membership
-
‘కోటి’ మాయల మెంబర్షిప్
సాక్షి, అమరావతి: అడుగడుగునా ప్రలోభాలు, బలవంతాలు, మాయమాటలు, బెదిరింపులు.. అధికార తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాల వెనుక తతంగమిది. ప్రజల్ని మాయ చేయడంలో ఆరితేరిన తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత, సీఎం చంద్రబాబు (Chandrababu) ఆడిన మరో మాయ నాటకమిది. ఈ కోటి సభ్యత్వాల వెనుక అధికారాన్ని అడ్డుపెట్టుకొని మూడు నెలలుగా టీడీపీ నేతలు ఒక పథకం ప్రకారం సాగించిన దందా దాగి ఉంది. ఓ పక్క బీమా ఆశ చూపించడం, మరోపక్క పథకాలు ఆగిపోతాయన్న బెదిరింపులు, ఇంకోపక్క మాయమాటలు.. ఇలా సభ్యత్వాలన్నీ ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయించినవేనని టీడీపీ నేతలే చెబుతున్నారు.టీడీపీ సభ్యత్వం (TDP Membership) తీసుకున్న వారికి రూ.5 లక్షల బీమా ఉంటుందని ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. సభ్యత్వాల నమోదు ప్రారంభానికి ముందే చంద్రబాబు గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ఈ బీమాను రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దాని గురించి ప్రచారం చేయడంతోపాటు ప్రతి గ్రామంలోని ఓటర్లలో 80 శాతం మందిని సభ్యులుగా చేర్చాలని నేతలపై ఒత్తిడి చేశారు. సభ్యత్వాలు చేయించిన వారికే పార్టీలో అవకాశాలు ఉంటాయని చెప్పారు. దీంతో నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి టీడీపీ సభ్యత్వం తీసుకుంటే ఉచితంగా రూ.5 లక్షల బీమా వస్తుందని ప్రజల్ని నమ్మించారు. సభ్యత్వం ఉంటేనే పథకాలని బెదిరింపులు మరోపక్క టీడీపీ సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తాయని, లేకుంటే రావని ఇంటింటికీ తిరిగి బెదిరింపులకు దిగారు. ప్రజల నుంచి ఆధార్ కార్డులు తీసుకుని పేర్లు రాసేసి, సభ్యత్వ రుసుము రూ.100 కూడా నాయకులే కట్టేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళగిరి టీడీపీ కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షించారు. ఏ నియోజకవర్గంలో ఎంత శాతం సభ్యత్వాలు అయ్యాయో విశ్లేషిస్తూ తగ్గిన నియోజకవర్గాల నాయకులను హెచ్చరించారు. చంద్రబాబు పలుసార్లు టెలీ కాన్ఫరెన్స్లు నిర్వహించి తక్కువ సభ్యత్వాలు నమోదైన నియోజకవర్గాల నేతలకు చీవాట్లు పెట్టారు. దీంతో వారు గ్రామాలు, వార్డుల్లో తిష్టవేసి బలవంతంగా సభ్యత్వాలు చేయించారు. కొన్ని గ్రామాల్లో ఏకంగా 80, 90 శాతం ఓటర్లను తమ సభ్యులుగా చేర్పించేశారు. ముచ్చర్లలో బయటపడిన బాగోతం విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామంలో ఏకంగా గ్రామంలోని వంద శాతం ఓటర్లను సభ్యులుగా నమోదు చేశారు. వంద శాతం సభ్యత్వ నమోదు జరిగిన గ్రామంగా ముచ్చర్లను ప్రకటించి సీఎం తనయుడు లోకేశ్తో అక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడి సభ్యత్వాల లోగుట్టును వైఎస్సార్సీపీ నేత గుడివాడ అమర్నాథ్ బయటపెట్టడంతో లోకేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ముచ్చర్ల ఈనాం అన్ సెటిల్డ్ గ్రామం కావడంతో అక్కడున్న 600 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. ఆ భూములకు పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికి, గ్రామస్తుల ఆధార్ కార్డులు తీసుకుని టీడీపీ సభ్యత్వాలు నమోదు చేయించినట్లు బయటపడింది.నిజానికి ఆ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులంతా వైఎస్సార్సీపీకి చెందినవారు. ఆ గ్రామంలో సుమారు 1,350 ఓట్లు ఉంటే గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 600కిపైగా ఓట్లు వచ్చాయి. జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలు కూడా ఆ గ్రామంలో ఉన్నారు. అలాంటి గ్రామంలో నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వాల నమోదు ఎలా సాధ్యమైందనే ప్రశ్నకు సమాధానం కరువైంది. అందుకే ఆ గ్రామానికి రాకుండా లోకేశ్ జారుకున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే రీతిలో టీడీపీ శ్రేణులు బోగస్ సభ్యత్వాలు చేయించారు.వైఎస్సార్ బీమాను పణంగా పెట్టి..మరోవైపు టీడీపీ సభ్యత్వాల కోసం రాజకీయాలకు అతీతంగా అందరికీ అమలైన వైఎస్సార్ బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం నిలిపి వేసింది. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలోని ప్రతి ఒక్కరితో వలంటీర్లు ఈ బీమాకు దరఖాస్తు చేయించారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలోనో, అనారోగ్యంతోనే చనిపోతే నేరుగా వారి ఖాతాల్లో రూ.5 లక్షల బీమా సొమ్ము జమ అయ్యేది. మృతుని కుటుంబానికి తక్షణం రూ.10 వేలు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ పథకాన్ని నిలిపివేసి, టీడీపీ సభ్యత్వాల నమోదు ప్రారంభించారు. టీడీపీ సభ్యత్వం తీసుకుంటే రూ.5 లక్షల బీమా వస్తుందని చెప్పారు. వైఎస్సార్ బీమా లేదు కాబట్టి ఇదైనా వస్తుందనే ఆశతో చాలామంది తప్పనిసరై సభ్యత్వం తీసుకున్నారు. కానీ, ఎవరికీ బీమా వర్తించడంలేదు. కృష్ణా జిల్లా మంటాడకు చెందిన ఆరేపల్లి సత్యనరేంద్ర వరప్రసాద్ (37) ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోతే అతని కుటుంబానికి ఒక్క రూపాయి పరిహారం రాలేదు. వైఎస్సార్ బీమా ఉంటే అతనికి రూ.5 లక్షలు వచ్చేది. ఇప్పుడు ఎలాంటి పరిహారం అందక ఆ కుటుంబం ఇబ్బందులు పడుతోంది. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కేసులు పదుల సంఖ్యలో ఉన్నాయి. బీమా పేరుతో టీడీపీ చేస్తున్న మోసపూరిత సభ్యత్వ నమోదుకు ఇదో నిదర్శనం. -
సచిన్ టెండుల్కర్ అందుకు అంగీకరించారు: ఎంసీసీ
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్కు విశిష్ట గౌరవ సభ్యత్వం ఇవ్వనున్నట్లు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ (Melbourne Cricket Club-ఎంసీసీ) ప్రకటించింది. తమ ప్రతిపాదనను సచిన్ అంగీకరించినట్లు తెలిపింది.కాగా 1838లో స్థాపించిన ఎంసీసీ ఆస్ట్రేలియాలోనే పురాతన క్రీడా క్లబ్. ఈ క్లబ్కు చెందిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో సచిన్ చేసిన పరుగుల రికార్డు ఇంకా పదిలంగానే ఉంది.ఎంసీజీలో పరుగుల వరదఈ వేదికపై మొత్తంగా ఐదు టెస్టులాడిన టెండుల్కర్(Sachin Tendulkar) 44.90 సగటుతో 449 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. సచిన్కు విశిష్ట సభ్యత్వం(Honorary Cricket Membership) ఇవ్వాలని ఎంసీసీ నిర్ణయించింది. ఆయన అంగీకరించడం మాకు సంతోషంఈ మేరకు.. ‘ఎంసీసీ సభ్యత్వం స్వీకరించేందుకు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాటర్ సచిన్ అంగీకరించడం చాలా సంతోషంగా ఉంది. క్రికెట్కే అతడొక ఐకాన్ ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్లో అసాధారణ ఆటతీరుకు గుర్తింపుగా విశిష్ట సభ్యత్వం ఇస్తున్నాం’ అని ఎంసీసీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.అదే విధంగా.. ఎంసీసీ అధ్యక్షుడు ఫ్రెడ్ ఓల్డ్ఫీల్డ్ మాట్లాడుతూ.. ‘‘కేవలం భారత క్రికెట్కే కాదు.. ప్రపంచ క్రికెట్కు కూడా సచిన్ టెండుల్కర్ ఎనలేని సేవలు అందించారు. ఆయన మా విశిష్ట సభ్యత్వం స్వీకరించేందుకు ఒప్పుకొన్నారు. ఇంతకంటే మాకు గొప్ప విషయం మరొకటి ఉండదు’’ అని పేర్కొన్నాడు. ఇలాంటివేం కొత్త కాదుఇక.. ఆస్ట్రేలియా నుంచి సచిన్కు ఈ గౌరవం కొత్తేం కాదు. మనదేశంలో ‘భారతరత్న’ లాంటి ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ పురస్కారంతో 2012లోనే అక్కడి ప్రభుత్వం సచిన్ టెండుల్కర్ను సత్కరించింది. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా టీమిండియా ప్రస్తుతం ఎంసీజీలోనే ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు ఆడుతోంది. అంతకు ముందు పెర్త్లో జరిగిన తొలి టెస్టులో భారత్, అడిలైడ్ టెస్టులో ఆసీస్ గెలవగా.. బ్రిస్బేన్లో జరిగిన మూడో టెస్టు డ్రా అయింది. దీంతో ప్రస్తుతం ఇరుజట్లు 1-1తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో సమంగా ఉన్నాయి. చదవండి: IND VS AUS: తగ్గేదేలేదన్న నితీశ్ రెడ్డి.. వైరలవుతున్న పుష్ప స్టయిల్ సెలబ్రేషన్స్ -
యుద్ధానికి తెర దించేందుకు..రష్యా రెడీ!
రెండున్నరేళ్లు దాటిన యుద్ధం. కనీవినీ ఎరగని విధ్వంసం. ఇరువైపులా లెక్కకైనా అందనంత ఆస్తి, ప్రాణనష్టం. యుద్ధంలో నిజమైన విజేతలంటూ ఎవరూ ఉండరని ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నిరూపిస్తోంది. అగ్ర రాజ్యపు అపార ఆర్థిక, సాయుధ సంపత్తి ముందు ఏ మూలకూ చాలని ఉక్రెయిన్ యుద్ధంతో కకావికలైంది. ఆర్థికంగా, సైనికంగా మాత్రమే గాక జనాభాపరంగా, అన్ని రకాలుగానూ దశాబ్దాలు గడిచినా కోలుకోలేనంతగా నష్ట పోయింది. అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక, సాయుధ దన్నుతో నెట్టుకొస్తున్నా ట్రంప్ రాకతో ఆ సాయమూ ప్రశ్నార్థకంగా మారేలా కన్పిస్తోంది. అదే జరిగితే చేతులెత్తేయడం మినహా దాని ముందు మరో మార్గం లేనట్టే. ఇంతటి యుద్ధం చేసి రష్యా కూడా సాధించిన దానికంటే నష్టపోయిందే ఎక్కువ. అందులో ముఖ్యమైనది సైనిక నష్టం. యుద్ధంలో ఇప్పటికే ఏకంగా 2 లక్షల మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి! దీనికి తోడు కనీసం మరో 5 లక్షల మంది సైనిక విధులకు పనికిరానంతగా గాయపడ్డట్టు సమాచారం. ఇది ఆ దేశానికి కోలుకోలేని దెబ్బే. యువతను నిర్బంధంగా సైన్యంలో చేర్చుకునే ప్రయత్నాలూ పెద్దగా ఫలించడం లేదు. యుద్ధ భూమికి పంపుతారనే భయంతో రష్యా యువత భారీ సంఖ్యలో వీలైన మార్గంలో దేశం వీడుతోంది. దాంతో సైనికుల కొరత కొన్నాళ్లుగా రష్యాను తీవ్రంగా వేధిస్తోంది. మరో దారి లేక సైన్యం కోసం ఉత్తర కొరియా వంటి దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి! దీనికి తోడు సుదీర్ఘ యుద్ధం కారణంగా ప్రధానమైన ఆయుధ నిల్వలన్నీ దాదాపుగా నిండుకోవడంతో రష్యాకు ఎటూ పాలుపోవడం లేదు. ఉక్రెయిన్పై సైనిక చర్యను ఇంకా కొనసాగించే విషయంలో స్వదేశంలోనే తీవ్ర వ్యతిరేకత ఉందని ఇప్పటికే రుజువైంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి ఏదో రకంగా తెర పడాలని ఉక్రెయిన్తో పాటు రష్యా కూడా కోరుకుంటున్నట్టు సమాచారం. ఇటీవలి పుతిన్ ఉన్నత స్థాయి భేటీలో ఈ అంశమూ చర్చకు వచ్చిందంటున్నారు.ఇవీ షరతులు...→ భూతల యుద్ధంలో ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యానికి గతంలోలా కొన్నాళ్లుగా పెద్దగా ప్రతిఘటన ఎదురవడం లేదు.→ దాంతో నెనెట్స్క్ తదితర ఉక్రెయిన్ భూభాగాల్లోకి రష్యా నానాటికీ మరింతగా చొచ్చుకుపోతోంది.→ కానీ ఇందుకు చెల్లించుకోవాల్సి వస్తున్న సైనిక, ఆయుధ మూల్యం తదితరాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఆలోచనలో పడేసినట్టు వార్తలొస్తున్నాయి. ఏదోలా ఉక్రెయిన్పై యుద్ధానికి తెర దించేందుకే ఆయన మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.→ కొన్ని ప్రధాన షరతులకు ఉక్రెయిన్ అంగీకరించే పక్షంలో యుద్ధా్దన్ని నిలిపేసేందుకు పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.→ ఆక్రమిత ప్రాంతాలకు తోడు మరింత భారీ భూభాగాన్ని ఉక్రెయిన్ తమకివ్వాలని పుతిన్ పట్టుబడుతున్నారు.→ అది కనీసం అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన వర్జీనియా పరిమాణంలో ఉండాలని కోరుతున్నారు.→ ఉక్రెయిన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ నాటోలో సభ్యత్వం ఇవ్వరాదని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ డిమాండ్ను నాటో పరిగణనలోకే తీసుకోవద్దని కోరుతున్నారు. యుద్ధంలో మరణించిన రష్యా సైనికులు: 1.5 లక్షల నుంచి 2లక్షలుగాయపడ్డ సైనికులు: 5 లక్షల పైచిలుకువామ్మో సైన్యం!రష్యా యువతలో వణుకుసైన్యంలో చేరడమనే ఆలోచనే రష్యా యువతకు పీడకలతో సమానం! కొత్తగా చేరేవారిని వేధించడంలో రష్యా సైనికుల ట్రాక్ రికార్డు సాధారణమైనది కాదు! రిటైరైన తర్వాత కూడా వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ వణికిపోయే పరిస్థితి! వాటి బారిన పడే బదులు బతికుంటే బయట బలుసాకైనా తినొచ్చని రష్యా యూత్ భావిస్తుంటారు. డెడొవ్షినా అని పిలిచే ఈ వేధింపుల జాఢ్యం ఇప్పటిది కాదు. రష్యా సైన్యంలో 17వ శతాబ్దం నుంచే ఉందని చెబుతారు. దీనికి భయపడి రష్యా యువత సైన్యంలో చేరకుండా ఉండేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తుంటుంది. ఉక్రెయిన్ యుద్ధంలో కనీవినీ ఎరగనంత సైనిక నష్టం జరుగుతుండటంతో భారీగా రిక్రూట్మెంట్కు రష్యా రక్షణ శాఖ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. యువతీ యువకులకు వారి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా సైన్యంలో చేరాలని పేర్కొనే ‘డ్రాఫ్ట్ నోటీస్’ పంపిస్తోంది. దాంతో సైనిక జీవితాన్ని తప్పించుకునేందుకు రష్యా యువత లక్షలాదిగా విదేశాల బాట పట్టారు. అలా వెళ్లలేని వారిలో చాలామంది ఫేక్ మెడికల్గా అన్ఫిట్ సర్టిఫికెట్లు సమర్పిస్తుంటారు. ఆ క్రమంలో అవసరమైతే తమ ఎముకలు తామే విరగ్గొట్టుకుంటారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు! దాంతో చెచెన్యా, యకుట్జియా, దగెస్తాన్ వంటి సుదూర ప్రాంతాల నుంచి సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన యువతను రక్షణ శాఖ కొన్నాళ్లుగా ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. ఖైదీలను నిర్బంధంగా సైన్యంలో చేరుస్తోంది. ఇలాంటి వారిని సైన్యంలో దారుణంగా చూస్తున్నారు. చనిపోతే మృతదేహాలను గుర్తించి గౌరవప్రదంగా కుటుంబీకులకు అప్పగించే పరిస్థితి కూడా ఉండటం లేదు! దీనికి తోడు రష్యాలో మామూలుగానే సైనికులు దారుణమైన పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుంది. వారికి అత్యంత అవసరమైన పౌష్టికాహారానికే దిక్కుండదు! పైగా సరైన వైద్య సదుపాయమూ అందదు. సంక్షేమం దేవుడెరుగు, చివరికి సైనికుల భద్రతకు కూడా ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యమివ్వదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మామూలు సమయాల్లోనే పరిస్థితి ఇలా ఉంటుందంటే ఇక యుద్ధ సమయాల్లోనైతే సైనికుల భద్రత, సంక్షేమానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ సర్కారు అక్షరాలా గాలికే వదిలేస్తుంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
EPFO: 7.66 లక్షల కంపెనీలు.. 7.37 కోట్ల మందికి పీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో)లో సభ్యత్వం గడిచిన ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. ఉద్యోగులకు చందా కట్టే కంపెనీల సంఖ్య 6.6 శాతం మేర పెరిగింది. దీంతో వీటి మొత్తం సంఖ్య 7.66 లక్షలకు చేరింది. అలాగే ఉద్యోగుల చేరికలు సైతం 7.6 శాతం పెరిగి ఈపీఎఫ్వో మొత్తం సభ్యుల సంఖ్య 7.37 కోట్లకు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు విడుదల చేసింది.2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఈ నెల 8న జరిగిన ఈపీఎఫ్వో సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 109వ సమావేశం పరిగణనలోకి తీసుకున్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్వో కింద చందాలు జమ చేసే సంస్థలు 6.6 శాతం పెరిగి 7.66 లక్షలకు చేరాయి. చందాలు జమ చేసే సభ్యులు 7.6 శాతం పెరిగి 7.37 కోట్లుగా ఉన్నారు. మొత్తం 4.45 కోట్ల క్లెయిమ్లకు పరిష్కారం లభించింది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!2022–23లో ఇవి 4.13 కోట్లుగా ఉన్నాయి. కొత్త కారుణ్య నియామక ముసాయిదా విధానం, 2024ను సైతం ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్టు కార్మిక శాఖ ప్రకటించింది. ఐటీ, మెరుగైన పరిపాలనా, ఆర్థిక సంస్కరణలపై చర్చించినట్టు.. వచ్చే కొన్ని నెలల పాటు ప్రతి నెలా సమావేశమైన సంస్కరణల పురోగతిని సమీక్షించాలని నిర్ణయించనట్టు తెలిపింది. -
నాలుగేళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో), ఎన్పీఎస్ పథకాల్లో సభ్యుల చేరిక గణాంకాల ఆధారంగా గడిచిన నాలుగేళ్లలో 5.2 కోట్ల మందికి ఉపాధి లభించినట్టు ఎస్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఇందులో 47 శాతం మందికి కొత్తగా ఉపాధి లభించగా, మిగిలిన వారు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరిన వారు కావడం గమనార్హం. గడిచిన నాలుగేళ్ల కాలానికి సంబంధించి ఈపీఎఫ్వో పేరోల్ డేటాను విశ్లేషించినప్పుడు నికర ఈపీఎఫ్ సభ్యుల చేరిక 2019–20 నుంచి 2022–23 మధ్య 4.86 కోట్లుగా ఉందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ‘ఎకోరాప్’ పేర్కొంది. ఇందులో కొత్తగా ఉపాధి లభించిన వారి సంఖ్య 2.27 కోట్లు ఉన్నట్టు, నికర పేరోల్ డేటాలో వీరు 47 శాతంగా ఉన్నట్టు ఎస్బీఐ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. ఈ సంవత్సరాల్లో సంఘటిత రంగంలో 42 లక్షల మేర ఉపాధి అవకాశాలు పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఈపీఎఫ్వో పేరోల్ గణాంకాలు మరింత ఆశాజనకంగా ఉన్నట్టు తెలిపింది. ఇప్పటికే 44 లక్షల మంది నికర సభ్యులు ఈపీఎఫ్లో భాగమయ్యారని, ఇందులో మొదటిసారి ఉపాధి పొందిన వారు 19.2 లక్షల మంది ఉన్నారని వెల్లడించింది. ‘‘ఇదే ధోరణి 2023–24 పూర్తి ఆర్థిక సంతవ్సరంలో కొనసాగితే అప్పుడు నికర సభ్యుల చేరిక 160 లక్షలుగా ఉండొచ్చు. మొదటిసారి చేరిన వారు 70–80 లక్షలుగా ఉండొచ్చు’’అని తెలిపింది. ఎన్పీఎస్ డేటా ప్రకారం 2022–23లో 8.24 లక్షల మంది కొత్త సభ్యులు చేరగా, ఇందులో రాష్ట్ర, ప్రభుత్వాల నుంచి 4.64 లక్షలు, కేంద ప్రభుత్వం నుంచి 1.29 లక్షలు, ప్రభుత్వేతర సంస్థల నుంచి 2.30 లక్షల మంది ఉన్నారు. గడిచిన నాలుగేళ్లలో ఎన్పీఎస్లో సభ్యుల చేరిక 31 లక్షలుగా ఉంది. 1.31 లక్షల ఒప్పంద ఉద్యోగాలు: ఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా తమ సభ్య కంపెనీలు 2022 జూలై నుంచి 2023 జూన్ మధ్య కాలంలో 1.31 లక్షల ఒప్పంద కారి్మకులను చేర్చుకున్నట్టు ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) ప్రకటించింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు అంత క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఏప్రిల్–జూన్లో 5.6 శాతం పెరిగాయని ఐఎస్ఎఫ్ ఈడీ సుచిత దత్తా తెలిపారు. ఈ–కామర్స్, సరుకు రవాణా, తయారీ, ఆరోగ్యం, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, రిటైల్, బ్యాంకింగ్ విభాగాల రిక్రూట్మెంట్ కారణంగా ఇది సాధ్యమైందని చెప్పారు. 2023 జూన్ 30 నాటికి ఐఎస్ఎఫ్ సభ్య కంపెనీలు చేర్చుకున్న ఒప్పంద కారి్మకుల సంఖ్య 15 లక్షలకు చేరుకుందన్నారు. -
రాహుల్ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ.. సుప్రీంకోర్టులో పిల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. లక్నోకు చెందిన న్యాయవాది అశోక్ పాండే ఈ పిటిషన్ వేశారు. వయనాడ్ ఎంపీగా రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. కాగా మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆగస్టు 4న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం తీర్పుతో రాహుల్పై లోక్సభ అనర్హత వేటు తొలిగిస్తున్నట్లు ఆగస్టు 7న లోక్సభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆయన ఎంపీ సభ్యత్వాన్ని పునురుద్దరించడంతో ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ హాజరయ్యారు. చదవండి: ఇండియా పేరు మార్పుపై సోషల్ మీడియాలో రచ్చ.. బిగ్బీ, సెహ్వాగ్, మమతా ట్వీట్లు అసలేం జరిగిందంటే కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ..‘దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన సూరత్ కోర్టు మార్చి 23న రాహుల్ గాంధీకి రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రాతినిధ్య చట్టం కింద మార్చి 24న లోక్సభలో అనర్హుడిగా ప్రకటించడంతో వయనాడ్ ఎంపీ పదవి కోల్పోయారు. సూరత్ కోర్టు విధించిన శిక్షపై రాహుల్ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ఊరట దక్కపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను నిర్దోషినని. తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టు తీర్పును నిలిపివేస్తున్నామని తెలిపింది -
బ్రిక్స్లోకి మరో ఆరు దేశాలు
న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు దేశాలు వచ్చి చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో జరుగుతున్న మూడు రోజుల శిఖరాగ్ర భేటీలో ఆఖరు రోజైన గురువారం మీడియా సమావేశంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఈ మేరకు ప్రకటించారు. 2024 జనవరి ఒకటో తేదీ నుంచి ఆరు దేశాల సభ్యత్వం అమల్లోకి వస్తుందని తెలిపారు. బ్రిక్స్ బలం అయిదు నుంచి 11 దేశాలకు పెరగనుంది. ఈ నిర్ణయంపై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ అధ్యక్ష పీఠంపై ఉన్న దక్షిణాఫ్రికాలో కూటమి శిఖరాగ్ర సమ్మేళనం జరుగుతోంది. ‘సిద్ధాంతాలు, ప్రమాణాలు, విధానాల ప్రాతిపదికన విస్తరణ ప్రక్రియను ఏకాభిప్రాయంతో చేపట్టాం. మున్ముందు కూడా కూటమిని విస్తరిస్తాం’అని రమఫోసా చెప్పారు. బ్రిక్స్ విస్తరణ, ఆధునీకరణ.. ప్రపంచంలోని అన్ని సంస్థలు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనే సందేశం ఇస్తుందని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘బ్రిక్స్ విస్తరణకు భారత్ మొదట్నుంచీ మద్దతుగా నిలిచింది. కొత్తగా సభ్య దేశాలను చేర్చుకోవడం ద్వారా బ్రిక్స్ మరింత బలోపేతమవుతుంది. ఉమ్మడి ప్రయత్నాలకు కొత్త ఊపునిస్తుంది. బహుళ ధ్రువ ప్రపంచ క్రమతపై విశ్వాసం పెంచుతుంది’అని ప్రధాని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తన వర్చువల్ ప్రసంగంలో బ్రిక్స్ తాజా విస్తరణపై హర్షం వ్యక్తం చేశారు. కూటమిలో సహకారానికి కొత్త అధ్యాయం మొదలైందని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు. బ్రిక్స్ భాగస్వామ్య దేశం నమూనా, కూటమిలో చేరాలనుకునే దేశాల జాబితాను ఏడాది జరిగే శిఖరాగ్ర సమ్మేళనం నాటికి సిద్ధం చేసే బాధ్యతను విదేశాంగ మంత్రులకు అప్పగించినట్లు రమఫోసా చెప్పారు. స్థానిక కరెన్సీలు, చెల్లింపు విధానాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంపై నివేదిక రూపొందించాల్సిందిగా బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు సూచించేందుకు అంగీకారానికి వచి్చనట్లు ఆయన వివరించారు. 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలు బ్రిక్గా ఏర్పాటయ్యాయి. దక్షిణాఫ్రికా చేరికతో 2010 నుంచి బ్రిక్స్గా రూపాంతరం చెందింది. బ్రిక్స్లో చేరేందుకు 40 వరకు దేశాలు ఆసక్తి చూపుతుండగా వీటిలో 23 దేశాలు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుత కూటమి ప్రపంచ జనాభాలో 41%, ప్రపంచ జీడీపీలో 24%, ప్రపంచ వాణిజ్యంలో 16% వరకు వాటా కలిగి ఉంది. పశి్చమదేశాల కూటమికి బ్రిక్స్ను ప్రధాన పోటీ దారుగా భావిస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని భేటీ బ్రిక్స్ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ గురువారం ఇరాన్ అధ్యక్షుడు ౖఇబ్రహీం రైసీ సహా పలు దేశాల నేతలతో సమావేశమయ్యారు. రైసీతో చర్చల సందర్భంగా ఇరువురు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, ఉగ్రవాదం, అఫ్గానిస్తాన్ వంటి ద్వైపాక్షిక అంశాలతో చాబహర్ పోర్టు అభివృద్ధిపైనా చర్చించారు. బ్రిక్స్లో ఇరాన్ చేరికకు మద్దతుగా నిలిచినందుకు ప్రధాని మోదీకి రైసీ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రయాన్–3 విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలియజేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వివరించారు. ప్రధాని మోదీ ఇథియోపియా అధ్యక్షుడు అబీ అహ్మద్ అలీ, సెనెగల్ అధ్యక్షుడు మాకీ సాల్, మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ తదితరులతో జరిగిన భేటీలో పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకునేందుకు గల అవకాశాలపై ప్రధాని మోదీ చర్చించారని బాగ్చీ వివరించారు. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రం అనంతరం ప్రధాని మోదీ గురువారం సాయంత్రం జొహన్నెస్బర్గ్ నుంచి గ్రీస్కు బయలుదేరారు. ఆఫ్రికాకు భారత్ విశ్వసనీయ భాగస్వామి ‘ఎజెండా 2063’సాధనలో ఆఫ్రికాకు భారత్ సన్నిహిత, విశ్వసనీయ భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్కు భారత్ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో సహకారానికి ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. బ్రిక్స్, ఆఫ్రికా దేశాల ముఖ్య నేతలతో గురువారం జొహన్నెస్బర్గ్లో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఆఫ్రికా యూనియన్ శక్తివంతంగా రూపుదిద్దుకునేందుకు వచ్చే 50 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలపై 2013లో తయారు చేసిన ఆర్థికాభివృద్ధి నమూనాయే ‘అజెండా 2063’. ప్రపంచమే ఒక కుటుంబమనే భావనను భారత్ వేల ఏళ్లుగా విశ్వసిస్తోందని ప్రధాని చెప్పారు. ఆఫ్రికా దేశాలతో వాణిజ్యం, పెట్టుబడుల్లో భారత్ నాలుగు, అయిదో స్థానాల్లో ఉందన్నారు. ఎల్ఏసీని గౌరవిస్తేనే సాధారణ సంబంధాలు న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్లో వాస్తవ«దీన రేఖ(ఎల్ఏసీ) పరిధిలో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా ఉద్దేశాలు, అభిప్రాయాలు చైనా అధినేత షీ జిన్పింగ్ దృష్టికి తీసుకెళ్లారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో గురువారం జిన్పింగ్తో మోదీ మాట్లాడారు. భారత్–చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఇరు దేశాల సరిహద్దుల్లో శాంతి, స్నేహభావం నెలకొనాలని, ఎల్ఏసీని గౌరవించాలని మోదీ తేలి్చచెప్పారు. ఎల్ఏసీ నుంచి ఇరుదేశాల బలగాలను ఉపసంహరించే చర్యలను వేగవంతం చేసేలా తమ అధికారులను ఆదేశించాలని ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. 2020 మే నెలలో తూర్పు లద్దాఖ్లో భారత్, చైనా సైనికుల మధ్య త్రీవస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. -
Ukraine-Russia war: నాటో నాటో.. ఎప్పుడో ఎప్పుడో!
ఎస్.రాజమహేంద్రారెడ్డి: నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్య దేశాల సమావేశం ఉక్రెయిన్ ఆశలపై నీళ్లు చల్లింది. నాటో.. నాటో అంటూ కలవరించిన ఉక్రెయిన్ ఇప్పుడు నాటు.. నాటు అనక తప్పడం లేదు. గతేడాది మాడ్రిడ్లో జరిగిన సమావేశం అనంతరం స్వీడన్, ఫిన్లండ్లను కూటమిలో చేర్చుకుంటున్నట్టు నాటో ప్రకటించింది. ఆ రెండు దేశాలు జూలై 11, 12 తేదీల్లో లిథువేనియాలో జరిగిన సమావేశాలకు కూడా హాజరయ్యాయి. ఇదే బాటలో నాటో కూటమి తమను కూడా అక్కున చేర్చుకుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆశించారు. కానీ ఆయన అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి! ఉక్రెయిన్ భవిష్యత్తు తమతోనే ముడిపడి ఉంటుందని సమావేశం చివరి రోజు నాటో పేరుకు ఒక ప్రకటన చేసినా, ఆ భవిష్యత్తు ఎప్పుడు ఆరంభమవుతుందో మాత్రం స్పష్టం చేయలేదు. దాదాపు 500 రోజులకు పైగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు పశి్చమ దేశాలు ఆయుధ సామగ్రితో పాటు యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్లను సమకూరుస్తూ అండగా ఉన్నప్పటికీ, ఆ సాయం వెనక ఆయా దేశాల ఊగిసలాట ధోరణి జెలెన్స్కీని కలవరపరుస్తూనే వస్తోంది. ప్రతిదానికీ చేతులు జోడించి ఎదురు చూడాల్సి రావడం ఆయనకు మింగుడు పడటం లేదు. నాటో కూటమిలోకి ప్రవేశం దక్కితే ఈ అవస్థ ఉండదన్నది జెలెన్స్కీ ఆలోచన. నిజానికి నాటోలో చేరితే ఉక్రెయిన్ రక్షణ బాధ్యతను కూటమి దేశాలన్నీ సంయుక్తంగా మోయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ భవితవ్యాన్ని, రష్యాతో జరుగుతున్న యుద్ధ గమనాన్ని శాసించే నాటో సభ్యత్వ వ్యవహారంలో నిజానికి ఏం జరిగింది? ఉక్రెయిన్కు సభ్యత్వమిచ్చేందుకు ఎందుకు నాటో పచ్చజెండా ఊపలేదు? అసలు జెలెన్స్కీ ఆశించిందేమిటి? వివరాల్లోకి వెళ్దాం... అనుకున్నదొక్కటి... జెలెన్స్కీ ఏం ఆశిస్తున్నదీ సుస్పష్టం. గత సెపె్టంబరుకు ముందు ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, నాటోలో ఉక్రెయిన్కు సభ్యత్వం కావాలన్న తన అభ్యర్థనను 2023 జూలైలో లిథువేనియాలో జరిగే కూటమి సమావేశంలో వ్యక్తం చేస్తానని అన్నారు. కానీ ఈ వ్యాఖ్యల్లో మొక్కుబడితనమే తప్ప గాఢమైన కోరికేమీ ధ్వనించలేదు. ఉక్రెయిన్ ప్రాంతాలైన లుహాన్స్్క, డొనెట్స్్క, ఖెర్సన్, జపోరిజియాలను తమ భూభాగాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ గత సెపె్టంబరులో ప్రకటించగానే జెలెన్స్కీ స్వరం మారిపోయింది. నాటోలో తమకు పూర్తి సభ్యత్వమిచ్చే అంశాన్ని ఆగమేఘాల మీద పరిశీలించాల్సిందిగా జెలెన్స్కీ అభ్యరి్థంచడం మొదలెట్టారు. అంటే నాటో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ సీరియస్గా ఆశిస్తున్నది కేవలం ఏడాది క్రితం నుంచేనని సుస్పష్టం. నాటో మార్గదర్శకాల ప్రకారం యూరప్లోని ఏ దేశమైనా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పన్నెండు దేశాల కూటమిగా మొదలైన నాటో సభ్య దేశాల సంఖ్య ఇప్పుడు 32కు పెరిగింది. లిథువేనియాలోని విలి్నయస్లో జరిగిన నాటో భేటీకి హాజరైన జెలెన్స్కీ పనిలో పనిగా లుకిస్కస్ స్క్వేర్లో జరిగిన ఓ సభలో తమ అభీష్టాన్ని అక్కడి జనాలతో పంచుకున్నారు. సభా వేదికపై ‘ఉక్రెయిన్–నాటో 33’ నినాదాన్ని కూడా ప్రదర్శించడం విశేషం. నాటో నేతలకే ఇష్టం లేదు...! లుకిస్కస్ స్క్వేర్ సభా వేదికపై ప్రదర్శితమైన ‘ఉక్రెయిన్–నాటో 33’ బ్యానర్ అక్కడివారి మది దోచినా, ఉక్రెయిన్ మెడలో ఇప్పటికిప్పుడే ‘నాటో–33’ గుర్తింపు కార్డు పడటం మాత్రం నాటో నేతల్లోనే చాలామందికి అసలు ఇష్టం లేదు. అందుకే ‘అప్పుడే కాదం’టూ ఉక్రెయిన్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. ఒకవైపు యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు ఉక్రెయిన్కు సభ్యత్వాన్ని మంజూరు చేస్తే నాటో దేశాలన్నీ రష్యాపై ప్రత్యక్షంగా యుద్ధ బరిలోకి దిగాల్సి వస్తుంది. నాటో నిబంధనల ప్రకారం ఏ సభ్య దేశంపై దాడి జరిగినా కూటమిలోని దేశాలన్నీ సంయుక్తంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. నాటో నిబంధనల్లోని ఆరి్టకల్–5 ఈ విషయాన్ని స్పష్టంగా నిర్దేశించింది. నాటో చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక్కసారి, అమెరికాపై 9/11 ఉగ్ర దాడులు జరిగినప్పుడు ఈ నిబంధన అమలైంది. ఒకవేళ ఇప్పుడు గనక ఉక్రెయిన్కు సభ్యత్వమిస్తే కూటమిలోని మిగతా 32 దేశాలూ రష్యాపై యుద్ధానికి దిగాల్సి వస్తుంది. ‘నాటో దేశాల భూభాగంలో ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. ఇప్పుడు యుద్ధం నడిమధ్యలో ఉంటే తలపడటానికి సిద్ధంగా ఉన్నాం. అసలు ఆ మాటకొస్తే ఇప్పుడు మేమంతా రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే లెక్క’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. నాటో కూటమి తమ సభ్య దేశాల పట్ల ఎంతటి అంకితభావంతో ఉంటుందో బైడెన్ ఈ వ్యాఖ్యలతో ప్రపంచానికి చాటారు. అయితే బైడెన్ వ్యాఖ్య వెనక అసలు ఉద్దేశాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జెన్ వాలెస్ కుండబద్దలు కొట్టారు. ‘ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్న దేశాన్ని ఇప్పటికిప్పుడు కూటమిలోకి ఆహా్వనించలేం. అలా చేయడం మొత్తం కూటమినీ యుద్ధభూమిలోకి లాగడమే అవుతుంది’’ అంటూ అసలు విషయం చెప్పకనే చెప్పారు. యుద్ధం ముగిశాక గెలుపోటములతో నిమిత్తం లేకుండా వీలైనంత త్వరగా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సభ్యత్వానికి నాటో ఇలా సూత్రప్రాయంగా అంగీకరించినా అధికార ముద్ర ఎప్పుడు పడుతుందో చెప్పలేం. యుద్ధం ముగిసేదాకా ఉక్రెయిన్కు నాటో మోక్షం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నా, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది మాత్రం అస్పష్టం! జెలెన్స్కీకీ ముందే తెలుసు...! యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం రావడం కల్లేనని జెలెన్స్కీకీ తెలుసు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఆయన పదేపదే నాటో సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం మాటే ఉండదు. మాకది ఇష్టం లేక కాదు, కానీ అసాధ్యం’ అని జెలెన్స్కీ ఐదారు నెలల క్రితం కీవ్లో తన మనసులో మాటను సుస్పష్టంగా చెప్పారు. అయితే యుద్ధం ముగిసిన వెంటనే నాటో సభ్యత్వం లభించేలా ఓ రోడ్మ్యాప్ను ఖరారు చేసుకోవడానికే పదేపదే ఇలా సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సభ్యత్వంపై ఎటూ తేల్చని నాటో కనీసం ఆ దిశగా ఎలాంటి కార్యాచరణనూ ప్రకటించకపోవడం ఉక్రెయిన్ అధ్యక్షుడిని నిరాశకు గురి చేసింది. ఇది ఒకరకంగా ఉక్రెయిన్ను ఆగమ్యగోచరమైన పరిస్థితిలోకి నెట్టిందనే భావించాలి. ఉక్రెయిన్ ఉక్రెయిన్గా నిలవాలంటే యుద్ధాన్ని గెలవాలి, లేదా రష్యాతో సంధి కుదుర్చుకోవాలి. ఈ రెండు పరిస్థితుల్లోనే ఉక్రెయిన్ నాటోలో చేరగలుగుతుంది. ఓడిపోతే ఉక్రెయిన్ రష్యాలో అంతర్భాగంగా మారిపోతుంది. అప్పుడిక దానికి నాటో ప్రస్తావన అవసరమే లేకుండా పోతుంది. గెలుపోటములను కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటిదాకా ‘అయితే గియితే’లో ఉన్న నాటో సభ్యత్వ అంశం ‘ఆ సుదినం ఎప్పుడు’ అనేదాకా అయితే వచి్చంది. ప్రస్తుతానికి ఉక్రెయిన్కు ఊరటనిచ్చే విషయం ఇదొక్కటే. యుద్ధం త్వరలో ఓ కొలిక్కి వచ్చి ఉక్రెయిన్కు నాటో తలుపులు తెరుకోవాలని కోరుకుందాం! తెరుచుకుంటాయనే ఆశిద్దాం!! -
ఆస్కార్లో కొత్త రూల్.. ఈ అర్హతలు ఉంటేనే ఎంట్రీ
ప్రతి ఏడాది ఆస్కార్ సభ్యత్వ నమోదు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డు విజేతల నిర్ణయానికి ఈ సభ్యుల ఓటింగ్ కీలకంగా నిలుస్తుంది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14న జరగనుంది. కాగా ‘క్లాస్ ఆఫ్ 2023’లో భాగంగా 398 మంది కొత్త సభ్యులకు ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానాన్ని పంపినట్లు ఆస్కార్ కమిటీ సీఈవో బిల్ క్రామెర్, అధ్యక్షుడు జానెట్ యాంగ్ వెల్లడించారు. ఈ జాబితాలో మన దేశం నుంచి దాదాపు 15 మందికి ఆహ్వానం అందడం విశేషం. తెలుగు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్లో ఆరుగురు, తమిళం నుంచి మణిరత్నం, బాలీవుడ్నుంచి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ వంటివారు ఉన్నారు. వృత్తిపరమైన అర్హతలు, ప్రపంచవ్యాప్త గుర్తింపు వంటి అంశాల ఆధారంగా ఈ ‘క్లాస్ ఆఫ్ 2023’ జాబితాను తయారు చేసినట్లు అకాడమీ పేర్కొంది. ఈ 398 మందిలో 51 దేశాలకు చెందినవారు ఉండగా, వీరిలో 40 శాతం మంది మహిళలు, 52 శాతం మంది యూఎస్కు చెందనివారు ఉన్నట్లుగా ఆస్కార్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఇక ఈ కొత్త సభ్యులతో కలిసి ఆస్కార్ మెంబర్షిప్లు కలిగి ఉన్నవారి సంఖ్య 10, 817కు చేరినట్లు హాలీవుడ్ అంటోంది. ఆర్ఆర్ఆర్ నుంచి ... ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకుగాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ యంయం కీరవాణి, పాట రచయిత చంద్రబోస్లకు అకాడమీ ఆహ్వానాలు అందాయి. అలాగే ఈ చిత్రం హీరోలు ఎన్టీఆర్, రామ్చరణ్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్లు కూడా ఆస్కార్ అకాడమీ సభ్యులు కానున్నారు. దర్శకులు మణిరత్నం, షౌనక్ సేన్ (95వ ఆస్కార్ అవార్డ్స్లో డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ దర్శకుడు), నిర్మాతలు కరణ్ జోహర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ (95వ ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియా తరఫున అఫీషియల్ ఎంట్రీగా పంపబడిన గుజరాతీ ఫిల్మ్ ‘ది ఛెల్లో షో’ నిర్మాత), చైతన్య తమ్హానే (మరాఠీ), ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీకి చెందిన గిరీష్ బాలకృష్ణన్, క్రాంతి శర్మ, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్లు హరేష్ హింగో రాణి, పీసీ సనత్, ఫిల్మ్ ఎగ్జిక్యూ టివ్లు శివానీ రావత్, శివానీ పాండ్యా మల్హోత్రా వంటివారు ఉన్నారు. గర్వంగా ఉంది – రాజమౌళి ‘‘ఆస్కార్ అకాడమీ సభ్యత్వ నమోదు కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచి ఆరుగురికి ఇన్విటేషన్స్ రావడం గర్వంగా ఉంది. వీరితో పాటు భారతదేశం తరఫున ఆస్కార్ ఆహ్వానం అందుకున్నవారికి కూడా నా శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు రాజమౌళి. కొత్త రూల్ ఓ సినిమాను ఆస్కార్ ఎంట్రీకి పంపాలంటే కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. యూఎస్లోని ఆరు ప్రధాన నగరాల్లో (న్యూయార్క్, లాస్ ఏంజెల్స్, చికాగో, మియామి, అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో) ఆ సినిమా కనీసం ఏడు రోజులు ప్రదర్శితం కావాలి. వీటిలో ఒక షో సాయంత్రం ప్రైమ్ టైమ్లో ఉండాలి, థియేటర్స్లో కనీస సీటింగ్ సామర్థ్యం ఉండాలి. తాజాగా బెస్ట్ పిక్చర్, ఫారిన్ బెస్ట్ ఫిల్మ్ విభాగాలకు సంబంధించి కొత్త రూల్ పెట్టనున్నారట. ఇకపై ఆస్కార్కు ఓ సినిమాను పంపాలంటే యూఎస్లోని పాతికకు పైగా మూవీ మార్కెట్స్ ఉన్నచోట సినిమాలు ప్రదర్శించబడాలట. అది కూడా రెండువారాలకు పైగా. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న పని అని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ కొత్త రూల్ను 97వ ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవం (2025) నుంచి అమలులోకి తేవాలని అవార్డ్ కమిటీ ప్లాన్ చేస్తోందన్నది హాలీవుడ్ టాక్. ఆ నలుగురికీ గౌరవం ‘‘ఈ నలుగురూ చలన చిత్రపరి శ్రమలో మంచి మార్పుకు నాంది అయ్యారు. తర్వాతి తరం ఫిల్మ్ మేకర్స్కి, ఫ్యాన్స్కి స్ఫూర్తిగా నిలిచారు. వీరిని సత్కరించడం ‘బోర్డ్ ఆఫ్ గవర్నర్స్’కి థ్రిల్గా ఉంది’’ అని ఆస్కార్ అకాడమీ అవార్డ్ అధ్యక్షుడు జానెట్ యాంగ్ అన్నారు. సినిమా రంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ‘గవర్నర్ అవార్డ్స్’లో భాగంగా హానరరీ ఆస్కార్ అవార్డ్ను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ఈ గౌరవ ఆస్కార్ను అందుకోనున్న నలుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. నటి ఏంజెలా బాసెట్, రచ యిత–దర్శకుడు–నటుడు–గేయ రచయిత మెల్ బ్రూక్స్, ఫిల్మ్ ఎడిటర్ కరోల్ లిటిల్టన్లతో పాటు సన్డాన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన మిచెల్ సాటర్లకు అవార్డును అందజేయనున్నారు. నవంబర్ 18న లాస్ ఏంజెల్స్లోని ఫెయిర్మాంట్ సెంచరీ ప్లాజాలో జరిగే వేడుకలో ఈ నలుగురూ గౌరవ పురస్కారాలు అందుకుంటారు. -
యునెస్కోలోకి మళ్లీ అమెరికా!
పారిస్: అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతులు, ప్రపంచదేశాలతో సత్సంబంధాల్లో ‘పెద్దన్న’ అనే పేరు కోసం తమతో పోటీపడుతున్న చైనాను నిలువరించేందుకు అమెరికా మరో అడుగు ముందుకేసింది. యునెస్కోలోని చైనా పలుకుబడిని తగ్గించేందుకే అమెరికా ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కృత్రిమ మేథ, సాంకేతిక విద్య వంటి అంశాల్లో యునెస్కోలో ప్రపంచవ్యాప్తంగా పాటించే ప్రమాణాలు, విధాన నిర్ణయాలను తనకు అనువుగా మార్చేందుకు చైనా యత్నిస్తోందని ఇటీవల అమెరికా ఉన్నతాధికారి ఒకరు ఆరోపించడం తెల్సిందే. దీంతో యునెస్కోలో తాజా సభ్యత్వం కోసం అమెరికా రంగంలోకి దిగుతోంది. యునెస్కోలో అమెరికా మళ్లీ చేరబోతున్నట్లు ఆ దేశ అధికారులు సోమవారం ప్రకటించారు. గతంలో పాలస్తీనాను సభ్యదేశంగా చేర్చుకునే అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా యునెస్కో నుంచి తప్పుకుంటానని బెదిరించింది. 2017లో నాటి ట్రంప్ సర్కార్ యునెస్కో నుంచి వైదొలగింది. ఆనాటి నుంచి దాదాపు రూ.5,100 కోట్ల విరాళాలు ఆపేసింది. తాజాగా ఆ నిధులన్నీ చెల్లిస్తామంటూ యునెస్కో మహిళా డైరెక్టర్ జనరల్ ఆండ్రీ ఆజౌలేకు అమెరికా ఉన్నతాధికారి రిచర్డ్ వర్మ లేఖ రాశారు. గతంలో యునెస్కోకు అమెరికానే అతిపెద్ద దాతగా ఉండేది. ఇది యునెస్కోకు చరిత్రాత్మక ఘటన అంటూ అమెరికా తాజా నిర్ణయాన్ని ఆండ్రీ స్వాగతించారు. -
కరాటే కల్యాణికి బిగ్ షాక్.. మా సభ్యత్వం రద్దు!
సినీనటి కరాటే కళ్యాణికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ షాకిచ్చింది. ఆమెను మా నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కల్యాణి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమెకు వివరిస్తూ లేఖ రాశారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. (ఇది చదవండి: కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?) అయితే మా నోటీసులపై స్పందించిన కరాటే కళ్యాణ్ ఈ నెల 16న తన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఆమె సమాధానం పట్ల మా అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తి చేసింది. ఈ నెల 23న జరిగిన కార్యవర్గ సమావేశంలో నిబంధనల ప్రకారం కరాటే కల్యాణిని సస్పెండ్ చేస్తున్నట్లు రఘుబాబు ప్రకటించారు. మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. (ఇది చదవండి: ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్) అసలేం జరిగిందంటే.. సీనియర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల ఈ విగ్రహావిష్కరణ మే 28న జరగనుంది. అయితే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి వీల్లేదంటూ కరాటే కల్యాణి వ్యాఖ్యానించారు. ఎందుకు దేవుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. దీంతో ఎన్టీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. -
అనర్హతవేటు ఎత్తివేత.. ఫైజల్ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ
సాక్షి, ఢిల్లీ: లక్షద్వీప్ ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్సభ సభ్యత్వం విషయంలో.. లోక్సభ సెక్రటేరియెట్ వెనక్కి తగ్గింది. సుప్రీం కోర్టులో ఇవాళ వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫైజల్పై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు, లక్షద్వీప్ లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది లోక్సభ. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియెట్ జనరల్ పేరిట ఓ నోటిఫికేషన్ను ఉదయమే రిలీజ్ చేసింది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో.. మాజీ కేంద్ర మంత్రి పీఎం సయ్యిద్ అల్లుడు మహ్మద్ సాలిహ్పై హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు మహ్మద్ ఫైజల్పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు 2016, జనవరి 5వ తేదీన ఫైజల్పై అండ్రోథ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఆ కేసు కొనసాగుతుండగానే.. 2019లో ఆయన లోక్సభ ఎంపీగా నెగ్గారు. అయితే.. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఫైజల్తో పాటు మరో ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది కవరత్తి కోర్టు. దీంతో జనవరి 13వ తేదీన లోక్సభ సచివాలయం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ.. అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. అది తప్పుడు కేసు అని, ఫైజల్ను నిర్దోషిగా తేలుస్తూ, లోక్సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించే అంశం పరిశీలించమని లోక్సభ సెక్రటేరియట్కు కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, లోక్సభ సెక్రటేరియేట్ మాత్రం జాప్యం చేస్తూ వస్తోంది. దీంతో కింది కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే విధించినా, లోక్సభ సెక్రటేరియట్ మాత్రం తనను అనర్హునిగా ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవడం లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారాయన. ఈ పిటిషన్పై సుప్రీం ధర్మాసనం మంగళవారం వాదనలు వింది. బుధవారం కూడా వాదనలు వినాల్సి ఉంది. ఈ లోపే లోక్సభ సచివాలయం ఆయన అనర్హత వేటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. తాజాగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడంతో.. ఫైజల్ కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి, ఇవి రాహుల్ కేసులోనూ వర్తించే అవకాశాలున్నాయన్న చర్చ ద్వారా ఆసక్తి రేకెత్తింది. -
అమెజాన్ యూజర్లకు గుడ్న్యూస్.. తక్కువ ధరకే కొత్త ప్లాన్, ప్రైమ్ కంటే చవక!
కరోనా తర్వాత ఓటీటీ చూసేవారి సంఖ్య భారీగానే పెరిగింది. దీంతో ప్రముఖ సంస్థలన్నీ కంటెంట్తో కస్టమర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో పలు కంపెనీలు తమ నెల, వార్షిక, ప్లాన్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ వాసులు మాత్రం క్వాలిటీ కంటెంట్తో పాటు కాస్త కాస్ట్ తక్కువ ఉండే వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఓటీటీ సంస్థలు కాస్త తక్కువ ధరలో ప్లాన్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ కస్టమర్ల కోసం అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon prime Lite) పేరిట ఓ కొత్త ప్లాన్ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. చవకైన ప్లాన్.... అమెజాన్ ఐడియా అదిరింది అమెజాన్ ప్రైమ్.... షాపింగ్, ప్రైమ్ వీడియో, మ్యూజిక్, ఇ-బుక్స్ ఇలా అన్నింటికీ కలిపి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ (Amazon prime) అందిస్తున్న తెలిసిందే. గతంలో తన వార్షిక ప్లాన్ ధరను రూ. 999 నుంచి రూ. 1499కి పెంచేసింది. ఇప్పటికే మార్కెట్లో ప్రత్యర్థి కంపెనీలతో పోటీ తీవ్రంగా ఉండడంతో పాటు తమ ధరల పెంపు కూడా అమెజాన్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. దీంతో తమ వినియోగదారుల కోసం అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon prime Lite) పేరిట వార్షిక ప్లాన్ను రూ.999కే తీసుకురానుంది. అంటే నెట్ఫ్లిక్స్ తర్వాత, అమెజాన్ ప్రైమ్ చౌకైన, యాడ్-సపోర్టెడ్ ప్లాన్ను ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అమెజాన్ ప్రైమ్ తరహాలోనే లైట్లోనూ కొన్ని మినహాయింపులతో దాదాపు అవే సదుపాయాలను అందించబోతున్నారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉన్న ఈ వెర్షన్ను, ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంచింది. అనంతరం దశలవారీగా భారత్లో యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మ్యూజిక్, బుక్స్, గేమ్స్ అవసరం లేదనుకునేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఈ రెండూ కాకుండా అమెజాన్ ఏడాదికి రూ.599కే ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్ అందిస్తోంది. ఇందులో ఎస్డీ క్వాలిటీలో వీడియోలు చూసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇతర సదుపాయాలేవీ ఉండవు. అమెజాన్ ప్రైమ్ యూజర్లకు సేమ్ డే డెలివరీ, వన్ డే డెలివరీ సదుపాయం ఉంది. అయితే త్వరలో రాబోతున్న లైట్ యూజర్లకు మాత్రం ఈ సదుపాయం ఉండదు. ఫ్రీ డెలివరీ, రెండ్రోజుల స్టాండర్డ్ డెలివరీ సదుపాయం మాత్రమే ఉంటుంది. చదవండి: కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్! -
అధీకృత సంస్థగా ఎంఈడీఈపీసీ
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, మానిటర్స్, మొబైల్స్ విడిభాగాల ఎగుమతికై ఎగుమతి కంపెనీలకు కావాల్సిన రిజిస్ట్రేషన్/మెంబర్షిప్ సర్టిఫికేట్ జారీ చేయడానికి.. మొబైల్, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్కు (ఎంఈడీఈపీసీ) ప్రభుత్వం అధికారం ఇచ్చింది. ప్రొజెక్టర్లు, టీవీలు, ప్రింటర్లు, ఫోటోకాపీయింగ్ మెషీన్స్ వంటి ఇతర ఉత్పత్తులకూ ఎంఈడీఈపీసీ ధ్రువీకరణ పత్రం జారీ చేయనుంది. ఎగుమతి కంపెనీలు ఫారెన్ ట్రేడ్ పాలసీ కింద ప్రయోజనాలు పొందాలంటే ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. -
ట్విటర్లో బ్లూ టిక్ పెయిడ్ వెర్షన్ ప్రారంభం.. భారత్లో ఎప్పుడంటే?
ట్విటర్లో బ్లూ టిక్ పెయిడ్ వెర్షన్ ప్రారంభమైంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేకి చెందిన ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. నెలకు 7.99 డాలర్లు చెల్లించి ట్విటర్ బ్లూకి సైనప్ కావొచ్చంటూ ఐఫోన్ యూజర్లకు నోటిఫికేషన్ పంపించింది. ఈ సందర్భంగా ఓ ట్విటర్ యూజర్ భారత్లో ఈ పెయిడ్ వెర్షన్ ఎప్పుడు ప్రారంభిస్తున్నారని అడిగిన ప్రశ్నకు ఎలన్ మస్క్ స్పందించారు. మరో నెలలో ప్రారంభం కావొచ్చని అన్నారు. ట్విటర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి బ్లూ చెక్మార్క్తో పాటు యాడ్స్ తక్కువ డిస్ప్లే చేయడంతో పాటు అదనపు ఫీచర్లను అందిస్తామని వెల్లడించారు. .@elonmusk When can we expect to have the Twitter Blue roll out in India? #TwitterBlue — Prabhu (@Cricprabhu) November 5, 2022 అంతేకాదు ట్విటర్లో వర్డ్స్ పరిధిని పెంచనున్నట్లు మస్క్ చెప్పిన విషయం తెలిసిందే. ట్విటర్లో సుదీర్ఘ సందేశాలు పోస్ట్ చేసేందుకు వీలులేదు. అలాంటి ఇబ్బందులను తొలగించడానికే పెద్ద పెద్ద మెస్సేజ్లను సైతం పోస్ట్ చేసేలా మార్పులు చేయనున్నట్లు మస్క్ ప్రకటించారు. చదవండి👉 ట్విటర్ తొలగింపులు, మాజీ ఉద్యోగులకు కొత్త చిక్కులు -
యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్!
యూట్యూబ్(Youtube).. అటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ ఎక్కడ విన్నా ఈ పేరే వినపడుతోంది. విభిన్నమైన కంటెంట్లతో పాటు తమలోని టాలెంట్ని ప్రదర్శించేందుకు అనువైన వేదికగా మారింది యూట్యూబ్. అందుకే పిల్లలు, టీనేజర్లు అనే తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకున్న అతిపెద్ద వీడియో ప్లాట్ఫాంగా అవతరించింది. ప్రస్తుతం ఈ ప్రముఖ సంస్థ తన యూజర్ల కోసం వెల్కమ్ ప్రోగ్రామ్ను అందిస్తోంది. అది కూడా కేవలం పది రూపాయలకే యూట్యూబ్ ప్రీమియం మూడు నెలల సబ్స్క్రిప్షన్ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఎంతకాలం అందుబాటులో ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. దీంతో ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్ యూట్యూబ్లో మనకి కావాల్సిన వీడియోలను వీటితో పాటు పలు సర్వీస్లు కూడా ఉచితంగా చూసే వెసలుబాటు కల్పిస్తోంది. కానీ యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) అనేది సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నగదు చెల్లిస్తేనే ఈ సేవలను పొందగలం. ఇందులో యాడ్-ఫ్రీ వీడియో ఎక్స్ ఫీరియన్స్, వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోలను ఆఫ్లైన్లో ప్లే చేయడం, బ్యాక్గ్రౌండ్లో వీడియోలను ప్లే చేయడం, YouTube Musicకు మెంబర్షిప్ వంటి అనేక ఇతర ఫీచర్లను YouTube Kids యాప్పై అందిస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్ ప్రకటించిన ఆఫర్ ప్రకారం ఈ సేవలన్నీ కేవలం పది రూపాయలకే మూడు నెలల పాటు పొందచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే, YouTube తీసుకొచ్చిన ఈ ఆఫర్ మొదటిసారిగా యూట్యూబ్ రెడ్ (YouTube Red), మ్యూజిక్ ప్రీమియం (Music Premium), యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium), గూగుల్ ప్లే (Google Play) సబ్స్క్రైబర్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఈ ఆఫర్ కాలం పూర్తయిన తర్వాత యూట్యూబ్ ప్రీమియం ఫీచర్లను పొందాలంటే నెలకు రూ.129 చెల్లించాలి. మరో విషయం ఏమిటంటే రూ.10 ఆఫర్ ముగియడానికి 7 రోజుల ముందు సబ్స్క్రైబర్కు YouTube గుర్తుచేస్తుంది, తద్వారా వారు సభ్యత్వాన్ని కొనసాగిస్తారా లేదా నిలిపివేస్తారా అనేది వారే నిర్ణయించుకోవచ్చు. చదవండి: భారత్లో తొలిసారి, కొత్త వాషింగ్ మెషీన్ వచ్చిందోచ్.. నోటితో చెప్తే ఉతికేస్తుంది! -
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకివ్వరు?
ఐక్యరాజ్యసమితి: భారత్, జపాన్, బ్రెజిల్, ఉక్రెయిన్ లాంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకు కల్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిలదీశారు. శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం జరిగిన ఐరాస సాధారణ సభ చర్చా కార్యక్రమంలో వర్చువల్గా ప్రసంగించారు. భదత్రా మండలిలో అన్ని గొంతుకలకు అవకాశం కల్పించాలన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, సెంట్రల్, ఈస్ట్రన్ యూరప్లకు వీటో అధికారం ఉండాలని సూచించారు. సమతూకంతో కూడిన భదత్రా మండలిని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఇప్పటికే శాశ్వత సభ్యదేశ హోదా పొందిన రష్యా ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై ఏనాడూ మాట్లాడలేదని జెలెన్స్కీ విమర్శించారు. అందుకు కారణమేంటో చెప్పాలన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇప్పుడు ఐదు శాశ్వత సభ్యదేశాలున్నాయి. అవి రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మరికొన్ని దేశాలకు ఈ హోదా కల్పించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే. -
బయటకు పొక్కని ‘రహస్యం’.. ఆ విషయంలో చేతులెత్తేశారా?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నత్త నడకన సాగడానికి కారణమేంటి ? టీడీపీ సభ్యత్వం అనుకున్న లక్ష్యాన్ని ఎందుకు సాధించలేకపోతోంది? దేశంలోనే పెద్ద ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే చంద్రబాబు సభ్యత్వాన్ని ఎందుకు పూర్తి చేయించలేకపోతున్నారు? లక్ష్యం సాధించని సభ్యత్వం మీద పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు ఎందుకు స్పందించడంలేదు? చదవండి: బీజేపీతో పొత్తు కోసం తహతహ.. ఎల్లో మీడియాకు నిద్ర కరువైందా? ఎందుకీ ఫేక్ న్యూస్ దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక సభ్యత్వం ఉన్నది తమకే అంటూ తెలుగుదేశం నాయకులు బాకాలు ఊదేవారు. ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత కార్యకర్తల బలగం టీడీపీకి ఉందని చంద్రబాబు, లోకేష్ గొప్పలు చెప్పుకున్నారు. టీడీపీకి 70 లక్షల కార్యకర్తల బలం ఉందని అనేవారు. ఈ సారి జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా గతాన్ని మించి ఘనంగా జరగాలని నాయకులను కార్యకర్తలను చంద్రబాబు ఆదేశించారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత కరోనా నేపథ్యంలో రెండేళ్లపాటు సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని చేపట్టలేదు. గత ఏప్రిల్ 21వ తేదీన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మహానాడు ముగిసే సమయానికి సభ్యత్వ నమోదులో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని నాయకులకు చంద్రబాబు దిశ నిర్దేశం చేశారు. 70 లక్షల టార్గెట్ మించి సభ్యులను చేర్చుకోవాలని ఆదేశించారు. కార్యక్రమం చేపట్టి నాలుగు నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో సభ్యత్వం జరగలేదు. ఈ నాలుగు నెలల వ్యవధిలో టీడీపీ సభ్యత్వం 20 లక్షల కూడా దాటలేదు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులందరూ కలిసి సభ్యత్వ నమోదుపై స్పీడ్ పెంచాలని ప్రతిరోజు జూమ్ సమావేశాల్లో చంద్రబాబు, లోకేష్ ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ నాయకులు మాత్రం తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనుకున్న స్థాయిలో జరగలేదు. లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో కూడా లోకల్ కేడర్ మాట వినే స్థితిలో లేరు. కుప్పం నియోజకవర్గం అందరికంటే ముందుందని చెబుతున్న చంద్రబాబు ఎంత సభ్యత్వం జరిగింది అనే దాని మీద మాత్రం నోరు విప్పలేదు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో పాటు వారి బంధువులు కూడా టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని ప్రతి సమావేశంలోనూ చంద్రబాబు పిలుపునిస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ ప్రతి ఐదు లక్షల సభ్యత్వం పూర్తయిన ప్రతిసారి మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడించేవారు. ప్రస్తుత సభ్యత్వ నమోదు గురించి ఇప్పటివరకు చంద్రబాబు గాని లోకేష్ గాని నోరు విప్పలేదు. తెలుగుదేశం పార్టీకి నాయకులు ఇస్తున్న విరాళాలు లెక్కలు చెబుతున్నారే తప్ప పార్టీ సభ్యత్వ వివరాల మాత్రం బయటకు పొక్కనివ్వడం లేదు. కార్యకర్తల నుంచి స్పందన లేకపోవడంతో దాన్ని కవర్ చేసుకునేందుకు చంద్రబాబు లోకేష్ నానా తంటాలు పడుతున్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించిన యాప్ సహకరించడం లేదంటూ ఎల్లో మీడియాలో లీక్లు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు అనుకున్న స్థాయిలో జరగకపోవడానికి మరొక కారణం ఉందనే చర్చ టీడీపీలో అంతర్గతంగా నడుస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కులాలు, మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తున్నారని, ఈ పథకాలు వైఎస్సార్ సీపీని అభిమానించేవారితో పాటుగా.. అదే స్థాయిలో టీడీపీ అభిమానులకు కూడా అందుతున్నాయి అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున ఇక తమకు పార్టీలు ఎందుకని తెలుగుదేశం కార్యకర్తలు సభ్యత్వ నమోదుపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఈయూలోకి ఉక్రెయిన్!
కీవ్: యూరోపియన్ యూనియన్లో ఉక్రెయిన్కు సభ్యత్వం కల్పించాలని ఈయూ కమిషన్ శుక్రవారం సిఫార్సు చేసింది. జర్మనీ, ఇటలీ, రొమేనియా, ఫ్రాన్స్ అధినేతలు గురువారం ఉక్రెయిన్లో పర్యటించి, ఈయూలో సభ్యత్వం విషయంలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఈయూ కమిషన్ సానుకూలంగా స్పందించి, సిఫార్సు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్ తన సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చుకొనే క్రమంలో ఇది మొదటి అడుగు అని చెప్పొచ్చు. ఈయూ కమిషన్ సిఫార్సుపై వచ్చే వారం బ్రస్సెల్స్లో 27 సభ్యదేశాల నాయకులు సమావేశమై, చర్చించనున్నారు. అన్ని దేశాల నుంచి అంగీకరించే ఉక్రెయిన్కు ఈయూ సభ్యత్వం ఖరారైనట్లే. అయితే ఇది వెంటనే సాధ్యం కాదని, కార్యరూపం దాల్చడానికి మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరాలో కోత రష్యా మరోసారి యూరప్ దేశాలకు సహజ వాయువు సరఫరాలో కోత విధించింది. ఇటలీ, స్లొవేకియాకు సగం, ఫ్రాన్స్కు పూర్తిగా కోత విధించింది. దాంతో జర్మనీ, ఆస్ట్రియా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యూరప్లో ఇంధనం ధరలు, తద్వారా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. యూరప్ దేశాల్లో విద్యుత్ ఉత్పత్తికి రష్యా నుంచి సరఫరా అయ్యే గ్యాస్ చాలా కీలకం. ఉక్రెయిన్లో బ్రిటిష్ ప్రధాని బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ శుక్రవారం ఉక్రెయిన్ పర్యటన ప్రారంభించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. కీవ్కు మరోసారి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలైన తర్వాత బోరిస్ జాన్సన్ ఇక్కడికి రావడం ఇది రెండోసారి. ఉక్రెయిన్పై రష్యా దాడులను జాన్సన్ మొదటినుంచీ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఉక్రెయిన్కు అండగా ఉంటామని చెబుతున్నారు. బ్రిటిన్ ఇప్పటికే కోట్లాది పౌండ్ల సాయాన్ని ఉక్రెయిన్కు అందజేసింది. -
నిర్మలా సీతారామన్ రాజ్యసభ సభ్యత్వంపై ఉత్కంఠ
-
నాటో దిశగా ఫిన్లాండ్ అడుగులు
కీవ్: నాటో సభ్యత్వం కోసం ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేయాలని యోచిస్తున్నట్లు ఫిన్లాండ్ నాయకులు చెప్పారు. దీంతో ఇప్పటివరకు తటస్థంగా ఉన్న ఫిన్లాండ్ ఇకపై రష్యా వ్యతిరేక కూటమిలో చేరబోతున్నట్లవుతోంది. నాటోలో చేరడం ఫిన్లాండ్ రక్షణను బలోపేతం చేస్తుందని, అదేవిధంగా నాటో కూటమి దేశాలకు బలాన్నిస్తుందని ఆదేశ అధ్యక్షుడు సౌలి నినిస్టో, ప్రధాని సన్నా మరిన్ చెప్పారు. నాటోలో వెంటనే చేరాలని, ఇందుకు అవసరమైన చర్యలను రాబోయే రోజుల్లో చేపడతామని తెలిపారు. ఫిన్లాండ్ ప్రకటనపై రష్యా హెచ్చరిక స్వరంతో స్పందించింది. ఆ దేశం నాటోలో చేరితే రష్యాతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయని, ఉత్తర యూరప్లో స్థిరత్వం నాశనమవుతుందని రష్యా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. తమ భద్రతకు ముప్పు తెచ్చే చర్యలకు తాము తగిన మిలటరీ చర్యలతో స్పందిస్తామన్నారు. రష్యాతో ఫిన్లాండ్ ఎందుకు ఘర్షణ కోరుతుందో, ఎందుకు స్వతంత్రాన్ని వద్దనుకొని వేరే కూటమిలో చేరుతుందో భవిష్యత్ చరిత్ర నిర్ధారిస్తుందన్నారు. నాటో పొరుగుదేశం స్వీడన్ సైతం త్వరలో నాటోలో చేరడంపై నిర్ణయం తీసుకోనుంది. నాటోలో చేరికకు ఈ దేశాలు దరఖాస్తు చేసుకుంటే వాటిని నాటో దేశాల పార్లమెంట్లు ఆమోదించి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది. నాటోలో చేరాలన్న ఫిన్లాడ్ నిర్ణయాన్ని నాటో సభ్యదేశాలు స్వాగతించాయి. మీ వల్లనే...: నాటోలో చేరాలని తాము భావించేందుకు రష్యానే కారణమని ఫిన్లాండ్ నాయకులు ఆరోపించారు. తమకు హెచ్చరికలు చేసేముందు రష్యా అద్దంలో చూసుకోవాలన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నేతలు పరోక్షంగా చెప్పారు. ఉక్రెయిన్కు మద్దతుపై ఇటీవలే ఫిన్లాండ్ నేతలు జెలెన్స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్పై దాడి వల్లనే ఇంతకాలం తటస్థంగా ఉన్న స్వీడన్, ఫిన్లాండ్ నాటోవైపు మొగ్గు చూపాయి. ఆదేశాల్లో ప్రజానీకం కూడా నాటోలో చేరడంపై సుముఖంగా స్పందించింది. రష్యా దాడి మొత్తం యూరప్ భద్రతను సంశయంలో పడేసిందని ఈ దేశాలు ఆరోపించాయి. ఈ దేశాలు నాటోలో చేరితే తమకు మరింత బలం చేకూరుతుందని నాటో అధిపతి జనరల్ స్టోల్టెన్బర్గ్ అభిప్రాయపడ్డారు. దరఖాస్తు చేసిన రెండువారాల్లో వీటి అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని నాటో అధికారులు చెప్పారు. దాడులే దాడులు..: ఒకపక్క అనుకున్న విజయం దక్కకపోవడం, మరోపక్క తటస్థ దేశాలైన స్వీడన్, ఫిన్లాండ్ నాటోలో చేరాలనుకోవడం.. రష్యాకు అసహనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తూర్పుప్రాంతంపై రష్యా తన దాడులు ముమ్మరం చేసింది. ఇదే సమయంలో మారియుపోల్లో మిగిలిన ఉక్రెయిన్ సేనలను తుడిచిపెట్టేందుకు వాయుదాడులు కూడా జరిపింది. ఇది కూడా చదవండి: ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు.. కిమ్ కీలక నిర్ణయం -
కాంగ్రెస్కు 2.6 కోట్ల డిజిటల్ సభ్యులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ గతేడాది నవంబర్లో ప్రారంభించిన దేశవ్యాప్త డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ శుక్రవారంతో ముగిసింది. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ తదితర ప్రముఖులు సహా 2.6 కోట్లమంది డిజిటల్ సభ్యులుగా నమోదయ్యారు. 2022–27 సంవత్సరాలకు పార్టీ సభ్యత్వ నమోదును రాతపూర్వక రశీదులతోపాటు డిజిటల్గాను ఈసారి కాంగ్రెస్ చేపట్టింది. దేశవ్యాప్తంగా 5 లక్షల మంది పార్టీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ మెంబర్షిప్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు చేపట్టినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. -
రష్యాతో చర్చల వేళ.. ఈయూ ఎదుట జెలెన్ స్కీ కీలక డిమాండ్
కీవ్: ఉక్రెయిన్పై రష్యా బలగాల దాడులు ఐదో రోజు కొనసాగుతున్నాయి. మరోవైపు బెలారస్లోని ఫ్యాఫిట్ వేదికగా ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలకు ఉక్రెయిన్ నుంచి ఆ దేశ రక్షణశాఖ మంత్రి హాజరయ్యారు. ఈ చర్చల్లో ఇరు వర్గాలు పలు డిమాండ్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. యూరోపియన్ యూనియన్ ఎదుట కీలక ప్రతిపాదనను ఉంచారు. సోమవారం జెలెన్ స్కీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోలో తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని జెలెన్స్కీ అభ్యర్థించారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది తమ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ న్యాయమైన హక్కు అని తాను అనుకుంటున్నానని, ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్కు యుద్ధ విమానాలు పంపాలని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఉక్రెయిన్కు ఫైటర్ జెట్లను అందించాలని నిర్ణయించినట్టు ఈయూ కూటమి విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ తెలిపారు. దీంతో రష్యాపై దాడులను తీవ్రతరం చేసేందుకు ఉక్రెయిన్కు ఊహించని మద్దుతు తోడైంది. -
సభ్యత్వం చేయకపోతే పదవులు రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని, సభ్యత్వ నమోదులో క్రియాశీలకంగా పనిచేయనివారికి పార్టీలో భవిష్యత్ ఉండదని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. అలాంటి వారికి పదవులు రావడం కష్టమన్నారు. సభ్యత్వ నమోదును ఏఐసీసీ చాలా సీరియస్గా పరిగణిస్తోందని, రోజూ ఢిల్లీస్థాయిలో సమీక్షిస్తోందని చెప్పారు. పార్టీ నేతలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, సమన్వయకర్తలు, బూత్స్థాయి ఎన్రోలర్లు సమష్టిగా పనిచేసి 30 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన గాం«దీభవన్లో డిజిటల్ సభ్యత్వ నమోదుపై పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. పార్టీ బలోపేతానికి, రానున్న ఎన్నికల్లో గెలుపునకు సభ్యత్వాలు చాలా కీలకమని, ప్రతి పోలింగ్ బూత్లో కనీసం 100 మందిని పార్టీ సభ్యులుగా చేర్పించాలని చెప్పారు. ఫిబ్రవరి 9న మళ్లీ దీనిపై సమీక్షించనున్నారు. 11 గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్కుమార్గౌడ్, అంజన్కుమార్ యాదవ్, డిజిటల్ సభ్యత్వ నమోదు రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు అడిగితే దాడులా? రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని రేవంత్రెడ్డి ఆరోపించారు. ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతిని మూడేళ్లయినా అమలుపర్చలేదని, ఈ విషయాలను అడిగేందుకు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడికి వెళ్లిన యూత్ కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నేతలు దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలో యూత్ కాంగ్రెస్ నేత రవికాంత్గౌడ్పై ఎమ్మెల్యే కిషన్రెడ్డి అనుచరులు దాడి చేశారని, జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిలో పోలీసుల అత్యుత్సాహం కారణంగా కార్యకర్త శ్రీనివాస్ నాయక్ కాలు విరిగిందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యమం ఉధృతం చేస్తాం: శివసేనారెడ్డి ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడిలో భాగంగా వినతిపత్రాలు సమరి్పంచేందుకు వెళ్లిన యువజన కాంగ్రెస్ నేతలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఎమ్మెల్యేలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. దేశంలోనే నంబర్ 1 నల్లగొండ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పార్టీ సభ్యత్వ నమోదులో నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని గాం«దీభవన్ వర్గాలు చెప్పాయి. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో 3.50 లక్షల సభ్యత్వం నమోదైందన్నాయి. దీని పరిధిలోని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 76,252, సూర్యాపేటలో 73,697, కోదాడలో 55,682, మిర్యాలగూడలో 38,456, దేవరకొండలో 38,380, నాగార్జునసాగర్లో 57,260, నల్లగొండలో 8,711 సభ్యత్వాలను ఈ నెల 29 నాటికి పూర్తి చేసినట్టు చెప్పాయి. నల్లగొండ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో భారీస్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయి. -
మెంబర్ షిప్ కోసం 20 ఏళ్లు వెయిటింగ్.. కొందరు ఆ కోరిక తీరకుండానే
సాక్షి, హైదరాబాద్: ఏదైనా క్లబ్బులో సభ్యత్వం కావాలంటే నిర్దేశిత మొత్తం చెల్లిస్తే చాలు వెంటనే అవకాశం కల్పిస్తారు. మరీ డిమాండ్ ఉన్న క్లబ్బుల్లో ఒకటి రెండేళ్లు లేదా గరిష్టంగా ఐదేళ్లు వేచి చూడాల్సి ఉంటుంది. అదే సికింద్రాబాద్ క్లబ్ మెంబర్షిప్ పొందాలంటే 20 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సిందే. అప్పటికీ సభ్యత్వం లభిస్తుందన్న గ్యారంటీ లేదు. గత పదేళ్లుగా కొత్త సభ్యత్వాలే ఇవ్వలేదు. సభ్యత్వం కోసం దరఖాస్తు చేసిన వారిలో కొందరు ఆ కోరిక తీరకుండానే చనిపోయారంటే అతిశయోక్తి కాదేమో. 218 ఏళ్ల క్రితం అప్పటి నిజాం నవాబు ప్రస్తుత అల్వాల్ పరిధిలోని ప్రాంతాలను సికింద్రాబాద్గా నామకరణం చేశారు. 1806లో హుస్సేన్ సాగర్కు తూర్పున ఉన్న 13 మొఘలాయి గ్రామాలను బ్రిటిష్వారికి అప్పగించారు. అదే కాలక్రమేణ కంటోన్మెంట్గా ఏర్పడింది. ► నిజాం ఆధీనంలోని హైదరాబాద్కు సమాంతరంగా బ్రిటిషర్లు సికింద్రాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. మిలిటరీ అధికారుల వినోదం కోసం క్రీడాప్రాంగణాలు, బార్లు, థియేటర్ల ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మిలిటరీ అధికారుల సంక్షేమం కోసం ఏర్పాటైన ఓ సంఘం ఆధ్వర్యంలో 1878లో ‘పబ్లిక్ రూమ్స్’ పేరిట ఓ క్లబ్ను ఏర్పాటు చేశారు. ► తొలుత బొల్లారం (సికింద్రాబాద్ స్టేషన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ప్రాంతం)లో ఏర్పాటైన ఈ సంఘం తమ కార్యాలయాన్ని తొకట్టా గ్రామ (కాలక్రమంలో ఇదే బోయిన్పల్లిగా మారింది) పరిధిలోని 20.17 ఎకరాల విస్తీర్ణంలోని ఓల్డ్ గ్రాంట్ బంగళా (ఓజీబీ)లోనికి మార్చారు. ► 1836 గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఓల్డ్ గ్రాంట్ బంగళాల స్థలం పూర్తిగా ఆర్మీ ఆధీనంలో, భవనం మాత్రమే హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్ఓఆర్) కింద యజమానులకు అప్పగించారు. ఈ మేరకు సికింద్రాబాద్ క్లబ్ స్థలం యాజమాన్యం ఇప్పటికీ ఆర్మీ ఆధీనంలో ఉండగా, భవనం మాత్రమే క్లబ్ నిర్వాహకుల చేతుల్లో ఉంది. ► కాలక్రమేనా సికింద్రాబాద్ గారిసన్ క్లబ్, సికింద్రాబాద్ జింఖానా క్లబ్, యునైటెడ్ సర్వీసెస్ క్లబ్, సికింద్రాబాద్ క్లబ్గా మారింది. ► సికింద్రాబాద్ క్లబ్బులో సభ్యత్వం పొందిన వారు ‘ఎలైట్ పర్సన్స్’గా చెలామణి అయ్యే వారు. ► 2010 నాటికి ఈ క్లబ్బులో సభ్యుల సంఖ్య 8 వేలకు చేరుకోవడంతో కొత్త సభ్యత్వాలను నిలిపివేశారు. అప్పటికే 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి సైతం నేటికీ సభ్యత్వాలు దక్కలేదు. (చదవండి: బ్రాండ్ హైదరాబాద్.. లండన్, న్యూయార్క్.. ఇప్పుడు మనదగ్గర) కార్పొరేట్ సభ్యత్వానికి రూ.10 లక్షలు సికింద్రాబాద్ క్లబ్లో సభ్యత్వం దక్కని వారికి ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ సభ్యత్వాలకు అవకాశం కల్పించారు. రూ.10 లక్షల నాన్ రీఫండబుల్ రుసుముతో పదేళ్ల కాలపరిమితితో కూడి సభ్యత్వాన్ని అందజేస్తారు. కనీసం రూ.2 కోట్ల టర్నోవర్, రూ.5 కోట్లకు మించి నెట్వర్త్ కలిగిన హైదబాద్లోని వ్యాపారులకు మాత్రమే ఈ సభ్యత్వం ఇస్తారు. ఇవి కూడా 250 మించి ఇవ్వరు. సికింద్రాబాద్ మిలిటరీ స్టేషన్ పరిధిలోని మిలిటరీ ఉన్నతాధికారులకు నేరుగా సభ్యత్వం ఇస్తారు. ఇది కూడా గరిష్టంగా 1100 మందికి మాత్రమే ఇస్తారు. (చదవండి: హైదరాబాద్లో ఎలక్ట్రిక్ రేస్ కార్లతో.. ‘ఫార్ములా–ఈ’) ► ఈ క్లబ్లకు దేశీయంగా వివిధ పట్టణాల్లోని 71 పేరెన్నిక కలిగిన క్లబ్బులు, అంతర్జాతీయంగా యూకే, లండన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా వివిధ దేశాల్లోని 20కి పైగా క్లబ్బులతో అఫిలియేషన్ ఉంది. అంటే ఈ క్లబ్బు సభ్యులను అఫిలియేషన్ ఉన్న ఆయా క్లబ్బుల్లోకి అతిథులుగా అనుమతిస్తారు. సికింద్రాబాద్ క్లబ్బు సభ్యత్వానికి డిమాండ్ పెరగడానికి ఈ అఫిలియేషన్ కూడా ఒకటి కావడం గమనార్హం. (చదవండి: నా కల నెరవేర్చావు.. థ్యాంక్ యూ కేటీఆర్: ఆనంద్ మహీంద్రా) -
మందు, డ్రగ్స్కి దూరం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం కొత్తగా తీసుకోవాలని అనుకునే వారికి ఆ పార్టీ నూతన నిబంధనలు ప్రవేశపెట్టింది. మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, పార్టీ విధానాలను, కార్యక్రమాలను ఎప్పటికీ బహిరంగ వేదికలపై విమర్శించబోమని ఒక సెల్ఫ్ డిక్లరేషన్ (స్వీయ ధ్రువీకరణ పత్రం) ఇవ్వాలని షరతు విధించింది. నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు చేపట్టనుంది. సభ్యత్వం కోసం రూపొందించిన దరఖాస్తు పత్రంలో కొత్తగా సభ్యులుగా చేరాలనుకునే వారు కచ్చితంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి తీరాలి. ఆదాయానికి మించి ఆస్తులు లేవని, పార్టీని పటిష్టపరిచే కార్యక్రమాల కోసం శారీరక శ్రమకు సిద్ధమేనని అంగీకరించాలి. సామాజిక వివక్ష చూపించమని, వివక్ష, అసమానతల నిర్మూలనకు కృషి చేస్తామని ఇలా మొత్తం 10 పాయింట్లకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేస్తేనే కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లభిస్తుంది. -
అమెజాన్ ప్రైమ్ యూజర్లకు షాక్
ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఓటీటీ డిస్నీ+ హాట్స్టార్ ధరల్ని పెంచాయి. ఇప్పుడు అమెజాన్ సైతం త్వరలో ప్రైమ్ ధరల్ని భారీగా పెంచనున్నట్లు తెలిపింది. అమెజాన్ సైతం ముందస్తుగానే 'లాస్ట్ ఛాన్స్ జాయిన్ ప్రైమ్' పేరుతో యాడ్ను ప్రమోట్ చేయడంతో ప్రైమ్ ధరలు పెరిగడం నిజమేనని ప్రైమ్ వినియోగదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో అమెజాన్ ప్రైమ్ ధరల్ని పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రైమ్ ధర సంవత్సరానికి రూ.999 ఉండగా..పెరగనున్న ధరతో ప్రైమ్ ధరతో రూ.1,499కి చేరనుంది. పెరగనున్న ప్రైమ్ ధరలు ఎలా ఉన్నాయి త్వరలో పెరుగుతున్న ప్రైమ్ ధరల్ని చూసుకుంటే నెలవారీ సబ్స్క్రిప్షన్ రూ.129 ఉండగా అది కాస్తా రూ.179కి పెరగనుంది. క్వార్టల్లీ సబ్ స్క్రిప్షన్ ధర రూ.329 ఉండగా రూ.359కి పెరగనుంది. యానువల్ సబ్ స్క్రిప్షన్ ధర రూ.1,499కి పెరగనుంది. అమెజాన్ ప్రైమ్తో ప్రయోజనాలు అర్హత ఉన్న వస్తువులపై అపరిమిత సంఖ్యలో ఒకటి లేదా రెండు రోజుల పాటు ఉచితంగా డెలివరీ. ప్రైమ్ వీడియో,మ్యూజిక్ సబ్స్క్రిప్షన్. అమెజాన్, ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 5శాతం రివార్డ్ పాయింట్లు. ఆఫర్ సేల్ సమయంలో ప్రైమ్ మెంబర్లు 30 నిమిషాల ముందుగా బుక్ చేసుకోవచ్చు. చదవండి: Netflix: నెట్ఫ్లిక్స్ దశనే మార్చేసిన దక్షిణకొరియన్ డ్రామా..! -
భోజన ప్రియులకు జోమాటో బంపర్ ఆఫర్..!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో తన యూజర్లకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. యూజర్ల కోసం కొత్తగా మరో మెంబర్షిప్ను తొందరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. జోమాటో తన యూజర్ల కోసం ఇప్పటికే జోమాటో ప్రో పేరిట మెంబర్షిప్ను అందుబాటులోకి తెచ్చింది. జోమాటో ప్రో సభ్యత్వంలో భాగంగా రూ. 200 మెంబర్షిప్ను తీసుకుంటే ఫుడ్ డెలివరీలపై 30 శాతం వరకు అదనపు తగ్గింపు, రెస్టారెంట్ డైనింగ్లో 40 శాతం వరకు తగ్గింపుతో పాటు వేగవంతమైన డెలివరీలను అందిస్తోంది. ఈ మెంబర్షిప్ గడువు 90 రోజులుగా ఉంటుంది. తాజాగా జోమాటో తన యూజర్ల కోసం మరో సరికొత్త మెంబర్షిప్ను అందుబాటులోకి తీసుకురానుంది. జోమాటో ప్రో ప్లస్ పేరిట కొత్త మెంబర్షిప్ను ప్రకటించింది. ఈ మెంబర్షిప్లో భాగంగా అపరిమిత ఫ్రీ డెలివరీలను యూజర్లకు జోమాటో అందించనుంది. అంతేకాకుండా ఎలాంటి సర్జ్ ఛార్జీలు, డిస్టాన్స్ ఛార్జీలు, అన్ని ప్రో మెంబర్షిప్ సేవలను జోమాటో అందించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ ట్విటర్లో పేర్కొన్నారు. అయితే ఈ ఆఫర్ కోసం జోమాటో ఒక చిన్న మెలిక పెట్టింది. ఈ మెంబర్షిప్ కోసం జోమాటో యాప్ ఈ రోజు(ఆగస్టు 2) సాయంత్రం ఆరు గంటలకు కొంతమంది యూజర్లకు మాత్రమే ఆహ్వానాన్ని పంపనుంది. ఆహ్వానం వచ్చిన యూజర్లు సదరు అమౌంట్ను చెల్లించి జోమాటో ప్రో ప్లస్ మెంబర్షిప్ సేవలను పొందవచ్చును. జోమాటో ప్రో ప్లస్ మెంబర్షిప్ ధరలను ఇంకా ప్రకటించలేదు. జొమాటో 2008 లో ప్రారంభించగా, ఈ సంవత్సరం ఏప్రిల్లో కంపెనీ రూ. 8,250 కోట్ల వరకు ఐపీవోను దాఖలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు గణనీయంగా పెరిగాయి. We have 1.8mn Zomato Pro members as of today. And one of the most requested features from our customers has been “Unlimited Free Deliveries” (something like Amazon Prime). So… in a few hours, we are launching our Limited Edition *Pro Plus* membership for select customers… pic.twitter.com/RtL4ftDBpt — Deepinder Goyal (@deepigoyal) August 2, 2021 -
Pavala Syamala: పావలా శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి సాయం
సాక్షి, హైదరాబాద్ : నటి పావలా శ్యామల దీనగాధపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆమెను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను తీసుకున్నారు. ‘మా’ సభ్యత్వంతో పాటు లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ సభ్యులు కరాటే కళ్యాణి, సురేష్ కొండేటి శ్యామల ఇంటికి చేరుకొని 'మా' అసోసియేషన్ కార్డు సహా 1,01,500 రూపాయల చెక్కును అందించారు. ఇక ‘మా’ మెంబర్ షిప్ కార్డ్ తో నెలకు 6 వేల చొప్పున ప్రతినెలా ఫించను రూపంలో అందుతుందని తెలిపారు. ‘మా’ సభ్యత్వం పొంది ఉంటే ఎవరైనా ఆర్టిస్ట్ అకాల మరణం చెందితే వారికి రూ. 3లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. పావలా శ్యామల కూతురి వైద్యానికి సంబంధించి న్యూరో సిటీ సెంటర్ వైద్య నిపుణులు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇక చిరంజీవి తనకు సాయం చేయడం పట్ల పావలా శ్యామల ఆనందం వ్యక్తం చేశారు. గతంలోను ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవి రూ. 2లక్షలు ఇచ్చి సాయం అందించారని, మళ్లీ ఇప్పుడు తనను ఆదుకున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..'గతంలోనూ తీవ్ర మానసిక వేదనను అనుభవించాను. నా కుమార్తెకు టీబీ వ్యాధికి చికిత్స చేయించలేని పరిస్థితి. కాలు విరిగి తీవ్ర ఇబ్బందిలో ఉంటే.. అప్పుడు ఆ రెండు లక్షల ఆర్థిక సాయం నన్ను ఎంతో ఆదుకుంది. ఆ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. అప్పుడు సినీ పరిశ్రమలో ఎవరూ సాయం చేయలేదు. కానీ నాకు మెగాస్టార్ కుమార్తె వచ్చి 2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈ కష్టంలో మరోసారి లక్షా పదిహేను వందల రూపాయలను చెక్ రూపంలో అందించారు.అంతేకాకుండా ప్రతి నెలా ఆరువేల రూపాయలు సాయం అందించేందుకు సాయపడ్డారు. మనస్ఫూర్తిగా చిరంజీవి గారికి నా ధన్యవాదాలు' అని అన్నారు. ఇక చిరంజీవి సాయానికి 'మా' కమిటీ సభ్యులు సైతం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చదవండి : పావలా శ్యామలకు ఆర్థిక సహాయం చేసిన డైరెక్టర్ పాపం పావలా శ్యామల.. తిండిలేక, అనారోగ్యంతో.. -
పావలా శ్యామలకు మెగాస్టార్ చిరంజీవి సాయం
-
టీఆర్ఎస్లో సభ్యత్వాల లొల్లి!
సాక్షి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మొదలైన అధికార టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయా..? పాత–కొత్త నేతల మధ్య తిష్టవేసి కూర్చున్న ఆధిపత్య పోరు ప్రభావం చూపుతోందా..? కొత్తగా పార్టీలో చేరి పదవులు చేపట్టిన నేతలున్న చోట ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందా..? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత సభ్యత్వాన్ని నమోదు చేయాలన్నది టీఆర్ఎస్ అగ్రనాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టార్గెట్లు విధించి మరీ సభ్యత్వాలు నమోదు చేయిస్తోంది. సాధారణ సభ్యత్వంతోపాటు.. క్రియాశీలక సభ్యత్వాలు చేయిస్తున్నారు. షరా మామూలుగానే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకే అగ్ర తాంబూలం. దీంతో వారికి ఇష్టమున్న వారికే సభ్యత్వం దక్కుతుంది..? లేదనుకుంటే లేదు.. అది ఎంత పెద్దస్థా యి నాయకుడైనా.. ఎమ్మెల్యే సమ్మతి లేకుండా సభ్యత్వం దక్కే అవకాశమే లేకుండా పోయిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ సమస్యను రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం మాత్రం లభించడం లేదన్నది వారి ఆవేదన. పాత–కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు టీఆర్ఎస్లో గడిచిన అయిదారేళ్లుగా వేళ్లూనుకున్న ప్రధాన సమస్య పాత–కొత్త నేతల ఆధిపత్య పోరు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు.. పార్టీ అధికారం చేపట్టాక వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చి చేరిన వారు పాత–కొత్త నేతలుగానే కొనసాగుతున్నారు. ఈ రెండు వర్గాలు కలిసిపోయి పనిచేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు దాదాపు తక్కువే. ఈ సమస్య ఇపుడు సభ్యత్వాల నమోదుపై ప్ర భా వం చూపుతోందని అంటున్నారు. కేవలం పాత–కొత్త నాయకత్వాలు ఉన్న చోట మాత్రమే కాకుండా.. సమ ఉజ్జీలైన ఇద్దరు నాయకులు ఉన్న చోటా ఈ సమస్య ఉత్పన్నమవుతోందని చెబుతున్నారు. గత సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చోటు చేసుకున్న పరిణామాలే తాజా నమోదు కార్యక్రమంలోనూ పునరావృతమవుతున్నాయని అభిప్రాయం ప డుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ సమ స్య కోదాడ, ఆలేరు, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉందని అంటున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గంలో 50వేల చొప్పున కనీసం ఆరు లక్షల సభ్యత్వాలు చేయించాలని పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. ఆరు నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయని సమాచారం. కాగా, గడిచిన మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇలా.. ► కోదాడలో మొదటి నుంచి శశిధర్ రెడ్డి పార్టీ నేతగా ఉండగా.. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు వచ్చి చేరారు. మొన్నటి 2018 ఎన్నికల్లో బొల్లం మల్లయ్య యాదవ్ టీడీపీ నుంచి గులాబీ గూటికి చేరారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఇక్కడ సభ్యత్వ పుస్తకాలు ఆ పాత నేతలకు ఇచ్చే విషయంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సమాచారం. ► ఆలేరులో ముందు నుంచీ ఎమ్మెల్యే సునిత ఉన్నా.. గత ఎన్నికల ముందు కాంగ్రెస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వెంట కొంత క్యాడర్ వచ్చి చేరింది. వీరికి పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. ► మునుగోడులో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వర్గాలు ఉన్నాయి. నియోజకవర్గ ఇన్చార్జ్గా కూసుకుంట్ల ఉన్నారు. సభ్యత్వ నమోదు పూర్తి బాధ్యత కూడా ఆయనకే ఉంది. దీంతో కర్నె వర్గానికి సభ్యత్వ పుస్తకాలు దక్కడం లేదని చెబుతున్నారు. ► నకిరేకల్ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆ తర్వాతి పరిణామాల్లో టీఆర్ఎస్లో చేరారు. పార్టీ నాయకత్వ నిర్ణయం ప్రకారం నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుప్రీమ్. దీంతో అక్కడి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. నియోజవర్గ వ్యాప్తంగా సభ్యత్వాలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీ, శాసన మండలి డిప్యుటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పంచుకున్నారని అంటున్నారు. దీంతో వీరేశం వర్గ నాయకులకు సభ్యత్వ పుస్తకాలు అందడం కానీ, సభ్యత్వాలు ఇవ్వడం కానీ జరగడం లేదన్నది ఆ వర్గీయుల ఆరోపణ. నాగార్జునసాగర్లో మండలానికో బాధ్యుడు ఉప ఎన్నిక జరగనున్న నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును బయటి ప్రాంతాలకు చెందిన నేతలకు మండలానికొకరి చొప్పున బాధ్యతలు అప్పజెప్పారని స్థానిక నాయకులు చెబుతున్నారు. సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ నియోజకవర్గానికి ప్రస్తుతానికి ఇన్చార్జి అంటూ ఎవరూ లేరు. సభ్యత్వాల నమోదు బాధ్యతను అటు నోముల కుటుంబం నుంచి పార్టీలో నాయకుడిగా ఉన్న ఆయన తనయుడు భగత్కు కానీ, ఇతర నాయకులకు గానీ ఇవ్వలేదని సమాచారం. ఇక్కడినుంచి ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఆయనకూ పూర్తి బాధ్యతలు ఇవ్వలేదని పార్టీ వర్గాల సమాచారం. చదవండి: వామ్మో.. హైదరాబాద్లో పెట్రోల్ ధరలు -
ఇండిగో ఎయిర్లైన్స్కు ఐఏటీఏలో సభ్యత్వం
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ ఇండిగో.. అంతర్జాతీయ విమానయాన సంఘం (ఐఏటీఏ)లో సభ్యత్వం పొందినట్లు బుధవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలోనే సంస్థ సేవలు టర్కీ, వియత్నాం, మయన్మార్, చైనా వంటి దేశాలకు విస్తరించిన విషయం తెలిసిందే కాగా, సరిగ్గా ఇటువంటి సమయంలో సభ్యత్వం పొందడం వల్ల ప్రపంచంలో అత్యుత్తమ వాయు రవాణా వ్యవస్థగా ఇండిగోను తీర్చిదిద్దాలనే లక్ష్యానికి సహకారం లభించిందని సంస్థ సీఈఓ రోనోజోయ్ దత్తా అన్నారు. ఇండిగో ప్రస్తుతం రోజుకు 1,500 విమాన సర్వీసులను నిర్వహిస్తుండగా.. వీటిలో 60 దేశీయ, 23 అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. మొత్తం 247 ఎయిర్క్రాఫ్ట్లను సంస్థ కలిగిఉంది. ఇక ఐఏటీఏ 290 ఎయిర్లైన్స్కు ప్రాతినిధ్యం వహిస్తోంది. మరోవైపు ఈ ఏడాది మార్చిలోనే స్పైస్జెట్ ఈ సంఘంలో సభ్యత్వం పొందిన తొలి భారత చౌక చార్జీల విమానయాన సంస్థగా నమోదైంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను భారం తగ్గకపోవచ్చు! న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్ను(ఐటీ) తగ్గింపు నిర్ణయం కేంద్రం తీసుకునే అవకాశం లేదని ఉన్నత స్థాయి వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కార్పొరేట్ రంగానికి ఊతం ఇవ్వడానికి ఆర్థికశాఖ ఇటీవలే కార్పొరేట్ పన్నును ఏకంగా 10 శాతం తగ్గించింది. పెట్టుబడుల పెరుగుదల, ఉపాధి కల్పన, ఉత్పత్తి ధర తగ్గడం తద్వారా వ్యవస్థలో డిమాండ్, వినియోగం పెరగడం దీని లక్ష్యం. వినియోగదారు కొనుగోలు సామర్థ్యం, డిమాండ్ పెరగడానికి వ్యక్తిగత ఆదాయపు పన్ను కూడా తగ్గించాలని ఇటీవల కొన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తోంది. -
బీజేపీలో మళ్లీ చేరడం ఆనందంగా ఉంది: విద్యాసాగర్రావు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మళ్ళీ బీజేపీలోకి రావడం ఉత్సాహం, ప్రేరణ కల్గిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కేంద్ర బిందువుగా మారుతుందని.. టీఆర్ఎస్కు ధీటైన ప్రత్యర్థిగా బీజేపీ ఎదుగుతుందన్నారు. మొన్నటి వరకు గవర్నర్గా ఉన్న విద్యాసాగర్రావు పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకి లక్ష్మణ్ బీజేపీ సభ్వతాన్ని ఇచ్చారు. పార్టీ సభ్యత్వం స్వీకరించిన అనంతరం విద్యాసాగర్రావు మాట్లాడుతూ.. ‘పార్టీ కార్యకర్తల శ్రమ వల్లనే ఎదిగాను. బీజేపీలో మళ్లీ చేరడం ఆనందంగా ఉంది. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంపై బలహీనమైన ఆలోచనలు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో 17 సెప్టెంబర్ను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుంచి బీజేపికి పూర్తిగా అంకితమవుతాను. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని’ విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి జలాల వినియోగంలో విద్యాసాగర్ రావు పాత్ర కీలకమని గుర్తు చేశారు. తన సలహాలు, అనుభవాలు పార్టీకి అవసరమన్నారు. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు విసుగు చెందారని.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే అవకాశం ఉంటుందన్నారు. అసెంబ్లీ భవన నిర్మాణంపై కోర్టు తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి చెంప పెట్టుగా అభివర్ణించారు. -
ఇక పదవుల పందేరం
సాక్షి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో మొదటి దశగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావడంతో అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 27వ తేదీన ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం గత నెల 27వరకు కొనసాగినా అదనపు సమయం ఇచ్చి ఈనెల 10వ తేదీతో ముగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 50వేల చొప్పున మొత్తం 6లక్షల సభ్యత్వాలు చేయించాలని రాష్ట్ర నాయకత్వం లక్ష్యంకాగా ఇందులో జిల్లాకు చెందిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో లక్ష్యాన్ని దాటి 80వేల సభ్యత్వాలు పూర్తి చేశారు. మిగిలిన నియోజక వర్గాల్లోనూ లక్ష్యాన్ని చేరుకోగా.. పలుచోట్ల లక్ష్యాన్ని మించి పూర్తి చేసినట్లు సమాచారం. సభ్యత్వ నమోదు పూర్తి కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ, మండల, పట్టణ ప్రాంతాల్లో డివిజన్ కమిటీల నియామకానికి పార్టీ అగ్రనాయత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే కసరత్తు సభ్యత్వ నమోదులో ఇన్చార్జిలుగా వ్యవహరించిన వారు ఇప్పటికే కమిటీలపై ప్రాథమిక సమాచారాన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలకు అందజేశారు. సభ్యత్వ నమోదులో సమర్థవంతంగా వ్యవహరించిన వారికే కమిటీల్లో స్థానం కల్పించనున్నారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా మొదటి దశ సభ్యత్వ నమోదు విజయవంతం కావడంతో రెట్టింపు ఉత్సాహంతో కమిటీల ఏర్పాటుకు అగ్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభ్యత్వ నమోదులో పనితీరే గీటురాయిగా కమిటీలతో పాటు నామినేటెడ్ పోస్టుల్లోనూ ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ఈ మేరకు పదవులపై ద్వితీయ శ్రేణి నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు గ్రామ, మండల స్థాయి నాయకుల నుంచి సేకరించిన అభిప్రాయాలను సభ్యత్వ నమోదు ఇన్చార్జిలుగా వ్యవహరించిన నేతలు అధిష్టానానికి నివేదిక రూపంలో అందజేశారు. అయితే, కమిటీలతో పాటు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రతిపాదనలే కీలకం కానున్నాయి. దసరా నాటికి జిల్లా పార్టీ కార్యాలయాలు జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలను భవనాలు నిర్మించాలన్న లక్ష్యంతో జూన్ 24న శంకుస్థాపన చేశారు. ఉమ్మడి వరంగల్లో వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించి తప్ప మిగిలిన అన్నిచోట్ల భూమి పూజలు నిర్వహించారు. ఈ నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు జిల్లాకో ఇన్చార్జిని నియమించారు. ఈ మేరకు త్వరితగతిన పూర్తయ్యేలా గుళాళీ దళనేత, సీఎం కేసీఆర్.. పార్టీ కార్యాలయాల మ్యాపులు, నిధులను కూడా అందజేశారు. వరంగల్ రూరల్ మినహా మిగ తా జిల్లాలో పనులు జరుగుతుండగా మంత్రి దయాకర్రావు పనులను పలుమార్లు పరిశీలిం చి వేగంగా జరిగేలా చూస్తున్నారు. సీనియర్లకు ప్రాధాన్యం సభ్యత్వ నమోదు విజయవంతం కావడంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమై కమిటీలు, పార్టీ పదవులకు ప్రాతిపాదించాల్సిన వారిపై మార్గనిర్దేశం చేసినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు ఇతరత్రా కారణాలతో అవకాశం దక్కని వారికి పార్టీలో కీలక పదవులు ఇస్తామని నాయకత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకులు పలువురు ఆశగా ఎదురుచూస్తున్నారు. కమిటీల ఏర్పాటు ప్రక్రియను ఈనెల మూడో వారంలోగా పూర్తి చేయాలని అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ సీనియర్లకు కమిటీలు, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా వుండగా త్వరలోనే మున్పిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనుండగా.. అర్బన్, బూత్, డివిజన్ కమిటీల నియామకానికి త్వరగా పూర్తిచేసేందుకు కసరత్తు జరుగుతోంది. గ్రామ, మండల, బూత్, డివిజన్, బస్తీ కమిటీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కార్మిక, విద్యార్ధి తదితర అనుబంధ కమిటీలను ఈ నెల మూడో వారంలోగా నియమించేందుకు నేతలు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహులు మంత్రి, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
తమిళంలో ఇక డబ్ చేయలేనేమో..!
-
నాణ్యతకు ఇదే సాక్షి
సాక్షి, హైదరాబాద్: సాక్షి దినపత్రిక మరో అరుదైన ఘనత సాధించింది. కలర్ఫుల్గా వెలుగులు విరజిమ్ముతూ రంగుల ముద్రణా నాణ్యతలో తనకు సాటిలేదని నిరూపించుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ కలర్ క్వాలిటీ క్లబ్ (ఐసీక్యూసీ)లో సభ్యత్వాన్ని సాధించింది. 2018–20 సంవత్సరాలకుగాను సాక్షి ఈ ఘనతను సాధిం చినట్లు వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్ (వాన్–ఇఫ్రా) శుక్రవారం ప్రకటించింది. ఐసీక్యూసీలో సభ్యత్వం కోసం సాక్షి మీడియా గ్రూప్ తెలుగు రాష్ట్రాల్లోని 22 ముద్రణా కేంద్రాల తరఫున పోటీలో పాల్గొంది. అన్ని ప్రింట్ సెంటర్లకు ఐసీక్యూసీలో విజయవంతంగా సభ్యత్వాన్ని సాధించి రికార్డు సృష్టించింది. ఒక వార్తా పత్రిక తమ ముద్రణా కేంద్రాల న్నింట్లోనూ అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించడం, ఐసీక్యూసీలో సభ్యత్వం కోసం పోటీ పడి దానిని సాధించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. వాన్–ఇఫ్రా ఐసీక్యూసీ పోటీలో ఏకంగా 22 ఎడిషన్లలో సభ్యత్వాన్ని సాధించిన ప్రపంచంలోని ఏకైక సంస్థ సాక్షి మాత్రమే. వార్తా పత్రికలు, పబ్లిషింగ్ సంస్థలు ముద్రణలో ఎంతవరకు నాణ్యతను పాటిస్తున్నాయో శాస్త్రీయంగా పరిశీలిస్తూ వస్తోంది వాన్ ఇఫ్రా. 1994 నుంచి ముద్రణకు సంబంధించి పోటీలు నిర్వహిస్తూ ముద్రణా ప్రమాణాలకు అనుగుణంగా పాయిం ట్లు ఇస్తోంది. ఈ పోటీలో పాల్గొని ముద్రణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటించిన దినపత్రికలకు ఐసీక్యూసీలో సభ్యత్వాన్ని ఇస్తోంది. పాఠకుల్ని, అడ్వర్టయిజర్లను ఆకట్టుకోవాలం టే ముద్రణలో నాణ్యతా ప్రమాణాలు అత్యంత ముఖ్యమని భావించిన ఇఫ్రా ఈ పోటీ ప్రారంభించింది. రంగుల ముద్రణలో నాణ్యతను పరీక్షించేందుకు ఇఫ్రా ప్రతిపాదించిన ‘క్యూబాయిడ్‘ను వార్తాపత్రికలు తమ రెగ్యులర్ ఎడిషన్లలో నెలకు 5 రోజులచొప్పున 3 నెలలపాటు ముద్రించి.. ఆ ప్రతుల్ని వాన్–ఇఫ్రాకు పంపించాలి. ఆ సంస్థ నిపుణులు ముద్రణలో నాణ్యతను అంచనా వేసి సభ్యత్వాన్ని ఇస్తారు. ఈ ఏడాది అక్టోబర్లో జర్మనీలోని బెర్లిన్లో జరిగే కార్యక్రమంలో సాక్షికి సభ్యత్వాన్ని ఇవ్వనున్నారు. -
శ్రీరెడ్డికి ‘మా’ సభ్యత్వం ఇస్తారా..?
సాక్షి, హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్పై పోరాడుతున్న సినీ నటి శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో శుక్రవారం సభ్యత్వ రుసుము చెల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో తాను సభ్యత్వ రుసుము ఇవ్వలేదన్న ప్రచారం సరికాదని పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పాలక వర్గం సభ్యత్వం ఇచ్చినా, ఇవ్వకపోయినా సినీ పరిశ్రమలోని సమస్యలపై పోరాటం కొనసాగుతుందని రెండు రోజుల క్రితం ఫిలించాంబర్లో మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు ‘మా’ సభ్యత్వం ఇస్తారా..? లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై ఇంత వరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈనెల 2న ‘మా’ కార్యాలయానికి వెళ్లి తన సభ్యత్వం విషయమై అకౌంటెంట్ ప్రసాద్ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ‘మా’ సభ్యత్వం ఇస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలాగా తన ఉద్యమం ఉంటుందని ఈ సందర్భంగా శ్రీరెడ్డి ప్రకటించారు. తెలుగు హీరోయిన్లకు 70 శాతం అవకాశాలు ఇప్పించేలా సినీ పెద్దలను ఒప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. చిత్ర పరిశ్రమలో మహిళలపట్ల జరుగుతున్న లైంగిక వేధింపుల (కాస్టింగ్ కౌచ్) నిరోధానికి ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కమిటీలో మహిళా సంఘాలకు అవకాశం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. -
‘మా’ సభ్యత్వం ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం
బంజారాహిల్స్ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష న్(మా) సభ్యత్వం ఇవ్వకపోతే పోరాటం ఉధృతం చేస్తానని సినీ నటి శ్రీరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆమె ‘మా’ కార్యాలయానికి వెళ్లి తన సభ్యత్వం విషయమై అకౌంటెంట్ ప్రసాద్ను ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మా సభ్యత్వం ఇస్తే ఒకలాగ, ఇవ్వకపోతే ఇంకోలాగా తన ఉద్యమం ఉంటుందన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినీ పెద్దలను పిలిపించి తెలుగు హీరోయిన్లకు 70 శాతం అవకాశాలు ఇప్పించేలా ఒప్పించాలని, కమిటీలో మహిళా సంఘాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ పీఎస్లో ఫిర్యాదు... తన స్నేహితురాలు సోనుకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని శ్రీరెడ్డి బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చీప్ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తే ఊరుకోం
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’లో తనకు సభ్యత్వం ఇవ్వలేదంటూ నటి శ్రీరెడ్డి ఫిల్మ్చాంబర్ ఎదుట శనివారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ వివాదంపై ‘మా’ సభ్యులు ఫిల్మ్చాంబర్లో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ–‘‘తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఎవరైనా తప్పుగా మాట్లిడితే ఊరుకునేది లేదు. శ్రీరెడ్డి మాటల్లో నిజం లేదు. చీప్ పబ్లిసిటీ కోసం ఇలా చేస్తే ఊరుకోం. ‘మా’ లోని 900మంది సభ్యుల్లో ఎవరూ తనతో నటించరు. ఎవరైనా నటిస్తే ‘మా’ నుంచి సస్పెండ్ చేస్తాం. ఆమెకు ‘మా’ లో సభ్యత్వం ఇవ్వం’’ అన్నారు. ‘‘మా’ 25 సంవత్సరాల జూబ్లీ ఇయర్లో ఇలాంటి సంఘటన సిగ్గు చేటు. ఇదంతా ఆ అమ్మాయి ఎందుకు చేస్తోంది? ఫ్రీ పబ్లిసిటీ కోసమా? సైకలాజికల్ ప్రాబ్లమా? అర్థం కావట్లేదు. పానకంలో పుడకలాగా సినీ పరిశ్రమను శ్రీరెడ్డి నాశనం చేస్తోంది’’ అన్నారు ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్. ‘‘శ్రీ రెడ్డి విషయంలో ‘మా’ కి సహకరిస్తాం. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్లో తనకు ఇచ్చిన సభ్యత్వం రద్దు చేసి, కార్డు వెనక్కి తీసేసుకుంటాం’’ అన్నారు టీఎఫ్సీసీ ౖచెర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్. ‘‘ప్రతి విషయానికీ టీవీ, సోషల్మీడియాకి ఎక్కితే పోయేది మన పరువే. ఇలాంటివి చూసి కొత్త అమ్మాయిలు హీరోయిన్గా ఎలా రావాలనుకుంటారు?’’ అన్నారు ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్. మా సభ్యులు బెనర్జీ, ఉత్తేజ్, సురేష్ కొండేటి, హేమ, వేణు మాధవ్, ఏడిద శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
‘అనర్హత’పై హైకోర్టులో విచారణ..వాయిదా
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్ శాసనసభ సభ్యత్వం రద్దుపై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసు వాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ప్రకాష్రెడ్డి సోమవారం రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. ప్రకాష్ రెడ్డి స్థానంలో సుప్రీంకోర్టు నుంచి ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే కేసు వాదించడానికి వస్తున్నారు. గవర్నర్ ప్రసంగం రోజు జరిగిన వీడియోలను, ఒరిజినల్ సీడీలను కోర్టుకు సమర్పించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి విదితమే. మంగళవారం సమర్పిస్తామని గతంలో తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సమయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కోర్టుకు ఈరోజు సమర్పిస్తారా, లేదా అన్నది వేచి చూడాల్సిందే. పిటిషనర్ తరపు న్యాయవాది రవిశంకర్ జంధ్యాల స్థానంలో సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించనున్నారు. అయితే ఇద్దరు న్యాయవాదులు కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణ ప్రారంభం కాకుండానే ప్రధాన న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. -
కోమటిరెడ్డి, సంపత్కుమార్ల సభ్యత్వం రద్దు
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభలో జరిగిన ఘటనలకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ), ఎస్ఏ సంపత్కుమార్ (అలంపూర్)లపై వేటు పడింది. సభా హక్కుల ఉల్లంఘన, సభ గౌరవానికి భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో.. వారిద్దరి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మంగళవారం అసెంబ్లీ తీర్మానించింది. ప్రస్తుత అసెంబ్లీ ముగిసే వరకు వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్కు చెందిన మిగతా 11 మంది ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసింది. మరోవైపు శాసనమండలిలోనూ ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. దురదృష్టకరమైన ఘటన.. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నర్సింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి విసిరేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ఫోన్స్ సెట్ను విసిరేయగా.. అది తగిలి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ గాయపడ్డారు. దీనిని సీరియస్గా తీసుకున్న అధికారపక్షం.. నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం కాగానే ఈ అంశాన్ని లేవనెత్తింది. స్పీకర్ మధుసూదనచారి వచ్చి సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న అనంతరం దీనిపై మాట్లాడారు. ‘‘గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో దుర్మార్గమైన, దురదృష్టకమైన, అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. సభకు నా తీవ్ర మనస్తాపాన్ని తెలియజేస్తున్నా.. నాలుగేళ్లుగా దేశంలోనే గొప్పగా, గౌరవంగా సభను నిర్వహిస్తున్నాం. నేను తీవ్రంగా మనస్తాపం చెందాను. దాడితో దెబ్బతిన్న స్వామిగౌడ్ను చూసి షాక్కు గురయ్యాను..’’అని పేర్కొన్నారు. సభా నిబంధనల మేరకు.. తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి టి.హరీశ్రావు మాట్లాడారు. ‘‘నిన్నటి అరాచక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చను మిగిల్చింది. మీ (స్పీకర్) తీవ్ర మనోవేదనకు, ఆవేదనకు అనుగుణంగా అసెంబ్లీ నిబంధనల (240 పేజీలోని సబ్ రూల్ 2) ప్రకారం.. కాంగ్రెస్ సభ్యులు కె.జానారెడ్డి, ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జె.గీతారెడ్డి, టి.జీవన్రెడ్డి, జి.చిన్నారెడ్డి, డి.కె.అరుణ, టి.రామ్మోహన్రెడ్డి, వంశీచంద్రెడ్డి, ఎన్.పద్మావతి, దొంతి మాధవరెడ్డిలను బడ్జెట్ సమావేశాల కాలానికి సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాను. నిన్న జరిగిన దాడి చాలా చాలా తీవ్రమైనది. చట్టసభలను అవమానపరిచేలా, రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా జరిగింది. ఈ విషయంలో శాసనసభ తీవ్ర వేదనకు గురైంది. శాసనసభ నిబంధనలను ఉల్లంఘించి, సభా మర్యాదలకు భంగం కలిగించడానికి కారణమైన వారిపై పార్లమెంటరీ నిబంధనల (120 పేజీలోని 7.1 పేరా, రాజ్యాంగంలోని 194లో మూడో సెక్షన్) ప్రకారం.. కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్కుమార్ల సభ్యత్వాలను ప్రస్తుత శాసనసభ కాలం ముగిసేవరకు రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాను..’’అని తెలిపారు. ఈ తీర్మానాలను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. సభ ఆమోదం కోరారు. అనంతరం తీర్మానాలను ఆమోదించినట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం అప్రజాస్వామికమని కాంగ్రెస్ సభ్యులు ఉత్తమ్కుమార్రెడ్డి, టి.జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పటికే మార్షల్స్ సభలోకి ప్రవేశించారు. అందులో మహిళా మార్షల్స్ ఎక్కువ సంఖ్యలో వచ్చారు. తొలుత వారు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్రెడ్డి వద్దకు వచ్చి బయటికి తీసుకెళ్లబోయారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆగారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్ సభ్యులంతా బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోకి రావడం గమనార్హం. మండలిలో గందరగోళం.. శాసన మండలిలోనూ ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన గందరగోళానికి బాధ్యులను చేస్తూ వారిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. మంగళవారం శాసన మండలి ప్రారంభమైన వెంటనే.. కాంగ్రెస్ సభ్యులు విపక్ష నేత షబ్బీర్అలీ, పొంగులేటి సుధాకర్రెడ్డి, సంతోష్, దామోదర్రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలను సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీర్మానాన్ని ప్రతిపాదించారు. దానిని పరిగణనలోకి తీసుకున్న మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్.. తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండైన సభ్యులు సభను వీడి వెళ్లాలని సూచించారు. అయితే కాంగ్రెస్ సభ్యులు బయటికి వెళ్లకుండా ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సస్పెండైన సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఉండదని, బయటకు వెళ్లిపోవాలని డిప్యూటీ చైర్మన్ స్పష్టం చేశారు. అయినా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో సభలో గందరగోళం నెలకొంది. చివరికి మార్షల్స్ను రప్పించి.. కాంగ్రెస్ సభ్యులను బయటకు పంపారు. ఈ సమయంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
కోల్గేట్ కేవలం రూ.76 లకు (ADVT)
-
అమూల్ బటర్ కేవలం రూ.41లకే.. (ADVT)
-
ఆశీర్వాద్ ఆటా కేవలం రూ.207 లకే.. (ADVT)
-
మెంబర్ షిప్ తీసుకోండి, పెద్ద బ్రాండ్స్ పైన ఎక్స్ట్రా 10% తగ్గింపు (ADVT)
-
భారత్, పాక్ చేతులు కలిపేనా?
న్యూఢిల్లీ: చైనా నాయకత్వంలోని షాంఘై సహకారం సంఘం (ఎస్సీఓ)లో 17 నెలల నిరీక్షణ అనంతరం భారత్కు సభ్యత్వం లభించింది. రష్యా, చైనా సూచనల మేరకే 2014లో ఈ సహకార సంఘం సభ్యత్వానికి భారత్ దరఖాస్తు చేసుకొంది. వాస్తవానికి ఈ సభ్యత్వం కోసం భారత్ ఎప్పటి నుంచో నిరీక్షిస్తోంది. 2005లోనే ఈ సంఘంలో భారత్లో పరిశీలక హోదా పొందింది. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం లాగా ఇది ఓ భౌగోళిక ప్రాధాన్యత గల సంఘం కాదు? మరి షాంఘై సహకార సంఘం సభ్యత్వం వల్ల భారత దేశానికి కలిగే ప్రయోజనాలేమిటీ? ఈ సంఘం చాప్టర్ ప్రకారం సభ్య దేశాలు రక్షణ రంగంలో ప్రధానంగా పరస్పరం సహకరించుకోవాలి. ప్రతి సభ్య దేశం మరో దేశంలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు జరపాలి. అంటే భారత దేశం వెళ్లి పాకిస్తాన్లో, పాకిస్తాన్ వచ్చి భారత్లో సైనిక విన్యాసాలు నిర్వహించాలి. నిత్యం సరిహద్దుల్లో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్న ఇరు దేశాల సైనికుల మధ్య ఈ సరికొత్త బంధం ఏర్పడుతుందా? అన్నది ప్రస్తుతానికి అనుమానమే. షాంఘై సంఘం సభ్యత్వం సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సభ్య దేశాలన్నీ ఉమ్మడిగా ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. అటు పాకిస్తాన్ను ఇటు భారత దేశాన్ని వేదిస్తున్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇరుదేశాల సైన్యం ఏకమైతే అంతకంటే జరిగే మేలు మరొకటి ఉంది. ముఖ్యంగా ఇది నెరవేరాలన్నా ఉద్దేశంతోనే చైనా అటు పాకిస్తాన్ను, ఇటు భారత్ను సంఘంలోకి ఆహ్వానించింది. పాకిస్తాన్ మీదుగా వెళుతున్న చైనా ఆర్థిక కారిడార్కు ఇరుదేశాల మధ్య శాంతియుత పరిస్థితులు, ముఖ్యంగా చైనా కారిడార్ వెళ్లే పాకిస్తాన్ భూభాగంలో అల్లర్లు జరుగకూడదు. అందుకనే ‘చైనా సింగిల్ రూట్, సింగిల్ బెల్ట్’ ప్రాజెక్టులో భారత్ చేరకపోయినప్పటికీ షాంఘై సంఘంలో మనకు ఉచితాసనం ఇచ్చింది. వాస్తవానికి చెప్పాలంటే నార్త్ అట్లాంటిక్ దేశాల మధ్య సైనిక సహకారం కోసం ఏర్పాటైన ‘నాటో’ లాంటి అంతర్జాతీయ సంస్థలకు పోటీకాగానే చైనా ఈ సహకార సంఘాన్ని తీసుకొచ్చింది. -
కాంగ్రెస్ సభ్యత్వాల లక్ష్యం 4 లక్షలు
డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ కాకినాడ : జిల్లాలో నాలుగు లక్షల పార్టీ సభ్యత్వాలు చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ తెలిపారు. స్థానిక కళావెంకట్రావు భవనంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, పరిశీలకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ ఆదేశాలు మేరకు ఈనెల 15 నాటికి సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. రెండు నెలలుగా సభ్యత్వాలు నమోదు చేస్తున్నామని చెప్పారు. దళితులు, మహిళల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. బీజేపీ, టీడీపీ పాలనపై విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఆదరణ చూపిస్తున్నారన్నారు. బూత్ స్థాయిలో 50 మంది చొప్పున సభ్యత్వాలు చేర్పించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నియోజకవర్గ ఇన్చార్జి తుమ్మల దొరబాబు, అంకం గోపి, నులుకుర్తి వెంకటేశ్వరరావు, ఎన్వీ శ్రీనివాస్, ఒంటెద్దు బాబి, గంగిరెడ్డి త్రినా«థ్, నియోజకవర్గాల పరిశీలకులు దుళ్ల ఏడుకొండలు, మచ్చా అప్పాజీ, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి అయితాబత్తుల సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
నవ్విపోదురు గాక..
- టీడీపీ సభ్యత్వంలో తిరకాసులెన్నో.. - వైఎస్సార్సీపీ కీలక నేతలూ ‘తమ్ముళ్లేనట’! - ఓటరు జాబితా ఆధారంగా సభ్యత్వ కార్డుల ముద్రణ – అందరికీ అవే పంపిణీ – ససాక్ష్యాలతో బయటపడుతున్న ‘సభ్యత్వ నమోదు’ డొల్లతనం – తీవ్రంగా తప్పుబడుతున్న విపక్షాలు (సాక్షిప్రతినిధి, అనంతపురం) - ఇది టీడీపీ అధినేత చంద్రబాబు సంతకంతో జారీ చేసిన ఆ పార్టీ సభ్యత్వ కార్డు. దీన్ని ఇచ్చింది మాత్రం టీడీపీ కార్యకర్తకు కాదు. ఈ కార్డులో సభ్యత్వం తీసుకున్నట్లు ఉన్న వ్యక్తి పేరు బండి పరుశురాం. ఈయన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు. ప్రతిపక్ష పార్టీలో కీలక అనుబంధ సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికే టీడీపీ సభ్యత్వ కార్డు జారీ చేయడాన్ని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. - ఈ ఫొటోలోని వ్యక్తిపేరు మంగల అనిల్ కుమార్. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి. ఈయనకూ టీడీపీ సభ్యత్వ కార్డు ఇచ్చేశారు. ఎవరో వచ్చి ఇంట్లోకి ఓ కవర్ విసిరేశారు. దాన్ని చూస్తే టీడీపీ సభ్యత్వ కార్డు. దీంతో అవాక్కవడం అనిల్ వంతైంది. ఈ రెండు ఉదాహరణలను పరిశీలిస్తే టీడీపీ సభ్యత్వ నమోదులో డొల్లతనం బట్టబయలవుతోంది. కనీసం ఎవరు టీడీపీ కార్యకర్తో, ఎవరికి సభ్యత్వం ఉందో.. లేదో? తెలుసుకోకుండానే కేవలం ‘సంఖ్య’ను చూపించుకోవడం కోసం ఇష్టానుసారంగా సభ్యత్వ కార్డులు జారీ చేశారు. ఏదీ పారదర్శకత?! ఏ రాజకీయ పార్టీ అయినా సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పార్టీ విధివిధానాలు నచ్చి అందులో చేరిన వ్యక్తి సభ్యత్వ నమోదు రుసుం చెల్లించి గుర్తింపు కార్డు తీసుకుంటారు. అన్ని రాజకీయ పార్టీల్లో సాధారణంగా జరిగే తంతు ఇది. కొన్ని పార్టీల నాయకులు గ్రామాలు, వార్డుల వారీగా ఎంతమంది సభ్యత్వం తీసుకున్నారో జాబితాను పరిశీలించి వారి తరఫున రుసుం చెల్లిస్తున్నారు. ఇది మరో పద్ధతి! కానీ తెలుగుదేశం పార్టీ కొత్త సంస్కృతిని తెరపైకి తెచ్చింది. ఎవరు టీడీపీలో ఉన్నారు? ఎవరు సభ్యత్వం తీసుకున్నారనే అంశాలను పట్టించుకోలేదు. వార్డుల వారీగా ఓటరు జాబితాలు తెప్పించుకుని, అందులో 30–40 శాతం మంది సభ్యత్వం తీసుకున్నట్లు చూపించి.. వారి పేరుతో గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. కనీసం కార్డుల పంపిణీ ముందైనా టీడీపీ స్థానిక నాయకులు ఇందులో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంకు చెందిన వ్యక్తుల పేర్లు ఉన్నాయా అనేది పరిశీలించడం లేదు. కార్డులు రాగానే కొంతమంది బాయ్స్కు కూలి ఇచ్చి డోర్ నంబర్ల వారీగా ఇళ్లలో ఇచ్చేయాలని చెబుతున్నారు. డెలివరీ బాయ్స్కు ఏ కార్డు ఎవరిదో? వారు ఏ పార్టీలో ఉంటారో? వారి స్థాయి ఏమిటో కూడా తెలీదు. దీంతో వారు డోర్ నంబర్ల ఆధారంగా పంపిణీ చేసేస్తున్నారు. ఈ కార్డులు అందుకున్న వైఎస్సార్సీపీ నేతలు అవాక్కవుతున్నారు. ‘సంఖ్య’ కోసమే చేశారా? టీడీపీ అధిష్టానం జిల్లాకు 4,12,290 మందితో సభ్యత్వ నమోదును లక్ష్యంగా నిర్దేశించింది. కానీ జిల్లా పార్టీ 1,07,147 సభ్యత్వాలు అధికంగా చేసి.. 5,19,437 మందితో సభ్యత్వం చేయించినట్లు లెక్కలు చూపించింది. సభ్యత్వ నమోదులో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మొత్తమ్మీద కదిరి 187.97 శాతంతో అగ్రస్థానం, గుంతకల్లు 98.14 శాతంతో చిట్టచివరన ఉన్నట్లు లెక్క చూపారు. వాస్తవ పరిస్థితిని చూస్తే టీడీపీ సభ్యత్వ నమోదు వాస్తవాలకు దూరంగా ఉందని విపక్షాలు తప్పుబడుతున్నాయి. సిగ్గుచేటు : బండిపరుశురాం, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు టీడీపీ ఓ సిగ్గులేని పార్టీ. సభ్యత్వ నమోదు చూస్తేనే డొల్లతనం బయటపడుతోంది. లెక్కలన్నీ తప్పుల తడకే. ఓటరు జాబితా ఆధారంగా నమోదు చేస్తే 5లక్షలు కాదు.. జిల్లాలోని ఓటర్లందరికీ టీడీపీ సభ్యత్వ కార్డులే ఇవ్వొచ్చు. వాస్తవ పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారు. -
వంద దాటిన డీసీసీబీ సభ్యత్వం
- తాజాగా 4 రైతు సేవా సహకార సంఘాలకు సభ్యత్వం - రూ.11కోట్లకుపైగా డిపాజిట్లు - డీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కేంద్రసహకార బ్యాంకులో మరో నాలుగు రైతు సేవ సహకార సంఘాలకు సభ్యత్వం లభించింది. ఇప్పటి వరకు ఈ బ్యాంకులో 95 సహకార సంఘాలు, 4 జాయింట్ పార్మింగ్ కో ఆపరేటివ్ సొసైటీలకు మొత్తంగా 99 సంఘాలకు సభ్యత్వం ఉంది. తాజాగా ఎర్రగుంట్ల, పాములపాడు, పెద్దహరివానం, రామదుర్గం రైతు సేవా సహకార సంఘాల (ఫార్మర్స్ సర్వీస్ కో ఆపరేటివ్ సొసైటీ)కు సభ్యత్వం ఇవ్వడంతో 103కు చేరిందని కేడీసీసీబీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఇంతవరకు ఈ సంఘాలు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. గురువారం ఏపీజీబీ కర్నూలు రీజినల్ మేనేజర్ వీసీకే ప్రసాద్, నంద్యాల రీజినల్ మేనేజర్ శివశంకర్రెడ్డి వీటిని డీసీసీబీకి అప్పగించారు. ఈ సంఘాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని చైర్మన్ తెలిపారు. వీటిలో జనవరి 31నాటికి ఎర్రగుంట్ల సంఘం ఆదాయం రూ.165.34 లక్షలు, పాములపాడు రూ.39.26 లక్షలు, పెద్దహరివానం రూ.79.80గా ఉందన్నారు. వీటికి డీసీసీబీలో సభ్యత్వం ఇవ్వడం వల్ల బ్యాంకుకు రూ.11కోట్లకుపైగా డిపాజిట్లు రానున్నాయని తెలిపారు. ఈ సంఘాలను అన్ని విధాలా ఆదకుంటామన్నారు. కేడీసీసీబీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రామాంజనేయులు మాట్లాడుతూ.. సభ్యులు పెరగడంతో బ్యాంకు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్కుమార్, శివలీల తదితరులు పాల్గొన్నారు. -
ఇదేనా టీడీపీ సభ్యత్వం
– శిల్పా ఇంటి వద్ద చెత్తలో పార్టీశ్రేణుల గుర్తింపు కార్డులు – పంపిణీ చేయకుండా విసిరేసిన వైనం నంద్యాల: కార్యకర్తలే తమ బలం, ప్రాణం అని గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకునే తెలుగుదేశం పార్టీ వారికి ఇస్తున్న ప్రాధాన్యత ఏ పాటిదో చెత్తకుప్పలో పడి ఉన్న ఈచిత్రాలను చూస్తే తెలుస్తోంది. 2014లో తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. శిల్పా, ఫరూక్ వర్గాల నేతలు పోటీపడి సభ్యత్వం చేయించారు. తర్వాత హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వారికి గుర్తింపుకార్డులు జారీ అయ్యాయి. ఈ గుర్తింపు కార్డులను పార్టీ ఇన్చార్జ్ బాధ్యతలను నిర్వహిస్తున్న మాజీ మంత్రి, నంద్యాల ఇన్చార్జ్ శిల్పాకు పంపారు. 4 డబ్బాల్లో ఉన్న పదివేలకు పైగా గుర్తింపు కార్డులను శిల్పా ఇంట్లో భద్రపరిచారు. వీటికి గడువు ఈ ఏడాది డిసెంబరుకు ముగుస్తుంది. గుర్తింపుకార్డులను శిల్పా వర్గం పంపిణీ చేయకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో వీటి గడువు పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వీటిని పంపిణీ చేస్తే బండారం బయటపడుతుందని ఆయన వర్గీయులు ఇంటి ఎదురుగా ఉన్న చెత్తకుప్ప, కాల్వలో విసిరేశారు వేల సంఖ్యలో ఉన్న ఈ గుర్తింపు కార్డులను చిన్నారులు ఆడుకునేందుకు ఏరుకుంటున్నారు. చెత్తలో చైర్పర్సన్, కౌన్సిలర్ల గుర్తింపు కార్డులు శిల్పా ఇంటి ఎదుట లభ్యమైన పార్టీ గుర్తింపు కార్డుల్లో చైర్పర్సన్ దేశం సులోచన గుర్తింపు కార్తు ఉంది. పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు నంద్యాల, గోస్పాడు మండలాల్లోని పార్టీ కార్యకర్తల కార్డులు సైతం ఉన్నాయి. మాజీమంత్రి ఫరూక్కు సన్నితుడైన పార్టీ నేత చింతలపల్లె సుధాకర్తో సహా పలువురి గుర్తింపు కార్డులు చెత్తలో దర్శనమిచ్చాయి. వీటిని చూసిన ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు మనస్తాపానికి గురవుతున్నారు. పార్టీ సభ్యత్వమంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. -
సైనాకు చేజారిన అవకాశం
రియో డి జనీరో: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ త్రుటిలో అరుదైన అవకాశాన్ని కోల్పోయింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో అథ్లెట్ల సభ్యత్వం కోసం జరిగిన పోటీలో సైనా 1233 ఓట్లు సాధించి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఇందులో తొలి నాలుగు స్థానాల్లో నిలిచినవారు మాత్రమే ఐఓసీ అథ్లెట్ సభ్యులుగా ఎంపికవుతారు. ఒలింపిక్స్ గ్రామంలో 25 రోజుల క్రితం నిర్వహించిన ఈ ఓటింగ్లో బీజింగ్ ఒలింపిక్స్ ఫెన్సింగ్ ఈవెంట్ చాంపియన్ బ్రిట్టా హైడ్మన్ (జర్మనీ) 1603 ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత దక్షిణ కొరియా టేబుల్ టెన్నిస్ ఆటగాడు సుంగ్ మిన్ ర్యూ (1544), హంగేరికి చెందిన మాజీ స్విమ్మర్ డేనియల్ గ్యుర్తా (1469), రష్యా పోల్వాల్టర్ ఎలేనా ఇసిన్ బయేవా (1365) తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ఐఓసీ సభ్యులుగా ఎంపికయ్యారు. వీరు రాబోయే ఎనిమిదేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. -
ఆన్లైన్లో ఎల్లాపి సభ్యత్వ నమోదు
కరీంనగర్ : జిల్లాలోని ఎల్లాపి కులస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలసంకుల వెంకటేశ్వర్రావు, సాయిని నర్సింగరావు తెలిపారు. జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యత్వం కోసం సీనియర్ సభ్యులతో కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. ఉచితంగా సభ్యత్వ నమోదు ఉంటుందని, దీనికోసం ఎవరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సభ్యుల విరాళాలు, ప్రభుత్వ నుంచి వచ్చిన నిధులతో చింతకుంటలో ఎల్లాపి భవనం నిర్మించినా ఇప్పటివరకు లెక్కలు చూపించలేదన్నారు. అందులో నిధులు దుర్వినియోగమయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం మే 22న యూనిట్ల అధ్యక్ష,కార్యదర్శులు, సంఘం పెద్దలతో కలిసి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నామన్నారు. ఈ కార్యవర్గం ప్రతి నెలా రెండో ఆదివారం సమావేశమవుతుందని, సమస్యలుంటే పరిష్కరిస్తామని చెప్పారు. సమావేశంలో జిల్లా కోశాధికారి తూం లక్ష్మీకాంతరావు, సల్వాజి భూపతిరావు, తోట శ్రీపతిరావు, మాదాసు మోహన్రావు, యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు సాయిని రవీందర్రావు, నాయిని ప్రభాకర్రావు, జాజాల రాజగోపాల్, పారువెల్లి జీవన్రావు, వేల్ముల ప్రకాశ్రావు, చంద ప్రకాశ్రావు, కైలాస నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
పీఆర్టీయూ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు
కొండమల్లేపల్లి : పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కరానికి పీఆర్టీయూ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు మిర్యాల భరతయ్య, ప్రధాన కార్యదర్శి భూతం ముత్యాలు, కొర్ర లోక్యానాయక్, నర్సింహ్మానాయక్, చందర్, గంగాధర్, చీన్యానాయక్, పెద్దన్న, బక్కయ్య, పద్మ, శ్రీలత, మంజుల, ఉమామహేశ్వరి ఉన్నారు. -
‘ఎన్ఎస్జీ’ ఆశాభంగం
అణు సరఫరా దేశాల బృందం(ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ చేసిన ప్రయత్నాన్ని ఊహించినట్టుగానే చైనా వమ్ముచేసింది. వాస్తవానికి అలా చేసింది అదొక్కటే కాదు...స్విట్జర్లాండ్, బ్రెజిల్, మెక్సికో, టర్కీలు కూడా చైనా దోవనే ఎంచుకున్నాయి. అయితే చైనా వ్యతిరేకించడానికీ, మిగిలిన దేశాల అభ్యంత రాలకూ మధ్య తేడా ఉంది. స్విట్జర్లాండ్, బ్రెజిల్, మెక్సికో, టర్కీలు ఎన్ఎస్జీ సభ్యత్వం ఇవ్వడానికి సంబంధించిన ప్రక్రియకు అనుసరించే ప్రమాణాలేమిటో ముందుగా నిర్ణయించాలని కోరాయి. చైనా ఇంకాస్త ముందుకెళ్లింది. అది అంత ర్జాతీయ నిబంధనలు, సూత్రాలు ఏకరువు పెట్టింది. మిగిలిన దేశాల సూచనల వల్ల మనకు కలిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే అణు పరిజ్ఞానాన్ని లేదా అణు పదార్థాన్ని ఎవరికీ రహస్యంగా చేరేసిన చరిత్ర మన దేశానికి లేదు. అలాంటి చరిత్ర ఉంటే గింటే చైనాకుంది. ఇలాంటి ప్రమాణాలను ఏర్పర్చడం ప్రారంభిస్తే చైనా, మరికొన్ని ఇతర దేశాల సభ్యత్వాలు గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు కూడా. అయితే భారత్ విషయంలో చైనా చెబుతున్న అభ్యంతరాల సారాంశం వేరే ఉంది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై సంతకం చేసిన దేశాలకే ఎన్ఎస్జీ తదితర సంస్థల్లో సభ్యత్వం ఇవ్వాలన్న నిబంధన ఎన్పీటీలో ఉంది. అలా సంతకం చేయాలంటే ముందుగా మన అణు హోదాను వదులుకోవడానికి సిద్ధపడి ఉండాలి. ఎన్పీటీ ఒప్పందమే ఎంతో వివక్షతో కూడుకుని ఉన్నది. దాన్ని ఏర్పరిచిన అయిదు అగ్ర దేశాలూ ఆ నిబంధననుంచి తమకు తాము మినహా యింపు ఇచ్చుకున్నాయి. దీన్ని ఎత్తి చూపే మన దేశం మొదటినుంచీ ఆ ఒప్పం దంపై సంతకం పెట్టడానికి నిరాకరిస్తోంది. అమెరికాతో 2008లో పౌర అణు ఒప్పం దం కుదరడానికి ముందు మన దేశం అదేమాట చెప్పింది. అందుకు అమెరికా అంగీకరించడంవల్లే ఆ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది చైనాకు కంటగింపుగా ఉంది. ఇప్పుడు ఎన్పీటీతో ఎన్ఎస్జీ సభ్యత్వాన్ని ముడిపెడితే భారత్ని అడ్డుకోవడం చైనాకు సులభమవుతుంది. మనం ఎప్పటిలా ఎన్పీటీపై సంతకానికి నిరాకరిస్తాం గనుక చర్చంతా దాని చుట్టూ నడుస్తుంది. చివరకు అలా ఒప్పుకుంటే తప్ప భారత్ సభ్యత్వాన్ని అంగీకరించకూడదని ఎన్ఎస్జీలో మిగిలిన దేశాలు భావించవచ్చు. ఎందుకంటే అందులో సభ్యత్వం పొందిన దేశాలన్నీ అలా సంతకం పెట్టి వచ్చాయి. తమకు లేని మినహాయింపు భారత్కు ఎందుకని అవి నిలదీ యొచ్చు. ఆ విషయంలో అమెరికా అందరినీ ఒప్పించగలిగినా వివక్షాపూరిత ఎన్పీటీపై తమ తరహాలో కాక భారత్ పంతం నెగ్గించుకుందన్న న్యూనతకు ఆ దేశాలు గురవుతాయి. అలాంటి పరిస్థితి ఏర్పడేలా చూడటమే చైనా ధ్యేయం. తన చిరకాల మిత్ర దేశం పాకిస్తాన్ ప్రయోజనాలను నెరవేర్చడం చైనా చర్యలోని ఆంతర్యం. పైకి భారత్, పాకిస్తాన్లు రెండింటికీ సభ్యత్వాన్ని ఇవ్వొద్దని చైనా వాదిస్తోంది. ఒక ప్రాంతంలో తరచు విభేదించుకునే రెండు దేశాల్లో ఒకదానికి సభ్యత్వమిచ్చి రెండో దేశానికి ఇవ్వకపోవడం మరిన్ని సమస్యలకు దారితీస్తుం దన్నది ఆ దేశం పైకి చెబుతున్న మాట. కానీ భారత్కు సభ్యత్వం ఇవ్వదల్చుకుంటే పాకిస్తాన్కు కూడా ఇవ్వాలన్నది దాని ఉద్దేశం. పాక్కు ఎన్ఎస్జీ సభ్యత్వం ఇవ్వడాన్ని మన దేశం అడ్డుకోవడంలేదు. కానీ ఎన్ఎస్జీలోని మిగిలిన దేశాలకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. ఉత్తర కొరియాకు అణు పరిజ్ఞానం అందించింది పాకిస్తానేనని చాలా దేశాలకు అనుమానాలున్నాయి. సమస్యంతా దానిచుట్టూ తిప్పితే భారత్ సభ్యత్వం ఆగిపోతుందని చైనా భావి స్తున్నట్టు కనబడుతోంది. ఎన్ఎస్జీ సభ్యత్వం ఉంటే అణు రియాక్టర్లు, యురేని యంవంటివి ఎవరివద్దనైనా కొనుగోలు చేయడానికి, అమ్మడానికి అవకాశం ఏర్ప డుతుంది. భారత్ ప్రధాన అవసరం అణు విద్యుదత్పత్తి కాబట్టి తనతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటే సరిపోయేదానికి ఎన్ఎస్జీ సభ్యత్వం అవసరం ఏము న్నదని చైనా అనుకుంటుండవచ్చు. కాని యూరోప్ దేశాల సాంకేతికతతో పోలిస్తే చైనా అణు రియాక్టర్లు మెరుగైనవేమీ కాదు. ఒక వేళ చైనానుంచి కొనాలనుకున్నా ఎన్ఎస్జీ సభ్యత్వం ఉంటే మిగిలిన దేశాలు ఇవ్వజూపుతున్న ధరతో పోల్చి ఆ దేశంతో బేరసారాలు జరపడానికి మనకు అవకాశం ఉంటుంది. అది లేకుండా చేయడం కూడా చైనా ఉద్దేశం కావొచ్చు. భారత్కు సభ్యత్వం విషయంలో చైనాకు ఎలాంటి అభ్యంతరాలూ ఉండబో వని మన దేశం భావించింది. విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ఒకటికి రెండుసార్లు ఆ సంగతి చెప్పారు. మన విదేశాంగ కార్యదర్శి ఎస్. జయశంకర్ ఈ విషయమై చర్చించడానికి చైనా కూడా వెళ్లారు. చైనా మద్దతుపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాంటి అభిప్రాయం మన దేశానికి కలిగించడంలో చైనా నాయకత్వం సఫలమైంది. అయితే ఎన్ఎస్జీ సభ్యత్వానికి తమ మద్దతుంటుందని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనో నీటో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ఈనెల మొదట్లో ప్రకటించినా తీరా సమయం వచ్చేసరికి ఆ దేశం ఎందుకు వ్యతిరేకించిం దన్నది అనూహ్యం. స్విట్లర్లాండ్ సైతం ఇలాగే హామీ ఇచ్చి వెనక్కు తగ్గింది. అసలు ఎన్ఎస్జీ సభ్యత్వం కోసం అర్రులు చాచడం అనవసరమని కొంతమంది నిపు ణులు చెబుతున్న మాట. అమెరికాతో పౌర అణు ఒప్పందం కుదిరినప్పుడే ఎన్ఎస్జీ సభ్యత్వం ద్వారా సమకూరే చాలా ప్రయోజనాలు మనకు దక్కాయని వారంటున్నారు. ఇప్పుడు కొత్తగా చేరడంవల్ల భవిష్యత్తులో ఆ సంస్థకు సంబం ధించిన నిబంధనల రూపకల్పనలో పాలుపంచుకోవడం మినహా మనకు అద నంగా దక్కేదేమీ ఉండదని వారి వాదన. ఎన్ఎన్జీ పుట్టుక, పెరుగుదలలో భారత్ వ్యతిరేక మూలాలున్నాయి. 1974లో మన దేశం పోఖ్రాన్లో అణు పరీక్ష జరిపాక దీన్ని ఏర్పాటు చేశారు. రెండోసారి పరీక్ష సమయంలో దాని నిబంధనలు మరింత కఠినం చేశారు. అలాంటి సంస్థలో మనకు అంత సులభంగా సభ్యత్వం దక్కడం కూడా సాధ్యం కాదు. ఒకవేళ అంతా సవ్యంగా జరిగి ఎన్ఎస్జీ సభ్యత్వం లభిస్తే దౌత్యపరంగా ఘన విజయం సాధించామని చెప్పుకోవడానికి ఎన్డీఏ ప్రభు త్వానికి అవకాశం ఉండేది. ఇప్పుడది దూరమైంది. భారత్కు ఆ సభ్యత్వం రావడం పెద్ద కష్టం కాదని, త్వరలోనే అది లభిస్తుందని అమెరికా చెబుతోంది. ఆ సంగతెలా ఉన్నా ఆచితూచి అడుగేయడం, చైనా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని మనం గుర్తించకతప్పదు. -
‘అణు’ సభ్యత్వం తథ్యం కానీ..
బైలైన్ అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో స్థానం సంపాదిం చాలన్న మన ప్రయత్నంలో గణనీయమైన మార్పు వచ్చింది. ఇప్పుడు సమస్య ‘ఇవ్వాలా’ కాదు, ‘ఎన్నడు’ అనేది. గత ఏడాదిగా భారత్ను సమర్థిస్తూ, అనుకూల ప్రభావాన్ని కలుగజేస్తున్న అమెరికా, అది ఈ ఏడాది చివరికే జరుగుతుందని విశ్వసిస్తోంది. భారత్ సభ్యత్వం అంశం చర్చకు వచ్చిన సియోల్ ప్లీనరీ జరిగిన తర్వాత శ్వేతసౌధమే అది తెలిపింది. అంతిమ నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉంది. ఒకప్పుడు మన దేశ అణు కార్యక్రమం పట్ల జాగరూ కతతోనో లేదా వ్యతిరేకతతోనో ఉండిన కెనడా వంటి దేశాలు ఎన్ఎస్జీ సమావేశానికి ముందు... మన దేశానికి ప్రాధ్యాన్యతా ప్రాతిపదికపై ప్రవేశం కల్పించాలని బహిరం గంగానే వాదించాయి. అవి ఉపయోగించిన పదం ‘‘అతి త్వరగా’’. బ్రిటన్, ఫ్రాన్స్, మాస్కో ప్రభుత్వాలు కల్పించిన ఆటంకం ఏమైనా ఉందంటే అదే. విస్పష్టమైన లక్ష్యాల కోసం అలుపెరగని శక్తిసామర్థ్యాలతో, ఆత్మవిశ్వాసంతో. అంతర్జాతీయ ప్రమాణాల మందకొడి గమనానికి బదు లుగా మన కాలానుగుణ ప్రణాళిక ప్రకారం కృషిని సాగిం చడం మన దౌత్యంలోని నూతన పరిణామం. ఇప్పుడు చైనా తప్ప అన్ని ప్రధాన అణుశక్తులూ మన దేశాన్ని ఎన్ఎస్జీలో చేర్చుకోవాలని కోరుతున్నాయంటే అది ఈ నూతన పరిణామం వల్ల కలిగిన లాభమే తప్ప, యాదృచ్ఛికంగా కలిగినదేమీ కాదు. అంతర్జాతీయ బహుముఖ సంస్థలలో ఏకా భిప్రాయం ఏర్పడటం అవసరమైన ఇలాంటి అంశాలను నిర్వచించకుండా వదిలేసిన కాలమనే బహిరంగ ప్రదేశం లోకి తోసేయడం సంప్రదాయకంగా జరుగుతుంటుంది. యథాతథ స్థితి కన్నా దౌత్యపరమైన ప్రశాంతత మెరుగని చెప్పనవసరం లేదు. క్షిపణి సాంకేతిక పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ (ఎమ్టీసీఆర్) విషయంలో నెలకొన్న అంతర్జాతీయ జడత్వాన్ని మిత్రుల సహాయంతో ఈ నెల మొదట్లో అధిగ మించాం. 2030 నాటికి 40 శాతం కర్బనేతర విద్యుదు త్పత్తికి కట్టుబడతామని మనం గత ఏడాది పారిస్లో వాతా వరణ మార్పుల విషయమై హామీ ఇచ్చాం. ఆ హామీని సైతం ప్రస్తావిస్తూ అతి జాగ్రత్తగా రూపొందించిన వాద నతో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ఎస్జీ విషయంలోని యథాతథ స్థితిని సవాలు చేశారు. శ క్తివంతమైన ఆ వాదన బలమైన శత్రువులను సైతం మిత్రులుగా మార్చింది. భారత్ తన శక్తికి మించి మరీ వాతావరణ మార్పుల విష యంలో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ప్రపంచం కూడా భారత అణు వ్యాపారానికి మద్దతును తెలిపితీరాలి అనే తర్కాన్ని వారు అర్థం చేసుకున్నారు. ఇక రెండవ కారణం, అణ్వస్త్రవ్యాప్తి నిరోధకత విష యంలో భారత్కు ఉన్న చరిత్ర. చైనా ప్రతిఘటనను ‘‘విధి విధానాలకు సంబంధించిన అటంకాలు’’ అన్నారని మనకు తెలుసు. అవి, పాకిస్తాన్తో తనకున్న వ్యూహాత్మక మైత్రిని పరిరక్షించుకోవాలనే చైనా కోరిక ఫలితం. మిగతా అణు శక్తులలో చేరడానికి ముందు భారత్ అణువ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై సంతకం చేసి తీరాలనేది చైనా లాంఛనప్రాయమైన అభ్యంతరం. అణుశక్తులైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్లు ఈ వాదనను అంగీకరించడానికి ఎందుకు తిరస్కరించాయి? అణువ్యాప్తి నిరోధం విష యంలో భారత్ది మచ్చలేని చరిత్ర కాబట్టి. 1950ల నుంచి అణు సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్న భారత్కు వ్యతిరేకంగా ఎన్నడూ ఏ చిన్న గుసగుస వినిపించ లేదు. అందుకు విరుద్ధంగా పాకిస్తాన్కు అణువ్యాప్తి చెందిం చిన చరిత్ర ఉన్నది. 2002 స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసం గంలో నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ పాకిస్తాన్ను అణు ముప్పు ఉన్న ప్రాంతంగా పేర్కొన్నారు. అడ్రియన్ లెవీ అండ్ కాథరిన్ స్కాట్-క్లార్క్లు రచించిన డిసెప్షన్: పాకిస్తాన్, ది యునెటైడ్ స్టేట్స్ అండ్ ది గ్లోబల్ న్యూక్లియార్ వెపన్స్ కాన్స్పిరసీ అనే పుస్తకం ఈ అంశంపై ప్రామాణి కమైనది. ఆ పుస్తకం కవర్ పేజీ పైనే ‘‘అమెరికా సహా యంతో, సాంకేతికతను ఇతర దేశాలకు అందించడం ద్వారా, పునరుజ్జీవితమైన తాలిబన్కు, అల్కాయిదాకు ఆశ్రయం కల్పించడం ద్వారా భారీ అణ్వాయుధ సంపత్తిని సమకూర్చుకుని పాకిస్తాన్ నిజానికి పాశ్చాత్య దేశాలను వంచిం చింది’’ అని ప్రముఖంగా ముద్రించి ఉంటుంది. ‘‘టైఫాయిడ్ మర్ఫీ’’ మారుపేరున్న డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ డబ్బుకు ఆశపడి... కొన్నిసార్లు ఆ దురాశకు భావ జాలం ముసుగుతొడిగి మరీ అణు రహస్యాలను అమ్మేశాడు. ఒక అసాధారణమైన డాక్యుమెంటు ఫలితంగా ఖాన్ 2004 ఫిబ్రవరి 4న బహిరంగంగా ఆ విషయాన్ని టెలివి జన్లో అంగీకరించాల్సివచ్చింది. లిబియా, ఉత్తర కొరి యాల వంటి ఖాతాదార్లకు అణు సాంకేతికతను అమ్ముతూ ఖాన్ అణు బ్లాక్ మార్కెట్ను నడిపాడు. ఆయన ఇది ఒంటరిగా చేసి ఉండరనేది స్పష్టమే. కానీ సైన్యం చేత తప్పు చేసినవాడిగా ముద్ర వేయించుకున్నాడు. ‘‘ఖాన్ తన తప్పును అంగీకరించాడు, ఆయన అత్యున్నత సహాయకు లకు అణు వ్యాపారం లేకుండా పోయింది’’ అని నాటి అధ్యక్షుడు బుష్ అన్నారు. ‘‘ఖాన్ నెట్వర్క్కు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్నంతా పంచుకుంటానని, తమ దేశాన్ని తిరిగి మరెన్నడూ అణు వ్యాప్తికి వనరును కానిచ్చేది లేదని అధ్యక్షుడు ముష్రాఫ్ వాగ్దానం చేశారు’’ అని కూడా తెలిపారు. పాకిస్తాన్ అధ్యక్షుడు సైతం తన దేశం తప్పు చేసిందని అంగీకరించాల్సి వచ్చింది. ఖాన్కు నగదు రూపం లోనూ, భౌతికంగానూ కూడా చెల్లింపులు జరిగాయి. అతడ్ని జైలుకు పంపడానికి బదులు ఆ డబ్బునంతా ఆయననే ఉంచుకోనిచ్చి, ప్రశాంతంగా పదవీ విరమణానం తర జీవితం గడపమని పంపేశారు. దీనికి విరుద్ధంగా భారత్ ‘‘అణ్వాయుధ వ్యాప్తి నిరో ధక ఒప్పందంలోని నిబంధనలను, లక్ష్యాలను సాధ్యమై నంత విశాలమైన రీతిలో అమలుపరచడానికి’’ సహకరిం చిందని ఎన్ఎస్జీ 2008లో పేర్కొంది. ఇంతకంటే ఎక్కు వగా చెప్పాల్సినది, ప్రత్యేకించి ఎన్ఎస్జీకి సంబంధించి ఏమీ లేదు. పాకిస్తాన్ను కాపాడటం కోసం భారత్కు వ్యతిరేకంగా అణ్వస్త్రవ్యాప్తి నిరోధం సమస్యను లేవనె త్తడం పూర్తి పరిహాసోక్తి కాకపోయినా, గొప్ప వైచిత్రి అవుతుంది. చైనా అభ్యంతరం సైతం సభ్యత్వ క్రమానికి సంబంధిం చినదే తప్ప మన దేశ అర్హతకు సంబంధించి నది కాకపో వడం కూడా భారత్ విశ్వసనీయతపై సందేహం లేదనే దానికి ఆధారం. దౌత్యం ఒక సుదీర్ఘ క్రీడ. క్షిపణి సాంకేతికత వంటి విష యాల్లో మనం ఫలితాలను వెంటనే సాధించగలుగుతాం. ఎన్ఎస్జీ సభ్యత్వం కేవలం కాలానికి సంబంధించిన సమస్యే, అది కూడా చాలా ఎక్కువ కాలమేమీ కాదు. వ్యాసకర్త: ఎం.జె. అక్బర్ (సీనియర్ సంపాదకులు) పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి -
చైనాకు దక్కనిది మనకు దక్కింది!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమే (క్షిపణి సాంకేతిక నియంత్రణ మండలి- ఎంటీసీఆర్)లో భారత్ సభ్యురాలైంది. విధ్వంసక క్షిపణులు, వాయుమార్గంలో ప్రయాణించే ఇతర వాహనాల విచ్చలవిడి వ్యాప్తిని నిరోధించేందుకు ఏర్పాటయిన ఎంటీసీఆర్ లో సభ్యత్వం ద్వారా భారత్.. అత్యాధునిక క్షిపణి పరిజ్ఞానంతోపాటు నిఘా డ్రోన్లను కొనుగోలుచేసుకునే వీలుంటుంది. అంతేకాదు అణు సరఫరా దేశాల కూటమి(ఎన్ఎస్ జీ)లో భారత సభ్యత్వానికి మోకాలడ్డిన చైనాను సమీప భవిష్యత్ లోనే దారికి తెచ్చుకునే అవకాశమూ లేకపోలేదు. ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్. జైశంకర్ ఎంటీసీఆర్ సభ్యత్వానికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు. 38 దేశాల ఎంటీసీఆర్ లో కీలకపాత్ర పోషిస్తోన్న ఫ్రాన్స్, నెదర్లాండ్, లక్సెంబర్గ్ రాయబారుల సమక్షంలో భారత్ చేరిక విజయవంతమైందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్నో లాభాలు.. భారత్ తో అణు ఒప్పందంలో భాగంగా అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి సంబంధించిన అన్ని కూటములలో సభ్యత్వాన్ని సమర్థిస్తానని అమెరికా గతంలో చేసిన వాగ్ధానానికి కార్యరూపమే ఎంటీసీఆర్ లో చేరిక. ప్రస్తుతం ఎంటీసీఆర్ లో 38(భారత్ తో కలిపి) దేశాలకు సభ్యత్వం ఉంది. ఈ దేశాలన్నీ 500 కేజీల బరువు, లక్ష్యం పరిధి 300 కిలోమీటర్లకు పైబడిన బాలిస్టిక్ క్షిపణులు తయారుచేయబోవు. ఒకవేళ ఇంతకు ఉంటేగనుక వాటిని ధ్వంసం చేయాల్సి ఉంటుంది. తద్వారా సభ్యదేశాల నుంచి అత్యాధునిక క్షపణి పరిజ్ఞానాన్ని, డ్రోన్లు, ఇతర వాహక నౌకలను దిగుమతి చేసుకోవచ్చు. మున్ముందు భారత్ సొంతగా రూపొందించబోయే టెక్నాలజీని కూడా అంతర్జాతీయ విపణిలో విక్రయించుకునే అవకాశం లభిస్తుంది. ఎంటీసీఆర్ లో సభ్యత్వం లేకపోవడం వల్లే ఇజ్రాయెల్ తాను రూపొందించిన అత్యాధునిక అంతరీక్ష నౌక(షావిత్)లను అమ్ముకోలేక పోవడం గమనార్హం. చైనాకు చెక్ పెట్టొచ్చు! ఎంటీసీఆర్ లో సభ్యత్వం ద్వారా భారత్ చైనాకు చెక్ పెట్టే అవకాశాలున్నాయి. 2004 నుంచి ఎంటీసీఆర్ లో చైనా సభ్యత్వం పరిశీలనలో ఉంది. వరుస క్షిపణి ప్రయోగడాలతో ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోన్న ఉత్తర కొరియాకు చైనా వెన్నుదన్నుగా నిలుస్తున్నదని ఎంటీసీఆర్ లోని మిగతా దేశాలు ఆరోపిస్తున్నాయి. చైనా మాత్రం పైకి తాను బాలిస్టిక్ క్షిపణుల తయారీని నిలిపేశానని చెప్పుకుంటోంది. లోలోన మాత్రం విధ్వంసక ఆయుధాల విక్రయాన్ని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ తో చైనా చేసుకున్న ఆయుధ సరఫరా ఒప్పందం కూడా అలాంటిదే. ప్రయత్నాలు ప్రారంభించిన ఏడాదో లోపే భారత్ కు ఎంటీసీఆర్ సభ్యత్వం దక్కడం గమనార్హం. తద్వారా భారత్ మున్ముందు చైనాపై ఒత్తిడి తీసుకువచ్చే లేదా ఆ దేశంపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఎలాగైతే భారత్ కు ఎన్ఎస్ జీ సభ్యత్వం దక్కకుండా చైనా మోకాలడ్డిందో, భవిష్యత్ లో భారత్ కూడా చైనా ఎంటీసీఆర్ సభ్యత్వానికి అడ్డుపడొచ్చు. ఆ సందర్భమే తలెత్తితే.. ద్వైపాక్షిక చర్చల ద్వారా ఎన్ఎస్ జీ సభ్యత్వానికి మార్గాలు సుగమం చేసుకోవచ్చు. -
ఎన్ఎస్ జీ సభ్యత్వానికి మెక్సికో మద్దతు
మెక్సికో: అమెరికా, స్విట్జర్లాండ్ ల తర్వాత కీలకమైన న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో భారత్ స్థానం కోసం మెక్సికో మద్దతు తెలిపింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సంప్రదింపులు జరిపిన ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో తమ మద్దతును ప్రకటించారు. మోదీతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఎన్రిక్ కు ధన్యవాదాలు తెలిపిన మోదీ మెక్సికో భారత్ కు ఎనర్జీ సెక్యురిటీలో కీలకభాగస్వామిగా పేర్కొన్నారు. ఐదు దేశాల పర్యటన కోసం వెళ్లిన మోదీ చివరగా మెక్సికోలో ఆ దేశ అధ్యక్షుడితో సమావేశమై చర్చలు జరిపారు. అమ్మకందారు-కొనుగోలుదారులుగా కాకుండా అంతకంటే మంచి భాగస్వామ్యంతో ముందకెళ్తామని అన్నారు. ట్రేడ్ సెక్టార్, పెట్టుబడులు, వాతావరణ మార్పులు, ఎనర్జీ తదితర ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. చైనా ఎన్ఎస్ జీలో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తుండటంతో మెక్సికో, స్విట్జర్లాండ్ల మద్దతు భారత్ కు కలిసొచ్చే అంశం. భారత్ కు న్యూక్లియర్ ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన ఎన్పీటీలో స్థానం లేదని చైనా వాదిస్తుండగా.. భారత్ ట్రాక్ రికార్డు కారణంగా తాము, మిగతా దేశాలు ఇందుకు సపోర్ట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం తెలిపిన విషయం తెలిసిందే. ఎన్ఎస్ జీ స్థానం వల్ల అటామిక్ ఎనర్జీ సెక్టార్ లో భారత్ భారీగా లాభపడుతుంది. -
సభ్యత్వం తీసుకోండి
- రుసుము మేమే భరిస్తాం: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు: దారిద్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాల్లో కనీసం ఒక్కరైనా ఏదో ఒక సహకార సంఘంలో సభ్యులుగా ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఇందుకు సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్పించడానికి అయ్యే సభ్యత్వ లేదా షేర్ రుసుం ప్రభుత్వమే భరించనుందన్నారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో త్వరలో అధికారిక ప్రకటన వెలువరించనున్నామని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో నూతనంగా నిర్మించబడనున్న ‘సహకార సౌధ’ శంకుస్థాపన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. సహకార సంఘాల్లోని సభ్యులందరికీ ఆరోగ్యబీమా కోసం అమలు చేస్తున్న ‘యశస్విని పథకం’ ఎంతో ప్రయోజనకంగా ఉంటోందన్నారు. ఈ పథకం రాష్ట్రంలోని అన్ని బీపీఎల్ కుటుంబాలకు కూడా అందాలనేది తమ ఉద్దేశమన్నారు. అందువల్లే బీపీఎల్ కుటుంబంలో కనీసం ఒక్కరినైనా సహకార సంఘ సభ్యుడిగా చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల రాష్ట్రంలోని దాదాపు 1.08 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని సిద్ధరామయ్య వివరించారు. ఒక్క యశస్వినీ పథకమే కాకుండా సహకార సంఘాల్లోని ప్రతి సభ్యుడికీ రూ.3 లక్షల వరకూ వడ్డీరహిత రుణాలు అం దిస్తున్నామన్నారు. ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు కూడా నూతనంగా చేరబో యే సభ్యులకు అందుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 వేల సహకార సంఘాలు, 2.22 కోట్ల సహకారసంఘ సభ్యులు ఉన్నారని సిద్ధరామ య్య తెలిపారు. ప్రభుత్వ నూతన నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు కూడా ప్రయోజనం పొందగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సహకార శాఖ మంత్రి హెచ్.ఎస్ మహదేవ ప్రసాద్ మాట్లాడుతూ... నూతననంగా చేపడుతున్న సహకారసౌధ భవన నిర్మాణానికి రూ.8.60 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. ఏడాదిన్నరలోపు భవనాన్ని పూర్తి చేస్తామని తె లిపారు. మంత్రులు రామలింగారెడ్డి, దినేశ్గుండూరావ్ పాల్గొన్నారు. -
బీజేపీ మొబైల్ మెంబర్ షిప్ ప్రారంభం
హైదరాబాద్ : గ్రేటర్ లో బీజేపీ మొబైల్ మెంబర్ షిప్ ను సోమవారం కేంద్ర కార్మిక శాఖమంత్రి దత్తాత్రేయ , రాష్ట్ర అధ్యక్షుడుకిషన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ... అన్నిరాష్ట్రాల్లోను బీజేపీయే ప్రత్యామ్నాయ పార్టీ అని తెలపారు. మోదీ సర్కార్ వల్ల ప్రపంచంలో భారత్ కు గుర్తింపు వస్తోందన్నారు. 100 మంది సభ్యులను చేర్పిస్తే క్రియాశీలక సభ్యత్వం ఇస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 35 లక్షలకు పైగా సభ్యలను చేర్చడమే బీజేపీ లక్ష్యమన్నారు. మార్చి 31 దాకా పార్టీ సభ్యత్వం ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొన్నారు. -
టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాలయ్య
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. శనివారమిక్కడ బాలకృష్ణ టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి పేరు నమోదు చేయించుకున్నారు. గత ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సంగతి తెలిసిందే. -
ఇంతేనా?
సభ్యత్వ నమోదు తీరుపై టీడీపీ నేతల అసంతృప్తి సిటీబ్యూరో: సభ్యత్వం తీసుకున్న వారికి వివిధ సదుపాయాలు కల్పిస్తున్నా లక్ష్యం చేరకపోవడం ఏంటి? ఇప్పటి నుంచైనా చురుగ్గా సభ్యత్వ నమోదులో పాల్గొనాలని టీటీడీపీ రాష్ట్ర నేతలు అన్నారు. హైదరాబాద్ నుంచి 1.5 లక్షల సభ్యత్వం నమోదు చేయాలని లక్ష్యం పెట్టుకుంటే కేవలం 30 వేల సభ్యత్వాలే నమోదు కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తి చేయడంతో టీటీడీపీ రాష్ట్ర నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, పెద్దిరెడ్డి, రాములు గురువారం సభ్యత్వ నమోదుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే రూ.2 లక్షల బీమా, ప్రమాదాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందితే రూ.50వేల వరకు రీయింబర్స్మెంట్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కూన వెంకటేశ్గౌడ్, జిల్లా నాయకులు బీఎన్ రెడ్డి, వనం రమేశ్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. -
టెక్నాలజీ వచ్చాక అన్నీ సులువైపోయాయ్
-
ఒక్క మిస్డ్ కాల్తో వైసీపీలో సభ్యత్వం
-
10 నుంచి ఆప్ సభ్యత్వ నమోదు
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించిన ఆప్ ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. దేశంలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో పదిహేను రోజులపాటు సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజులపాటు కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశం అనంతరం యోగేంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడారు. మొత్తం 545 స్థానాల్లో ఎన్ని స్థానాలకు పోటీ చేయనున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు యాదవ్ సమాధానమిస్తూ... ఈ విషయంలో పార్టీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అయితే వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకే తాము ఆసక్తి కనబరుస్తున్నామని చెప్పారు. 15 నుంచి 20 స్థానాలకు తగ్గకుండా తమ పార్టీ పోటీ చేసే అవకాశముందన్నారు. కేజ్రీవాల్ నేతృత్వంలోనే లోక్సభ ఎన్నికలకు వెళ్తామన్నారు. అయితే పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం గురించి మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదన్నారు. హర్యానాలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 10 లోక్సభ నియోజకవర్గాల్లో ఆప్ పోటీ చేస్తుందని చెప్పారు. నిజానికి హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్లో జరగాల్సి ఉన్నా అక్కడ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయని, లోక్సభ ఎన్నికలతోపాటే వాటిని నిర్వహించే అవకాశముందన్నారు. అందుకే హర్యానాలోని అన్ని లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఆప్లో చేరేందుకు దేశంలోని ఎంతోమంది ఆసక్తి కనబరుస్తున్నారని, అందుకే ఈ నెల 10 నుంచి 26 వరకు ‘మై బీ ఆమ్ ఆద్మీ’ పేరుతో సభ్యత్వ నమోదు ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. పల్లెల్లో, పట్టణాల్లో పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తోందని, ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరాల్సిందిగా ప్రజలను ఈ కార్యక్రమం ద్వారా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అయితే పార్టీలో చేరేందుకు ఎటువంటి సభ్యత్వ నమోదు రుసుము వసూలు చేయడంలేదని తెలిపారు. -
నేరం రుజువైతే ఎంపిల సభ్యత్వం రద్దు:సుప్రీం