు తీసింది. ఈ పంపింగ్ కేంద్రం వైశాల్యం 84753.2 చదరపు అడుగులు. దీనికి సంబంధించిన సర్జ్పూల్, అదనపు సర్జ్పూల్స్ కూడా ప్రపంచంలోనే పెద్దవి. గోదావరిని దిగువ నుంచి ఎగువకు తిరుగు ప్రయాణం చేసే విధంగా పంపింగ్ చేయడం కోసం 1120 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు పంప్హౌస్లను 28మిషన్లతో ఏర్పాటు చేశారు. అవి లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) పంపింగ్ కేంద్రాలు. వీటిన్నింటిని భూగర్భంలో నిర్మించి సరికొత్త ఆ ప్రాంతంలో సరికొత్త లోకాన్ని సృష్టించింది. భూగర్భంలో గాయత్రి నిర్మాణం.. ఆ తర్వాత ప్యాకేజ్8 పంపింగ్ కేంద్రం గాయత్రి. భూగర్భంలో మేఘా నిర్మించిన ఒక్కో పంపింగ్ కేంద్రం ఒక్కో అద్భుతాన్ని సృష్టించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో 2టిఎంసీల నీటి పంపింగ్కుగాను మొత్తం 4680 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం కలిగిన కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా అందులో ఎంఈఐఎల్ ఏర్పాటు చేస్తున్న 89మిషన్లు 3840 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి మేఘానే ఏర్పాటు చేస్తోంది. మేఘాకు దక్కిన గౌరవం ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్లో పాలుపంచుకోవడం మేఘా ఇంజనీరింగ్ అదృష్టమని మేఘా సంస్థ ప్రతినిధి బీ.శ్రీనివాస్రెడ్డి తెలిపారు. తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రపంచంలో అత్యుత్తమ ఇంజినీరింగ్ సంస్థతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం తమకు దక్కిన జీవితకాల గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో చర్చించి ప్రోత్సహించడం వల్లనే త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని బీ.శీనివాస్ రెడ్డి తెలిపారు. -
కొండ పోచమ్మకు గోదావరి జలాలు
సాక్షి, హైదరాబాద్ : గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది. ప్రతిష్టాత్మక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గుండెకాయ వంటి కొమురవెల్లి మలన్నసాగర్ నుంచి బుధవారం నీటి విడుదల మొదలైంది. 52 టీఎంసీల నీరు నిల్వ చేయగల సామర్ధ్యం కలిగిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ సర్జ్పూల్కు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ నుంచి విడుదలైన గోదావరి జలాలు చేరాయి. ఈ పథకంలో ఇది మానవ నిర్మిత అతిపెద్ద కట్టడం. ఇక్కడి నుంచి ఈ జలాలను కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి విడుదల చేశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ సహ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియోజకవర్గం గజ్వేల్ పరిధిలో కొండపోచమ్మ సాగర్ భారీ రిజర్వాయర్ను ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ నిర్మించింది. ఎటువంటి ఆర్భాటం లేకుండా నేడు అధికారులు వెట్రన్ చేపట్టారు. వెట్రన్లో భాగంగా తొలుత ఒకటో నెంబర్ పంప్ నుంచి నీటి విడుదలను చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం, సూచనలకు అనుగుణంగా నీటిపారుదల రంగ నిపుణుల సలహా మేరకు ఎటువంటి అటంకాలు ఎదురవకుండా నిర్మాణపనులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ చేపట్టింది. వాస్తవానికి మలన్నసాగర్ రిజర్వాయర్ నింపిన తర్వాతే కొండపోచమ్మ సాగర్కు నీరు విడుదల కావాలి. 52 టీఎంసీల సామర్ధ్యం కలిగిన భారీ కొమురవెల్లి మలన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో తుక్కాపూర్ పంప్హౌస్ నుంచి డెలివరీ సిస్టర్న్ ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. ఈ నీరు గజ్వేల్ మండలం అక్కారంలో నిర్మించిన పంప్హౌస్కి ఆ తర్వాత మర్కూక్ సమీపంలో నిర్మించిన మరో పంప్హౌస్కు అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సర్జ్పూల్కు చేరుతాయి. మల్లన్న సాగర్ సర్జ్పూల్ నుంచి ఒక్కొక్కటి 43 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 8 మెషీన్లు నీటిని ఎత్తిపోస్తాయి. ఒక్కొ పంప్ 1100 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తాయి. ఇక్కడ గోదావరి జలాలు 103.88 మీటర్ల ఎత్తుకు చేరుతాయి. ఈ మార్గమధ్యలో 16.18 కి.మీ పొడవైన సొరంగం కూడా ఉంది. దాదాపు 119 కి.మీ పొడువైన 17 డిస్ట్రిబ్యూటరీ కాలువలు కూడా దీనికి అనుసంధానంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందే ఆయకట్టులో ఎక్కువ శాతం మల్లన్నసాగర్ పరిధిలోనే ఉంది. ఈ రిజర్వాయర్ ద్వారా సిరిసిల్ల, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలో 1,25,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇక్కడి నుంచి సుదూరాన ఉన్న బస్వాపూర్ రిజర్వాయర్కు కూడా నీరు ఎత్తిపోయనున్నారు. అలాగే నల్లగొండ జిల్లాకు కూడా గోదావరి జలాలు మల్లన్నసాగర్ నుంచే అందుతాయి. ఇక్కడి నుంచి మరో స్వతంత్ర లింక్ ద్వారా నీరు సింగూరుకు చేరుతాయి. కొండపోచమ్మ సాగర్కు వెళ్లే మార్గంలో ఉండే అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపుతారు. -
మహారాష్ట్రకు మేఘా రూ.2 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరుకు తనవంతు బాధ్యతగా ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘ ఇంజనీరింగ్ ముందుకు వచ్చి సహాయం చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5 కోట్లు, కర్ణాటకకు 2 కోట్లు ఆర్ధిక సహాయం అందించిన మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి తాజాగా ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వానికి 2 కోట్ల రూపాయల విరాళం అందచేసారు. ఈ మేరకు 2 కోట్లు బ్యాంకు ద్వారా పంపించిన మేఘ యాజమాన్యం మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లేఖ కూడా రాసింది. లాక్డౌన్ మూలంగా పేదలు, కూలీలు, ఆకలితో అలమటిస్తున్న వారికి ప్రభుత్వాలు అందిస్తున్న సాయానికి తమ వంతుగా మరిన్ని ప్రజా ప్రయోజన కార్యక్రమాలకు చేయూతను అందిస్తామని మేఘా ప్రకటించింది. (ఏపీ: ‘మేఘా’ విరాళం) -
ఏపీ: ‘మేఘా’ భారీ విరాళం
సాక్షి, అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న చర్యలను పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వయంగా అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా కృష్ణారెడ్డి ప్రశంసించారు. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వం యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసి కరోనా మహమ్మారిని కట్టడి చేస్తోందన్నారు. మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైన వెంటనే అప్రమత్తం కావడంతో పాటు లాక్డౌన్ ప్రకటించడంతో వైరస్ తీవ్రత తగ్గిందని వివరించారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తమ వంతు సాయం అందించాలన్న ఉద్దేశంతో విరాళం అందజేసినట్లు తెలిపారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా రూ.5 కోట్ల విరాళాన్ని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. సిద్దార్థ విద్యా సంస్థల ఔదార్యం సిద్దార్థ విద్యా సంస్థల యాజమాన్యం, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ రూ. 1.30 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, దేవినేని అవినాష్ సమక్షంలో సిద్దార్థ విద్యాసంస్థల కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వరరావు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ రూ. 20 లక్షల విరాళం కరోనా వ్యతిరేక పోరాటానికి మద్దతుగా సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూ. 20 లక్షల విరాళం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున విరాళం అందించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలిచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. (సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ) -
సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందించారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ సీఎంఆర్ఎఫ్కు రూ.5 కోట్ల విరాళాన్ని గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు అందించారు. శాంతా బయోటెక్నిక్స్ అధినేత కేఐ వరప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలుసుకుని ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. సీఎం సహాయ నిధికి వ్యక్తిగత సాయంగా ఒక కోటీ 116 రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి వరప్రసాదర్ రెడ్డి అందించారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కామిడి నర్సింహారెడ్డి తమ కంపెనీ తరఫున రూ.కోటి చెక్కును సీఎంఆర్ఎఫ్కు అందించారు. లారస్ ల్యాబ్స్ సీఈఓ డాక్టర్ సత్యనారాయణ, ఇ.డి. చంద్రకాంత్ చేరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి తమ ల్యాబ్ తరఫున ఒక లక్ష హైడ్రాక్సి క్లోరోక్విన్ ట్యాబ్లెట్లను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. సీఎంఆర్ఎఫ్కు రూ.50 లక్షల చెక్కును సీఎంకు అందించారు. కరోనా వ్యాప్తి జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు పలకడంతో పాటు, భారీగా విరాళాలు ఇచ్చిన దాతలకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. దాతలు అందించిన ఆర్థిక సహాయం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ఉపయోగపడడంతో పాటు, వారు చూపించిన స్ఫూర్తి అధికార యంత్రాంగానికి మరింత ఉత్సాహం ఇస్తుందని అన్నారు. మరికొందరు ఇలా... ♦ హైదరాబాద్కు చెందిన మీనాక్షి గ్రూప్ సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం అందివ్వడానికి ముందుకు వచ్చింది. ఈ చెక్కును ప్రగతి భవ న్లో మంత్రి కేటీఆర్కు సంస్థ చైర్మన్ కె.ఎస్.రావు, ఎండీ సి.శివాజీ అందించారు. ♦ తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు ఉపయోగపడే నాలుగు వేల ఎన్–95 మాస్కులను జీపీకే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ యజమానులు ఫణికుమార్, కర్నాల శైలజారెడ్డి ఐటీ, మున్సిపల్ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ప్రగతి భవన్లో అందజేశారు . ♦ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ‘క్రెడాయ్’ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం అందించారు.ఈ చెక్కును ప్రగతి భవ¯ŒŒ లో మంత్రి కేటీఆర్కు సంస్థ ప్రతినిధులు అందించారు. ♦ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ సహ యజమాని విజయ్ మద్దూరి రూ.25 లక్షలు, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పక్షాన చైర్మన్ లోక భూమారెడ్డి రూ.5 లక్షలు చొప్పున విరాళాన్ని మంత్రి కేటీఆర్కు అందజేశారు. టీఆర్ఎస్ ‘స్థానిక’ ప్రజా ప్రతినిధుల విరాళం రూ.9.51 కోట్లు హైదరాబాద్ : టీఆర్ఎస్కు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తమ ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.9,51,17,500ను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కౌన్సిలర్లు, జెడ్పీ చైర్పర్సన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తమ అంగీకారాన్ని సీఎం కేసీఆర్కు తెలిపారు. టీఆర్ఎస్కు చెందిన 18,190 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.9,51,17,500ను సీఎం సహాయ నిధికి జమ చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యల కోసం తమ ఒక నెల గౌరవ వేతనం డబ్బు లు ఉపయోగించుకోవాలని వారు కోరారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆపద సమయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చూపిన ఔదార్యం ఎంతో స్ఫూర్తిదాయకమైందని సీఎం అభినందించారు. -
తెలంగాణకు మేఘ సంస్థ రూ. 5కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ను తరిమి కొట్టడానికి యావద్దేశం పోరాడుతోంది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కోవిడ్ మహమ్మారిని పారద్రోలటానికి అహర్నిశలా శ్రమిస్తున్నాయి. సినీ, రాజకీయ, ఇతర రంగాల వారు తమవంతు సహాయంగా ప్రభుత్వాలకు విరాళాలు అందజేస్తూ బాసటగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మౌలిక రంగ నిర్మాణ సంస్థ మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్స్ లిమిటెడ్ తనవంతుగా తెలంగాణ ప్రభుత్వానికి సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న పోలీస్, ఇతర సహాయక సిబ్బందికి ఉచితంగా భోజనం అందించడానికి మేఘ సంకల్పించింది. ఇదే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తనవంతు బాధ్యతగా రూ. 5 కోట్లను విరాళంగా ఇచ్చింది. కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మేఘ ప్రశంసించింది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి శక్తి సామర్ధ్యాలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మేఘ యాజమాన్యం అభినందించింది. ఈ మేరకు 5 కోట్ల రూపాయల చెక్కును మేఘ అధినేత పీవీ కృష్ణారెడ్డి గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అందజేశారు. -
పోలవరం పరుగులు పెడుతోంది
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ పనులు ఊపందుకున్నాయి. అటు నిర్మాణ పరంగానూ ఇటు ఇంజనీరింగ్ అనుమతుల్లోనూ అడ్డంకులు తొలగిన విషయం తెలిసిందే. రాజకీయ, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పనులను పూర్తిస్థాయి ఇంజనీరింగ్, శాస్త్రసాంకేతిక పద్ధతుల్లో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించి ప్రాధాన్యత ఇస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు, లోటుపాట్లు, ముఖ్యంగా అశాస్త్రీయంగా (నాన్-ఇంజనీరింగ్) పద్ధతిలో చేపట్టిన పనులన్నింటినీ క్రమంగా సవరిస్తూ ఇంజనీరింగ్ మోడల్లోనే పోలవరం ముందుకు సాగుతోంది. (పోలవరం ప్రాజెక్ట్ను పరిశీలించిన సీఎం జగన్) అనువైన సమయం- పనులు ముమ్మరం నిర్మాణ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మేఘా) పూర్తిస్థాయిలో తన శక్తి యుక్తులను ఈ ప్రాజెక్ట్పై కేంద్రీకరించింది. నిర్ణీత గడువుకన్నా ముందే ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు యత్నిస్తోంది. అనతికాలంలోనే ప్రాజెక్ట్ స్పిల్వేకు సంబంధించి 62818 ఘనపు మీటర్ల పనిని చేయడంతో పాటు మిగిలిన పనులు యుద్ధ ప్రతిపాదికన చేపట్టేందుకు ప్రాథమిక కసరత్తులను మేఘా వేగవంతం చేసింది. ప్రాజెక్ట్కు ప్రధానమైన పనులు వేగవంతం చేసేందుకు గోదావరి ఒడ్డున మట్టి పటిష్టతకు సంబంధించి పటుత్వ (VIBRO COMPACTION WORKS UNDER PROGRESS) పరీక్షలు, గ్యాప్-1లో నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక పనులు, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన కొండ తవ్వకం (బ్లాస్టింగ్), ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ అవసరం మేరకు అంటే వరద ఉదృతి వల్ల ప్రాజెక్ట్ పనులకు అవరోధం ఎదురుకాని విధంగా చేపట్టే పనులు ముమ్మరం అయ్యాయి. కీలకమైన అనుమతులకు ప్రత్యేక అధికారులు ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్ష్యం మేరకు పనులు చేయడంతో పాటు అందుకు అనుగుణంగా శాస్త్రీయమైన పద్ధతిలో డిజైన్లకు సంబంధించిన అనుమతులు సాధించడం చాలా కీలకమైనది. ఇప్పుడు చేపట్టాల్సిన పనులకు సంబంధించిన డిజైన్లకు అనమతులు లభించకపోతే పనులు వేగంగా చేసినా ప్రయోజనం ఉండదు. మళ్లీ ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లు మొదటికి వస్తుంది. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాజెక్ట్ను పరిశీలించి సమీక్షించినప్పుడు అనుమతులు త్వరగా మంజూరు చేస్తే నిర్దేశించిన గడువు ప్రకారం పనులను పూర్తిచేస్తామని మేఘా యాజమాన్యం స్పష్టం చేసింది. దాంతో డిజైన్ల అనుమతులు సాధించేందుకు ఢిల్లీ, హైదరాబాద్లోనూ ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అప్పటి నుంచి పనులు శాస్త్రీయ పద్ధతిలో ఊపందుకున్నాయి. (ప్రాజెక్టుల బాటకు శ్రీకారం) గత ప్రభుత్వ తప్పిదాలు ప్రాజెక్ట్ పనులను మేఘా సంస్థ గత ఏడాది నవంబర్లో దక్కించుకున్నప్పటికీ వెంటనే పనులు చేపట్టడం సాధ్యం కాలేదు. దాదాపు మూడు నెలల పాటు విలువైన సమయం వృధా అయ్యింది. అందుకు గత ప్రభుత్వం నాన్ ఇంజనీరింగ్ పద్ధతిలో పనులు చేపట్టడమే. ముంపు సమస్య తలెత్తి విలువైన సమయం వృధా కావడానికి చంద్రబాబు ప్రభుత్వం కాఫర్ డ్యామ్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడమే కారణం. వాస్తవానికి ఇది ఇంజనీరింగ్ విధానాలకు వ్యతిరేకం. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లో ఆయన ఒత్తిడికి తలొగ్గి 42.5 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించేందుకు అంగీకరించడం మరింత నష్టం చేకూర్చింది. ఇంతవరకు ఏ జలాశయ నిర్మాణాల్లోనూ లేనివిధంగా పోలవరంలో మాత్రమే ఈ విధమైన అనుమతి లభించింది. కాఫర్ డ్యామ్ అనేది ప్రధాన జలాశయంలో నిర్మాణం జరిగేప్పుడు నీరు అడ్డు రాకుండా నదీ ప్రవాహాన్ని మళ్లించేందుకు ఏర్పాటు చేసే తాత్కాలిక నిర్మాణం. దీనివల్ల గత ఏడాది వరదలప్పుడు జలాశయంలో నీరు నిలిచిపోయి పనులు ఆగిపోవడమే కాకుండా నిర్మాణం ప్రాంతంలో నిర్మించిన రహదారులు కొట్టుకుపోయాయి. (ట్రాన్స్ట్రాయ్.. డబ్బులేమయ్యాయ్?) కనీసం 4 టిఎంసీల నీరు నిలువ ఉండడంతో దానిని తోడితే తప్ప పనులు చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో దాదాపు మూడు నెలల పాటు పంపింగ్ మిషన్లు ఏర్పాటు చేసి ఆ నీటిని తరలించాల్సి వచ్చింది. దాంతో జనవరి నెలాఖరుకు కానీ పనులు ఉపందుకుకోవడం సాధ్యం కాలేదు. గత ప్రభుత్వం స్పిల్వేతో పాటు కాఫర్ డ్యామ్ కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది. వాటిని కూడా సకాలంలో పూర్తి చేయలేకపోయింది. ఈ ప్రాజెక్ట్లో ఎర్త్కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్ (ప్రధాన ఆనకట్ట)తో పాటు అందులోని మూడు గ్యాప్లు, స్పిల్వే, స్పిల్ చానెల్, అప్రోచ్ చానెల్, పైలెట్ చానెల్, కుడి-ఎడమ కాలువల అనుససంధానంతో పాటు జల విద్యుత్ కేంద్రం కీలకమైనవి. వీటిల్లో చాలా పనులు అసలు గత ప్రభుత్వం చేపట్టనే లేదు. జనవరి నుంచి స్పిల్వే పనులు ముమ్మరం చేసిన మేఘా ఇంజనీరింగ్ లక్ష్యానికి అనుగుణంగా పనులు సాగిస్తోంది. జనవరిలో 20631 ఘనపు మీటర్లు, ఫిబ్రవరిలో 32124 ఘ.మీ, మార్చిలో ఇప్పటివరకు 21358 ఘ.మీ పనిని పూర్తిచేసింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పిల్వే బీమ్ల నిర్మాణంతో పాటు బ్రిడ్జ్లు, డివైడ్ వాల్, ట్రైనింగ్ వాల్, గైడ్వాల్ పనులను ఉదృతం చేసింది. అదే సమయంలో ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యామ్, అందులోని మూడు గ్యాపులు, జల విద్యుత్ కేంద్రం మొదలైన ప్రధానమైన పనులు శరవేగంగా సాగుతున్నాయి. (ముంపు ప్రాంతాల నివేదిక ఇవ్వండి) నిజానికి చంద్రబాబు పాలనలో ఈ ప్రాజెక్ట్ నత్తనడక నడిచింది. దివంగత రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ కీలకమైన అనుమతులన్నీ అప్పుడే సాధించారాయన. ఆ తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ చూపలేదు. వైఎస్సార్ పాలనలోనే దాదాపు కుడి-ఎడమ కాలువలు పూర్తయ్యాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనలో 2010 నుంచి 2019 వరకు కేవలం స్పిల్వేలో కొంత పనితోపాటు డయాఫ్రం వాల్, కాఫర్ డ్యామ్ మాత్రమే నిర్మించారు. ఇంతకు మించి అప్పుడు జరిగిందేమీ లేదు. (కాఫర్ డ్యామ్పేరుతో కపట నాటకం) కీలకమైన డిజైన్లు: ఈ ప్రభుత్వం వచ్చాక నిర్మాణ సంస్థను మార్చి పనులు వేగం చేయించడంతో పాటు అదే సమయంలో ప్రాజెక్ట్ నిర్మాణ పనులల్లో అనుమతులు చాలా కీలకమైనవి. గత ప్రభుత్వ వీటిని నిర్లక్ష్యం చేసింది. మొత్తం ప్రాజెక్ట్లో 45 డిజైన్లు అనుమతి లభించాల్సి ఉండగా వాటిలో 37 డిజైన్లు అనుమతి సాధించడానికి దాదాపు 10 ఏళ్ళ సమయం పట్టింది. మరో ఎనిమిది కీలకమైన డిజైన్ల అనుమతి లభించలేదు. దీంతో త్వరితగతిన అనుమతి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రధాన ఆనకట్టలోని గ్యాప్-1లో నిర్మించే మట్టి, రాతి నిర్మాణ పనులకు ఇంకా అనుమతి లభించలేదు. ప్రాజెక్ట్కు ఇది ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. కానీ గత ప్రభుత్వం దీని అనుమతులు సాధించేందుకు శ్రద్ధ చూపించలేదు. గ్యాప్-2లో ఏ విధమైన నిర్మాణం ఉండాలనే దానిపైన కూడా చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనేక పనులకు సంబంధించి ఇప్పుడే ఇంజనీరింగ్ తరహాలో పనులు ముమ్మరం అయ్యాయి. దీంతో పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి అవుతుందనే నమ్మకం కలుగుతోంది. -
శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు
సాక్షి, పోలవరం: గోదావరి నదిపై మేఘా మహాయజ్ఞం ఆరంభమైంది. అనుకున్న సమయానికి నిర్ధేశించిన లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోంది. కుయుక్తులతో, రాజకీయ కక్షలతో వేసే, వేయించే కేసులు, భారీ వరదల వంటి అవాంతరాలు ఎదురుకాని పక్షంలో దేశంలోనే పెద్దదైన బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ పోలవరంను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేసే లక్ష్యంగా ప్రణాలికలు రూపొందించింది. ఆరు దశాబ్దాల క్రితం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. పుష్కర కాలం క్రితం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత ప్రాజెక్ట్ నిర్మాణం నత్త నడక కన్నా నెమ్మదిగా జరిగాయి. కాగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పోలవరం ప్రాజెక్ట్ ను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో రివర్స్ టెండరింగ్కు వెళ్లారు. రివర్స్ టెండరింగ్ లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కాంట్రాక్టును ప్రభుత్వానికి రూ 628 కోట్లు ఆదా అయ్యేలా మేఘా ఇంజనీరింగ్ దక్కించుకుంది. ఆ వెంటనే పనుల వేగం పెరిగింది. ప్రభుత్వం, మేఘా సర్వశక్తులు సమీకరించి ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నాయి. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మేఘా పట్టుదల, కార్మికులు, సిబ్బంది వల్ల పనులు చకచకా నడుస్తున్నాయి. 3. 07 లక్షల ఘణపు మీటర్ల కాంక్రీట్ పనిని ఈ ఏడాది ఆగష్టు నాటికి పూర్తి చేయాలనీ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న మేఘా అందుకు అవసమైన ఇంజనీరింగ్ సిబ్బంది, విభాగాల వారి నిపుణులు, అధునాతన యంత్రాలు, సుమారు ఐదు వేలకు పైగా కార్మికులను షిప్ట్ల వారీగా పని చేయిస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం దూకుడుగా కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని పరిశీలించటంతో పాటు జలవనరులశాఖ అధికారులు, సిబ్బంది, మేఘా ఇంజనీరింగ్ సంస్థను ఉత్సాహ పరచటంతో పాటు మార్గ నిర్ధేశం చేసేందుకు ముఖ్యమంత్రి ఈ నెల 27న గురువారం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్ కాలానికి పోలవరం ప్రాజెక్ట్ జలాశయం లో ప్రధానమైన స్పిల్ వే, ఎర్త్ కం రాక్ ఫీల్ డ్యామ్ పూర్తి చేసేలా ప్రభుత్వం, మేఘా సంస్థ ప్రణాళికలు రూపొందించాయి. ఇప్పటికే దేశంలోనే ప్రతిష్టాత్మకంగా పేరు గాంచిన కాళేశ్వరం, పట్టిసీమ, హంద్రీనీవా వంటి అనేక పధకాలను చేపట్టి పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ పోలవరం పనులు చేపట్టటంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ పూర్తి అవుతుందనే నమ్మకం ప్రజలు, అధికారులు, ముఖ్యంగా పోలవరం ఆయకట్టు ప్రాంత రైతులకు వచ్చింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో స్పిల్ వే లోనే 53 బ్లాక్ ల నిర్మాణం కీలకం. ఈ పనిని గడువులోగా పూర్తి చేసేందుకు మేఘా పనులు చేపట్టింది. అందుకు అవసరమైన లక్ష్యాలను నిర్ధేశించుకుంది. బాబు తప్పిదంతో పనుల ఆలస్యానికి కారణం రివర్స్ టెండరింగ్ లో పనులు దక్కించుకున్న మేఘా వాటిని ప్రారంభించటానికి మూడు నెలలు కష్టపడాల్సి వచ్చింది. గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. తొలుత స్పిల్ వే నిర్మించిన అనంతరం కాపర్ డ్యామ్ వగైరా నిర్మిస్తే ముంపు సమస్య వచ్చేది కాదు. కాపర్ డ్యామ్ వల్ల పలు ప్రాంతాలు మునిగి పోయాయి . పోలవరం స్పిల్ వే లో నాలుగు టి ఎం సి ల నీరు నిల్వ ఉంది. రోడ్స్ అన్ని పాడై పోయాయి. నీటిని తోడి, రోడ్స్ సరి చేసేందుకు మూడు నెలల విలువైన సమయాన్ని మేఘా వెచ్చించాల్సి వచ్చింది. ఒకవేళ ఈ సమస్య లేకపోతె ప్రాజెక్ట్ పనుల్లో సింహభాగం చివరి దశకు వచ్చేవి. ప్రస్తుతం పోలవరం పనులు ఊపందుకున్నాయి. జలాశయంలో కీలకమైన స్పిల్వే లో 53 బ్లాకులను నిర్మించాలి. ఒక్కొక్క బ్లాకు 55 మీటర్ల ఎత్తు ఉంటుంది . వీటిని పూర్తి చేసే పనులు ఊపందుకున్నాయి. ఒక బ్లాకులో ఒక మీటర్ ఎత్తు నిర్మించడానికి (కాంక్రీట్ వేయడానికి) నాలుగు రోజుల సమయం పడుతుంది. సరాసరిన ప్రతీరోజు 12 బ్లాకుల్లో ఎత్తు పెంచే పని చురుగ్గా జరుగుతోంది. ఈ మొత్తం స్పిల్వేలో రెండున్నర లక్షల క్యూబిక్ మీటర్ల పనిచేయాలి. గత ఏడాది వరదల వల్ల ఎదురైనా అడ్డంకులను అధిగమించి జనవరి నెలాఖరు నాటికి 25 వేల క్యూబిక్ మీటర్ల పనిని ఎంఇఐఎల్ పూర్తిచేసింది. ఫిబ్రవరిలో 40 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి. మార్చిలో 50 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసి, మిగిలిన పనిని ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో పూర్తిచేయాలని మైల్ స్టోన్ గా పెట్టుకున్న మేఘా సంస్థ జలవనరుల శాఖ అధికారుల పర్యవేక్షణలో ముందుకు సాగుతోంది. రోజుకు 15 వందల క్యూబిక్ మీటర్ల పనిచేయాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ఈ ప్రాజెక్ట్లో కీలకమైన స్పిల్వేలోని పియర్స్, ఎర్త్కమ్ ర్యాక్ఫిల్ డ్యామ్ పునాది పనులు మేఘా మొదలుపెట్టింది. జలాశయంలో కీలకమైన మోడీ గ్యాపులలో 1,3కి సంబంధించిన డిజైన్లు ఆమోదం పొందే పని మేఘా చేపట్టింది. పోలవరం జలాశయం ఒక్కటైనా దీనిని మూడు విభాగాలుగా పరిగణలోకి తీసుకుంటారు. గ్యాప్1తో పాటు స్పిల్ వే, ఎర్త్ కమ్ ర్యాక్ఫిల్ డ్యాం కీలకమైనవి. ఇందులో గ్యాప్3ను 150 మీటర్ల పొడవుతో చిన్నపాటి కాంక్రీట్ డ్యామ్గా పూర్తిచేయాలి. గ్యాప్2లో ఎర్త్కమ్ ర్యాక్ఫిల్ డ్యాం ఉంటుంది. దీనినే ప్రధానమైన జలాశయంగా పిలుస్తారు. దీని పొడవు 1.75 కిలోమీటర్లు ఉంటుంది. గ్యాప్1లో కూడా ఎర్త్కమ్ ర్యాక్ఫిల్ డ్యామే నిర్మించాలి. దీని పొడవు 450 మీటర్లు ఉంటుంది. ప్రాజెక్ట్లో ర్యాక్ఫిల్ డ్యాం పనులు చేపట్టడానికి అవసరమైన వైబ్రో కంప్యాక్షన్ పరీక్షలను మేఘా నిర్వహిస్తోంది. అదే సమయంలో ప్రాజెక్ట్కు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు ప్రారంభమయ్యాయి. వీటి నిర్మాణం వల్ల ప్రాజెక్ట్ పనిజరుగుతున్నప్పుడు వరదలు వస్తే నీటిని మళ్లించడం వీలవుతుంది. గ్యాప్1లో డయాఫ్రం వాల్, స్పిల్ వే ఎగువ, దిగువన కాంక్రీట్ పనులు ప్రారంభించడానికి మేఘా ఏర్పాట్లు చేసుకుంది. వచ్చే ఏప్రిల్కు పోలవరంలో మెజారిటీ పనులు పూర్తి పోలవరం ప్రాజెక్ట్లోని ముఖ్యమైన పనులను పూర్తిచేయడానికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ లక్ష్యాలను పెట్టుకోంది. స్పిల్వే కాంక్రీట్పనిని 5 నెలలో అంటే 2020 జూన్ నెలఖరు నాటికి పూర్తిచేయాలనేది ఆ లక్ష్యాలలో ఒకటి. ఇందులో భాగమైన బీమ్లు అంతకన్నా ముందే మే నెలఖరు నాటికి పూర్తిచేయాలనే ప్రణాళిక ప్రకారం పనులు వేగిరం అయ్యాయి. స్పిల్వేకు సంబంధించిన బ్రిడ్జ్ పనులు పూర్తికి ఏడు నెలల సమయం పడుతుంది. స్పిల్ వే చానెల్కు సంబంధించిన బ్రిడ్జ్ పనులు 2021 మే నాటికి పూర్తికావాలి. ఈ పని మొత్తంగా 14 నెలల సమయం పడుతుంది. ఇందుకు సంబంధి ఇప్పుడు డిజైన్ల అనుమతులు తీసుకొని చకచకా పనులు చేయనున్నారు. డివైడ్ వాల్, ట్రైనింగ్వాల్, గైడ్ వాల్ లాంటివి 5 నెలల్లో అంటే ఈ ఏడాది మే నెలఖరుకు పూర్తిచేయాలి. ప్రాజెక్ట్ కోటింగ్, సర్ఫేస్ డ్రస్సింగ్, తారు రహదారి లాంటి ఫినిషింగ్ పనులు 2021 ఆగష్టు నాటికి పూర్తవుతాయి. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో లక్షా ముప్పైవేలు సాగులోకి రావడంతో పాటు 80 టిఎంసీల నీటిని కృష్ణకు తరలించడమే కాకుండా గోదావరి డెల్టాలో 13 లక్షల ఆయకట్టు రబీలో స్థిరీకరించి ఎడమ కాలువ క్రింద లక్షా అరవైవేల ఎకరాలకు నీరందిస్తారు. విశాఖ నగరానికి తాగునీటి అవసరాల కోసం 23.44 టిఎంసీల నీరు అందిస్తారు. -
హంద్రీ - నీవాను మించి...
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్తో ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా అద్బుతం చేసింది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్చ్ లిమిటెడ్(ఎంఈఐఎల్). ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పధకంలో తమ ఇంజనీరింగ్ మేధస్సుతో అద్భుతాలు చేసింది. అనతికాలంలోనే అత్యధిక సామర్ధ్యం కలిగిన పంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి తెలంగాణా ప్రజల గొంతుకను తడపడమే కాదు బీడుపడిన పంటపొలాలను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం. మూడేళ్ళలోనే 11పంపింగ్ కేంద్రాలలొ 3436 మెగావాట్ల సామర్ద్యం గల మిషన్ల ఏర్పాటుతో మొదటి దశ పనులు పూర్తిచేసి కాళేశ్వరంలోని లింక్ -1,2 లను పూర్తిచేసి రెండు టిఎంసిల నీటిని ఎత్తిపోసి చరిత్ర తిరగరాసింది. మేఘా పంపులతో గోదావరి పరవళ్లు రెండేళ్ళలో 11పంపింగ్ కేంద్రాలు పూర్తి చేయడంతో పాటు లింక్-1 పూర్తితో 120 కిమీ ఎగువకు గోదావరి నీరు రివర్స్ పంపింగ్ ద్వారా మళ్ళించడమే కాకుండా లక్ష్మీ పంప్ హౌస్ తో దిగువన ప్రాణహిత నీరు ఎగువ గోదావరిలోకి మళ్ళింపు చేయడం మరో రికార్డ్. గోదారి పరవళ్ళకు కొత్తనడకలు నేర్పుతూ రైతుల ఆశలకు జీవంపోస్తూ తెలంగాణా ప్రభుత్వ చిత్తశుద్దిని, పట్టుదలను, ఆచరణలో కాళేశ్వరాన్ని శరవేగంగా పూర్తి చేసి నిరూపించింది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్స్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్). ఇప్పుడు లక్ష్మీ(మేడిగడ్డ)పంపింగ్ కేంద్రం నుండి 11 మిషన్లతో ఒకేసారి నీటిని ఎత్తిపోయడం ద్వారా మొదటి దశ పనులు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. తాజాగా లక్ష్మీ కేంద్రం ఫిబ్రవరి 15వ తేదీ అర్దరాత్రి నుండి ఇప్పటివరకు నాలుగు టిఎంసిల నీటిని ఎత్తిపోసింది. 11 మిషన్లు పనిచేయడం ద్వారా 22 డెలివరీ పైపుల ద్వారా విడుదలైన ఆ గోదావరి పరవళ్ళు కనులవిందుగా ఉంది. పంపింగ్ కేంద్రం నుండి జాలువారిన గోదారి జలాలు వాడిన రైతన్నల ఆశలను మళ్ళీ చిగురింపచేశాయి. లక్ష్మీ నుండి డిసి ద్వారా విడుదలైన నీరు 13 కిలోమీటర్ల మేర కాలువలో హోయలొలుకుతూ సరస్వతి జలాశయానికి చేరిన గోదారి సముద్రాన్ని తలపిసూ జనాలను మైమరిపిస్తోంది. హంద్రీ - నీవాను మించి... ఇప్పటి వరకూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పధకం అయిన హంద్రీనీవాతో ఔరా అనిపించుకున్న మేఘా ఇప్పుడు తాజాగా కాళేశ్వరంలో 3436 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మిషన్లను 11పంపింగ్ కేంద్రాలలో ఏర్పాటుచేసి తన పేరిట ఉన్న రికార్డును తానే తిరగరాసింది. కాళేశ్వరంతో మరెవరికీ సాధ్యంకాని రికార్డు తన సొంతం చేసుకుంది మేఘా. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మొత్తం 22 పంపింగ్ స్టేషన్లు ఉండగా ఎంఈఐఎల్ మాత్రమే 17 పంప్ హౌస్లను నిర్మిస్తోంది. సాగునీటి రంగంలో ఎత్తిపోతల పధకాలకు ఇంత పెద్దస్థాయిలో విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కూడా ఇదే మొదటిసారి. రికార్డు స్థాయిలో నిర్మాణం కాళేశ్వరం ద్వారా 7200 మెగావాట్ల సామర్ద్యంతో 3టిఎంసిల నీటిని రోజుకు పంప్ చేసే విధంగా పనులు జరగుతుండగా అందులో 2టిఎంసిల నీటిని రోజుకు పంప్ చేయడానికి 4992 మెగావాట్ల సామర్ద్యం కల్గిన పంపింగ్ కేంద్రాలతో పాటు అంతే విద్యుత్తు సరఫరా అవుతుంది.ఇందులోనూ అత్యధిక భాగం మేఘానే పూర్తిచేసింది. 11 పంపింగ్ కేంద్రాలలో 59మిషన్లను ఏర్పాటు చేయడం ద్వారా 3436 మెగావాట్లు రెండున్నరేళ్ళలో నిర్మించడం ఇంజనీరింగ్ వండర్ గా గుర్తింపు పొందింది.పంపింగ్ కేంద్రాల నిర్మాణంలో ఇంతవరకు దరిదాపుల్లో మరే ప్రాజెక్టు కూడా లేదు. ఐతే మొదటి దశలోని లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గాయత్రి పంప్ హౌస్లను పూర్తిగా వినియోగిస్తుండటంతో దాదాపు 50టిఎంసిల నీటిని మిడ్ మానేరుకు పంప్ చేసి అక్కడి నుండి లోయర్ మానేరుకు విడుదల చేశారు. తాజాగా మళ్ళీ లక్ష్మీ కేంద్రం నుండి 11 మిషన్లతో పంపింగ్ ప్రారంభించగా సరస్వతి, పార్వతి, కేంద్రాల నుంచి కూడా పూర్తి స్థాయిలో పంపింగ్ కు రంగం సిద్దం చేశారు. ఇప్పటికే సరస్వతిలో 4మిషన్లు పంపింగ్ చేస్తున్నాయి. మేఘా విద్యుత్ వండర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు మొత్తం 4627మెగావాట్ల విద్యుత్ సరఫరా అవసరం కాగా అందులో 3057మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ అనతికాలంలోనే నిర్మించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక అతి తక్కువ సమయంలోనే మేఘా పంపింగ్ కేంద్రాలు 44 టిఎంసీల నీటిని ఎత్తిపోశాయి. ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ నీటిని పంప్చేయడం కూడా ఓ రికార్డ్గా చెప్పొచ్చు. -
సకాలంలో ఓఎన్జీసీ కీలక ప్రాజెక్టు పూర్తి
ఎంఇఐఎల్ మరో కీలక ప్రాజెక్ట్ను సకాలంలో పూర్తి చేసింది. చమురు రంగంలో వచ్చే మూడు దశాబ్దాల కాలానికి తగిన సామర్ధ్యంతో కూడిన నిర్వహణ వ్యవస్థను రూపొందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం అసోం రెన్యూవల్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్కు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఈపీసీ విధానంలో ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అధునాతన పద్ధతిలో ఈ ప్రాజెక్టును పునర్ నిర్మించింది. భారత్లో ముడి చమురు, ఉత్పత్తి రవాణా వ్యవస్థల్లో ఓఎన్జీసీకి ఈ చెందిన ఆన్షోర్ వ్యవస్థ అతి భారీది. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన వ్యవస్థ ప్రస్తుత అవసరాలకు సరిపోకపోవడం, మరో వైపు వచ్చే 30 ఏళ్ల అవసరాలు దృష్టిలో పెట్టుకొని అసోం ప్రాజెక్టు పునర్ నిర్మాణాన్ని ఓఎన్జీసీ చేపట్టింది. రూ.2400 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రతిష్టాత్మకమైన కాంట్రాక్టును ఈపీసీ పద్ధతిలో ఎంఇఐఎల్ దక్కించుకుంది. ప్రాజెక్టులో భాగంగా అసోంలోని నిర్మించిన లఖ్వా గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్ (జీజీఎస్) ఇప్పటికే జాతికి అంకితమివ్వడం జరిగింది. తాజాగా ప్రాజెక్టు పనులన్నీ పూర్తికావడంతో డిసెంబర్ 26, 2019న ప్రయోగాత్మక పరిశీలన నిర్వహించడం ద్వారా దీన్ని వాణిజ్యపరంగా వినియోగంలోకి తీసుకువచ్చారు. అసోం రెన్యూవల్ ప్రాజెక్టు ఆధునీకరణ ద్వారా ఓఎన్జీసీ ముడి చమురు, ఇంధన ప్రాసెసింగ్ సామర్ధ్యం భారీగా పెరుగుతుంది. రెన్యూవల్కు ముందు ఈ ప్రాజెక్టు ఉత్పత్తి సామర్ధ్యం ఏటా 1.4 ఎంటీపీఎ (మిలియన్ టన్స్ ఫర్ ఇయర్) అంటే 1.03 కోట్ల బ్యారెల్స్ (ఒక బ్యారెల్ అంటే ఇంచుమించు 159 లీటర్లు). పునర్నిర్మాణం తర్వాత ఈ సామర్ధ్యం 1.83 కోట్ల బ్యారెల్స్కు పెరుగుతుంది. అంటే దాదాపు రెట్టింపు. ఆధునీకరణలో భాగంగా అత్యంత నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గతంలో ఉన్న 800 కిలోమీటర్ల పైప్లైన్ను 560 కిలోమీటర్లకు ఎంఇఐఎల్ తగ్గించింది. గతంలోని విధానంలో 21 నిర్మాణాలు ఉండగా ప్రస్తుతం అవి 9కి తగ్గాయి. వాటిని కూడా ఆధునిక ఇంటిగ్రేటెడ్ కేంద్రాలుగా మార్చి వ్యవస్థలోని సంక్లిష్టతలను తగ్గించి సరళతరం చేసింది ఎంఇఐఎల్. ఒప్పందంలో భాగంగా రెన్యూవల్ ప్రాజెక్టులో కీలకమైన 5 గ్యాస్ సేకరణ కేంద్రాలను ఎంఇఐఎల్ నిర్మించింది. ఈ ఆధునిక వ్యవస్థ నిర్వహణకు తగినట్టుగా 2 నీటి శుద్ధికేంద్రాలు, 2 వాటర్ ఇంజెక్షన్ ప్లాంట్లు నిర్మించింది. సేకరించిన గ్యాసును కంప్రెస్ చేసే నిల్వ చేసేందుకు రెండు ప్లాంట్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ నవీకరణ ప్రాజెక్టులో భాగంగా ముడి చమురు నుంచి ఉత్పత్తయ్యే అన్నింటిని నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం, రవాణా వ్యవస్థ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యవస్థలో అత్యంత కీలకమైన గ్యాస్ కండిషనింగ్ కోసం గ్యాస్ డీహ్రైడేషన్ యూనిట్ నిర్మాణం కూడా జరిగింది. ఎకో ఫ్రెండ్లీగా వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఉత్పత్తయ్యే వ్యర్థాలన్నింటినీ నిర్మూలించేందుకు ప్రత్యేక వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. -
కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలం
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టి నాసిక్లోని త్రయంబకేశ్వరుడిని స్పృశిస్తూ తెలంగాణలో బాసర జ్ఞానసరస్వతికి ప్రణమిల్లుతూ గలగలపారుతూ భద్రాద్రిలో శ్రీరామచంద్రుడి పాదాలను తాకుతూ ప్రవహించే గోదావరి ఇప్పుడు దిశ మార్చుకుంది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత సంగమ ప్రదేశంలో గోదావరి ప్రవాహ దిక్కు మారింది. ఈ అద్భుతాన్ని ఆవిష్కరించి నీరు పల్లమెరుగన్న మాటకు కాలం చెల్లిందని నిరూపించింది ఇంజినీరింగ్ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. గోదావరి దిశ మార్చిన మేఘా తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. గోదావరి జలాలతో రాష్ట్రమంతా సస్యశ్యామలంగా ఉండాలనే సదాశయంతో రూపొందించిన పథకం ఇది. ప్రత్యక్షంగా కొంత ప్రాంతాన్ని, పరోక్షంగా కొంత ప్రాంతాన్ని మొత్తంగా తెలంగాణ అంతటికి నీరందించే ప్రాజెక్టు ఇది. భారీ ప్రాజెక్టులను అతి వేగంగా పూర్తి చేస్తూ సాగు, తాగునీటి రంగంలో అద్భుతాలు సృష్టిస్తూ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గోదావరి దిశ మార్చుతూ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భూమిక పోషించింది. ప్రపంచంలో ఇంత వరకు ఎవరూ ఉపయోగించని భారీస్థాయి పంపులు కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌజుల్లో ఏర్పాటు చేసి లిఫ్ట్ ఇరిగేషన్కు కొత్త భాష్యం చెప్పింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నది అయిన గోదావరిని దిగువ నుంచి ఎగువకు ప్రవహించేలా చేసి ఎలక్ట్రోమెకానికల్ రంగంలో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా తొలిసారిగా ఓ భారీ నదిని గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా సముద్రమట్టానికి 300 మీటర్ల ఎగువకు నీరు ఎదురు ప్రవహించేలా చేసిన అద్భుతాన్ని తెలంగాణ రాష్ట్రం సొంతం చేసుకుంది. మూడేళ్లలో పూర్తి ఆంధ్రప్రదేశ్లోని హంద్రీ-నీవా, అమెరికాలోని కొలరాడో, ఈజిప్టులోని గ్రేట్మ్యాన్మేడ్ రివర్ వంటి వాటికి ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టులుగా గుర్తింపు ఉంది. కాని వాటి పంపింగ్తో పోలిస్తే కాళేశ్వరం తక్కువ సమయంలో వాటికన్నా ఎక్కువ నీటిని ఎగువకు ఎత్తిపోసింది. ప్రపంచ నీటిపారుదల రంగంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఈ అద్భుతం ఆవిష్కృతం కావడం వెనుక మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) అనితర సాధ్యమైన కృషి ఉంది. సాంకేతికంగా, విద్యుత్పరంగా ఎన్నో సంక్లిష్టతలు ఉన్నా అకుంఠిత దీక్షతో ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది మేఘా వాస్తవానికి ఇంత భారీస్థాయి ప్రాజెక్టులు పూర్తికావడానికి దశాబ్దాలు పడుతుంది. నాగార్జున సాగర్, శ్రీరామ్, శ్రీశైలం, తెలుగు గంగ ప్రాజెక్టులు పూర్తి కావడానికి 20 ఏళ్లకు పైగా పట్టింది. అయినా ఇవి ఇప్పటికీ పూర్తిస్థాయి వినియోగంలోకి రాలేదని అందరూ అంగీకరిస్తారు. కాళేశ్వరంలో ప్రాజెక్ట్లో క్లిష్టమైన పనులు ఎన్నో ఉన్నప్పటికీ మూడేళ్లలో దాన్ని పూర్తికావడం అరుదైన విషయం. రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోతల పథకాల నిర్మాణం సాధారణ సాగునీటి ప్రాజెక్టుల్లాగా సులభంగా ఉండదు. అందులోనూ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భూగర్భంలో పంప్హౌస్లు, సొరంగాలు ఉన్నాయి. సాంకేతిక పనులు, ఇంజినీరింగ్ రంగంలో ముఫ్పై ఏళ్ల అనుభవం, నైపుణ్యాన్ని రంగరించి ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలన్న పట్టుదలతో అన్ని సవాళ్లను అధిగమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మేఘా ఇంజినీరింగ్. రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయగల సామర్ధ్యం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెకుకు ఉంది. నీటిని ఎత్తిపోసేందుకు లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గాయత్రి పంపు హౌసుల్లో ఏర్పాటు చేసిన పంపులు సామర్థ్యం విషయంలో దేనికవే విశిష్టమైనవి. నాలుగు పంపు హౌసులు ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. పంపు హౌజుల్లో అతి క్లిష్టమైనది లక్ష్మీపూర్ గాయత్రి. భూమికి 470 అడుగుల లోతున నిర్మించిన ఈ పంప్ హౌజ్ అన్ని రిజర్వాయర్లలో ఏడాది అంతా నీరు నిల్వ ఉండేలా చూస్తుంది. జంట సొరంగాలతో కూడిన ఈ పంపు హౌసులో నిర్మించిన భారీ సర్జ్ పూల్స్ ప్రపంచంలోనే అతి పెద్దవి. ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 7 మోటర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోటర్లు రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయగలవు. మేకిన్ ఇండియాలో భాగంగా దేశీయంగా తయారు చేసిన భారీ మోటర్లు ఇవి. ఒక్కో మోటర్ పంపు బరువు 2376 మెట్రిక్ టన్నులు ఉంటుంది. సాధారణంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంప్ హౌసులను నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా భూమికి సమానంగా నది ఒడ్డున నిర్మిస్తారు. కాని భూమి లోపల నిర్మించిన గాయత్రి పంప్ హౌస్ మాత్రం ఎంతో విశిష్టమైన నిర్మాణం. దీని కోసం 21.6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వారు. కిలోల్లో చెప్పాలంటే ఇది కోట్లలో ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, సలహాలు సూచనలు, ప్రోత్సాహంతో ఈ ఇంజినీరింగ్ అద్భుతాన్ని మేఘా ఇంజినీరింగ్ పూర్తి చేయగలిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమలకు అవసరమైన నీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మేడిగడ్డ నుంచి సిరిసిల్ల వరకు ఇసుకమేటలుగా కనిపించే ప్రదేశమంతా ఇప్పుడు సస్యశ్యామలం కాబోతోంది. గోదావరి దశ-దిశను మార్చయడంలో ఇంజినీరింగ్ దిగ్గజం మేఘా అద్భుతమైన పాత్ర పోషించింది. -
పోలవరం స్పిల్ వే ప్రాంతంలో పనులకు శ్రీకారం
సాక్షి, పోలవరం : అనుకున్నట్టుగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. చెప్పిన గడువుకంటే ముందుగానే పోలవరం పూర్తిచేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా స్పిల్ వే ప్రాంతంలో కాంక్రీట్ పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ గురువారం శ్రీకారం చుట్టారు. తొలిరోజు 100 క్కుబిక్కు మీటర్ల పనిని ఇవాళ పూర్తి చేసింది. ఈ పనుల శాతాన్ని రోజు రోజుకు పెంచుకుంటూపోతూ లక్ష్యం మేరకు పనులను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండర్ల పాల్గొన్న ఎంఈఐఎల్ పోలవరం ప్రాజెక్ట్ పనులను 12.6 శాతం తక్కువకు కోట్ చేసి దక్కించుకొంది. ఈ నెల ఒకటో తేదీన ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఈ రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి 782 కోట్ల రూపాయలు ఆదా అయింది. కాగా మొదటిగా మేఘా ఇంజనీరింగ్ భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలోని రోడ్లను మరమ్మతులు చేసి ఆ ప్రాంతాన్ని నిర్మాణానికి అనుకూలంగా తీర్చిదిద్దింది. తాజాగా కాంక్రీట్ పనులకు శ్రీకారం చుట్టింది. స్పిల్ వే ప్రాంతంలో పనులను ఇవాళ ప్రారంభించింది. ముందుగా నిర్ణయించిన సమయానికి కాంక్రీట్ వేయటం ప్రారంభించిన మేఘా సంస్థ ప్రతినిధులు తోలి రోజు 100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు. ఈ పరిమాణాన్ని రోజు రోజుకు పెంచుకుంటూపోతామని ఎంఇఐఎల్ సంస్థ జనరల్ మేనేజర్ అంగర సతీష్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అనుగుణంగా ప్రస్తుతం స్పిల్ వే వద్ద పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో వర్షపు నీరు ఎక్కువగా ఉంది. ఆ నీటిని తొలుత సాధారణ ప్రవాహం ద్వారా తగ్గించే ఏర్పాట్లను మేఘా సంస్థ చేసింది. నీటి మట్టం కొంత తగ్గిన తరువాత మోటార్లను ఉపయోగించి ఆ నీటిని నిర్మాణ ప్రాంతం నుంచి పూర్తిగా తొలగిస్తామని సతీష్ చెప్పారు. స్పిల్ వేలో మూడు లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాల్సి ఉంది. స్పిల్ ఛానల్ లో 5.3 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాలి. అయితే స్పిల్ చానల్ లో నీటి నిల్వ ఎక్కువగా ఉండటంతో నీరు తగ్గిన తరువాత మేఘా ఇంజనీరింగ్ అక్కడ పనులు చేపట్టనుంది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, కాపర్ డ్యామ్ పనులను ఒకదాని వెనుక ఒకటి ప్రారంభిస్తామని సతీష్ బాబు చెప్పారు. రాక్ ఫిల్ డ్యామ్ లో 1. 50 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులను చేయాల్సి ఉంది. ఈ పనులను వచ్చే సీజన్లో అంటే 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. స్పిల్ వే పనులు 2020 జూన్ నాటికి పూర్తి చేస్తామని వివరించారు. -
ఫోర్బ్స్‘కలెక్టర్స్ ఎడిషన్’లో... ‘మేఘా’కు ప్రత్యేక స్థానం!
హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఇండియా మేగజీన్.. ‘కలెక్టర్స్ ఎడిషన్ 2019’లో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) చైర్మన్ పీపీ రెడ్డికి విశిష్ట గౌరవం లభించింది. ఈ ఎడిషన్లో ఆయనకు సంబంధించి ఒక ప్రత్యేక కథనాన్ని ఫోర్బ్స్ ఇండియా ప్రచురించింది. దేశంలోని అత్యంత సంపన్నులకు సంబంధించి ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన 2019 జాబితాలో పీపీ రెడ్డి 3.3 బిలియన్ డాలర్ల సంపదతో 39వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘మేఘా బిల్డర్’ పేరుతో ఫోర్బ్స్ ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. పీపీ రెడ్డితో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణా రెడ్డి కలిసి ఉన్న ఫొటోతో ప్రచురించిన ఈ వ్యాసంలో, 1987లో పైపుల తయారీ సంస్థగా చిన్నగా ప్రారంభమయిన మేఘా ఇంజనీరింగ్, అటు తర్వాత సాగించిన అప్రతిహత పురోగమనాన్ని ప్రస్తావించింది. 14 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు– కాళేశ్వరంను సంస్థ విజయవంతంగా పూర్తిచేసిన విషయాన్ని ఇందులో ప్రస్తావించింది. అలాగే జోర్డాన్, కువైట్, టాంజానియా, జాంబియా వంటి పలు దేశాల్లోని పలు ప్రాజెక్టుల్లో సంస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఉటంకించింది. భారత్ అత్యుత్తమ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కంపెనీల్లో ఒకటిగా ఎంఈఐఎల్ నిలుస్తోందని పేర్కొంది. రుణ రహిత కంపెనీగా ఎంఈఐఎల్ కొనసాగుతున్న విషయాన్ని ఫోర్బ్స్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. -
పర్యావరణం కలుషితం కాకుండా...
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ రంగంలో ప్రపంచంలోని తనదైన ముద్రవేసుకున్న మేఘా ఇంజనీరింగ్ ఇప్పుడు తాజాగా గ్యాస్ సరఫరా, పంపిణీకి విస్తృతం చేయనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని మూడు జిల్లాలో ఆటోమొబైల్ గ్యాస్ సరఫరా చేస్తున్న మేఘా తాజాగా మరో శకాన్ని ప్రారంభించబోతోంది. మేఘా గ్యాస్ బ్రాండ్ పేరుతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం పర్యావరణం కలుషితం కాకుండా... కేంద్రం కలను సాకారం చేసేలా మేఘా హైడ్రోకార్బన్స్ డివిజన్ సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 16 జిల్లాల్లో గ్యాస్ పంపిణీ కోసం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతులను పొందింది. అలాగే ఆటోమోబైల్ రంగానికి గ్యాస్ సరఫరా కోసం ఇప్పటికే 9 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్ మరో అయిదు స్టేషన్లను వచ్చే మూడు నెలల్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా, కర్ణాటకలోని తూంకూరు, బెల్గాం జిల్లాల్లో గ్యాస్ పంపిణీని ప్రారంభించగా.. త్వరలో తెలంగాణ లో పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నాగాయలంక, వెస్ట్ పెనుగొండ క్షేత్రాలు కీలకం కృష్ణా జిల్లా నాగాయలంక, వెస్ట్ పెనుగొండ ఆన్షోర్ గ్యాస్ క్షేత్రాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్యాస్ గ్రిడ్ను అభివృద్ధి పరిచేందుకు ఓఎన్జీసీ నుంచి వ్యూహాత్మకంగా పొందింది. ఈ గ్యాస్ క్షేత్రాల నుంచి రోజుకి లక్షా 30 వేల ఎస్సీఎం గ్యాస్ను తరలించనుంది. ఇందుకోసం అమెరికా నుంచి రప్పించిన మెకానికల్ రిఫ్రిజేషన్ యూనిట్లు, కంప్రెసర్లు వంటి అత్యధునిక యంత్రాలను ఉపయోగిస్తోంది. నాగాయలంక క్రేత్రం నుంచి నేచురల్ గ్యాస్ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని కృష్టాజిల్లాలోని వినియోగదారులకు పంపిణీ చేస్తున్నది. ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలో ఇప్పటికే 1200 కిలోమీటర్ల పైప్లైన్ వేసింది. భవిష్యత్తు అవసరాల కోసం మరో 5000 కిలోమీటర్ల పైప్లైన్ వేయనుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)ను, ఆటో మోబైల్ రంగానికి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)ని సరఫరా చేయనుంది. తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి త్వరలో గ్యాస్ పంపిణీకి సన్నహాలను చేస్తున్నది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో 12 కిలోమీటర్ల మేర పైపులైను వేయగా వచ్చే మూడు నెలల్లో మిగతా జిల్లాల్లో పైప్లైను పనులను విస్తరించి సేవలను ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నది. మేఘా సీఎన్జీ స్టేషన్లు... కృష్ణా జిల్లాలో ఆటోమోబైల్ రంగానికి ఇప్పటికే 9 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించిన మేఘా గ్యాస్ మూడు నెలల్లో మరో ఐదు సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న 9 సీఎన్జీ స్టేషన్ల ద్వారా ప్రతి నెలా నాలుగున్నర లక్షల ఎస్సీఎం గ్యాస్ను విక్రయిస్తున్నది. కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ఐదు సీఎన్జీ స్టేషన్ల ద్వారా మరో మూడు లక్షల ఎస్సీఎం గ్యాస్ ను సరఫరా చేసే అవకాశం వుంది. అంచనాలకు మించి కర్ణాటకలోని బెల్గాం, తూంకూరు జిల్లా గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. తూంకూరు జిల్లాలోనే మొత్తం 12,500 మంది వినియోగదారులకు ప్రస్తుతం పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తుండగా, ఈ నెలాఖారుకు మరో నాలుగు వేల గ్యాస్ కనెక్షన్లను ఇవ్వనుంది. వాణిజ్య వినియోగదారుల నుంచి ప్రతి నెలా లక్షా 40 వేల ఎస్సీఎం గ్యాస్ పంపిణీ చేస్తుండగా, త్వరలోనే ఈ డిమాండ్ రెట్టంపు కానుంది. -
పోలవరం పనులు ప్రారంభించిన ‘మేఘా’
సాక్షి, పోలవరం: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు మేఘ ఇంజనీరింగ్ సంస్థ శుక్రవారం భూమి పూజ చేసింది. ప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు అనుమతినిస్తూ హైకోర్టు ఉత్తరువులు ఇవ్వడంతో మేఘా సంస్థ పనులు ప్రారంభించింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థ అధికారులు ఇవాళ ఉదయం స్పిల్వే బ్లాక్ నంబర్ 18 వద్ద జలవనరుల శాఖ ఈఈ ఏసుబాబు సమక్షంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. కాగా అన్ని వనరులు ఉపయోగించి నిర్ణీత గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మేఘా సంస్థ అన్ని ఏర్పాటు చేసుకుంటోంది. కాళేశ్వరం లాంటి క్లిష్టమైన ప్రాజెక్టులు నిర్మించిన అనుభవంతో ఆంధ్రప్రదేశ్లోనూ జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని ఒప్పంద గడువు ప్రకారం పూర్తి చేసి రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. ఇన్ని రోజులు పోలవరం పనులు చేపట్టేందుకు అడ్డంకిగా ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేయడంతో పనులు చేయడానికి మార్గం సుగమం అయ్యింది. హైకోర్టు ఉత్తరువులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టును కాళేశ్వరం తరహాలో యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2005లో పనులు ప్రారంభిస్తూ హెడ్వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనులను ప్యాకేజ్ వారిగా అప్పగించారు. అదే సమయంలో ఆయన కీలకమైన అన్ని అనుమతులను సాధించారు. పాత కాంట్రాక్టును రద్దు చేసి మళ్లీ రివర్స్ టెండర్కు వెళ్లి పోలవరం హెడ్ వర్కులతో పాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది. మేఘా ఇంజనీరింగ్ గతంలో ఈ టెండర్లో పనులు చేపట్టిన సంస్థల కంటే తక్కువ -12.6 శాతానికి రూ. 4358 కోట్ల మొత్తానికి పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వానికి దీనివల్ల రూ 628 కోట్ల మొత్తంలో నిధులు ఆదా అవుతున్నాయి. ఈ ప్రాజెక్లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే 4358 మొత్తానికి టెండర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా ఈ బహుళార్ధ సాధక ప్రాజెక్టును పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఎంఈఐఎల్ వడివడిగా అడుగులు వేస్తోంది. -
‘రివర్స్ టెండరింగ్తో మరి ఇంత తేడానా’
సాక్షి, అమరావతి: రివర్స్ టెండరింగ్తో ఇంత భారీ తేడా వస్తుందని ఊహించలేదు.. ఆశ్చర్యపోయాను అన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. మంగళవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిజాయతీగా పని చేసేందుకు ప్రయత్నిస్తుందని ప్రశంసించారు. ఏ పని ఇచ్చినా జ్యూడిషియల్గా ఫాలో అప్ చేసి ఇస్తుండటం మంచి పరిణామం అన్నారు. మేఘా కృష్ణా రెడ్డి కంపెనీ రూ.700 కోట్లు తక్కువకు టెండర్ చేయడానికి ఎలా ముందుకు వచ్చారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కింది స్థాయిలో అవినీతి ఉంది.. దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలని ఉండవల్లి కోరారు. అందరు నిజాయతీగా పని చేయక తప్పదనే పరిస్థితి తీసుకురావలన్నారు ఉండవల్లి. పాలనలో పూర్తి పారదర్శకత తీసుకురావడానికి ప్రయత్నించాలని సూచించారు. 57 శాతం పైగా ఓట్లతో అధికారంలోకి వచ్చారు.. అదే శాశ్వతం అనుకోవద్దని ఉండవల్లి హెచ్చరించారు. ప్రజల్లో మంచి పేరుతో పాటు.. తనతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలను సంతృప్తి పరచడం జగన్ విధి అన్నారు. ఎమ్మెల్యేలపై నమ్మకం ఉంచి జాగ్రత్తగా వ్యవహరించమని కోరారు. జగన్ ఒక్కడిగా వచ్చాడు.. ఒక్కడిగా నడిపించాడు.. ఇప్పుడు తేడా రానివ్వొద్దన్నారు. ప్రభుత్వంపై సీరియస్గా ఆరోపణలు చేయడానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. -
‘రివర్స్’ సూపర్ సక్సెస్.. రూ. 782 కోట్లు ఆదా!
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టులో చేపట్టిన ‘రివర్స్ టెండరింగ్’ సూపర్ సక్సెస్ అవుతోంది. తాజాగా పోలవరం ప్రధాన డ్యామ్ వద్ద మిగిలిన పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్ టెండరింగ్లో ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ. 782 కోట్లు ఆదా అయ్యాయి. రూ. 4,987.55 కోట్లు విలువచేసే.. పోలవరం ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలువగా.. 12.6శాతం తక్కువ మొత్తానికే ఈ పనులు చేపట్టేందుకు ‘మేఘ’ సంస్థ ముందుకొచ్చింది. ఈ పనుల కోసం రూ. 4,358.11 కోట్లు కోట్ చేస్తూ.. మేఘ సంస్థ బిడ్డింగ్ వేసింది. ఈ మేరకు ఆర్థిక బిడ్ను ఏపీ ప్రభుత్వం సోమవారం తెరిచింది. దీంతో ఏపీ ఖజానాకు రూ. 628.43 కోట్లు ఆదా కాగా.. గతంలో 4.8శాతం ఎక్సెస్ ధరకు తన అస్మదీయులకు చంద్రబాబు సర్కారు ఈ టెండర్లు కట్టబెట్టింది. దీనివల్ల ఖజానాపై రూ. 154 కోట్ల అదనపు భారం పడింది. ఈ భారాన్ని కూడా కలుపుకుంటే ప్రస్తుతం ఖజానాకు రూ. 782 కోట్లు ఆదా అయినట్టు అయింది. ఇంతకుముందు పోలవరం 65వ ప్యాకేజీ పనులకు సంబంధించి చేపట్టిన రివర్స్ టెండరింగ్లో రూ.58.53 కోట్లు ఖజానాకు ఆదా అయిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రధాన డ్యాము వద్ద మిగిలిన రూ. 1,771.44 కోట్ల పనుల కోసం, 960 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రూ. 3,216.11 కోట్ల పనుల కోసం తాజాగా ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ను నిర్వహించింది. ఈ మేరకు పనులను చేపట్టేందుకు మేఘ సంస్థ బిడ్డింగ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో హైడల్ ప్రాజెక్టు పనులను 4.8శాతం అధిక ధరకు నవయుగ సంస్థకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. ఎక్సెస్ రేటుకు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 154 కోట్ల అదనపు భారం పడింది. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతి, అక్రమాలపై నిపుణుల కమిటీ విచారణ జరిపింది. పోలవరం టెండర్లను గత ప్రభుత్వం కావాలనే అధిక మొత్తానికి కటబెట్టినట్టు నిపుణల కమిటీ నిర్ధారించింది. ఒకే సంస్థకు నామినేటెడ్ పద్ధతిలో గత చంద్రబాబు సర్కారు పోలవరం పనులను కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ విధానాన్ని చేపట్టింది. రివర్స్ టెండరింగ్లో గణనీయమైన రీతిలో ప్రభుత్వ ఖజానాకు భారం తగ్గింది. పోలవరం 65వ ప్యాకేజీ పనుల్లో రూ. 59 కోట్లు ఆదా కాగా.. ప్రస్తుతం ప్రధాన పనుల విషయంలో ఏకంగా రూ. 782 కోట్లు ఆదా అయ్యాయి. చదవండి: రివర్స్ టెండరింగ్: తొలి అడుగులోనే 58.53 కోట్లు ఆదా -
‘మేఘా’ సిగలో మరో కీర్తి కిరీటం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇ్రన్ఫాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక సంస్థ ఇండియన్ కాంక్రీట్ ఇనిస్టిట్యూట్ (ఐసీఐ)నుంచి ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డు అందుకుంది. కాంక్రీట్ డే సందర్భంగా ఐసీఐ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో ఓ ప్రైవేటు హోటల్లో కాంక్రీట్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీఐ అధ్యక్షుడు వినయ్ గుప్తా చేతుల మీదుగా ఉత్తమ కాంక్రీట్ స్ట్రక్చర్ అవార్డును ఎంఈఐఎల్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్, ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇతర కంపెనీల ప్రతినిధులు అందుకున్నారు. ఈ సందర్భంగా బి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..‘ఈ అవార్డును అందుకోవడం గర్వంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎంఈఐఎల్ భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం పనిచేసిన 1,500 మంది ఇంజనీర్లు, సిబ్బందికి ఈ అవార్డును అంకితం ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతోనే ఈ ప్రాజెక్టును ఇంత త్వరగా పూర్తిచేయగలిగాం’అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్లోని అమెజాన్ భవనానికి, ఖాజాగూడ నుంచి నానక్ రామ్గూడ వరకు ఏర్పాటు చేసిన వైట్ ట్యాపింగ్ రోడ్తో పాటు వివిధ జిల్లాల్లోని ఉత్తమ కాంక్రీట్ నిర్మాణాలకు కూడా అవార్డులు అందించారు. -
ప్రత్యేకత చాటుకుంటున్న ’మేఘా’
కరీంనగర్: తెలంగాణలో పుడమిని చీల్చుకుంటూ గోదారమ్మ పొంగిపొర్లుతూ ఉరకలేస్తోంది. భూగర్భంలో నుంచి ’మేఘా’ గాయత్రి పంపింగ్ హౌసులో జలాలు ఉవ్వెత్తున ఉబుకుతున్నాయి. శివుడి శిరస్సుపై నుంచి గంగమ్మ జాలువారినట్టు పుడమిని నమ్ముకున్న రైతన్నల ఆశలకు అంకురార్పణ చేస్తూ తెలంగాణలోని మగాణిని పచ్చదనం పరిచేందుకు గోదారమ్మ బిరబిరా పరుగులెడుతోంది. గాయత్రి భాగర్భ పంపింగ్ కేంద్రం నిర్మాణంతో ఏటిలో నుంచి కాలువల్లోకి పొంగిపొర్లుతూ బీళ్లు బారిన పొలాల గట్లలోకి తడార్చేందుకు జలాలు ఉరకలేస్తున్నాయి. గొంతెండిన పొలాలను పులకరింపజేస్తూ పంటపొలాల్లో విత్తులు మొక్కై ఫలాలు అందించేందుకు భూమి పొరల్లోంచి చీల్చుకుంటూ వస్తోన్నాయి. మానేరులో గోదారమ్మ సాగరాన్ని తలపిస్తూ గాయత్రి పంపింగ్ హౌస్ కళకళలాడుతోంది. బీడుబారిన పొలాలను పులకరింపజేస్తూ మిడ్ మానేరుకు పరుగులు తీస్తోంది. తెలంగాణలో ’మేఘా ఇంజనీరింగ్’ ఓ అత్యద్భుతాన్ని ఆవిష్కరించింది. ’మేఘా ఇంజినీరింగ్’ భూగర్భంలో విశ్వవిఖ్యాతిగాంచిన గాయత్రి నీటి పంపింగ్ కేంద్రాన్ని తెలంగాణ కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామ సమీపంలో నిర్మించింది. ఈ కేంద్రాన్ని ఆగస్టు 11న ప్రారంభించి నేటి వరకు 22 రోజులు అవుతుండగా 3 పంపింగ్ మిషన్లతో 11. 40 టిఎంసీల నీరు మిడ్ మానేరుకు చేరుకున్నాయి. తొలిగా ప్రారంభించిన క్రమసంఖ్యలో 5వ మిషన్ 16 రోజుల్లో నిరంతరాయంగా 380 గంటపాటు, రెండోది వరుసలో 4వ మిషన్ 378 గంటలు పని చేయడంతో ఈ రెండు మిషన్లు ఒక్కొక్కటి దాదాపు 4.30 టిఎంసీల నీటిని పంప్ చేశాయి. అలాగే మూడోది 1వ మిషన్ 10రోజుల్లో 248గంటలు పని చేసి 2.80టిఎంసీల నీటిని తోడింది. ’మెగా’ మహాద్భుతం గాయత్రి పంపింగ్ కేంద్రాన్ని భూగర్భంలో 470 అడుగులు 327 మీటర్ల పొడవున నిర్మించి విశ్వవిఖ్యాతి ఘనత సాధించింది. ఈ నిర్మాణంలో తొలిదశలో ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యంతో 5 మిషన్లున్నాయి. మోటారు, పంపు కలుపుకుంటే ఓ మిషన్. మలిదశలో మరో రెండు మిషన్లు సిద్ధమవుతుండగా ఇప్పటికే ఓ మిషన్ డ్రైరన్ కూడా పూర్తయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రం గుండెకాయల పని చేస్తూ బీళ్లుబారిన లక్షల ఎకరాల చేనులకు సాగునీరు అందించేందుకు గోదారమ్మ పరుగులు పెడుతూ రైతన్నల కళ్ళల్లో ముంగిట్లో బంగారు కలలను , గుండెల్లో మొక్కవోని ధైర్యాన్ని చిగురింపజేస్తోంది. 2019 జూలైలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లింక్ 1లోని లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం), పార్వతి (సుందిళ్ల) నుంచి నీటిని పంపింగ్ చేస్తున్న ’మేఘా’ తన రికార్డును తానే అధిగమించింది. ప్రపంచ నెంబర్ వన్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా స్థాయిలో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమిస్తూ అతి పెద్ద పంపులు ఏర్పాటు చేసి ఎలాంటి సాంకేతిక సమస్యకు తావివ్వలేదు. అత్యద్భుతమైన ప్రాజెక్టుపై విమర్శలు చేస్తోన్న నోళ్లకు తాళాలు వేసుకునేలా ’మేఘా పంపింగ్ కేంద్రాలు’ గంగమ్మను భూ ఉపరితలంపైకి ఉబికిస్తూ నలుదిక్కులు ఘనతను పిక్కటిల్లెలా చాటుతోంది. ఇప్పటి వరకు అతిపెద్ద పంపింగ్ కేంద్రాలుగా హంద్రీనీవా తొలిదశలోని 12 కేంద్రాలు, రెండోదశలో 18 కేంద్రాలు ఖ్యాతిని గడించాయి. అంతేకాకుండా పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పంపింగ్ కేంద్రం చూసినా ’మేఘా ఇంజనీరింగ్’ నిర్మించినవే. ఏపీలోని హంద్రీనీవా అతి పెద్దది, ముఖ్యంగా అతి పొడవైనది అంతే కాకుండా ఎక్కువ పంపింగ్ కేంద్రాలతో రికార్డులను సొంతం చేసుకుంది. తొలిదశలో 12 కేంద్రాలు, 2వ దశలో 18 కేంద్రాలున్నాయి. తొలిదశలో 1వ పంపింగ్ కేంద్రం కృష్ణానది శ్రీశైలం ఎగువ భాగం మాల్యాలో నిర్మించారు. ఈ పంపింగ్ కేంద్రంలో 12 మిషన్లు ఉన్నాయి. ఒక్కొక్క మిషన్ 9.56 క్యూసెక్కుల నీరు అలాగే 5 మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యంతో నిర్మించారు. దాదాపు నీటి పంపింగ్ ఎత్తు 38 మీటర్లు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే లింక్ 1లో ఒక్కొక్క మిషన్ సామర్ధ్యం 40 మెగావాట్లు. ఒక్క లక్ష్మీ మేడిగడ్డ కేంద్రంలోనే 17 మిషన్లు వున్నాయి. మొత్తం సామర్ధ్యం 680 మెగావాట్లు. హంద్రీనీవా మాల్యా పంపింగ్ కేంద్రం మొత్తం సామర్ధ్యం 60 మెగావాట్లు. అంటే హంద్రీనీవా కంటే కాళేశ్వరం లక్ష్మీ పంపింగ్ కేంద్రం ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఐతే కాళేశ్వరంలోనే ఈ లక్ష్మీ మేడిగడ్డ కేంద్రంతో పోల్చితే గాయత్రి భూగర్భ పంపింగ్ కేంద్రం మరింత అత్యంత పెద్దది. ఇందులో ఒక్కొక్కటి 139 మెగావాట్ల చొప్పున 7మిషన్లు 973 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించింది. అందులోనూ భూగర్భంలో 470 అడుగుల దిగువన నిర్మించడం విశేషం. ఏపీ, తెలంగాణలో ఏ పంపింగ్ కేంద్రముతోనూ గాయత్రి పంపింగ్ కేంద్రానికి పోలిక లేనేలేదు. హంద్రీనీవా అతిపెద్ద పంపింగ్ పధకం ఐనప్పటికీ అందులో మరింత పెద్దదిగా పరిగణించేది మాల్యాలోని తొలి కేంద్రం. 2012 నుంచి అంటే 8 ఏళ్లు 1242 రోజుల పాటు పంపింగ్ జరుగుతున్నప్పటికి 163.4 టిఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోసారు. అలాగే పట్టిసీమ నుంచి ఐదేళ్లలో 289 టిఎంసీల నీటిని అందించగలిగారు. ఐతే కాళేశ్వరంలోని ’మేఘా ఇంజనీరింగ్’ నిర్మించిన లింక్1, లింక్2 లోని 4 మెగా పంపింగ్ కేంద్రాలు పనిచేస్తే ఏ స్థాయిలో తెలంగాణలో బీళ్లు బారిన లక్షల ఎకరాల భూములకు సాగునీరు చేరుతుందో నోటి మాటతో లెక్కకట్టి చెప్పడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడంతో పాటు ’మేఘా ఇంజనీరింగ్’ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా పంపింగ్ చేస్తుండటంతో విశ్వంలోనే ’మేఘా’ ప్రత్యేకతను చాటుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఫలాలు అందించేందుకు ఆరంభంలోనే ఈ పరిమాణంలో నీరు అందిస్తే భవిష్యత్తులో హంద్రీనీవా, పట్టిసీమ పథకాల్లాగే ఏళ్లపాటు వేల గంటలు పంపింగ్ జరిగితే ప్రపంచంలో నీటి కోసం యుద్ధాలు ఎక్కడైనా జరగొచ్చు కానీ తెలంగాణలో మాత్రం సాగు, తాగు నీరుకు చిరకాలం కరువే అనే మాట కనుచూపు మేరల్లో ఉండదు. తెలంగాణ మాగాణులు పచ్చదనంతో పరిడవిళ్లుతాయి. ఈ ఘన చరిత్రలో, తెలంగాణ భవిష్యత్తులో ’మేఘా ఇంజనీరింగ్’ నిర్మాణ భాగస్వామవడం ఓ మైలురాయి. -
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ఘట్టం
ఇంజనీరింగ్ చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా, ఇంజనీరింగ్ నిపుణులు సైతం నివ్వెరపోయేలా భూగర్భంలో ‘మేఘా’నీటి పంపింగ్ కేంద్రం నీటిని పంప్ చేయడం ప్రారంభించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో ఆవిష్కరణలు, పరిశోధనలు, నిర్మాణాలు ప్రపంచ గమనాన్ని వేగిరం చేయగా తెలంగాణాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ కేంద్రం వాటి సరసన చేరి పంపింగ్ కేంద్రాల నిర్మాణంలో అగ్రభాగాన నిలబడింది. ఈ పంపింగ్ కేంద్రం వ్యవసాయ ఇంజనీరింగ్ (ఎలక్ట్రోమెకానికల్) చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించి భవిష్యత్లో అన్నదాత నీటిసమస్యలు తీర్చే కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది. ‘తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం మేఘా ఇంజినీరింగ్కు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రజల నీటి కలను తీర్చేందుకు ప్రపంచంలో అత్యుత్తమ ఇంజినీరంగ్ సంస్థలతో కలిసి పనిచేయడం, అత్యాధునిక టెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం మాకు లభించిన జీవిత కాలపు అవకాశంగానూ, గౌరవంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతీ అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లనే తక్కువ కాలంలో పూర్తి చేయడం సాధ్యమైంది. ‘ అని మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘మేఘా’మహాద్భుత సృష్టి ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇంతకుముందు ఎక్కడా లేనిది. అందులోనూ భూగర్భంలోనిది. శక్తిరీత్యా, సామర్ధ్యాల ప్రకారం, నీటి పంపింగ్ లక్ష్యం, పరిమాణం... ఇలా ఏ ప్రకారం చూసుకున్నా అదొక ఇంజనీరింగ్ కళాఖండం. మేఘా ఇంజనీరింగ్ తన సాంకేతిక శక్తి సామర్ధ్యాలతో నిర్మించిన మహాద్భుత సృష్టి. మానవనిర్మిత ప్రపంచ అద్భుతాల్లో ఇది ముందువరసలోకి చేరుతుంది. అదే కాళేశ్వరం పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్ (గాయత్రి) భూ గర్భ పంపింగ్ కేంద్రం. ప్రపంచంలో ఇంత పెద్ద నీటి పంపింగ్ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు. ఒక్కో మిషన్వారీగా చూస్తే సామర్ద్యం 139 మెగావాట్లు కావడంతో ప్రపంచంలో ఇదే పెద్దది. ఇక మొత్తం పంపింగ్ కేంద్రం ప్రకారం చూసినా 973 మెగావాట్లు కూడా అతిపెద్దది. ఇందులో వినియోగించిన ఎలక్ట్రికల్ మోటార్ పంప్హౌస్ల్లోనే కాకుండా మొత్తంగా ప్రపంచంలో ఏ రంగంలోనూ అంటే పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, మరే ఇతర రంగాల్లోనూ ఇంత పెద్దది లేదు. దీన్ని బట్టి ఈ పంపింగ్ కేంద్రం మేఘా స్థాయి ఎంత గొప్పదో ఊహించుకుంటేనే విస్తుపోక తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో 2 టీఎంసీల పంపింగ్ కు గాను మొత్తం 4627 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం అవసరం కాగా ఎంఐఈఎల్మాత్రమే 3057 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం కలిగిన పంపులను ఏర్పాటు చేస్తూ తన శక్తి సామర్థ్యాలు చాటుకుంది. సాగునీటి రంగంలో ఎత్తిపోతల పథకంలోని పంపులకు ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్సామర్థ్యం వ్యవస్థను ఏర్పాటు చేయడం ఓ రికార్డ్. ప్రపంచంలో ఇంతకు ముందెన్నడు భారీ స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఈఫిల్ టవర్ కన్నా పెద్దది.. లక్ష్మీపూర్ (గాయత్రి) భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం పొడవు ఈఫిల్ టవర్ పొడవు కన్నా ఎక్కువ. ఈఫిల్ టవర్ ఎత్తు 324 మీటర్లు కాగా, ఈ పంప్హౌస్ పొడవు 327 మీటర్లు. కలకత్తాలోని దేశంలోనే అతిపొడవైన భవంతి ‘ది 42’ కంటే ఈ పంప్హౌస్ లోతు ఎక్కువ. ‘ది 42’ పొడవు 260 మీటర్లు. దానితో పోల్చితే ఈ పంప్హౌస్ ఎంత లోతైనదో (కింద నుంచి చూస్తే ఎత్తు) తెలిస్తే విస్తుపోక తప్పదు. ఈ పంప్హౌస్ నిర్మాణం కోసం భూగర్భాన్ని తొలిచి 2.3 కోట్ల ఘనపు మీటర్ల మట్టిని మేఘా ఇంజనీరింగ్ బయటకు తీసింది. మొత్తంగా లక్ష్మీపూర్ (గాయత్రి) భూగర్భ నీటి పంపింగ్ కేంద్రం వైశాల్యం 84,753.2 చదరపు అడుగులు. ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యంతో 5 మిషన్లను పంపింగ్కు సిద్ధం చేయగా ఇవి ఎంత పెద్దవంటే అనుబంధ పరికరాల తో కలిపి ఒక్కో మిషన్ బరువు 2376 మెట్రిక్ టన్నులు. ఒక్కో లారీలోను 20 టన్నుల సరుకు రవాణా చేస్తుంటారు. మిషన్లో ప్రధానమైనవి స్టార్టర్, రోటర్లు. స్టార్టర్ బరువు 216 టన్నులు కాగా రోటర్ బరువు 196 టన్నులు. సాధారణంగా 200 టన్నుల బరువు మోసే క్రేన్లు ఉండవు. ఇక్కడ వీటిని కదిలించడానికి రెండేసి క్రేన్లను వినియోగిస్తున్నారు. తద్వారా 300 టన్నులు బరువు మోయగలిగిన ఇఒటి క్రేన్ సముదాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ పంప్హౌస్ నిర్మాణం కోసం 6 వేల టన్నుల స్టీల్తో పాటు 50 వేల టన్నుల సిమెంట్ కాంక్రీట్ వినియోగించారు. ఇక్కడి నుంచి కనీసం రోజుకు 2 టిఎంసీల నీటిని పంప్ చేసే విధంగా నిర్మాణ పని పూర్తయింది. ఈ మిషన్లు పని చేయడం ప్రారంభం కాగానే నాగార్జున సాగర్ కుడికాలువ ప్రవాహం ఎంత పెద్దదో అంతకన్నా రెండింతలు పెద్దగా నీరు ప్రవహిస్తుంది. అక్కడ సామర్ధ్యం 11,000 క్యూసెక్కులు అయితే ఇక్కడ 22,000 క్యూసెక్కుల నీరు పంపింగ్ ద్వారా వస్తుంది. భూగర్భం నుంచి 111.4 మీటర్ల ఎత్తుకు నీటిని పంపింగ్ చేసే విధంగా మిషన్లను ఏర్పాటు చేశారు. సాధారణంగా 30 లేదా 40 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేయడమే అరుదు. అటువంటిది ఈ పథకంలో అంత ఎత్తుకు రోజుకు కనీసం 2 టిఎంసీల నుంచి గరిష్టంగా 4.5 టిఎంసీల వరకు పంప్చేసే సామర్ద్యం వుందీ అంటే ఈ మేఘా పంపింగ్ కేంద్రం ఎంత ఘనమైనదో ఊహించుకోవచ్చు. ప్రపంచంలో అతి పెద్ద పంప్హౌస్ను అతిస్వల్పకాలంలో పూర్తి చేసిన సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘ఇదొక అత్యద్బుతమైన అండర్గ్రౌండ్ పంప్హౌస్. భూమికి 470 అడుగుల దిగువన, జంట టన్నెల్స్తో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద సర్జ్పూల్స్ నిర్మించాం. ఈ అల్డ్రా మెగా ప్రాజెక్టులో 139 మెగావాట్ల సామర్థ్యం గల 5 మెషీన్లతో రోజుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేయగల సామర్థ్యంతో నెలకొల్పాం. ఏ రకంగా చూసినా ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే వినూత్నమైన మెగా ప్రాజెక్టు. ఈ మహా అద్భుతమైన ప్రాజెక్టును అనతి కాలంలోనే పూర్తి చేసిన ఘనత మేఘా ఇంజినీరింగ్కే దక్కుతుంది‘ అని అన్నారు. శ్రీశైలం, సాగర్ జల విద్యుత్తో సమానం.. సాధారణంగా నీటి పంపింగ్ కేంద్రాలు భూ ఉపరితలం మీదే వుంటాయి. మొట్టమొదటిసారిగా అతిపెద్ద పంపింగ్ కేంద్రాన్ని భూగర్భంలో మేఘా ఇంజనీరింగ్ నిర్మించింది. దీని విద్యుత్ వినియోగ, పంపింగ్ సామర్ధ్యం 973 మెగావాట్లు అంటే నమ్మగలరా? విడివిడిగా చూస్తే శ్రీశైలంలోని రెండు జలవిద్యుత్ కేంద్రాల కన్నా, నాగార్జునసాగర్లో ఒక జలవిద్యుత్ కేంద్రం ఉత్పత్తి స్థాయి కన్నా దీని వినియోగం ఎక్కువ. వాస్తవానికి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, పంప్హౌస్ వేర్వేరు రకాలు. కాని విద్యుత్ పరిమాణాన్ని ఉదహరించడానికి అలా చెప్పాల్సి వచ్చింది. ఉపరితలంలో నిర్మించే పంప్హౌస్కు పునాదులతోపాటు నిర్మాణ సమయంలోనూ మార్పులు చేర్పులు సులభమవుతాయి. కానీ భూగర్భ పంపింగ్ కేంద్రాన్ని నీటి లభ్యత, నీటిమట్టం ఆధారంగానే అవసరమైన లోతులో నిర్మించాలి. ఇష్టం వచ్చిన తరహాలో భూగర్భంలో మార్పులు చేర్పులు చేయడానికి వీలు పడదు. అంటే నిర్మాణ పరంగా ఎంత క్లిష్టమైన పనిని మేఘా ఇంజనీరింగ్ తన సాంకేతిక శక్తి సామర్ధ్యాలతో మూడున్నరేళ్లలో పూర్తి చేసిందో ఊహించుకుంటేనే విస్తుపోక తప్పదు. పంప్హౌస్ ఆకృతి నిర్మాణంలో కీలకమైన ప్రదేశాలు.. సర్వీస్బే: భూమి ఉపరితలం నుంచి 210 మీటర్లు లోతున వుండగా, పంప్బే: 190.5 మీటర్లు, యాన్సిరీ బే: 195.5 మీటర్లు, ట్రాన్స్ఫార్మర్బే: 215 మీటర్లు, కంట్రోల్ రూం: 209 మీటర్లు లోతున వున్నాయి. కాళేశ్వరం పథకంలో మొత్తం 22 పంపింగ్ కేంద్రాలను (ఈ పథకం బహుళదశ ప్రపంచంలో పెద్దది) నిర్మిస్తుండగా అందులో 17 కేంద్రాలను ఎంఇఐఎల్ నిర్మిస్తోంది. -
థర్మల్ విద్యుత్లో ‘మేఘా’ ప్రస్థానం
విద్యుత్ సరఫరా రంగంలో జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసుకున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) తాజాగా థర్మల్ విద్యుత్ రంగంలోనూ విజయవంతంగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇప్పటికే జాతీయ స్థాయిలో అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థ డబ్ల్యూపీపీటీసీఎల్ను రికార్డు సమయంలో నిర్మించడమే కాకుండా జల, సౌర విద్యుత్ రంగంలోనూ అగ్రగామిగా ఉన్న ఎంఇఐఎల్ ఇప్పుడు మొదటి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. తమిళనాడులోని నాగపట్టినమ్ వద్ద 150 మెగావాట్ల నాగాయ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతానికి 60 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసేలా గ్రిడ్కు అనుసంధానం చేశారు. మొత్తం ప్రాజెక్ట్ను ఈ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఎంఇఐఎల్’ థర్మల్ విద్యుత్ కేంద్రాలు తమిళనాడులో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఎంఇఐఎల్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో 525 మెగావాట్ల ట్యుటీకోరిన్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎస్ఇపీసీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కోసం ఇపీసీ పద్ధతిలో ఎంఇఐఎల్ చేపట్టింది. నాగపట్టినమ్ వద్ద ఏర్పాటు చేస్తున్న 150 మెగావాట్ల నాగయ్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కేవీకే ఎనర్జీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఎంఇఐఎల్ ఏర్పాటు చేస్తున్నది. నాగయ్ థర్మల్ పవర్ ప్లాంట్ నాగపట్టణంకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లాంటు ఉంటుంది. ప్లాంట్ ఏర్పాటుకు 230 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 530 టిపిహెచ్ సామర్థ్యం కలిగిన బాయిలర్, 150 మెగావాట్ల టర్బైన్ జనరేటర్, ఏయిర్ కూల్డ్ కండెన్సర్, 125 మీటర్ల ఎత్తైన చిమ్నీని ఎంఇఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ థర్మల్ విద్యుత్ కేంద్రానికి కావాల్సిన 70 శాతం బొగ్గును దేశీయంగానూ, మిగతా 30 శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ప్లాంట్కు కావలసిన 3700 టన్నుల స్టీల్ను ఎంఇఐఎల్ సొంతంగా సరఫరా చేసింది. ఈ ప్లాంటులో ఉత్పత్తి అయిన విద్యుత్ ను తరలించేందుకు 24.6 కిలో మీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్లను ప్లాంటు నుంచి 230 కెవి తిరువూరు సబ్ స్టేషన్ వరకు ఏర్పాటు చేశారు. ఏడు రోజులకు సరిపడా బొగ్గును నిల్వ చేయడానికి 114 టిపిహెచ్ నిల్వ ఏర్పాట్లు చేశారు. సుమారు 130 మెగావాట్లకు ప్రైవేట్ ఏజెన్సీలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం పూర్తయింది. జులై 10, 2019 నాడు గ్రిడ్ కు అనుసంధాన ప్రక్రియను ప్రారంభించారు. ట్యుటీకోరిన్ థర్మల్ ప్లాంట్ 525 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఎంఇఐఎల్ తమిళనాడు రాష్ట్రంలోని ట్యుటికోరిన్ జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తమిళనాడు జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ట్రాన్జెడ్కో) తో ఎస్ఇపిసి సంస్థ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పీపీఏ) కుదుర్చుకున్నది. ఈ కేంద్రానికి కావలిసిన స్థలాన్ని వి.ఓ.చిదంబరం పోర్టు నుంచి లీజుకు తీసుకుంది. వడక్కు కరసేరి గ్రామంలో యాష్ పాండ్ ను ఏర్పాటు చేయడానికి 100 హెక్టార్ల స్థలాన్ని సేకరించారు. ఈ స్థలం ఎస్ఇపిసి కి చెందినది. ఈ ప్రాజెక్టులో భాగంగా టాన్జెడ్కో ఎంఇఐఎల్ కు 48 కిమీల 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్ల ను ఏర్పాటు చేసే పనులను అప్పగించింది. ప్లాంటు నుంచి ఒట్టపీడరమ్ సబ్ స్టేషన్ వరకు లైన్ ఏర్పాటు చేశారు. ఎస్ఇపిసి టిఎన్ఈబీ తో విద్యుత్ అమ్మకాలకు సంబంధించి 30 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అదే విధంగా ఈ ప్లాంటుకు అవసరమైన బొగ్గును సరఫరా చేసేందుకు గాను దేశీయ, విదేశీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ థర్మల్ విద్యుత్ కేంద్రంలో 1700 టిపిహెచ్ సామర్థ్యం కాలిగిన బాయలర్, 555 మెగావాట్ల సామర్థ్యం కలిగిన టర్భైన్ జనరేటర్, 500 టిపిహెచ్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, గంటకు 6700 క్యూమెక్స్ సముద్ర జలాలను తీసుకొనే ఇంటెక్, గంటకు 66000 క్యూమెక్స్ సామర్థ్యం కలిగిన కూలింగ్ వాటర్ సిస్టమ్ ని ఎంఇఐఎల్ ఏర్పాటు చేస్తోంది. అదేవిధంగా 275 మీటర్ల ఎత్తయిన చిమ్నీని ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ కు కావలసిన 15000 టన్నలు స్టీల్ ను ఎంఇఐఎల్ సొంతంగా సరఫరా చేసింది. 2018 డిసెంబర్ 28న బాయిలర్ హైడ్రో టెస్ట్ విజయవంతం అయ్యింది. ఇప్పటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎలక్ట్రో మెకానికల్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలో ఈ విద్యుత్ కేంద్రాన్ని ఎంఇఐఎల్ అందుబాటులోకి తేనుంది. సాంప్రదాయేతర విద్యుదుత్పత్తి రంగంలో ఎంఇఐఎల్ ఇప్పటికే 112 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నది. మహారాష్ట్రలో ధూలే జిల్లా సాక్రి వద్ద 50 మెగావాట్లు, చంద్రాపూర్ వద్ద రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాలను మహాజెన్ కో కోసం ఏర్పాటు చేసింది. దేశంలోనే తొలిసారిగా గుజరాత్ లో సాగునీటి కాల్వలపై 10 మెగావాట్ల కెనాల్ టాప్ సోలార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది వంద సృజనాత్మక ఇన్ఫ్రాస్ట్రక్టర్ ఆవిష్కరణల్లో ఒకటిగా అంతర్జాతీయ కన్సల్టెన్సీ కంపెనీ కేపీఎంజీ తన ఎకానమీ పవర్ ప్రాజెక్టుల నివేదికలో గుర్తించింది. భారత్ నుంచి ఎంపికైన ఆరింటిలో ఇది ఒకటి కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో 50 మెగావాట్ల సోలార్ థర్మల్ కేంద్రాన్ని ఎంఇఐఎల్ విజయవంతంగా పూర్తి చేసి, విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది. ఇక జల విద్యుత్ రంగంలో హిమాచల్ ప్రదేశ్ లో 25 మెగావాట్ల లాంబడ్గ్ హైడల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఉండగా, గుజరాత్ లో సౌరాష్ట్ర భ్రాంచ్ కెనాల్ పై ఏర్పాటు చేసిన 45 మెగావాట్ల మూడు జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటికే రెండు విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, మూడోది అన్ని పనులు పూర్తి చేసుకొని, ప్రారంభానికి సిద్ధంగా ఉంది. -
‘మేఘా’ పై జీఎస్టీ దాడులు అవాస్తవం
సాక్షి, హైదరాబాద్ : మేఘా ఇంజినీరింగ్ సంస్థపై జీఎస్టీ దాడులు అవాస్తమని ఆ సంస్థ సీఈవో స్పష్టం చేశారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)పై దాడులు జరిపినట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు. బిల్లులు, ఇతర వ్యవహారాల్లోనూ నియమ నిబంధనలకు లోబడే సంస్థ పని చేస్తోందని సీఈవో పేర్కొన్నారు. గత రెండేళ్లుగా పన్ను చెల్లింపుదారుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా జీఎస్టీని చెల్లించి సంస్థ మేఘానే అన్నారు. జీఎస్టీ అమలులోకి వచ్చాక తమ కంపెనీ మూడువేల కోట్లు చెల్లింపులు చేసిందన్నారు. దేశంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న ఇన్ ఫ్రా సంస్థల్లో మేఘా ఒకటిగా నిలుస్తుందని, పన్ను చట్టాలను ఎప్పుడూ తమ సంస్థ గౌరవిస్తుందన్నారు. ఆ వార్తల్లో కనీస సమాచారం లేకుండా పూర్తిగా అవాస్తవాలు, ఊహాజనిత విషయాలు ప్రచురించారని, దాడులు వార్తకు సంబంధించి సంస్థ నుంచి నిజనిర్థారణ చేసుకోకుండానే వార్తలను ప్రచురించడం కొన్ని అదృశ్య శక్తుల దురద్దేశాలను బట్టబయలు చేస్తున్నాయన్నారు. కొందరు ఉద్ధేశ్యపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో మేఘా ఇంజినీరింగ్ సంస్థపై ఐటీ, ఈడీ, జీఎస్టీ సంస్థలు దాడులు జరిపాయని, జరగబోతున్నాయని కక్షపూరితంగా వ్యాప్తి చేస్తున్నారన్నారు. మేఘాపై తప్పుడు కథనాలతో అనుచితమైన, అనవసర ప్రచారానికి పాల్పడిన ఆంగ్ల దిన పత్రిక తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ఎంఈఐఎల్ చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతోందని, మరోసారి ఇలాంటి ఊహాజనిత వార్తలు రాయకుండా ఉండేందుకేనని తెలిపారు. -
అన్నీతానైన ‘మేఘా’ కృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కన్నెపల్లిలోని మేడిగడ్డ ఎత్తిపోతల కేంద్రంలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి, డెరైక్టర్ బి.శ్రీనివాసరెడ్డి అన్నీ తామై వ్యవహరించారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్లకు కన్నెపల్లి పంప్హౌస్ ఫోర్ బే, నీటి నిల్వ, నీటిని పంప్ చేసే విధానం, దాని నిర్మాణం తదితర విశిష్టతల గురించి వివరించారు. మోటార్ల పనితీరుపై వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం పంప్ హౌస్లో మోటార్స్ ఏర్పాటు చేసిన దిగువ ప్రాంతానికి గవర్నర్, ఇద్దరు సీఎంలను తీసుకెళ్లి మోటార్ల పనితీరు, వాటి సామర్థ్యం తదితర అంశాలను వివరించారు. ఆపై పంప్హౌస్ ఎగువ భాగానికి వచ్చి.. మోటర్లను కంప్యూటర్ ద్వారా సీఎం ఆన్ చేశారు. అక్కడి నుంచి డిశ్చార్జ్ పాయింట్ వద్దకు వెళ్లి నీరు ఉబికివస్తున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పంప్హౌస్ను వేగంగా నిర్మించడంపై మేఘా ఇంజనీర్లను సీఎం అభినందించారు. -
భూగర్భ ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం
ప్రపంచంలోనే అత్యంత భారీ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అనతి కాలంలో పూర్తి చేయడంలో మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిర్ణీత గడువుకు ముందే పంప్హౌజ్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేసి ఈ నెల 21న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రారంభోత్సవంలో గోదావరి నీటి ఎత్తిపోతలకు మార్గం సుగుమం చేసింది. ముఖ్యంగా లింక్-1 లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎత్తిపోతల కేంద్రాలను, లింక్- 2లోని ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ కేంద్రం ప్యాకేజీ-8లను రెండేళ్లలోనే సిద్ధం చేసి మేడిగడ్డ నుంచి మిడ్మానేరు నీటి తరలింపు ప్రక్రియకు రాచమార్గం పరిచింది. ప్రపంచంలోనే తొలిసారి.. కాళేశ్వరం ద్వారా రోజూ గరిష్టంగా 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మిస్తున్న ఈ భారీ పథకంలో 22 ఎత్తిపోతల కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా, అందులో 17 కేంద్రాల నిర్మాణాలను మేఘా చేపట్టింది. ఇందులో మొత్తం 120 మెషీన్లను (ప్రతి మెషీన్లోను ఒక పంపు, ఒక మోటారు ఉంటాయి) ఏర్పాటు చేస్తుండగా, అందులో 105 మెషీన్లను మేఘానే ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌజ్లను, ప్యాకేజీ-8 పనులను పూర్తి చేసి పాక్షికంగా నీటిని పంపింగ్ చేసేలా పనులు పూర్తి చేసింది. మొదటిదశలో 63 మెషీన్ల ఏర్పాటు లక్ష్యంగా ఎంఈఐఎల్ పనులు ప్రారంభించగా రెండేళ్ల కాలంలో 33 మెషీన్లను పంపింగ్కు సిద్ధం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ-8, ప్యాకేజీ-14లోని పంపుహౌజ్లు నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకాలుగా అమెరికాలోని కొలరాడో, ఈజిప్ట్లోని గ్రేట్ మేన్మేడ్ రివర్కు పేరు పొందగా, వీటి పంపు సామర్థ్యం హార్స్పవర్లోనే ఉంది. వీటి నిర్మాణానికి మూడు దశాబ్దాల సమయం పట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో హంద్రీనీవా, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, పట్టిసీమ, పురుషోత్తపట్నం వంటి ఎత్తిపోతల పథకాలు చేపట్టినా, 40 మెగావాట్ల సామర్థ్యం గల భారీ మెషీన్లను కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోనే ఉపయోగించారు. కానీ కాళేశ్వరంలో 139 మెగావాట్ల సామర్థ్యం గల పంపులను వినియోగిస్తున్నారు. తొలిదశలో 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు 4,992 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా, ఇందులో 3,057 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థ, అందులో సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు నిర్మాణ పనులను ఎంఈఐఎల్ సిద్ధం చేసింది. ప్యాకేజీ-8లో ఆవిష్కృతం.. అద్భుతమైన పంపింగ్ స్టేషన్ను భూ ఉపరితలానికి 330 మీటర్ల లోతున మేఘా నిర్మించింది. 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 మోటార్ పంపుల యూనిట్లను ఇక్కడ సిద్ధం చేసింది. ప్రతి పంపు మోటారు బరువు 2,376 మెట్రిక్ టన్నులు ఉందంటే ప్రతి యూనిట్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ పంప్ హౌజ్లో ప్రతి అంతస్తులోనూ 87,995 చదరపు అడుగుల కాంక్రీటు నిర్మాణం చేసింది. ట్రాన్స్ఫార్మర్ బేలు, కంట్రోల్ రూంలు రెండు చొప్పున, బ్యాటరీ రూం, మోటార్ రూమ్ ఒక్కొక్కటి చొప్పున నిర్మించగా, ఎల్టీ ప్యానెల్స్, పంప్ ఫ్లోర్, కంప్రెషర్లు కలిపి మొత్తం 4 అంతస్తుల్లో నిర్మించారు. ఈ పంపుమోటార్లను భూ అంతర్భాగంలో ఏర్పాటు చేసినందున భవిష్యత్తులో ఎలాంటి సాంకేతిక సమస్యలూ ఎదురుకాకుండా అత్యంత శ్రద్ధతో వీటి నిర్మాణాలు చేశారు. మొత్తం పనిలో 40 శాతం వాటా కింద బీహెచ్ఈఎల్, మోటార్లు, పంపులు, యంత్ర పరికరాలు, విడిభాగాలు రూపంలో సరఫరా చేయగా, వాటిని వివిధ ప్రాంతాల నుంచి సేకరించి ప్యాకేజీ-8 వద్దకు తీసుకొచ్చాక వాటిని బిగించే 60 శాతం పనిని ఎంఈఐఎల్ తన ఇంజనీరింగ్ సాంకేతిక నైపుణ్యంతో పూర్తి చేసింది. ఇది మా అదృష్టం: బి.శ్రీనివాస్రెడ్డి, ఎంఈఐఎల్ డైరెక్టర్ ‘ఈ ఎత్తిపోతల పథకంలో భాగస్వాములం కావడం మా అదృష్టం. ఈ ఇంజనీరింగ్ అద్భుతంలో పాలు పంచుకుని పర్యవేక్షించే భాగ్యం కలిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద అండర్గ్రౌండ్ పంప్హౌజ్ను, మేడిగడ్డ పంప్హౌజ్లో 6 మెషీన్లను 10 నెలల సమయంలో పూర్తిచేయడం ప్రపంచ రికార్డు. బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా ఇది చరిత్రలో నిలుస్తుంది’ -
లిమ్కా బుక్స్లో మేఘా ఇంజనీరింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరో ఘనతను సాధించింది. లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్తోపాటు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. విద్యుత్ సబ్ స్టేషన్ను రికార్డు సమయంలో ఏడు నెలల్లోపే నిర్మించడంతో సంస్థకు ఈ గౌరవం దక్కింది. మేఘా పనితీరును మెచ్చి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ‘బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డు’తో సత్కరించింది. ‘అనంతపురం జిల్లా నంబూలపూలకుంట వద్ద 400/220 కేవీ సబ్స్టేషన్ నిర్మాణం 2015 సెప్టెంబరు 25న ప్రారంభించి, 2016 ఏప్రిల్ 25న ప్రారంభానికి సిద్ధం చేశాం. ఇటువంటి ప్రాజెక్టుల నిర్మాణానికి సాధారణంగా 15–18 నెలలు పడుతుంది. 18–20 నెలల్లో పూర్తి చేయాలని పవర్ గ్రిడ్ కోరింది. 3 షిఫ్టుల్లో సిబ్బందిని మోహరించి గడువు కంటే ముందే నిర్మించాం’ అని మేఘా డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అడ్డంకులను అధిగమించి.. నిర్మాణ ప్రాంతం ఎక్కువగా రాళ్లతో కూడి ఉందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ శరధ్ దీక్షిత్ వివరించారు. ఆధునిక బ్లాస్టింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించి రాళ్లను తొలగించామన్నారు. ‘సబ్ స్టేషన్ నుంచి సాంకేతిక సమస్యలు లేకుండా మూడేళ్లుగా నిరంతరం విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ ప్రాజెక్టును ఉద్ధేశించి పవర్ గ్రిడ్ తన వెబ్సైట్లో మరో ముందడుగుగా అభివర్ణించింది’ అని తెలిపారు. కాగా, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ రికార్డు సమయంలో పూర్తి చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇప్పటికే స్థానం దక్కించుకుంది. -
ప్యాకేజీ–8.. సవాళ్లూ ‘భారీ’వే!
భూమికి 333 మీటర్ల లోతున ఓ పెద్ద షాపింగ్ మాల్ ఉంటే..! ఇది అంతకంటే భారీ నిర్మాణమే. 65 మీటర్ల ఎత్తయిన రాతి ట్యాంక్. సొరంగం ద్వారా నీరు ఆ ట్యాంక్లోకి చేరుతుంది. అక్కడి నుంచి అత్యంత భారీ పంపులు, మోటార్ల సాయంతో దాదాపు 117 మీటర్ల పైకి వస్తాయి. వీటిని ఆపరేట్ చేయటానికి ఆ భూగర్భంలోనే భారీ నాలుగంతస్తుల సముదాయమూ ఉంది. క్లుప్తంగా... కాళేశ్వరం ప్యాకేజీ–8 ఇదే. ‘సర్జ్ పూల్’గా పిలుస్తున్న ఆ ట్యాంక్లు మూడున్నాయి. వీటిలో 2 కోట్ల లీటర్ల నీళ్లు నిల్వ ఉంటాయి. పలు ఇంజనీరింగ్ విశిష్టతలతో రాష్ట్రానికి చెందిన మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) చేపడుతున్న ఈ ప్రాజెక్టును సోమవారం రాష్ట్ర, జాతీయ మీడియా ప్రతినిధులు సందర్శించారు. మోటార్లు, పంప్లు, ఇతర పరికరాలు సరఫరా చేసిన భెల్, నిర్మాణం చేపట్టిన ‘మేఘ’ సంస్థలు ప్రాజెక్టు విశేషాల్ని ఈ సందర్భంగా వివరించాయి. కాళేశ్వరం ప్యాకేజీ–8లో భాగంగా రామడుగు వద్ద నిర్మిస్తున్న భారీ భూగర్భ టన్నెల్, అక్కడే నిర్మించిన సర్జ్పూల్లు... వీటిలోని నీటిని పంప్ చేసేందుకు 139 మెగావాట్ల చొప్పున ఏర్పాటవుతున్న 7 పంప్లు... 600 టన్నుల బరువుండే మోటార్లు... ఇవన్నీ ఇతర ఏ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోనూ కనిపించకపోవచ్చు. ఈ ఏడు పంపుల ద్వారా ఏక కాలంలో 21 వేల క్యూసెక్కుల నీటిని పంప్ చేయొచ్చు కూడా. 24 గంటలూ పనులు జరుగుతున్నాయని, జాప్యం నివారించడానికి... కీలక ఎలక్ట్రో–మెకానికల్ పరికరాల్ని ఖర్చుకు వెనకాడకుండా విమానాల్లో తెప్పిస్తున్నామని ఎంఈఐఎల్ డైరెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి చెప్పారు. మోటార్లను భోపాల్లో తయారు చేశామని, షాఫ్ట్లు, పంప్లు కూడా ఆలస్యం లేకుండా అందిస్తున్నామని ‘భెల్’ సాంకేతిక సలహాదారు నరేంద్ర కుమార్ తెలియజేశారు. ‘‘భెల్ సరఫరాల్ని జాప్యం లేకుండా తెచ్చి కమిషన్ చేయటానికి మా పాతికేళ్ల ఇంజనీరింగ్ అనుభవం పనికొస్తోంది. ఈ ప్యాకేజీ ఎన్నో సవాళ్లు విసిరింది. వాటిని ఛేదించుకుంటూ వచ్చాం. సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా 600 టన్నుల బరువుండే మోటార్లను భూగర్భంలోనే ఏర్పాటు చేయాల్సి వచ్చినా వెనకాడలేదు. 85 శాతం పని పూర్తయింది. మిగిలింది 4 నెలల్లో చేస్తాం’’ అని శ్రీనివాసరెడ్డి వివరించారు. ఈ ఒక్క ప్యాకేజీ–8 విలువే దాదాపు రూ.4,700 కోట్లు!!. లింక్–2 ఈపీసీ... లింక్–1 బీఓక్యూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం 80 వేల కోట్లు. వీటిలో దాదాపు 50 శాతం పనుల్ని మేఘ దక్కించుకుంది. ఏడు లింకులుగా విభజించిన ఈ పనుల్లో... లింక్–2 పనుల్ని ఈపీసీ పద్ధతిలో, లింక్–1 బీఓక్యూ పద్ధతిలో చేస్తున్నామని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈపీసీ పద్ధతిలో కాంట్రాక్టు రేటు ముందే నిర్ణయమవుతుంది. బీఓక్యూలో చేస్తున్న పనులకు తగ్గ బిల్లుల్ని ప్రభుత్వం చెల్లిస్తుంటుంది. ‘‘లింక్–1లో మేం 3 లిఫ్ట్లు చేపట్టాం. ఇందులో ప్యాకేజీ–8లోని భూగర్భ పంప్హౌస్తో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద మూడు ఓపెన్ పంప్హౌస్ల నిర్మాణం కూడా ఉంది. అన్నీ 80–85 శాతం వరకూ పూర్తయ్యాయి. లింక్–2లో ప్యాకేజీ–6 పనులే చేపట్టాం. ఇక్కడ మరో నాలుగు నెలల్లో 7 పంపుల ఏర్పాటూ పూర్తవుతుంది’’ అని చెప్పారాయన. కావాల్సిన నిధుల్ని అంతర్గత వనరులు, బ్యాంకు రుణాల ద్వారా సమీకరిస్తున్నామన్నారు. నిధుల కొరత లేదని, ఇప్పటికైతే పబ్లిక్ ఇష్యూకు వెళ్లే ఆలోచన కూడా లేదని చెప్పారాయన. భవిష్యత్తులో ఆ అవకాశాల్ని కొట్టి పారేయలేమన్నారు. తమ సంస్థకు రేటింగ్ ఏజెన్సీ ఫిచ్... ఏప్లస్ క్రెడిట్ రేటింగ్ ఇచ్చిందని గుర్తుచేశారు. ‘‘మా ఆర్డర్బుక్ రూ.60వేల కోట్లుంది. గడిచిన ఆరు నెలల్లోనే రూ.8 వేల కోట్ల ఆర్డర్లు కొత్తగా వచ్చాయి. ఇక 2017–18లో టర్నోవర్ 50% వృద్ధి చెంది 3 బిలియన్ డాలర్లకు చేరింది’’ అన్నారాయన. ఇన్ఫ్రాతో పాటు గ్యాస్ సరఫరా, విద్యుత్, విమానయాన రంగాల్లోనూ తాము కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తు చేశారు. ‘‘దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు జాంబియా, టాంజానియా వంటి ఆఫ్రికా దేశాల్లోనూ పలు ప్రాజెక్టులు చేపట్టాం. 2017–18 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 70 ప్రాజెక్టులు పూర్తి చేశాం’’ అని వివరించారు. ఇవీ... సర్జ్పూల్ విశేషాలు 333 మీటర్ల లోతున భూగర్భంలో 65 మీటర్ల ఎత్తులో భారీ ట్యాంక్లా ఉండే ఈ పూల్ పూర్తిగా ఆటోమేషన్తో పనిచేస్తుంది. సర్జ్పూల్లో చేరిన నీటిని తోడి... పూల్ వెనకాల 90 డిగ్రీల కోణంలో ఏర్పాటు చేసిన 117 మీటర్ల ఎత్తయిన పంప్ల ద్వారా పైనుండే పాండ్లోకి పంప్ చేస్తారు.పంప్ ట్రిప్ అయినపుడు నీరు వెనక్కొచ్చి సర్జ్పూల్లో నీటి స్థాయి పెరిగి, ఆటోమేషన్ విభాగం మునిగిపోయే ప్రమాదముంది. అందుకే... ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తూ 3 పూల్స్ నిర్మించారు. వాటిలోకి నీరు సర్దుకుంటుంది. ప్రాజెక్టును చాన్నాళ్ల క్రితమే చేపట్టినా... ఈ పనులన్నీ మూడున్నరేళ్లలోనే చేసినట్లు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వీటి పనితీరును నీరు లేకుండా ఇప్పటికే పరీక్షించామని, మరో రెండున్నర నెలల్లో నీటితో పరీక్షిస్తామని చెప్పారు. ఈ విద్యుత్ కోసం బయట 400 కేవీ సబ్స్టేషన్ను ఏర్పాటు చేశారు. - (మంథా రమణమూర్తి) -
ఉత్తరప్రదేశ్లో మేఘా భారీ ప్రాజెక్టు పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉత్తర ప్రదేశ్లో ఓ భారీ పవర్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. దేశంలో తొలిసారిగా అత్యాధునిక గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ టెక్నాలజీని దీనికోసం వాడారు. 13,220 మెగా వోల్ట్ ఆంపియర్ విద్యుత్ను సరఫరా చేసే సామర్థ్యం దీని సొంతం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల విద్యుత్ సరఫరా సామర్థ్యానికి ఇది సమానమని కంపెనీ ఈ సందర్భంగా తెలియజేసింది. దేశంలో ప్రైవేటు రంగంలో ఈ స్థాయిలో నిర్మించిన తొలి ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన చేపట్టిన ఈ కాంట్రాక్టు విలువ రూ.4,150 కోట్లు. ఈ ప్రాజెక్టును వెస్టర్న్ ఉత్తర ప్రదేశ్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ (డబ్ల్యూయుపీపీటీసీ) నుంచి మేఘా ఇంజనీరింగ్ దక్కించుకుని 2011లో నిర్మాణాన్ని ప్రారంభించింది. 35 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతను మేఘా చేపడుతుంది. దీనిద్వారా పశ్చిమ ఉత్తర ప్రదేశ్లోని ఏడు జిల్లాలకు విద్యుత్ సరఫరా చేస్తారు. ప్రాజెక్టు నిర్మాణంలో 200 మంది సాంకేతిక నిపుణులు, 2,000లకు పైగా కార్మికులు పాలుపంచుకున్నట్లు కంపెనీ తెలియజేసింది. -
గడువులోగానే 4 ప్రాజెక్టులు పూర్తి: ఎంఈఐఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు రూ. 3,100 కోట్ల విలువ చేసే నాలుగు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను గడువులోగానే పూర్తి చేసినట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) వెల్లడించిం ది. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోనే రికార్డు స్థాయి పనితీరు కనపర్చినట్లు సంస్థ డెరైక్టర్ బి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. పూర్తి చేసిన వాటిల్లో సౌనియోజన, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, గజ్వేల్ వాటర్గ్రిడ్తో పాటు టాంజానియాలో తాగు నీటి పథకం ప్రాజెక్టులు ఉన్నాయని ఆయన వివరించారు. సుమారు రూ. 515 కోట్ల వ్యయంతో గుజరాత్లో తలపెట్టిన సౌని యోజన ప్రాజెక్టు పనులు ఈ ఏడాది ఆగస్టు 27న పూర్తికాగా.. ప్రధాని మోదీ 30న జాతికి అంకితం చేశారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. మిషన్ భగీరథ కింద తెలంగాణలో రూ. 548 కోట్ల వ్యయంతో గజ్వేల్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేశామని, 1,200 కి.మీ. మేర తాగు నీటి పైప్లైన్లు వేశామని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సాంకేతికంగా ఆసియాలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకమైన పట్టి సీమ ప్రాజెక్టును కూడా నిర్దిష్ట గడువు కన్నా ముందుగానే పూర్తి చేశామని వివరించారు.