meghana
-
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన కన్నడ నటి మేఘనా.. సోషల్ మీడీయాలో వైరల్ (ఫోటోలు)
-
ప్రియుడిని పెళ్లాడిన ప్రముఖ బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. 'సీతారామ' సీరియల్ ఫేమ్ మేఘనా శంకరప్ప కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది. తన ప్రియుడు జయంత్తో ఏడడుగులు వేసింది. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నూతన వధూవరులకు అభినందనలు తెలుపుతున్నారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన మేఘనా శంకరప్ప సీతారామ సీరియల్తో గుర్తింపు తెచ్చుకుంది.కాగా.. ఇంజినీరింగ్ పూర్తి చేసిన మేఘనా శంకరప్ప నటనవైపు అడుగులు వేసింది. బెంగళూరుకు చెందిన జయంత్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.ఇక నటన విషయానికొస్తే.. మేఘనా శంకరప్ప ప్రస్తుతం 'సీతారామ' సీరియల్లో నటిస్తోంది. గతంలో ఆమె కన్నడలోనే 'నమ్మనే యువరాణి', 'కిన్నెరి' లాంటి సీరియల్స్లో కనిపించింది. అంతేకాకుండా 'కృష్ణ తులసి', 'రత్నగిరి రహస్య', 'దేవయాని', 'సింధూర' లాంటి సీరియల్స్లో నటించారు. అంతేకాకుండా మేఘన ఓ ప్రైవేట్ ఛానల్ డ్యాన్స్ రియాల్టీ షోలో కంటెస్టెంట్గా పాల్గొన్నారు. ఆమె డ్యాన్స్ను శివరాజ్కుమార్ లాంటి స్టార్ హీరో సైతం మేఘన నృత్యాన్ని మెచ్చుకున్నారు. కన్నడ టీవీ పరిశ్రమలో మేఘన ఇప్పటివరకు నటించిన సీరియల్స్లో పాజిటివ్, నెగటివ్ పాత్రల్లో నటించింది. View this post on Instagram A post shared by Meghana S Shankarappa ✨ (@meghanasshankarappa_) -
ప్రముఖ బుల్లితెర నటి ఇంటి కిచెన్ లో ప్రమాదం
బుల్లితెర జంట ఇంద్రనీల్ (Indraneil)-మేఘన (Meghana)కు పెద్ద ప్రమాదమే తప్పింది. వారి ఇంట్లో గ్యాస్స్టవ్ పేలింది. ఆ ఘటన జరిగిన సమయంలో కిచెన్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ పేలుడు గురించి మేఘన మాట్లాడుతూ.. నేను స్టవ్పై ఒక ఆమ్లెట్ వేసుకుని హాల్లో కూర్చున్నాను. ఇంతలో సడన్గా కరెంట్ రావడంతో టప్మని ఏదో బ్లాస్ట్ అయినట్లు శబ్ధం వచ్చింది. నా కళ్ల ముందే..ఏసీ పేలిందేమోనని అన్ని గదుల్లోకి వెళ్లి చూశా.. ఎక్కడా ఏం కనిపించలేదు. కిచెన్కు వచ్చేసరికి గ్లాస్ స్టవ్ నా కళ్లముందే ఇంకా పగులుతోంది. మూడేళ్లకిందటే ఈ స్టవ్ తీసుకున్నాను. అంతలోనే ఇలా జరిగింది. నా ఒక్కరికే కాదు చాలామందికి ఇలాంటి సమస్య ఎదురైంది. ఒకరింట్లోనైతే వారి తల్లి వంట చేస్తుండగా ఆ స్టవ్ పేలి ఆ గాజుముక్కలు తన ముఖానికి గుచ్చుకున్నాయంట! ఇంద్రనీల్- మేఘన ఇంట్లో పేలిన గ్యాస్స్టవ్ ఫోటోలనా కెరీర్ ఏం కావాలి?నేను ఆర్టిస్ట్ను. స్టవ్ పేలేసమయంలో నేనూ అక్కడే ఉండుంటే ఆ ముక్కలు నా ముఖానికి గుచ్చుకుంటే నా పరిస్థితేంటి? నా కెరీర్ ఏం కావాలి? ఇది చిన్న ప్రమాదం కాదు. దీనిపై కచ్చితంగా కోర్టుకెళ్తాం. గ్లాస్ స్టవ్ వాడాలంటేనే భయంగా ఉంది. అందుకే ఇకపై స్టీల్ స్టవ్ వాడతాను. దయచేసి వంటింట్లో అందరూ జాగ్రత్తగా ఉండండి అని మేఘన సూచించింది. కాగా వీరిద్దరూ చక్రవాకం సీరియల్లో నటించారు.చదవండి: ఆ విషయంలో ప్రభాస్ గ్రేట్.. తనను చూసి నేర్చుకోవాలి: పృథ్వీరాజ్ -
పెళ్లై 20ఏళ్లు.. పిల్లలు ఎందుకు లేరంటే.. (ఫోటోలు)
-
తండ్రి మరణం.. బెంగతో కూతురి విషాదం!
నిజామాబాద్: తండ్రి మరణం, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 15 ఏళ్ల క్రితం కూనమనేని శ్రీనివాస్ కుటుంబం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఎడపల్లిలో స్థిర పడింది. శ్రీనివాస్కు భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండేళ్ల క్రితం కూనమనేని శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుమార్తె మేఘన తండ్రిపై బెంగపెట్టుకొని మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదని తల్లి మాట్లాడుతుండగా విన్న మేఘన మనస్తాపానికి గురై సోమవారం తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ నరేశ్ పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి చదవండి: ప్రేమించి.. సహ జీవనం సాగించి -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
తెలుగమ్మాయిలకు జాక్ పాట్...బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు
-
కర్నూల్ అమ్మాయికి బంపరాఫర్.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్
ముంబై: భారత మహిళల జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్న ఇద్దరు ఆంధ్రప్రదేశ్ క్రికెటర్లు సబ్బినేని మేఘన, అంజలి శర్వాణిలకు తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లభించింది. కొత్తగా ప్రకటించిన జాబితాలో వీరిద్దరికి గ్రేడ్ ‘సి’లో చోటు దక్కింది. బ్యాటర్ మేఘన ఇప్పటి వరకు భారత్ తరఫున 3 వన్డేలు, 17 టి20లు ఆడగా... లెఫ్టార్మ్ పేసర్ అంజలి 6 టి20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన 25 ఏళ్ల అంజలి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్తో అంతర్జాతీయ అరంగేంట్రం చేసింది. ఇక మూడు గ్రేడ్లలో కలిపి మొత్తం 17 మందితో బోర్డు వార్షిక కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. గ్రేడ్ ‘ఎ’లో ఇప్పటి వరకు కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన మాత్రమే ఉండగా కొత్తగా ఆల్రౌండర్ దీప్తి శర్మకు అవకాశం లభించింది. మే 2021 తర్వాత మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్లు ప్రకటించడం ఇదే తొలిసారి. గత జాబితాలో ఉండి ప్రస్తుతం రిటైర్ అయిన మిథాలీ రాజ్, జులన్ గోస్వామిలతో పాటు పూనమ్ యాదవ్ను కూడా తప్పించగా... ‘బి’ గ్రేడ్ జాబితాను 10నుంచి ఐదుకు కుదించారు. ప్రస్తుతం జట్టులో కీలకంగా మారిన రేణుకా ఠాకూర్, రిచా ఘోష్లకు ప్రమోషన్ దక్కగా, పూజ వస్త్రకర్ ‘బి’ నుంచి ‘సి’కి పడిపోయింది. కాంట్రాక్ట్ల జాబితా గ్రేడ్ ‘ఎ’ (రూ. 50 లక్షలు): హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ. గ్రేడ్ ‘బి’ (రూ. 30 లక్షలు): రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, రాజేశ్వరి గైక్వాడ్. గ్రేడ్ ‘సి’ (రూ. 10 లక్షలు): మేఘనా సింగ్, దేవిక వైద్య, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ వస్త్రకర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యస్తిక భాటియా. చదవండి: NZ vs PAK: సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్.. న్యూజిలాండ్పై పాక్ ఘన విజయం -
అమ్మగా ఆలోచించి.. రూ. 50 కోట్లకు పైగా ఆదాయం..
ప్రస్తుతం మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై జనానికి స్పృహ పెరిగింది. పిల్లలు తినే ఆహారం గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. దీనికి పరిష్కారం కోసం ఆలోచించిన ఓ స్విమ్మింగ్ చాంపియన్ ఓ కంపెనీ పెట్టి పిల్లలకు మంచి ఆహారం అందిస్తోంది... మంచి లాభాలూ ఆర్జిస్తోంది. ఇదీ చదవండి: Pepsi New Logo: పెప్సీ కొత్త లోగో అదుర్స్! 15 ఏళ్ల తర్వాత... కూతురు కోసం చేసిన ప్రయత్నం.. పుణెకు చెందిన మేఘనా నారాయణ్కు పిల్లల పోషణ, ఆరోగ్యం పట్ల మక్కువ ఎక్కువ. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడంపైనే ఆమె ఆలోచనలు ఎప్పుడూ ఉండేవి. ఈ నేపథ్యంలో శౌరవి మాలిక్, ఉమంగ్ భట్టాచార్య అనే మరో ఇద్దరితో కలిసి 2015లో పిల్లల కోసం ఆర్గానిక్ ఫుడ్ ఉత్పత్తులను అందించే హోల్సమ్ ఫుడ్స్ (స్లర్ప్ ఫార్మ్ అండ్ మిల్లె) అనే కంపెనీని స్థాపించారు. తన పాపాయికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడానికి ఆమె చేసిన ప్రయత్నాలే ఆమెను ఈ వ్యాపారం ప్రారంభించేలా చేశాయి. స్లర్ప్ ఫామ్ ప్రారంభించే ముందు మేఘనా మెకన్సీ అండ్ కంపెనీలో పబ్లిక్ హెల్త్ ప్రాక్టీస్కు నాయకత్వం వహించారు. స్లర్ప్ ఫార్మ్ సంస్థలో ప్రముఖ బాలివుడ్ నటి అనుష్క శర్మ కూడా పెట్టుబడి పెట్టడం విశేషం. ఈ సంస్థ 2022 ఫిబ్రవరి నాటికి రూ. 57 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. ఇదీ చదవండి: Charges on UPI: యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు.. యూజర్లకు వర్తిస్తాయా? స్విమ్మింగ్లో చాంపియన్ మేఘనా నారాయణ్ అంతర్జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్. ఆమె 400 బంగారు పతకాలను గెలుచుకుంది. మేఘన ఎనిమిదేళ్ల పాటు భారత్కు ప్రాతినిధ్యం వహించారు. ఆసియా క్రీడలు సహా అనేక పోటీల్లో ఆమె పాల్గొని పతకాలు సాధించారు. ఒలింపిక్ క్రీడల్లో దేశానికి బంగారు పతకం సాధించాలనేది ఆమె కల. మేఘన విద్యాభ్యాసం మేఘన బెంగళూరు యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో బీఈ పూర్తి చేశారు. ఆ తర్వాత 2002లో ఆక్స్ఫర్డ్లోని ఓరియల్ కాలేజీకి రోడ్స్ స్కాలర్గా కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చదవడానికి వెళ్లారు. 2007లో ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. ఇదీ చదవండి: పేటీఎం యూజర్లకు గుడ్న్యూస్.. పేటీఎం వ్యాలెట్ నుంచి ఏ మర్చంట్కైనా చెల్లింపులు -
మహిళా కాంగ్రెస్ నేత అరెస్ట్.. కారణం ఇదే..
గాంధీనగర్: గుజరాత్కు చెందిన మహిళా కాంగ్రెస్ నేత మేఘనా పటేల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, విదేశీ మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో దాదాపు రూ. 10లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. విదేశీ మద్యం అక్రమ రవాణా కేసులో మేఘనా పటేల్ను గుజరాత్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే, ఆమె.. తన బొలెరో కారులో విదేశీ మద్యం స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పిప్లాడ్ రోడ్డు ప్రాంతంలో మేఘనా పటేల్ కారును ఆపి చెక్ చేశారు. ఈ సందర్బంగా కారు నడుపుతున్న వ్యక్తిని తనిఖీ చేయగా.. మేఘనా పటేల్ కోసం రూ.7.5 లక్షలకు పైగా విలువైన విదేశీ మద్యం తీసుకొచ్చినట్లు తేలింది.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో, విదేశీ మద్యాన్ని పోలీసులు సీజ్ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, ఈ విదేశీ మద్యం ఎక్కడ నుంచి వచ్చింది.. దీన్ని ఎవరు విక్రయించారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మేఘనా పటేల్, కారు డ్రైవర్ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, మేఘనా పటేల్ మాజీ మహిళా ఉపాధ్యక్షురాలుగా పని చేశారు. -
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ హాస్పిటల్స్ సీయివోగా మేఘన.. ఆమెనే ఎందుకు?
భారతీయ మూలాలు ఉన్న ప్రొఫెసర్ మేఘనా పండిత్ బ్రిటన్లోని ప్రసిద్ధ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ హాస్పిటల్స్ సీయివోగా నియమితురాలై ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకుంది. గత సంవత్సరం జులై నుంచి బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ హాస్పిటల్స్(వోయుహెచ్), నేషనల్ హెల్త్ సర్వీసెస్ ట్రస్ట్(ఎన్హెచ్ఎస్)కు తాత్కాలిక సీయివోగా బాధ్యతలు నిర్వహించిన మేఘన ఇప్పుడు శాశ్వత ప్రాతిపదికన ఆ బాధ్యత లు చేపట్టబోతోంది. ‘సీయివోగా మేఘన నియామకం సంతోషం కలిగిస్తుంది. విషయం మీద ఆసక్తి, అనురక్తి మాత్రమే కాదు అంకితభావం, క్రమశిక్షణ ఉంటే ఉన్నతస్థాయికి ఎదగవచ్చు అని చెప్పడానికి ఆమె ఉదాహరణ. ఉద్యోగులతో కలిసి పనిచేసే తీరు ఆమెలోని నాయకత్వ లక్షణాలకు అద్దం పడుతుంది. ట్రస్ట్కు సంబంధించిన విలువలు కాపాడడంలో, ట్రస్ట్ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆమె నాయకత్వ బలం ఉపయోగపడుతుంది’ అంటున్నారు ట్రస్ట్ చైర్పర్సన్ జోనాథన్. ‘ఎన్హెచ్ఎస్’కు బ్రిటన్లో ఎన్నో టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. యూరప్లో అత్యధిక సంఖ్యలో హాస్పిటల్స్ ఉన్నాయి. ట్రస్ట్ ఆధ్వర్యంలో విలువైన పరిశోధనలు జరుగుతున్నాయి. గతంలో ‘ఎన్హెచ్ఎస్’కు సంబంధించి చీఫ్ మెడికల్ ఆఫీసర్(సిఎంవో)గా విధులు నిర్వహించింది మేఘన. వార్విక్ యూనివర్శిటీ హానరరీ ప్రొఫెసర్గా నియామకం అయింది. ముంబైలో ఎంబీబీఎస్ చేసిన మేఘనా పండిత్ బోధన నుంచి నిర్వహణ వరకు తనదైన ప్రతిభతో ముందుకు దూసుకువెళ్తోంది. చదవండి: మీకంటే తోపు లేడనుకుంటున్నారా? అయితే సమస్యే..! -
ఘనంగా కొణిదెల హీరో పవన్ తేజ్ యాంకర్ మేఘన నిశ్చితార్థం (ఫోటోలు)
-
హీరోయిన్తో కొణిదెల హీరో నిశ్చితార్థం, ఫొటోలు వైరల్
కొణిదెల హీరో పవన్ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి, యాంకర్ మేఘన మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. బుధవారం ఇరుకుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు చిరంజీవి సతీమణి సురేఖ, నటుడు సాయిధరమ్ తేజ్ సహా తదితరులు హాజరయ్యారు. తన ఎంగేజ్మెంట్ ఫొటోను పవన్తేజ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. 'నేను ఆమెను ప్రేమిస్తున్నాను, నాకు ప్రేమ అంటే ఏంటో ఆమె వల్లే తెలిసింది. మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని' రాసుకొచ్చాడు. అటు మేఘన కూడా.. 'నా ప్రేమను కనుగొన్నాను, అతడితో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతోంది, కానీ నా చేతులు బరువెక్కుతున్నాయి. ఇక నా జీవితం అంతా నీకే సొంతం' అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. కాగా పవన్ తేజ్కు.. మెగాస్టార్ చిరంజీవి బాబాయ్ అవుతాడు. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో హీరోగా ఆకట్టుకున్నాడు పవన్. ఇందులో హీరోయిన్గా మేఘన నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ లవ్లో పడ్డట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతో త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. కాగా పవన్ తేజ నటుడిగా రాణించేందుకు ప్రయత్నిస్తుండగా మేఘన బుల్లితెర షో యాంకర్గా అలరిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Megganna (@m_y_megganna) View this post on Instagram A post shared by Pavan Tej Konidela (@pavantej_konidela) View this post on Instagram A post shared by Pavan Tej Konidela (@pavantej_konidela) చదవండి: తాప్సీ మూవీని నిషేధించి, గుణపాఠం చెప్దామంటున్న నెటిజన్లు ఘనంగా ప్రముఖ సీరియల్ నటి సీమంతం, ఫొటోలు వైరల్ -
Womens T20: మహిళల టి20 చాలెంజ్లో చెలరేగిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి!
పుణే: మహిళల టి20 చాలెంజ్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (47 బంతుల్లో 73; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో ట్రయల్బ్లేజర్స్ 16 పరుగుల తేడాతో వెలాసిటీపై గెలిచింది. అయితే రన్రేట్లో వెనుకబడిపోవడంతో బ్లేజర్స్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. శనివారం జరిగే ఫైనల్లో సూపర్నోవాస్తో వెలాసిటీ తలపడుతుంది. గురువారం జరిగిన మ్యాచ్లో ట్రయల్ బ్లేజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (44 బంతుల్లో 66; 7 ఫోర్లు, 1 సిక్స్) దంచేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (1) నిరాశపరిచినా... వన్డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్తో కలిసి మేఘన మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మేఘన 32 బంతుల్లో (6 ఫోర్లు, 2 సిక్సర్లు), జెమీమా 36 బంతుల్లో (6 ఫోర్లు) అర్ధ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్కు 113 పరుగులు జోడించాక మేఘన అవుటైంది. తర్వాత హేలీ మాథ్యూస్ (16 బంతుల్లో 27; 4 ఫోర్లు) ధాటిగా ఆడింది. అనంతరం వెలాసిటీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులకే పరిమితమైంది. కిరణ్ నవ్గిరే (34 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగినా లాభం లేకపోయింది. -
NZ W Vs Ind W: అదరగొట్టిన తెలుగమ్మాయి.. భారీ స్కోరు.. అయినా తప్పని ఓటమి.. సిరీస్ వాళ్లదే
NZ W Vs Ind W 3rd ODI: - క్వీన్స్టౌన్: మళ్లీ భారీ స్కోరు చేసినా... భారత మహిళల జట్టు న్యూజిలాండ్ చేతిలో వరుసగా మూడో వన్డేలోనూ ఓటమి చవిచూసి మరో రెండు వన్డేలుండగానే సిరీస్ను 0–3తో కోల్పోయింది. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మొదట మిథాలీ రాజ్ బృందం 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (41 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్స్లు), షఫాలీ వర్మ (57 బంతుల్లో 51; 7 ఫోర్లు) తొలి వికెట్కు 100 పరుగులు జోడించారు. మిడిలార్డర్లో దీప్తి శర్మ (69 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధసెంచరీ సాధించింది. 280 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 49.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. మహిళల వన్డే క్రికెట్లో ఇది రెండో అత్యుత్తమ ఛేజింగ్. అమెలియా కెర్ (67; 8 ఫోర్లు), అమి సాటెర్త్వైట్ (59; 6 ఫోర్లు), లారెన్ డౌన్ (52 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు), కేటీ మారి్టన్ (37 బంతుల్లో 35) మెరిపించి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. జులన్ గోస్వామికి మూడు వికెట్లు దక్కాయి. చదవండి: Ind Vs Wi 2nd T20: ఆఖరి 2 బంతుల్లోనూ సిక్స్లు కొట్టాలి.. హర్షల్ ఆ అవకాశం ఇవ్వలేదుగా.. మనదే సిరీస్ -
Ind Vs NZ: తొలి వన్డేలో నిరాశే... ప్చ్... మన మేఘన కూడా...
Ind W Vs NZ W 1st ODI - క్వీన్స్టౌన్: వన్డే సిరీస్నూ భారత మహిళల జట్టు పరాజయంతోనే ప్రారంభించింది. తొలి వన్డేలో భారత్ 62 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. కెపె్టన్ మిథాలీ రాజ్ (73 బంతుల్లో 59; 6 ఫోర్లు) రాణించినా పరాజయం తప్పలేదు. శనివారం జరిగిన ఈ పోరులో మొదట న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 275 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ సుజీ బేట్స్ (111 బంతుల్లో 106; 10 ఫోర్లు) శతక్కొట్టింది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూజా వ్రస్తాకర్, రాజేశ్వరి, దీప్తి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 49.4 ఓవర్లలో 213 పరుగుల వద్ద ఆలౌటైంది. తొలి అంతర్జాతీయ వన్డే ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన (4) నిరాశపరిచింది. యస్తిక (41; 4 ఫోర్లు), మిథాలీ మూడో వికెట్కు 88 పరుగులు జోడించారు. వీళ్లిద్దరు ఔటయ్యాక మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోవడంతో భారత్ లక్ష్యానికి దూరమైంది. చదవండి: IPL Mega Auction 2022: రూ.15.25 కోట్లు.. ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు JENSEN STRIKES! @Jensen_Hayley digs one in and gets the wicket of Yastika Bhatia for 41. Good catch from @MaddyLGreen circling the boundary! Tune in LIVE to see the final quarter of our @kfcnz ODI on @sparknzsport 📲#NZvIND pic.twitter.com/jMzP5iW0LW — WHITE FERNS (@WHITE_FERNS) February 12, 2022 -
తగ్గద్దు.. వెనకడుగు వేయొద్దు
టంగుటూరు: పట్టుదల, ధైర్యం ఉంటే యువత ఏదైనా సాధించవచ్చని న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైన గడ్డం మేఘన చెప్పారు. విజయ సాధనలో ఎవరు నిరుత్సాహపరిచినా వెనకడుగు వేయకుండా ముందుకు సాగితే విజయం తథ్యమని అన్నారు. భారత దేశంలో యువతకు చాలా అవకాశాలు ఉన్నాయని, అమ్మాయిల్లో చాలా నైపుణ్యాలు ఉంటాయని చెప్పారు. వారు పట్టుదల, ధైర్యంతో కష్టపడితే లక్ష్యాలను సునాయాసంగా చేరుకోవచ్చన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికై అరుదైన ఘనత సాధించారు. మేఘన తండ్రి గడ్డం రవికుమార్, తల్లి ఉష. వ్యాపార రీత్యా 21 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మేఘన కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్లో చదువు పూర్తి చేశారు. సంక్రాంతి సందర్భంగా ఆమె తల్లిదండ్రులతో కలిసి స్వగ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆమె చెప్పిన విషయాలు.. యువతకు చాలా ఐడియాలు ఉంటాయి. వీటిని న్యూజిలాండ్ పాలకులు గుర్తిస్తారు. మూడేళ్లకోసారి యూత్ పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్లో 120 మంది ఎంపీలు ఉంటారు. ప్రతి ఎంపీకి ఒక యూత్ ఎంపీ ఉంటారు. 16 నుంచి 18 ఏళ్ల వయస్సు వారు అర్హులు. వీరికి చదువు, నాయకత్వ లక్షణాలు ఉండాలి. నేను స్కూలు స్థాయిలోనే హెడ్గా ఎంపికయ్యాను. చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటు. స్నేహితులతో కలిసి అనాథ శరణాలయాలకు విరాళాలు సేకరిస్తాను. రిప్యూటీ సెంటర్ ద్వారా ఇరాన్, ఇరాక్, సిరియా తదితర దేశాల నుంచి వలస వచ్చిన శరణార్ధుల కోసం ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేపట్టాం. చిన్నారులకు చదువులో సాయం చేస్తాం. ఇవే నాకు ఈ అవకాశాన్ని కల్పించాయి. జూలైలో పార్లమెంటులో ప్రసంగం జూలైలో రెండు రోజులు మాకు పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం ఉంటుంది. లెజిస్లేటివ్, జనరల్ డిబేట్లో, సెలెక్ట్ కమిటీలో పాల్గొంటాం. పలు సూచనలు చేస్తాం. అక్కడి అభివృద్ధి కార్యక్రమాల్లో లోపాలను ఎత్తిచూపుతూ మంత్రులను, ప్రధానిని సైతం నిలదీయొచ్చు. మేము సభ దృష్టికి తెచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిపై మంత్రులు, ప్రధాని చర్చిస్తారు. వాటిని బిల్లులు చేసిన సందర్భాలూ చాలా ఉన్నాయి. న్యూజిలాండ్లో ఇళ్ల సమస్య ఎక్కువ. పేదలకు ఇళ్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సరిపోవడంలేదు. దీనిపైనే తొలి ప్రశ్న వేస్తాను. మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీకి విరాళం చీమకుర్తి మండలం పల్లామల్లిలోని మదర్ థెరిస్సా ఎడ్యుకేషనల్ సొసైటీ బాలల కోసం చేస్తున్న మంచి పనులు చూసి రూ. 60 వేలు విరాళంగా ఇచ్చాను. పాఠశాలకు మరో రూ.2 లక్షలు ఇస్తాను. ఇంకా ఏదైనా అవసరం ఉంటే శాయశక్తులా చేస్తాను. తెలుగంటే బాగా ఇష్టం ప్రతి సంవత్సరం ఇండియాకు వస్తాను. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో రాలేదు. తెలుగంటే బాగా ఇష్టం. అందుకే ఇక్కడ తెలుగు బాగా నేర్చుకున్నాను. మన సంస్కృతి, సంప్రదాయాలు, భాష చాలా గొప్పవి. అక్కడే పుట్టి పెరిగినా వీటిని మరిచిపోలేదు. యూత్ ఎంపీకి చేసుకున్న దరఖాస్తులో కూడా నేను ఎక్కడ నుంచి వచ్చాను, నా దేశ సంస్కృతి సంప్రదాయాలను పొందుపరిచాను. -
Gaddam Meghana: న్యూజిలాండ్ యువ ఎంపీగా 18ఏళ్ల తెలుగమ్మాయి..
-
న్యూజిలాండ్లో ఎంపీగా ప్రకాశం జిల్లా యువతి
టంగుటూరు: ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘనను న్యూజిలాండ్లో ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ప్రాతినిథ్యం వహించే పార్లమెంట్ సభ్యురాలిగా అక్కడి ప్రభుత్వం నామినేట్ చేసింది. మేఘన తండ్రి రవికుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం రీత్యా 2001లో న్యూజిలాండ్లో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచే మేఘన సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేస్తుందని ఆమె తండ్రి తెలిపారు. -
Chiranjeevi Sarja Son: బాబాయి అందమైన వీడియో, నటి భావోద్వేగం
-
బాబాయి అందమైన వీడియో, నటి భావోద్వేగం
సాక్షి, ముంబై: దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా సోదరుడు ధృవ సర్జా ఒక అందమైన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిరు, మేఘనా తనయుడు రాయన్ రాజ్తో ఆడుకుంటూ, ముద్దాడుతున్న వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. భార్య ప్రేరణతో కలిసి రాయల్ రాజ్ను ఎత్తుకున్న ఫోటోను, అలాగే బుజ్జి రాయన్ కాలితో ధృవను తన్నుతున్న ఫోటో కూడా యాడ్ చేశారు. దీనిపై తల్లి మేఘనా రాజ్ భావోద్వేగంతో స్పందించారు. అటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇపుడు వైరల్గా మారింది. సోదరుడు అకాల మరణం తరువాత మేఘనను అక్కున చేర్చుకొని అన్నీ తానే అయి చూసుకున్నాడు ధృవ. ఈ క్రమంలో భర్తలేని లోటు తెలియనివ్వకుండా మేఘనాకు ఘనంగా సీమంతం కూడా జరిపించాడు. అంతేకాదు తన అన్నయ్యే మళ్లీ పుడతాడంటూ రూ. 10 లక్షల విలువ చేసే వెండి ఉయ్యాలను బహుమతిగా ఇవ్వడం అప్పట్లో విశేషంగా నిలిచింది. 2018లో చిరు సర్జా, నటి మేఘనా రాజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతా హాయిగా సాగిపోతోంది అనుకుంటున్న తరుణంలో పెళ్లైన రెండేళ్లకే చిరు సర్జా మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. గతేడాది జూన్ 7న తీవ్ర గుండెపోటుతో 35 ఏళ్లకే కన్నుమూశారు. అప్పటికే గర్భవతిగా ఉన్న మేఘనాను ఈ సంఘటన హతాశురాలిని చేసింది. అయితే అక్టోబర్ 22న పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో ఈ విషాదంనుంచి మేఘనకు కాస్తంత ఊరట లభించింది. తరచూ తన భావాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునే మేఘనా తన చిన్నారి, జూనియర్ చిరు పేరును ‘‘రాయన్ రాజ్’’ అంటూ ఇటీవల ఒక బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేశారు. కాగా తెలుగులో బెండు అప్పారావు, లక్కీ తదితర చిత్రాల్లో నటించిన మేఘనా, చిరంజీవి సర్జాతో ‘ఆటగార’, ‘రామ్లీలా’ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. -
కరెంట్ షాక్తో చేతులు పోయాయి. భర్త వదిలేశాడు. కానీ..
‘‘జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే జీవితమంటే ప్రతీ క్షణాన్ని ఆస్వాదించడమే. మామూలు వాళ్లైనా సరే.. వైకల్యం ఉన్న వాళ్లైనా సరే ఏదో ఒకటి సాధించాలని అందరికీ ఉంటుంది. అలాంటప్పుడు ముందుకెళ్లకుండా.. వెనక్కి తిరిగి చూడడం ఎందుకు? నా విషయంలో నేను చేస్తున్న పని ఎంతో ఆనందాన్ని ఇస్తోంది’’ అంటూ ముసిముసి నవ్వులతో చెబుతోంది టిక్టాకర్ మేఘనా గిమిరే. కరెంట్ షాక్తో రెండు చేతులు పొగొట్టుకున్న ఈమెలోని ఆత్మవిశ్వాసం.. అన్నీ ఉన్నా సాధించడానికి బద్ధకించేవాళ్లకు ఒక మంచి పాఠం. వెబ్డెస్క్: నేపాల్కు చెందిన మేఘనా గిమిరే. కొన్నేళ్ల క్రితం ప్రేమించిన వ్యక్తిని పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుంది. పెళ్లైన పది నెలల తర్వాత ఓరోజు ఆమె ఘోర ప్రమాదానికి గురైంది. చేతికి ఇనుప గాజులు వేసుకోవడం, దగ్గర్లో ఉన్న హైటెన్షన్ వైరను పొరపాటున తాకడంతో ఆమె కరెంట్ షాక్కు గురైంది. చేతులు పూర్తిగా దెబ్బతినడంతో డాక్టర్లు సర్జరీ చేసి వాటిని తీసేశారు. అందమైన భార్య వికలాంగురాలు అయ్యేసరికి సహించలేక ఆ భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మేఘన ఇబ్బందుల్ని ఎదుర్కొంది. నడిపించిన తల్లి ప్రేమ భర్త వదిలేసినా.. కన్నపేగు మమకారం మేఘనను అక్కున చేర్చుకుంది. పుట్టింటికి తీసుకొచ్చింది. తినబెట్టడం, బట్టలు మార్చడం, స్నానం అన్నీ తల్లే దగ్గరుండి చేసింది. కొన్నాళ్లకు తనంతట తానుగా పనులు చేసుకోవడం ప్రారంభించింది గిమిరే. క్రమంగా కాళ్ల సాయంతో పనులు చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు సరదాగా మొబైల్ను కాళ్లను ఆపరేట్ చేస్తూ.. తన పాత టిక్టాక్ అకౌంట్ను చూసింది. సెల్ఫ్ వీడియోలతో టిక్టాక్లో వీడియోలు అప్లోడ్ చేసింది. ఆ వీడియోల్లో ఆమె ఆత్మవిశ్వాసానికి లక్షల మంది ఫిదా అయ్యారు. తక్కువ టైంలోనే మేఘన టిక్టాక్కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం టిక్టాక్లో ఆమెకు ఇరవై లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇండియాలో టిక్టాక్ బ్యాన్ కాకముందు మన దగ్గరి నుంచి కూడా ఆమె వీడియోలకు మంచి స్పందనే దక్కేది. #Nepal #Tiktoker #Meghana pic.twitter.com/0VPf705VRK — ashwik (@ursashwik) June 3, 2021 అభిమానుల అండ సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ బాగా పెరిగింది. అయితే రాను రాను ఆ అభిమానులే.. ఆమె పట్ల దాతలుగా మారారు. వాళ్లు అందించిన డబ్బు సాయంతోనే ఆమె అమెరికా వెళ్లగలిగింది. అక్కడి డాక్టర్ల పర్యవేక్షణలో ప్రోస్తటిక్ చేతుల్ని అందుకుంది. కానీ, అవి ఆమెకు తాత్కాలిక ఊరట మాత్రమే అందించాయి. అయినప్పటికీ తనకు ఇప్పటిదాకా అందిన సాయం మరువలేనిదని చెబుతోంది మేఘన. చిరునవ్వుతో ఆమె చేసే సరదా వీడియోలే కాదు.. సందేశాలతో ఆమె మాట్లాడే మాటలు ఆకట్టుకునేలా ఉంటాయి. చదవండి: మీమ్స్లో కనిపించే ఇతగాడి గురించి తెలుసా? -
రెడ్ సారీలో హీటెక్కిస్తున్న బ్యూటీ
-
యాంకర్ మేఘనా అదిరే స్టిల్స్
-
పాట చాలా బాగుంది: వైఎస్ షర్మిల
‘‘ఈ కథలో పాత్రలు కల్పితం’ చిత్రంలోని రెండో పాట చాలా బాగుంది.. సినిమా కూడా మంచి విజయం సాధించాలి’’ అని వైఎస్ షర్మిల అన్నారు. పవన్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా అభిరామ్ ఎమ్. తెరకెక్కించిన చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మాధవి సమర్పణలో రాజేశ్ నాయుడు నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని సెకండ్ లిరికల్ సాంగ్ను వైఎస్ షర్మిల విడుదల చేశారు. ‘‘ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యే ఎలిమెంట్స్కి ఎంటర్టైన్ మెంట్ జోడించి అభిరామ్ ఈ చిత్రాన్ని రూపొందించారు’’ అన్నారు రాజేశ్ నాయుడు. ‘‘పవన్ తేజ్ కొణిదెలకు ఇది పర్ఫెక్ట్ లాంచింగ్ అవుతుంది’’ అన్నారు అభిరామ్ ఎమ్. -
పాత్రలు కల్పితం
పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో మాధవి సమర్పణలో రాజేష్ నాయుడు నిర్మించారు. మేఘన హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలోని ‘కన్నయే కళ్లు..’ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మాట్లాడుతూ –‘‘థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. పవన్ తేజ్కి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుందని భావిస్తున్నాం. మా చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సునీల్ కుమార్ విజువల్స్, తాజుద్దీన్ సయ్యద్ మాటలు మా చిత్రానికి హైలైట్’’ అన్నారు. ‘‘రాజేష్ నాయుడుగారి సహకారంతోనే సినిమాను రిచ్గా తీయగలిగాం. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని అభిరామ్.ఎమ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ పామర్తి. -
కల్పిత పాత్రలతో...
పవన్ తేజ్ కొణిదెల హీరోగా, మేఘన, లక్కీ హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. అభిరామ్ ఎం. దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. రాజేష్ నాయుడు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. టైటిల్ ప్రకటించినప్పటి నుంచి మా సినిమాకి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మంచి విజన్తో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే థ్రిల్లింగ్ అంశాలతో అభిరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ తేజ్ కొణిదెలకి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ అవుతుంది. ‘జెస్సీ’, ‘ఓ పిట్టకథ’ సినిమాలకి పనిచేసిన సునీల్ కుమార్ విజువల్స్, ‘ఆర్ఎక్స్ 100’, ‘కల్కి’ చిత్రాల ఫేమ్ తాజుద్దీన్ సయ్యద్ మాటలు ఈ చిత్రానికి హైలెట్గా నిలుస్తాయి. త్వరలోనే టీజర్, పాటల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ పామర్తి, లైన్ ప్రొడ్యూసర్: దుర్గా అనీల్ రెడ్డి. -
పవర్ఫుల్ పోలీస్
పవన్ తేజ్ కొణిదెల హీరోగా, మేఘన, లక్కీ హీరోయిన్లుగా అభిరామ్ ఎం. దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘పెళ్లి’ సినిమా ఫేమ్ పృథ్వీరాజన్ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆయన లుక్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ జరుపుతున్నాం. పవన్ తేజ్కి తొలి సినిమా అయినా అనుభవం ఉన్నవాడిలా నటిస్తున్నాడు. అభిరామ్ మేకింగ్ ఫ్రెష్గా ఉంది. ‘జెస్సీ’ ఫేమ్ సునీల్ కుమార్ విజువల్స్, ‘ఆర్ఎక్స్ 100, కల్కి’ చిత్రాలకు డైలాగ్స్ రాసిన తాజుద్దీన్ సయ్యద్ మాటలు ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ పామర్తి, లైన్ ప్రొడ్యూసర్: దుర్గా అనిల్ రెడ్డి. -
‘ఈ కథలో పాత్రలు కల్పితం’లో మరో పాత్ర రివీల్
పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో రూపొందుతోన్న సినిమా 'ఈ కథలో పాత్రలు కల్పితం'. ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై అభిరామ్ ఎం. దర్శకత్వంలో రాజేష్ నాయుడు నిర్మిస్తున్నారు. మేఘన హీరోయిన్. ఇటీవల విడుదలైన ఫస్ట్, సెకండ్ లుక్ పోస్టర్లకి మంచి స్పందన లభించింది. మొదటి రెండు పోస్టర్లలో హీరో లుక్ను మాత్రమే విడుదల చేసిన చిత్ర బృందం..ఇప్పుడు మిగతా పాత్రలు పోషించిన వారి లుక్స్ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం బబ్లూ పృథ్వీరాజ్ పాత్రను విడుదల చేసింది చిత్ర బృందం. రాజీవ్ కృష్ణ పేరుతో పోలీసు అధికారి పాత్రలో పృథ్వీరాజ్ సీరియస్గా కనిపించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి కార్తీక్ కొడకండ్ల సంగీతమందిస్తుండగా సునీల్ కుమారన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. -
పాత్రలన్నీ కల్పితం
పవన్ తేజ్ కొణిదెలను హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవీటీ ఎంటర్టైన్మెంట్స్పై అభిరామ్ ఎం. దర్శకత్వంలో రాజేష్ నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. మేఘన హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రాజేష్ నాయుడు మాట్లాడుతూ – ‘‘ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్కి మంచి స్పందన వస్తోంది. ఫస్ట్ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. మా హీరో పవన్ తేజ్ కొణిదెలకి మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న నటుడిలా నటిస్తున్నారు. అభిరామ్ మేకింగ్ ఫ్రెష్గా ఉంది. మంచి థ్రిల్లింగ్ ఎంటర్టైనర్. సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ బ్యూటిఫుల్ విజువల్స్, తాజుద్దీన్ సయ్యద్ డైలాగ్స్ ఈ చిత్రానికి హైలెట్గా నిలుస్తాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ పామర్తి, లైన్ ప్రొడ్యూసర్: దుర్గా అనీల్ రెడ్డి. -
మేఘనకు డబుల్స్ స్వర్ణం
హైదరాబాద్: ఆసియా పసిఫిక్ యూత్ గేమ్స్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారిణి మారెడ్డి మేఘనా రెడ్డి సత్తా చాటింది. రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో జరిగిన ఈ టోరీ్నలో అండర్–17 బాలికల డబుల్స్ విభాగంలో మేఘన తన భాగస్వామి తో కలిసి విజేతగా నిలిచింది. ప్రస్తుతం మేఘ న భారతీయ విద్యాభవన్స్ స్కూల్లో 11వ తరగతి చదువుతోంది. ఈ టోర్నీలో భారత్తో పాటు రష్యా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, థాయ్లాండ్, ఇండోనేసియా, మలేసియా, సింగపూర్, చైనీస్ తైపీ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈనెల 3 నుంచి 9 వరకు ఈ టోర్నీ జరిగింది. -
ముగిసిన మేఘన పోరాటం
వ్లాదివోస్తోక్: వరుస విజయాలతో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పతకాలపై ఆశలు రేపిన హైదరాబాద్ అమ్మాయి మేఘన జక్కంపూడి పోరాటం సెమీస్తో ముగిసింది. రష్యా ఓపెన్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శనివారం కేవలం 27 నిమిషాల పాటు సాగిన మిక్స్డ్ డబుల్స్ సెమీస్ మ్యాచ్లో ఎనిమిదో సీడ్ మేఘన–ధృవ్ కపిల జోడి 6–21, 15–21తో అద్నాన్ మౌలానా–మిచెల్లి క్రిస్టిన్ బండాసో (ఇండోనేషియా) జంట చేతిలో ఓడింది. అనంతరం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్లో టాప్ సీడ్ మేఘన–పూర్విషా రామ్ జంట 10–21, 8–21తో నాలుగో సీడ్ మికి కషిహర–మియుకి కటో (జపాన్) ద్వయం చేతిలో కంగుతింది. కేవలం 33 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో భారత జోడి ఏమాత్రం పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది. -
కారు అదుపు తప్పి విద్యార్థిని దుర్మరణం
మేడ్చల్: కళాశాలకు సెలవులు ఇవ్వడంతో తండ్రితో కలిసి ఇంటికి వెళుతున్న ఓ బాలిక కారు అదుపుతప్పడంతో తండ్రి కళ్లెదుటే మృతి చెందిన సంఘటన గురువారం మేడ్చల్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ నాయుడు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అదిలాబాద్ జిల్లా, నిర్మల్కు చెందిన మురళీగౌడ్ కుమార్తె మేఘన(17) బాచుపల్లి శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. గురువారం నుంచి కాలేజీకి సెలవులు ప్రకటించడంతో మురళీ గౌడ్ గురువారం మధ్యాహ్నం కుమార్తెను తీసుకుని కారులో నిర్మల్ వెళుతుండగా అత్వెల్లి శివారులోని రేకుల బావి మలుపు వద్ద కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న రేలింగ్ ను ఢీ కొట్టింది.కారు వేగంగా ఉండటంతో రేలింగ్ రేకులు వెనుక సీట్లో కూర్చున మేఘన తలలోకి చొచ్చుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మురళీగౌడ్, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మేఘన మృతదేహన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మేఘన–తస్నీమ్ జంటకు ‘ఆసియా’ డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. మయన్మార్లో ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో అండర్–15 బాలికల డబుల్స్ విభాగంలో మారెడ్డి మేఘన రెడ్డి–తస్నీమ్ మీర్ జోడీ విజేతగా నిలిచింది. హైదరాబాద్కు చెందిన మేఘన, గుజరాత్ అమ్మాయి తస్నీమ్ ఫైనల్లో 23–21, 21–18తో గాంగ్ యో జిన్–జియోంగ్ డా యోన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. 40 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ పోరులో రెండు జోడీలు ప్రతీ పాయింట్కు నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. అయితే కీలకదశలో మేఘన–తస్నీమ్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ టోర్నమెంట్లో భారత్కు స్వర్ణం సహా నాలుగు కాంస్య పతకాలు లభించాయి. అండర్–15 బాలుర సింగిల్స్లో శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... అండర్–17 బాలికల సింగిల్స్లో అదితి భట్... అండర్–17 బాలుర సింగిల్స్లో మెరబా లువాంగ్... అండర్–15 బాలుర డబుల్స్లో పుల్లెల సాయివిష్ణు–గంధం ప్రణవ్ రావు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు దక్కించుకున్నారు. -
అమ్మా నాన్న తమ్ముడు... ఓ కన్నడ అమ్మాయి!
మేఘన ఆలోచనలు భూమ్మీద లేవెప్పుడూ! ఇప్పుడైతే పూర్తిగా గగనంలోనే ఆమె డ్యూటీ. పట్టుపట్టి ఫైటర్ జెట్ పైలెట్ అయిన మేఘన.. కొత్త జనరేషన్కి.. ఓ కొత్త ఇన్స్పిరేషన్! అమ్మా నాన్న తమ్ముడు... ఓ కన్నడ అమ్మాయి. ‘అందంగా అల్లుకున్న హరివిల్లు మాది’ అని పాడుకోదగినంత చక్కని కుటుంబం. ‘నాన్నా! ఇంత చిన్న స్కూల్లో కాదు పెద్ద స్కూల్లో చదువుకుంటాను’ అన్నది మేఘన నాలుగో తరగతిలో. అంత పెద్ద స్కూలు మనూర్లో లేదంటే ‘పెద్ద స్కూలుకి హాస్టల్ కూడా ఉంటుంది కదా నాన్నా’.. ఇదీ పదేళ్ల వయసులో మేఘన అన్న మాట. తన కూతురు మామూలు అమ్మాయిగా మిగలదు, అడ్వెంచరస్ పర్సనాలిటీ అవుతుందని తండ్రికి ఎక్కడో ఓ నమ్మకం. కూతురి మీద తండ్రి పెంచుకున్న ఆ నమ్మకమే... కన్నడ రాష్ట్రానికి ఓ రికార్డును సాధించి పెట్టింది, ఉత్తర భారతం ముందు తలెత్తుకోవడానికి దక్షిణ భారతానికి ఓ భరోసానిచ్చింది. మేఘనా శాన్బాగ్ ఆలోచనలు ఎప్పుడూ వినువీధిలోనే విహరిస్తూ, మేఘాలను తాకుతుండేవి. చదువుకే పరిమితమయ్యేది కాదు. ఆటపాటల్లో కూడా చురుగ్గా ఉండేది. ఒక విషయం చర్చకు వస్తే తన వాదనతో ఎదుటి వారిని సమాధాన పరిచి తాను అనుకున్నట్లే చేసేది. అమ్మానాన్నలిద్దరూ చట్టాన్ని ఔపోశన పట్టారు, వాళ్ల కూతురు వారితో గెలవడంలో మెళకువలు నేర్చుకుంది. తండ్రి న్యాయవాది, తల్లి జడ్జి. ఇంటి కోర్టులో తన వాదనను తానే వినిపించుకుంది మేఘన, ‘‘చిన్నపిల్ల ఏదో చెబుతుంటే అన్నింటికీ ఒప్పుకోవడమేనా’’ అంటూ తల్లి డిఫెన్స్ వాదనను లేవనెత్తింది. ఈ ఫ్యామిలీ కోర్టులో తండ్రి న్యాయమూర్తి పాత్ర పోషించాల్సి వచ్చింది. వాది ప్రతివాది ఇద్దరూ సమర్థంగానే ఉన్నారు. ఎటొచ్చీ న్యాయమూర్తిలో దాగిన తండ్రి మనసు కూతురి వైపే మొగ్గింది. ఆ తీర్పుతో మేఘన చిక్మగుళూరు (కర్ణాటక రాష్ట్రం) దగ్గర మార్లె నుంచి ఉడిపిలోని లిటిల్ రాక్ ఇండియన్ స్కూల్లో చేరింది. ఐదవ తరగతి నుంచి ట్వల్త్ క్లాస్ వరకు అదే స్కూల్. ఇంజనీరింగ్ మైసూర్లోని శ్రీ జయచామరాజేంద్ర కాలేజ్లో చేసింది. ఎప్పుడూ సాహసాలే మేఘన ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కాలేజ్ అడ్వెంచర్ క్లబ్ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేది. సెమిస్టర్ బ్రేక్లో ట్రెకింగ్, రివర్ రాఫ్టింగ్, మౌంటనియరింగ్ వంటి సాహసయాత్రలను మేఘన స్వయంగా నిర్వహించేది. ఆమె మనాలిలో మౌంటనియరింగ్ కోర్సు చేసింది. పారాగ్లైడింగ్లో పూర్తిస్థాయి శిక్షణ కూడా తీసుకుంది. గోవా, క్వారీ బీచ్లో సోలో పారాగ్లైడింగ్ ఈవెంట్లో జంప్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మధ్యలో కర్ణాటక సంగీతం నేర్చుకుంది. ఇలా ఆడుతూ పాడుతూ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఫైనలియర్లో ఉన్నప్పుడు మొదలైంది ‘వాట్ నెక్ట్స్’ అనే ఆలోచన. అందరిలా ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడానికి మనస్సంగీకరించలేదు. అందరికంటే భిన్నంగా ఏదైనా చేయాలనే ఉత్సుకత చిన్నప్పటి నుంచి ఉంది. ఆ ఉత్సుకతే ఆమె చేత అన్నేసి సాహసాలను చేయించింది. వాటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టడం కాదు జీవితమంటే అనే సంఘర్షణ కూడా మొదలైంది. పారాగ్లైడింగ్లో శిక్షణనిచ్చిన సీనియర్లు చెప్పిన మాటలు మళ్లీ మళ్లీ గుర్తుకు వచ్చాయి. వాళ్లు ఎయిర్ఫోర్స్లో పని చేసి రిటైర్ అయిన అధికారులు. పారా గ్లైడింగ్ ట్రైనింగ్తోపాటు వాళ్ల ఉద్యోగ అనుభవాలను కూడా పంచుకునేవారు. సాహసానికి పరాకాష్ట అయిన ఉద్యోగం అంటే అదేనేమో అనిపించేది మేఘనకు. తన కెరీర్ కూడా అంతటి సాహసోపేతంగానే ఉండాలని ముచ్చటపడింది. ఎయిర్ఫోర్స్లో చేరాలని మనసు పడింది. (తమ్ముడు నిర్ణయ్, తల్లి శోభ, తండ్రి రమేశ్తో మేఘన) దేశంలో ఆరో అమ్మాయి మేఘనాశాన్బాగ్ ఫైటర్ పైలట్ కావడం దక్షిణ భారతదేశానికి రికార్డు. మనదేశంలో యుద్ధవిమానాలు నడపడానికి అర్హత సాధించిన ఆరో అమ్మాయి మేఘన. మొదటి ఐదు స్థానాల్లో మధ్య ప్రదేశ్, రాజస్థాన్, బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వారున్నారు. మేఘన విజయం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే కాదు, దక్షిణాది రాష్ట్రాలకు కూడా రికార్డే. దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ తొలి ఫైటర్ పైలట్ మేఘననే. రఫెల్ యుద్ధ విమానాన్ని నడపడం తన కల అంటోంది మేఘన. చక్కటి కాఫీలా ఉండాలి మేఘనది కన్నడ కాఫీ తోటల్లో పుట్టిన కుటుంబం. ఆమె తల్లి శోభ ఆడపిల్లకు మరీ గిరిగీసే చాదస్తపు తల్లి కాదు. న్యాయమూర్తిగా జీవితాలను ప్రభావితం చేస్తున్న మహిళ. జీవితాన్ని చక్కగా అమర్చుకోవాలనే సంప్రదాయవాది మాత్రమే. కూతురు జీవితం... ఉదయాన్నే ఘుమఘుమలాడే కాఫీలాగ ఆస్వాదభరితంగా ఉంటే బావుణ్ననుకునే తల్లి. సాహసాల జోలికి పోకుండా ఒళ్లు హూనం చేసుకోకుండా కూతురు లక్షణంగా ఉండాలని కోరుకునే తల్లి మనసు ఆమెది. మేఘన యుద్ధవిమానాలను నడిపే అధికారి అయినప్పుడు సంతోషంతోపాటు ఎక్కడో మనసులో భయపడుతూనే ఉన్నారామె. ‘ఇంత గొప్ప స్థాయికి చేరడం ఆనందమే కానీ...’ అంటూ అర్ధోక్తిలో ఆగిపోతుంటారిప్పటికీ. ఆమె ఇలా అంటుంటే మేఘన మాత్రం ‘‘అది నా జీవితంలో గొప్ప పర్వదినం అనే చెప్పాలి. కాక్పిట్లో నేనొక్కదాన్నే. ఒక్కదాన్నే విమానాన్ని టేకాఫ్ చేయాలి. ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ కి నా పేరు చెప్పుకుని విమానాన్ని గాల్లోకి తీసుకెళ్లడంలో ఉన్న ఆనందాన్ని చెప్పడానికి మాటలుండవు. అనుభవంలో తెలియాల్సిందే. ఆ ఫ్లయింగ్లో నేను విమానాన్ని నడిపింది కేవలం ఇరవై నిమిషాల సేపే. కానీ అవి నాకు అమూల్యమైన క్షణాలు. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’’ అని తన తొలి ఫ్లయింగ్ అనుభవాన్ని పంచుకుంది. ‘‘నేను ఫైటింగ్ విభాగాన్ని ఎన్నుకున్నాను. శిక్షణలో రోమాలు నిక్కబొడుచుకునే విన్యాసాలను ఎన్నో చేస్తుంటాం. ఫైటర్ పైలట్ శిక్షణలో బాంబులతో దాడి చేయడం, కాల్పులు, పోరాట నైపుణ్యాలను నేర్పిస్తారు. తర్వాత అవన్నీ తీపి జ్ఞాపకాలుగా మిగులుతాయి. ఒక్కో విన్యాసాన్నీ పూసగుచ్చినట్లు చెబుతుంటే అమ్మానాన్న, తమ్ముడు భయంగా చూశారు నన్ను. అప్పుడు నాకేదయినా అయి ఉంటే... అనేదే వాళ్ల భయం. తమ్ముడు నిర్ణయ్ పుణేలోని సింబయాసిస్లో లా కోర్సు చేస్తున్నాడు అచ్చం అమ్మ కోరుకున్నట్లే’’ అని నవ్వింది మేఘన. కలిసొచ్చిన నిర్ణయం మేఘన 2015లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆమెకి ఇండియన్ ఎయిర్ఫోర్సులో చేరాలనే లక్ష్యం ఏర్పడింది కూడా అప్పుడే. సరిగ్గా అదే సమయానికి మనదేశ విమానయాన రంగం... యుద్ధవిమానాల కాక్పిట్లోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఎయిర్ఫోర్స్ నిర్ణయంతో 2016 జూన్లో మోహనా సింగ్, భావనా కాంత్, అవనీ చతుర్వేదిలు దేశంలో యుద్ధవిమానాలు నడపడానికి ఎంపికైన తొలి మహిళలుగా రికార్డు్డ సృష్టించారు. అప్పటి వరకు పైలట్గా విమానాలను నడపాలనేదే మేఘన ఆశయం. ఎయిర్ఫోర్స్ నిర్ణయంతో మేఘన లక్ష్యం యుద్ధవిమానాలయ్యాయి. ఆ ముగ్గురు మహిళల రికార్డు మేఘనలో పట్టుదలను మరింతగా పెంచింది. ఏకకాలంలో ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, సర్వీస్ సెలక్షన్ బోర్డు రెండు పరీక్షలను రాసింది. రెండింటిలోనూ తొలి ప్రయత్నంలోనే సెలెక్ట్ అయింది. కానీ తన కల విమానాల్లోనే విహరిస్తుండడంతో ఎయిర్ఫోర్స్లోకి వచ్చింది. 2017 జనవరిలో హైదరాబాద్, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. యుద్ధవిమానాలు నడపడంలో నైపుణ్యం సాధించింది. ఏఎఫ్ఏలో జాయిన్ అయ్యి, డిసెంబర్లో కోర్సు పూర్తి చేసింది. ఈ ఏడాది ఫ్లయింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ అందుకుంది. ప్రయత్నమూ గొప్పే మనదేశంలో యుద్ధవిమానాలను నడిపించిన తొలి మహిళలుగా మోహనా సింగ్, భావనాకాంత్, అవనీచతుర్వేదిల విజయగాథ చదవడం నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ఆ కథనం నన్ను ప్రభావితం చేసింది. నాలాగే మరెందరో స్ఫూర్తి పొంది ఉండవచ్చు. నన్ను చూసి స్ఫూర్తి పొందేవాళ్లు కూడా ఉండాలి. అదే నాకు సంతోషం. ఫైటర్ పైలట్ కావడం గొప్ప అవకాశం. ప్రతి ఒక్క అమ్మాయికి, అబ్బాయికి ఫైటర్ పైలట్ కావాలనేదే కల కావాలి. ఆ కలను సాధించుకోవడంలో విజయం మాత్రమే కాదు ప్రయత్నించడం కూడా గొప్ప అనుభూతిగానే మిగులుతుంది. – మేఘనా శాన్బాగ్, ఫైటర్ పైలట్ – వాకా మంజులారెడ్డి -
జీరోయిజమ్
‘‘ప్రేక్షకులు ఇప్పటి వరకు íహీరోయిజమ్ చూసి ఉంటారు. కానీ, మా చిత్రంలో జీరో యిజమ్ చూస్తారు’’ అని డైరెక్టర్ జేడీ అన్నారు. సురేశ్ పాని, మేఘన జంటగా జేడీ దర్శకత్వంలో చింతల జెఎస్ కుమార్ (జోషి) నిర్మిస్తున్న చిత్రం ‘మామ రెండు జెగ్గులు’. ఈ సినిమా ప్రారంభోత్సవంలో డైరెక్టర్ సాగర్, నిర్మాత ప్రసన్నకుమార్, కూచిపూడి వెంకట్ పాల్గొన్నారు. జేడీ మాట్లాడుతూ– ‘‘ఒక ఊర మాస్ అబ్బాయికి, స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి క్లాస్ అమ్మాయికి మధ్య జరిగే కథే ఈ చిత్రం. ‘మామ’ అంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలు పెట్టిన సురేశ్ హీరోగా పరిచయమవుతున్నారు. డిసెంబర్లోపు సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. -
తెలుగు సినిమాని కొత్త దారిలో తీసుకెళుతుంది
ఎం.ఎస్.క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్స్టేషన్’. మాగంటి శ్రీనాథ్, మేఘన జంటగా నటించారు. నాగసాయి మాకం దర్శకుడు. ఈ చిత్రం కోసం గోరేటి వెంకన్న పాడిన ప్రచార గీతాన్ని హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి గీత రచయిత సుద్దాల అశోక్తేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాగసాయి మాట్లాడుతూ – ‘‘దాదాపు 200 పోలీస్ స్టేషన్లలకు వెళ్లి అక్కడి కేసులను పరిశీలించి కథను తయారు చేసుకున్నాను. సినిమాకి పనికొచ్చే కేసులను కథలో చేర్చాం. ఈ కేసులన్నీ వినోదాత్మకంగానే ఉంటాయి. సినిమా అంతా గ్రామీణ నేపథ్యంలోనే సాగుతుంది’’ అన్నారు. మహంకాళీ శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘నేనీ చిత్రాన్ని ప్యాషన్ కోసం చేయలేదు. వ్యాపారం కోసమే చేశాను. పెట్టిన డబ్బు తిరిగి రాకపోతే ప్యాషన్ ఉండి ఏం లాభం. ఈ సినిమాను కొత్త తరహా కథ, కథనాలతో తెరకెక్కించాం’’ అన్నారు. సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ – ‘‘సాహిత్యానికి చిన్నా పెద్దా తేడా లేదని దాసరిగారు నాతో చెప్పేవారు. చిన్న హీరోకు పాట రాసినా సూపర్ స్టార్కు రాసినట్లే భావించి రాయాలని చెప్పేవారు. అలాగే ఈ చిత్రంలో మంచి పాట రాశాను. మనసు పెట్టి రచించాను’’ అన్నారు. గోరేటి వెంకన్న మాట్లాడుతూ – ‘‘నాకు గాయకునిగా, గీత రచయితగానే కాకుండా నటునిగా ఈ చిత్రంలో అవకాశం కల్పించారు దర్శక,నిర్మాతలు. ప్రాధాన్యమున్న పాత్రలో నటించాను. కావాల్సినంత వినోదం ఉంటుంది. ‘బిలాల్పూర్ పోలీస్స్టేషన్ ’ తెలుగు సినిమాను కొత్తదారిలో తీసుకెళ్లే చిత్రమవుతుంది’ అన్నారు. -
స్త్రీలోక సంచారం
చిన్నప్పట్నుంచీ తను రోజువారీగా «ధరిస్తూ వస్తున్న షూజ్, సాక్స్, ఇంకా యాక్సెసరీస్ను పెద్ద మొత్తంలో జాగ్రత్త పరిచిన అస్ఫియా ఖాద్రీ అనే హైదరాబాద్ యువతి మూడు ప్రపంచ రికార్డులు సాధించింది. మినార్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ వస్తు సేకరణ ప్రదర్శనకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు హాజరై, సంతృప్తి చెందిన అనంతరం అస్ఫియాకు 18 పతకాలు 21 ప్రశంసా పత్రాలు (సైటేషన్స్) అందజేసి.. ఇటీవలే ఎం.బి.బి.ఎస్. పూర్తి చేసి, ఆర్థోపెడిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేయబోతున్న అస్ఫియాకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ::: గత ఏడాది జైపూర్లోని బార్మర్కు సమీపంలో రైల్వే ట్రాక్పై ఒక అట్టపెట్టెలో గుర్తు తెలియని వ్యక్తులు ఉంచి వెళ్లిన అప్పుడే పుట్టిన ఆడశిశువును లైన్మ్యాన్ గమనించి జో«ద్పూర్లోని ‘నవజీవన్ సంస్థాన్’ ఆశ్రమానికి చేర్చిన తర్వాత ఇప్పుడీ ఎనిమిది నెలల పాపను స్వీడన్ నుంచి వచ్చిన ఎలిన్ క్రిస్టిన్ ఎరిక్సన్ అనే నర్సు దత్తత తీసుకున్నారు. కజ్రీ అని పేరు పెట్టి నవ జీవన్ సంస్థాన్ అల్లారు ముద్దుగా పెంచుతున్న ఈ పాపను దత్తత తీసుకోడానికి అవసరమైన నియమావళిని ఎలిన్ పూర్తి చేయవలసి ఉంది ::: బాలురపై లైంగిక దాడులకు పాల్పడేవారికి విధించే శిక్షలను మరింత కఠినతరం చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ.. మంత్రి మండలికి పంపించబోతోంది. ఇందుకు అనుగుణంగా ‘పోక్సో’ (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టంలో సవరణలు చేయాలన్న స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ సూచనను న్యాయ శాఖ ఇప్పటికే ఆమోదించింది. గత మేలో పెళ్లయ్యాక ఇంగ్లండ్ నూతన రాచవధువు మేఘన్ మార్కెల్ తొలిసారి ఒంటరి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే అంతఃపుర ఆంక్షలను, నిబంధనలను పక్కన పెట్టి క్వీన్ కుటుంబాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళుతున్నారని ఏక కాలంలో ప్రశంసలు, విమర్శలు మూటగట్టుకుంటున్న మార్కెల్.. న్యూయర్క్, లాస్ ఏంజిలెస్లలోని తన స్నేహితులను, బంధువులను, తల్లిదండ్రులను కలుసుకునేందుకు భర్త ప్రిన్స్ హ్యారీ పక్కన లేకుండానే.. వచ్చే నెలలో అనధికారిక ఏకాంత పర్యటనకు బయల్దేరుతున్నారు ::: మెల్బోర్న్లో మొదలౌతున్న ఐ.టి.టి.ఎఫ్. (ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్) వరల్డ్ టూర్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొనేందుకు ఆదివారంనాడు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఇండియన్ టెన్నిస్ స్టార్ మోనికా బాత్రా, మౌమాదాస్, మరో ఐదుగురు టెన్నిస్ ప్లేయర్లను ప్రయాణానికి అనుమతించేందుకు మెల్బోర్న్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం నిరాకరించింది. అప్పటికే సీట్లన్నీ బుక్ అయి ఉండటం మాత్రమే కాక, వారి పి.ఎన్.ఆర్. (ప్యాసింజర్ నేమ్ రికార్డ్) నంబర్లు సరిపోలలేదని ఎయిర్ ఎండియా చెప్పడంతో పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియక బాత్రా, మిగతా ప్లేయర్లు మరో విమానంలో మెల్బోర్న్ బయల్దేరి వెళ్లారు. -
తెలంగాణ నేపథ్యంలో...
‘‘బిలాల్పూర్ పోలీస్స్టేషన్’ ఫస్ట్లుక్ చాలా కొత్తగా ఉంది. సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. పోస్టర్లో ఉన్న కొత్తదనం సినిమాలో కూడా ఉంటుందనుకుంటున్నా’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. శ్రీనాథ్ మాగంటి, మేఘనా జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్స్టేషన్’. ‘జగ్గిలొల్లి’ అన్నది ఉపశీర్షిక. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాసులు నిర్మించిన ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్ను శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. నిర్మాత శ్రీనివాసులు మాట్లాడుతూ– ‘‘తెలంగాణ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇదొక వినూత్న ప్రయత్నం. మా టీమ్ని శేఖర్ కమ్ములగారు అభినందించడం చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘వాస్తవ సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించాం. కథ, కథనాలు ఆకట్టుకునేలా ఉంటాయి. గాయకుడు గోరటి వెంకన్న ప్రధాన పాత్రలో కనిపిస్తారు’’ అన్నారు నాగసాయి. ఈ చిత్రానికి సంగీతం: సాబూ వర్గీస్. -
మహిళలు తిరగబడితే?
మేఘన, ఆరోహి, వృశాలి, పోసాని కృష్ణమురళి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘త్రినేత్రి’. తిరుపతి కె. వర్మ దర్శకత్వంలో ఎడవెల్లి వెంకట్ రెడ్డి, కాచిడి గోపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తిరుపతి కె. వర్మ మాట్లాడుతూ– ‘‘ఆడవాళ్లపై జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. మహిళలు తిరగబడితే ఎలా ఉంటుంది? అన్నదే కథ. పోసానిగారి పాత్ర ఈ సినిమాకి హైలైట్గా ఉంటుంది. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘పోసానిగారు మా సినిమా కథ విని చాలా బాగుంది, కచ్చితంగా మంచి హిట్ అవుతుందన్నారు’’ నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: ఎడవెల్లి రాంరెడ్డి, కెమెరా: చారి, సంగీతం: జయంత్. -
సహజమైన కథ
శ్రీనాథ్ మాగంటి, మేఘన జంటగా నాగసాయి మాకం దర్శకత్వంలో ఎమ్ఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాసులు నిర్మించిన సినిమా ‘బిలాల్పూర్ పోలీస్స్టేషన్’. ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘‘పోలీస్స్టేషన్ బ్యాక్డ్రాప్లో వచ్చే వినూత్నమైన చిత్రం ఇది. ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. కథ మీద నమ్మకంతో దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా ఉన్నత నిర్మాణ విలువలతో చిత్రాన్ని నిర్మించాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీనివాసులు. ‘‘వాస్తవ సంఘటనలతో అల్లుకున్న పూర్తి సహజమైన కథ ఇది. ప్రజా కవి గోరటి వెంకన్న ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. కామెడీ సన్నివేశాలు టైమింగ్కు తగ్గట్లుగా ఉంటాయి. సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు నాగసాయి. ఈ సినిమాకు సంగీతం: సాబూ వర్గీస్. -
రాణిగారింటి పెళ్లికి మురికివాడల మైనా
మేఘన్ మెర్కెల్! కొత్త పెళ్లి కూతురు. ప్రిన్స్ హ్యారీ భార్య. ఏడాదిగా మెర్కెల్ గురించిన విశేషాలు ధారావాహికగా వచ్చాయి. బ్రిటన్ అంటేనే పెద్ద దేశం. అలాంటి పెద్ద దేశంలో, పెద్దింటికి కోడలిగా వెళ్తున్న అమ్మాయి అంటే సహజంగానే ప్రపంచానికి ఈ ‘సాధారణ యువతి’ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. ఎలా ప్రేమలో పడిందీ, పెళ్లి ఎప్పుడు నిశ్చయం అయిందీ అనే విశేషాల నుంచి.. ఆమెకున్న కాలిగ్రఫీ (సొగసైన చేతిరాతలో నైపుణ్యం) హాబీ వరకు మెర్కెల్ గురించి ప్రతిదీ ప్రధానంగా ఆకర్షించే అంశమే అయింది. మొత్తానికి శనివారం మెర్కెల్, హ్యారీల వివాహం ‘నిరాడంబరమైన వైభవం’తో జరిగింది. మన దేశం నుంచి ఒకరిద్దరికి మాత్రమే పెళ్లి పిలుపు అందింది. ఆ ఒకరిద్దరి లో ముంబై మురికివాడల్లో ఉన్న ‘మైనా’ అనే స్వచ్ఛంద మహిళా సంస్థ ప్రతినిధులు కూడా ఉన్నారు! ఆత్మీయ అతిథిగా ‘మైనా’! ప్రిన్స్ చార్లెస్ డయానాను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లిని నేరుగా కానీ, టీవీల్లో కానీ కోట్లాది మంది చూశారు. ఇప్పుడు డయానా చిన్న కొడుకు హ్యారీ పెళ్లికి కూడా అంతే ప్రాధాన్యం లభించింది. యువరాజు పెళ్లిని ఇంట్లో పెళ్లిలా ఇష్టంగా చూశారు మన దేశ ప్రజలు. అదేస్థాయిలో ఈ పెళ్లి కోసం ఎదురు చూశారు కూడా. ముంబయి డబ్బావాలాలైతే.. తమకు తెలిసిన వాళ్లతో మెర్కెల్కు పైథానీ చీర, హ్యారీకి కుర్తా, తలపాగాను బహుమతిగా పంపించారు. ఇక విశిష్ట అతిథుల కేటగిరీలో ప్రియాంక చోప్రా పెళ్లికి వెళ్లొచ్చారు. ఆత్మీయమైన అతిథిగా పైన మనం చెప్పుకున్న ‘మైనా’ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా కూడా ఇన్విటేషన్ అందుకున్నారు. ఆహ్వానం ఎలా వచ్చింది? గత ఏడాది జనవరిలో మేఘన్ మెర్కెల్ ముంబయికి వచ్చి ధారవీ బస్తీ మహిళలతో, ‘మైనా’ ప్రతినిధులతో కలివిడిగా కూర్చుని కబుర్లాడి వెళ్లారు. ‘మైనా’ ప్రత్యేక ఆహ్వానంపై ముంబై వచ్చిన మెర్కెల్.. స్త్రీ సాధికారత దిశగా పనిచేస్తున్న ఈ మహిళల నుంచి స్ఫూర్తి పొందారు. రాయల్ వెడ్డింగ్కి ‘మైనా’ ప్రతినిధులకు ఆహ్వానం అందడానికి ఇదే ప్రధాన కారణం. యువరాజు పెళ్లికి ఆహ్వానం అందుకున్న ఏడు విదేశీ ఎన్జీవోలలో మన ‘మైనా’ ఒకటి. మెర్కెల్ ఇండియాకి రావడానికి కారణం 23 ఏళ్ల సుహానీ జలోటా. సుహానీ యు.ఎస్.లోని డ్యూక్ యూనివర్సిటీ స్టూడెంట్. చురుకైన విద్యార్థి. ఎంటర్ప్రెన్యూరియల్ ఫెలోషిప్లో భాగంగా ముంబైలో ‘మైనా మహిళా ఫౌండేషన్’ ప్రారంభించింది. రుతుక్రమ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత పట్ల మహిళలకు అవగాహన కల్పించడం, పేద మహిళలకు తక్కువ ధరకు శానిటరీ ప్యాడ్స్ అందించడం ఈ ఫౌండేషన్ ఉద్దేశం. ప్యాడ్స్ తయారీ యూనిట్లో పని చేసే 15 మంది, వాటిని పంపిణీ చేసే యాభై మంది కూడా స్థానిక బస్తీ మహిళలే. ‘మైనా’ ఉన్న ధారవి బస్తీ ఆసియాలోనే అతి పెద్దది. ఈ ఫెలోషిప్ ప్రాజెక్టుకు 2015లో ‘కాలేజ్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుంది సుహానీ. ఆ అవార్డుకి ఎంపికైన తొమ్మిది మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కో మెంటార్ను సూచించింది యూనివర్సిటీ. అలా సుహానీకి మెంటార్గా మెర్కెల్ వచ్చిందని అనుకుంటాం. కానీ కాదు! మెర్కెల్ ప్రత్యేక ఆసక్తి ఓ రోజు సుహానీ తన సహవిద్యార్థితోపాటు ఆమె మెంటార్ అయిన మెర్కెల్ని కలిసింది సుహానీ. ‘మైనా’ గురించి చెప్పినప్పుడు మెర్కెల్ ఎంతో ఆసక్తి చూపించారు. అలా మెర్కెల్ యు.ఎస్. నుంచి ముంబయి వచ్చారు. మైనా మహిళా ఫౌండేషన్లో శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న బస్తీ మహిళలను కలిశారు. వాళ్లకు సూచనలివ్వడంతోపాటు, చేయగలిగినంత సహాయం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారామె. పెళ్లి ఆహ్వానానికి నాంది ఆ పరిచయమే. పెళ్లికి వచ్చే వాళ్లు వధూవరులకు బహుమతులు ఇవ్వవద్దని, ఆ డబ్బును ఫౌండేషన్లకు విరాళంగా ఇవ్వమని యువరాజు హ్యారీ, మేఘన్ ముందే ఆçహూతులను కోరారు. రాయల్ వెడ్డింగ్కి మైనా మహిళా ఫౌండేషన్తోపాటు మరో ఆరు చారిటీలకు కూడా ఆహ్వానం అందింది. అవన్నీ స్థానిక బ్రిటిష్ చారిటీలే. ‘‘రాజకుటుంబంలో జరిగే వివాహానికి ఆహ్వానం అందడం ఫెయిరీ టేల్ స్టోరీలాగా ఉందని’’ మైనా మహిళా ఫౌండేషన్ ప్రతినిధి రిషా రోడ్రిగ్స్ పొంగిపోయారు. ఈ పెళ్లికి సుహానీ జలోటాతోపాటు మరో ముగ్గురు ‘మైనా’ మహిళలు కూడా బ్రిటన్కి వెళ్లారు. అరుదైన గౌరవం ఇది. -
సాహోరే.. క్యాబీ!
మేఘనా సాహును ‘నువ్వసలు ఆడదానివేనా?’ అన్నట్లు చూశారు. ఆ చూపును పట్టించుకోలేదు మేఘన. సమాధానం తనకు తెలియకపోతేనే కదా! చూపుల్ని వదిలి, మలుపుల్ని చూసుకుంది. స్టీరింగ్ అందుకుంది. ‘హాయ్ మేఘనా! నువ్వు అమ్మాయివా? అబ్బాయివా?’ సంశయంగా, సంకోచంగా అడిగింది లావణ్య. ‘అమ్మాయినే. ఒకప్పుడు మాత్రం అబ్బాయిని’.. ఇబ్బందిగా బదులిచ్చింది మేఘన. ‘ఏమో! అమ్మాయిలాగ డ్రస్ వేసుకుంటున్నావ్ కానీ నిన్ను చూస్తే అస్సలు అమ్మాయివి అనే అనిపించవు’.. అదోలా ముఖం పెట్టింది మరో కొలీగ్ ప్రవీణ. ‘నేను అమ్మాయిలా కనిపించినా, అబ్బాయిలా కనిపించినా మనం కలిసి పని చేయడానికి, కలిసి చేస్తున్న పనికీ అదేమీ ఇబ్బంది కాదు కదా’ అంది మేఘన. ఆ మాటను ఆమె స్థిరంగా అన్నప్పటికీ, ఆమె స్వరంలో సన్నటి బాధ చిగురుటాకులా వణికింది. చుట్టూ చూపుల ప్రశ్నలు లావణ్య, ప్రవీణ మౌనంగా ఉండిపోయారు. వెంటనే కంప్యూటర్లో ముఖం పెట్టేసి, తమ పనిలో మునిగిపోయారు. కొలీగ్స్ ఆ సంగతే మర్చిపోయి ఉండొచ్చు. మేఘన మనసును మాత్రం చెప్పలేనంత నిస్పృహ ఆవరించింది. అది ఫార్మా కంపెనీ. అందరూ చదువుకున్న వాళ్లే. అయినా తన పట్ల కొందరి ప్రవర్తనలో ఉండాల్సిన సభ్యత లోపించింది. అది ఏ ఫ్యాషన్ మాల్లో జారి పడిపోయిందో, కెరీర్ పరుగుల్లో అవసరం లేదని వాళ్లే వదిలేసుకున్నారో ఏమో తెలియదు. ఏది వదిలేసుకున్నప్పటికీ మంచికో చెడుకో పక్క మనిషి గురించిన ఆరా తీసే తత్వం మాత్రం వదిలిపోలేదు. ఇంటి నుంచి కాలు బయట పెట్టినప్పటి నుంచి మళ్లీ ఇల్లు చేరే వరకు మేఘనపై రకరకాల చూపులు. వాటిని తట్టుకోవడానికి ఆమె సిద్ధమైంది, ఆ చూపులకు అలవాటు పడిపోయింది కూడా. అయితే పరిచయం లేని వాళ్ల చూపులను పట్టించుకోవడం మానేసినంత తేలిక కాదు.. రోజూ సహోద్యోగుల నుంచి ఎదురయ్యే చూపుల వివక్షను ఎదుర్కోవడం. అవే ఇప్పుడు ప్రశంసలు అది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నగరం. స్విఫ్ట్ డిజైర్ కారులో డ్రైవింగ్ సీట్లో ఉంది మేఘనా సాహు! ఓలా కంపెనీతో టై అప్ అయిందా క్యాబ్. మేఘనను ఇప్పుడు ‘నువ్వు అమ్మాయివేనా’ అని అడిగేవాళ్లు లేరు. ఒంటరిగా క్యాబ్లో ప్రయాణిస్తున్న ఆడవాళ్లు ‘హమ్మయ్య ఫర్వాలేదు’ అని ఊపిరి పీల్చుకుంటున్నారు. మగవాళ్లు డ్రైవింగ్ సీట్ వైపు చూసి ‘మన నగరం కూడా జెండర్ ఫ్రీ అవుతోంది.. గుడ్’ అనుకుంటున్నారు. ఆ క్యాబ్ ఎక్కింది మీడియా పీపుల్ అయితే వెంటనే ‘క్యాబ్ నడుపుతున్న తొలి ట్రాన్స్జెండర్’ అని ఓ స్టోరీ రాసేస్తున్నారు. అలా మేఘన గురించి ఒడిశా పత్రికలు రాస్తున్నాయి. జాతీయ చానళ్లు ప్రసారం చేస్తున్నాయి. స్ఫూర్తి పొందడానికి చిన్న సంఘటన చాలు. అది సంతోషాన్నిచ్చేదయినా, మనసును గిచ్చి మెలిపెట్టేదయినా.. అని అనుకుంటూ ఉంటుంది మేఘన.. తన పాత ఉద్యోగంలో ఎదురైన ప్రశ్నల్ని తలచుకుని. మరొకరికి స్ఫూర్తినివ్వడానికి చిన్న పనైనా చాలు అనుకుంటోంది ఇప్పుడు. కొడుకు సాయిశుభమ్, భర్త వాసుదేవ్తో మేఘన.. తడబడితే నిలబడలేం మేఘనా సాహు ఎంబీఎ చదివింది. ఆ కోర్సు ఒక పనిని సమర్థంగా నిర్వహించడం ఎలాగో నేర్పిందామెకి. సమాజం నుంచి అంతకంటే పెద్ద పాఠం నేర్చుకుందామె.. ‘తడబడితే నిలబడలేం’ అని. జీవించడానికి తన గౌరవాన్ని పణంగా పెట్టాల్సిన పని లేదని కూడా తెలుసుకుంది. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్గా నెలకు ముప్పై వేలకు తక్కువ కాకుండా సంపాదిస్తోంది. ట్రాన్స్జెండర్ల పట్ల సానుభూతి, గౌరవం ఉన్న, ట్రాన్స్జెండర్ పీపుల్ హక్కుల కోసం పోరాడుతున్న వాసుదేవ్ యాక్టివిస్టును పెళ్లి చేసుకుంది. ఆరేళ్ల పిల్లాడికి తల్లిగా మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది మేఘనా సాహు. భర్తకు మొదటి భార్య వల్ల పుట్టిన కొడుకునే ఆమె తన కొడుకుగా పెంచుతోంది. భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత వాసుదేవ్కి మేఘనతో పరిచయం అయింది. ఆ పరిచయం పెళ్లిగా మారింది. - మంజీర నా కోసం.. సడలించారు! నాకు డ్రైవింగ్ లైసెన్స్ పెద్ద సమస్య అయింది. ట్రాన్స్జెండర్లకు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించలేదు. ఆర్టిఓ అధికారులు నా డ్రైవింగ్ స్కిల్స్ని ఒకటికి రెండు సార్లు పరీక్షించారు. డ్రైవర్గా మారాలనుకున్న నా నిర్ణయాన్ని పెద్ద మనసుతో గౌరవించి వారి విచక్షణాధికారంతో నిబంధనలను సడలించారు. – మేఘనా సాహు, క్యాబీ -
భారత మహిళల ‘ఎ’ జట్టు కెప్టెన్ మేఘన
ముంబై: ముక్కోణపు టి20 సిరీస్ సన్నాహాల్లో భాగంగా... ఇంగ్లండ్ మహిళల టి20 జట్టుతో జరిగే రెండు వార్మప్ మ్యాచ్ల్లో పాల్గొనే భారత మహిళల ‘ఎ’ జట్టును ప్రకటించారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన కెప్టెన్గా ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్కే చెందిన వికెట్ కీపర్ రావి కల్పన, హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డిలకు కూడా ఈ జట్టులో చోటు లభించింది. ఈనెల 18, 19వ తేదీల్లో ముంబైలో వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి. అనంతరం భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 22 నుంచి 31 వరకు ముక్కోణపు టోర్నమెంట్ జరుగుతుంది. భారత మహిళల ‘ఎ’ జట్టు: సబ్బినేని మేఘన (కెప్టెన్), వనిత, హేమలత, మోనికా దాస్, తరన్నుమ్ పఠాన్, ప్రియాంక ప్రియదర్శిని, అరుంధతి రెడ్డి, రావి కల్పన (వికెట్ కీపర్), రాధా యాదవ్, కవితా పాటిల్, శాంతి కుమారి, ప్రీతి బోస్, షెరాల్ రొజారియో, హర్లీన్. -
యువత ప్రశ్నిస్తే...
అనిల్ నెమలి, మేఘన జంటగా తారా నీలు కార్పొరేషన్ బ్యానర్పై అనురాగ్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఓ కొత్త చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్త సన్నివేశాన్ని శ్రీరామ్ క్లాప్ ఇచ్చారు. భూపతి రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. దాసరి కిరణ్ తొలి సన్నివేశాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సందర్భంగా హీరో అనిల్ మాట్లాడుతూ ‘‘డైరెక్ట్ అవుదాం అని రామానాయుడు స్టూడియోలో కోర్స్ చేశాను. అనురాగ్ గారికి మా నాన్నతో ఉన్న పరిచయంతో, ఆయన చెప్పిన కథ నచ్చడంతో హీరో అయ్యాను’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చిన అనురాగ్ గారికి థాంక్స్’’ అన్నారు మేఘన. ‘‘ఈ సినిమాకు కథ, మాటలు, సంగీతం, నిర్మాణం, దర్శకత్వం నేనే చేస్తున్నాను. దేశ ఆర్ధిక వ్యవస్థ కుంటుపడింది. యువత సోషల్ మీడియాతో బిజీ అయిపోయింది. యువత ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందించనున్నాం. అనిల్, మేఘనను హీరో హీరోయినుగా పరిచయం చేస్తున్నాను. నలుగురు కుర్రాళ్లు బాంబ్ బ్లాస్ట్ నుంచి ప్రజల్ని ఎలా కాపాడార న్నదే సినిమా కథాంశం’’ అన్నారు అనురాగ్. -
కోలేటి దామోదర్ కూతురి పెళ్లిలో సీఎం కేసీఆర్
-
అర్జున్రెడ్డికి మించి...
షఫీ, లక్కీ ఏకరీ, సాయికిరణ్, పూజశ్రీ, మేఘన, జ్యోతికయాదవ్ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘నందికొండ వాగుల్లోన’. సత్యనారాయణ ఏకరీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రఘు.హెచ్ ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ని, నవనీత్ స్వరపరచిన పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సమర్పకులు సాయి వెంకట్, షిరాజ్ మాట్లాడుతూ– ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. ‘అర్జున్రెడ్డి’ సినిమాలో కంటే ఎక్కువ కంటెంట్ ఉంటుంది. ముఖ్యంగా బి, సి సెంటర్స్లో బాగా ఆడుతుందని నమ్ముతున్నాం. మార్చి 2న సినిమాను విడుదల చేయాలనుకున్నాం. కానీ, థియేటర్ల బంద్ కారణంగా రిలీజ్ చేయడం లేదు. మంచి డేట్ చూసుకొని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఎ సర్టిఫికెట్ వచ్చిన సినిమానా? అనుకోకండి. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు సత్యనారాయణ. ‘‘మా సినిమా రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన సాయివెంకట్, ఆర్.కె. గౌడ్గార్లకు ధన్యవాదాలు’’ అని నిర్మాత రఘు అన్నారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఆర్.కె. గౌడ్ పాల్గొన్నారు. -
మేఘనా ఆత్మహత్యకేసులో ఐదుగురిపై కేసు
బనశంకరి: తరగతి ఎన్నికల్లో ఓటమి పాలై తోటి విద్యార్థు చేతిలో ర్యాగింగ్కు గురై ఆత్మహత్యకు పాల్పడిన కుమారస్వామి లేఔట్లోని దయానందసాగ కళాశాల విద్యార్థిని మేఘన కేసులో ఇద్దరు విద్యార్థినులతోసహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేఘనా క్లాస్ విభాగం చీఫ్ రాజకుమార్, సహవిద్యార్థులైన సౌధామిని, సందీప్, నిఖిల్, సంధ్యపై ఆత్మహత్య ప్రేరిపిత చట్టం కింద రాజరాజేశ్వరినగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కు హాజరుకావాలని నోటీస్ జారీచేశారు. అయితే నిందితులు పరారీలో ఉండటంతో కుటుంబసభ్యులకు పోలీసులు నోటీసులు జారీచేసినట్లు డీసీపీ ఎంఎన్.అనుచేత్ తెలిపారు. ర్యాగింగ్వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నలుగురు యువతులు, ఎనిమిది యువకులబృందం కాలేజీ ఆవరణలో మేఘనా తో గొడవపడ్డారని, ఈ దృశ్యాన్ని ప్రత్యర్థి వర్గ విద్యార్థి బృందం మోబైల్లో వీడీయో తీశారన్నారు. దీనిని ప్రశ్నించినందుకు సదరు విద్యార్థులు మేఘనపై దాడి చేసినట్లు వీడియో ఫుటేజ్ల్లో ఉందన్నారు. అదేవిధంగా ప్రత్యర్థి విద్యార్థులు గుమికూడి ర్యాగింగ్ ఎలా చేయాలనే విషయంపై చర్చించిన వీడియోలు తమకు లభ్యమైనట్లు ఆయన తెలిపారు. ఈ రెండు వీడియోలను ల్యాబ్కు పంపామని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరిచర్యలు తీసుకుంటామని తెలిపారు. ర్యాగింగ్ జరగలేదని కాలేజీపాలకమండలి చెబుతుండగా మరో వైపు ఈ వీడియోలు వెలుగు చూశాయన్నారు. కాలేజీ పాలకమండలి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు విచారణలో వెలుగుచూస్తే వారిపై ప్రత్యేక కేసు నమోదు చేస్తామన్నారు. -
మేఘన ర్యాగింగ్ వీడియో హల్చల్
యశవంతపుర : ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థిని మేఘనను ర్యాగింగ్ చేస్తున్న రెండు వీడియోలో బయటపడ్డాయి. దీంతో కర్ణాటక మహిళ కమిషన్ మేఘన ఆత్మహత్య కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. గురువారం ఉదయం మేఘన ను ర్యాగింగ్ చేస్తున్న రెండు వీడియోలు వైరల్ అయ్యాయి. మొదట మేఘన ఆత్మహత్యకు, కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్న దయానంద సాగర కళాశాల యాజమాన్యం, కళాశాల ఆవరణలో మధ్యాహ్నం మేఘనను తోటి విద్యార్థిని, విద్యార్థులు అవమానంగా మాట్లాడటం, దుర్భాషలాడటం, దాడి చేయడానికి యత్నించిన వీడియోలు బయటపడ్డాయి. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా హల్చల్ చేస్తున్నాయి. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి మొబైళ్లను తీసుకుని పరిశీలించగా ర్యాగింగ్ దృశ్యాలు బయటపడినట్లు విచారణలో తేలింది. దీంతో మేఘన తల్లిదండ్రులకు బలం చేకూరింది. మేఘన ఆత్మహత్యకు కారణమైన విద్యార్థులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తోటి విద్యార్థినిని అమర్యాదగా మాట్లాడటం సిగ్గుచేటు: మహిళా కమిషన్ చైర్పర్సన్ తోటి విద్యార్థినిని సహచరులే అమర్యాదగా మాట్లాడటం సిగ్గు చేటని మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి అన్నారు. ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేస్తున్నట్లు చెప్పారు. -
రిజల్ట్ కోసం వెయిటింగ్
మేఘన, సంతోషి, సల్మాన్ ప్రధాన పాత్రల్లో కృష్ణకార్తీక్ దర్శకత్వంలో హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘హ్యాక్డ్ బై డెవిల్’ (హెచ్బిడి). ఉదయ్భాస్కర్. వై నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో కృష్ణకార్తీక్ మాట్లాడుతూ– ‘‘హెచ్బిడి’ నా మొదటి సినిమా. చాలా ఉద్వేగంతో ఉన్నా. పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నా. మా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘కృష్ణకార్తీక్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ఆయనకి ఇది తొలి చిత్రమైనా బాగా తెరకెక్కించారు. ఈ సినిమా తర్వాత రెగ్యులర్గా సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు నిర్మాత ఉదయ్భాస్కర్. సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, నిర్మాతలు టి.రామ సత్యనారాయణ, రాజ్ కందుకూరి, సాయి వెంకట్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహి మదన్ యం.యం, కెమెరా: కన్నా కోటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ గౌడ్ వై. -
భారత్ ‘ఎ’ జట్టులో మేఘన
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ‘ఎ’ మహిళల క్రికెట్ జట్టుతో స్వదేశంలో జరిగే వన్డే, టి20 మ్యాచ్ల సిరీస్లో పాల్గొనే భారత ‘ఎ’ జట్లను ప్రకటించారు. రెండు ఫార్మాట్లలో అనూజా పాటిల్ కెప్టెన్గా వ్యవహరిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆల్రౌండర్ సబ్బినేని మేఘన వన్డే, టి20 జట్లలో స్థానాన్ని సంపాదించింది. 21 ఏళ్ల మేఘన ఇప్పటివరకు భారత్ తరఫున ఆరు టి20 మ్యాచ్ల్లో ఆడింది. ఇటీవలే బీసీసీఐ అండర్–19 టోర్నమెంట్లో డబుల్ సెంచరీ సాధించిన 16 ఏళ్ల ముంబై అమ్మాయి జెమీమా రోడ్రిగ్స్కు కూడా ఈ రెండు జట్లలో చోటు లభించడం విశేషం. డిసెంబరు 2, 5, 7వ తేదీల్లో జరిగే మూడు వన్డేలకు హుబ్లీ... 12, 14, 16వ తేదీల్లో జరిగే మూడు టి20 మ్యాచ్లకు బెల్గామ్ ఆతిథ్యం ఇస్తాయి. అంతకుముందు ఈనెల 26, 28వ తేదీల్లో అలూర్లో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతుంది. -
దెయ్యం హ్యాక్ చేస్తే..!
మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమాజ, మానస, అజయ్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘హెచ్.బి.డి.’ (హ్యాక్డ్ బై డెవిల్). కృష్ణ కార్తీక్ దర్శకత్వంలో వై.ఉదయ్ భాస్కర్ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ– ‘‘పక్కా థ్రిల్లర్ మూవీ ఇది. చిన్న నిర్మాతలు సినిమాలు తీయడం మానేస్తే సినీ పరిశ్రమ ఎంతో చిన్నదైపోతుంది. చిన్న చిత్రాలను అందరూ ఎంకరేజ్ చేయాలి. ఈ నెల 25న మా బ్యానర్లో మరో కొత్త సినిమా ప్రారంభమవుతుంది’’ అన్నారు. ‘‘మొదటి సినిమానే ప్రయోగాత్మకమైన కథతో చేయాలని నిర్మాతలు కోరడంతో హెచ్.బి.డి. తెరకెక్కించాం. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. నా రెండో సినిమా కూడా ఈ బ్యానర్లోనే త్వరలో ప్రారంభం అవుతుంది’’ అన్నారు కృష్ణకార్తీక్. సంగీత దర్శకుడు మహి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్కుమార్ గౌడ్ పాల్గొన్నారు. -
బిలాల్పూర్లో...
శ్రీనాథ్ మాగంటి, మేఘన జంటగా నాగసాయి మక్కం దర్శకత్వంలో మహంకాళి శ్రీనివాసులు నిర్మిస్తున్న చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్స్టేషన్’. జగ్గిలొల్లి అనేది ఉపశీర్షిక. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ‘‘బిలాల్పూర్ పోలీస్స్టేషన్ చుట్టూ తిరిగే ఈ కథలో లవ్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సమతూకంగా ఉంటాయి. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో అల్లుకున్న కథ ఇది. ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది’’ అన్నారు నాగసాయి. ‘‘పోలీస్ నేపథ్యంలో వచ్చే ఫార్ములా సినిమాలకు మా చిత్రం భిన్నంగా ఉంటుంది. ఇలాంటి కథను ఇంత వరకు స్క్రీన్పై చూసి ఉండరు’’అన్నారు శ్రీనివాసులు. -
ఘనంగా చిరంజీవి సర్జా, మేఘన నిశ్చితార్థం
శాండిల్వుడ్కు చెందిన మరో జంట పెళ్ళి పీటలు ఎక్కడానికి సిద్ధమైంది. వెండితెరపై హీరో హీరోయిన్లుగా రొమాన్స్ పండించిన జంటలు నిజ జీవితంలోనూ సంసార బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. ఈ ట్రెండ్ ఇటీవలి కాలంలో బాగా పెరగడం విశేషం. సాక్షి, బెంగళూరు : కన్నడ నటుడు చిరంజీవి సర్జా, నటి మేఘనా రాజ్ల నిశ్చితార్థం ఆదివారం బెంగళూరు జేపీనగరలో ఉన్న మేఘనారాజ్ నివాసంలో సంప్రదాయబద్ధంగా జరిగింది. నటుడు, దర్శకుడు అయిన అర్జున్సర్జాతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి సర్జా కాబోయే వధువు మేఘనారాజ్ ఇంటికి వచ్చారు. అర్జున్సర్జా భార్య ఆశారాణి, పిల్లలు ఐశ్వర్య సర్జా, ధృవసర్జాతో పాటు కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. చిరంజీవి సర్జా కుటుంబ సభ్యులకు మేఘనా ఇంట్లోకి పూలహారం వేసి స్వాగతం పలికారు. హిందూ సంప్రదాయంలో కొత్త జంట ఉంగరాలు మార్చుకున్నారు. మేఘనారాజ్ ఎరువు రంగు చీరలో, చిరు సర్జా వైట్ షర్ట్, వైట్ పంచలో కనిపించారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు బెంగళూరు నగరంలో ఉన్నలీలా ప్యాలెస్లో బంధువులు, సన్నిహితులతో విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో గులాబీ రంగులో గౌనులో మేఘనా, నీలం రంగు లైట్ చెక్స్ ఉన్న షర్ట్లో చిరు దర్శనమిచ్చారు. ఉభయులూ నట ప్రముఖులే సీనియర్ సినీనటులైన సుందర్రాజ్, ప్రమీలా జోషాయ్ దంపతుల కుమార్తె అయిన మేఘనారాజ్.. పుండ అనే కన్నడ సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. మలయాళం సినిమాల్లో మంచి పేరును తెచ్చుకోవడం జరిగింది, తెలుగు, తమిళ సినిమాల్లో కూడా సినిమాల్లో నటించారు. కన్నడలో రాకింగ్ స్టార్ యశ్తో నటించిన రాజాహులి సినిమా ద్వారా మేఘనారాజ్కు మంచి పేరు సంపాదించారు. బహుపరాక్, లక్ష్మణ, అల్లమ యశస్వీ తదితర సినిమాల్లో ఆమె హీరోయిన్గా నటించారు. ఆటగార సినిమాలో మేఘనారాజ్, చిరంజీవి సర్జా ఇద్దరు జంటగా నటించడం విశేషం. ప్రముఖ నటుడు అర్జున్సర్జా సోదరి కుమారుడే చిరంజీవి సర్జా. వాయుపుత్ర సినిమా ద్వారా కన్నడ సినిమాల్లోకి అడుగు పెట్టిన చిరు సర్జా, అనంతరం గండెదె, చిరు, దండం దశగుణం, వదర నాయక, రుద్రతాండవ తదితర పలు కన్నడ సినిమాల్లో హీరోగా నటించారు. -
శ్రియ, మేఘన ముందంజ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ ఐసీఎస్ఈ–ఐఎస్సీ స్కూల్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఈవెం ట్లో ఎ. శ్రియ, జి. మేఘన ముందంజ వేశారు. చాదర్ఘాట్లోని విక్టరీ ప్లేగ్రౌండ్లో సోమవారం జరిగిన అండర్–17 బాలికల సింగిల్స్లో సెయింట్ జోసెఫ్ (కింగ్కోఠి)కు చెందిన శ్రియ 15–5, 15–5తో వరహాల చెట్టి (విశాఖపట్నం)పై గెలిచింది. మిగతా మ్యాచ్ల్లో మేఘన (ఎఫ్కేఎస్, రాజమండ్రి) 15–0, 15–3తో నయన (గీతాంజలి, సికింద్రాబాద్)పై విజయం సాధించగా, అన్షు రెడ్డి (సెయింట్ జోసెఫ్) 15–2, 15–4తో అమీన సుల్తానా (ఎన్ఏఎస్ఆర్)ను ఓడించింది. సాయి శ్రియ (ఎఫ్కేఎస్, రాజమండ్రి) 15–0, 15–1తో డైసి మిట్ట (అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్)పై నెగ్గింది. అండర్–17 బాలుర సింగిల్స్లో మహేశ్ (సెయింట్ జోసెఫ్, కింగ్కోఠి) 15–6, 15–7తో సాయి నితిన్ (హెరిటేజ్ వ్యాలీ)పై, గుణ కార్తీక్ (ఎఫ్కేఎస్, రాజమండ్రి) 15–3, 15–8తో త్రిపాఠి మనోజ్ రెడ్డి (సెయింట్ జోసెఫ్, కింగ్కోఠి)పై గెలుపొందారు. శ్రీకర్ (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్) 15–6, 15–10తో శాండిల్య (షేర్వుడ్)పై విజయం సాధించాడు. -
మేఘన, శ్రుతి ‘ట్రిపుల్’
సాక్షి, హైదరాబాద్: జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో మేఘనా రెడ్డి (గోపీచంద్ అకాడమీ), డీవీ శ్రుతి మూడేసి టైటిళ్లు కైవసం చేసుకున్నారు. బాలికల సింగిల్స్ విభాగంలో మేఘన అండర్–15, 17, 19 టైటిళ్లు సాధించగా.. శ్రుతి అండర్–13 సింగిల్స్, డబుల్స్తోపాటు అండర్–15 డబుల్స్ టైటిళ్లు సొంతం చేసుకుంది. బుధవారం ముగిసిన ఈ టోర్నీలో మేఘన అండర్–15 విభాగంలో 21–14, 10–21, 21–16తో అభిలాష (వీబీఏ)పై, అండర్–19 ఫైనల్స్లో పూర్వీ సింగ్ (ఎల్బీ స్టేడియం)పై విజయం సాధించింది. అండర్–17 ఫైనల్ మ్యాచ్లో 21–14, 8–2తో మేఘన ఆధిక్యంలో ఉండగా... అభిలాష మ్యాచ్ నుంచి వైదొలిగింది. దీంతో మేఘన విజేతగా నిలిచింది. అండర్–13 సింగిల్స్ విభాగంలో శ్రుతి 15–21, 21–18, 24–22తో శ్రేష్ఠ రెడ్డి (ఎల్బీ స్టేడియం)పై గెలుపొందింది. శ్రుతి–డీవీ లయ జోడీ అండర్–13 డబుల్స్ ఫైనల్ మ్యాచ్లో 21–13, 21–11తో తేజస్వి–శ్రేష్ఠ రెడ్డి జోడీపై, అండర్–15లో 21–19, 21–11తో వైష్ణవి– మృతిక జంటపై గెలిచి విజేతలుగా నిలిచింది. బాలికల అండర్–17 డబుల్స్ ఫైనల్స్లో కే. మేఘన–అను సోఫియా ద్వయం 25–23, 21–17తో వైష్ణవి–మృతికపై, అండర్–19 ఫైనల్స్లో పూర్వీ సింగ్–చక్రయుక్తారెడ్డి జోడీ 21–8, 21–11తో మౌన్య శ్రీ–నిపుణ జోడీపై విజయం సాధించారు. మహిళల సింగిల్స్లో పూజ (ఎల్బీ స్టేడియం) 21–13, 11–21, 21–19తో ప్రణాలి కర్ణి (ఎల్బీ స్టేడియం)పై, మహిళల డబుల్స్ ఫైనల్లో పూజ–ప్రణాలి కర్ణి (ఎల్బీ స్టేడియం) జోడి 21–7, 21–7తో వైష్ణవి–వర్ణిత జోడీపై గెలిచి టైటిల్స్ సాధించారు. బాలుర ఫలితాలు: అండర్–13 సింగిల్స్: లోకేశ్ రెడ్డి (వీబీఏ) 21–7, 21–6తో జయ ఆదిత్యపై; డబుల్స్: మేఘాంశ్ ఆనంద్–శ్రావణ్ కుమార్ (వీబీఏ) జోడీ 21–16, 21–14తో రామ్–జయ ఆదిత్య (వీబీఏ) జంటపై గెలిచింది. అండర్–15 సింగిల్స్: లోకేశ్ రెడ్డి 18–21, 21–13, 21–8తో తారక్ శ్రీనివాస్పై; డబుల్స్: తారక్ శ్రీనివాస్–వర్షిత్ రెడ్డి జోడీ 15–21, 21–18, 21–20తో శశాంక్ సాయి–శ్రీనివాసరావు జోడీపై నెగ్గింది. అండర్–17 తరుణ్ రెడ్డి 21–19, 21–20తో మనీశ్ కుమార్ (గోపీచంద్ అకాడమీ)పై; డబుల్స్: అనికేత్ రెడ్డి–తరుణ్ రెడ్డి జోడీ 21–19, 18–21, 21–7తో సాయి పృథ్వీ–రోహిత్ రెడ్డి (వీబీఏ)జోడీపై విజయం సాధించింది. అండర్–19 ఆదిత్య గుప్తా (ఎల్బీ స్టేడియం) 21–11, 21–12తో అనికేత్ రెడ్డి (వీబీఏ)పై; డబుల్స్: సాయి రోహిత్–ఆకాశ్ చంద్రన్ (గోపీచంద్ అకాడమీ) జోడీ 21–11, 21–14తో భవధీర్–ప్రేమ్ చౌహాన్ జంటపై గెలిచింది. పురుషులు సింగిల్స్: ఎన్వీఎస్ వీజేత (ఎల్బీ స్టేడియం) 21–18, 21–18తో సాయం బోత్రా (ఎల్బీ స్టేడియం)పై; డబుల్స్: సాయి రోహిత్– ఆకాశ్ చందన్ర్ ద్వయం 21–10, 21–13తో నిఖిల్ రెడ్డి– సాయం బోత్రా జంటపై నెగ్గింది. పురుషులు 45+ సింగిల్స్: కమలాకర్ 21–6, 21–6తో వెంకటేశ్పై; డబుల్స్: రవి కిరణ్– వెంకటేశ్ జోడీ 21–6, 21–9తో శ్రీరామ్–ఆంజనేయులు జంటపై విజయం సాధించింది. -
సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మేఘన
సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో హైదరాబాద్ అమ్మారుు మేఘన క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. విజయవాడలో జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం జరిగిన అండర్-13 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో మేఘనారెడ్డి (తెలంగాణ) 22-20, 21-14తో శివంగి సింగ్ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందింది. మరో మ్యాచ్లో శ్రీయ (తెలంగాణ) 13-21, 9-21తో అనుపమ ఉపాధ్యాయ (ఉత్తరాఖండ్) చేతిలో పరాజయం పాలైంది. అంతకుముందు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్ల్లో మేఘన 21-11, 21-10తో ప్రియాంక పంత్ (మధ్యప్రదేశ్)పై, శ్రీయ (తెలంగాణ) 21-13, 21-19, 21-19తో జర్లిన్ అనికా (తమిళనాడు)పై నెగ్గారు. బాలుర మూడో రౌండ్ మ్యాచ్ల్లో సారుువిష్ణు పుల్లెల (తెలంగాణ) 21-19, 21-8తో జోమి సింగమ్ (మణిపూర్)పై, ప్రణవ్ రావు (తెలంగాణ) 21-8, 21-9తో హర్షిత్ సేతి (రాజస్థాన్)పై నెగ్గి ప్రిక్వార్టర్స్కు చేరుకున్నారు. అండర్-15 బాలికల మూడో రౌండ్ మ్యాచ్ల్లో సామియా ఇమాద్ ఫరూఖి (తెలంగాణ) 21-14, 21-8తో ముస్కాన్ రాథోడ్ (మధ్యప్రదేశ్)పై, భార్గవి (తెలంగాణ) 21-12, 21-16తో కోశా లిలె (గుజరాత్)పై, కేయూర (తెలంగాణ) 21-10, 21-9తో తస్నీమ్ మీర్ (గుజరాత్)పై గెలుపొందారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్ల విజేతలు అండర్-13 బాలుర డబుల్స్: ప్రణవ్ రావు- సాయి విష్ణు (తెలంగాణ) జంట 21-14, 21-5తో అయాన్- అయాద్ రషీద్ (అస్సాం) జోడీపై, ధర్మాజ్ఞ (తెలంగాణ)- రుషేంద్ర (ఏపీ) జంట 21-1, 21-8తో జోయ్ చటర్జీ- రోనక్ నేగి (జార్ఖండ్) జోడీపై, రవి ఉత్తేజ్- నిక్షిప్త్ (తెలంగాణ) జంట 21-9, 21-8తో ఖర్బూలి- లావన్బియాంగ్ వన్నింగ్ (మణిపూర్) జోడీపై, వంశీకృష్ణ (ఏపీ)- ఉనీత్కృష్ణ (తెలంగాణ) జంట 21-7, 21-5తో యశ్రాజ్ బిశ్వాల్- ప్రియాన్షు మెహంతి (ఓడిశా)పై గెలిచాయి. బాలికల డబుల్స్: మేఘన (తెలంగాణ)- తస్నీమ్ మీర్ (గుజరాత్) జంట 21-1, 21-3తో నుపుర్ (గుజరాాత్)- ఖామ్సెంగ్ రాజ్కుమారి (అస్సాం) జోడీపై, శ్రీయ (తెలంగాణ)- ప్రవీణ (తమిళనాడు) జంట 21-14, 21-11తో రియా- సహన్య కులకర్ణి (మహారాష్ట్ర) జోడీపై గెలుపొందాయి. అండర్-15 బాలికల డబుల్స్: భార్గవి- కైవల్య లక్ష్మి (తెలంగాణ) జంట 21-4, 21-7తో ప్రియా దేవి- సోనియా (మణిపూర్) జోడీపై, కేయూర (తెలంగాణ)- కవిప్రియ (పంజాబ్) జంట 21-7, 21-9తో మంద్రిత- ఉత్సవ (వెస్ట్ బెంగాల్) జోడీపై నెగ్గాయి. -
రెండోరౌండ్లో కైవల్య లక్ష్మి, మేఘన
జాతీయ సబ్జూనియర్ బ్యాడ్మింటన్ సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ అమ్మారుులు కైవల్యలక్ష్మి, మేఘన శుభారంభం చేశారు. విజ యవాడలో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన అండర్-15 బాలికల తొలి రౌండ్లో కైవల్య లక్ష్మి 21-11, 21-15తో అవంతిక (ఉత్తరప్రదేశ్)పై, మేఘన 21-9, 21-8త రాధికపై, అభిలాష (తెలంగాణ) 21-8, 21-14తో మమైక్యా లంక (ఏపీ)పై గెలిచారు. బాలుర విభాగంలో రెండోరౌండ్ మ్యాచ్ల్లో రితిన్ (తెలంగాణ) 21-18, 21-17తో వరుణ్పై గెలుపొందాడు. అండర్-13 బాలికల తొలిరౌండ్ మ్యాచ్ల్లో ఆశ్రీత (తెలంగాణ) 21-8, 21-6తో మీనా (రాజస్థాన్)పై, శ్రీనిత్య (తెలంగాణ) 21-12, 23-21తో డోల్మపై విజయం సాధిం చారు. బాలుర తొలిరౌండ్ మ్యాచ్ల్లో సాహస్ (తెలంగాణ) 21-10, 21-15తో జయేశ్ (ఛత్తీస్గఢ్)పై, అనిరుధ్ (తెలంగాణ) 21-11, 21-19తో జీత్ పటేల్ (గుజరాత్)పై, ఉనీత్ కృష్ణ 21-15, 21-14తో అస్మిత్ (ఛత్తీస్గఢ్)పై నెగ్గారు. -
విజయం విండీస్దే..
సొంతగ్రౌండ్లో తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన స్థానిక క్రికెటర్ సబ్బినేని మేఘన ప్రేక్షకులను నిరాశపరిచింది. మూలపాడులో వెస్టిండీస్ మహిళ జట్టుతో ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో తనదైన శైలిలో దూకుడుగా ఆడి 17 పరుగులకే విండీస్ బౌలిర్ మ్యాథ్యూస్ చేతిలో ఎల్బీగా చిక్కి పెవిలిన్ పట్టింది. మంధన, మేఘన ఇద్దరూ ఓపెనింగ్కు దిగగా, విండీస్ బౌలర్ల ధాటికి తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. విండీస్ జట్టు మూడింటిలో వరుసగా రెండు టీ20 మ్యాచ్లు గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది. ఆదివారం కావడంతో ప్రేక్షకులు భారీగా వచ్చారు. మేఘన ఆట కోసం స్కూల్ బ్యాండ్తో సహా పెద్ద సంఖ్యలో విద్యార్థులు మ్యాచ్ను తిలకించేందుకు వచ్చారు. ప్లకార్డులు పట్టుకుని జేజేలు పలికారు. విండీస్ స్కిప్పర్ స్టెఫాన్ టేలర్ రెండో మ్యాచ్లో కూడా రాణించి జట్టును విజయంపథం వైపు మళ్లించింది. మొదటి నుంచీ నిలకడగా రాణిస్తూ స్థానిక ప్రేక్షకుల మనసు దోచుకున్న వేద కృష్ణమూర్తి ఐదు పరుగులకే పెవిలియన్ పట్టడంతో మ్యాచ్పై ఆశలు ఆవిరయ్యాయి. భారత జట్టులో స్కిపర్ హర్మన్ ప్రీత్కౌర్ కాస్త రాణించినా మిగిలిన వారంతా కూలబడటంతో స్వల్ప లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. మంగళవారం చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. - విజయవాడ స్పోర్ట్స్ -
మేఘన డబుల్ ధమాక
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సబ్జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి మేఘన ఆకట్టుకుంది. కర్నూలులో జరిగిన ఈ టోర్నీలో అండర్-13 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో మేఘన (తెలంగాణ) 13-21, 21-11, 21-18తో అనుపమా ఉపాధ్యాయ (ఉత్తరప్రదేశ్)పై గెలుపొందింది. డబుల్స్ విభాగంలో మేఘన (తెలంగాణ)- తస్నీమ్ మీర్ (గుజరాత్) ద్వయం 22-20, 21-19తో శ్రేయ (తెలంగాణ)- ప్రవీణ (తమిళనాడు) జోడీని ఓడించి టైటిల్ను కై వసం చేసుకుంది. బాలుర సింగిల్స్ విభాగంలో శంకర్ ముత్తుసామి (తమిళనాడు) 19-21, 21-11, 21-10తో ఆకాశ్ సింగ్ (ఉత్తరప్రదేశ్)పై నెగ్గగా... డబుల్స్ విభాగంలో వంశీకృష్ణ (ఏపీ)- ఉనీత్ కృష్ణ (తెలంగాణ) ద్వయం 21-16, 21-13తో సతక్ష్ సింగ్ (ఢిల్లీ)- సారుు సర్వేశ్ (పంజాబ్) జోడీపై గెలుపొందింది. అండర్-15 కేటగిరీలో బాలుర సింగిల్స్ ఫైనల్లో సారుుచరణ్ (ఏపీ) 21-16, 21-13తో ఆయూష్ రాజ్ (ఉత్తరప్రదేశ్)పై, బాలికల సింగిల్స్లో రిచా ముక్తిబోధ్ (కర్నాటక) 21-12, 21-12తో మేధ శశిధరణ్ (కర్నాటక)పై గెలుపొందారు. డబుల్స్ విభాగంలో ఎడ్విన్ జాయ్- అరవింద్ సురేశ్ (కేరళ) ద్వయం 21-16, 21-18తో బిద్యాసాగర్- పున్షిబా యెంగ్కోమ్ (మణిపూర్)జోడీపై విజయం సాధించింది. బాలికల డబుల్స్లో కేయూర (తెలంగాణ)-కవిప్రియ (పంజాబ్)జంట 21-15, 21-12తో తన్యా హేమంత్- కీర్తన (కర్నాటక) జోడీని ఓడించి విజేతగా నిలిచింది. -
రెండో రౌండ్లో ఆర్నిరెడ్డి, మేఘన
సాక్షి, హైదరాబాద్: చాంపియన్షిప్ సిరీస్ అండర్- 16 టెన్నిస్ టోర్నమెంట్లో ఆర్నిరెడ్డి, మేఘన ముందంజ వేశారు. బోరుున్పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్లో శనివారం జరిగిన బాలికల తొలిరౌండ్లో మేఘన (తెలంగాణ) 7-4తో జయకృష్ణ ఆరాధన (తమిళనాడు)పై, ఆర్నిరెడ్డి (తెలంగాణ) 7-4తో ఖుషీరావుపై విజయం సాధించారు. బాలుర విభాగంలో రిత్విక్ 7-2తో నివాస్పై గెలుపొందగా... కనిష్క్ పాండే (తెలంగాణ) 2- 7తో శ్రీవాత్సన్ (కర్నాటక)చేతిలో ఓడాడు. ఇతర మ్యాచ్ల ఫలితాలు బాలురు: అర్నవ్ కుమార్ 7-6 (5)తో ఆదిత్యపై, యశోదన్ 7-2తో విధుర్పై, అర్జున్ గొల్లపూడి 7-2తో వర్షిత్ కుమార్పై, ప్రతినవ్ 7-1తో రిషి చక్రపై విజయం సాధించారు. బాలికలు: పావని 7-0తో రచెల్ ఏంజెలాపై, కుంకుమ్ 7-1తో అభిషితా రెడ్డిపై, మృదుల 7-0తో నిర్ణయ సురాపూర్పై గెలుపొందారు. -
రాణించిన కేయూర, మేఘన
► రాష్ట్రస్థాయి జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో హైదరాబాద్ అమ్మాయిలు కేయూర, మేఘన అండర్-17, అండర్- 19 విభాగాల్లో రాణించారు. గురువారం జరిగిన అండర్-19 బాలికల సింగిల్స్ రెండో రౌండ్లో కేయూర 15-18, 15-17, 15-12తో అభిలాషపై, మేఘన 15-13, 15-12తో దివ్యపై విజయం సాధించారు. మరో మ్యాచ్లో మమత 11-15, 15-12, 15-10తో వన్షికపై గెలుపొందింది. బాలుర సింగిల్స్ తొలిరౌండ్లో లోహిత్ 15- 10, 15-6తో రిషికేశ్పై, అనురాగ్ దాస్ 15-12, 15-6తో ప్రణీత్ రెడ్డిపై, తరుణ్ రెడ్డి 15-5, 15-10తో శ్రేయ్ సింగ్పై నెగ్గారు. అండర్-17 బాలికల తొలిరౌండ్ మ్యాచ్ల్లో కేయూర 17-15, 15-9తో సుప్రియపై, దివ్య 15-7, 15-9తో రూహిపై, మేఘన 15-6, 15-11తో కావ్యపై, వన్షిక 15-10, 15-9తో ఇషితపై విజయం సాధించారు. బాలుర రెండోరౌండ్ మ్యాచ్ల్లో మహితేజ 15-8, 15-12తో తరుణ్ కుమార్పై, సుదీశ్ వెంకట్ 15-5, 15-5తో మణిశర్మపై, ప్రేమ్ 8-15, 15-9, 15-10తో ఆదిత్య గుప్తాపై, విఘ్నేశ్ 15-9, 15-10తో ఉదయ్పై, ప్రణీత్ 15-13, 15-12తో ప్రమోద్పై, సూర్యకిరణ్ 15-10, 15-13తో సాయి పృథ్వీపై, యశ్వంత్ రామ్ 13-15, 15-9తో అనురాగ్ దాస్పై, సాకేత్ 10-15, 15-8,15-7తో వినయ్పై, తరుణ్ రెడ్డి 15-11, 15-9తో రోహిత్ రెడ్డిపై, శశాంక్ 15-13, 15-12తో శ్రీకర్పై, ధనిక్ 15-9, 15-13తో గణేశ్ సాయిపై, భవ ధీర్ 15-10, 15-13తో అబ్దుల్ రహీమ్పై గెలుపొందారు. -
ఐపీఎస్ అధికారిపై భార్య ఫిర్యాదు
చెన్నై : భర్త తనను వరకట్నపు వేధింపులకు గురిచేస్తున్నట్లు ఐపీఎస్ అధికారిపై భార్య డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. చెన్నై పోలీసు డిప్యూటీ కమిషనర్గా ఐపీఎస్ అధికారి సంతోష్కుమార్ పనిచేస్తున్నారు. ఇతని భార్య మేఘనాకుమార్. ఈమె చెన్నై మెరీనాబీచ్లోని డీజీపీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీపీ టికె రాజేంద్రన్ అందుకున్నారు. ఫిర్యాదు అందజేసిన తర్వాత మేఘనాకుమార్ విలేకరులతో మాట్లాడారు. 11 ఏళ్ల క్రితం తనకు భర్త ఐపీఎస్ అధికారి సంతోష్కుమార్కు వివాహం జరిగిందని, ప్రస్తుతం తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తమ మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయన్నారు. ప్రస్తుతం తన భర్త విలువైన ఫ్లాట్, స్థలం, నగదు, నగలు ఇవ్వాలంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు చెప్పారు. అతనిపై ఫిర్యాదు చేస్తే బిడ్డను అపహరించి తీసుకువెళతానని హెచ్చరించారని, అందుచేత తన భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు కోవాలని రోదిస్తూ తెలిపారు. -
'డార్లింగె ఓసినా డార్లింగే' ఆడియో ఆవిష్కరణ
-
విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తుల దాడి
చాకుతో చేయి కోసిన వైనం భీమవరం : సైకిల్పై స్కూల్కు వెళుతున్న విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి పరారైన ఘటన భీమవరంలో చోటు చేసుకుంది. భీమవరం వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గునుపూడికి చెందిన పొన్నాడ రాంబాబు కుమార్తె మేఘన హౌసింగ్బోర్డు కాలనీలోని ఆదిత్య స్కూల్లో పదవ తరగతి చదువుతుంది. ఎప్పటి మాదిరిగానే సోమవారం సైకిల్పై స్కూల్కు వెళుతుండగా స్థానిక వన్టౌన్లోని శ్రీనివాస థియేటర్ రోడ్లోకి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు మొహానికి ఖర్చీఫ్లు కట్టుకుని మోటారు సైకిల్పై వెళుతూ విద్యార్థిని చేతిని చాకుతో కోసి పరారయ్యారు. చేతి నుంచి రక్తం కారడంతో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థినిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం వన్టౌన్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. పది రోజులుగా ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్పై తన వెనుక వస్తూ వేధిస్తున్నారని విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. -
సవతి తల్లి ప్రేమే ఎక్కువే
సవతి పిల్లలను ప్రేమించే వారి సంఖ్య చాలా అరుదనే చెప్పాలి. పిల్లల్ని చిత్ర హింసలకు గురి చేసే సవతి తల్లుల గురించి తెలుసు కానీ తండ్రి కంటే ఎక్కువగా సవతి తల్లే ప్రేమిస్తుండడం విశేషం. నటుడు ప్రకాష్రాజ్, నటి డిస్కో శాంతి చెల్లెలు లలితా కుమారి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి పూజా, మేగ్నా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్నేళ్ల ముందు ప్రకాష్ రాజ్ లలితా కుమారి విడిపోయారు. అనంతరం ప్రకాష్ రాజ్ ముంబాయికి చెందిన బోనీవర్మ అనే నృత్య దర్శకురాలను ప్రేమించి మరో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు పుట్టింది. అయితే ప్రకాష్ రాజ్ తొలి సంతానం కూడా వీరి వద్ద పెరుగుతున్నారు. వారిపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారా? అన్న ప్రశ్నకు బోనీకపూర్ బదులిస్తూ తనది పిల్లల్ని హింసించే మనస్తత్వమా అంటూ ఎదురు ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ కంటే ఎక్కువగా ఆయన పిల్లల్ని తాను ప్రేమిస్తున్నట్లు తెలిపారు. సవతి తల్లులు పిల్లల పట్ల ప్రేమతో మెలగాలని ఆమె పేర్కొన్నారు. -
అనంతరం: వినయ మేఘన
తాము చేయలేకపోయినవి తమ పిల్లలు చేయాలని, తమ కలలను వారు నిజం చేయాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. ఎంతమంది పిల్లలు ఆ ఆశల్ని నెరవేరుస్తారో తెలియదు కానీ... మేఘన మాత్రం నెరవేర్చింది. తండ్రి సుభాష్ఘాయ్ కలను తాను నిజం చేసి చూపించింది. తండ్రికి తగ్గ తనయ అని అందరూ ప్రశంసించేలా చేసింది. అయితే ఆమెను పొగిడిన చాలామందికి తెలియదు... ఆమె సుభాష్ సొంత కూతురు కాదని! సినిమా వాళ్ల పిల్లల్లో చాలామంది తామూ ఆ రంగుల ప్రపంచంలోనే విహరించాలని ఆశపడుతుంటారు. అక్కడే పుట్టాం, అక్కడే పెరిగాం, అక్కడే జీవిద్దాం, అక్కడే సాధిద్దాం అనుకుంటారు. కానీ మేఘన అలా అనుకోలేదు. సినిమా ప్రపంచం తనకు నచ్చదంది. సినిమాల్లోకి రావాలన్న ఆలోచన తనకి ఎప్పటికీ కలగదు అంది. కానీ సినీ ప్రపంచంతో సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకోలేకపోయింది. దానికి కారణం... ఆమె తండ్రి సుభాష్ ఘాయ్... ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు. ఆయన ఆశ నెరవేర్చడం కోసం తన నిర్ణయాన్ని మార్చుకుంది మేఘన. పిల్లలు లేని సుభాష్... తన తమ్ముడి కూతురు మేఘన పసిబిడ్డగా ఉన్నపుడే దత్తత చేసుకున్నారు. కళ్లలో పెట్టుకుని పెంచుకున్నారు. అలాగని మరీ కాలు కందకుండా పెంచలేదు. సుభాష్ ప్రాక్టికల్ మనిషి. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు అని నమ్ముతారాయన. అందుకే అందలాల మీద కాకుండా అందరితో కలిసిపోయేలా కూతుర్ని పెంచాలనుకున్నారు. సెలెబ్రిటీల పిల్లలు చదివే బడిలో కాకుండా, మధ్య తరగతి పిల్లలు అధికంగా ఉండే స్కూల్లో మేఘనను చేర్పించారు. కారులో కాకుండా స్కూలు బస్సులో పంపించారు. ధనవంతులతో కాకుండా సామాన్యుల పిల్లలతో స్నేహం చేయడం నేర్పించారు. తన తండ్రిలోని ఆ గొప్ప గుణం... తనకు జీవితమంటే ఏంటో, జీవితంలో ఎలా ఉండాలో నేర్పింది అంటుంది మేఘన. మేఘనను చూసినవాళ్లంతా ఆశ్చర్యంగా అనే మాట ఒకటే... ‘అంత పెద్ద దర్శకుడి కూతురై ఉండి, భలే సింపుల్గా ఉందే’ అని. ఆ కాంప్లిమెంట్ తన తండ్రికి దక్కాలంటుంది మేఘన. ఆయనంటే చాలా ఇష్టం మేఘనకి. అందుకే సినిమాల వైపు రాకూడదు అనుకున్నా... తండ్రి మీద ప్రేమతో, ఆయన కలను నెరవేర్చాలన్న ఆశయంతో ‘విజిల్వుడ్ ఇన్స్టిట్యూట్’ బాధ్యతలు చేపట్టింది. ‘విజిల్వుడ్’ అనేది సుభాష్ స్థాపించిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్. సుభాష్ దాన్ని తెరిచేనాటికి మేఘన లండన్లో మేనేజ్మెంట్ స్టడీస్ పూర్తి చేసి, ఓ మీడియా హౌస్లో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తోంది. సినీ పరిశ్రమకు ప్రతిభావంతులను అందించాలనే ఆశయంతో ఆయన దీనికి ఊపిరిపోశారు. అయితే దర్శకుడిగా బిజీగా ఉన్న ఆయనకు దాన్ని అభివృద్ధి చేయడం కష్టమైంది. అందుకే దాని బాధ్యతను కూతుర్ని స్వీకరించమని కోరారు. ఆయన మాటను మేఘన కాదనలేదు. వెంటనే ఇన్స్టిట్యూట్ పగ్గాలు చేపట్టింది. దాన్ని ఆమె ఎంత సమర్థంగా నిర్వహించిందంటే... అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ తదితర దేశాల నుంచి వచ్చి మరీ ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. మీ నాన్న పేరు నిలబెట్టారు అని ఎవరైనా అంటే... ‘నాన్న నన్ను నమ్మారు, ఆ నమ్మకాన్ని నిజం చేయాలనుకున్నాను. చేశానేమో తెలీదు, కానీ ఆయనతో పోల్చుకునేంత గొప్పదాన్ని మాత్రం ఇంకా కాలేదు’ అంటుంది. ఈ వినయమే మేఘనను ఈ రోజు ఈ స్థాయికి చేర్చిందనడంలో సందేహం లేదు! -
మాయ’లేడీ’కి ఆరు నెలల జైలు శిక్ష
మియాపూర్, న్యూస్లైన్: వాహనదారుడిని లిఫ్ట్ అడిగి.. కారుతో పాటు ఉడాయించిన ఓ మాయ‘లేడీ’కి కూకట్పల్లి 9 ఎంఎం కోర్టు న్యాయమూర్తి వి.సత్యనారాయణ ఆరు నెలలు జైలుశిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కథనం ప్రకారం... హర్యానాకు చెందిన మమత రాణి అలియాస్ మేఘన నాలుగు నెలల క్రితం మాదాపూర్లో కారులో వెళ్తున్న జి.వెంకట్రెడ్డిని లిఫ్ట్ అడిగి కారు ఎక్కింది. కొద్ది దూరం వెళ్లాక ఆయన ఓ హోటల్ వద్ద కారు ఆపి లోపలికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి మమత అతని కారు తీసుకొని ఉడాయించింది. కాగా, వెంకట్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు నిందితురాలిని గత మే 20న అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ వేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితురాలికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. నిందితురాలు మమతపై ఇలాంటివే మరో రెండు కేసులున్నాయి. నకిలీ పోలీసులకు 10 నెలల జైలు... పోలీసులమని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులకు కోర్టు 10 నెలల జైలు శిక్ష విధించింది. వివరాలు.. ఉప్పల్ శాంతినగర్కు చెందిన ప్రదీప్సింగ్, వెంకట్రాజ్ పోలీసులమని చెప్పుకుంటూ తిరుగుతూ వాహనాలను అపహరిస్తున్నారు. వీరిద్దరినీ కూకట్పల్లి పోలీసులు గత జనవరిలో అరెస్ట్ చేశారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి సత్యనారాయణ.. నిందితులకు 10 నెలల జైలుశిక్ష, రూ.50 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.