Minister indrakaran Reddy
-
కవాల్ టైగర్ రిజర్వ్ వెబ్సైట్ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రకృతి రమణీయత, జలపాతాలు, ఎటుచూసినా ఆకుపచ్చని అటవీ అందాలతో అలరారుతున్న కవాల్ పులుల రక్షిత అటవీ ప్రాంతంపై అటవీ శాఖ ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించింది. పర్యాటకులు, సందర్శకులకు ఉపయోగకరమైన పూర్తి సమాచారంతో తయారుచేసిన సైట్ను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అరణ్యభవన్లో మంగళవారం ప్రారంభించారు. చదవండి: అక్కడ ‘కారు’ గెలుపు డౌటే!.. కారణం అదేనా? కవాల్ అటవీ ప్రాంతం ప్రత్యేకత, విస్తరించిన ప్రాంతాలు, జంతువులు, పక్షులు, చెట్ల జాతుల వివరాలు, సందర్శనీయ స్థలాలు, ఎకో టూరిజం ప్రాంతాలు, సఫారీ, అన్లైన్ బుకింగ్ వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కవాల్టైగర్.కామ్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కాగా... కవాల్ అటవీ ప్రాంతంలో అభివృద్ది చేసిన గడ్డి మైదానాలపై (గ్రాస్ లాండ్స్) ప్రత్యేక బుక్లెట్ను, రాష్ట్రంలో మరొక పులుల సంరక్షణ కేంద్రం అమ్రాబాద్ టైగర్ రిజర్వు వార్షిక నివేదికను సైతం మంత్రి విడుదల చేశారు. కవాల్ అభయారణ్యం సిబ్బంది బాగా పనిచేస్తున్నారన్న మంత్రి... ఫీల్డ్ డైరెక్టర్ వినోద్కుమార్ను అభినందించారు. ఇక్కడ ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన గడ్డి మైదానాలకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోందని, జాతీయ పులుల సంక్షణ సంస్థ (ఎన్టీసీఏ) నిపుణులు ప్రశంసించారని పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ తెలిపారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైశ్వాల్, అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్లు, వివిధ అటవీ సర్కిళ్ల అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులు
-
యాదాద్రి పనులు 90 శాతం పూర్తి
యాదగిరిగుట్ట: ‘యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పనులు 90 శాతం పూర్తయ్యాయి. కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం ఈ నెలాఖరు వరకు పూర్తవుతాయి. క్యూలైన్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి’అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పనులను పరిశీలించారు. అనంతరం హరిత హోటల్లో దేవాలయ అధికారులతో కలసి పెండింగ్ పనులపై సమీక్షించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ యాదాద్రి పనుల పురోగతిని వివరించారు. ధ్వజస్తంభం పనులు ఈ నెలాఖరు వరకు పూర్తవుతాయన్నారు. క్యూ కాంప్లెక్స్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. కొండ కింద పుష్కరిణి పనులు పూర్తయ్యాయని, గండి చెరువు, కల్యాణ కట్ట 90 శాతం పూర్తయ్యాయని, అలాగే ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం పూర్తయిందని మంత్రి వెల్లడించారు. మార్చి 20 వరకు కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుందన్నారు. ఆలయ ప్రారంభ సమయానికి అన్నప్రసాద మండపం పూర్తి కాకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆలయ ప్రారంభంనాటికి ఏమైనా పనులు పెండింగ్లో ఉంటే అవి తరువాత నిరంతరం కొనసాగుతాయని మంత్రి చెప్పారు. యాగం నిర్వహణకు సంబంధించిన సామగ్రి, ఆరువేల మంది రుత్వికుల జాబితా సిద్ధమైందని వివరించారు. సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణ తిరుపతిగా అవతరించ బోతోందని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. మార్చి 21వ తేదీ నుంచి 1,008 హోమ కుండాలతో మహా సుదర్శన యాగం, 28వ తేదీన శాస్త్రోక్తంగా మహా కుంభ సంప్రోక్షణతో భక్తులకు స్వయంభూ దర్శనాలు కలుగుతాయని చెప్పారు. -
కేసీఆర్ దృష్టికి తీసుకెళతా!
‘‘ప్రపంచ ప్రఖ్యాత నిర్మల్ బొమ్మల నేపథ్యంలో, అంతరించిపోతున్న హస్తకళలు, కళాకారుల గురించి కృష్ణకుమార్ తీసిన ‘రాధాకృష్ణ’ను అంతా ఆదరించాలి’’ అని తెలంగాణ పర్యావరణ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. ‘ఢమరుకం’ శ్రీనివాసరెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందింది. టి.డి. ప్రసాద్ వర్మ దర్శకత్వంలో పుప్పాల సాగరికా కృష్ణకుమార్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో మంత్రి మాట్లాడుతూ–‘‘పూర్తిగా తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోనే చిత్రీకరించిన సినిమా ఇది. అందులోనూ నిర్మల్ కళాకారుల కష్టాల నేపథ్యంలో మంచి ఆశయంతో తీసినందున ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీనుకెళ్తాను’’ అన్నారు. ‘‘శ్రీనివాస్రెడ్డి పట్టుబట్టి ఈ సినిమాలో నాతో ఒక పాత్ర చేయించారు’’ అన్నారు ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. ‘‘కేవలం ప్రేమకథా చిత్రంగానే కాక అంతరించి పోతున్న హస్తకళలను బ్రతికించాలని ఒక మంచి సందేశాన్ని ‘రాధాకృష్ణ’లో ఇస్తున్నాం’’ అన్నారు దర్శకుడు శ్రీనివాసరెడ్డి. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు పుప్పాల సాగరిక కృష్ణకుమార్. ప్రసాద్ వర్మ, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, నటుడు అలీ, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తదితరులు మాట్లాడారు. -
ఆలయాలకు భక్తులు రావొద్దు..
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ చైనా నుంచి 180 దేశాలకు వ్యాపించిందని చెప్పారు. తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్ట చర్యలకు ఆదేశించారని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను క్వారంటైన్ కు తరలిస్తున్నామని పేర్కొన్నారు. దేవాలయాల్లో రద్దీ తక్కువ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించామని చెప్పారు. నిన్నటి నుంచి అన్ని ఆలయాల్లో భక్తులకు అనుమతులు నిలిపివేశామన్నారు. (కరోనా అలర్ట్: 271కి చేరిన బాధితుల సంఖ్య) దేవాదాయ శాఖ కార్యాలయంలో పంచాంగ శ్రవణం ప్రతి ఏటా ఉగాది పంచాంగ శ్రవణం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో జరిగేందని.. కానీ ఈ ఏడాది దేవాదాయ శాఖ కార్యాలయంలో జరుగుతుందన్నారు. లైవ్ ద్వారా మాత్రమే భక్తులు పంచాంగ శ్రవణం వినాలని సూచించారు. కరోనా కట్టడికి చర్యల్లో భాగంగా శ్రీరామనవమి ఉత్సవాలు కూడా ఆడంబరాలు లేకుండా జరిపేవిధంగా ఆదేశాలిచ్చామని తెలిపారు. తక్కువ మంది మాత్రమే శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరవుతారని పేర్కొన్నారు. (‘దగ్గు, గొంతు నొప్పి.. ఆ తర్వాత కరోనా’) -
వేద విద్య ప్రోత్సాహానికి పాఠశాలలు: ఇంద్రకరణ్
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, పూజారులు, వేద పండితులు, సిద్ధాంతుల సంక్షేమానికి పాడుతోందని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ, భాషా సాంస్కృతిక శాఖలు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సహకారంతో రెండు రోజుల తెలంగాణ జ్యోతిష మహాసభలు–2018 సోమవారం రవీంద్రభారతిలో ప్రారంభమయ్యాయి. వేదవిద్యను ప్రోత్సహించేందు కు రాష్ట్రంలో అవసరమైనన్ని వేద పాఠశాలలు ప్రారంభించనున్నట్లు మంత్రి చెప్పారు. విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ, జ్యోతిష మహాసభలు సమాజ శ్రేయస్సుకు, రాష్ట్ర సంక్షేమానికి తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ అభినవోద్ధండ విద్యాశంకర భారతీస్వామి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ సనాతన జ్యోతిశ్శాస్త్ర విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు యాయ వరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి మాట్లాడుతూ, ఈ మహాసభలు రాబోయే పండుగల తేదీలపై ఏకాభిప్రాయం సాధించేందుకు దోహదపడతాయన్నారు. జ్యోతిశ్శాస్త్ర వైభవమ్ విశిష్ట సంచికను ఆవిష్కరించి తొలి ప్రతిని గాయత్రీ పీఠం తత్త్వానంద రుషికి అంద జేశారు. కార్యక్రమంలో ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకుడు మరుమాముల వేంకటరమణ శర్మ, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి సముద్రా ల వేణుగోపాలాచారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు బోర్పట్ల హనుమంతాచార్య, కవేలి అనంతాచార్యులు, కృష్ణమాచార్య సిద్ధాంతి, అంతర్వేది కృష్ణమాచార్యులు, తెలంగాణ విద్వత్సభ ఉపాధ్యక్షుడు ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతి తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 2 నుంచి లాయర్లకు హెల్త్కార్డులు
సాక్షి, హైదరాబాద్: న్యాయవాదుల సంక్షేమనిధి కోసం గతంలో కేసీఆర్ సర్కార్ కేటాయించిన రూ.వంద కోట్లపై వచ్చిన రూ.23 కోట్ల వడ్డీని న్యాయవాదుల సంక్షేమానికి వెచ్చి ంచాలని తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ నిర్ణయించింది. శనివారం సచివాలయం లో న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన ట్రస్ట్ సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న లాంఛనంగా న్యాయవాదులకు హెల్త్కార్డులు జారీ చేస్తామన్నారు. అదేరోజు మూడు కీలక పథకాలను ప్రారంభిస్తామని చెప్పారు. న్యాయవాదికి రూ.2 లక్షల మేరకు ఆరోగ్య బీమా కల్పించాలని, ప్రమాదంలో మరణిస్తే ప్రమాద బీమా పథకం కింద కుటుంబసభ్యులకు రూ.10 లక్షల ఆర్థిక సా యం చేయాలని సమావేశం నిర్ణయించిందని చెప్పారు. -
పులకించిన భద్రగిరి
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి కల్యాణం సోమవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. రామాలయ సమీపంలోని మిథిలా ప్రాంగణంలో శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకను కనులారా చూసిన భక్తులు పులకించిపోయారు. వేడుకలో భాగంగా మొదట గర్భగుడిలో అభిషేకం జరిపించారు. అక్కడ ధ్రువమూర్తులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆ తర్వాత వేద పండితుల మంత్రోచ్ఛరణలు, ఆలయ ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. భక్త రామదాసు చేయించిన బంగారు నగలను ధరించిన శ్రీసీతారాముల వారు చూడముచ్చటగా కనిపించారు. ఉదయం 10 గంటల నుంచి ఆలయ వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణ తంతు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తంలో జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవ విగ్రహాల శిరస్సులపై ఉంచారు. భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో మాంగల్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తలంబ్రాలు పోసే వేడుకను జరిపించారు. భద్రాద్రి క్షేత్ర మహత్మ్యం, శ్రీసీతారాముల కల్యాణ విశిష్టతను వేద పండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు భక్తులకు వివరించారు. మార్మోగిన రామనామస్మరణం శ్రీసీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి తరలివచ్చారు. సుమారు 1.50 లక్షల మంది కల్యాణాన్ని తిలకించారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి కల్యాణ వేడుక తంతు జరుగుతున్నంత సేపూ మిథిలా ప్రాంగణం రామనామస్మరణంతో మార్మోగింది. ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి శ్రీసీతారాముల వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువస్త్రాలు తీసుకొస్తారని ప్రకటించినప్పటికీ.. చివరి క్షణాల్లో ఆయన పర్యటన రద్దయింది. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున జేఈవో శ్రీనివాసరాజు శ్రీసీతారాముల వారికి పట్టువస్త్రాలను అందజేశారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కల్యాణోత్సవాన్ని వీక్షించారు. స్వామివారికి కల్యాణం జరిగిన వేదికపైనే మంగళవారం పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి ప్రత్యేక నిధులు
ఆర్మూర్ : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించ నుందని, ప్రతి మున్సిపాలిటీకి రూ.50 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకు కేటాయింపులుంటా యని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణాభివృద్ధికి మంజూరైన రూ.25 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు, భవిష్యత్లో మంజూరు కానున్న మరో రూ.25 కోట్ల తో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పట్టణం లోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఆదివారం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వాతి సింగ్ అధ్యక్షతన క్షత్రియ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ఇంద్రకణ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజల అభిప్రాయాలను సేకరించి నిధు ల కేటాయించడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలో సిద్దుల గుట్టతో పాటు మరో 50 ఆలయాలకు నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పేదలు ఆత్మగౌరవం తో జీవించాలనే లక్ష్యంతో చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు త్వరలో పూర్తవుతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు చేపట్టిన పనులను సీడబ్ల్యూసీ కమిటీ ప్రతినిధులు చూసి కితాబునిచ్చారన్నారు. 2019–20 సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లకు పెరగనుందన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి పనుల తరువాత సంక్షేమానికి పెద్ద పీట వేయనున్నారన్నారు. ఆర్మూర్ కోర్టులో కేసుల పెండెన్సీ ఉంటే సబ్ కోర్టును మంజూరు చేస్తామన్నారు. అభివృద్ధిలో అన్ని వర్గాల భాగస్వామ్యం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఆర్మూర్ మున్సిపాలిటీని ఆదర్శం గా నిలిపేవిధంగా అభివృద్ధి చేస్తామన్నారు. గత పాలకులు పట్టణాభివృద్ధిని విస్మరించారన్నారు. కానీ ప్రస్తుతం పట్టణంలో రూ.31 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. త్వరలో మరిన్ని నిధులు మంజూరవుతాయని, పట్టణ రూపు రేఖలు మారిపోనున్నాయన్నారు. అన్ని వర్గాల వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని, ఎమ్మెల్యే జీవన్రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, కౌన్సిలర్లు, న్యాయవాదులు, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు, ఐఎంఏ ప్రతినిధులు, మర్కజి కమిటీ ప్రతినిధులు, కుల, యువజన సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి పెద్దపీట మాక్లూర్(ఆర్మూర్) : ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని మామిడిపల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న శ్రీఅపురూప వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వంటశాల గదిని ప్రారంభించారు. ఆలయ ఆవరణలో కల్యాణ మండపం నిర్మాణానికి రూ.50 లక్షలు మాంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడుతూ సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు మాంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గం గోని సంతోష్, ఎంపీటీసీ సభ్యులు ఎనుగం టి లక్ష్మీ, ఎంపీపీ గురిజాల శిరీష, ఆలయ చైర్మన్ అమృతలత, మాజీ జెడ్పీటీసీ సభ్యు లు ఆకుల విజయ, భక్తులు పాల్గొన్నారు. -
డబుల్ వేగం..!
నియోజకవర్గాలకు ఇళ్ల కేటాయింపు ఇలా నిర్మల్ : 1400 ముథోల్ : 1400 ఖానాపూర్ : 560 మొత్తం : 3,360 పరిపాలన ఆమోదం : 2,626 టెండర్లు పిలిచినవి : 1,740 టెండర్లు పూర్తయినవి : 533 నిర్మాణం పూర్తయినవి : 45 నిర్మాణంలో ఉన్నవి : 24 శంకుస్థాపన చేసినవి : 160 నిర్మల్ : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తోంది. ఇప్పటివరకు కాంట్రాక్టర్ల సమస్యతో జిల్లాలో ఈ పథకం నత్తకే నడక నేర్పేలా సాగుతోంది. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న తన ఇలాఖాలోనే ఇళ్ల నిర్మాణంలో వెనుకంజలో ఉండడంపై అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సీరియస్గా దృష్టిపెట్టారు. ఇక జిల్లాలో ఎలాగైన ఈ పథకం విజయవంతం చేయాలన్న లక్ష్యంతో ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ‘డబుల్’ స్పీడ్ పెంచేలా అధికారులతో ఇటీవలే సమీక్షించారు. ఈమేరకు ఆదివారం నిర్మల్లో 160ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. త్వరలో మరిన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించనున్నట్లు పేర్కొ న్నారు. ఏడాదిలోపే నిర్మాణా లను పూర్తిచేసి అర్హులందరికీ అందిస్తా మని చెప్పారు. ఈక్రమంలో పేదల ఆశలూ ‘డబుల్’ అయ్యాయి. స్పీడ్ పెంచాల్సిందే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మే రకు అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో జిల్లా చాలా వెనుకబడి ఉంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 3,360 ఇళ్లు కేటాయించారు. ఇందులో 2,626 గృహాలకు మాత్రమే పరిపాలన అనుమతులు లభించాయి. ఇందులో 1,763 ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పిలవగా 533 మాత్రమే టెండర్ ఆమోదం పొందాయి. ఇక ఇందులో ఇప్పటివరకు కేవలం 45ఇళ్లు మాత్రమే పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. మరో 24 ఇళ్లు నిర్మాణదశలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన 45ఇళ్లు, నిర్మాణంలో ఉన్న 24ఇళ్లు కూడా నిర్మల్ రూరల్మండలంలోని మంత్రి స్వగ్రామం ఎల్లపెల్లిలోనివే. జిల్లాలో మరెక్కడా ఇప్పటివరకు నిర్మాణాలు చేపట్టలేదు. కాంట్రాక్టర్లే అసలు సమస్య.. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు టెండర్లు పిలవగానే మొదట్లో కాంట్రాక్టర్లు క్యూకట్టారు. తీరా.. ప్రభుత్వం ఇస్తున్న నిధులతో క్షేత్రస్థాయిలో నిర్మించాలంటే ఎదురవుతున్న ఇబ్బందులతో ఒక్కొక్కరూ ముఖం చాటేశారు. ప్రభుత్వం ఒక్కో ఇంటిని రూరల్ ఏరియాలో రూ.5.04లక్షలతో, అర్బన్లో రూ.5.30లక్షలతో నిర్మించాలంటోంది. ఈ పరిధిలో ప్రస్తుత మార్కెట్లో కష్టమంటున్నారు కాంట్రాక్టర్లు. ఒక్కో ఇల్లుకు కనీసం రూ.6.50లక్షల వరకు ఖర్చవుతుంది. ఇక పన్నులు వ్యాట్ నుంచి జీఎస్టీకి మారినా ప్రభుత్వం పర్సంటేజీ పెంచకపోవడమూ కాంట్రాక్టర్ల వెనుకంజకు కారణమవుతోంది. వ్యాట్ అమలులో ఉన్నప్పుడే తాము నష్టపోతామని వెనుకంజ వేసిన కాంట్రాక్టర్లు ప్రభుత్వం వ్యయం పెంపుపై స్పందించకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకపోవడంతో విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో జిల్లాలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపడతామని టెండర్ తీసుకున్న ఏఎన్ కన్స్ట్రక్షన్ కంపెనీ పత్తాలేకుండా పోయింది. దీంతో అధికారులు మళ్లీ కొత్త కాంట్రాక్టర్లను సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రికి ప్రతిష్టాత్మకం.. రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రిగా ఉన్న అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తన ఇలాఖాలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈనేపథ్యంలోనే టెండర్ తీసుకున్న కాంట్రాక్టర్ వెనుకంజ వేసినా.. జిల్లాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్రెడ్డిని ఒప్పించి, తన స్వగ్రామం, దత్తత గ్రామమైన ఎల్లపెల్లిలో 45ఇళ్ల నిర్మాణాలను చేపట్టేలా చేశారు. సదరు కాంట్రాక్టర్ సైతం ఈ ఇళ్లను శరవేగంగా సకల హంగులతో పూర్తి చేసి ఇచ్చారు. అదే గ్రామంలో మరో కాంట్రాక్టర్తో 24ఇళ్లను మంత్రి నిర్మింపజేయిస్తున్నారు. ఇక తమ స్వగ్రామానికే పథకాన్ని పరిమితం చేశారన్న విమర్శలు రావడంతో జిల్లావ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నిర్మల్లో 160ఇళ్లకు.. అర్బన్ ప్రాంతమైన నిర్మల్లో ఈనెల 28న 160 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి శంకుస్థాపన చేశారు. పట్టణ శివారులోని బంగల్పేట్ మహాలక్ష్మి మందిరం సమీపంలో వీటి నిర్మాణం కోసం స్థలం కేటాయించారు. నిర్మల్ నియోజకవర్గానికి 1400 ఇళ్లు కేటాయించారు. ఇందులో 1,226 నిర్మాణాలకు పరిపాలన అనుమతులు లభించాయి. ఎల్లపెల్లిలో 45 నిర్మాణాలు పూర్తికాగా, 24ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. తాజాగా ఆదివారం నిర్మల్లోని బంగల్పేట్ శివారులో మరో 160ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. త్వరలోనే వీటి నిర్మాణాలు ప్రారంభించేలా చూస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎల్లపెల్లిలో ఎదురుచూపులు.. ఎల్లపెల్లిలో 45ఇళ్లను విశాలంగా నిర్మించారు. ఒక్కో ఇంటిలో హాల్, కిచెన్తోపాటు రెండు పడక గదులు నిర్మించారు. అండర్గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టం, అన్ని ఇళ్లకూ కామన్గా సెప్టిక్ట్యాంకును ఏర్పాటు చేశారు. ఇదంతా బాగానే ఉంది. కానీ.. ఇళ్ల నిర్మాణం పూర్తయి నెలలు గడిచిపోయాయి. లబ్ధిదారుల ఎంపికను మొదటి గ్రామసభలో పూర్తిచేశారు. మొత్తం 45మంది లబ్ధిదారులతో కూడిన జాబితానూ రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. గత కలెక్టర్ ఈ జాబితాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడంతో అలా ఆగిపోయింది. కొత్త కలెక్టర్ ప్రశాంతి వచ్చాక పూర్తయిన ఇళ్లు, లబ్ధిదారుల జాబితానూ పరిశీలించినట్లు తెలిసింది. కానీ ఇప్పటికీ ఇళ్ల పంపిణీ మాత్రం చేపట్టడం లేదు. త్వరలో రెండో గ్రామసభ పెట్టి ఈ ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టేందుకే ఆపారని అధికార పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. -
నిర్మల్ బస్టాండ్లో మంత్రి తనిఖీ
నిర్మల్టౌన్ : ∙నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ను ఆదివారం రాష్ట మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తనిఖీ చేశారు. సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. బస్సు సర్వీసుల సేవలపై ఆరా తీశారు. బస్సుల వేళల్లో సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా? అని ప్రయాణికులను అడిగారు. ప్రయాణికులు తమ సమస్యలు మంత్రి ఐకేరెడ్డి దృష్టికి తీసుకురాగా, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాయకులు అప్పాల గణేశ్, ముత్యంరెడ్డి, పాకాల రాంచందర్, కౌన్సిలర్ నేల్ల అరుణ్, తోట నర్సయ్య తదితరులున్నారు. -
అర్చకుల వేతన సవరణలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: దేవాలయ ఉద్యోగులు, అర్చకుల వేతన సవరణ వ్యవహారం గందరగోళంగా మారింది. ప్రభుత్వం ముందు ప్రకటించినట్టుగా కాకుండా అమలు వేరే రకంగా ఉందంటూ అర్చక, ఉద్యోగులు శుక్రవారం రాత్రి వరకు దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మధ్యాహ్నం అదే కార్యాలయంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారిలను సన్మానించిన ఆ ప్రతినిధులు.. తర్వాత వాస్తవం తెలిసి అదే కార్యాలయం ముందు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మేలు చేసేలా వ్యవహరిస్తే, అధికారులు మాత్రం ఆయన హామీకి విరుద్ధంగా తమకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన ప్రారంభించారు. అధికారులకే అస్పష్టత...! దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతన సవరణకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీర్ఘకాలంగా దేవాలయ అర్చక, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడంతో ముఖ్యమంత్రి స్పందించారు. ఈ మేరకు చట్టసవరణ జరిగి డిసెంబర్ 1 నుంచే కొత్త వేతనాలను చెల్లించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఇంతకాలం ఏ ఆలయంలో ఉద్యోగులు, అర్చకులకు ఆ ఆలయ ఆదాయం నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు. అలా కాకుండా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి నేరుగా ప్రభుత్వమే ఉద్యోగులు, అర్చకుల బ్యాంకు ఖాతాలకు ఒకటో తేదీనే జమ చేసేలా, పీఆర్సీ అమలు చేసేలా నిర్ణయం ఉందని అంతా భావించారు. శుక్రవారం మధ్యాహ్నం చెక్కు అందజేసే కార్యక్రమానికి రావాల్సిందిగా పేర్కొనటంతో 88 మంది ప్రతినిధులు కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారిలు ఆంధ్రాబ్యాంకు ప్రతినిధులకు చెక్కు అందజేశారు. వెంటనే ఉద్యోగులు, అర్చక ýప్రతినిధులు ఆ ఇద్దరిని సన్మానించి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. వారు వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసి ఆగ్రహానికి గురయ్యారు. చాలా వివరాలకు అధికారుల వద్దనే స్పష్టత లేదని, అంతా గందరగోళం చేసి తమను వంచించారని వారు ఆరోపించారు చారిత్రక దినం.. దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ మేరకు ఆలయ ఉద్యోగులు, అర్చకులకు వేతన సవరణ అమలు చేస్తున్నందున డిసెంబరు ఒకటి చారిత్రక దినంగా నిలిచిపోతుందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అంతకుముందు వ్యాఖ్యానించారు. సీఎం తీసుకున్న సానుకూల నిర్ణయం అర్చక, ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగు నింపుతుందని రమణాచారి పేర్కొన్నారు. ఈ సవరణ మహోన్నత నిర్ణయమని తెలంగాణ అర్చక సమాఖ్య నేతలు ఉపేంద్రశర్మ, రామశర్మలు పేర్కొన్నారు. రెండు వేల మందికే వర్తింపు ఇప్పటి వరకు ఆలయాల నుంచి తీసుకుంటున్న వేతనాలను ఆలయాల నుంచే తీసుకోవాలని, సవరణతో పెరిగే మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం వారి ఖాతాలకు జమ చేస్తుందని అధికారులు పేర్కొనడంతో కంగుతినడం అర్చకుల వంతయింది. ఇక వేతన సవరణ అమలు కావాల్సిన 5,200 మందిలో కేవలం 2 వేల మందికే ప్రస్తుతం వర్తింపజేస్తున్నారని, మిగతావారి విషయంలో సాంకేతిక కారణాలతో తర్వాత పరిశీలిస్తామని అధికారులు చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారు. ఇక 2015 పీఆర్సీ పరిధిలో ఉన్నవారి సవరణ అంశాన్నీ పక్కన పెట్టారు. మళ్లీ దేవాలయాల నుంచి వేతనాలు పొందే విషయంలో స్థానిక కార్యనిర్వహణాధికారులు, పాలక మండళ్లతో వేధింపులు ఎదురవుతున్నాయని మొత్తుకుంటే ఇప్పుడు మళ్లీ వారి నుంచే వేతనాలు పొందాలని మెలిక పెట్టడం వెనక అధికారుల కుట్ర ఉందని అర్చక, ఉద్యోగ ప్రతినిధులు ఆరోపిస్తూ వెంటనే కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా ప్రారంభించారు. సీఎం సానుకూలంగా స్పందిస్తే అధికారులు కుట్ర చేసి ఆయన ఆలోచనను నీరుగార్చారని పేర్కొంటూ జేఏసీ నేత గంగు భానుమూర్తి ఆధ్వర్యంలో ధర్నా జరిపారు. చివరకు అదనపు కమిషనర్లు శ్రీనివాసరావు, కృష్ణవేణి సోమవారం కమిషనర్తో చర్చించవచ్చని పేర్కొనటంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు. -
ఆలయాల్లో అద్దెలు స్వాహా!
సాక్షి, హైదరాబాద్: అది హైదరాబాద్ నగరంలో శంకరమఠం పేరుతో నిర్వహిస్తున్న ఆధ్మాత్మిక కేంద్రం. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ మఠం కింద 55 దుకాణాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఒక్కో దుకాణానికి రూ.10 వేల వరకు నెలవారీ అద్దె ఉంది. వెరసి మఠానికి ఏటా రూ.60 లక్షలకుపైగా అద్దె వసూలుకావాలి. కానీ దేవాదాయశాఖ ఖజానాకు చిల్లిగవ్వ కూడా జమకావడం లేదు. ఆ సొమ్మంతా ప్రైవేటు వ్యక్తులు, కొందరు అధికారులు కలసి స్వాహా చేసేస్తున్నారు. ఓ మంత్రి పేరు చెప్పి కొందరు స్థానిక నేతలు, అధికారులు ఈ అద్దె సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయశాఖ ఇప్పటివరకు నామమాత్రంగా 20 వరకు నోటీసులు జారీ చేసింది. కానీ నయాపైసా కూడా జమ చేయించలేకపోయింది. నగరంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న చాలా దేవాలయాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. ఈ అద్దెల సొమ్ము ఎటుపోతోందో శాఖ కమిషనర్కు కూడా తెలియని పరిస్థితి నెలకొనడం గమనార్హం. లెక్కలే లేవు.. అసలు దేవాదాయశాఖకు ఎన్ని దుకాణాలున్నాయి, వాటిలో ఎన్నింటిని లీజుకిచ్చారు, ఎన్నింటిని నేరుగా అద్దెకిచ్చారు, వాటి రూపంలో దేవాదాయశాఖ ఖజానాకు రావాల్సిన మొత్తం ఎంత.. అనే లెక్కలేవీ దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో నమోదై లేవు. వెరసి ఏటా దేవుడి ఖజానాకు రావాల్సిన రూ.కోట్ల మొత్తం అధికారులు, కొందరు నేతల జేబుల్లోకి చేరుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఈ తంతును గుర్తించి నోరెళ్లబెట్టారు. వెంటనే దుకాణాల అద్దె, లీజులకు సంబంధించి పూర్తి లెక్కలు సమర్పించాలని ఆదేశించారు. కానీ నెలన్నర గడిచినా ఇప్పటివరకు అధికారులు లెక్కలు సిద్ధం చేయలేదు. కోట్ల కొద్దీ స్వాహా రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల అధీనంలో పెద్ద ఎత్తున భూములు, భవనాలు ఉన్నాయి. గ్రామాల్లో ఎకరాల కొద్దీ భూములు ఉండగా... పట్టణాలు, నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ఆలయాల పరిధిలో ఖాళీ భూములతోపాటు దుకాణాలు ఉన్నాయి. పలుచోట్ల ఈ భూములు, దుకాణాలను లీజులకు ఇవ్వగా.. మరికొన్ని చోట్ల నెలవారీగా అద్దెకిచ్చి ప్రతినెలా అద్దె సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇలా వందల సంఖ్యలో దుకాణాలు ఉన్నాయి. వాటి అద్దె రూపంలో ఏటా రూ.కోట్లు వసూలవుతాయి. ఆ సొమ్మును కాజేసేందుకు అలవాటు పడ్డ అధికారులు.. అసలు వాటికి లెక్కలే లేకుండా చేశారు. కొన్నేళ్లుగా దేవాదాయ శాఖకు పూర్తిస్థాయి కమిషనర్ లేక ఇన్చార్జి అధికారి పర్యవేక్షణలో కొనసాగుతోంది. దాంతో లెక్కలు అడిగే వారు లేకపోవటం, ప్రభుత్వం దేవాదాయ శాఖను నిర్లక్ష్యం చేయటంతో.. అధికారులు అద్దెల సొమ్మును స్వాహా చేయడం ప్రారంభించారు. దేవాలయాలు, దేవాదాయశాఖ అధీనంలో ఉన్న మఠాలకు నగరంలో వందల సంఖ్యలో దుకాణాలున్నా.. వాటి అద్దెలు, లీజుల రూపంలో ఎంతమొత్తం వసూలవుతోందో తెలియని గందరగోళం ఉంది. కొన్ని దేవాలయాల్లో అవకతవకల తీరిదీ.. - సికింద్రాబాద్లో బోనాల సందర్భంగా భారీ జాతర సాగే అమ్మవారి దేవాలయం దుకా ణాల్లో భారీ గోల్మాల్ జరుగుతోంది. వాణి జ్యపరంగా మంచి కేంద్రం కావడంతో దుకా ణాల అద్దె భారీగా ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా ఆ అద్దెల వివరాలను రికార్డుల్లో నమోదు చేయటం లేదు. వాటి కాగితాలూ మాయమయ్యాయి. - జూబ్లీహిల్స్లోని మరో అమ్మవారి దేవాలయా నికి చెందిన దుకాణాల వివరాలెక్కడా పొందుపరచలేదు. అక్కడ ఎంతమొత్తం వసూలవుతుందో తెలియని పరిస్థితి. - అమీర్పేటలో మంచి సెంటర్లో ఉన్న అమ్మవారి ఆలయానికి సంబంధించి రికార్డుల్లో ‘ప్రైవేట్ నెగోషియేషన్’అని మాత్రమే రాశారు. ఎవరి అధీనంలో దుకాణాలున్నాయో వివరాల్లేవు. - రెజిమెంటల్ బజార్లోని ఓ శివాలయం దుకాణాల అద్దెలకు సంబంధించి కొన్నేళ్లుగా లెక్కలు రాయడం లేదు. - సికింద్రాబాద్లో ఉన్న ఓ ధర్మశాల, షేక్పేట ద్వారకానగర్లోని మరో దేవాలయం, అమీర్పేట, భోలక్పూర్, పాన్బజార్, ముషీరాబాద్, ఎల్లారెడ్డిగూడల్లోని ఐదు దేవాలయాల పరిధిలోని దుకాణాలను అనధికారికంగా అద్దెకిచ్చి ఆ మొత్తాన్ని ఖజానాకు జమకట్టడం లేదు. - లాలాగూడలోని ఓ దేవాలయం దుకాణాలను 25 ఏళ్లపాటు లీజుకిచ్చినట్టు రికార్డుల్లో రాసి ఉంది. కానీ లీజు ఎప్పటితో పూర్తవుతుందనే వివరాలను మాత్రం గల్లంతు చేశారు. లీజు మొత్తం ఎంతో కూడా లేకపోవడం గమనార్హం. - కవాడిగూడలోని ఓ ఆలయం దుకాణాల లీజు 2012లో పూర్తయినట్టు రికార్డుల్లో చూపారు. తర్వాత ఆ దుకాణాలు ఎవరి అధీనంలో ఉన్నాయి. వాటి అద్దె ఎంత, లీజుకిచ్చారా లేదా అన్న వివరాలు పొందుపరచలేదు. ఆ మేరకు సొమ్మును పక్కదారి పట్టించేస్తున్నారు. -
సచివాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని సి-బ్లాక్ ఎదుట ఓ రైతు శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దేవన్న (37)కు ప్రభుత్వం చెరువు పక్కన గతంలో మూడెకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో ఇందిరమ్మ పచ్చతోరణం కార్యక్రమం కింద మామిడి, జామ చెట్లు పెంచుకుంటున్నాడు. చెరువు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దేవన్న కొంత భూమిని కోల్పోయాడు. భూమికి బదులు భూమి ఇప్పించాలంటూ కొన్నాళ్ళుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం భార్య లలిత, ఇద్దరు పిల్లలతో కలసి సచివాలయం వద్దకు వచ్చాడు. మంత్రి హరీశ్రావును కలవాలని భావించాడు. మూడేళ్ళుగా అధికారుల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగటం లేదంటూ సూసైడ్ నోట్ రాశారు.‘నా చావుకు కారణం ఎమ్మెల్యే విఠల్రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జాయింట్ కలెక్టర్ శివ లింగయ్య’అని అందులో పేర్కొన్నారు. తనకు తిండి, నీరు, ఉపాధి లేకుండా చేసి వేధిస్తున్నారంటూ ఆరోపించాడు. దళితులకు న్యాయం చేయాలని సీఎంను వేడుకున్నాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులకు కూడా లేఖ రాశాడు. ప్రజారాజ్యం పార్టీ కోసం నా జీవితం మొత్తం నాశనం చేసుకున్నానని పార్టీ కోసం పని చేసిన పుణ్యానికి నా తండ్రిని, కొడుకుని పోగొట్టుకున్నానని పేర్కొన్నాడు. నేను చనిపోయిన తర్వాత నా భార్య బిడ్డలను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ను కోరారు. టాయిలెట్ క్లీనర్ తాగిన దేవయ్యను పోలీసులు మాక్స్క్యూర్ ఆస్పత్రికి తరలించారు. దేవయ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
లబ్ధిదారుల ఎంపిక వేగిరం
డబుల్ బెడ్రూం ఇళ్లపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ఖరారైన ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపికను చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో జాప్యం ఉండొ ద్దన్నారు. ఈ పథకంలో 50,959 ఇళ్ల నిర్మా ణానికి మొదట విడతలో ప్రధాని ఆవాస్ యోజన కింద కేంద్రం రూ.190.66 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్లు, రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు పనితీరుపై బుధవారం ఆయన సమీక్ష జరిపారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటోందని, కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతున్నారని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకు 94,250 ఇళ్ల నిర్మాణానికి పాలనపరమైన అనుమతులు వచ్చా యని, 83,087 ఇళ్లకు టెండర్లు పిలవగా 41,925 ఇళ్లకు ఖరారైనట్లు చెప్పారు. ప్రస్తుతం 20,986 ఇళ్ల పనులు కొనసాగు తున్నాయని, 1,629 ఇళ్లు సిద్ధమయ్యాయని వివరించారు. ఇప్పటివరకు రూ.202.85 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గృహ నిర్మాణ మండలి రూ.1,066.94 కోట్లతో చేపట్టే 13 ప్రాజెక్టులకు త్వరగా డిమాండ్ సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ఇంద్రకరణ్రెడ్డి ఆదేశించారు. కూకట్పల్లిలోని 200 ఎంఐజీ ప్లాట్ల నోటిఫికే షన్కు స్పందన రానందున మరోసారి డిమాండ్ సర్వే నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. హౌసింగ్ బోర్డు ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన రూ.207.98 కోట్ల బకాయిలను వసూలు చేయాలని ఆదేశిం చారు. జేఎన్టీయూకు లీజుకిచ్చిన భూమి లో కొంతభాగం ఓ ప్రైవేటు సొసైటీ ఆక్ర మణలో ఉందని, దాన్ని స్వాధీనం చేసుకోవా లని ఆదేశించారు. లీజు గడువు ముగిసిన వాటి వివరాలను అందజేయాలన్నారు. జేఎన్టీయూ చెల్లించాల్సిన రూ.10.53 కోట్ల లీజు రెంట్కు సంబంధించి ఆ వర్సిటీ వీసీ, ఉన్నత విద్యా శాఖ మంత్రి, స్పెషల్ సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. -
‘కూతురమ్మ’కు అండగా నిలుస్తాం..
‘సాక్షి’ కథనానికి విశేష స్పందన.. నిర్మల్ రూరల్: తనను కన్నవాళ్లకే అమ్మగా మారి.. తల్లిదండ్రులను పిల్లలుగా భావించి సేవలం దిస్తున్న పేదింటి ‘కూతురమ్మ’కు తాము అండగా నిలుస్తామంటూ మనసున్నోళ్లు ముందుకు వస్తున్నారు. ‘సాక్షి’ ఫ్యామిలీ పేజీలో మంగళవారం ‘కూతురమ్మ’ శీర్షికన ప్రచురించిన కథనానికి విశేష స్పందన వస్తోంది. నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తికి చెందిన అర్చన తల్లిదండ్రులు పద్మ, దుర్గారెడ్డిల దీనగాథతో ‘సాక్షి’ప్రచురించిన కథనం విశ్వవ్యాప్తమైంది. ఈ కథనాన్ని చదివి మానవత్వానికి ఎల్లలు లేవు.. మనసుంటే మార్గముంటుంది.. అన్న మంచి మనసుతో అర్చనకు అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. అర్చన కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇంటిని మంజూరు చేస్తామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. హృదయాన్ని కదిలించే కథనాన్ని రాసిన ‘సాక్షి’ని ఆయన అభినందించారు. అర్చన పరిస్థితిపై స్పందించిన వారిలో మాణిక్రెడ్డి(షాద్నగర్), సతీశ్రాజు (భీమవరం), భాస్కర్రెడ్డి(హైదరాబాద్), వెంగళ్రావు(నెల్లూరు), మాధురి (హైదరాబాద్), బాలాజీ వరప్రసాద్ (విజయవాడ)లతో పాటు నిర్మల్కు చెందిన టీఆర్ఎస్ నేత కూచాడి శ్రీహరిరావు, డాక్టర్ ప్రమోద్చంద్రారెడ్డి, ప్రముఖ కాంట్రాక్టర్ లక్కడి జగన్మోహన్రెడ్డి, జాన్డీర్ షోరూం యజమాని రవీందర్, కనకదుర్గా చిట్స్ బ్రాంచ్మేనేజర్ నర్సారెడ్డి, మనోహర్రెడ్డి(డీఎస్పీ) జీవన్రెడ్డి(పట్టణ సీఐ) ఇలా చాలా మంది మనసున్నోళ్లు ముందుకు వచ్చారు. -
బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకో
రేవంత్రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హితవు సాక్షి, హైదరాబాద్: బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి శనివారం హితవు పలికారు. పేదల ఇళ్ల నిర్మాణంలో కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తుందనడం అవాస్తవమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సరైన ఆధారాలుంటే మీడియా ముందు బహిర్గ తం చేయాలని, అనవసరంగా మాట్లాడితే పుట్టగతులుండవని హెచ్చరించారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో రాష్ట్రం వెనక్కు తగ్గదని, ప్రభుత్వ భూములను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసిన ఘనత బాబుదేనని ఆరోపించారు. -
నిర్మల్లో ఈఎస్ఐ ఏర్పాటు చేయండి
దత్తాత్రేయను కోరిన ఇంద్రకరణ్ సాక్షి, న్యూఢిల్లీ: నిర్మల్లో భారీగా ఉన్న బీడీ కార్మికుల్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. బుధవారం ఉదయం కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలసిన ఇంద్రకరణ్రెడ్డి ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు కు వినతిపత్రాన్ని సమర్పించారు. నిర్మల్ లో ఏరియా ఆస్పత్రి భవనం ఖాళీగా ఉందని లేబర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆ భవనాన్ని తమ అధీనంలోకి తీసుకొని అక్కడ ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పా టుకు చర్యలు తీసుకోవాలని దత్తా త్రేయను కోరారు. అలాగే నిర్మల్లో పీఎఫ్ రీజినల్ ఆఫీసు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ సానుకూలంగా స్పందించి నిర్మల్లో ఆస్పత్రి, పీఎఫ్ రీజినల్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రామగుండంలో 100 పడకల ఆస్పత్రిని, రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో కూడా ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్టు దత్తాత్రేయ తెలిపారు. -
మంత్రి కాన్వాయ్లోని వాహనం ఢీ : విద్యార్థి మృతి
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ సమీపంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కాన్వాయ్లోని ఇన్నోవా వాహనం ఢీకొని సాత్విక్ (17) అనే విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. శనివారం ఉదయమే ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన సాత్విక్.. తిరిగి శాంతినగర్ వైపునకు వస్తున్నాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న మంత్రి కాన్వాయ్లోని ఇన్నోవా వాహనం ఆ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ద్విచక్రవాహనం ఎగిరిపడి, సాత్విక్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని నిజామాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ రాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. కాగా, సాత్విక్ కుటుంబసభ్యులను ఆదివారం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పరామర్శించి, రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సాత్విక్ సోదరుడికి డిగ్రీ పూర్తయిన తర్వాత భవిష్యత్తులో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ఏడేళ్ల క్రితం లక్ష్మణచాంద మండలం చింతలచాందా గ్రామానికి చెందిన జోగు మోహన్, లక్ష్మి దంపతులు నిర్మల్ పట్టణానికి వలస వచ్చి ఫొటో స్టుడియో నడుపుకొంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. సాత్విక్, సాయి. తమ పిల్లలకు మంచి విద్యనందించాలని సొంత ఊళ్లోని వ్యవసాయ భూములను అమ్మేసి నిర్మల్లో స్థిరపడ్డారు. -
అర్చకులకు ఒకటినే కచ్చితంగా వేతనాలు
-
అర్చకులకు ఒకటినే వేతనాలు
ప్రభుత్వోద్యోగుల తరహాలో వేతన చెల్లింపు విధానం: కేసీఆర్ - అవసరమైతే చట్ట సవరణ.. ఈ సమావేశాల్లోనే బిల్లు - న్యాయ నిపుణులతో చర్చించి ముసాయిదా రూపకల్పన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాల యాల్లో అర్చకులకు ఒకటో తేదీనే కచ్చితంగా వేతనాలు అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతన చెల్లింపు విధానాన్ని అమలు చేస్తామని, ఇందుకోసం దేవాదాయ చట్ట సవరణ చేస్తామని తెలిపారు. అవసరమైతే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతామని తెలిపారు. సమాజంలో గౌరవంగా బతికే రీతిలో వేతనాల చెల్లింపు ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వేతనాలు చెల్లించాలని అర్చకులు, దేవాలయాల ఉద్యోగులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్ల సాధన కోసం దేవాలయ అర్చకులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి ఆందోళన చేపట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, సలహాదారు రమణాచారి, కమిషనర్ శివశంకర్లతో సుదీర్ఘంగా సమీక్షించారు. అర్చక సంఘాల ప్రతినిధులు గంగు భానుమూర్తి, గంగు ఉపేంద్రశర్మ, దేవాలయ ఉద్యోగుల ప్రతినిధులు రంగారెడ్డి, మోహన్ తదితరులు కూడా భేటీలో పాల్గొన్నారు. ప్రత్యేక నిధి నుంచి... దేవాదాయ శాఖ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న 642 ఆలయాలకు సంబంధించి దాదాపు 5,800 మంది అర్చకులు, ఉద్యోగులకు వర్తించేలా కొత్త వేతన చెల్లింపు విధానాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచే వేతనాలు చెల్లించాలని అర్చకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్ను కోరారు. కానీ అది సాధ్యమయ్యే అవకాశం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘అర్చకత్వం గౌరవమైన వృత్తి. కానీ వారి వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పోటీ సమాజంలో ఇది పెద్ద సమస్యగా మారింది. అర్చకత్వం చేసే యువకులకు పిల్లనివ్వడానికి ముందుకు రాని దుస్థితి రావడం బాధాకరం. ఈ పరిస్థితి మారాలి. వారికీ గౌరవప్రదమైన వేతనాలు అందాలి. అది కూడా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఒకటో తారీఖునే చేతిలో పడాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు. ప్రతి నెలా ఆలయాల నుంచి దేవాదాయశాఖ వసూలు చేసే 12 శాతం మొత్తాన్ని ఒకచోట నిధిగా చేసి.. దాని నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఠంచన్గా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని అధికారులకు సూచించారు. ఆ నిధి చాలని పక్షంలో ప్రభుత్వం కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వారి వేతనాలను కూడా క్రమబద్ధీకరించాలని.. అందుకు విధివిధానాలను సిద్ధం చేయాలని సూచించారు. ఈ సంక్రాంతి నాటికే అర్చకులు, ఆలయ ఉద్యోగులకు కొత్త వేతన విధానం అమల్లోకి రావాలన్నారు. భూముల లెక్కలు తేల్చండి గత ప్రభుత్వాల మితిమీరిన రాజకీయ జోక్యం వద్ద ఆలయాల్లో ఆధ్యాత్మిక భావన భగ్నమైందని, కౌలు పేరుతో దేవాలయ భూములు కబ్జాకు గురయ్యాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆలయ భూముల వివరాలను పక్కాగా సేకరించి అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పాలక వర్గాల్లో ధార్మిక, భక్తి భావాలున్నవారే సభ్యులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఈమేరకు నియమావళి రూపొందించాలని సూచించారు. కాగా రాష్ట్రంలో 11 వేల వరకు ఆలయాలుంటే కేవలం 642 మాత్రమే దేవాదాయ శాఖ పరిధిలో ఉండాల్సిన గందరగోళం ఏమిటని సీఎం ప్రశ్నించారు. వేతన క్రమబద్ధీకరణ ఈ 642 ఆలయాలకే వర్తిస్తే మిగతా వారు నష్టపోతారని, అందరికీ లబ్ధి కలిగేలా చూడాలని పేర్కొన్నారు. ఇంద్రకరణ్రెడ్డి నేతృత్వంలో కమిటీ.. అర్చకులు, దేవాలయ ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కూడా సమావేశమై మూడు నాలుగు రోజుల్లో పూర్తి నివేదికను తనకు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ అంశంపై శాసనసభలో బిల్లు పెడతామన్నారు. బిల్లు ముసాయిదా రూపకల్పన కోసం దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సీఎస్ ఎస్పీ సింగ్, దేవాదాయ కమిషనర్ శివశంకర్, అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, లాసెక్రటరీ సంతోష్రెడ్డి, అర్చక–ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భానుమూర్తి, ఉపేంద్రశర్మ, రంగారెడ్డి, మోహన్లు అందులో సభ్యులుగా ఉన్నారు. దేవాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, రోస్టర్ సమస్యలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కమిటీని సీఎం ఆదేశించారు. -
వ్యవసాయాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి
- మంత్రి పోచారం వెల్లడి - వ్యవసాయ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ - రైతులకు నిరంతర విద్యుత్: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్: వ్యవసాయరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ బొగ్గులకుంటలోని రెడ్డిహాస్టల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వ్యవసాయ అధికారుల సంఘం డైరీని ఆవిష్కరించారు. గౌరవ అతిథులుగా హాజరై న మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నూతన సంవత్సర క్యాలెండర్ను, వనపర్తి ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి టెలిఫోన్ డైరీని, ఎమ్మెల్యే వి. శ్రీనివాస్గౌడ్ టేబుల్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పోచారం మాట్లాడుతూ... గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వ్యవసాయరంగ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాట య్యాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అన్ని అవాంత రాలను అధిగమించి పురోగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులు రుణాలు పొందగా, ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టింది మాత్రం 6 లక్షల మంది రైతులేనని అన్నారు. రుణాలు పొందిన రైతులు కచ్చితంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేలా వ్యవసాయ అధికారుల సంఘం నాయకులు కృషి చేయాల న్నారు. కేసీఆర్ అధికారం చేపట్టిన తరువాత నిరంతరాయంగా విద్యుత్ అందించి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అధిక శాతం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారే సీఎంలు కావడంతో తెలంగాణ ప్రాంతం, ప్రజలు నిర్లక్ష్యానికి గురైన విషయం వాస్తవమేనని జి. చిన్నారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అని గొప్పలు చెప్పుకుంటున్నా దానిని నాలుగు దఫాలుగా విభజించడంతో రుణమాఫీ కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరగడానికే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోతుందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరు వాత కేసీఆర్ తొలి ప్రాధాన్యత ఇచ్చింది వ్యవసాయ రంగానికేనని శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ కార్య క్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్ మోహన్, రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ కృపాకర్రెడ్డి, వైస్ చైర్మన్ సత్యనారా యణ, అధ్యక్షురాలు అనురాధ, తదితరులు పాల్గొన్నారు. -
‘డబుల్’ సమస్యలు తొలగిపోయాయి
మండలిలో మంత్రులు ఇంద్రకరణ్, తుమ్మల ప్రకటన - నిధులు, ఇసుక, సిమెంట్ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని వ్యాఖ్య - త్వరలోనే శరవేగంగా ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడి - కేసీఆర్ హామీలన్నింటినీ తుంగలో తొక్కుతున్నారు: షబ్బీర్ అలీ - ఖమ్మంలో ఓ వైద్య కళాశాలకు అక్రమ భూకేటాయింపు: సుధాకర్రెడ్డి - గృహ నిర్మాణంపై రెండో రోజు వాడివేడి చర్చ సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి సమస్యలన్నీ తొలగిపోయా యని.. త్వరలో ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా చేపట్ట బోతున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.17 వేల కోట్లు సమీకరించిం దని.. ఉచితంగా ఇసుక సరఫరాతో పాటు సిమెంట్ కోసం 32 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. పేదలకు గృహ నిర్మాణం అంశంపై శాసనమండలిలో బుధ వారం కూడా అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ‘డబుల్’ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష కాంగ్రెస్ ఆరోపించగా.. ఇందిరమ్మ, రాజీవ్ స్వగృహ పథకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని అధికార పార్టీ నేతలు దీటుగా ఎదురుదాడి చేశారు. మీరు దోచి పెట్టారు.. కాదు మీరే.. రాజీవ్ స్వగృహ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం భూత్ బంగ్లాలుగా మార్చిందని.. అసలు ఇళ్లు నిర్మించకుండానే కాంట్రాక్టర్లకు రూ.1,000 కోట్లు దోచిపెట్టిందని టీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్రెడ్డి దీటుగా స్పందించారు. ఓ ప్రజాప్రతినిధికి చెందిన వైద్య కళాశాలకు ఖమ్మంలో 11 వేల గజాల స్థలాన్ని ప్రభుత్వం అక్రమంగా కట్టబెట్టిందని ఆరోపించారు. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద పొందిన పత్రాలను సభలో ప్రదర్శించారు. ఆ స్థలాన్ని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. అహ నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి, దాన్ని చూస్తూ భోజనం చేసినట్లుగా డబుల్ బెడ్ రూం పథకం తయారు కావొద్దని ఎద్దేవా చేశారు. ఇక డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రభుత్వం ప్రజల్లో ఆశలు రేకెత్తించిందని, కానీ ఏమీ చేయకపోవడంతో నిరాశ నెలకొందని బీజేపీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు పేర్కొన్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో నిర్మించే డబుల్ ఇళ్లలో వారికి కోటాను పెంచాలని ఎంఐఎం సభ్యుడు సయ్యద్ అల్తాఫ్ రిజ్వీ కోరారు. ఏడాదికి రెండు లక్షల ఇళ్లు ఏవీ? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 31 నెలలు గడిచినా నిర్మించింది 900 ఇళ్లు మాత్రమేనని మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఏడాదికి రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామని గత ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి, విస్మరించారని ఆరోపించారు. హైదరాబాద్లోని ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన ఇళ్లను చూపించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లను దండుకున్నారని ఆరోపించారు. ఇక ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి, అబద్ధాలాడి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. అమాయక ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విమర్శించారు. రూ.10 లక్షలు ఖర్చయ్యే డబుల్ బెడ్ రూం ఇళ్లను రూ.5 లక్షలతోనే నిర్మించాలన్నందునే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వం బిల్లులు నిలిపివేయడంతో రాష్ట్రంలో రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్లు మధ్యలోనే ఆగిపోయాయని.. ఊళ్లకు వెళ్తే కూలిపోయిన ఇళ్లు కనిపిస్తున్నా యని రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానిం చారు. దీనిపై టీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ‘ఊళ్లలో అంతకుముందు కట్టిన ఇళ్లు కూలుతున్నయి అన్నారు.. అంతే..’ అని మండలి చైర్మన్ స్వామిగౌడ్ సర్దిచెప్పారు. -
నేడే కొమురవెల్లి మల్లన్న కల్యాణం
తోటబావి కల్యాణ మండపం వద్ద ఏర్పాట్లు పూర్తి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: భక్త జనుల కొంగు బంగారం... బండల నడుమ వెలసిన సుందర రూపుడు.. కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి శుభ ఘడియలు వచ్చాయి. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఇంద్రకీలాద్రిపై వెలిసిన కోరమీసం స్వామికి దుర్ముఖినామ సంవత్స రం, మార్గశిర భాద్రపద ద్వాదశి ఆదివారం ఉదయం 10.45 గంటల శుభ ముహుర్తాన మేడలాదేవి, కేతమ్మదేవితో కల్యాణం జరగ నుంది. ఈ క్రతువుతోనే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఆలయ అధికారు లు తోటబావి కల్యాణ మండపం వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. మల్లన్న ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. మహారాష్ట్రలోని తమ్ముళ్ళూరులోని రంభాపూరి మఠాధిపతి శ్రీశ్రీశ్రీ షట్ స్థల బ్రహ్మ 1008వ గురువు శ్రీ శివానంద స్వామిజీ మల్లన్న కల్యాణ వేడుక లను పర్యవేక్షించనున్నారు. స్వామి వారికి భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రభు త్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు తలసాని శ్రీని వాస్యాదవ్, పద్మారావుగౌడ్, చందూలాల్ తదితరులు కల్యాణ మహోత్సవానికి హాజరు కానున్నారు. మల్లన్న బ్రహ్మోత్సవాలు ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారంతో మొదలై ఫాల్గుణ మాసం చివరి ఆదివారం (ఉగాది ముందు వచ్చే ఆదివారం) అగ్నిగుండాలతో ముగు స్తాయి. మూడు నెలలపాటు ఉత్సవాలు కొన సాగుతాయి. తెలంగాణతోపాటు మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 80 లక్షల మంది భక్తులు ఈ జాతరకు వస్తారని అంచనా. సంక్రాంతి తరువాత వచ్చే మొదటి ఆదివారాన్ని పట్నంవారంగా, రెండవ ఆదివారాన్ని లష్కర్వారంగా, మహాశివరాత్రి లింగోద్భవవారంగా పిలుస్తారు. మహాశివరాత్రికి పెద్దపట్నం... మల్లన్న ఆలయంలో మహాశివరాత్రిని పురస్క రించుకుని ఆలయ తోటబావి వద్ద ఫిబ్రవరి 24న శుక్రవారం మహాశివరాత్రికి లింగోద్భవ కాలంలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అదే సమయంలో ఆలయ తోట బావి వద్ద ఒగ్గు పూజారులు 48 వరుసలతో పెద్దపట్నాన్ని వేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శివసత్తులు ఆ పెద్దపట్నాన్ని తొక్కుకుంటూ ఆ ముగ్గు పిండిని పొలాలలో చల్లుకుంటే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని భక్తుల విశ్వాసం. అగ్నిగుండాలతో జాతర ముగింపు.. మల్లన్న ఆలయంలో ఉగాది ముం దు మార్చి 26న ఆదివారం అగ్నిగుం డాలతో జాతర బ్రహ్మోత్సవాలు ముగు స్తాయి. ఆలయ తోటబావి వద్ద ఆలయ అధికారులు, అర్చకుల ఆధ్వర్యంలో క్విం టాళ్ల కొద్దీ సమిధలను కాల్చి భగభగ మండే నిప్పుల కొలిమిని రాజేస్తారు. ఆల య అర్చకులు ఉత్సవ విగ్రహాలతో అగ్ని గుండాలు దాటుతూ మల్లన్న ఆలయ గర్భ గుడిలోకి చేరి మల్లన్నకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మల్లన్న భక్తులు ఒక్కొక్కరుగా అగ్నిగుండాలు దాటుతూ మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ అగ్నిగుండాలతో జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
‘డబుల్’ ఇళ్లకు రూ.230కే బస్తా సిమెంటు
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రూ.230కే బస్తా సిమెంటును సరఫరా చేయ డానికి 32 సిమెంటు కంపెనీలు అంగీకరిం చాయి. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సమక్షంలో ముఖ్యకార్యదర్శి అశోక్కుమార్తో సిమెంటు కంపెనీల ప్రతిని ధులు గురువారం అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంటు, స్టీలు, ఇసుక వంటివి తక్కువ ధరకు అందించాలని సిమెంటు కంపెనీలను రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సిమెంటు బస్తాను తక్కువ ధరకే అందించడానికి 32 సిమెంటు కంపెనీలు ముందుకొచ్చారుు. నిర్మాణం ఇక వేగవంతం... రాష్ట్ర ప్రభుత్వానికి, సిమెంటు కంపెనీలతో ఒప్పందం జరిగిన సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. సిమెంటును సరఫరా చేసిన వారంరోజుల్లో కంపెనీలకు బిల్లులను చెల్లిస్తామని చెప్పారు. సిమెంటు సరఫరా, చెల్లింపుల్లో ఏమైనా సమస్యలు తలెత్తినా పరస్పర అవగాహనతో, చర్చలతో పరిష్కరించుకుంటామన్నారు. సిమెంటు కంపెనీలతో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం వేగవంతం అవుతుందని ఇంద్రకరణ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మా ణానికి నిధుల సమస్య లేదని, రుణం ఇవ్వ డానికి హడ్కో ఇప్పటికే ముందుకు వచ్చిం దన్నారు. సబ్సిడీ ధరకు వస్తున్న సిమెంటు పక్కదారి పట్టకుండా కఠినమైన, పటిష్టమైన చర్యలను తీసుకుంటా మని ఇంద్రకరణ్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకోసం సరఫరా చేస్తున్న సిమెంటుపై ప్రత్యేకమైన చిహ్నాలను ముద్రిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 32 సిమెంటు కంపెనీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అది కాంగ్రెస్ గుంపుల పంచాయితీ
రైతు గర్జన సభపై ఇంద్రకరణ్రెడ్డి ధ్వజం హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్లో రైతు గర్జన సభ జరిపింది తమ పార్టీలోని ఆధిపత్య పోరు, గుంపుల పంచాయితీ వల్లేనని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆ పార్టీపై ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు రైతు గర్జన పేరుతో రైతులను మరో సారి వంచించారని, ఆత్మద్రోహం చేసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీలు పురాణం సతీశ్, డాక్టర్ భూపతిరెడ్డిలతో కలసి బుధవారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తలాపునే గోదావరి ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించకుండా, జనానికి కనీసం తాగునీరు అందకుండా చేశారని కాంగ్రెస్ను దుయ్యబట్టారు. అభివృద్ధికి అడ్డుపడే ఏ పార్టీకీ తెలంగాణలో పుట్టగతులు ఉండవని మంత్రి హెచ్చరించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి అక్రమంగా సంపాదించిన సొమ్ముతోనే జిల్లాలో కాంగ్రెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. దశాబ్దాల తరబడి ప్రజలను ముంచిన వారే ప్రతిపక్షంలోకి రాగానే పునీతులై నట్లు ప్రభుత్వంపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. -
గొందిమల్ల ఘాట్ను పరిశీలించిన మంత్రులు
అలంపూర్/అలంపూర్ రూరల్: కృష్ణానదిలో కొన్ని నీళ్లు ఉన్నా పుష్కర స్నానాలు చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని గొందిమల్ల వీఐపీ ఘాట్ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, జేసీ రాంకిషన్లతో కలిసి సందర్శించారు. ఘాట్ నిర్మాణ పనులు, పార్కింగ్, మూత్రశాలలు, మరుగుదొడ్లు, తాగునీటి వసతులపై మంత్రులు సమీక్షించారు. నదిలో నీటి ప్రవాహం దూరంగా ఉన్నప్పటికీ పుష్కరస్నానాలు చేయడానికి వీలుగా సౌకర్యాలు కల్పించాలన్నారు. పుష్కరఘాట్ వద్ద నదిలో మరో ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని, ఘాట్ నుంచి నదిలో ఉన్న నీటి ప్రవాహం వరకు ఇసుక, మట్టితో తాత్కాలిక రోడ్డు వేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. పుష్కరాలకు రెండు, మూడు రోజుల ముందు అప్పటి నీటి ప్రవాహాన్ని బట్టి రోడ్డు వేసుకోవాలన్నారు. పుష్కరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వీరి వెంట మాజీ ఎంపీ మందా జగన్నాథం, ఆర్డీఓ అబ్దుల్హమీద్, డీఎస్పీ బాలకోటి, సీఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మంజుల, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
చరిత్రలో నిలిచిపోయేలా పుష్కరాలు
గోదావరి కంటే ఘనంగా నిర్వహించేందుకు కృషి 90శాతం పుష్కరాల పనులు పూర్తి మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్రూరల్: కృష్ణా పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా కృషి చేస్తుందని దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. భక్తులకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి కృష్ణా పుష్కరాలు చరిత్రలోనే నిలిచిపోయేలా నిర్వహిస్తామన్నారు. మండలపరిధిలోని సోమశిలలో కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జరుగుతున్న ఘాట్ల పనులను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన సందర్శించి పరిశీలించారు. ఈసందర్భంగా వీఐపీ ఘాట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కంటే ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.825కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. పుష్కరాలకు సంబంధించి దాదాపు 90శాతం పనులు పూర్తయ్యాయని, పదిశాతమే మిగిలి ఉన్నాయన్నారు. వాటిని ఈనెలాఖరు వరకు పూర్తి చేయడానికి అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. వచ్చేనెల 5, 6 తేదీల వరకు పుష్కరాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయన్నారు. పుష్కరఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పుడిప్పుడే కృష్ణానదికి నీళ్లు వస్తున్నాయని, పుష్కరాల వరకు పూర్తిస్థాయిలో నదికి నీళ్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. సోమశిలకు భక్తులు ఎక్కువగా వస్తారని, ఈ ప్రాంతంలో ఒక్క ప్లాస్టిక్ వస్తువు కనిపించకుండా పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పుష్కరాల ఘాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు నిత్యం పర్యవేక్షిస్తూ పనులు త్వరగా పూర్తయ్యేందుకు కృషి చేస్తున్నారన్నారు. షవర్లు ఏర్పాటు చేయాలి: మంత్రి జూపల్లి సోమశిల సమీపంలో జనరల్ ఘాట్ సమీపంలో షవర్లు ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కృష్ణానదిలో మునగలేని భక్తులకు షవర్లు ఉపయోగపడతాయన్నారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎప్పటికప్పుడు మైకుల ద్వారా ప్రజలకు అన్ని సమస్యలు, వసతులను తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. వీఐపీ ఘాట్ దగ్గర 25ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశామని మంత్రి జూపల్లికి జేసీ రాంకిషన్ తెలిపారు. సోమశిల ఆధ్యాత్మిక ప్రాంతమైనందున ప్రతిరోజూ లక్ష వరకు భక్తులు వచ్చే అవకాశముందని, ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని జేసీని మంత్రి ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా సోమశిలలో ఏర్పాటు చేసే దుకాణాలను ఊరి బయటనే పెట్టాలని వ్యాపారులకు సూచించారు. అనంతరం సోమశిల జనరల్ పుష్కరఘాట్ వద్ద జంగమ్మగుడి సమీపంలో మంత్రులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో జేసీ రాంకిషన్, ఆర్డీఓ దేవేందర్రెడ్డి ఎంపీపీ చిన్న నిరంజన్రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, సింగిల్విండో చైర్మన్ రఘుపతిరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ విద్యాసాగర్, పీఆర్ డీఈ రాములు, జూపల్లి రామారావు, ఎండీ ఎక్బాల్, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాలుగైదు రోజుల్లో పండగ వాతావరణం ఇటిక్యాల: కృష్ణా పుష్కరాల ఘాట్ల వద్ద నాలుగైదు రోజుల్లో పండగ వాతావరణం నెలకొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. బీచుపల్లి వద్ద పుష్కరఘాట్ల నిర్మాణ పనులను మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 52పుష్కరఘాట్లకు ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించి, పనులు యుద్ధప్రాతిపాదికన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణా పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. తెలంగాణ కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తంగా నిలిచేలా రాష్ట్రప్రభుత్వం కృష్ణాపుష్కరాలను నిర్వహించేందుకు కృషి చేస్తోందన్నారు. పుష్కరఘాట్ల వద్ద ఉన్న ఆలయాలను అలంకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఆలయ ఈఓపై ఆగ్రహం బీచుపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని మంగళవారం మంత్రులు సందర్శించారు. పుష్కర సమయం ముంచుకొస్తున్నా ఆలయం వద్ద అలాంటి వాతావరణం కనిపించక పోవడమేమిటని ప్రశ్నించారు. ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద, గర్భగుడి వద్ద ఉన్న సమస్యలు తొలగించాలని చెప్పినా అర్థం కావడం లేదా అని మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ గోపురం నిర్మాణ పనులు పుష్కరాల పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు పెబ్బేరు: రంగాపూర్ ఘాట్ వద్ద మంగళవారం మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేస్తామని వారు ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాంచందర్, డీఎస్పీ జోగుల చెన్నయ్య, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గౌనిబుచ్చారెడ్డి, తదితరులున్నారు. -
ఎర్రవల్లి చరిత్రలో నిలుస్తుంది
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి జగదేవ్పూర్: సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లి దేశ చరిత్రలో నిలుస్తుందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో వారు పర్యటించి, డబల్బెడ్రూం ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఎర్రవల్లి ఇళ్లు పేదోళ్ల విల్లాలంటూ కొనియాడారు. గత 67 ఏళ్లలో దేశంలో ఎక్కడా జరుగని అభివృద్ధి సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతోందన్నారు. డబుల్బెడ్రూం పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. హైదరాబాద్కు రెండు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయని, రూరల్ ఏరియాలో రెండు లక్షల 65 వేల ఇళ్లు మంజూరుకు ప్రణాళిక తయారైందని , త్వరలోనే టెండర్లు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మల్లన్నసాగర్ బాధితులను ఆదుకుంటాం మల్లన్నసాగర్ బాధితులు అందోళన చెందవద్దని, ప్రభుత్వ తరపున ఆదుకుంటామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి పక్షాలు ముంపు గ్రామాల ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. రైతులు ఏ జీఓ ప్రకారం నష్టపరిహారం కోరినా అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో గడా అధికారి హన్మంతరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్రెడ్డి, సర్పంచ్లు భాగ్య, బాల్రెడ్డి, జెడ్పీటీసీ రాంచంద్రం, ఎంపీటీసీ భాగ్యమ్మ, వీడీసీ అధ్యక్షుడు కిష్టారెడ్డి, ఉపాధ్యక్షుడు కృష్ణ, గౌరవ అధ్యక్షులు బాల్రాజు పాల్గొన్నారు. వర్ధరాజస్వామి ఆలయానికి పూర్వవైభవం తెస్తాం వర్ధరాజస్వామి దేవాలయానికి పూర్వ వైభవనం తీసుకవస్తామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం వర్ధరాజ్పూర్ గ్రామంలోని వర్ధరాజస్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. రెండో కంచిగా పేరొందిన వర్ధరాజస్వామి ఆలయాన్ని రాష్ట్రంలో నంబర్ వన్ దేవాలయంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ఆర్చకులు మంత్రికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మంత్రి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎర్రవల్లి లెజండ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని హనుమాన్, వర్ధరాజస్వామి దేవాలయ ఆవరణల్లో మొక్కలు నాటారు. -
యాదాద్రి అభివృద్ధికి రూ.900 కోట్లు
వేములవాడ రాజన్నకు మరో రూ.400కోట్లు ‘మల్లన్నసాగర్’పై కాంగ్రెస్ది అనవసర రాద్ధాంతం 2013 చట్టంతో నిర్వాసితులకు న్యాయం జరగదు మెరుగైన పనితీరుతో దేశంలోనే నెంబర్వన్ స్థానంలో కేసీఆర్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి గజ్వేల్లో మహంకాళి బోనాలకు హాజరైన మంత్రి, డిప్యూటీ స్పీకర్ గజ్వేల్: యాదాద్రి ఆలయ అభివృద్ధికి రూ.900 కోట్లు కేటాయిస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రకటించారు. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్లో నిర్వహించిన మహంకాళి బోనాల ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని పిడిచెడ్ రోడ్డు మార్గంలో ఉన్న ఆలయంలో అమ్మవారికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డితో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఆలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల సత్వర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. యాదాద్రితోపాటు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి సైతం రూ.400 కోట్లతో కార్యాచరణ సిద్ధమవుతుందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పంతో పనిచేయడం వల్లే దేశంలోనే నెంబర్వన్ సీఎంగా కేసీఆర్ గుర్తింపు పొందారని చెప్పారు. కేసీఆర్ బాటలో నడవాలని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ఇతర ముఖ్యమంత్రులకు సూచించడం గొప్పవిషయమన్నారు. మల్లన్న సాగర్పై రాద్ధాంతమెందుకు? మల్లన్నసాగర్ విషయంలో కాంగ్రెస్ అనవసర రాద్ధాంతానికి తెరతీసిందని విమర్శించారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ జరగాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 2013 చట్టం ప్రకారం భూసేకరణ జరిగి ఎకరాకు కేవలం రూ.1500 మాత్రమే చెల్లించారని గుర్తు చేశారు. నష్టపరిహారం పెంచాలని బాధితులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతుండగా ఇప్పటికీ... ఆ వ్యవహారం కొలిక్కి రాలేదన్నారు. జీఓ 123 భూనిర్వాసితులకు సరైన మార్గమని చెప్పారు. ఈ జీఓ ద్వారా వెంటనే పరిహారం అందే అవకాశముందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసే సంకల్పంతో చేపట్టనున్న ఈ రిజర్వాయర్ నిర్మాణ ంపై కుట్రలు చేయవద్దన్నారు. హరితహారంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలోనే మొదటగా గజ్వేల్ వాసులకు ఇంటింటికి నీరు.. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఇక్కడి ప్రజలు మిషన్ భగీరథ ఫలాలను అందుకోబోతున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గోదావరి జలాలతో తెలంగాణలో కరువును శాశ్వతంగా తరిమేయడానికి మల్లన్నసాగర్ ఉపకరిస్తుందన్నారు. అందుకోసం ఈ రిజర్వాయర్ నిర్మాణం వెంటనే కావాలని అమ్మవారికి మొక్కుకుంటున్నట్లు తెలిపారు. ఈ రిజర్వాయర్ పూర్తయితే మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని చెప్పారు. -
ఇంద్రకరణ్రెడ్డికి వారెంట్
సాక్షి, హైదరాబాద్: వాలీబాల్ అసోసియేషన్ ఎన్నికల వివాదం కేసులో ఫిర్యాదుదారుగా ఉండీ వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు హాజరుకాని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి నాంపల్లి సీసీఎస్ కోర్టు సోమవారం వారెంట్ జారీ చేసింది. జూలై 11న ఆయన కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి డ్యానీరూథ్ విచారణను వాయిదా వేశారు. గతంలో వాలీబాల్ అసోసియేషన్కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా ఇంద్రకరణ్రెడ్డి ఎన్నికయ్యారు. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన హరినాథ్రెడ్డి తాను ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారు. హరినాథ్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇంద్రకిరణ్రెడ్డి సీసీఎస్కు ఫిర్యాదు చేశారు. విచారణకు చేపట్టిన కోర్టు.. ఇంద్రకరణ్రెడ్డికి వాంగ్మూలం ఇవ్వాలంటూ సమన్లు జారీచేసింది. వాటిని సీసీఎస్ అధికారులు ఇంద్రకరణ్రెడ్డికి అందించారు. అయినా ఇంద్రకరణ్రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. -
‘డబుల్ బెడ్రూం’కు కార్యాచరణ
గృహ నిర్మాణ శాఖతో జరిపిన సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశం సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యాలయంలో గృహ నిర్మాణశాఖకు చెందిన పలు అంశాలపై మంత్రి సమీక్ష జరిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పై జిల్లాలవారీగా టెండర్ల పురోగతి, పనుల ప్రారంభంపై ఆరా తీశారు. ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల్లో 5,238 ఇళ్లకుగాను టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లల్లో అవకతవకలపై రెవెన్యూ బృందాల విచారణను త్వరితంగా పూర్తి చేసి అర్హులకు పెండింగు బిల్లులు త్వర గా చెల్లించాలన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో రాజీవ్ స్వగృహ ఖాళీ ఫ్లాట్లపై సమీక్ష చేపట్టారు. బండ్లగూడ, పోచారంలోని స్వగృహ ఇళ్లకు ధరను నిర్ణయించి పేర్లు నమోదు చేసుకున్నవారికి నోటీసులు ఇవ్వాలన్నారు. హౌసింగ్ బోర్డు, గృహ నిర్మాణ సంస్థ విభజన ప్రక్రియ మందకొడిగా సాగడంపై వివరాలు కోరారు. సమీక్ష సందర్భం గా హౌసింగ్ బోర్డు కార్యాలయానికి వచ్చిన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి గృహ నిర్మాణ శాఖకు చెందిన అంశాలను ఇంద్రకరణ్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వాంబే ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. -
‘డబుల్’కు అంత రుణం ఎలా తెస్తారు?
పద్దులపై చర్చలో కాంగ్రెస్ సభ్యుడు వంశీచంద్రెడ్డి ♦ మైనార్టీ పద్దుల్లో వివరాల్లేకపోవడంపై అక్బర్ ఫైర్ ♦ బీసీలను రెంట్టింపు కేటాయింపులు చేయాలి: ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి హడ్కో నుంచి రుణం తీసుకుంటామని చెబుతున్న సర్కారు మాటలకు, వాస్తవ పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి విమర్శించారు. 2.60 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ఈ ఏడాది దాదాపు రూ.16,123 కోట్లు కావాలని, అంత మొత్తం రుణంగా ఇచ్చే పరిస్థితి హడ్కోకు లేదన్నారు. దేశ ంలో అన్ని రాష్ట్రాలకు హౌసింగ్ కోసం హడ్కో 2014-15లో రూ.3వేల కోట్లు, 2015-16లో 4,366 కోట్లు ఇచ్చిందన్నారు. అలాంటప్పుడు ఒక్క తెలంగాణకే రూ.16 వేల కోట్లు ఎలా ఇస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో పద్దులపై చర్చను ప్రారంభించారు. ఇందిరమ్మ బిల్లుల కోసం 4.15 లక్షల మంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. బడ్జెట్లో అమరుల కుటుం బాల సంక్షేమం ప్రస్తావనే లేదన్నారు. అక్బరుద్దీన్ ఆగ్రహం.. సర్దిచెప్పిన సీఎం మైనార్టీ సంక్షేమానికి సంబంధించి అధికారులు ఇచ్చిన పుస్తకంలో ఈ ఏడాది లక్ష్యాలు, విడులైన నిధులు, పెండింగ్ వివరాలు పూర్తిస్థాయిలో పేర్కొనక పోవడంపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం స్వయంగా నిర్వహిస్తున్న శాఖలోనే ఇలాంటి పరిస్థితి ఉండడమేంటని ప్రశ్నించారు. దీంతో కేసీఆర్ కలుగజేసుకొని.. సిబ్బంది కొరత కారణంగా వివరాలు సకాలంలో ఇవ్వలేకపోయారని, త్వరలోనే పూర్తి సమాచారం పంపుతామని సర్దిచెప్పారు. బీసీలకు నిధులేవీ?:వంశీచందర్ రెడ్డి జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు బడ్జెట్లో రూ.2500 కోట్లే కేటాయించడం వారిని అవమానించడమేనని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. కేటాయింపులను రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి వినియోగించాల్సిన13,136 కోట్లలో గతేడాది 7,314 కోట్లే ఖర్చు చేయడం రాజ్యాం గాన్ని ఉల్లంఘించడమేనన్నారు. ఫీజులకు కేటాయింపులేవీ: పాయం ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి గతేడాది బకాయిలు రూ.800 కోట్లు ఉండగా.. ప్రస్తుత ఏడాది రూ.2,600 కోట్లు ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పాత బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోగా, వచ్చే ఏడాది చెల్లింపులకు కూడా ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దళితులకిచ్చిన హామీలేమయ్యాయి?: సున్నం రాజయ్య కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.లక్ష నగదు, ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కావడం లేదని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. దళితులు మూడెకరాల భూమి పథకం కింద 10 లక్షల ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటివరకు 3,640 ఎకరాలే పంపిణీ చేశారని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్ నాటికి డబుల్ ఇళ్లు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 2014-15 ఏడాదిలో మంజూరు చేసిన 60 వేల ఇళ్లతో పాటు ఈ ఏడాది మంజూరు చేసిన 2 లక్షల డబుల్బెడ్రూం ఇళ్లను వచ్చే బడ్జెట్ నాటికి పూర్తిచేస్తాం. ఇందుకు బడ్జెట్లో 587 కోట్లు కేటాయించాం. హడ్కో నుంచి 13,351 కోట్ల అప్పుగా తెస్తాం. రూ.12,549 కోట్ల రుణానికి హడ్కో ఓకే చెప్పింది. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి బాటలు: మంత్రి చందూలాల్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేసింది. గతేడాదితో పోలిస్తే ఎస్సీ సంక్షేమానికి రూ.1,155 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.443 కోట్లు పెంచాం విదేశీ విద్యకు మరింత సాయం: మంత్రి జగదీశ్ రెడ్డి విదేశాల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు ప్రస్తుతం అందజేస్తున్న రూ.10 లక్షలనుమరింత పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేప్ బాధితులకు అందజేస్తున్న పరి హారాన్నీ పెంచుతాం బీసీ సబ్ప్లాన్కు ప్లాన్: మంత్రి జోగు రామన్న బీసీ సబ్ప్లాన్కు పూర్తి సానుకూలంగా ఉన్నాం. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి చేర్చడంపై అనంతరాం కమిటీ నివేదిక రావాల్సి ఉంది. 12శాతం రిజర్వేషన్లపై ఆలోచిస్తున్నాం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లపై ఆలోచనలు చేస్తున్నాం. సుధీర్ కమిటీ నివేదిక వచ్చిన వెంటనే దీనిపై చర్యలుంటాయి. అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తాం: తుమ్మల ఇప్పటికే ఆరంభించిన 1,268 అంగన్వాడీ కేంద్రాలను పూర్తి చేయడంతో పాటు కొత్తగా 1,200 భవనాల నిర్మాణాలను చేపడతాం. -
'వాళ్లపై కేసులు పెడితే జైళ్లు చాలవు'
సాక్షి, హైదరాబాద్: 'ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలకుగాను 250 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు..ఇది ఎవరి పాపం..ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టితే జైళ్లు సరిపోవు' అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు నేరుగా భాగస్వాములయ్యారు..ఇండ్లు కట్టకముందే బిల్లులు తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సోమవారం శాసనసభలో విపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. లక్షా 70 వేల ఇందిరమ్మ ఇళ్లను సీబీసీఐడీ పరిశీలిస్తే లక్షా 20 వేల ఇళ్లు కట్టినవేనని తేలిందన్నారు. వీటికి సంబంధించి రూ.273..13 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించామని, మిగిలిన బకాయిలను సైతం చెల్లిస్తామన్నారు. సీబీసీఐడీ నివేదిక వచ్చిన తర్వాత మిగిలిన ఇళ్లకు చెల్లిస్తామన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయించలేదని డబుల్ బడ్రూం ఇళ్ల పథకంపై అనుమానాలు అవసరం లేదన్నారు. రూ.1735 కోట్ల హడ్కో రుణంతో 2016-17లో 2లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఇప్పటికే టెండర్లను పిలిచామని, అన్ని జిల్లాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. డబుల్ బడ్రూం ఇళ్ల లబ్ధిదారుల నుంచి మీ-సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్ నగరంలో 1.51లక్షల ఇళ్లకు సరిపడ స్థలాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 382 ఎకరాలు, జీహెచ్ఎంసీ వెలుపల 299 ఎకరాలను గుర్తించామన్నారు. కాగా..ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టితే జైళ్లు సరిపోవు అని మంత్రి చేసిన వ్యాఖ్యాలను కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలను తెలిపింది. -
కృష్ణా పుష్కరాలకు రూ.825 కోట్లు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. కృష్ణా పుష్కరాలకు రూ.825 కోట్లు కేటాయిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి శుక్రవారం ప్రకటించారు. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల తరహాలోనే కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. స్నానఘట్టాలకు, రోడ్ల విస్తరణకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. మహబూబ్నగర్, నల్లగొండలో 86 స్నానఘట్టాల నిర్మాణానికి రూ.212 కోట్లు, రోడ్ల విస్తరణకు రూ.398 కోట్లు కేటాయించామని వివరించారు. మార్చి మొదటివారంలో పుష్కరాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారలతో సమీక్ష నిర్వహిస్తామని, మార్చి 15 నుంచి పుష్కరాల పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 12న కృష్ణా పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. -
‘డబుల్’కు 14,664 కోట్లు కావాలి!
సీఎంను కోరనున్న గృహనిర్మాణ శాఖ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సమావేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.14,664 కోట్ల నిధులు అవసరమవుతాయని గృహ నిర్మాణ శాఖ అంచనా వేసింది. వచ్చే బడ్జెట్లో ఈమేరకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరాలని నిర్ణయించింది. దీనిపై గృహనిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మంగళవారం అధికారులతో చర్చించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువగా బడ్జెట్ కేటాయించడం, పెద్దగా పనులు మొదలుకాకపోవడం వెరసి పథకంపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో మెరుగ్గా నిధులు కేటాయించి పనులను ముమ్మరంగా నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష రెండు పడక గదుల ఇళ్లను నిర్మించనున్నట్టు ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారు. వీటికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.7,750 కోట్లను కోరాలని నిర్ణయిం చారు. నగరం మినహా రాష్ట్రం లోని ఇతర పట్టణ, గ్రామాల్లో ఇళ్ల కోసం రూ.6,194 కోట్లను కోరాలని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో 60 వేల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 40 వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ఉంది. సబ్సిడీ ద్వారా గ్రామాల్లో ఇందిరా ఆవాస్ యోజన కింద 55 వేల ఇళ్ల నిర్మాణానికి రూ.527 కోట్లు, పట్టణాల్లో పీఎంఏవై పథకం కింద ఇళ్ల నిర్మాణానికి రూ. 193 కోట్లు అవసరమని తేల్చారు. అలాగే, సమావేశంలో దేవాదాయ శాఖ వ్యవహారాలపైనా చర్చించారు. ఉద్యోగుల జీతభత్యాలకు రూ.22 కోట్లు కావాల్సి ఉంటుందని లెక్కలేశారు. వీటిపై ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపాలని మంత్రి ఆదేశించారు. -
'చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తాం'
రంగారెడ్డి జిల్లా: తెలంగాణలోని చారిత్రక దేవాలయాలను అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఆదివారం మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో జరిగిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి కల్యాణ మహోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మహేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ... మేడారం జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. రాఘవాపూర్ గ్రామంలో సబ్స్టేషన్ నిర్మాణ పనులను మంత్రి మహేందర్రెడ్డి ప్రారంభించారు. -
త్వరలో తెలంగాణ మొక్కు తీర్చుకోనున్న కేసీఆర్
తిరుమల : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తిరుమలేశునికి బంగారు కానుకలు సమర్పించాలని కేసీఆర్ మొక్కుకున్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ నెల మూడో వారంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శించుకుంటారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు కూడా టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. -
ప్రవాసులను ఆదర్శంగా తీసుకోవాలి
‘ఆటా’ ముగింపు వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను, భాషావ్యాప్తిని ప్రవాస తెలుగువారు చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారని, ఇక్కడి వారు విదేశాల్లో ఉన్న మన తెలుగువాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. ఉద్యోగాలు, వ్యాపారాలకే పరిమితం కాకుండా జన్మభూమికి సేవలందిస్తూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించడం అభినందనీయమన్నారు. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శిల్పకళా వేదికలో ఆటా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆటా ఎలక్ట్ అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ 15 రోజులుగా వివిధ జిల్లాల్లో సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆటా ముగింపు వేడుకలను శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆటా అధ్యక్షుడు సుధాకర్ పెరికారి, సాంస్కృతిక కార్యక్రమాల సలహాదారు డాక్టర్ పద్మజారెడ్డి, ఆటా ఓవర్సీస్ సమన్వయకర్తలు పి.హరినాథ్రెడ్డి, సురేందర్రెడ్డి, ఆటా కార్యదర్శి బొమ్మినేని మధు, ఎనుగు లక్ష్మారెడ్డి, పీ కిరణ్, శ్రీనివాస్, టీడీటీ నేతలు ఎర్రబెల్లి దయాకర్రావు, రావుల చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ యూనిట్ కాస్ట్ తగ్గింపు యోచన?
♦ అందరికీ ఏకరీతిన రూ.70 వేలు ♦ ప్రభుత్వానికి గృహనిర్మాణ శాఖ అధికారుల ప్రతిపాదన? ♦ నేడు తుది నిర్ణయం! సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల రూపంలో పెండింగు బిల్లుల భారం గుదిబండగా మారడంతో దాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు రూ.500 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో... ఆ ఇళ్ల యూనిట్ కాస్ట్లోనే మార్పులు చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రభుత్వం ముందుంచినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందిరమ్మ పథకంలో ఇంటి యూనిట్ కాస్ట్ రూ.70 వేలుగా ఉంది. అదే ఎస్సీలైతే రూ.లక్ష, ఎస్టీలైతే రూ.1.05 లక్షలుగా ఉంది. కేంద్రప్రభుత్వం ఇందిరా ఆవాస్ యోజన ఇళ్ల యూనిట్కాస్ట్లో చేసే మార్పులకు తగ్గట్టుగా రాష్ట్రప్రభుత్వం కూడా వాటిని మారుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట ఈ యూనిట్కాస్ట్ను ఆ మేరకు పెంచింది. ఇప్పుడు వాటిని తగ్గించి అందరికీ రూ.70 వేలుగా చేయాలని గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రతిపాదించినట్టు సమాచారం. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఇందిరా ఆవాస్ యోజన స్థానంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎలాగూ ‘ఇందిరా ఆవాస్’కు కాలదోషం పట్టుకున్న నేపథ్యంలో దాని యూనిట్ కాస్ట్ను అమలు చేయడమెందుకనేది అధికారుల వాదన. యూనిట్కాస్ట్ తగ్గిస్తే ప్రభుత్వంపై ‘పెండింగు బిల్లుల’ భారం భారీగా తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైలు గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకిరణ్రెడ్డి వద్దకు చేరినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే రాష్ట్రప్రభుత్వంపై దాదాపు రూ.వంద కోట్ల వరకు భారం తగ్గుతుందని అధికారులు ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం. గురువారం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. పాతపద్ధతే కొనసాగుతోంది: ఇంద్రకరణ్రెడ్డి దీనిపై గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వివరణ కోరగా...‘ఇప్పటి వరకు మార్పు చేర్పులు చేయలేదు. పాత పద్ధతే కొనసాగుతోంది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పెండింగు బిల్లులు విడుదల చేయాలని నిర్ణయించాం. యూనిట్కాస్ట్ మార్పు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని చెప్పారు. -
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం
♦ శాసనమండలిలో ఈటల హామీ ♦ ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో ప్రభుత్వానికి సంబంధం లేదు ♦ నవంబర్ నాటికి కొత్త ఆహార భద్రతా కార్డుల జారీ సాక్షి, హైదరాబాద్: నిబంధనల ప్రకారం నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగులందరినీ త్వరలో క్రమబద్ధీకరిస్తామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. శాసనమండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు పల్లా రాజేశ్వర్రెడ్డి, సుధాకర్రెడ్డి, పూల రవీందర్, జనార్దన్, సయ్యద్ అల్తాఫ్ హైదర్ రజ్వీ, సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఈటల ఈ మేరకు బదులిచ్చారు. 1993 నుంచి ఇప్పటివరకు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం నియమితులైన 25,529 మంది కాంట్రాక్టు ఉద్యోగులను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. కాంట్రాక్టు సిబ్బంది సర్వీసుల క్రమబద్ధీకరణను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధికారుల కమిటీని నియమించినట్లు తెలిపారు. కోర్టు తీర్పులను దృష్టిలో ఉంచుకొని అనుసరించాల్సిన మార్గదర్శకాలపై కమిటీ కొన్ని సిఫార్సులు చేసిందన్నారు. ఏజెన్సీల ద్వారా, సిబ్బంది తక్కువగా ఉన్న శాఖలు అవసరాలకు అనుగుణంగా నియమించుకున్న ఔట్సోర్సింగ్ సిబ్బందితో ప్రభుత్వానికి సంబంధం లేదని ఈటల స్పష్టం చేశారు. రేషన్కార్డుల హేతుబద్ధీకరణ... రేషన్ దుకాణాల్లో అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని...రేషన్ కార్డుల హేతబద్ధీకరణ చేపడతామని ఈటల చెప్పారు. రేషన్ అక్రమాలను అరికట్టేందుకు డీలర్ల కమీషన్ను పెంచనున్నట్లు తెలిపారు. 20 శాతం వరకు బియ్యం పక్కదారి పడుతోందని...దీన్ని నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇ-పాస్ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 54 వేల కార్డులను ప్రజలు స్వచ్ఛందంగా వెనక్కు ఇచ్చారన్నారు. ఆధార్ కార్డు లేదని ఏ ఒక్కరినీ తొలగించలేదని, సబ్సిడీ బియ్యానికి 2.82 కోట్ల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. కొత్తగా ముద్రించిన ఆహార భద్రతా కార్డులను నవంబర్ నాటికి జారీ చేయాలని నిర్ణయించినట్లు ఈటల తెలిపారు. స్టీల్ప్లాంటు స్థాపనకు చర్యలు: హరీశ్ రాష్ట్రంలో స్టీల్ ప్లాంటు స్థాపనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి హరీశ్రావు మండలిలో తెలిపారు. రాష్ట్రంలో స్టీల్ ప్లాం టును స్థాపించేందుకు గల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వ ఉక్కుశాఖ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసిందన్నారు. భారత భౌగోళిక సర్వే ప్రాథమిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 302 మిలియన్ టన్నుల వివిధ గ్రేడ్ల ఇనుప ఖనిజం ఉందన్నారు. ప్లాంటు స్థాపనకు జీ-3 కేటగిరీలో 200 మిలియన్ టన్నుల నిక్షేపాలు సెయిల్కు తప్పనిసరిగా కావాల్సి ఉం టుందని, బయ్యారంలో పూర్తిస్థాయిలో అన్వేషణ జరుగుతోందన్నారు. జీ-3 కేటగిరీ తేవడానికి అంతర్జాతీయ బిడ్కు వెళ్లాలని నిర్ణయించినట్లు హరీష్రావు తెలిపారు. కంతనపల్లి బ్యారేజీ ఎత్తును మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుందని హరీశ్రావు మరో ప్రశ్నకు బదులిచ్చారు. బ్యారేజీ వల్ల 4 గ్రామాలు పూర్తిగా, 13 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయని, దాన్ని తగ్గిం చేందుకే ఈ ఆలోచన చేస్తున్నామన్నారు. కాగా, వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయం పరిసర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి తగిన సంస్థ ఏర్పాటును పరిశీలిస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది సమ్మక్క సారలమ్మ జాతరను, కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోందన్నారు. -
ఎస్కలేషన్ భారం 3 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 25 ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసేం దుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోం దని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో ఉన్న అడ్డంకులను అధిగమించడంతోపాటు ధరల సర్దుబాటు(ఎస్కలేషన్)కు తుదిరూపు ఇస్తున్నామన్నారు. ధరల సర్దుబాటుతో ప్రభుత్వంపై రూ.2,700కోట్ల నుంచి రూ.3 వేల కోట్ల భారం పడుతుందని తెలిపారు. కొత్తగా టెండర్లు పిలిస్తే న్యాయపరమైన చిక్కులు, సమయం వృథాతోపాటు భారం రూ.15 కోట్లకు పెరిగే అవకాశం ఉన్నందునే ధరల సర్దుబాటుకు నిర్ణయించామని వివరించారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు గాదరి కిశోర్, ఆళ్ల వెంకటేశ్వర్రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం 13 మేజర్, 12 మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు చూపిన ఉత్సాహం.. వాటిని పూర్తి చేయడంలో చూపలేదని విమర్శించారు. భూసేకరణ కోసం జీవో 123 తెచ్చామని, దీనిద్వారా మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలో భూమి కొనుగోలు వేగం గా జరుగుతోందని తెలిపారు. ఈ 25 ప్రాజెక్టుల కింద 41 వేల ఎకరాల భూమి అవసరం ఉందని, ఇవి పూర్తి చేసి 29 లక్షల ఎకరాలకు సాగునీరిస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు మొబిలైజేషన్ అడ్వాన్సుల ద్వారా రూ.2,950 కోట్లు ఇవ్వగా, అందులో రూ.2,674 కోట్లు రికవరీ చేసినట్లు వివరించారు. రూ.1,024 కోట్లతో గోదాములు ప్రతి మండలంలో అందుబాటులో ఉండేలా 17.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణం కోసం రూ.1,024 కోట్లు ఖర్చు చేయనున్నట్లు హరీశ్రావు తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి వీటి నిర్మాణం పూర్తి చేస్తామని సభ్యులు శ్రీనివాస్గౌడ్, హన్మంత్ షిండే అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 6.25లక్షల దీపం కనెక్షన్లు: జగదీశ్రెడ్డి రాష్ట్రంలో 6.25 లక్షల దీపం కనెక్షన్లు మం జూరు చేసినట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో వికలాంగులు, వితంతు మహిళలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. వచ్చే ఏడాది 3.50 లక్షల మందికి కనెక్షన్లు ఇస్తామని సభ్యులు కొండా సురేఖ, బొడిగె శోభ, గొంగిడి సునీత అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. 227 చైన్ స్నాచింగ్లు: నాయిని ప్రస్తుత ఏడాదిలో ఇప్పటిరవకు 227 చైన్ స్నాచింగ్లు జరిగాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు జె.గీత, డీకేఅరుణ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. గతేడాది 582 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ నేరాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. కృష్ణాపుష్కరాలపై 8న సమావేశం వచ్చే ఏడాది కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఇప్పటికే మహబూబ్నగర్లో16, నల్లగొండలో 19స్నాన ఘట్టాలున్నాయని, కొత్త వాటిపై ప్రతిపాదనలు కోరామని వివరించారు. పుష్కరాలపై ఈనెల 8న సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సమక్క-సారక్క జాతరకు రూ.107 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలు అందాయని సభ్యులు వేముల ప్రశాంత్రెడ్డి, పుట్టా మధు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కేంద్ర న్యాయశాఖ మంత్రి లేఖ రాశారని వివరించారు. -
పుష్కరాలకు దీటుగా మేడారం
2016 ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకూ జాతర * రూ.182 కోట్లతో సౌకర్యాలు: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మేడారం సమ్మక్క, సారక్క తొలి జాతరను గోదావరి పుష్కరాలకు దీటుగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 2016 ఫిబ్రవరి 17 నుంచి 20 జరగనున్న మేడారం జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రోడ్లు, రవాణా, తాగునీరు, పారిశుధ్యం, రక్షణ తదితర సదుపాయాలను కల్పించేం దుకు రూ.182 కోట్ల వ్యయంతో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో కలిసి బుధవారం సచివాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అక్టోబర్ 20లోపు టెండర్ల ప్రక్రియ ముగించి, తర్వాతి 3 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నా రు. కోటి 25 వేల మంది భక్తులు తరలివచ్చే మేడారం జాతర ఏర్పాట్లను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. మేడారంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే సమ్మక్క, సారక్క జాతరలకు సైతం ఏర్పాట్లు చేస్తామన్నారు. మేడారం జాతర సందర్భంగా గాల్లో పోలీసు కాల్పులు జరపడం ఆనవాయితీగా వస్తున్నదని, ఇప్పటివరకు అనధికారికంగా నిర్వమిస్తున్న ఈ సంప్రదాయాన్ని గిరిజన దేవుళ్లపై గౌరవంతో అధికారికంగా జరపాలని సీఎం కేసీఆర్ను కోరతామని ఎంపీ సీతారాం నాయక్ చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, దేవాదాయ కార్యదర్శి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. మేడారం జాతర ముఖ్యఘట్టాలు ఫిబ్రవరి 17: కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. ఫిబ్రవరి 18: చిలకలమ్మ గుట్టపై నుంచి సమ్మక్కను గద్దెపైకి తీసుకొస్తారు. ఫిబ్రవరి 19: సమ్మక్క, సారక్క మహాజాతర. కోటి మందికిపైగా భక్తులు మొక్కు తీర్చుకుంటారని అంచనా. ఫిబ్రవరి 20: అమ్మవారు వన ప్రవేశం -
ప్రత్యేక హైకోర్టుతోనే సంపూర్ణ తెలంగాణ
విభజన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాం న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హైకోర్టుతోనే సంపూర్ణ తెలంగాణ సాధ్యమవుతుందని న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని, టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ను స్తంభింపజేశారని తెలిపారు. నాంపల్లి క్రిమినల్ కోర్టులో బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన వార్షిక సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. హైకోర్టు విభజన జరిగితే న్యాయశాఖలో అనేక ఖాళీలు ఏర్పడతాయని.. జడ్జి పోస్టులను కూడా భర్తీ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లకు వచ్చే వడ్డీని జూ నియర్ న్యాయవాదులకు అందేలా చూస్తామని తెలిపారు. అలాగే న్యాయవాదులకు హెల్త్కార్డులు, గృహ నిర్మాణ సదుపాయాన్ని కల్పించే విషయమై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం స్పోర్ట్స్ లాంజ్ను, బార్ అసోసియేషన్ వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి టి.రజని, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యు లు, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావు, ఫెడరేషన్ అధ్యక్షులు బి.కొండారెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు చింతల క్రిష్ణ, భూపాల్రాజ్, సంపూర్ణ, తిరుపతి వర్మ, వినోద్కుమార్ పాల్గొన్నారు. -
గోపురాలు ఎక్కడమే పరిష్కారమా?
అర్చకుల సమ్మెపై ఇంద్రకరణ్ మేడ్చల్: గుళ్లు, గోపురాలు ఎక్కితే సమస్యలు పరిష్కారమవుతాయా.. అని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రశ్నించారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ పరిధిలోని అత్వెల్లిలో జరుగుతున్న రాఘవేంద్రస్వామి ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలంటూ రాష్ట్రంలో ఆలయాల సిబ్బంది, అర్చకులు చేస్తున్న సమ్మె అనవసరమైనదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అర్చకుల కోసం పీఆర్సీ అమలు చేయడంతోపాటు, రూ.100 కోట్లతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అర్చకుల డిమాండ్లపై ప్రభుత్వం కమిటీ వేసిందని, నివేదిక రాకముందే సమ్మె చేయ డం అర్థరహితమ న్నారు. గోపురం ఎక్కిన అర్చకులు వర్గల్: మెదక్ జిల్లా నాచగిరిలో అర్చకులు సోమవారం ఆలయ గోపురం ఎక్కి నిరసన తెలిపారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి గంటపాటు ఆందోళన కొనసాగించారు. నినాదాలతో హోరెత్తించారు. గజ్వేల్-తూప్రాన్ మార్గం లో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, గడా అధికారి హన్మంతరావు ఫోన్ చేసి అర్చకులతో మాట్లాడి నచ్చచెప్పారు. దీంతో ఆందోళన విరమించారు. -
80 శాతం ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్ : గోదావరి పుష్కరాలను ఘ నంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని దేవాదాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా నిర్వహిస్తున్న పుష్కరాలు ఈనెల 14 నుంచి 25 వరకు జరుగుతాయని, పుష్కరస్నానాలకు కోట్లాది మంది భక్తులు వస్తారని భావిస్తున్నట్లు బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో చెప్పారు. ఐదు జిల్లాల్లో గోదావరి పరీవాహక ప్రాంతంలో 106 ఘాట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 12 ఏళ్ల క్రితం జరిగిన పుష్కరాల్లో తెలంగాణలో కేవలం 27 ఘాట్లనే ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. నిజామాబాద్ జిల్లా కుందకుర్తి నుంచి మొదలుకొని భద్రాచలం వరకు ఘాట్ల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. ఘాట్లకు అనుసంధానంగా రోడ్ల నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయన్నారు. పుష్కరాల నిర్వహణకు రూ.650 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని రూ.700 కోట్ల సాయం కోరితే కేవలం రూ. 50 కోట్లు మాత్రమే కేటాయించారని, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రూ.100 కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. పుష్కరాల గురించి విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు సాయం పెంచే ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు. 106 ఘాట్ల కోసం రూ. 105.39 కోట్లు కేటాయించామని, రోడ్లు, ఇతర పనులకు ఆర్ అండ్బీ ద్వారా రూ. 250 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. పంచాయతీ రాజ్శాఖకు రూ.75 కోట్లు, మంచినీటి కోసం రూ.35 కోట్లు, దేవాదాయశాఖకు రూ. 20కోట్లు, బందోబస్తుకు రూ.25 కోట్లు, ట్రాన్స్కోకు రూ.12 కోట్లు, ఆరోగ్యశాఖకు రూ.2.5 కోట్లు కేటాయించి ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. భక్తుల కోసం 2,300 బస్సు సర్వీసులను, 84 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామన్నారు. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలంలో ప్రత్యేకంగా హెలిప్యాడ్లు ఏర్పాటుచేసి, రెండు హెలికాప్టర్లను హైదరాబాద్ నుంచి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. బందోబస్తు కోసం 18 వేల మంది పోలీసు సిబ్బంది అవసరమని, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పోలీసులను రప్పిస్తున ్నట్లు చెప్పారు. ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బుర్రకథ, ఒగ్గుకథ, చిందు యక్షగానాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. రాష్ట్రపతి, ప్రధానిని కూడా ఆహ్వానించామని, భద్రాచలంకు హిమాలయాల నుంచి నాగసాధువులను ఆహ్వానించామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ పాల్గొన్నారు. -
త్రిమూర్తుల
పూజ చేసి ప్రారంభించిన గవర్నర్, సీఎం, చినజీయర్ స్వామి రాజగోపురం, మహాప్రాకారాలకు గుట్టపైన.. ఆలయ అభివృద్ధి పనులకు పెద్దగుట్ట వద్ద నమూనా ప్లాన్ను ఛాయాచిత్ర ప్రదర్శన ద్వారా వీక్షణం ఆలయ అభివృద్ధి కోసం పలు సూచనలు చేసిన సీఎం కేసీఆర్ మిథునలగ్న ముహూర్తాన పూజలు చేసిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఆధ్యాత్మిక కేంద్రమైన యాదగిరిగుట్ట (యాదాద్రి) అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. లక్ష్మీనారసింహ క్షేత్ర అభివృద్ధి కోసం తయారుచేసిన ప్రతిపాదనల మేరకు అభివృద్ధి పనులతో పాటు రాజగోపురం ఎత్తు పెంపు, మహాప్రాకార నిర్మాణానికి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్. నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీత్రిదండి శ్రీ మన్నారాయణ చినజీయర్స్వామిల చేతుల మీదుగా శనివా రం శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ త్రిమూర్తులు ముగ్గురూ దాదాపు 3:40 నిమిషాల పాటు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో పర్యటించి భూమిపూజ చేశారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంత రం ఆలయ ద్వారం సమీపంలో రాజగోపురం, మహాప్రాకా రం పనులను, పెద్దగుట్ట వద్ద ఆలయ అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. కుటుంబ సమేతంగా వచ్చిన గవర్నర్ శంకుస్థాపనల తర్వాత హైదరాబాద్ వెళ్లిపోగా, సీఎంతో పాటు చినజీయర్స్వామిలు ఆలయ అభివృద్ధిపై జిల్లా ఉన్నతాధికారులు, వైటీడీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు హెలికాప్టర్లలో.. తొలుత అనుకున్న విధంగా కాకుండా సీఎం పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో వస్తారని అనుకున్నా ఆయన హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో గుట్టకు చేరుకున్నారు. ఒక హెలికాప్టర్లో చినజీయర్స్వామి, మరో హెలికాప్టర్లో గవర్నర్ కుటుంబ సభ్యులు ఉదయం 11:20 నిమిషాల కల్లా గుట్టకు చేరుకున్నారు. అక్కడి నుంచి సీఎం, చినజీయర్స్వామిలు సీఎం కాన్వాయ్లో గుట్టపైకి రాగా, 10 నిమిషాల తర్వాత గవర్నర్ నరసింహన్, సతీమణి విమలా నరసింహన్తో కలిసి గుట్టపైకి వచ్చారు. వారి కోసం ఆలయద్వారం వద్దే చినజీయర్స్వామితో పాటు మంత్రులు, అధికారులు వేచి ఉన్నారు. గవర్నర్ దంపతులు వచ్చిన తర్వాత అందరూ కలిసి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ద్వారానికి సమీపంలో ఏర్పాటు చేసిన రాజగోపురం, మహాప్రాకారం నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అక్కడి నుంచి పెద్దగట్టుకు వెళ్లి అభివృద్ధి పనులు ప్రారంభించారు. అక్కడి నుంచి గవర్నర్ దంపతులు వెళ్లిపోగా, సీఎం కేసీఆర్, చినజీయర్ స్వామిలు మళ్లీ గుట్టపైకి వచ్చారు. అక్కడి ఆండాళ్ నిలయంలో భోజనం చేసిన అనంతరం ఆలయ అభివృద్ధిపై ప్రముఖ ఆర్కిటెక్ట్, క్రియేటివ్ డెరైక్టర్ ఆనంద్సాయి రూపొందించిన నమూనా ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించారు. అక్కడే వైటీడీఏ అధికారులు, కలెక్టర్ సత్యనారాయణరెడ్డిలతో మాట్లాడిన సీఎం.. ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. అనంతరం మధ్యాహ్నం 2:40 గంటలకు ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు. హెలిప్యాడ్ వద్ద చినజీయర్ స్వామికి స్వాగతం పలికిన సందర్భంగా గవర్నర్ దంపతులతో పాటు సీఎం కేసీఆర్ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయడం గమనార్హం. అయితే, అంతకు ముందు నిర్ణయించిన విధంగా మిధునలగ్న ముహూర్తాన ఆలయ అర్చకులు రాష్ట్ర దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేత పూజలు చేయించి అభివృద్ధిపనుల ప్రారంభానికి అంకురార్పణ చేశారు. ముగ్గురూ ముగ్గురే యాదాద్రి అభివృద్ధి పనులను ప్రారంభించిన ముగ్గురూ ముగ్గురేనని ఆధ్యాత్మిక వాదులు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర గవర్నర్కు దైవ భక్తి మెండు అని, ఆయనకు ఆగమ శాస్త్రంపై కూడా అవగాహన ఉందని, ఇక, యాగాలు నిర్వహించే స్థాయిలో భక్తి ఉన్న సీఎం కేసీఆర్, ఏకంగా దేశంలోనే గుర్తింపు పొందిన మఠాధిపతి అయిన చినజీయర్ స్వామిలు యాదాద్రి అభివృద్ధి పనులను ప్రారంభించడం గొప్ప విశేషమనే చర్చ ఆ వర్గాల్లో జరుగుతోంది. ఈ పర్యటనలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన ‘యాదాద్రి’ అనే భక్తి చానల్తో పాటు మాసపత్రికను కూడా సీఎం ప్రారంభించి, ఆవిష్కరించారు. మళ్లీ వస్తా... తన పర్యటనలో భాగంగా యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో మాట్లాడుతూ త్వరలోనే మళ్లీ గుట్టకు వస్తానని ఇక్కడే బస చేసి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. గుట్ట అభివృద్ధికి ఉన్న సమస్యలను సీఎంకు వివరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ మళ్లీ వారం పదిరోజుల్లో వస్తా.. అవసరమైతే ఇక్కడే బసచేసి ఆయా వర్గాలతో మాట్లాడి సమస్యలు పరిష్కరించి వెళతా’ అని చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆలయ అభివృద్ధి కోసం రూపొందించిన నమూనా చిత్రాలు, మాస్టర్ప్లాన్లపై మరింత చర్చ జరపాలని, మరో రెండు, మూడు భేటీల తర్వాత తుది నమూనాను రూపొందిద్దామని కూడా సీఎం చెప్పినట్టు సమాచారం. సీఎం పర్యటన సందర్భంగా డీ ఐజీ గంగాధర్, ఏఎస్పీ గంగారాంల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పర్యటనలో పాల్గొంది వీరే... యాదాద్రి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా మంత్రి జగదీష్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, ఎంపీ బూరనర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, గాదరి కిశోర్, జ్యోతిష్యనిపుణుడు దైవజ్ఞశర్మ, టీఆర్ఎస్ నేతలు బండా నరేందర్రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, నోముల నర్సిం హయ్య, జెల్లా మార్కండేయులుతోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, దైవజ్ఞశర్మ, వైటీడీఏ వైస్చైర్మన్ కిషన్రావు, కమిటీ కన్వీనర్ ఎంజీగోపాల్, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్,ఈఓ గీతారెడ్డి, ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి తదితరులున్నారు. ఎప్పుడు.. ఏమయింది? ఉదయం .. 11:05 -రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం కేసీఆర్ 11:18 - హెలికాప్టర్లో గుట్టకు చినజీయర్స్వామి రాక 11:26 - మరో హెలికాప్టర్లో గవర్నర్ కుటుంబం రాక 11:34 - సీఎం కేసీఆర్ .. చినజీయర్స్వామితో కలిసి గుట్టపైకి 11:45 - గవర్నర్ రాక.. అందరూ కలిసి ఆలయంలోనికి 12:18 - ప్రత్యేక పూజల అనంతరం ఆలయం బయటకు వచ్చిన గవర్నర్, సీఎం, చినజీయర్స్వామి 12:25 - రాజగోపురం, మహాప్రాకారం పనులకు శంకుస్థాపన 12:37 - పెద్దగుట్టకు పయనం 12:50 -పెద్దగుట్టకు చేరుకున్న గవర్నర్, సీఎం, చినజీయర్స్వామి మధ్యాహ్నం .. 1:00 - ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన 1:10 - పెద్దగుట్ట నుంచి గుట్టపైకి పయనం 1:25 - గుట్టపైన ఉన్న ఆండాళ్ నిలయానికి రాక 1:30 - భోజనం 1:50 - భోజనం ముగింపు 1:55 - సంగీత భవన్కు కేసీఆర్, చినజీయర్ స్వామి 2:40 - ఛాయాచిత్ర పదర్శన.. చిన్నపాటి సమీక్ష అనంతరం హైదరాబాద్కు పయనం. -
చెరువు కన్నతల్లిలాంటిది
చేవెళ్లలో పుష్కరిణి పనుల ప్రారంభోత్సవ సభలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సుందరీకరణ, పునరుద్ధరణ పనులను దత్తత తీసుకున్న పోలీసుశాఖ చేవెళ్ల : చెరువు కన్న తల్లిలాంటిదని, వాటిని పునరుద్ధరించుకుంటే భూగర్భజలాలు పెరుగుతాయని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. చేవెళ్లలో పుష్కరిణి పనులను శనివారం ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు చేపలను పెంచుకోవచ్చని, వ్యవసాయదారులు సాగునీటికి వాడుకోవచ్చునన్నారు. చేవెళ్లలోని పురాతన శ్రీవెంకటేశ్వర దేవాలయ పునరుద్ధరణ, అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి రూ.50 లక్షలు మంజూరు చేయించడానికి కృషిచేస్తానని చెప్పారు. పోలీసులు గుండం అభివృద్ధిని దత్తత తీసుకోవడాన్ని ఆయన అభినందించారు. రాష్ట్ర రవాణామంత్రి పి.మహేందర్రెడ్డి మాట్లాడుతూ 46 వేల చెరువులను గుర్తించగా, వీటిలో మొదటి విడతగా 10 వేల చెరువులను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 2,800 చెరువులకు ఈసంవత్సరం 558 చెరువులను పునరుద్ధరిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు చెరువుల పునరుద్ధరణను పూర్తిగా విస్మరించాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో పగలే వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ను అందిస్తామని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలలో పోలీసులు భాగస్వాములు కావడం అభినందనీయమాన్నారు. డీఐజీ గంగాధర్, ఎస్పీ ఎం.శ్రీనివాసులు మాట్లాడుతూ శాంతిభద్రతలతో పాటుగా సీఎం కేసీఆర్ పిలుపుమేరకు స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెప్పారు. ముందుగా స్థానిక వెంకటేశ్వర దేవాలయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్యకు జన్మదిన సందర్భంగా వేదికపైనే మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మహేందర్రెడ్డి కేక్ను కట్చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు పి.నరేందర్రెడ్డి, యాదవరెడ్డి, డీఎస్పీ ఏవీ.రంగారెడ్డి, ఆర్డీఓ చంద్రమోహన్, సీఐ ఉపేందర్, ఎస్ఐలు రాజశేఖర్, ఖలీల్, ఎంపీపీ ఎం.బాల్రాజ్, జెడ్పీటీసీ సభ్యురాలు చింపుల శైలజ, సర్పంచ్ నాగమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు పద్మ, వైస్ ఎంపీపీ పి.వెంకట్రెడ్డి, వార్డుసభ్యురాలు అంతమ్మ, మాణిక్రెడ్డి, బర్కల రాంరెడ్డి, రామేశ్వర్రెడ్డి, ఎం.యాదగిరి, నీటి పారుదల అధికారులు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
అందరి సహకారం అవసరం
మిషన్ కాకతీయ పనులు ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ రూరల్: మిషన్ కాకతీయకు అన్ని వర్గాల సహకారం అవసరమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లపెల్లి గ్రామంలోని పాతచెరువు పునరుద్ధరణ పనులను నిర్మల్ డివిజన్ పోలీసులు అధికారులు, సిబ్బంది దత్త తీసుకుని మంగళవారం శ్రమదానం చేశారు. మంత్రి, జిల్లా ఎస్పీ తరుణ్జోషి పనులను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. పోలీసులు చెరువును దత్తత చేసుకోవడం అభినందనీయమన్నారు. పోలీసు శాఖను ఆదర్శంగా తీసుకోని అన్ని శాఖాల అధికారులు ఒక్కో చెరువు దత్తత తీసుకుని కాకతీయ మిషన్ను విజయవంతం చేయాలన్నారు. త్వరలో అమలు చేయబోయే డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని ఎల్లపెల్లిలో ప్రారంభించనున్నామన్నారు. అనంతరం ఎస్పీ తరున్జోషి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పోలీసు శాఖ భాగస్వామ్యం అవుతోందన్నారు. మిషన్ కాకతీయ, హరితహారం పథకాలకు తమ శాఖ ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. డీఎస్పీ మనోహర్రెడ్డి, ఎంపీపీ అల్లోల సుమతిరెడ్డి, ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి, సర్పంచ్ భీంరావు, సీఐలు పురుషోత్తమచారి, జీవన్రెడ్డి, ఎస్సైలు రమణమూర్తి, మహేంధర్రెడ్డి, సునీల్కుమార్, మల్లేష్, రాంనర్సింహారెడ్డి, నవీన్, శ్రీనివాస్, నాయకులు ముత్యంరెడ్డి, తుల శ్రీనివాస్, గోవర్ధన్రెడ్డి, జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కుంభమేళా’పై కుంభకర్ణ నిద్ర!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యమనే కుంభకర్ణ నిద్ర పోతుండటంతో వాటి ఏర్పాట్లలో ప్రణాళిక గల్లంతైంది. పుష్కరాలకు కేవలం 3 నెలల గడువే ఉన్నప్పటికీ పుష్కర ఘాట్లు, రోడ్ల నిర్మాణం, దేవాలయాల వద్ద వసతుల కల్పన వంటి పనులేవీ మొదలు కాలేదు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పర్యటన సందర్భంగా బాసర వద్ద 3 రోజుల క్రితం హడావుడిగా పుష్కరఘాట్లకు శ్రీకారం చుట్టిన అధికారులు మంథని, కాళేశ్వరం, ధర్మపురి, కోటిలింగాల తదితర ప్రాంతాల్లో మాత్రం పనులను ప్రారంభించలేదు. గడువులోగా పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా వర్షాకాలం మొదలయ్యే నాటికి పనులు పూర్తికాకుంటే ఆ తర్వాత హడావుడిగా నిర్వహించినా వానల దెబ్బకు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహా కుంభమేళాకు ఏడాది ముందే పనులు చేపట్టింది. ఇప్పుడు మహారాష్ట్ర సర్కారు కూడా అదే బాటలో పయనిస్తోంది. కానీ మన ప్రభుత్వ విభాగాలు మాత్రం ముందస్తు ఏర్పాట్లలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. స్థల సేకరణా జరగని తీరు.. గోదావరి పుష్కరాల్లో అతి ముఖ్యమైనవి స్నానఘట్టాలు, మహిళలు వస్త్రాలు మార్చుకునే గదులు. వీటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు కొన్ని చోట్ల కనీసం స్థల సేకరణ కూడా పూర్తి కాలేదు. ధర్మపురి, బాసర దేవాలయాల వద్ద గోదావరి ఒడ్డు వద్ద ఆలయాలకు సంబంధించి ఎక్కువగా స్థలం లేదు. ఈ ప్రాం తాల్లో కచ్చితంగా ప్రైవేటు స్థలాలను ఎంపిక చేయాల్సిందే. కానీ ఇప్పటి వరకు ఆ కసరత్తు పూర్తికాలేదు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం లాంటి దేవాలయాల వద్ద అధికారులు చేతులెత్తేసేలా కనిపిస్తోంది. గతంలో సరస్వతీ పుష్కరాలు, ప్రాణహిత పుష్కరాలప్పుడు అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేసి చేతులెత్తేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఇప్పుడూ అదే పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. ముందుకు సాగని రోడ్ల పనులు... పుష్కరాల నేపథ్యంలో గోదావరి తీరంలోని దేవాలయాలకు మంచి రోడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం 35 పనులను గుర్తించి రూ.250 కోట్లను రోడ్లు భవనాల శాఖకు కేటాయించింది. కానీ టెండర్ కసరత్తు ఇటీవలే పూర్తై ఆ పనుల్లో 3, 4కు మించి ప్రారంభం కాలేదు. కాళేశ్వరం దేవాలయానికి గంగారం నుంచి దామరకుంట, అన్నారం మీదుగా 30 కిలోమీటర్ల మేర రూ. 33 కోట్లతో రెండు వరసల రోడ్డు నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నిర్మాణ సామగ్రి కూడా అక్కడికి చేరలేదు. ఈ దేవాలయం వద్ద కేవలం 36 గదులే ఉన్నాయి. గదుల కొరత తీవ్రంగా ఉంది. ఈసారి భక్తుల సంఖ్య భారీగా పెరగనున్నందున గతంలో సరస్వతీ పుష్కరాల సమయంలో నిర్మించినట్లుగా షెడ్లను రెట్టింపు చేయాలని ఆలయ కమిటీ ప్రతిపాదిస్తే దాన్ని ప్రభుత్వం తిరస్కరించింది. ఇప్పుడూ ఇన్చార్జిల పాలనే పుష్కరాల సమయంలో ఆయా ఆలయాలకు అధికారులను కేటాయించాల్సి ఉన్నా కరీంనగర్ జిల్లా దేవాలయాల వద్ద పరిస్థితులను పర్యవేక్షించాల్సిన అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వరరావును వేములవాడ ఇన్చార్జి కమిషనర్గా నియమించారు. ఆయన కార్యాలయంలో సూపరింటెండెం ట్ కేడర్ అధికారిని ధర్మపురి ఆలయ ఇన్చార్జి కమిషనర్గా నియమించారు. సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఈవో రాజ్కుమార్కు మంథని గోదావరి పుష్కర ప్రాంత అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిం చారు. ఆయన ఇప్పటికే 15 ఆలయాల బాధ్యత చూస్తున్నారు. ఆలయాల అభివృద్ధి పనులకు కొన్నింటికి టెండర్లు పూర్తి కాలేదు. -
కుంభమేళా తరహాలో పుష్కరాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బుధవారం శాసనసభలో టీఆర్ఎస్ సభ్యులు కొప్పుల ఈశ్వర్, దివాకర్రావు, పుట్టామధు, కాంగ్రెస్ సభ్యులు కిష్టారెడ్డి, డీకే అరుణ, బీజేపీ సభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్లు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. పుష్కరాల సందర్భంగా రోడ్ల నిర్మాణం కోసం ఆర్అండ్బీ నుంచి రూ.182కోట్లు, పంచాయతీరాజ్ నుంచి రూ.57కోట్లు, ఘాట్ల నిర్మాణానికి ఇరిగేషన్ నుంచి రూ.82 కోట్లు కేటాయించామని, మరో రూ.750 కోట్ల కేంద్ర సాయాన్ని కోరామని తెలిపారు. ఆర్టీసీ 900 నుంచి 1500 ప్రత్యేక బస్సులు నడపనుందని, అలాగే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రధాని, రాష్ట్రపతిని పుష్కరాలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గోదాముల నిర్మాణానికి రూ.1,024కోట్లు : హరీశ్రావు రాష్ట్రంలో సుమారు 21 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంగల గోదాముల కొరత ఉందని మంత్రి టి.హరీశ్రావు తెలిపారు. కొరత తీర్చడానికి మొదట 15లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాములను నిర్మిస్తామని దీనికోసం రూ.1,024 కోట్లు వ్యయం చేయనున్నామని తెలిపారు. బుధవారం సభలో సభ్యులు హన్మంతు షిండే, సోమారపు సత్యనారాయణ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ ఈ విషయం తెలిపారు. ప్రభుత్వ భవనాలను విక్రయించం: మంత్రి మహమూద్ అలీ ప్రభుత్వ భూములను, భవనాలను విక్రయించడం ద్వారా ఆర్థిక వనరులను సమీకరించాలన్న ఉద్దేశమేదీ ప్రభుత్వానికి లేదని రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు డీకే అరుణ, పువ్వాడ అజయ్, జీవన్రెడ్డిలు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. గోల్కొండ పరిరక్షణకు చర్యలు: మంత్రి చందూలాల్ గోల్కొండ కోట పరిరక్షణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. కోట లోపల ఉన్న చారిత్రక నిర్మాణాల పరిరక్షణ కోసం రూ.65.90 లక్షల వ్యయంతో పురావస్తు శాఖ పలు చర్యలు చేపట్టగా, రూ.1.20 కోట్లతో కోటలో సౌండ్ అండ్ లైట్ షోను మెరుగు పరిచేందుకు చర్యలు చేపట్టామన్నారు. పెరిగిన సైబర్ నేరాలు : హోంమంత్రి నాయిని హైదరాబాద్లో సైబర్ నేరాలు పెరిగాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు మల్లు భట్టి విక్రమార్క, కిష్టారెడ్డి, డీకే అరుణ అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ, హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 2014లో 632 కేసులు నమోదైనట్లు వివరించారు. 2013లో 276, 2012లో 110, 2011లో 105 కేసులు నమోదయ్యాయని తెలిపారు. -
రూ.20 కోట్లతో ఏడుపాయల అభివృద్ధి
పాపన్నపేట : ఏడుపాయల అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రకటించారు. మంగళవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డితో కలిసి దుర్గమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఆయన ఒడిబియ్యం పోసి ఏడుపాయల జాతరను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ లక్షలాది భక్తుల కొంగుబంగారమైన ఏడుపాయల అభివృద్ధి కోసం రూ.20కోట్లు మంజూరు చేసి ఏడాదిలోగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మాస్టర్ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా ఏడుపాయలను తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణ రాష్ర్టంలో జరుగుతున్న మొదటి జాతర కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. కోటి విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి, జాన పదుల విశ్వాసాలకు నిలయమైన జాతరను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నెల రోజులుగా జాతర నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిందన్నారు. జల సమాధులు జరగకుం డా ఉండడానికి నది ఒడ్డున ఫౌంటెన్లు ఏర్పాటు చేశామన్నారు. రూ.5.25 కోట్లతో ఏడుపాయలకు రోడ్డు వెడల్పు, రూ.25లక్షలతో ఆలయం ముందు కొత్తగా బ్రిడ్జి నిర్మించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది వరకు ఏడుపాయల రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. -
ఈసారి 'పుష్కరాల'కు ప్రత్యేకం
హైదరాబాద్: ఈ ఏడాది గోదావరి పుష్కరాలను జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. కేవలం ఏర్పాట్ల కోసమే రూ.425 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. గోదావరి ప్రవహించే ఐదు జిల్లాల్లో మొత్తం 69 స్నాన ఘట్టాలను నిర్మిస్తామని ఆయన అన్నారు.