Millionaire
-
మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ పాట్లు..! ఈసారి ఏకంగా..
మిలియనీర్ బ్రయాన్ జాన్స(Bryan Johnson)న్ యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో వార్తల్లో నిలిచారు. అందుకోసం కోట్లక్దొదీ డబ్బుని ఖర్చు చేస్తున్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అతడు ఆ ప్రయోగాల్లో సక్సెస్ అందుకుంటాడో లేదా గానీ బ్రయాన్ తనపై చేసుకునే ప్రయోగాలు ఊహకందని విధంగా భయానకంగా ఉంటాయి. ఇంతకుముందు ప్లాస్మా, తన కొడుకు రక్తం ఎక్కించుకోవడం వంటి వాటితో హడలెత్తించాడు. ఇప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్తో ఆరోగ్యం తోపాటు వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఏకంగా తన కార్యాలయాన్నే హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్(Hyperbaric oxygen chamber)గా మార్చేశారు. అసలేంటిదీ అంటే..?మిలియనీర్ బ్రయాన్ జాన్సన తన కార్యాలయాన్ని హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్లోకి మార్చిన తాజా వీడియోని నెట్టింట షేర్ చేశారు. ఈ వీడియోలో బ్రయాన్ తన నోరు, ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ ధరించి కంప్యూటర్పై పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. చూడటానికి ఆయన ఒక ఆక్సిజన్ చాంబర్ లోపల బంధించబడినట్లుగా ఆ వీడియోలో కనబడుతుంది. మరో ట్వీట్లో బ్రయాన్ ఆ హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ (HBOT) అంటే ఏంటో సవిరంగా వివరించారు. ఆ ట్వీట్లో హెచ్బీఓటీ( HBOT ) అనేది ఒత్తిడితో కూడిన గదిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ని పీల్చుకునే వైద్య చికిత్స అట. ఈ థెరపీ ప్రకారం ఒత్తిడితో కూడిన గదిలో ఊపిరితిత్తులు ఆక్సిజన్ని గ్రహించే సార్థ్యాన్ని పెంచుతుందట. ఫలితంగా శరీరమంత ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయట. ఈ చికిత్సలో కణజాలాల్లో ఆక్సిజన్ సాంద్రత పెంచడం, సెల్యులార్, వాస్కులరైజేషన్లకి మద్దతు ఇచ్చి, పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం అని ట్వీట్లో బ్రయాన్ రాసుకొచ్చారు. అయితే నెటిజన్లల్లో ఈ థెరపీపై ఒక ఉత్సుకత తోపాటు అనేక రకాల సందేహాలను లేవెనెత్తింది. ఎందుకంటే అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున ఈ హైపర్బారిక్ చాంబర్లలో ఎలక్ట్రానిక్స్(కంప్యూటర్) అనుమతించే అవకాశం లేదనే సందేహం వెలిబుచ్చగా, మరొకరు వాస్తవాన్ని స్వీకరించి ఆనందంగా బతకడం బెటర్ కదా బ్రో అని మరోకరు సెటైర్లు వేస్తూ పోస్టులు పెట్టారు. నిజానికి బ్రయాన్ ఈ ప్రయోగాల్లో ఎంతవరకు సఫలం అవుతాడో లేదో తెలియదు గానీ..ఒకరకంగా హాయిగా అందిరిలా జీవించే స్వేచ్ఛయుత జీవనాన్ని కోల్పుతున్నాడనేది జగమేరిగిన సత్యం కదూ..!.Moved my office into my hyperbaric oxygen chamber. pic.twitter.com/8TXfpPpICh— Bryan Johnson /dd (@bryan_johnson) February 21, 2025 (చదవండి: పుష్ప 2, ఛావా.. ఈ బ్లాక్బస్టర్ విజయాల్లో 'ఆమె'ది కీలక పాత్ర!) -
Millionaire Bryan Johnson: డైట్లో గరం మసాలా, స్టీల్ డబ్బాల్లో..!
ఏజ్-రివర్సల్ ఔత్సాహికుడు టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత తనపై చేసుకుంటున్న ప్రయోగాలు ఫలితాల గురించి కూడా నెటిజన్లతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంటారు. వాటిలో కొన్ని విజయవంతమవ్వగా మరికొన్ని విఫలమయ్యాయి. అయితే బ్రయాన్ తన డైట్లో భారత ఆహార పదార్థాల గొప్పతనం వాటి ప్రయోజనాల గురించి గతంలో షేర్ చేసుకున్నారు. తాజాగా భారతీయులు కూరలకు సువాసనతో కూడిన ఘమఘమలు అందించేందుకు ఉపయోగించే గరం మసాలాని కూడా తన డైట్లో చేర్చుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్లో తెలిపారు. తరుచుగా మన ముంబైలో గాలి నాణ్యత బాగాలేదని ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో ఉందంటూ విచారం వ్యక్తం చేసే బ్రయాన్ మన భారతీయ వంటకాల గొప్పదనాన్ని మాత్రం మెచ్చుకుంటూనే ఉంటారు. వాటిలో ఎన్నో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు కూడా. కానీ ఈసారి బ్రయాన్ మన భారతీయులు ప్రయాణాల్లో ఉపయోగించే టిఫిన్ డబ్బాల్లోనే ఆహారం నిల్వ చేయడం విశేషం. అలాగే భారతీయులు ఉపయోగించే గరం మసాలను కాల్చిన యాపిల్, క్యారెట్లతో కూడిన బటర నట్ స్క్వాష్ సూప్లో ఉపయోగించినట్లు వెల్లడించారు. ఇక ఆ రెసిపీ తయారీ విధానాన్నికూడా సవివరంగా వెల్లడించారు. అలాగే తన సూపర్ఫుడ్ స్మూతీ బ్లాక్బీన్ అండ్ మష్రూమ్ బౌల్ విత్ చిక్పీ రైస్లో ఏమి జోడించి తింటారో కూడా తెలిపారు. వీటితోపాటు మెటల్ కంటైనర్లలో(స్టీల్ డబ్బాల్లో) నిల్వ చేసిన తన ఫుడ్ ఫోటోలను కూడా షేర్ చేశారు. అవి చూడగానే భారతీయుల మాదిరిగా స్టీడబ్బాలు, టిఫిన్ బాక్స్లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన అందరికి ఆరోగ్యంపై స్ప్రుహ కలుగుతోందని, అందువల్లే ఫాస్ట్ఫుడ్ నుంచి ఆరోగ్యకరమైన భారతీయ ఆహార విధానాల వైపు దృష్టిపెడుతున్నారంటూ పెట్టిన పోస్టు నెటిజన్లందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదీ ఏమైన వృద్ధాప్యాన్ని తరిమికొట్టే ప్రయోగాలకు పేరుగాంచిన బ్రయాన్ జాన్సన్ సైతం మన భారతీయులు ఆహార సంస్కృతిని గౌరవించడం, వాటి ప్రయోజనాల గురించి ఆయన నోట వినడం చూస్తుంటే మన పెద్దలు ఆనాడే ఆరోగ్యం పట్ల ఎంత జాగుకరతతో వ్యవహరించారో అనిపిస్తోంది కదూ. ఇప్పటిది కాదు ఆరోగ్య స్ప్రుహ ఆనాడే మన పూర్వీకులు దానిపై దృష్టిపెట్లి మనకు ఔషధ గుణాలు కలిగిన వాటిని పరిచయం చేసి ఉపయోగించేలా చేశారు కదూ..!. What I'm eating for the next few days: Blueprint Superfood Smoothie •½ cup strawberries•½ cup blueberries•¼ cup pomegranate arils•½ cup dark cherries, pitted•1 cup almond milk•1 tablespoon flax seeds•5-6 macadamia nuts•1 teaspoon chia seeds•1 teaspoon… pic.twitter.com/YWfX1zR6hc— Bryan Johnson /dd (@bryan_johnson) February 18, 2025 (చదవండి: ఆ టీచర్ సాహసం మాములుగా లేదుగా..! గిరిజన పిల్లల కోసం..) -
ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం..!
అమెరికన్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేందుకు కోట్లకొద్దీ డబ్బులు ఖర్చుపెట్టి వార్తల్లో నిలిచిన సంగత తెలిసంది. దీన్ని బ్లూప్రింట్ ప్రాజెక్ట్ పేరుతో యువకుడిలా కనిపించే ప్రయోగాలకు నాందిపలికారు. ఈక్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో షేర్ చేసుకునేవారు. తాను చేస్తున్న ప్రయోగం సక్సస్ అయితే నిత్య యవ్వనంగా ఉండలనే మనిషి కోరిక నేరవేరడం తోపాటు దీర్ఘాయవును పొందేలా ఆరోగ్యంగా ఉండటం ఎలా అనేదానికి మార్గం సుగమం అవుతుందనేది బ్రయాన్ కోరిక. ఆయన కారణంగానే అందరిలోనూ భవిష్యత్తు ఆరోగ్యం, దీర్ఘాయువు ఎలా ఉండనుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆ నేపథ్యంలో ఆయన ఏ చిన్న ట్వీట్ చేసినా, ఎవ్వరితో సమావేశమైనా హాట్టాపిక్ అవుతుంది. తాజాగా బ్రయాన్ ముంబై సందర్శన తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. అక్కడ బ్రయాన్ లిటిల్ నెస్ట్ కమ్యూనిటీలో శ్లోకా అంబానీ, ఆనంద్ పిరమల్, సోనమ్ కపూర్ అహుజా వంటి ప్రముఖులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో వారితో భవిష్యత్తులో ఆరోగ్యం, దీర్ఘాయువు గురించి చర్చించారు. అలాగే జోమాటో సీఈవో దీపిందర్ గోయల్ వంటి ప్రభావవంతమైన వ్యక్తులతో కూడా సమావేశమయ్యారు. ఇక బ్రయాన్ భారతదేశం పర్యటనలో వాయు కాలుష్యం గురించి మాట్లాడారు. దీన్ని అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా అభివర్ణించారు. ముంభైలో ఉన్న పేలవమైన గాలి నాణ్యత గురించి షేర్ చేసుకున్నారు. ఈ కాలుష్యం ప్రభావం పడకుండా N95 మాస్క్లు, HEPA ఫిల్టర్లను ఉపయోగించాలని సూచించారు. ఇక్కడ గాలి నాణ్యత దారుణంగా ఉందని తన కళ్లు, గొంతు కూడా మండుతున్నాయని వాపోయారు. మంచి ఆరోగ్యం కోసం అందరూ ఆరోగ్యకరమైన గాలి లభించే వాతావరణంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, బ్రయాన్ భారత్ పర్యటన సమావేశాలు దీర్ఘాయువుపై ప్రపంచ ఆసక్తిని గురించి నొక్కి చెబుతున్నాయి. అలాగే భారత్లోని హెల్త్ సంబంధితన వెల్నెస్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకు వెళ్లేలా తీసుకోవాల్సిన చర్యలను కూడా హైలెట్ చేసింది. Great speaking with the Little Nest community about the future of health and longevity. Big thanks to Shloka Ambani, Anand Piramal and Sonam Kapoor Ahuja for hosting me. pic.twitter.com/i2O2vbrWQC— Bryan Johnson /dd (@bryan_johnson) December 4, 2024 (చదవండి: ఈ సూప్ తయారీకి మూలం బ్రిటిష్ అధికారులట..!) -
బాడీ పోశ్చర్(భంగిమ) కరెక్ట్గా ఉందా? హెచ్చరిస్తున్న టెక్ మిలియనీర్
టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్(46) తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలకు సంబంధించి.. మరో ఆసక్తికర విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అత్యంత కీలకమైన మన బాడీ పోశ్చర్ గురించి చెప్పారు. ఇది శరీర భాగాల తోపాటు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలిపారు. దాన్ని మెరుగుపరుచుకోకపోతే బ్రెయిన్పై ఎఫెక్ట్ పడుతుందంటూ చాలా షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. అందుకోసం ఏం చేయాలో కూడా వివరించారు. అవేంటంటే..తన యాంటీ ఏజింగ్ ప్రక్రియల్లో భాగంగా ప్రతి భాగాన్ని అత్యంత కేర్ఫుల్గా చూసుకుంటున్నారు బ్రయాన్. నిజానికి మన ఏజ్ పెరిగే కొద్ది ఎలాంటి మార్పులు సంభవించి నెమ్మదిగా వృద్ధాప్యం వస్తుందో కూడా వివరంగా చెప్పారు బ్రయాన్. తాను అనుకున్నట్లుగా వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టగలరో లేదో కచ్చితంగా చెప్పలేకపోయినా..ఏ అలవాట్ల వల్ల వేగంగా వృద్ధాప్య లక్షణాలు వస్తాయో ఆయన ప్రయోగాల ద్వారా చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇక బ్రయాన్ యాంటీ ఏజింగ్ ప్రక్రియలో తెలిసిన మరో ఆసక్తికర విషయం బాడీ పోశ్చర్. ఇది సరిగా లేకపోతే మన ఆరోగ్యంపై ఎలాంటి భయంకరమైన ప్రతికూల ప్రభావం చూపుతుంతో వివరిస్తూ..తన వ్యక్తిగత అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. తన బాడీ పోశ్చర్ చాలా భయంకరంగా ఉండేదని, అది నెమ్మదిగా తన బ్రెయిన్పై ఎలా ప్రభావం చూపిస్తుందో గమనించలేకపోయానని పోస్ట్లో రాసుకొచ్చారు. తన ఎంఆర్ఐలో తన భంగిమ మెదడులోని రక్తాన్ని బంధించి గుండెకు ప్రసరించకుండా ఎలా అడ్డుకుంటుందో తెలిపారు. దీని కారణంగా తనకు మూర్చ, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసిందన్నారు. నిజానికి బాడీ పోశ్చర్ గురించి చాలమందికి సరిగా తెలియదు. ఇదే ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తుందన్నారు. ఒక రోజులో మన బాడీని చాలా తప్పుడు భంగిమల్లో ఉంచుతామని అన్నారు. అది కూర్చీలో కూర్చొవడం దగ్గర నుంచి స్క్రీన్వైపు చూసే విధానం వరకు సరైన పోశ్చర్లో కూర్చొమని అన్నారు.ఈ అలవాట్లే క్రమేణ కండరాల నొప్పి, రక్తప్రసరణ సమస్యలు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తు పనితీరు బలహీనపడటం, నరాల కుదింపు, వెన్నుముక అమరికలో తేడాలు, మూడ్ మార్పులు, నిద్రాభంగం తదితర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. తాను ఐదు ముఖ్యమైన విషయాల్లో తన బాడీ భంగిమను మెరుగుపరిచానని అన్నారు. నిటారుగా ఉండేలా వ్యాయామాలు, ఫోన్ని చూడటానికి తలవంచకుండా కంటికి సమాన స్థాయిలో పెట్టుకుని చూడటం వంటి మార్పులు చేయాలని సూచించారు. అలాగే రోజులో ప్రతి 30 నిమిషాల కొకసారి కదలడం, చురుకుగా ఉండటం, మెట్లు ఎక్కడం, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు, డ్యాన్స్ వంటివి చేయాలని అన్నారు. రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా మన బాడీ పోశ్చర్ ఉండటం అత్యంత ముఖ్యం అని చెప్పారు బ్రయాన్. ఇది మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పారు. జస్ట్ మన పోశ్చర్ మాత్రమే మెరుగుపరుచుకోవడమే కాదు మీ చుట్టు ఉండే వాతారవణాన్ని కూడా సరైన విధంగా మన భంగిమకు అనుగుణంగా మార్చుకోగలిగితే సత్ఫలితాలు పొందగలమని చెబుతున్నారు బ్రయాన్. కాగా, ఇంతకుమునుపు బ్రయాన్ తాను బట్టతల రాకుండా ఎలా నివారించింది, జుట్టు రాలు సమస్యను అరికట్టే చిట్కాలు వంటి వాటి గురించి షేర్ చేసుకున్నారు.I didn't realize how terrible my posture was until an MRI showed it was slowly killing my brain.A ticking time bomb of a problem that I've now dramatically improved with these five habits. 🧵 pic.twitter.com/qPGKiCsDXc— Bryan Johnson /dd (@bryan_johnson) October 10, 2024 (చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!) -
నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్
జీవితమంటే ఎన్నో కష్టాలు, నష్టాలు. అన్నింటిని దాటుకుంటూ వెళ్తేనే అందమైన ప్రపంచం. దీనికి నిదర్శనమే షాదీ.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ 'అనుపమ్ మిట్టల్'. ఈయన తన అద్భుతమైన ప్రయాణం గురించి ఇటీవల వెల్లడించారు. అతి తక్కువ వయసులోనే ధనవంతుడై.. ఆ తరువాత అన్నీ కోల్పోయానని అన్నారు. దీనికి సంబంధించిన విషయాలను ఈయన లింక్డ్ఇన్ పోస్ట్లో వెల్లడించారు.20 ఏళ్ళ వయసులోనే మల్టీ మిలియనీర్గా ఎదిగాను. యుఎస్లో జీవితం ఒక కలలా అనిపించింది. ఎంతగా అంటే నేను ఫెరారీని కూడా ఆర్డర్ చేసాను. కానీ అది వచ్చిన వెంటనే, అంతా అదృశ్యమైంది. డాట్ కామ్ బుడగ పగిలిపోయింది, దానితో డబ్బు మాయమైంది. ఉన్న డబ్బు పోవడమే కాకుండా అప్పులు చేయాల్సి వచ్చిందని అనుపమ్ మిట్టల్ పేర్కొన్నారు.2003 నాటికి నేను గెలిచిన.. ఓడిపోయిన జ్ఞాపకం తప్పా మరేమీ మిగలలేదు. అన్నింటిని కోల్పోవడం వల్ల వచ్చే ధైర్యంతో నేను మరొక డాట్-కామ్ వెంచర్ను (షాదీ.కామ్) నిర్మించడానికి సన్నద్దమయ్యాను. డొమైన్ ధర 25,000 డాలర్లు. ఆ తరువాత మా వద్ద కేవలం 30,000 డాలర్లు మాత్రమే మిగిలింది. ప్రజలందరూ నన్ను పిచ్చివాడిగా భావించారు. అంతే కాకుండా నేను ప్రారంభించిన వ్యాపారం గురించి కూడా ప్రశ్నల వర్షం కురిపించారు.ఎవరు ఏమనుకున్నా.. నేను మాత్రం ఇదే గేమ్ ఛేంజర్ అని భావించాను. ఇదే సరైనదని ముందుకు వెళ్ళాను. మళ్ళీ పూర్వ వైభవం పొందాను. నా ప్రయాణం కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, నేను ఓటమి చూసినా మళ్ళీ ఎదగగలనని నిరూపించానని అనుపమ్ మిట్టల్ అన్నారు.ఇదీ చదవండి: భారత్లో హెడ్ ఆఫీస్ అమ్మేస్తున్న అమెరికన్ కంపెనీఒక వ్యక్తి సామర్థ్యాన్ని కేవలం గెలుపు, ఓటములతో నిర్దారించలేము. విజయం అనేది జనాదరణ పొందిన అభిప్రాయంతో పాటు వెళ్లడం కాదు. మీపై మీరు విశ్వాసంతో ముందుకు నడవడమే. రిస్క్ తీసుకోవాలి, గెలిచే వరకు ఆటను ఆపొద్దని మిట్టల్ సూచించారు. -
వయసుని తగ్గించుకోవడంలో సక్సెస్ అయిన బ్రియాన్ జాన్సన్! ఏకంగా..
మిలియనీర్ టెక్ వ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్(48) తన వృద్ధాప్యాన్ని తిప్పేకొట్టే ప్రతయత్నంలో విజయం సాధించాడు. ఆయనకు వయసు మీద పడుతున్న యువకిలా కనిపించాలనుకున్నారు. అందుకోసం ప్రాజెక్ట్ బ్లూప్రింట్ పేరుతో గత కొంతకాలం కఠినమైన డైట్ని అనుసరించాడు. ప్రత్యేకమైన ఆహారం, వందకు పైగా మాత్రలు వేసుకున్నాడు. తన శరీరంలో ప్రతి భాగం 18 ఏళ్ల యువకుడిలో ఉండేలా ప్రతి నిత్యం దాదాపు 30 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునేవాడు. దీని కోసం అని అతను కోట్లలో డబ్బు వెచ్చించాడు కూడా. ఎట్టకేలకు వయసు మీద పడుతున్న యువకుడిలో వయసు తగ్గించుకునే బ్లూప్రింట్ ప్రాజెక్ట్ విజయవంతమయ్యిందని, తాను యువకుడిలా మారానని వెల్లడించారు. వృద్ధాప్య ఛాయలకు విజయవంతంగా చెక్పెట్టానన్నారు. అందుకు సంబంధించిన రహస్యాన్ని బ్లూప్రింట్ స్టాక్ పేరుతో మార్కెట్లో విక్రయించనున్నట్లు తెలిపాడు. ఇది మన ఫాస్ట్ ఫుడ్పై ఖర్చు చేసే అమౌంట్ కంటే తక్కవలోనే ఈప్రొడక్ట్ స్టాక్ని తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. ఆ ప్రొడక్ట్లో డ్రింక్ మిక్స్, ప్రొటీన్, ఎనిమిది మాత్రలు, స్నేక్ ఆయిల్, 61 శక్తిమంతమైన థెరపీలు, 400 కెలరీలు సప్లిమెంటరీస్ ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రొడక్స్లను ప్రమోట్ చేస్తే ఇది తల్లిపాలకు సరిసమానమైనదని చెబతూ ఉత్త్పత్తుల వివరాలను ఎక్స్లో వెల్లడించారు. ఈ ఉత్పత్తుల పనితీరుపై దాదాపు వెయ్యి క్లినకల్ ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపారు. అంతేగాదు తన వయసు కంటే ఐదేళ్లు తగ్గించుకున్నానని, మెరుగైన ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపాడు. ఆయన ఈ బ్లూప్రింట్ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టాడు. వయసు రీత్యా వచ్చే జుట్టు రాలు సమస్యకు కూడా చెక్ పెట్టానని చెప్పారు. ఈ ఉత్పత్తులను తమ డైట్లో భాగం చేసుకుంటే భోజనం రెండు పూటలా తీసుకోవచ్చలేదన్నది తెలియాల్సి ఉంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేసే ఈ బ్లూప్రింట్ స్టాక్ అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, నార్వే, పోలాండ్ పోర్చుగల్, స్పెయిన్, సింగపూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, అరబ్ దేశాలు తోసహా మొత్తం 23 దేశాల్లో అందుబాటులో ఉందని వెల్లడించారు బ్రయాన్ జాన్సన్. (చదవండి: లిప్ ఫిల్లింగ్ ట్రీట్మెంట్ మంచిదేనా? ఫెయిలైతే అంతేనా..!) -
సినిమాని తలపించే కథ! వందల కోట్ల ఆస్తులున్న కొడుక్కి చెప్పని తండ్రి..!
అత్యంత సంపన్న కుటుంబం..20 ఏళ్లు వచ్చేవరకు కొడుక్కి చెప్పని తండ్రి సినిమాల్లో, కథల్లోనూ వింటాం ఇలాంటి కథను. నిజ జీవితంలో కనిపించడం అరుదు. అయినా మిలయనీర్ కుటుంబ నేపథ్యం ఉన్న పిల్లలు కచ్చితంగా ఆ రేంజ్ తగ్గట్టు బతుకుతారు. అంతలా సాధారణ పిల్లల్లా ఉండేందుకు వారి తల్లిదండ్రులే ఒప్పుకోరు. వాస్తవికంగా అలా జరగదు. కానీ ఈ మిలియనీర్ కొడుకు కథ సినిమాని తలపించేలా వేరేలెవెల్లో ఉంది. ఇంతకీ అతడి కథ ఏంటంటే.. తండ్రి వందల కోట్ల వ్యాపార సామ్రజ్యానికి అధిపతి. అత్యం సంపన్న కుటుంబం. అయినా ఆ విషయం కొడుక్కి చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. చైనాలో అత్యంత విలువైన ప్రొడక్ట్ హునాన్ స్పైసీ గ్లూటెన్ లాటియో బ్రాండ్ మాలా ప్రిన్స్ వ్యవస్థాపకుడు జాంగ్ యుడాంగ్ కొడుకు జాంగ్ జిలాంగ్ జియుపాయ్ కథ. అతడే స్వయంగా తన తండ్రి ఆస్తిని తనకు చెప్పకుండా రహస్యంగా ఉంచినట్లు తెలిపాడు. తనకు 20 ఏళ్లు వచ్చేవరకు తన తండ్రి మనం అప్పుల్లో ఉన్నామనే చెప్పేవాడు. తన తండ్రి జాంగ్ యడాంగ్ ప్రసిద్ధ బ్రాండ్ ఓనర్ అని తెలుసు. కానీ ఎప్పుడూ కుటుంబం అప్పులు పాలయ్యిందని చెప్పేవాడు. కౌంటీలో ఓ సాధారణ ప్లాట్లో తాము నివశించేవారమని చెప్పుకొచ్చాడు. పైగా తన కుటుంబ నేపథ్యాన్ని ఉపయోగించకుండానే తాను ఓ మంచి పాఠశాలలో ప్రవేశం పొంది చదువుకున్నట్లు తెలిపాడు. తన కాలేజ్ చదువు పూర్తయ్యాక వెంటనే కనీసం నెలకు రూ. 60 వేలు వేతనం వచ్చే మంచి ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పాడు. ఎందుకంటే..? ఆ డబ్బుతో కుటుంబ అప్పుల్ని తీర్చాలని జిలాంగ్ భావించాడు. అయితే తండ్రి తమకు వేల కోట్లు ఆస్తులు ఉన్నాయన్న విషయం గ్యాడుయేషన్ పూర్తి అవుతుండగా చెప్పినట్లు తెలిపాడు. ఆ తర్వాత తన తండ్రి తమ కుటుంబాన్ని దాదాపు రూ. 11 కోట్లు విలువ చేసే విలాసవంతమైన విల్లాకు మార్చారని అన్నాడు. ప్రస్తుతం జిలాంగ్ తన తండ్రి కంపెనీ ఈ కామర్స్ విభాగంలోనే పనిచేస్తున్నాడు. అయితే అతడు కంపెనీని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆశయంతో ఉన్నాడు. కానీ అతడి తండ్రి మాత్రం జిలాంగ్ పనితీరు బాగుంటేనే కంపెనీనీ అతడికి అప్పగిస్తానని చెబుతుండటం గమనార్హం. ఇలాంటి అద్భత కథలు నవలల్లోనూ, సినిమాల్లోనే ఉంటాయి. నిజ జీవితంలో సాధారణ యువకుడిలా పెరిగిన ఈ యువరాజు కథ చాలా అద్భుతంగా ఉంది కదూ..!. ఈ కథ పిల్లలకు ఏ వయసులో ఏది తెలియడం మంచిది అనేది బోధిస్తోంది. వారికి బాధ్యత తెలియాలంటే తండ్రి బ్యాంగ్రౌండ్తో పనిలేదని, స్వతహాగా అతడి కాళ్లపై నిలబడేలా పెంచితే చాలని తెలియజేస్తోంది ఈ గొప్ప కథ!. (చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కనపెట్టి అంబాసిడర్ అయిన యువతి!) -
దీపావళి కానుకేమో! బ్యాంక్ అకౌంట్లోకి రూ.4 కోట్లు
ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్కు చెందిన ఓ వ్యక్తి దీపావళి నాడు కోటీశ్వరుడు అయ్యాడు. అతనికి చెందిన రెండు వేర్వేరు బ్యాంక్ అకౌంట్లలోకి రూ.4 కోట్లకు పైగా వచ్చి డబ్బు వచ్చిపడింది. ఈ డబ్బు గుర్తుతెలియని ఖాతాల నుంచి జమవడంతో ఖంగారుపడ్డ ఆ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. అలీఘడ్లో మెడికల్ స్టోర్ నిర్వహించే మహమ్మద్ అస్లాం.. తన బ్యాంక్ ఖాతాలలో పెద్ద మొత్తం జమవడంపై బ్యాంక్ అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ దీపావళి సెలవు కావడంతో బ్యాంక్ అధికారుల నుంచి స్పందన రాలేదు. దీంతో అతడు డయల్ 112 కి ఫోన్ చేసి పోలీసులకు విషయం తెలియజేశాడు. తనకు చెందిన ఐడీఎఫ్సీ, యూకో బ్యాంకు ఖాతాల్లోకి నవంబర్ 11, 12 తేదీల్లో పలు దఫాలుగా రూ.4.78 కోట్లు జమైనట్లు అస్లాం తెలిపాడు. అవాక్కైన తాను వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించానని, కానీ వారు సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నాడు. దీంతో ఏం చేయాలో తెలియక డయల్ 112కి ఫోన్ చేసి విషయం చెప్పానని, తర్వాత వారి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశానని అస్లాం వివరించాడు. దీనిపై నగర పోలీసు అధికారి మృగాంక్ శేఖర్ పాఠక్ మాట్లాడుతూ దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. బ్యాంకులు పూర్తిగా తెరుచుకున్న తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. -
'నాన్న బ్లడ్ బాయ్'! 71 ఏళ్ల తండ్రి వయసు ఏకంగా 25 ఏళ్లకు..
టెక్ మిలినియర్ బ్రయాన్ జాన్సన్ బయోలాజికల్ ఏజ్ రివర్స్లో భాగంగా తనే ఏజ్ని తగ్గించడం కోసం ఎంతలా డబ్బును వెచ్చించాడో తెలిసిందే. ఇప్పుడూ ఏకంగా తన రక్తంతో వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రి ఏజ్ని తగ్గించే ప్రక్రియకు పూనుకున్నాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఇంతకీ ఏంటా కథకమామీషు అంటే.. 45 ఏళ్ల సాఫ్ట్వేర్ బిలియనీర్ బ్రయాన్ జాన్సన్ ఏజ్ తగ్గించుకునే ప్రయోగాలు తనకే పరిమితం చేయలేదు కాబోలు. అందుకోసం 71 ఏళ్ల తండ్రిని కూడా వదిలిపెట్టలేదు . జాన్సన్ తన తండ్రి కోసం సుమారు 1 లీటర్ ప్లాస్మా దానం చేసినట్లు తెలిపాడు. అతనికి తన శరీరంలో ఉన్న ప్లాస్మాను తీసివేసి కొడుకు రక్తంలోని ప్లాస్మాను ఎక్కించారు. దీంతో అతడి వృద్ధాప్య వయసు 25 ఏళ్లకు తగ్గింది. ఎంత పెద్దవారైతే అంత తొందరగా వృద్ధాప్యం వస్తుంది. అయితే ఎప్పుడైతే అతనికి కొడుకు జాన్సన్ ప్లాస్మా ఎక్కించారో అప్పుడే అతను 46 ఏళ్ల టైంలో వచ్చే వృద్ధాప్య వేగం వచ్చింది. ఈ చికిత్స జరిగిన నెలలు తర్వాత కూడా అతడిలో అదే తరహా వృద్ధాప్య లక్షణాలు కనిపించాయని జాన్సన్ ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు. తాను ఇప్పుడు మా నాన్న "బ్లడ్ బాయ్"ని అంటూ అసలు విషయం అంతా రాసుకొచ్చాడు. ఈ ప్రక్రియలో తన తండ్రి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నాడు. అలాగే తన నుంచి పొందిన లీటరు రక్తం కంటే ఎక్కువగానే తన తండ్రిలోని సొంత ప్లాస్మాను తీసేసి ఉండొచ్చు అందువల్లే తన తండ్రిలో ఇంతలా మార్పులు వచ్చాయని అంటున్నాడు. కాగా, జాన్సన్ గత ఫిబ్రవరి ప్రాజెక్ట్ బ్లూప్రింట్లో భాగంగా తన యవ్వనాన్ని తిరిగి పొందేందుకు రోజు వందకు పైగా మందులు వేసుకుంటున్నాని, దాదాపు 30 మంది వైద్యులచే నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. పైగా అందుకోసం ఏడాదికి రూ. 16 కోట్లు పైనే ఖర్చు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ రివర్స్ ఏజింగ్ ప్రయోగం సఫలం అవుతుందో లేదో తెలియదు గానీ అందుకోసం వారు తీసుకుంటున్న చికిత్సలు, పడుతున్న అవస్థలు వింటుంటే వామ్మో!.. అనిపిస్తుంది కదూ. My super blood reduced my Dad’s age by 25 years My father's (70 yo) speed of aging slowed by the equivalent of 25 years after receiving 1 liter of my plasma, and has remained at that level even six months after the therapy. What does that mean? The older we get, the faster we… pic.twitter.com/s4mBMDSP8Z — Zero (@bryan_johnson) November 14, 2023 (చదవండి: వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
వరించిన అదృష్టం..రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్స్యకారుడు!
చేపల వేటతో జీవనం సాగించే మత్స్యకారులకు ఒక్కోసారి అదృష్టం వరించి అరుదైన చేపలు వలలో చిక్కుతాయి. దీంతో లక్షాధికారులుగా మారిన పలు సందర్భాలు ఉన్నాయి. అలాంటి అదృష్టమే పాక్లోని ఓ మత్స్యకారుడిని వరించింది. దెబ్బతో ఒక్కరాత్రిలో ఊహించని రీతిలో అతని తలరాత మారిపోయింది. అతడికి లక్ అలా ఇలా లేదు. వివరాల్లోకెళ్తే...పాక్లోని కరాచీ నౌకాశ్రయం సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఇబ్రహి హైదరీ వలలో అరుదైన చేపలు పడ్డాయి. ఆ చేపలను మాండలికంలో గోల్డెన్ ఫిష్, లేదా సోవా అని పిలుస్తారు. ఇవి చాలా అమూల్యమైనవి, అరుదుగా దొరుకుతాయి. వీటిలో మంచి ఔషధగుణాలు ఉండటంతో వైద్యంలో ప్రముఖంగా వాడతారు. అలాగే వీటిలో దారం లాంటి పదార్థాన్ని శస్త్ర చికిత్స విధానాల్లో వినయోగిస్తారు. ఈ చేప ఒక్కొకటి ఏకంగా 7 మిలియన్లు(దాదాపు 70 లక్షలు) పలికాయి. దీంతో మొత్తం చెప్పలు సుమారు రూ. 7 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో అతను ఓవర్ నైట్లో కోటీశ్వరుడు మారిపోయాడు. ఈ చేప సుమారు 20 నుంచి 40 కిలోల బరువు ఉండి దాదాపు 1.5 మీటర్ల వరకు పెరుగుతుంది. వీటిని స్థానిక వంటకాల్లోనే కాక ఔషధాల్లోనూ ఎక్కువుగా ఉపయోగిస్తారు.కాగా, ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడుపోవడంతో మత్స్యకారుడు హైదరీ ఆనందానికి అవధులు లేవు. ఇవి సంతానోత్పత్తి కాలంలోనే తీరాని వస్తాయని, అప్పుడే వలకు చిక్కుతాయని చెబుతున్నాడు హైదర్. తాను ఈ సొమ్ముని తన సిబ్బందితో కలిసి పంచుకుంటానని ఆనందంగా చెబుతున్నాడు. ఏదైన టైం రావలిగానీ ఒక్క క్షణంలో మీ జీవితం అందనంత ఎత్తులోకి వెళ్లిపోతుందంటే ఇదే కదా!. (చదవండి: పేషెంట్కి చికిత్స అందిస్తూ..అంతలో వైద్యుడు..) -
కోటీశ్వరుడైన నిరుపేద.. ఒకప్పుడు తిండికి తిప్పలు.. నేడు ఎంతోమందికి..
ప్రస్తుతం కుబేరులుగా.. సక్సెస్ పీపుల్స్గా చెప్పుకుంటున్న వారందరూ కూడా ఒకప్పుడు ఎన్నెన్నో కష్టాలు పడి విజయం సాధించిన వారే. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త 'రాజా నాయక్'. ఈయనెవరో, ఈయన సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పేద కుటుంబంలో జన్మించిన రాజా నాయక్ ఆర్థిక పరిస్థితుల వల్ల పాఠశాల విద్యను కొనసాగించలేకపోయాడు. తండ్రికి సంపాదన లేదు, తల్లి బ్రతకడానికి చాలా కష్టపడింది. కష్టాలు భరించలేక 17 సంవత్సరాల వయసులోనే ఇంటి నుంచి పారిపోయిన రాజా ముంబై చేరుకున్నాడు. ఫుట్పాత్పై షర్టుల విక్రయం ఉన్నత చదువు లేని కారణంగా ఎలాంటి ఉద్యోగం లభించలేదు. కానీ అతనికి.. అతనిమీద ఉన్న దృఢమైన విశ్వాసంతో ఏదో ఒకటి సాధించాలని సంకల్పించుకున్నాడు. ఉద్యోగం లేకపోవడంతో, డబ్బు కూడా లేకుండా పోయింది. ఆ సమయంలో స్నేహితుడితో కలిసి ఫుట్పాత్పై షర్టులను విక్రయించాడు. జీవితం మీద కసితో పగలు, రాత్రి కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. తన కృషి, అంకితభావం వల్ల ఫుట్పాత్లోని తన చిన్న దుకాణం బాగా నడిచే స్థాయికి చేరింది. వ్యాపార రంగంలో మరిన్ని అడుగులు వేయడానికి కంకణం కట్టుకున్న రాజా నాయక్ అనేక అడ్డంకులను ఎదుర్కొని, ఫుట్పాత్ చొక్కాల వ్యాపారం నుంచి అతను కొల్హాపురి చప్పల్స్ అండ్ ఫుట్వేర్ బిజినెస్ ప్రారంభించాడు. కొత్త వ్యాపారాలు ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు, ఇది కాకుండా బాటిల్ డ్రింకింగ్ వాటర్ వెంచర్ జల బేవరేజెస్ ప్రారంభించాడు. ఇప్పటికి కూడా ఈయన తన వ్యాపారాన్ని పెంచుకోవడంలో నిమగ్నమై ఉన్నాడు. ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు! ప్రస్తుతం ఈయన రూ. 60 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగిన ఈయన సమాజంలోని అణగారిన వర్గాల కోసం విద్యా సంస్థలను నడుపుతున్నాడు. ప్రస్తుతం రాజా నాయక్ కర్ణాటకలోని దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (డిఐసిసిఐ) అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. -
ఎప్పటికి యవ్వనంగా ఉండాలని..వందకిపైగా టాబ్లెట్లు, కొడుకు రక్తం..
యవ్వనంగానే ఉండాలనే అందరూ అనుకుంటారు. కానీ అది కుదరుదు. కాలానుగుణంగా వయసు రీత్య వచ్చే మార్పులను యథాతథాంగా ఆమోదించాల్సిందే. దేనికైనా కొంత వరకే అవకాశం. ఆ తర్వాత కనుమరుగు కాక తప్పదు. ఇది ప్రకృతి నియమం కూడా. దీనికి విరుద్ధంగా చేయాలనుకున్న పనులు ఇంతవరకు వికటించాయే గానీ సఫలం కాలేదు. కానీ ఇక్కడొక మిలీనియర్ దాన్ని సఫలం చేసి తిరగ రాయలనుకుంటున్నాడు. ఎప్పటకీ యవుకుడిలా మంచి దేమధారుఢ్యంతో ఉండాలని అతడు చేస్తున్న పనులు వింటే షాక్ అవుతారు. మల మూత్ర విసర్జనలు సైతం.. వివరాల్లోకెళ్తే..యూఎస్కి చెందిన టెక్ మిలీనియర్ బ్రయాన్స్ జాన్సన్కి ఓ వింత కోరిక పుట్టింది. ఎప్పటికీ నవయవ్వనంగా ఉండాలనే ఆలోచన వచ్చింది. అందుకోసం యాంటీ ఏజింగ్ అనే ప్రక్రియకు తెరతీశాడు. అందులో భాగంగా అతడు రోజుకు దాదాపు వందకు పైగా అంటే.. దగ్గర దగ్గర 111 మాత్రలు హాంఫట్ చేస్తాడట. ఇక దీని వల్ల తన శరీరంలో ఉత్ఫన్నమయ్యే మార్పులను పర్యవేక్షించేలా ఆర్యోగ్య పర్యవేక్షణకు సంబందించిన అత్యాధునిక పరికరాలతో నిరంతరం పర్యవేక్షిస్తాడు. అవి ఏకంగా అతడి మల మూత్ర విసర్జనలను సైతం పరిక్షించి శరీరంలో వచ్చే మార్పులను పసిగట్టి చెబుతుందట. అలాగే ప్రతి రోజు బేస్ బాల్ టోపీని ధరిస్తాడు. అది అతడి నెత్తిపై వృధ్యాప్య లక్షణాలు కనిపించే తెల్ల జుట్టును డిటెక్ట్ చేసి దాన్ని రిపేర్చేస్తుందట. ప్రస్తుతం జాన్సన్ వయసు 46 ఏళ్లు. అయితే అతడు తన అవయవాలన్నీ 18 ఏళ్ల యువకుడి మాదిరిగే మారేలా చేయడం అతని ఆశయం, ఆశ కూడా. నిజానికి జాన్సన్ తన ప్రాసెసింగ్ కంపెనీ బ్రెయిన్ ట్రీ సొల్యూషన్స్ను ప్రముఖ దిగ్గజ ఈబే కంపెనీకి రూ. 6 వేల కోట్లకి విక్రయించడంతో.. జాన్సన్ దిశ తిరగబడిందనే చెప్పాలి. ఇక అక్కడ నుంచి పలు వ్యాపారాలతో మిలీనియర్గా మారాడు. జాన్సన్(ఎడమ వైపు), తన కొడుకుతో దిగిన ఫైల్ ఫోటో యాక్సిడెంట్ కాకూడదని.. ఇక జాన్సన్కి సడెన్గా ఇలా యువ్వనంగా మారాలనే వింత కోరిక ఎలా పుట్టిందో గానీ అందుకోసం అతడు తన జీవనశైలిలో ఎన్ని మార్పులు చేశాడంటే..ఒకప్పుడూ లాస్ఏంజిల్స్ వీధుల్లో గంటకు 16 మైళ్ల వేగంలో ఆడి కారులో రయ్యి.. రయ్యి.. మని వెళ్లే ఆ వ్యక్తి కాస్త..ఇప్పుడూ తానే స్వయంగా నెమ్మదిగా డ్రైవ్ చేసుకుంటు వెళ్తున్నాడు. పైగా ఎక్కడకైనా బయలుదేరే ముందు డ్రైవింగ్ మంత్రాన్ని జపిస్తాడట. ఇది ఎందుకంటే?.. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇంతలా యవ్వనంగా మారాలని కోట్లు కోట్లు ఖర్చు చేస్తున్న డబ్బు, అతడి కష్టం వృధా అయిపోతాయి కదా!అందుకని. ప్రాజెక్ట్ బ్లూప్రింట్తో.. మనోడు అక్కడితో ఆగలేదు యవ్వనంగా ఉండాలని ఏకంగా తన కొడుకు రక్తాన్ని ఎక్కించుకుంటున్నాడట. రోజు దాదాపు 30 మంది వైద్యుల బృందం ఎమ్మారై వంటి స్కానింగ్లు నిర్వహించి.. శరీరంలో ఎక్కడ కొలస్టాల్ పెరుగుతుందో చెక్ చేస్తారు. వృద్ధాప్య ఛాయలు వచ్చేలా జరగుతున్న మార్పులను గమనిస్తుంటారు. అందుకు తగ్గ ట్రీట్మెంట్ వెంటనే అందిస్తారట జాన్సన్కి. పైగా ఆ వైద్య బృందం బ్లూప్రింట్ అనే ప్రాజెక్ట్తో జాన్సన్ని తిరిగి యవ్వనంగా అయ్యేలా అతడి ఏజ్ని వెనక్కు తీసుకొచ్చే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేగాదు జాన్సన్ కొల్లాజెన్,స్పెర్మిడిన్, క్రియేటిన్ వంటి పోషకాలతో నిండిన "గ్రీన్ జెయింట్" స్మూతీతో రోజును ప్రారంభిస్తాడట. ఇక జాన్సన్ ఇలా యవ్వనంగా మారేందుకు ఏడాదికి సుమారు రూ. 16 కోట్లు దాక ఖర్చు పెడుతున్నాడు. నిజం చెప్పాలంటే.. మన జాన్సన్ అత్యంత ఖరీదైన వ్యక్తి అనాలి. అతడు చెప్పిన ప్రకారం యవ్వనంగా మారాలని చేస్తున్న ఖర్చును కనుగా టాలీ చేస్తే అతడి విలువ ఏకంగా మూడు వేలు కోట్లు. వామ్మో!..ఏందిరా నీకు ఈ పిచ్చి కోరిక అనిపిస్తుంది కదా!. ఈ మహానుభావుడు పెట్టే ఖర్చు ఒక దేశం అభివృద్ధి లేదా ఓ రెండు పట్టణాలు అదీ కాదంటే..కనీసంచాలా అట్టడుగు కుగ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తే బాగుపడతాయి. ఎందరో నిరుపేదల కష్టాలు తీరతాయని అనిపిస్తుంది కదా!. (చదవండి: ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా !..వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
వజ్రాల వ్యాపారం.. వందల కోట్ల సంపద- సన్యాసుల్లో కలిసిపోయారు!
అందరూ కస్టపడి సంపాదించి జీవితంలో కుబేరులు కావాలని, విలాసవంతమైన జీవితం గడపాలని కలలు కంటూ ఉంటారు. అయితే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక ఫ్యామిలీ మాత్రం కోట్ల సంపదను వదిలి సన్యాసుల్లో కలిసిపోయారు. ఇంతకీ వారెవరు? ఎందుకిలా చేశారు? వారి సంపాదన ఎలా ఉండేదనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. కొంతమంది ఆస్తులు లేకున్నా జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. మరి కొంతమంది ఎన్ని ఆస్తులున్నా మనశ్శాంతి లేకుండా జీవిస్తుంటారు. గుజరాత్ రాష్ట్రంలో ధనవంతులైన ఒక వజ్రాల వ్యాపారి, అతని భార్య కోట్ల సంపదను.. విలాసవంతమైన జీవితాన్ని వదులుకున్నారు. ఈ వజ్రాల వ్యాపారి కుమార్తె ఇప్పటికే తన తొమ్మిదవ ఏటనే సన్యాస దీక్షను తీసుకుంది. ఇదీ చదవండి: వాట్సాప్లో మరో అదిరిపోయే ఫీచర్ - అదేంటో తెలుసా? ఇప్పుడు ఆమె తల్లి తండ్రులు కూడా సన్యాసులుగా మారారు. సంవత్సరానికి రూ. 15 కోట్ల కంటే ఎక్కువ సంపాదించే ఫ్యామిలీ అన్ని వదిలి సన్యాసిగా మారడంతో ఎంతోమంది ఆశ్చర్యానికి గురవుతున్నారు. షా కుమారుడు భాగ్యరత్న అతని దీక్షా వేడుకకు ఫెరారీలో, అతని తల్లిదండ్రులు దీపేష్ & పికా అదే జాగ్వార్లో ప్రయాణించారు. తమ కుమార్తె ఇప్పటికే సన్యాసంలో కలిసిపోవడం వల్ల వీరు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. సన్యాసంలో చేరకముందే వారు అలాంటి జీవితం గడపాలని నిర్ణయించుకుని దీపేష్ షా 350 కిమీ, అతని భార్య పికా షా 500 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలుస్తోంది. మా కుమార్తె సన్యాసంలో స్వీకరించినప్పుడే ఆమె బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్లు దీపేష్ షా వెల్లడించారు. జీవితంలో ఎన్నెన్నో విజయాలను చూసాను, కానీ అంతిమంగా శాంతి, ఆనందం కోసం ఈ దీక్ష స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: రూ. 200 కోట్లు కంటే ఎక్కువ ఖరీదైన కారు! ఎందుకింత రేటు? దీపేష్ షా తండ్రి ప్రవీణ్ బెల్లం, చెక్కర వ్యాపారం చేసేవాడు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం వజ్రాల వ్యాపారం చేస్తూ బాగా సంపాదిస్తోంది. అయినప్పటికీ భౌతిక సుఖాలు, విలాసాలు శాశ్వతం కాదని ఇప్పుడు జైన మతంలో సన్యాసులుగా చేరి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. -
పెళ్లికాని శ్రీమంతుడు.. రెడీ టూ మింగిల్ అంటున్నా పట్టించుకోని అమ్మాయిలు
అతనో బిలియనీర్.. అమెరికాలోని సంపనుల్లో అతడొకడు. పేరు బ్రియాన్ జాన్సన్. కండలు తిరిగిన దేహంతో చూడటానికి కూడా చాలా అందంగానే ఉంటాడు. పైగా ఆల్కహాల్ కూడా ముట్టుకోడు పక్కా హెల్తీ డైట్ను ఫాలో అవుతాడు. అయినా అతనికి ఇప్పటివరకు పెళ్లి కాలేదు. జీవితంలో ఓ తోడు కోసం బ్రియాన్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు. కానీ ఏం చేస్తాం.. ఇప్పటికీ పెళ్లికాని కోటీశ్వరుడిగానే మిగిలిపోయాడు.ఇన్ని మంచి అలవాట్లు ఉన్న జాన్సన్ ఇంకా సింగిల్గానే ఉన్నాడు. చాలా సార్లు డేటింగ్కు పిలిచినా అమ్మాయిలు నో చెప్పి పారిపోతున్నారట. ఇంతకీ ఈ బిలియనీర్ పెళ్లి కహానీ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. బ్రియాన్ జాన్సన్.. అమెరికాలోని శ్రీమంతుల్లో ఒకడు. అందంగా ఉంటాడు, మద్యం కూడా తాగడు. కాలిఫోర్నియాకు చెందిన ఈ బిజినెస్మ్యాన్ వందల కోట్లకు అధిపతి. వయసు 45. పెళ్లీడు ఎప్పుడో వచ్చి వెళ్లిపోయింది కూడా. కానీ జాన్సన్కు ఇంకా పెళ్లి కాలేదు. భాగస్వామి కోసం అతను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడట. వందల కోట్లున్నా తన జీవితంలో ఇంకా అమ్మాయి లేదని తెగ ఫీల్ అవుతున్నాడు. వయసు మీద పడుతున్నా యంగ్గా కనిపించేందుకు బ్రియాన్ జాన్సన్ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కూడా. దీనికోసం ఏడాదికి ఏకంగా రూ.16కోట్లు ఖర్చు చేస్తున్నాడు. అయినా నో యూజ్.. అమ్మాయిలు ఇతను చెప్పే కండిషన్స్ విని దూరంగా పారిపోతున్నారు. ఇటీవల ఓ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో జాన్సన్.. పెళ్లికోసం తను పడుతున్న ఇబ్బందులను వివరించాడు. కోట్లున్నా తనకింకా పెళ్లి కాలేదని, భాగస్వామి దొరకడం కష్టమైపోయిందని ఆవేదన చెందాడు. అతను ఏమన్నాడంటే.. ''నేను రాత్రి 8.30 గంటలకే నిద్రపోతాను. ఉదయం 6గంటల నుంచి 11గంటలలోపు కేవలం 2250 కెలోరీలనిచ్చే ఆహార పదార్థాలనే తీసుకుంటాను. రోజుకు ఐదు గంటలు ఏకాగ్రత, మంచి లైఫ్స్టైల్ కోసమే కేటాయిస్తాను. పక్కా న్యూటిషియన్లు చెప్పిన డైట్నే ఫాలో అవుతాను. దీంతో పాటు ముడుచుకొని పడుకోవడం నాకు అలవాటు. ఇదే విషయాల గురించి అమ్మాయిలతో ప్రస్తావిస్తే వాళ్లు షాకవుతున్నారు.మొదట డేట్కు వస్తామని చెప్పిన వాళ్లు నా కండిషన్స్ లిస్ట్ చూసి నో చెబుతున్నారు.అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతకుముందు మద్యం తాగే అలవాటు కూడా ఉండేది. కానీ దానివల్ల అదనపు క్యాలరీలు వచ్చి బరువు పెరుగుతానని దీనికి కూడా దూరంగా ఉంటున్నా. అందం కోసం రోజుకు 111 ట్యాబ్లెట్స్ వేసుకుంటా. ఇన్ని చేస్తున్నా నాకింకా పెళ్లి కాలేదు'' అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు జాన్సన్. -
ఏడాదికి రూ.16 కోట్లు, నో గర్ల్ ఫ్రెండ్, నో సెక్స్: టెక్ మిలియనీర్ సీక్రెట్
Slow Down the Ageing Process: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనే లక్ష్యంతో ఒక్కో అవయవాన్ని యవ్వనత్వంతో నింపుకుంటున్న బ్రయాన్ జాన్సన్ తాజాగా తన సక్సెస్ సీక్రెట్ను పంచుకున్నాడు. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసే ప్రయత్నంలో ప్రతీరోజూ కఠినమైన వ్యాయామంతోపాటు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నట్టు కాలిఫోర్నియాకు చెందిన ఐటీ డెవలపర్ బ్రయాన్ జాన్సన్ తెలిపాడు. ప్రస్తుతం తనకు 18 ఏళ్ల యువకుడికి ఉండే ఊపిరి తిత్తులు, 37 ఏళ్లవయసునాటి గుండె ఉన్నాయని జాన్సన్ మరోసారి గుర్తు చేశాడు. (గోల్డ్ హిస్టరీ: అతిపెద్ద పతనం తులం ధర రూ.63.25 లే!) యవ్వనంగా ఉండాలనే తపనతో చేసే వ్యాయామం మాత్రమే సరిపోవడంలేదని ఇందుకోసం ఏడాదికి ఏకంగా సుమారు 16.4 కోట్లు(2 మిలియన్ల డాలర్లు) ఖర్చు చేస్తున్నట్టు తెలిపాడు. అయినా చెప్పుకోదగ్గ ప్రయోజనం లేదు. అందుకే మరింత యవ్వనంగా ఉండేందుకు రోజూ 110 మాత్రలు వేసుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే ఎప్పుడూ ఒకే సమయంలో నిద్రపోతా. ఉదయం 11 గంటల తర్వాత ఏమీ తినను.. నో సెక్స్.. కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అంటూ ఆశ్చర్యకరమైన విషయాలను తెలిపాడు. ఉదయం 3 ఔన్సుల వైన్ తీసుకోవడం ప్రయోజనకరమని స్పష్టం చేశాడు. ఆహారంలో భాగంగా 100కి పైగా మాత్రలు తీసుకుంటా.. అదీ అశ్వగంధ, పసుపు, వెల్లుల్లి, అకార్బోస్ లాంటి ఆయుర్వేద మందులు మాత్రమే. దీంతో పాటు హార్మోన్లు, ఇతర పదార్ధాల సమ్మిళితమైన గ్లూకోసమైన్ సల్ఫేట్ తీసుకుంటానని, ఇవే సుదీర్ఘ జీవితానికి రహస్యమని పేర్కొన్నాడు. అత్యంత రెజిమెంటెడ్ షెడ్యూల్, కఠిన ఆహార నియమాలు వ్యాయామంతో పాటుగా నెలవారీ ప్రాతిపదికన అనేక రకాల వైద్య ఆపరేషన్లు తప్పవని వెల్లడించాడు. 30 నిమిషాల పాటు వ్యాయామం అదీ కూడా 30 మంది వైద్యుల సిబ్బంది పర్యవేక్షణలో 20,000 సిట్-అప్లకు సమానమైన ఎక్స్ర్సైజ్ చేస్తాడట. ఇందుకోసం ప్రత్యేకమైన పరికరాలను కూడా ఏర్పాటు చేసుకున్నానన్నాడు. (IT refund scam: తెలుసుకోండి: లేదంటే కొంప కొల్లేరే!) రోజూ 7 రకాల క్రీములు జాన్సన్ ప్రతిరోజూ ఏడు వేర్వేరు క్రీములు వాడతాడు. ఇందులో విటమిన్లు సి, ఇ , బి3, ఫెరులిక్ యాసిడ్ , అజెలైక్ యాసిడ్ లాంటి ఉన్నాయి. 0.1 శాతం ట్రెటినోయిన్ టాపికర్ క్రీమ్, ప్రతి ఉదయం SPF 30, బాడీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ పడుకునే ముందు సెరావ్ నైట్ క్రీమ్ పూసుకుంటాడు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఫేస్ ఇంజెక్షన్లు స్కిన్ కేర్ కోసం వీక్లీ యాసిడ్ పీల్స్, లేజర్ థెరపీ, మైక్రోనీడ్లింగ్ అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఫేస్కి ఫ్యాట్ ఇంజెక్షన్ (దీనిక తేనెటీగ కుట్టినంత భయంకరంగా ఉబ్బిపోతుందట) మైక్రోబోటాక్స్ ఇంజెక్షన్లు, కొల్లాజెన్ ఉత్పత్తి కోసం పలు ఇంజెక్షన్లతో సహా వివిధ చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకుంటాడు. 10 ఏళ్ల వయసులో ఉండే నున్నని మెరుపు, 14 ఏళ్ల వయస్సులో ఉండే మెరిసే చర్మం వచ్చిందట. దీన్ని కొనసాగించడం కష్టంగాను, చాలా పెయిన్పుల్గా అనిపించినప్పటికీ "ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ తన వయస్సును1.01 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు. పరిగెత్తుతున్న వృద్ధాప్యమనే రైలుకు బ్రేక్లు వేయాలంటే సామాన్యమైన విషయంకాదు, కఠోర శ్రమ అంతకు మించిన డబ్బు కూడా ఉండాలంటాడు. -
రూ.కోటికి పైగా వచ్చింది..రూ.లక్షకు పైగా పోయింది
రంగల్/ కౌడిపల్లి: టమాటాకు ఎంత క్రేజీ ఉందో, ఒక్కోసారి అమ్మకాల్లేక, వర్షాలతో అంత డ్యామేజీకి గురవుతోంది. ఒకరింట సిరులు కురిపించగా, మరికొందరికి దిగులు మిగిల్చింది. మెదక్ జిల్లాలో ఓ రైతు టమాట పంట ద్వారా రూ.కోటి 20 లక్షలు సంపాదించగా, వరంగల్ లక్ష్మీపురం మార్కెట్లో టమాటాలు కుళ్లిపోవడంతో కొంతమంది వ్యాపారులు ట్రాక్టర్ లోడ్ మేర పారబోశారు. వరంగల్ లక్ష్మీపురం మార్కెట్కు రోజుకు 1,500–2,000 బాక్సుల టమాటా వస్తోంది. బాక్సు టమాటాను రూ.1,800– 2,500 హోల్సేల్గా, రిటైల్ మార్కెట్లో కిలో రూ.80 నుంచి రూ.120 చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో ఎత్తు టమాటా(2.5 కిలోలు) రూ.30–50 విక్రయించగా, కొద్దిరోజులుగా రూ.200–300 చొప్పున అమ్ముతుండటంతో వినియోగదారులెవరూ టమాటా వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో శుక్రవారం రూ.లక్షకు పైగా విలువైన టమాటాలను చెత్త ట్రాక్టర్లో తీసుకొచ్చి బయట పారబోసినట్లు వ్యాపారులు తెలిపారు. ఇటు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్నగర్కు చెందిన మహిపాల్రెడ్డి ఎనిమిదెకరాలలో టమాటా, నాలుగు ఎకరాలలో క్యాప్సికం సాగు చేస్తున్నారు. టమాటా ధర భారీగా పలకడంతో ఇప్పటికే రూ.కోటీ 20 లక్షలు సంపాదించారు. ఇంకా నలభై శాతం పంట పొలంలోనే ఉంది. నెల రోజులుగా రోజుకు రెండు వందల ట్రేల టమాటా దిగుబడి వస్తోంది. ట్రే టమాటా రూ.1,000 నుంచి రూ 3 వేలు ధర పలుకుతోంది. పంటసాగుకు ఎకరాకు రూ.2 లక్షల చొప్పన రూ.16 లక్షలు ఖర్చు అయినట్లు మహిపాల్రెడ్డి చెప్పారు. ‘ఛత్తీస్గఢ్ నుంచి మొక్కలు తెచ్చి నాటడంతోపాటు ఎండను తట్టుకునేలా షెడ్ వేశా. మల్చింగ్ డ్రిప్ పద్ధతిలో సాగు చేశా. దీంతో మంచి లాభాలు వచ్చాయి’అని అన్నారు. -
ఎంత మిలియనీర్ అయినా.. ఇండియాలో ఇలాగే ఉంటది!
భారతదేశంలో చాలామంది ధనవంతులు ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల జాబితాలో రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ వంటి బ్రాండ్ కార్లు మాత్రమే కాకుండా 'మెక్లారెన్' (McLaren) వంటి కార్లు కూడా ఉన్నాయి. అయితే మన దేశంలో ఏదైనా వాహనం కొని దానిని ఉపయోగించే ముందు పూజ చేయడం ఆనవాయితీ.. ఇదే పద్దతిని ఒక మిలియనీర్ కూడా పాటించాడు. కోట్ల సంపద కలిగిన వ్యక్తి తన కారుకి పూజ చేయడానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నివేదికల ప్రకారం, ముంబై నగరానికి చెందిన ఒక వ్యాపారవేత్త ఇటీవల సరికొత్త 'మెక్లారెన్ 720ఎస్' (McLaren 720S) డెలివరీ చేసుకున్నాడు. డెలివరీ తీసుకున్న తరువాత సమీపంలో ఉండే ఒక గుడి వద్ద పూజ కూడా చేయించాడు. పూజాదికార్యక్రమాలు ముగిసిన తరువాత ముంబైలోని పబ్లిక్ రోడ్లపై చక్కర్లు కొడుతూ కనిపించింది. ఈ కారుని చూసిన వారిలో చాలా మంది జనం దానితో సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడ్డారు. (ఇదీ చదవండి: కోకాకోలా క్యాన్సర్ కారకమా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే!) మెక్లారెన్ 720ఎస్: మెక్లారెన్ 720ఎస్ సూపర్ కారు విషయానికి వస్తే, ఇవి భారతీయ మార్కెట్ కోసం 400 యూనిట్లను మాత్రమే కేటాయించారు. ఇది శక్తివంతమైన 4.0 లీటర్ వి8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి 710 Bhp పవర్ 770 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 341 కి.మీ కావడం విశేషం. దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 5 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. (ఇదీ చదవండి: దంపతులిద్దరికీ అదే సమస్య.. వారికొచ్చిన ఐడియా ధనవంతులను చేసిందిలా!) నిజానికి ఖరీదైన మెక్లారెన్ 720ఎస్ స్టాండర్డ్, లగ్జరీ, పర్ఫామెన్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. అయితే ఇవన్నీ చూడటానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ.. పర్ఫామెన్స్ విషయంలో టాప్ ఎండ్ మోడల్ ఓ అడుగు ముందుంటుంది. ఇప్పటికీ ఈ ఖరీదైన కారుని ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ, గౌతమ్ సింఘానియా వంటి వారు కూడా కొనుగోలు చేశారు. కంపెనీ అధికారిక డీలర్షిప్ ముంబైలో ఉంది. అయితే ఈ కార్లు కావాలనుకునే వారు దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. -
చైనా మిలియనీర్ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. 56 ఏళ్ల వయసులో..
Chinese Millionaire: చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే డబ్బు సంపాదించి ధనవంతుడవొచ్చు. ఇది సాధారణ ప్రజల ఫిలాసఫీ. అయితే కొంత మంది ఒక స్థాయికి చేరితే చదువును కూడా మధ్యలో ఆపేస్తారు. కానీ దానికి భిన్నంగా చైనాలో ఒక ధనవంతుడు ఒక పరీక్షను 27 సార్లుగా రాస్తూనే ఉన్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, చైనాకి చెందిన 56 సంవత్సరాల 'లియాంగ్ షి' (Liang Shi) అత్యంత కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి 27 సార్లు రాసినట్లు తెలుస్తోంది. 'గావోకావో' అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ప్రతిష్టాత్మకమైన సిచువాన్ యూనివర్సిటీలో స్థానం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని పరీక్ష రాస్తున్నాడు. అయితే ఈ సారి కూడా అందులో సెలక్ట్ కాలేకపోయాడు. అయినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుని మాదిరిగా లక్ష్యం చేరే వరకు ప్రయత్నం ఆపమని దీక్ష పట్టి కూర్చుకున్నాడు. (ఇదీ చదవండి: కోటి శాలరీ.. ప్రైవేట్ జెట్లో ప్రయాణం.. కుక్కను చూసుకుంటే ఇవన్నీ!) నిజానికి లియాంగ్ చైనాలోని ధనవంతుల జాబితాలో ఒకరు. మిలీనియర్ అయినప్పటికీ ఎలాగైనా ఆ పరీక్షల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఉన్నత విద్యను పొందడం కోసం కష్టతరమైన పరీక్షలో విజయం సాధించాలనే తపనతో, రోజుకు 12 గంటల పాటు చదువుకుంటూ ఎన్నెన్నో త్యాగాలు చేస్తున్నాడు. 27 సార్లు ఒకే పరీక్ష రాస్తూ ఎంపిక కాకపోవడంతో ఎంతో మంది ఎగతాళి చేస్తున్నట్లు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: హోండా సంచలన ప్రకటన.. దెబ్బకు 13 లక్షల కార్లు వెనక్కి - కారణం ఇదే!) గావోకావో (Gaokao) గావోకావో అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష. దీని అసలు పేరు 'నేషనల్ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్' (NCEE). చైనాలో ఈ పరీక్షను గావోకావో అని పిలుస్తారు. ఈ ఎగ్జామ్ను సంవత్సరానికి ఒకేసారి మాత్రమే నిర్వహిస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఇది ఒక అవసరం. -
17కు వ్యాపారం.. 19కి సెటిల్.. 22కు రిటైర్మెంట్.. అమెరికా కుర్రాడి సక్సెస్ స్టోరీ!
ఆ కుర్రాడికి చిన్నప్పటి నుంచే ఎన్నో కలలు. మరెన్నో ఆశలు. అయితే అతని ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో అవేవీ నెరవేరే అవకాశమే లేదు. అయితే పరిస్థితులను అతను ఎలా మార్చుకున్నాడో తెలిస్తే ఎవరైనా సరే ఒకపట్టాన నమ్మలేరు. ఈ కథ 22 ఏళ్ల యువకుడిది. అతను తన విధిరాతను తానే సమూలంగా మార్చుకున్నాడు. చిన్నవయసులోనే కోట్లకు పడగలెత్తాడు. విద్యార్థిగా చదువు పూర్తయ్యే వయసు వచ్చేనాటికల్లా రిటైర్ అయ్యాడు. అమెరికాకు చెందిన హెడెన్ వాల్ష్ స్కూలు చదువును మధ్యలోనే విడిచిపెట్టాడు. ఈ కామర్స్లో తన ప్రతిభ చూపాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఒక ఎంటర్ప్రెన్యూర్గా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు. డెయిలీ మెయిల్ నివేదిక ప్రకారం హెడెన్ తన జీవితానుభవాలను టిక్టాక్, యూట్యూబ్లో షేర్ చేస్తుంటాడు. తాను ఎంత చిన్నవయసులో వ్యాపారం మొదలుపెట్టిందీ, దాని నుంచి ఎలా ఆదాయం సంపాదించినదనే వివరాలు తెలియజేస్తుంటాడు. హెడెన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు 14 వేలకు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ విషయానికొస్తే 3 లక్షలకు మించిన చందాదారులు ఉన్నారు. హెడెన్ను ఇంత చిన్నవయసులోనే ఎందుకు స్కూలు చదువు వదిలేసి, సంపాదన ప్రారంభించారని ప్రశ్నించినప్పుడు ఆయన తనకు ఎదురైన ఒక అనుభవాన్ని, అది తన జీవితాన్ని ఎలా మార్చివేసిందో తెలియజేశారు. బాల్యంలో ఎదురైన అనుభవం నుంచి.. హెడెన్ తన అనుభవాన్ని వివరిస్తూ..‘నాకు బాగా గుర్తుంది.. నాకు 10-11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏది కొనుక్కుందామన్నా నా దగ్గర డబ్బు ఉండేది కాదు. మా అమ్మానాన్న కూడా వాటిని కొనిచ్చేవారు కాదు. అప్పుడే నాకు నా సొంత సంపాదన అవసరమని అనిపించింది. నేను 17 ఏళ్ల వయసులోనే వ్యాపారం ప్రారంభించాను. సంపాదించడం కూడా మొదలుపెట్టాను. ఈ- కామర్స్ రంగంలో సత్తా చాటాను. ఇప్పటికీ అదే పనిచేస్తున్నాను. ఈ పని చేయడం అంటే నాకు ఎంతో సరదా. అయితే నేను టెక్నికల్గా రిటైర్ అయ్యాను. రియల్ ఎస్టేట్ నుంచి అందిన సొమ్ములోని కొంత మొత్తాన్ని వేరుగా ఉంచాను. దీని నుంచి వచ్చే ఆదాయంతో నా ఖర్చులు నెరవేరుతుంటాయి’ అని అన్నారు. 17 ఏళ్ల వయసులో వ్యాపారంలోకి.. సుమారు 17 ఏళ్ల వయసురాగానే హెడెన్ ‘ఈ కామ్ సీజన్’ను స్థాపించారు. దీనిలో ఆన్లైన్ కోర్సు నిర్వహిస్తుంటాడు. ఫీజు 575 డాలర్లు. హెడెన్కు 18 ఏళ్లు వచ్చేసరికి సొంతంగా లంబోర్గినీ(కారు) సమకూర్చుకున్నాడు. 19 ఏళ్ల నాటికి కోటీశ్వరునిగా మారాడు. 2022 నాటికి అతని ఆదాయం 15 మిలియన్ డాలర్లు. దీనిలో 3 మిలియన్ డాలర్లు లాభం ఉంది. తన ఈ- కామర్స్ ప్లాట్ఫారం ద్వారా హెడెన్ లెక్కలేనంతగా సంపాదిస్తున్నాడు. 22 ఏళ్ల వయసులో అతను రియల్ ఎస్టేట్ పోర్టుఫోలియా తీర్చిదిద్దాడు. కోటీశ్వరునిగా మారాలంటే.. మనిషికి అత్యంత అవసరమైన రెండు అంశాల గురించి హెడెన్ తెలియజేశారు. కోటీశ్వరులుగా మారాలనుకుంటున్నవారు.. మీకు వచ్చే సంపాదనలోని 20 శాతం మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేయండి. అప్పుడే మీరు అత్యధిక మొత్తంలో సేవింగ్స్ చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక రెండవది.. జీవితంలోని అన్ని వ్యాపకాల కన్నా సంపాదించడానికే అధిక ప్రాముఖ్యతనివ్వాలని సూచించారు. ఇది కూడా చదవండి: స్కూల్ పిల్లల బ్యాగుల్లో డైపర్లు.. వయసేమో 11..షాకైన టీచర్లు! -
భారత్ నుంచి వలసలు పోతున్న కుబేరులు
భారత దేశంలో ప్రభుత్వం సంపన్నులకు అండగా నిలుస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడుతుంటే వారు మాత్రం ఇక్కడ సరిపడా సంపాదించుకున్నాక మూట ముల్లె సర్దుకుని పరాయి దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఇది కొంత ఆందోళనకరమైన విషయమే అయినప్పటికీ ఈ సంఖ్య గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. కుబేరుల వలసల్లో చైనా ఈ ఏడాది 13,500 వలసలతో అగ్రస్థానంలో ఉండగా భారత దేశం 6,500 మంది కుబేరుల వలసలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. తగ్గారండోయ్.. హెన్లీ వెల్త్ మైగ్రేషన్ నివేదిక ప్రకారం 6,500 మంది అధిక నికర విలువ ఉన్న సంపన్నులు ఈ ఏడాది దేశం విడిచి వెళ్తున్నట్లు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కుబేరుల వలసలు గణనీయంగా తగ్గాయని, గత ఏడాది 7,500 మంది కుబేరులు దేశాన్ని విడిచి వెళ్లగా ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్యలో వెయ్యి మంది తగ్గారని తెలిపింది హెన్లీ వెల్త్ మైగ్రేషన్ సంస్థ. నష్టమే లేదు.. న్యూ వరల్డ్ వెల్త్ పరిశోధనాధికారి ఆండ్రూస్ అమాయిల్స్ మాత్రం ఈ వలసల సంఖ్యలతో పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదని, కొందరు వెళ్లిపోయినా వారికి రెట్టింపు సంఖ్యలో భారత దేశం కుబేరులను పుట్టిస్తూ ఉందని అన్నారు. క్లిష్టమైన నిషేధిత పన్ను చట్టాలు, కఠినమైన విదేశీ చెల్లింపుల నిబంధనలే ప్రధానంగా ఈ వలసలకు కారణాలుగా తెలుస్తోంది. నిజమే మరి... సంపాదన ఉంటే సరిపోతుందా దాన్ని దాచుకోవాలి కదా. చైనానే టాప్.. ఇక కుబేరుల వలసల్లో చైనా దేశం అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత దేశం రెండో స్థానంలో ఉంది. చైనా నుండి ఈ ఏడాది భారీగా 13,500 మంది సంపన్నులు ఆ దేశాన్ని విడిచి వెళ్తున్నట్లు నివేదిక చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కుబేరుల వలసలు గత ఏడాది 1,22,000 గా ఉండగా ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య 1,28,000 కు చేరుకోనున్నట్లు హెన్లీ అండ్ పార్ట్ నర్స్ సీఈవో డాక్టర్ జుర్గ్ స్టీఫెన్ తెలిపారు. ఎక్కడికి పోతున్నారు.. హెన్లీ వెల్త్ మైగ్రేషన్ నివేదిక ప్రకారం ఈ ఏడాది అత్యధికంగా 5200 మంది కుబేరులు ఆస్ట్రేలియా చేరుకోనున్నారు. తర్వాత యూఏఈ 4500 మందిని ఆహ్వనించనుంది. ఇక సింగపూర్ 3200 మందిని అమెరికా 2100 మందిని తమ కుబేరుల జాబితాలో కలుపుకోనున్నాయి. స్విట్జర్లాండ్ , కెనడా, గ్రీస్, ఫ్రాన్స్, పోర్చుగల్, న్యూజిలాండ్ దేశాలు కుబేరులను ఆహ్వానించడంలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇది కూడా చదవండి: లుంగీలు, నైటీలపై తిరగొద్దు.. చూడలేకపోతున్నాం! -
శ్రీమంతుడైన శ్రీవారితో అన్ని సమస్యలేనట..! విచిత్రంగా ఈ అమ్మడి బాధ
శ్రీమంతుడైన భర్తను పొందాలని అమ్మాయిలు అనుకుంటారు. ఎందుకంటే..'ధనం మూలం ఇదం జగత్'. అంటారు కదా! ప్రపంచమంతా డబ్బుతో నడుస్తుంది. డబ్బులుంటే చాలు ఏదైనా చేయొచ్చు. విలాసవంతమైన సౌకర్యాలతో బతకొచ్చు. ఖరీదైన నగలు వేసుకొవచ్చు. విలువైన బట్టలు.. ఇలా ఇతరులు కొనలేని ఎన్నో వస్తువులను ధనవంతుడైన భర్త ఉంటే తెచ్చిపెడతాడు. కానీ ఇదే తనకు సమస్య అవుతుందని అంటోంది ఓ భార్య. శ్రీమంతుడైన భర్తలుంటే ఇదే సమస్య అంటూ.. ఇన్స్టాలో ఓ వీడియో పోస్టు చేసింది. ఇంతకీ ఆవిడ సమస్య ఏంటో మరి..! ఆవిడ పేరు లిండా ఆండ్రాడే. దుబాయ్లో ధనవంతుడైన భర్తతో ఉంటోంది. శ్రీమంతడైన భర్త కాబట్టి విలువైనవి కొనిస్తున్నాడట. వాటిని జాగ్రత్తగా ఉంచుకోవడం ఇబ్బందవుతోందట. అవన్నీ దాచుకోవడం కష్టమవుతోందట ఈ అమ్మడుకు. వాటిని ఎప్పుడు, ఎవరు దోచుకెళ్తారో అని భయం పట్టుకుంటోందని వీడియోలో పేర్కొంది. ధనవంతడైన భర్తలున్నా ఎన్నో కష్టాలున్నాయని చెబుతూ ఆ వీడియో క్లిప్ను ఇన్స్టాలో పోస్టు చేసింది. నెట్టింట ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. వ్యూయర్స్ విభిన్న స్పందనలతో కామెంట్స్ బాక్స్ నిండిపోయింది. పోస్టు చేసిన 'నీకు అన్ని కష్టాలున్నాయా?. మనం మన జీవితాలను రీప్లేస్ చేసుకుందామా?' అంటూ ఓ వ్యూయర్ కామెంట్ పెట్టాడు. ఈవిడ నిజంగానే సమస్యలతో ఉందా..? ఇది జోకా?, 'మా తల్లే.. నిజంగా ఖరీదైన వస్తువులను ఎప్పుడైనా వాడావా?. ఇదే మొదటిసారా?', ధనవంతులైన భర్తలు తొందరగా బోర్ కొట్టేస్తారేమో అంటూ మరికొందరు స్పందించారు. ఆ మహిళకు కొందరు వ్యూయర్స్ సపోర్టు కూడా చేశారు. ఆమె వ్యక్తిగత జీవితంపై మనం కామెంట్ చేయకూడదు అని కామెంట్ పెట్టారు. రూ.4.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post shared by Linda Andrade (@lionlindaa) ఇదీ చదవండి:ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. ప్రాణాలు తీసిన ఆన్లైన్ గేమ్.. ఎంత తాగాడో తెలుసా? -
ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులు ఏ నగరంలో ఉన్నారో తెలుసా?
కుబేరులు అనగానే మన దృష్టి వారి సంపదవైపే వెళుతుంది. ఆసక్తి ఉంటే వారి కంపెనీలు.. వాళ్లు ఏం చదువుకుకున్నారు. రోజుకి ఎంత ఆర్జిస్తున్నారు?వంటి వివరాలను తెలుసుకుంటాం. కానీ, వాళ్లు ఎక్కుడ? ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారా? ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులు ఎంత మంది ఉన్నారో గుర్తించే హెన్లీ అండ్ పార్ట్నర్ సంస్థ ‘మోస్ట్ మిలియనీర్ ఇన్ 2023’పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్లో అమెరికా న్యూయార్క్ సిటీలోనే ప్రపంచంలో ఎక్కువ మంది ధనవంతులు ఉన్నట్లు తెలిపింది. దీంతో న్యూయార్క్ నగరం మరోసారి అత్యధిక ధనవంతులు జాబితాలో మరోసారి స్థానం దక్కించుకుంది. ఈ నగరంలో 3,40,000 మంది మిలియనీర్లు ఉండగా.. తర్వాత టోక్యోలో 290,300 మంది, శాన్ ఫ్రాన్సిస్కో 285,000మంది ఉన్నారు. ఈ నివేదిక ప్రపంచంలో ఎక్కువ సంపద కలిగిన ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సీఐఎస్(Commonwealth of Independent States), తూర్పు ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్, నార్త్ అమెరికా, దక్షిణాసియా , ఆగ్నేయాసియాలలో మొత్తం 97 నగరాల్లో ఈ డేటాను సేకరించింది. వాటి ఆధారంగా ఏ ప్రాంతంలో ఎంతమంది మిలియనీర్లు ఉన్నారో నిర్ధారించింది. ఇక న్యూయార్క్, ది బే ఏరియా, లాస్ ఏంజిల్స్,చికాగో నగరాలు అమెరికాలో మిలియనీర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల విభాగంలో ఆధిపత్యం చెలాయించాయి. చైనాకు చెందిన రెండు నగరాలు బీజింగ్, షాంఘైలు సైతం అదే జాబితాలో ఉన్నాయి. రెసిడెంట్ హైనెట్వర్త్ జాబితాలో(HNWI) 258,000 మందితో లండన్ ఈ సంవత్సరం నాల్గవ స్థానానికి పడిపోయింది, 240,100 మందితో సింగపూర్ తర్వాతి స్థానంలో ఉంది. 2000లో లండన్ లక్షాధికారులలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది, కానీ గత 20 ఏళ్లలో ఇది జాబితా నుండి పడిపోయింది. ది బిగ్ యాపిల్గా పేరు గడించిన న్యూయార్క్ నగరంలో 3,40,000 మంది మిలియనీర్లు, 724 సెంటీ-మిలియనీర్లు, 58 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక బ్రాంక్స్, బ్రూక్లిన్, మాన్హట్టన్, క్వీన్స్, స్టాటెన్ ఐలాండ్లు, మాన్హాటన్లోని 5వ అవెన్యూతో సహా ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన నివాసాలున్న కాలనీలుగా గుర్తింపు పొందాయి. ఇక్కడ ప్రధాన అపార్ట్మెంట్ ధరలు చదరపు మీటరుకు 27వేల డాలర్ల కంటే ఎక్కువగా ఉండవచ్చు’ అని హెన్లీ అండ్ పార్ట్నర్ నివేదిక హైలెట్ చేసింది. చదవండి👉 అవధుల్లేని అభిమానం అంటే ఇదేనేమో..టిమ్ కుక్కు ఇంతకన్నా ఏం కావాలి! -
బార్బర్ షాపులో పనిచేసి, ఎన్ని వేల కోట్ల ఖరీదైన కార్లు కొన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు
-
పాత సామాన్లు, చెత్త అమ్ముతున్న మోడల్.. లక్షల్లో సంపాదన
సెలబ్రెటీలు వాడిన వస్తువులకు మార్కెట్లో ధరలు భారీగా ఉంటాయని అందరికి తెలుసు. అయితే వాచ్లు, షర్ట్స్, బైక్స్ వంటి వస్తువులకు అభిమానులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసి కొనేస్తూ ఉంటారు. అయితే దీనికి భిన్నంగా అమెరికాకు చెందిన ఒక మోడల్ గోర్ల క్లిప్పింగ్స్, పాదాల చర్మం, డాండ్రఫ్ వంటివి అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తోంది. అమెరికా నార్త్ కరోలినాలో చెందిన 'రెబెక్కా బ్లూ' గతంలో ఎగ్జోటిక్ డ్యాన్సర్గా చేసి ప్రస్తుతం వెబ్క్యామ్ మోడల్, ఇన్ఫ్లూయెన్సర్గా ఉంటోంది. అయితే ఈమె తన వస్తువులను ఆన్లైన్లో విక్రయిస్తూ కావాల్సినంత డబ్బు సంపాదిస్తోంది. మొదట్లో తన స్ట్రిప్పింగ్ అవుట్ఫిట్స్ను ఒక వ్యక్తికి 20 డాలర్లకు విక్రయించింది. ఈ విధంగా ప్రారంభమైన తన వ్యాపారం ఇప్పుడు పరుగులు పెడుతోంది. తన వద్ద ఉన్న వస్తువులకు డిమాండ్ భారీగా ఉండటం గ్రహించి బిజినెస్ ప్రారంభించి 28 ఏళ్లకే బిలినియర్ అయిపోయింది. మొదట సాక్స్ వంటి వాటిని విక్రయించడం మొదలు పెట్టి ఇప్పడు ఉమ్మి, కాలి గోర్లు, పాదాల నుంచి కత్తిరించిన చర్మం, తన ఇంట్లోని చెత్త, కాటన్ స్వాబ్స్, ఇతర చిత్రవిచిత్రమైన వస్తువుల్ని కూడా అమ్మి డబ్బు సంపాదిస్తోంది.. నిజానికి ఇలాంటి వస్తువులను అమ్మిన సెలబ్రిటీలు ఇంతకు ముందు చాలానే ఉన్నారు. అమెరికాకు చెందిన మాజీ రియాల్టీ టీవీ స్టార్ స్టెఫానీ మాటో గతంలో అపాన వాయువును బాటిళ్లలో నింపి విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాపారం ఆమెకు బాగా కలిసి వచ్చింది. దాంతో పెద్ద ఎత్తున డబ్బు సంపాదించింది. ప్రస్తుతం రెబెక్కా బ్లూ ఇలాంటి చిన్న చిన్న పనికిరానివన్నీ విక్రయిస్తూ నెలకు 2000 డాలర్లు సంపాదిస్తోంది. అంటే ఇది భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.60 లక్షలకుపైనే ఉంటుంది. ఇలాంటి ఘటనలు మనదేశంలో చాలా తక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ అమెరికా వంటి దేశాల్లో అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.. సీన్ కట్ చేస్తే జైల్లో ఉన్నాడు
ఒక వ్యక్తికి ప్రమాదవశాత్తు ఏటీఎం నుంచి ఊహించని విధంగా కుప్పులు కుప్పలుగా డబ్బు వచ్చింది. అంతే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ నడిమంత్రపు సిరి ఉద్యోగాన్ని, ప్రియురాలిని కోల్పోయేలా చేసింది. చివరికి అతన్ని కటకటాలపాలయ్యేలా చేసింది. వివరాల్లోకెళ్తే... ఆస్రేలియాలోని ఒక బార్లో పనిచేసే సర్వర్ డాన్ సాండర్స్కి ఊహించని విధంగా ఏటీఎం నుంచి కట్టకట్టలు డబ్బు లభించింది. దీంతో అతను రాత్రికి రాత్రే మిలినియర్గా మారిపోయాడు. అతను ఒక రోజు రాత్రి బాగా మద్యం సేవించి ఆస్ట్రేలియాలోని వాంగారట్టాలో ఏటీఎం వద్దకు వెళ్లాడు. అప్పుడే అతను ఊహించని విధంగా ఏటీఎం నుంచి సుమారు రూ 13 కోట్ల నగదును పొందాడు. అసలేం జరిగిందటే.. అతను ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్న ప్రతిసారి సారీ ట్రై ఎగైన్ అని రావడం పెద్ద మొత్తంలో డబ్బులు మాత్రం ఏటీఎం నుంచి వచ్చేస్తుండేవి. ఇలా అతను మూడుసార్లు చేయగా...మూడుసార్లు పెద్దమొత్తంలో డబ్బు వచ్చింది. కానీ ఏటీఎం మెషిన్ మాత్రం లావాదేవీలు జరుపుతున్నంత సేపు ట్రాన్స్యాక్షన్ క్యాన్సిల్డ్ అని రావడం డబ్బులు మాత్రం వచ్చేయడం జరుగింది. ఐతే తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు కూడా రావడం లేదు. దీంతో సర్వర్ సాండర్స్కి దెబ్బకి తాగిన మత్తంతా దిగిపోయింది. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక ఆ రాత్రికి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు బ్యాంకుకు ఫోన్చేసి సంప్రదిస్తే ఎలాంటి అవాంఛనీయమైన నగదు బదిలీలు జరగలేదని చెబుతారు. అసలు ఏమైంది ఎందుకు ఇలా జరిగిందని సర్వర్ సాండర్స్ వాకాబు చేస్తే ఆ రోజు రాత్రి తెల్లవారుజామున 1 గంట నుంచి 3 గంటలకు బ్యాంక్ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయ్యిందని గ్రహించాడు. అదీగాక తాను ఆరోజు ఏటీఎంలో సేవింగ్ అకౌంట్లోని కొంత సొమ్మును క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నసమయంలోనే ఇంత పెద్ద మొత్తంలో దాదాపు రూ 13 కోట్ల నగదు బయటకు వచ్చిందని కనుగొన్నాడు. దీంతో ఊహించని విధంగా వచ్చిపడ్డ డబ్బుతో విచ్చల విడిగా జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేశాడు. స్నేహితులు యూనివర్సిటీలు ఫీజులు కట్టడం, ఉన్నత చదువులకు స్నేహితులను ఫారెన్ పంపించే పనులు వంటి సాయాలు కూడా చేశాడు. అతని మితిమీరిన జల్సాల కారణంగా బార్లో ఉద్యోగాన్ని, గర్లఫ్రెండ్ని పోగొట్టుకున్నాడు. అంతేకాదు ఆ డబ్బును మొత్తం ఐదునెలలో ఖర్చు పెట్టేశాడు. ఇదిలా ఉండగా బ్యాంకు అధికారులకు ఏటీఎంలో ఫ్రాడ్ జరిగిందని ఎవరో వ్యక్తి అధిక మొత్తంలో డబ్బును పొందినట్లు గుర్తిస్తారు. తర్వాత పోలీసులు ఇలా అక్రమంగా అధిక మొత్తంలో డబ్బుని పొందింది సర్వర్ సాండర్స్గా గర్తించి అరెస్టు చేశారు. పోలీసులు నిందితుడు సాండర్స్ పై 111 అభియోగాలతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన 2011లో జరిగింది. అతను సుమారు ఐదేళ్లు జైలు శిక్షను కూడా అనుభవించాడు. అతను 2016లో జైలు నుంచి విడుదలయ్యాడని ప్రస్తుతం ఒక బార్లో పనిచేస్తున్నాడని ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. ఐతే పోలీసులు ఫ్రాడ్ కేసుల విషయమే చెబుతూ... ఆన్లైన్లో ఈ ఘటన గురించి చెప్పడంతో ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది. ఏదీఏమైన ఉచితంగా వచ్చే డబ్బు ఎప్పటికైనా ప్రమాదమే కదా!. (చదవండి: ఫ్రీ బస్సులోనూ టికెట్ కోసం పట్టు.. బామ్మ వీడియో వైరల్) -
కోడి ఈకలతో కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు
-
కోడి ఈకలతో వ్యాపారం అంటే నవ్వారు.. కోట్ల టర్నోవర్తో అందరికీ షాకిచ్చారు!
వ్యర్థాల నుంచి కంపోస్ట్ చేయడం లేదా వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ పద్ధతి మనందరికీ తెలుసు, కానీ మనం ధరించే బట్టలు కూడా వ్యర్థాలతో తయారు చేయవచ్చని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఓ దంపతులు మాత్రం అలా ఆలోచించారు కాబట్టే, కోడి ఈకలతో మనం ధరించే బట్టలు తయారు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. వారి ఐడియా విని ఎగతాళి చేసిన వాళ్లే ఆశ్చర్యపోయేలా చేశారు జైపూర్కి చెందిన ముదిత, రాధేష్. కాలేజీలో పునాది పడ్డ ఈ ఐడియా, తమ కఠోర శ్రమ, అభిరుచితో దాన్ని కంపెనీగా మార్చిన ఈ దంపతులు ప్రస్తుతం కోట్లలో టర్నోవర్ని సొంతం చేసుకున్నారు. అనుకోకుండా ఆలోచన.. అదే వ్యాపారంగా మారి ముదిత మాట్లాడుతూ.. జైపూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్లో రాధేష్తో ఎంఏ చేస్తున్నప్పుడు, వ్యర్థ పదార్థాలతో కొత్త వస్తువులను తయారు చేసే దానిపై ప్రాజెక్ట్ చేశాను. ఒకరోజు, రాధేష్ ఒక ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ పొరుగున ఉన్న కసాయి దుకాణంలో నిలబడి ఉండగా కోడి ఈకలను చేత్తో తాకాడు. అనుకోకుండా అతనికి ఓ ఆలోచన వచ్చింది దాన్నే ప్రాజెక్ట్గా మార్చాం. ఆపై ఆ ప్రాజెక్ట్ ఐడియాతోనే బిజినెస్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. కోడి ఈకలతో వ్యాపారం అంటే నవ్వారు వారి ఆలోచన కార్యరూపం దాల్చడానికి సుమారు సుమారు 8 సంవత్సరాలు పట్టింది. 2010లో ప్రారంభమైన ఈ కార్యక్రమం 2018లో పూర్తయింది. ఇందుకోసం చాలా కష్టపడి చదవాల్సి వచ్చింది. ఎందుకంటే ఓ వైపు.. రాధేష్ కుటుంబం పూర్తిగా శాఖాహారం కాబట్టి, వాళ్లు ఈ వ్యాపారాన్ని నిరాకరించారు. వ్యాపార పనులు జరుగుతున్నప్పుడు కూడా వాళ్ల కుటుంబం ఆదుకోలేదు. ఈ క్రమంలో వాళ్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. మరో వైపు.. ఇంతకు ముందు ఎవరూ అలాంటి బట్టను తయారు చేయలేదు కాబట్టి, పుస్తకాలలో, ఇంటర్నెట్లో కూడా దాని గురించి ఎక్కువ సమాచారం లేదు. చాలా పరిశోధన తర్వాత, కోడి ఈకలను బట్టలుగా మార్చే ఒక పద్ధతిని కనుగొన్నారు. ఇక్కడ వరకు పట్టుదలతో ముందుకు సాగిన వీళ్లకు మళ్లీ వీటి సేల్స్ తలనొప్పిగా మారింది. కానీ తొందరగానే కోడి ఈకలతో తయారు చేసిన శాలువాలకు ఇక్కడి కంటే విదేశాల్లో దీనికి అధిక డిమాండ్ ఉన్న విషయాన్ని గమనించారు. అప్పటి నుంచి వారి ఉత్పత్తులు చాలా వరకు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. చిన్న కుటీర పరిశ్రమ స్థాయిలో మొదలైన వారి ఆలోచన రూపమే.. గత రెండున్నరేళ్లలో కంపెనీ దాదాపు 7 కోట్ల వ్యాపారం చేయగా ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్ 2.5 కోట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 1200 మంది కార్మికులు పని చేస్తున్నారు. చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్! -
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన కుబేరుల సంఖ్య
-
స్వీపర్కు రూ.1.9 కోట్లు ఇచ్చిన మిలియనీర్.. తర్వాత ఏమైందంటే?
లండన్: వీధులు ఊడ్చే వ్యక్తికి ఓ మల్టిమిలియనీర్ ఏకంగా రూ.1.9 కోట్లు ఇచ్చాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత తన డబ్బులు ఇవ్వాలంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. కోర్టులో కేసు గెలిచి తన సొమ్మును తిరిగి తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ నిరుపేద వ్యక్తికి అంత డబ్బు ఎందుకు ఇచ్చాడు. తిరిగి చెల్లించమనేందుకు గల కారణాలేంటి.. అసలు ఏం జరిగింది? బ్రిటన్కు చెందిన జాన్ రాంకిన్ కార్న్ఫోర్త్ అనే వ్యక్తి.. 1979లో ఓ న్యూఇయర్ పార్టీలో సిమోన్ డెనియర్ అనే వ్యక్తిని కలిశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన డెనియర్ వీధులు ఊడ్చుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జాన్ రాంకిన్.. డెనియర్ కలిసి పలు మార్లు మద్యం సేవించేవారు. ఇలా వారి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత.. తన తండ్రి మరణానంతరం కొన్ని మిలియన్ల పౌండ్లు పొందారు జాన్ రాంకిన్. అందులోంచి సుమారు 2 లక్షల పౌండ్లను తన నిరుపేద స్నేహితుడైన సిమోన్ డెనియర్కు 2012 నుంచి 2014 మధ్య మూడు దఫాలుగా ఇచ్చారు. డెనియర్ విడాకుల ఖర్చు కోసం 2012లో 26,300 పౌండ్లు, భార్యకు భరణం ఇచ్చేందుకు 2013లో 50వేల పౌండ్లు, ఇంటి రుణం చెల్లించేందుకని 2014లో 1.25 లక్షల పౌండ్లు ఇచ్చారు జాన్ రాంకిన్. తిరిగి చెల్లిస్తాడనుకున్నా.. ఎన్ని రోజులైన తన సొమ్మును తిరిగి చెల్లించకపోవటంతో కోర్టు మెట్లు ఎక్కారు జాన్ రాంకిన్. తన స్నేహితుడు ఆర్థికంగా ఎదిగాక తన సొమ్మును తిరిగి చెల్లిస్తాడని భావించానని చెప్పారు. కానీ అలా జరగలేదన్నారు. 2 లక్షల పౌండ్లు అనేది తనకు అంత పెద్ద సొమ్ము కాదని కోర్టు చెప్పినట్లు జాన్ రాంకిన్ గుర్తు చేసుకున్నారు. కానీ తన స్నేహితుడు తిరిగి ఇస్తాడని నమ్మానని పేర్కొన్నారు. అందుకే కోర్టు సాయం కోరినట్టు తెలిపారు. మరోవైపు.. ఇంటి రుణం తీర్చేందుకని ఇచ్చిన 1.25 లక్షల పౌండ్లు తన స్నేహితుడు గిఫ్ట్గా ఇచ్చాడని చెప్పాడు డెనియర్. తన మాజీ భార్యకు భరణం ఇచ్చేందుకు తీసుకున్న డబ్బులు రుణంగానే తీసుకున్నానని, వాటిని తిరిగి చెల్లించానని సిటీ కౌంటీ కోర్టులో ఒప్పుకున్నాడు. "వీధులు ఊడ్చుకుంటూ జీవనం సాగించే డెనియర్కు ఆ డబ్బు పెద్ద మొత్తం. ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు" అని డెనియర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి స్టిఫెన్ హెల్మ్యాన్.. ఇంటి కోసం ఇచ్చిన 1.25 లక్షల పౌండ్లు సైతం రుణమేనని, తిరిగి చెల్లించాల్సిందేనిని తీర్పు ఇచ్చారు. కానుకగా ఇచ్చాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఇంటి రుణంతో పాటు దానికి వడ్డీ చెల్లించాలని, అయితే.. విడాకుల కోసం ఇచ్చిన వాటికి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. -
వారసత్వ ఆస్తుల కోసం తండ్రి కొత్త షరతు.. కూతురి ఆవేదన
సాధారణంగా వారసత్వ ఆస్తులు దక్కాలంటే... పెళ్లి చేసుకోవాలనో, మరేదో నిబంధన పెడుతుంటారు తల్లిదండ్రులు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఆ తండ్రి మాత్రం ఓ కొత్త నియమం పెట్టాడు. రూ.93 కోట్ల ఆస్తి తన కూతురు క్లేర్ బ్రౌన్కు చెందాలంటే ఆమె శాశ్వతమైన ఉద్యోగాన్ని సంపాదించాలని, అందులోంచి ఎంతో కొంత సమాజానికి కంట్రిబ్యూట్ చేయాలని వీలునామాలో పొందుపరిచాడు. ట్రస్టు నుంచి ఫండ్స్ రావడం ఒక్కసారిగా ఆగిపోవడంతో కోర్టును ఆశ్రయించింది. శాశ్వత ఉద్యోగం దొరికితే తప్ప ఆ ఆస్తులను పొందలేవని క్లేర్కు చెప్పేసింది కోర్టు. దాంతో ఇరకాటంలో పడింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరక్కపోవడంతో తండ్రి ఆస్తులు కూడా దక్కడం లేదు. దీంతో చిన్నచిన్న అవసరాల కోసం కూడా తన జీవితభాగస్వామిపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతోంది క్లేర్. ఉద్యోగమే దొరికితే ఆస్తులతో తనకేం పని అని ప్రశ్నిస్తోంది. ఏడీహెచ్డీతో బాధపడుతున్నందున తండ్రి పెట్టిన రెండు నిబంధనలనూ తాను అందుకోలేనని చెబుతోంది. ఆస్తులుండి... అనుభవించలేని ఆమె దీనస్థితికి ఆమె కుటుంబ సభ్యులు సైతం బాధపడుతున్నారు. చదవండి: అదృష్టమంటే అది.. కలలో వచ్చిన నెంబర్తో రెండు కోట్లు గెలుచుకున్నాడు.. -
పుతిన్ తలను తెగనరకండి.. రష్యా కుబేరుడి సంచలన ప్రకటన
Russian businessman Offered To Putin: రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రష్యాను వీడి అమెరికాలో ఆశ్రయం పొందుతున్న వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన చేశాడు. యుద్ధ నేరస్తుడిగా పుతిన్ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా సరే వన్ మిలియన్ డాలర్ల సొమ్మును బహుమతిగా ప్రకటిస్తానంటూ సైన్యానికి ఆఫర్ చేశాడు. ఫేస్బుక్ వేదికగా ఆయన ఈ బహిరంగ ప్రకటన చేయడం విశేషం. రష్యాకు చెందిన కొనానిఖిన్ అమెరికాలో పలు వ్యాపారాల్లో ఆరితేరాడు. పలు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టారు. క్రిప్టో ఇన్వెస్టర్గా ఆయన చాలా ఫేమస్. అతని సంపద విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉంది. తాజాగా అతను రష్యా అధ్యక్షుడు పుతిన్కి వ్యతిరేకంగా గళం విప్పాడు. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ చేతులు కట్టుకుని ఉండలేనంటున్నాడు ఫేస్బుక్లో కొనానిఖిన్ చేసిన పోస్టులో... పుతిన్ రష్యా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి స్వేచ్ఛాయుత ఎన్నికలు లేకుండా చేశాడు. తనని తాను జీవితకాల అధ్యక్షుడిని చేసుకున్నాడు. అకారణంగా ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించి వేల మంది చావుకి కారణమవుతున్నాడు. ఒక రష్యన్ పౌరుడిగా నా దేశాన్ని నాజియిజం నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉంది. అందుకే యుద్ధ నేరస్తుడిగా పుతిన్ని అరెస్ట్ చేసినా లేదా చంపిన సైనికులు, అధికారులకు వన్ మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. అంతేకాదు తమ దేశం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న ఉక్రెయిన్ పౌరులకు సంఘీభావం ప్రకటించాడు కొనానిఖిన్. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొనానిఖిన్ 1992లో రష్యాను వీడాడు. ఆ తర్వాత 1999 నుంచి అమెరికాలో ఆశ్రయం పొందుతున్నాడు. అప్పటి నుంచి అక్కడే ప్రవాస జీవితం గడుపుతున్నారు. అమెరికాలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. పలుమార్లు ఇబ్బందులు ఎదురైనా అతను యూఎస్లోనే తలదాచుకుంటున్నాడు చదవండి: పుతిన్తో సంబంధాలు.. ఆస్తులు అమ్ముకుంటున్న రష్యన్ బిలియనీర్లు -
ఈ స్టార్ కమెడియన్ ఒక మిలియనీర్ !.. ఆస్తులు ఎంతంటే ?
Kapil Sharma Will Become Millionaire With His Shows: బీటౌన్లో మోస్ట్ పాపులర్ కమెడియన్లో కపిల్ శర్మ ఒకరు. ఆయన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మతో స్టార్ కమెడియన్గా మారాడు. బాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కపిల్ షోకి వచ్చి ప్రమోట్ చేసుకోవాల్సిందే అన్నంత రేంజ్లో కపిల్ విజయం సాధించాడు. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో భాగంగా కపిల్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ స్టార్ కమెడియన్పై త్వరలో బయోపిక్ కూడా రానుంది. కపిల్ శర్మపై వస్తోన్న ఈ బయోపిక్ చిత్రానికి 'ఫంకార్' అని టైటిల్ పెట్టారు. దీనికి మహావీర్ జైన్ నిర్మాతగా వ్యవహరించగా మృగ్ధీప్ సింగ్ లంబ దర్శకత్వం చేయనున్నారు. ఇదిలా ఉంటే పలు నివేదికల ప్రకారం కపిల్ శర్మ మొత్తం ఆస్తులు రూ. 242 కోట్లు అని తెలుస్తోంది. నెలకు రూ. 3 కోట్లకుపైగా సంపాదిస్తున్నాడట కపిల్. కపిల్ శర్మ తన నెల మొత్తం సంపాదనతో ఒక లక్జీరియస్ ఇల్లు కొనగలడని సమాచారం. ఇప్పటికే కపిల్ శర్మ ఇల్లు ముంబైలోని చాలా పాష్ ఏరియాలో ఉందట. ఇంతేకాకుండా అతను టీవీ ఎపిసోడ్ కోసం రూ. 40 నుంచి 90 లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. కపిల్ శర్మకు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ఆస్తులున్నాయట. ఇవికాకుండా మెర్సిడెస్ బెంజ్, వోల్వో ఎక్స్సీ 90, రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్డీ4 వంటి ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి. ఇవన్ని చూస్తుంటే ఈ స్టార్ కమెడియన్ ఒక రకంగా మిలియనీర్ అని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్లో 'ఐయామ్ నాట్ డన్ ఎట్' షోకు హోస్ట్గా కూడా చేస్తున్నాడు కపిల్. -
ఐడియా అదిరింది..10ఏళ్లకే కోట్లు సంపాదిస్తుంది,15ఏళ్లకు రిటైర్మెంట్!!
స్కూల్కు వెళ్లే 10 ఏళ్ల పిల్లలు ఇంట్లో ఏం చేస్తుంటారు. అది కావాలి ఇది కావాలి' అంటూ మారం చేస్తుంటారు. పిల్లలు మారం చేస్తున్నారని వారి తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్లు చేతిలో పెట్టి బుజ్జగిస్తుంటారు. లేదంటే వారికి ఇష్టమైనవి కొనిచ్చి సంతోష పెడుతుంటారు. కానీ ఈ 10ఏళ్ల చిచ్చర పడిగు అలా కాదు. పెద్ద పెద్ద కంపెనీల సీఈఓల శాలరీలకు పోటీగా నెలకు కోట్లు సంపాదిస్తుంది. వాళ్లకి సవాలు విసురుతోంది. వాట్ ఎన్ ఐడియా పిక్సీ కర్టిస్ ఆస్ట్రేలియాకు చెందిన 10ఏళ్ల పిక్సీ స్కూల్కు వెళుతుంది. ఓ రోజు వాళ్ల అమ్మ రాక్సీ జాసెంకోతో ఇలా 'మమ్మీ నేనూ బిజినెస్ చేస్తా..నాకు డబ్బులు కావాలి' అని అమాయకంగా అడిగింది. దీంతో తల్లి రాక్సీ.. కూతురు పిక్సీ కోరికను కాదనలేక.. అప్పటికే కూతురు పేరుతో ఉన్న 'పిక్సీస్ బౌస్' వ్యాపారాన్ని కూతురుకి అప్పగిచ్చింది. ఏం వ్యాపారం చేస్తుంది తల్లి వ్యాపార వ్యవహారాల్ని తన చేతిలోకి తీసుకున్న 10ఏళ్ల పిక్సీ..'పిక్సీస్ ఫిడ్జెట్స్' బొమ్మల్ని అమ్ముతుంది. తోటి పిల్లలకు ఎలాంటి బొమ్మలు నప్పుతాయో, వాళ్లు ఎలాంటి గాడ్జెట్స్ను ఇష్టపడతారో తెలుసుకొని వాటిని అమ్మడం ప్రారంభించింది. అలా వ్యాపారం ప్రారంభించిన 48గంటల్లో బొమ్మలన్నీ అమ్ముడుపోయాయి. ఇప్పుడు నెలకు కోట్లలో సంపాదిస్తుంది. ఈ సందర్భంగా పిక్సీ తల్లి రాక్సీ మాట్లాడుతూ 'నేను 100ఏళ్లు పనిచేస్తా.. కూతురు 15ఏళ్లకు రిటైర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నా' అంటూ సంతోషంగా చెబుతోంది. చదవండి: ‘బచ్పన్ కా ప్యార్’ పిలగాడు: బతికి బట్ట కట్టాడు.. మళ్లీ అదృష్ట దేవత తలుపు తట్టింది -
దొంగతనం చేశావ్ అన్నారు!....అంతే ఆమె కోటీశ్వరురాలైంది!!
ఒక్కోసారి మన టైం బాగోలేకపోతే లేదా ఎవరైన మన మీద అసూయ ద్వేషాలతోనో మన పై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. దీంతో మానసికంగానూ, ఆర్థికంగానూ కుంగిపోతుంటాం. కానీ ఇక్కడొకామెకు ఆ తప్పుడు ఆరోపణ ఆమెను కోటీశ్వరురాలుగా మార్చింది. (చదవండి: వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్ వైరస్ 12 దేశాలను చుట్టేసింది!!) అసలు విషయంలోకెళ్లితే...అలబామా లెస్టీ నర్స్ అనే ఆమె వాల్మార్ట్ షాపులో దొంగతనం చేసిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటుంది. అంతేకాదు తమ షాపులో 48 డాలర్లు(రూ. 3000) ఖరీదు చేసే తృణధాన్యలు, క్రిస్మస్ లైట్లు వంటి వస్తువులు దొంగలించిందని ఆరోపించింది. పైగా దొంగతనం చేసినందుకుగానూ తమకు 200 డాలర్లు(రూ. 14,000) చెల్లించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాల్మార్ట్ యాజామన్యం బెదిరించింది. దీంతో లెస్సీ జరిగిన విషయాన్ని ఆ షాపు వాళ్లకు వివరించినప్పటికి ఫలితం లేకపోయింది. పైగా ఆమెను అరెస్టు కూడా చేశారు. దీంతో లెస్టీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకుని కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అంతేకాదు పైగా తీర్పు ఆమెకు అనుకూలంగా రావడమే కాక అందులో ఆమె స్టోర్లోని అన్ని వస్తువులకు చెల్లించినట్లు కోర్టు పేర్కొంది. అంతేకాదు ఆమెను దొంగతనం చేశావ్ అంటూ ఆరోపించి మానసిక ఆవేదనకు గురి చేసినందుకుగానూ నష్టపరిహారంగా వాల్మార్ట్ 2.1 మిలియన్ డాలర్లు (రూ.15 కోట్లు)ను ఆమెకు చెల్లించవల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. (చదవండి: ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ కొన్నా స్కూటీ!.... ఏం లాభం నడిపేందుకు లేకుండాపోయింది) -
ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ
ముంబై: వ్యాపారాల్లో విజయాలు అంత సులువుగా రావు. ఎన్నో కష్టాలు, అడ్డంకులు.. ఇలా ఎదురయ్యే ప్రతి వాటిని దాటుకుంటూ వెనకడుగు వేయక ముందుక సాగాల్సి ఉంటుంది. అలా ప్రయాణించిన ఓ పేద కుటుంబంలోని యువకుడు నేడు వేల కోట్ల కంపెనీకి సీఈవో అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ముస్తఫా పేద కుటుంబం నుంచి వచ్చాడు. తన తండ్రి.. రోజూ కూలీ పని చేస్తే గానీ మూడు పూటల తిండి దొరకని స్థితి. తను 6వ తరగతిలో ఫెయిల్ కావడంతో చదువు మానేసి కూలి పనులకు వెళ్లాలనుకుంటున్న తరుణంలో అతని స్కూల్ టీచర్ చొరవతో మళ్లీ స్కూల్కి వెళ్లే అవకాశం దక్కించుకోవడంతో పాటు స్కూల్లో టాపర్గా నిలిచాడు. చివరికి ఉద్యోగం సంపాదించి తన తండ్రి చేసిన అప్పులన్నింటినీ తీర్చేశాడు. అనంతరం విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం రావడంతో వెళ్లాడు. జీవితం సాఫీగా సాగుతున్నా ఏదో తెలియని వెలితే ఉన్నట్లు అనిపించింది. ఉద్యోగం కన్నా బిజినెస్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు అతని బంధువులలో ఒకరు నాణ్యమైన ఇడ్లీ-దోశ పిండి కంపెనీని ప్రారంభించాలనే ఆలోచనను ఇచ్చారు. అది నచ్చడంతో ముస్తఫా ₹ 50,000 పెట్టుబడితో వ్యాపారం మొదలుపెట్టి తెలిసినవారికే వ్యాపార బాధ్యతలు అప్పగించి వెళ్లిపోయాడు. అయితే, మూడు సంవత్సరాల తర్వాత అతను తన పూర్తి సమయాన్ని కంపెనీపై దృష్టి పెడితేనే లాభాల్లోకి వెళ్తుందని గ్రహించి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అలా పూర్తి సమయాన్ని కంపెనీ కోసం కేటాయించినప్పటికీ ఒకానొక దశలో తన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేక కంపెనీలో షేర్లు ఇస్తానని మాటిచ్చాడు. అలా 8 ఏళ్ల పాటు అతని ప్రయాణం ఎన్నో కష్టాలను చవి చూశాక.. చివరకు తన కంపెనీకి ఓ పెద్ద ఇన్వెస్టర్ దొరికారు. 2000 కోట్ల రూపాయలను ఐడీ ఫ్రెష్ ఫుడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడంతో కంపెనీ రూపురేఖలే మారిపోయాయి. కంపెనీ విస్తరించడంతో పాటు సేల్స్ కూడా పెరిగాయి. తాను చెప్పినట్లుగా అందులో ఉన్న ఉద్యోగులను లక్షాధికారులను చేశాడు. ప్రస్తుతం తన కంపెనీలో వందల మంది పనిచేస్తున్నారు. చదవండి: వినూత్న ఉద్యోగ ప్రయత్నం.. ఉద్యోగం కావాలంటూ హోర్డింగ్ ఏర్పాటు, అయినా..? -
ఆస్తి 5 మిలియన్ డాలర్లు.. కానీ తినేది..
వాషింగ్టన్: ఎడమ చేత్తో కాకిని తోలరు... పిల్లికి బిచ్చం కూడా వేయరు.. సాధారణంగా పిసినారుల గురించి చెప్పేటప్పుడు ఇలాంటి సామెతలు వాడతారు. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే మహా పిసినారి.. పిల్లికి బిచ్చం వేయదు సరికదా ఆ పిల్లి తినే ఆహారాన్నే తాను తింటుంది. అంతేకాదు ఇంటికి వచ్చిన అతిథులకు సైతం అదే వడ్డిస్తుంది. పాపం.. ఆమె పేదవారేమో అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఆమె ఒక మల్టీ మిలియనీర్. ఆస్తి విలువ సుమారు 5.3 మిలియన్ డాలర్లు(దాదాపు రూ. 38 కోట్లు). కానీ ఒక్క పైసా కూడా వృథా చేయడం ఆమెకు ఇష్టం ఉండదు. వెయ్యి డాలర్లతో నెల మొత్తం గడిపేస్తుంది. వాషింగ్ స్క్రబ్ పీలికలు అయ్యేంత వరకు ఉపయోగిస్తుంది. వంటగదిలో ఒక్క కత్తి మాత్రమే వాడుతుంది. తనను తాను చీపెస్ట్ మల్టీ మిలియనీర్గా చెప్పుకొనే అమీ ఎలిజబెత్ వ్యవహారశైలి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘‘22 నిమిషాలు కాగానే వాటర్ హీటర్ను ఆఫ్ చేసేస్తా. అంతకు మించి క్షణం కూడా ఆలస్యం చేయను. ఎందుకంటే నీళ్లు ఎంత వేడెక్కితే నా స్నానానికి సరిపోతాయో నాకు బాగా తెలుసు. దీంతో నాకు 80 డాలర్లు ఆదా అవుతాయి. అంతేకాదు నేను క్యాట్ ఫుడ్ తీసుకుంటాను. నా ఇంటికి వచ్చేవారికి కూడా అదే పెడతాను. తద్వారా కిరాణా బిల్లు తగ్గిపోతుంది. ’’ అని అమెరికాలోని లాస్ వేగాస్కు చెందిన అమీ టీఎల్సీతో మాట్లాడుతూ తన జీవన విధానం గురించి చెప్పుకొచ్చారు.(చదవండి: పాతిపెట్టిన పిల్లిని తీసి కూర వండేసింది!) అంతేకాదు పాత వస్తువులతోనే కాలం నెట్టుకొస్తానని, తద్వారా కొత్తవి కొనేందుకు ఏటా అవసరమయ్యే సుమారు 2 లక్షల డాలర్లు ఆదా అవుతాయని పేర్కొన్నారు. ఇక అమీ మాజీ భర్త మైఖేల్ ముర్రే ఇంటి పనులన్నీ చేస్తారు. దీంతో పనిమనిషికి ఇవ్వాల్సిన 400 డాలర్లు ఆమెకు మిగిలిపోతున్నాయట. ఇక ఉద్యోగరీత్యా తరచుగా ప్రయాణాలు చేసే అమీ, 17 ఏళ్ల కాలం నాటి కారునే వాడతారు. డబ్బు పొదుపు చేసేందుకే తాను ఈ మార్గాలు ఎంచుకున్నానని, ఎవరు ఏమనుకున్నా తను అసలు పట్టించుకోనని ఆమె చెప్పుకొచ్చారు. అమీకి సంబంధించిన ఇంటర్వ్యూపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. -
ఉల్కాపాతం.. కోటీశ్వరుడయ్యాడు
జకర్తా: అదృష్టం ఎప్పుడు.. ఎలా.. ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. మట్టిలో మాణిక్యాలు దొరికి కోటీశ్వరులు అయిన వారిని చూశాం. కానీ ఉల్కాపాతం వల్ల కోటీశ్వరుడు అయిన వారి గురించి వినడం కానీ చూడటం కానీ ఇంతవరకు జరగలేదు కదా. తాజాగా ఈ అరుదైన సంఘటన వాస్తవ రూపం దాల్చిఇంది. ఉల్కా రాత్రికి రాత్రే ఓ వ్యక్తిని కోటీశ్వరుడిని చేసింది. ఆకాశం నుంచి ఇంటి పై కప్పు మీద 13 కోట్ల రూపాయల విలువ చేసే ఓ స్పేస్ రాక్ పడింది. దాంతో అతడి దశ తిరిగింది. వివరాలు.. జోసువా హుటగలుంగ్ అనే వ్యక్తి ఇండోనేషియా ఉత్తర సుమిత్రాలోని కోలాంగ్లో నివాసం ఉంటున్నాడు. శవపేటికలు తయారు చేస్తూ.. కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇంట్లో శవపేటిక తయారు చేస్తుండగా ఇంటి పై కప్పు మీద ఏదో పడినట్లు శబ్దం వినిపించింది. ఎవరైనా తన ఇంటి మీద రాళ్లు వేస్తున్నారా ఏంటి అనే అనుమానంతో బయటకు వచ్చి చూశాడు. అతడికి అక్కడ నల్లటి ఓ రాయి కనిపించింది. చేతిలోకి తీసుకున్నప్పుడు అది ఇంకా వేడిగానే ఉంది. బాగా పరిశీలించి చూడగా అది స్పేస్ రాక్ అని అర్థం అయ్యింది అన్నాడు. (చనిపోయిన బాలిక బతికింది: గంట తర్వాత..) జోసువా మాట్లాడుతూ.. ‘ఇంటి పై కప్పు మీద పడిన ఆ ఉల్క 15 సెంటీమీటర్లు భూమిలోకి చొచ్చుకుపోయింది. ఇక దీని బరువు సుమారు 2.1కిలోగ్రాములు ఉంది. ఇది తప్పకుండా ఆకాశం నుంచే పడి ఉంటుందని నా నమ్మకం. మా ఇరుగుపొరగువారు కూడా ఇది ఉల్కే అన్నారు. ఎందుకంటే ఆకాశం నుంచి నా ఇంటికి మీదకు రాయి విసిరే అవకాశం లేదు. ఈ ఉల్కాపాతంతో నన్ను అదృష్టం వరించింది. ఇక నా జీవితంలో అన్ని సంతోషాలే ఉంటాయి. ఈ ఉల్క విలువ సుమారుగా 13 కోట్ల రూపాయలు ఉంటుంది అంటున్నారు. అంటే నా 30 ఏళ్ల జీతానికి సమానం. ఈ డబ్బులో కొంత భాగాన్ని చర్చి నిర్మాణానికి వినియోగిస్తాను’ అన్నాడు. ఇక ఈ ఉల్క క్వాలిటీ, పరిమాణాన్ని బట్టి దాని ధర నిర్ణయించబడుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక స్వచ్ఛతని బట్టి దీని విలువ గ్రాముకు 0.50-50 అమెరికన్ డాలర్లుగా ఉంటుందని తెలిపారు. ఈ అరుదైన లోహాలకు గరిష్టంగా గ్రాముకు 1000 డాలర్లు కూడా చెల్లిస్తారని తెలిపారు. (చదవండి: అదృష్టం అంటే అతనిదే, రాత్రికి రాత్రే...) ఇక జోసువాకు దొరికిన స్పేస్ రాక్ 4.5 బిలయన్ సంవత్సరాల క్రితం నాటిదని.. ఇది సీఎం1/2 కార్బోనేషియస్ కొండ్రైట్ వర్గానికి చెందిన అరుదైన స్పేస్ రాక్ అని తేలింది. ఇక దీని ధర గ్రాముకు 857 అమెరిన్ డాలర్లు పలుకుతుందని.. మొత్తం చూస్తే.. 1.85 అమెరికన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు 137437517.50 రూపాయల)విలువ చేస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు. -
ఎన్నారై మిలియనీర్ కిడ్నాప్.. బీఎండబ్ల్యూలో శవం
కాలిఫోర్నియా: అపహరణకు గురైన ప్రముఖ ఎన్నారై మిలినీయర్ తుషార్ ఆత్రే తన బీఎండబ్ల్యూ కారులో విగతజీవిగా దొరికారు. కాలిఫోర్నియా శాంటా క్రూజ్లోని తన నివాసం నుంచి దుండగులు మంగళవారం తెల్లవారుజామున ఆయనను కిడ్నాప్ చేశారు. 50 ఏళ్ల తుషార్ అత్రే ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఆత్రే నెట్ ఐఎన్సీ అధిపతి. ఆయన చివరిసారిగా తెల్లరంగు బీఎండబ్ల్యూ కారులోకి ఎక్కుతూ సీసీటీవీ కెమెరాల్లో కనిపించారు. సముద్రానికి అభిముఖంగా ఉన్న తన విలాసవంతమైన నివాసం నుంచి ఆత్రేను దుండగులు తెల్లవారుజామున 3 గంటల అపహరించారు. అదే సమయంలో ఆత్రే నివాసం నుంచి ఎమర్జెన్సీ నంబర్ 911కు ఫోన్ కాల్ వచ్చిందని, జరిగిన నేరం గురించి ఆత్రే సంబంధికులు ఫోన్ చేశారని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం ఆత్రే బీఎండబ్ల్యూ కారును శాంటా క్రజ్ కొండప్రాంతాల్లో గుర్తించారు. కారులో ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడని మొదట పేర్కొన్న పోలీసులు.. చనిపోయింది తుషార్ ఆత్రేనని బుధవారం నిర్ధారించారు. ఇది దోపిడీ కేసు అయి ఉండొచ్చునని, ఈ కేసులో కనీసం ఇద్దరు నిందితులు ఉండి ఉంటారని అనుమానిస్తున్నామని శాంటా క్రూజ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొంది. -
వయసు ఏడేళ్లు... సంపాదన రూ.150 కోట్లు!
వాషింగ్టన్ : మిలియనీర్గా ఎదగడానికి ఒక వ్యక్తికి కనీసంలో కనీసం ముప్పై ఏళ్లైనా పడుతుంది. కానీ అమెరికాకు చెందిన ర్యాన్ అనే ఏడేళ్ల కుర్రాడు మాత్రం కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.150 కోట్లుతో పాటు, సోషల్ మీడియాలో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. యూట్యూబ్ చానల్తో... ప్రస్తుతం ఎంతో మంది ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్న యూట్యూబ్నే ర్యాన్ సైతం తన సంపాదనకు ఉపయోగించుకున్నాడు. 2015లో ఈ చిన్నోడు.. ‘ర్యాన్ టాయ్స్ రివ్యూ’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. రోజూ చిన్నారుల బొమ్మల వీడియోలు అప్లోడ్ చేసేవాడు. కొద్దిరోజుల్లో ఈ వీడియోలకు అభిమానులు పెరిగిపోయారు. ఇప్పుడవే వీడియోలు కోట్ల రూపాయలు కురిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ర్యాన్ చానల్ను దాదాపు కోటికి పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు. ఫోర్బ్స్ జాబితాలో తొలి స్థానం.. యూట్యూబ్ ద్వారా ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న వారి జాబితాలో ర్యాన్ తొలి స్థానం సంపాదించుకున్నాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ వివరాలు ప్రకటించింది. ఈ జాబితాలో గతేడాది 8వ స్థానంలో నిలిచిన ర్యాన్.. ఈసారి తన సంపాదన రెట్టింపు చేసుకున్నాడు. బొమ్మలతో వీడియోలు... అందరు చిన్నారుల్లాగే నచ్చిన బొమ్మలతో ఆడుకుంటూనే ర్యాన్ కోటీశ్వరుడయ్యాడు. అయితే ర్యాన్ ఆ బొమ్మలతో వీడియో కెమెరాల ముందు ఆడుకుంటాడు. కొత్తగా వచ్చే రకరకాల బొమ్మలపై రివ్యూలు ఇస్తుంటాడు. అవి ఎలా పనిచేస్తాయో అందులో వివరిస్తాడు. ఆ వీడియోల్ని తన చానెల్లో పోస్ట్ చేయగా వాటిని కొన్ని లక్షల మంది చూడటం వల్ల లెక్కలేనన్ని యాడ్స్ వచ్చాయి. దీంతో ర్యాన్ ఖాతాలోకి ఆదాయం వచ్చి చేరింది. -
అదృష్టం అంటే ఇదే మరి... ఐదు నెలల్లో రెండు సార్లు
కెనడా : అదృష్టం జీవితంలో ఒకసారే తలుపు తడుతుందన్నని అంటారు. కానీ మనోడిని మాత్రం రెండు సార్లు తలుపు తట్టింది. ఇంకేముంది రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. అది ఎలా అనుకుంటున్నారా.. మనోడికి అదృష్ట దేవత లాటరీ రూపంలో దర్శనమిచ్చింది. అది కూడా ఐదు నెలల్లో రెండు సార్లు. అఫ్రికా నుంచి కెనడా వలస వచ్చిన మెల్హిగ్ మెల్హిగ్ 28 ఏళ్ల వయసు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మెల్హిగ్కు ఈ ఏడాది ఏప్రిల్లో 1.5మిలియన్ డాలర్ల లాటరీ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అంతటితో సరిపెట్టుకోక గత నెలలో మళ్లీ లాటరీ టికెట్ కొన్నాడు. 13లక్షల మంది వేసిన ఈ లాటరీ(2మిలియన్ డాలర్లు) మళ్లీ మెల్హిన్కు దగిలింది. దీంతో మెల్హిగ్ దాదాపు 19 కోట్ల రూపాయలు(3.5మిలియన్ డాలర్లు) లాటరీ ద్వారా సంపాదించాడు. ఈ లాటరీ డబ్బుతో ఏం చెయ్యాలనుకుంటున్నావని లాటరీ అధికారులు అడగ్గా ‘ మొదటిసారి వచ్చిన లాటరీ డబ్బులతో నా భార్య, పిల్లల కోసం మంచి ఇంటిని కొన్నాను. ఈ సారి వచ్చిన డబ్బుతో నేను బిజినెస్ చెయ్యాలనుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగ పడే ఏదైనా మంచి పని చేయ్యాలనుకుంటున్నాను. కార్లు వ్యాపారం లేక ఇంధన వ్యాపారం చేయ్యాలనుకుంటున్నాను’ అని మల్హిన్ పేర్కొన్నారు. 13లక్షల మందిని కాదని అదృష్ట దేవత మెల్హిన్ ఇంటి తలుపులు తెరిచింది. లక్కు అంటే మనోడిదే మరి. -
అఖిలేశ్ ఇలా కోపం తీర్చుకున్నారా...!?
లక్నో : సుప్రీం కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈనెల(జూన్) 2న తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అయితే అఖిలేశ్ ఖాళీ చేసిన 4- విక్రమాదిత్య మార్గ్లోని బంగ్లాను స్వాధీనం చేసుకోవడానికి శనివారం ఉదయం మీడియాతో సహా అక్కడికి చేరుకున్న ప్రభుత్వ అధికారులు షాక్కు గురయ్యారు. ‘ఇదొక దుర్దినం, జీవితం చాలా చిన్నది.. బాధ పడాల్సిన అవసరం లేదంటూ’ గోడలపై రాసి ఉండటంతో పాటు విదేశాల నుంచి తెప్పించిన మార్బుల్స్, టైల్స్, ఏసీలు మాయమవడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయమై స్పందించిన ప్రభుత్వాధికారి ఒకరు మాట్లాడుతూ.. 2016లో 45 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ అఖిలేశ్ కుటుంబ సభ్యుల అభిరుచికి తగినట్లుగా బంగ్లాను పునరుద్ధరించామన్నారు. స్విమ్మింగ్ పూల్లోని టర్కిష్ టైల్స్తో పాటు, ఇటాలియన్ మార్బుల్, ఏసీలు, గార్డెన్ లైట్స్ మాయమయ్యాయని తెలిపారు. మార్బుల్స్ తీసుకోవడానికి స్విమ్మింగ్పూల్ సహా పలు చోట్ల తవ్వకాలు జరిపడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అంతేకాకుండా అఖిలేశ్ యాదవ్ తన కోసం ఏర్పాటు చేసుకున్న జిమ్ కూడా మొత్తం ఖాళీగా ఉందని ఆయన వాపోయారు. చర్యలు తీసుకుంటాం.. బంగ్లా నుంచి మాయమైన వస్తువుల జాబితా తయారు చేస్తున్నామని, అదే విధంగా పలు చోట్ల తవ్వకాలు జరపడం పట్ల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాధికారులు తెలిపారు. మాజీ సీఎం అయి ఉండి ఈ విధంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అనాగరిక చర్య అని వారు పేర్కొన్నారు. మిలియనీర్ అయి ఉండి ఇలా చేస్తారా.. అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ చూస్తే ఆయన ఎంత సంపన్నుడో తెలుస్తుందని యూపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించారు. లక్నోలో ఎన్నో ఆస్తులను కలిగి ఉన్న ఆయనకు అమెరికా, లండన్లలో కూడా అనేక బంగ్లాలు ఉండగా ఈవిధంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. తన కోసం కొత్తగా నిర్మించుకుంటున్న విల్లా కోసమే ఆయన ఇలా అనాగరిక చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా బంగ్లా ఖాళీ చేయడం ఇష్టంలేనందు వల్లే అఖిలేశ్ ఈవిధంగా కోపాన్ని తీర్చుకున్నారని విమర్శలు వెల్లువెత్తడంతో సమాజ్వాదీ పార్టీ ప్రతినిధి స్పందించారు. తమ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్పై ప్రభుత్వ అధికారులు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. కేవలం ఆయన ఇష్టపడి కొనుక్కున్న, బహుమతులుగా లభించిన వాటినే తన వెంట తీసుకెళ్లారని తెలిపారు. -
చెత్త బండిలో లక్షాధికారి శవ యాత్ర
వేలూరు(తమిళనాడు): లక్షాధికారిగా జీవించిన ఓ వ్యక్తిని మరణించాక బంధువులు, కన్న బిడ్డలు అనాథగా వదిలిపెట్టడంతో అతని మృతదేహాన్ని చెత్త బండిలో తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. షోలింగర్కు చెందిన రాజారామ్(70) భార్య కొన్నేళ్ల క్రితం మరణించడంతో కన్నబిడ్డలు అతన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో వీధుల్లో బిక్షాటన చేసి జీవిస్తుండేవాడు. గత నెల 27న రాజారామ్ మృతిచెందాడు. ఆయన బంధువులకు పోలీసులు సమాచారం అందజేశారు. రాజారామ్తో తమకు సంబంధం లేదని కన్నబిడ్డలు మృతదేహాన్ని తీసుకోలేదు. దీంతో బుధవారం పోస్టుమార్టం నిర్వహించి పారిశుధ్య కార్మికుల సాయంతో చెత్త తీసుకెళ్లే బండిలో మృతదేహాన్ని తీసుకెళ్లి దహనక్రియలు నిర్వహించారు. -
ఛాయ్ బిజినెస్తో మిలీనియర్ అయ్యింది
న్యూఢిల్లీ : ఛాయ్ బిజినెస్ ఓ అమెరికన్ మహిళను లక్షాధికారి చేసింది. అదీ కూడా రుచికరమైన భారతీయ టీ. కొలరాడోకు చెందిన బ్రూక్ ఎడ్డీ అనే అమెరికన్ మహిళ 2002లో భారత్ను సందర్శించింది. అనంతరం ఆమె 2006తో తిరిగి తన స్వదేశం అమెరికా వెళ్లిపోయింది. కానీ కొలరాడోలో కేఫ్ల్లో ఎక్కడ కూడా.. ఆమెకు అచ్చం భారత్లో దొరికిన మాదిరి రుచికరమైన టీ లభించలేదు. దీంతో ఆమెనే భారత భక్తి ఆదర్శాలతో ఓ ఛాయ్ వ్యాపారం చేపట్టాలని నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా వెంటనే 2007లో భక్తి ఛాయ్ పేరుతో ఛాయ్ వ్యాపారం ప్రారంభించేసింది. ఈ ఛాయ్ వ్యాపారమే ఇప్పుడు ఏడు మిలియన్ డాలర్ల రెవెన్యూ కంపెనీగా అవతరించింది. ఈ ఛాయ్కి రుచిమరిగిన అమెరికన్లు, ఆ కంపెనీ టీ తాగకుండా ఉండలేకపోతున్నారు. బ్రూక్ ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రోజురోజుకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెద్ద ఎత్తున్న చేకూరుతోంది. అమెరికన్ వీక్లీ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 2002లో భారత్ సందర్శించినప్పుడు తాను తాగిన టీ ఎంతో ఇష్టమని బ్రూక్చెప్పింది. ప్రతీసారి తాను ఏదో ఒక కొత్తదాన్ని ప్రవేశపెడుతుంటానని, ఇది కూడా అలాంటిదేనని పేర్కొంది. ఈ ఛాయ్ వ్యాపారం ప్రారంభించిన ఏడాది తర్వాత భక్తి ఛాయ్ తన తొలి వెబ్సైట్ కూడా లాంచ్ చేసింది. అలా తన వ్యాపారాలను వృద్ధి చేసుకుంటూ వచ్చింది. బ్రూక్ ప్రస్తుతం ఇద్దరు కవలలకు, సింగిల్ మదర్. ఫుల్-టైమ్ జాబ్కు గుడ్బై చెప్పి మరీ బ్రూక్ ఈ ఛాయ్ వ్యాపారంతో సామాజికంగా, పర్యావరణంగా మార్పు తీసుకొస్తోంది. 2014లో బ్రూక్ ఎడ్డీ, ఎంటర్ప్రిన్యూర్ మేగజైన్స్ ‘ఎంటర్ప్రిన్యూర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డులో టాప్-5 ఫైనలిస్ట్. -
కోట్ల రూపాయలు గెలిచాడు.. కానీ!
లండన్: యూకేకు చెందిన ఓ యువకుడు కార్ల్ క్రూక్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం అతడిని అదృష్టం వరించింది. లాటరీలో ఏకంగా రూ.9.8 కోట్లను గెలుచుకున్నాడు. ఇంకేంటి అతడి దారిద్ర్యం పోయింది. అతడనికి మంచి రోజులొచ్చాయని తోటి కూలీలు, అధికారులు భావించారు. కానీ, క్రూక్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శుక్రవారం (మరుసటి రోజు) కూడా కూలీగా పనిచేయడానికి వచ్చాడు. ఇక అంతే.. షాక్ తో కూడిన ఆశ్చర్యానికి లోనవడం తోటి కూలీలు, అధికారుల వంతయింది. ఒక్క రోజులో అతడ్ని అదృష్టం వరించిందని భావించలేదు. ఆ డబ్బును త్వరలో అందుకోనున్నట్లు చెప్పాడు. వచ్చే వారం డబ్బు సెటిల్ మెంట్ చేసుకుంటాను, ఇప్పటికే మా బాస్ తో ఈ విషయం చెప్పానన్నాడు. ఆడి ఆర్ఎస్5, ఓ మంచి ఇల్లు కొనుక్కుంటాను. భార్య సమంతతో కలిసి హానీమూన్ కు వెళ్తానని సంతోషంగా చెప్పుకొచ్చాడు. గతేడాది సమంతతో ఎంగేజ్ మెంట్, ఈ ఏడాది వివాహం కూడా జరిగిందని.. హనీమూన్ కోసం సమంతను ఆఫ్రికాకు తీసుకెళ్తానని క్రూక్ అంటున్నాడు. జాక్ పాట్ కొట్టాను కదా అని డబ్బులు పిచ్చిపిచ్చిగా ఖర్చు చేసే ప్రసక్తే లేదని, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తానని క్రూక్ వివరించాడు. షాపులో దాదాపు 500 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాను.. కనీసం ఈ డబ్బులు అయినా తిరిగి గెలుచుకుంటానని భావించానని, ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేదని కోటీశ్వరుడు కార్ల్ క్రూక్ ఆనంద భాష్పాలు రాల్చేశాడు. -
బిచ్చగాడు.. ద మిలియనీర్..
ఇతడి పేరు పప్పూ కుమార్.. పట్నాలో బిచ్చమెత్తుకుని జీవిస్తుంటాడు.. మరి ఈ టైటిల్కు ఇతడికి ఏం సంబంధమనేగా మీ డౌటు. ఉంది.. పప్పూ కుమార్కున్న స్థిరాస్తి విలువ రూ.1.25 కోట్లు! అంతేకాదు.. అతడి బ్యాంకు ఖాతాల్లో రూ.5 లక్షలు ఎప్పుడూ మూలుగుతునే ఉంటుంది! ఇంతేనా.. రోజూ షాపుల చుట్టూ తిరుగుతూ తాను బిచ్చం అడుక్కునే వ్యాపారులకే రూ.10 లక్షల దాకా అప్పులిచ్చాడు!! రెగ్యులర్గా బిచ్చంతోపాటు వడ్డీ కూడా వసూలు చేసుకెళ్తూ ఉంటాడు. మీకో విషయం తెలుసా? పప్పూ యాదవ్ బీటెక్ చదివి ఇంజనీర్ కావాలనుకున్నాడు.. మరి బిచ్చగాడిలా ఎలా మారాడు.. తెలుసుకోవాలంటే.. ఓసారి ఫ్లాష్బ్యాక్లోకి వెళ్లాల్సిందే.. పప్పూ యాదవ్ చిన్నప్పుడూ అందరిలాగే స్కూల్కు వెళ్లాడు. ఇంటర్ కూడా పాసయ్యాడు. గణితమంటే మక్కువ ఎక్కువ. అన్నిటికన్నా అందులోనే అతడికి 72 మార్కులు వచ్చాయి. ఇంజనీర్ కావాలనుకున్నాడు. కానీ ఓ ప్రమాదం అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. పాక్షికంగా పక్షవాతం వచ్చింది. ఆ తర్వాత తండ్రి చనిపోయాడు. ఇంట్లో వాళ్లు పప్పూను పట్టించుకోవడం మానేశారు. చివరికి గతిలేక పట్నా రైల్వేస్టేషన్లో అడుక్కోవడం మొదలుపెట్టాడు.. ఏడేళ్లు గడిచాయి.. 2015 సంవత్సరం.. ఓ రోజున.. రైల్వే పోలీసులు స్టేషన్లో బిచ్చగాళ్లను తరిమేయడం మొదలుపెట్టారు.. పప్పూ కుమార్ కదల్లేదు. భీష్మించుకుని కూర్చున్నాడు.. పోలీసులకు డౌట్ వచ్చింది. ఆరా తీశారు.. అసలు విషయం బయటపడింది.. రూపాయి రూపాయి దాచి.. అతడు ఒక్కోటి 2వేల చదరపు అడుగుల విస్తీర్ణమున్న రెండు ప్లాట్లు కొన్నాడు.. అతడికున్న 4 బ్యాంకు ఖాతాలు.. వడ్డీలకు అప్పులిస్తున్న విషయం బయటపడింది.. ఇంత డబ్బుంది కదా.. మామూ లు జీవితం జీవించమని చెప్పారు.. పప్పూ వినలేదు.. బిచ్చమెత్తుకోవడం మానలేదు. పోనీ.. ఆ పక్షవాతానికి చికిత్స చేయించుకోవచ్చు కదా అని చెబితే.. నేను చికిత్స చేయించుకుంటే.. ఇక నాకు బిచ్చమెవరు వేస్తారు అని ఎదురు ప్రశ్నించాడట. -
మిలియనీర్ అని చెప్పినా..బయటకు పంపారు
కాలిఫోర్నియా: నా వయసు 28ఏళ్లు, ఏడాదికి 4 మిలియన్ డాలర్లు సంపాదిస్తా, నాకు ఆరు సొంత ఇళ్లులున్నాయి.. నువ్వేం చేయగలవు..అంటూ మరో ప్రయాణికుడితో గొడవపడుతూ విమానంలో డబ్బా కొట్టుకున్న ఓ వ్యక్తిని సిబ్బంది బయటకు పంపించేసింది. ఫుల్లుగా మద్యం సేవించి జెట్బ్లూ విమానంలో ముగ్గురు వ్యక్తులు గొడవ పడుతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారు. అక్కడకు వచ్చిన విమానసిబ్బందితోనూ మిలియనీర్ అని చెప్పుకున్న వ్యక్తి దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆఖరికి చేసేదేమీలేక, గట్టిగా అరుస్తూ ప్రయాణికులను ఇబ్బందుకు గురి చేస్తున్న ఆ ముగ్గురిని పోలీసుల సహాయంతో బయటకు పంపించారు. లాంగ్ బీచ్ నుంచి సాక్రమెంటోకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరో ప్రయాణికురాలు ఈ మొత్తాన్ని వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టడంతో మిలియనీర్ బాగోతం బయటకు తెలిసింది. అయితే వీడియోలో మిలియనీర్గా చెప్పుకున్న వ్యక్తి డేవిడ్ బ్రాకెట్గా తెలుస్తోంది. అతను కాలిఫోర్నియా రియల్ ఎస్టేట్, మోర్టగేజ్ కంపెనీ హోమ్ ల్యాండ్ ఫైనాన్సియల్ నెట్వర్క్కి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాడు. -
ఒక్క రోజులోనే కోటీశ్వరురాలైంది!
సెర్బియాకు చెందని ఓ వృద్ధురాలు ఒక్క రోజులోనే కోటీశ్వరురాలు అయ్యింది. దాదాపు 6.70 కోట్ల రూపాయల నగదు, 27 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దక్కాయి. సెర్బియా తూర్పు ప్రాంతంలో మేరీ జ్లాటిక్ (86) కొన్ని దశాబ్దాలుగా ఓ చిన్న గుడిసెలో ఒంటరిగా జీవిస్తోంది. ఆమెకు కుక్కలు మాత్రమే తోడు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతి నెలా ఇచ్చే 6700 రూపాయల పెన్షనే ఆమెకు జీవనాధారం. మేరీ జ్లాటిక్కు చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న ఆమె భర్త మొమ్కిలో జ్లాటిక్ 2011లో ఆస్ట్రేలియాలో మరణించాడు. మొమ్కిలో సంపద ఆయన వారసత్వంగా మేరీకి దక్కింది. కాగా కోర్టులో కేసు పరిష్కారమై డాక్యుమెంట్లు చేతికి రావడానికి నాలుగేళ్లు పట్టింది. జ్లాటిక్ దంపతులు 1956లో సెర్బియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. మొమ్కిలో ఓ కంపెనీలో కార్పెంటర్గా పనిచేసేవాడు. మేరీ కొంతకాలం ఆస్ట్రేలియాలో గడిపిన తర్వాత తన తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సొంతూరు సెర్బియాలోని బొల్జెవక్ పట్టణానికి తిరిగి వచ్చింది. తల్లి మరణించిన తర్వాత ఆమె మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లలేదు. ఆస్ట్రేలియాలో ఉండే ఆమె భర్త మరో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మేరీకి తన భర్తతో సంబంధాలు తెగిపోయాయి. నాలుగేళ్ల క్రితం మొమ్కిలో మరణవార్త విని ఓ వ్యక్తి మేరీకి సాయపడ్డాడు. మొమ్కిలో దాచిన డబ్బు, సంపద ఆమెకు దక్కింది. కోట్ల రూపాయల సంపద దక్కినా మేరీ మాత్రం తన చిన్న గుడిసెలోనే ఉంటానని చెబుతోంది. -
కోటీశ్వరుడవ్వాలని..
బొల్లారం: వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు గుర్రపు పందెం ద్వారా కోటీశ్వరుడు కావాలనుకున్నాడు. హైదరాబాద్లోని బ్యాచిలర్స్ హాస్టళ్లలో ల్యాప్టాప్లు చోరీ చేయడంతో పాటు ఇళ్లల్లో చోరీలకు పాల్పడి నగర పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా మారాడు. సదరు కేటుగాడిని తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేసి.. 40 ల్యాప్టాప్లు, 35 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బేగంపేట ఏసీపీ గణేష్రెడ్డి, తిరుమలగిరి ఇన్స్పెక్టర్ సత్తయ్యతో కలిసి విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరిజిల్లా నిడదవోలుకు చెందిన కమెపల్లి కృష్ణమోహన్ అలియాస్ కార్తీక్ అలియాస్ క్రిష్ (35) బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చదువుకు స్వస్తి చెప్పి హైదరాబాద్కు చేరుకున్నాడు. 2002 వరకు సినీ పరిశ్రమలో సహాయ నిర్మాతగా కొనసాగాడు. నిర్మాతగా ఆశించినంత డబ్బు రాకపోవడం.. వ్యసనాలకు బానిస కావడంతో గుర్రపు పందాలు కాసి త్వరగా కోటీశ్వరు కావాలనుకున్నాడు. ఇందుకు అవసరమైన డబ్బు కోసం 2003 నుంచి చోరీల బాట పట్టాడు. నగరంలోని బ్యాచిలర్స్ హాస్టళ్లతో పాటు తాళం వేసి ఉన్న ఇళ్లలోనూ చోరీలు చేస్తున్నాడు. చోరీ సొత్తును కర్ణాటకలోని మైసూర్లో విక్రయించేవాడు. అక్కడే మకాంపెట్టి వచ్చిన డబ్బుతో గుర్రపు పందాలు ఆడుతూ జల్సాలు చేస్తున్నాడు. ఉన్నత కుటుంబం... నిందితుడు కృష్ణమోహన్ది ఉన్నత కుటుంబం. తల్లి విశ్రాంత ఉపాధ్యాయురాలు కాగా.. సోదరులు ఉన్నత చదువులు చ దివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. అయితే, వ్యసనాలకు బానిసైన కృష్ణమోహన్ బీటెక్ను మధ్యలోనే ఆపేసి, సులభంగా కోటీశ్వరుడు కావాలనే దురాశతో ఘరానా దొంగగా మారి జైలు పాలుకావడం గమనార్హం. సెంచరీ దాటిన కేసులు... కృష్ణమోన్ జంటనగరాల్లోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో 117 చోరీలకు పాల్పడి పోలీసులకు మోస్ట్వాంటెడ్గా మారాడు. ఇతడిపై 15 నాన్బెయిలబుల్ కేసులు ఉన్నాయి. ఎస్ఆర్నగర్ ఠాణా పరిధిలో మొదటసారి చోరీ చేశాడు. మూడు చోరీలు చేసి పోలీసులకు చిక్కాడు. తర్వాత 2009లో మాదాపూర్లో 52 చోరీలు చేసిన కృష్ణమోహన్ 2012లో ఎస్సార్నగర్లో 22, మారేడ్పల్లిలో 2, మల్కాజిగిరిలో 6, ఇవే కాకుండా పంజగుట్టతో పాటు జంటనగరాలలో వివిధ ఠాణా పరిధి మొత్తం 117 దొంగతనాలకు పాల్పడ్డాడు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న ఇతడిని బుధవారం తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిను గుర్రపు పందాలు ఆడి త్వరగా కోటీశ్వరుడు కావాలనే ఉద్దేశంతో చోరీలు చేస్తున్నట్టు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించారు. నిందితుడి నుంచి పోలీసులు 40 ల్యాప్టాప్లు, 35 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్కు తరలించారు. -
కోట్ల ఆస్తి మొత్తం.. ఆ కోతిదే!
పిల్లలు లేని దంపతులు ఓ కోతిని కొడుకుగా భావించారు.. నిత్యం సవర్యలు చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా తమ ఆస్తి మొత్తాన్ని దాని పేరు మీద రాసేందుకు సర్వం సిద్ధం చేశారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో సబిష్ట (45) న్యాయవాదిగా పనిచేస్తుండగా ఆమె భర్త శ్రీవాత్సవ (48) చిన్నవ్యాపారాలు చేసుకుంటున్నారు. వారికి ఒక ఇల్లు, 200 చదరపు గజాల్లో నివాస స్థలంతోపాటు లక్షల్లో ఆస్తి ఉంది. కానీ వారికి పిల్లలు లేరు. తల్లిని కోల్పోయిన చిన్న కోతిపిల్ల ఒకటి 2004లో తమకు తారసపడటంతో దానిని తెచ్చుకుని పదేళ్లకు పైగా దాన్ని పెంచుకుంటున్నారు. దానికి "చున్మున్' అని నామకరణం చేసి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న చున్మున్ తాము చనిపోతే బతకలేదని, తమ తర్వాత కూడా అది ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలని భావించి.. తమ ఆస్తి మొత్తాన్ని దాని పేరిట రాస్తున్నట్లు తెలిపారు. పైగా అది తమ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే బాగా కలిసి వచ్చిందని చెబుతూ.. అందరిలాగే చైనీస్ ఫుడ్స్ తినడమే కాకుండా కూల్ డ్రింక్స్, టీ, కాఫీలాంటి వాటిని కూడా అది ఫుల్లుగా లాగించేస్తుందని వాళ్లు ముద్దుగా చెబుతున్నారు. మొత్తానికి చున్మున్ మాత్రం త్వరలోనే కోటీశ్వరురాలు కాబోతోందన్న మాట!! -
ఆ బిచ్చగాడు కోటీశ్వరుడు!
రియాద్: సౌదీ అరేబియాలో అడుక్కోవటం నిషేధం. అయితే అక్కడ అక్రమంగా ఉండటమే కాకుండా.. అరబ్ జాతీయుడైన ఓ వ్యక్తి భార్యా, ముగ్గురు పిల్లలతో కలిసి భిక్షమెత్తుకుంటూ సైతం పోలీసుల కంటపడ్డాడు. ఇంకేం.. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జస్ట్ ఫార్మాలిటీస్ కోసమని.. విచారించడంతో పాటు సోదాలు చేసేందుకని అతడి ఇంటికి వెళ్లారు. తీరా అతడి ఇంటిని చూస్తేనే పోలీసులకు కళ్లు తిరిగిపోయాయి. విలాసవంతమైన అపార్టుమెంట్తో పాటు ఖరీదైన కారు కూడా ఉండటం చూసి విస్తుపోయారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి సోదాలు చేయడంతో ఏకంగా రూ.1.80 కోట్ల విలువైన 12 లక్షల సౌదీ రియాల్స్ దొరకడంతో మరింత ఆశ్చర్యపోయారు. వీటితో పాటు ఓ గల్ఫ్ దేశంలో పెట్టుబడి పెట్టేందుకు అతడు ఇన్వెస్టర్ లెసైన్సు కూడా పొందడం చూసి ఔరా! అనుకున్నారు. చివరికి.. చట్టవ్యతిరేకంగా దేశంలో ఉండటంతోపాటు చట్ట వ్యతిరేకంగా అడుక్కున్న నేరానికిగాను కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని ఈ మేరకు ‘సౌదీ గెజిట్’ ఓ కథనంలో పేర్కొంది. అయితే ఆ కోటీశ్వర బిచ్చగాడు ఏ దేశానికి చెందినవాడు, వివరాలేంటి? అన్నది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. -
చార్లీ చానల్తో... అయ్యాడు మిలియనీర్!
అవకాశం మనిషిని అదృష్టవంతుడిని చేస్తుంది. అలాంటి అవకాశాన్ని వెదుక్కోవడం కాదు.. అవకాశాలను సృష్టించుకోవాలి.. అని చాలా మంది చెబుతుంటారు. అయితే కొందరు వివేక వంతులు ఈ వాక్యాన్ని ప్రాక్టికల్గా చేసి చూపిస్తుంటారు. అలాంటి వారిలో ఒకడు చార్లిమెక్ డొనాల్. ఎంటర్టైన్ మెంట్ కోసం చేసే పని నుంచి ఈ యువకుడు మిలియనీర్గా ఎదిగిన విధానంబెట్టిదనిన... యూట్యూబ్.. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొంటే.. అరుదైన వీడియోలు చూడొచ్చు, అవసరమైన సినిమాలను చూడొచ్చు... కావాల్సినంత వినోదం పొందవచ్చు. అందుకే చాలా మంది యూ ట్యూబ్ను ఇష్టపడుతుంటారు. అయితే చార్లీకి కూడా యూట్యూబ్ అంటే ఇష్టమే.. వీడియోలను చూడటానికో.. వాటిని డౌన్లోడ్ చేసుకోవడానికో కాదు.. వీడియోలను అప్లోడ్ చేయడానికి! దాని ద్వారా వచ్చే గుర్తింపు కోసం, ఫలితంగా వచ్చే డబ్బు కోసం యూ ట్యూబ్ను ఇష్టపడ్డాడు చార్లీ. ఇంగ్లండ్కు చెందిన చార్లీ ప్రస్తుత వయసు 23 సంవత్సరాలు. రెండు సంవత్సరాల కిందటి వరకూ చార్లీ అంటే ఒక సాధారణ యువకుడు. ఇప్పుడు అసాధారణ యువకుడు. యూత్లో యూట్యూబ్ ఫీవర్ను తన పవర్గా మార్చుకొన్నవాడితను. charlieissocoolike అనే యూట్యూబ్ చానల్ ద్వారా పేరు పొందినవాడు చార్లీ. ప్రస్తుతం ఈ యూట్యూబ్ చానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య దాదాపు 20 లక్షలు! ఈ చానల్లో చార్లీ పోస్టు చేసే ఏ వీడియోనైనా వారందరినీ చేరుతుంది. 2007 చార్లీ చానల్ తొలిసారి యూట్యూబ్లోకి రంగ ప్రవేశం చేసింది. తొలి రోజునుంచే చార్లీ చానల్ పాపులర్ అయ్యింది. యూట్యూబ్ వ్యూయర్స్ ఫేవరెట్ అయ్యింది. యూట్యూబ్లో పాపులర్ కావడం ఎలా అనే వీడియోను తొలిగా పోస్టుగా పెట్టాడు చార్లీ. ఈ వీడియోను యూట్యూబ్ సైట్ వారు మెచ్చి దాన్ని.. హోమ్పేజ్లో డిస్ప్లే చేశారు. దీంతో చార్లీ చానల్కు మంచి క్రేజ్వచ్చింది. రెండో రోజు కల్ల్లా చార్లీ చానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య నాలుగువేలకు పెరిగింది. సరదాగా కంపోజ్ చేసి, అప్లోడ్ చేసిన వీడియోకు అంత ఆదరణ దక్కేసరికి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు చార్లీ. దాన్ని అంతటిలో వదలకూడదని.. కొంచెం సీరియస్గా చానల్ పని మీద దృష్టిపెట్టాడు. యూట్యూబ్లో పోస్టు చేసే వీడియోలను వీడియోబ్లాగ్పోస్ట్స్ అని అంటారు. దీన్నే షార్ట్ఫామ్లో వ్లోగ్స్ అని కూడా అంటారు. ఇలాంటి వ్లోగ్స్తో యూట్యూబ్లో చార్లీ పేరు మార్మోగిపోయింది. ఇతడి చానల్కు మంచి పాపులారిటీ వచ్చింది. సొంత క్రియేటివిటీని ఉపయోగించి తనకు వీలున్నప్పుడల్లా కూర్చిన వీడియోలను చార్లీ అప్లోడ్ చేసేవాడు. 2008 ప్రారంభం కల్లా చార్లీ నుంచి రెగ్యులర్గా అప్లోడ్స్ అందుకునే వారి సంఖ్య 25,000కు చేరింది. యూట్యూబ్లో లభించిన పాపులారిటినీ కమర్షియల్గా మార్చుకోవడం గురించి ప్లాన్ వేసిన చార్లీ సమాజం గురించి వీడియో రూపంలోని విశ్లేషణ ప్రారంభించాడు. యూత్ను టార్గెట్గా చేసుకొని ‘ఫైవ్ ఆసమ్ గర్ల్స్,’‘ఫైవ్ ఆసమ్ బాయ్స్’ అనే విశ్లేషణాత్మకమైన వీడియోలను అప్లోడ్ చే శాడు. వాటికి మంచి గుర్తింపు వచ్చింది. చార్లీ చానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య లక్షల్లోకి వచ్చింది. 2011లో పదిలక్షల మార్కును, 2013 మేలో ఇరవై లక్షల మార్కును రీచ్ అయ్యింది చార్లీ యూట్యూబ్ చానల్. ఇప్పుడు చార్లీచానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య మిలియన్లలోకి చేరింది. అదే విధంగా అతడి ఆదాయం కూడా! యూట్యూబ్లో ఒక చానల్ పోస్ట్అయిన వీడియోల మధ్య డిస్ప్లే, ప్లే అయ్యే అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వచ్చే సొమ్ములో కొంత మొత్తాన్ని ఆ చానల్ యజమానికి ఇస్తుంది గూగుల్. యూట్యూబ్ చానల్లోకి ఒరిజినల్, ఓన్ వీడియోలను అప్ లోడ్ చేసే వారికి ఇదే ఆదాయమార్గం. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ద్వారా డబ్బు వస్తుంది. ఈ మార్గం ద్వారా చార్లీకి గత రెండు సంవత్సరాల నుంచి అనునిత్యం భారీస్థాయిలో డబ్బు వచ్చి పడుతూనే ఉంది. ఇతడు పోస్టు చేసిన వీడియోను కనీసం 20 లక్షలమంది క్లిక్ చేస్తారు. అన్నే సార్లు యాడ్స్ కూడా ప్లే అవుతాయి. వాటి ఫలితంగా యూట్యూబ్కు డబ్బు వస్తుంది. అందులోంచి గూగుల్ చార్లీకి వాటా ఇస్తుంది. ఈ విధంగా యూట్యూబ్ చానల్ ద్వారా మిలియనీర్ అయిన వారిలో చార్లీ ఒకడు. చార్లీకి ప్రత్యేకంగా టీమ్ అంటూ ఏమీ లేదు. చార్లీ, అతడి సృజనాత్మకత.. అంతే. ఈ విధంగా యూట్యూబ్ ద్వారా అవకాశాన్ని సృష్టించుకొన్నాడు, దాన్ని ఆదాయ వనరుగా మార్చుకొన్నాడు. చార్లీకే కాదు ఇప్పుడు యూట్యూబ్ అందరికీ అందుబాటులో ఉంది కదా మరి..!