National Politics
-
కళ్లెదుటి ఫలితాలకు కారణమేంటి?
గడచిన సార్వత్రిక ఎన్నికలు అన్ని పక్షాలనూ సమంగా ఆశ్చర్యపరిచాయి. మునుపటికన్నా ఎక్కువ మెజారిటీ సీట్లు సాధిస్తామని ఆశించిన బీజేపీ కలలు కల్లలుకాగా, అందలం అందుకోవటమే ఆలస్యమన్నట్టు పొంగిపోయిన ఇండియా కూటమికి భంగపాటు తప్పలేదు. ఈ ఫలితాల ఆంతర్యమేమిటి... ఎవరెవరు ఎలా, ఎందుకు దెబ్బతిన్నారన్న అంశాలపై సీనియర్ పాత్రికేయుడు, టీవీ న్యూస్ ప్రెజెంటర్ రాజ్దీప్ సర్దేశాయి వెలువరించిన తాజా పుస్తకం ‘2024 ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా’. ఈ అసమ సమాజంలో నిత్యం దగా పడుతున్న సగటు మనిషి మౌనంగా, ప్రశాంతంగా ఉన్నట్టు కనబడుతూనే నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా ఇచ్చిన తీర్పు ఇది అంటారు రాజ్దీప్. అందుకే ఈ ఎన్నికల అసలు విజేత సగటు వోటరేనని చెబుతారు.పార్లమెంటరీ రాజకీయాలపై ఎంతో ఆసక్తి ఉన్నవారికి సైతం వెగటుపుట్టించే విధంగా మన ఎన్నికల తంతు తయారైంది. ఇంతటి రణగొణ ధ్వనులమధ్య కూడా నాయకులతో చర్చించటం, సాధారణ పౌరులను కలవటం, ఎవరివైపు మొగ్గు ఉందో అంచనావేయటం వివిధ చానెళ్లు చేస్తున్న పని. దీన్ని ఎంతో నిష్ఠగా, దీక్షగా నెరవేర్చే కొద్దిమంది పాత్రికేయుల్లో రాజ్దీప్ సర్దేశాయ్ ఒకరు.ఉత్తేజాన్నివ్వని హ్యాట్రిక్!రాజ్దీప్ తాజా పుస్తకం ‘2024 ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్డ్ ఇండియా’ 528 పేజీల సమగ్ర గ్రంథం. ఇప్పుడే కాదు... ‘2014 ది ఎలక్షన్ దట్ ఛేంజ్డ్ ఇండియా’ మొదటి పుస్తకంగా, 2019 ‘హౌ మోదీ వన్ ఇండియా’ రెండో పుస్తకంగా వచ్చాయి. తాజా పుస్తకం మూడోది. దీనికి ‘హ్యాట్రిక్ 2024’ అన్న శీర్షిక పెడదామనుకున్నారట. కానీ ఫలితాలు విశ్లేషించాక పునరాలోచనలో పడ్డారట. రచయిత దృక్ప థమేమిటో పుస్తకం శీర్షికే వెల్లడిస్తుంది. స్వతంత్ర భారతంలో నెహ్రూ తర్వాత వరసగా మూడోసారి అందలం అందుకున్నది మోదీ మాత్రమే! ఆ రకంగా ఆయనకైనా, బీజేపీకైనా ఇది ఘనవిజయం కిందే లెక్క. కానీ 272 అనే ‘మేజిక్ మార్క్’ ఎక్కడ? కనీసం దాని దరిదాపుల్లోకి కూడా రాలేక 240 దగ్గరే బీజేపీ ఆగిపోయింది. అందుకే ‘హ్యాట్రిక్’ విజయోత్సవ హోరు లేదు. 2024 ఎన్నికలు అందరినీ సమంగా ఆశ్చర్యపరిచాయి. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అని ప్రధాని నరేంద్ర మోదీ నినాదమిచ్చి తమ శ్రేణుల్ని ముందుకురికించారు.అందరం కలిశాం గనుక, ‘ఇండియా’ అన్న సంక్షిప్తీకరణ పదం దొరి కింది గనుక విజయం ఖాయమన్న భ్రమలో ప్రతిపక్ష కూటమి నాయ కులున్నారు. లాక్డౌన్తో జనం ఆర్థిక అగచాట్లు, వేలాది కిలోమీటర్ల నడక, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం, పీఎమ్ కేర్స్ ఫండ్, సాగుచట్టాల వ్యతిరేక ఉద్యమం, సీఏఏ, విపక్ష సర్కార్ల కూల్చివేతలు, విద్వేష పూరిత ప్రసంగాలు... ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వంపై ఏవగింపు కలిగించాయని ‘ఇండియా’ కూటమి నమ్మింది. విపక్ష నేతలపై ఈడీ, ఐటీ దాడులు, అరెస్టులు విపక్ష వ్యూహాన్ని ఏదో మేర దెబ్బతీసిన మాట వాస్తవమే. కానీ ఇందుకే మెజారిటీ సాధనలో ‘ఇండియా’ విఫలమైందని చెప్పటం కష్టమంటారు రాజ్దీప్. బిహార్ సీఎం నితీష్కుమార్ను చేజార్చుకోవటం, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ విషయంలో తప్ప టడుగుల వంటివి దెబ్బతీశాయన్నది ఆయన విశ్లేషణ. ఇలాంటివి చోటుచేసుకోనట్టయితే బీజేపీకి ఇప్పుడొచ్చిన 240 స్థానాల్లో మరో 40 వరకూ కోతపడేవని రాజ్దీప్ అభిప్రాయం. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్డీయేగా బరిలోకి దిగినా బీజేపీ సొంతంగానే మెజా రిటీ సాధించుకుంది. కేవలం మిత్ర ధర్మాన్ని పాటించి మాత్రమే భాగ స్వామ్య పక్షాలకు పదవులిచ్చింది. ఇప్పుడలా కాదు... నిలకడలేని టీడీపీ, జేడీ(యూ) వంటి పార్టీల దయాదాక్షిణ్యాలపై నెట్టుకురాక తప్పదు.ఒక్కటైన దళిత, ముస్లిం వర్గాలుగతంలో ఇతర వర్గాలతోపాటు వెన్నుదన్నుగా నిలిచిన దళిత ఓటుబ్యాంకు 2024 ఎన్నికల్లో బీజేపీకి దూరమైందని రాజ్దీప్ చెబు తారు. బీజేపీకి భారీ మెజారిటీ వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని ఆ వర్గాలు భయపడ్డాయి. కంచుకోట అనదగ్గ యూపీలో 2022లో ‘బుల్డోజర్ మ్యాండేట్’ వస్తే రెండేళ్లు గడిచేసరికల్లా ‘మండలైజ్డ్ కుల స్పృహ’ పెరిగి దళిత ఓటుబ్యాంకుకు అక్కడ 10 శాతం కోతపడిందని ఆయన విశ్లేషణ. వీరికి ముస్లింల ఓటు బ్యాంకు తోడైందంటారు. 2015–16 నుంచి 2022–23 మధ్య సంఘటిత రంగంలో 63 లక్షలు, అసంఘటిత రంగంలో కోటీ 60 లక్షల ఉద్యోగాలు ఆవిరయ్యాయన్న ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఐఆర్ఆర్) సంస్థ గణాంకాలను రాజ్దీప్ ఉటంకిస్తారు. రాజ్దీప్ పుస్తకం కళ్ల ముందు జరిగిన అనేక పరిణామాల వెనకున్న కారణాలేమిటో, నాయకుల అతి విశ్వాసంలోని అంతరార్థమేమిటో విప్పిజెబుతుంది. మనమంతా చూస్తున్నట్టు ఇప్పుడేలుతున్నది నిజంగా బీజేపీ యేనా? రాజ్దీప్ లెక్కలు చూస్తే క్షణకాలమైనా ఆ ప్రశ్న రాకమానదు. ఈసారి ఎన్నికల్లో ఏకంగా 114 మంది కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన నేతలకు బీజేపీ టిక్కెట్లు వచ్చాయట. బీజేపీ ‘కాంగ్రెస్ ముక్త భారత్’ నినాదం కాస్తా ‘కాంగ్రెస్ యుక్త బీజేపీ’ అయిందంటారాయన. అసలు జాతీయ రాజకీయాల్లో మోదీ ఆగమనానికి ముందే ఒక పార్టీగా కాంగ్రెస్ మతాన్ని పులుముకోవడం, వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం, నిలదీసిన సొంత పార్టీ నేతలపై సైతం అక్రమ కేసులు మోపి జైళ్లపాలు చేయడం వగైరాలు పెంచింది. ఆ రకంగా మోదీ రాకకు ముందే ‘మోదీయిజాన్ని’ పరిచయం చేసింది. ఆ నొప్పి ఎలా ఉంటుందో దశాబ్దకాలం నుంచి చవిచూస్తోంది.ఫలిస్తున్న ‘ప్రచారయావ’ప్రచారం విషయంలో మోదీ తీసుకునే శ్రద్ధను రాజ్దీప్ వివరి స్తారు. గుజరాత్లో బీజేపీ కార్యక్రమాలపై సింగిల్ కాలమ్ వార్త ఇవ్వ టానికి కూడా మీడియా సిద్ధపడని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా రాష్ట్రంలోని 182 నియోజకవర్గాల నుంచీ ప్రచార రథాలను తరలించి అహ్మదాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించాలని ఆయన ప్రతి పాదించారట. ఇందువల్ల డబ్బు ఖర్చుతప్ప ఒరిగేదేమీ లేదని పార్టీ నాయకులు గుసగుసలు పోగా, ర్యాలీ జరిగిన మర్నాడు ఎప్పుడూ లేనట్టు మీడియాలో అది ప్రముఖంగా వచ్చిందట. ప్రచారం భారీ స్థాయిలో చేయటం అప్పటినుంచీ మోదీకి అలవాటు. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ వెనకా ఈ వ్యూహమే ఉంది.‘గోదీ మీడియా’ ప్రస్తావనఅమిత్ షా, రాజ్నాథ్ సింగ్, రాహుల్ గాంధీ, శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ తదితరుల తీరుతెన్నులపై రాజ్ దీప్ వివరంగానే ప్రస్తావించారు. సద్విమర్శలను వ్యక్తిగతంగా తీసు కుని బెదిరించటంలో, అమర్యాదగా ప్రవర్తించటంలో అమిత్ మాల వీయ వంటి కొందరు బీజేపీ నేతల ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పారు. మరోపక్క మీడియా మొత్తాన్ని చాలామంది ఒకే గాటనకట్టి ‘గోదీ మీడియా’గా ముద్రేయటంపై విచారిస్తూనే కొన్ని ప్రధాన చానెళ్ల, పత్రికల తీరుపై ఈ గ్రంథంలో నిశితమైన విమర్శ వుంది. తాను ఈసారి ఎన్డీయే ఓడుతుందని భావించకపోయినా ‘మేజిక్ ఫిగర్’ దాటుతుందని గుడ్డిగా నమ్మిన వైనాన్ని వివరిస్తారు. అదే సమ యంలో ఎప్పుడూ అంచనాలు తప్పని ప్రదీప్ గుప్తా వంటి ప్రఖ్యాత సెఫాల జిస్టు సైతం ఎన్డీయేలో ఒక్క బీజేపీకే 322–340 మధ్య వస్తాయని చెప్పడాన్ని వెల్లడిస్తారు. సుదీర్ఘకాలం ఢిల్లీలో పాత్రికేయు డిగా పని చేసిన అనుభవం, ఉన్నత స్థానాల్లోని వారితో కలిగిన పరి చయాలు పుస్తక రచనలో రాజ్దీప్కు బాగా అక్కరకొచ్చాయి. ‘ఈవీఎంల గారడీ’ ఎక్కడ?అయితే ఒక విమర్శ – ఈవీఎంల వ్యవహారంపై అసోసియేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) ఏకరువు పెట్టిన అంశాల గురించి ప్రస్తావించినా ఆ ఎపిసోడ్ను లోతుగా చర్చించకపోవటం లోటనే చెప్పాలి. వాస్తవానికి దానిపై విడిగా పుస్తకమే రావాలి. మొత్తం 543 నియోజకవర్గాలకుగాను 537 చోట్ల ఈవీఎంలలో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ పొంతన లేదని ఏడీఆర్ బయటపెట్టింది. ‘ఇది కేవలం సాంకేతిక లోపమే... దీనివల్ల అంతిమ ఫలితం తారుమారు కాబోద’ని వాదించటానికి ముందు కనీసం అందుకు హేతుబద్ధమైన సంజాయిషీ ఇవ్వాల్సిన బాధ్యతని ఎన్నికల సంఘం గుర్తించక పోవటం విచారించదగ్గది. మొదలుపెడితే చివరి వరకూ చదివించే శైలితో, ఆశ్చర్యపరిచే సమాచారంతో ఈ పుస్తకం అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి గ్రంథం ఇంగ్లిష్లో మాత్రమే సరి పోదు. ప్రాంతీయ భాషల్లో సైతం వస్తేనే ప్రజల అవగాహన పెరుగుతుంది.తెంపల్లె వేణుగోపాలరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడుvenujourno@gmail.com -
తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్స్ట్రాంగ్ దారుణ హత్య
చెన్నై: బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు చీఫ్ కె ఆర్మ్స్ట్రాంగ్ ( 47) గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురుయ్యారు. చెన్నై పెరంబూర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బైకుల మీద వచ్చిన కొందరు దుండగులు ఆర్మ్స్ట్రాంగ్పై కత్తులతో దాడి చేశారు. ఆ టైంలో ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా గాయపరిచారు. వెంటనే ఆయన్ను స్థానిక రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది.దాడి ఆయన ఇంటికి సమీపంలోనే చోటు చేసుకుందని సెంబియమ్ పోలీసులు తెలిపారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ గెటప్లు వేసుకొచ్చారని, పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతుండగానే కత్తులతో దాడి చేశారని ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. ఆర్మ్స్టాంగ్ హత్యకేసులో శనివారం వేకువజామున పోలీసులు 8 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు. హత్యకు రాజకీయ వైరమా? వ్యక్తిగత కక్షలా? అన్నది తేలాల్సి ఉంది. ఈ హత్యను రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఆయన మృతిపై పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆర్మ్స్ట్రాంగ్ హత్యను ఖండించిన బీఎస్పీ చీఫ్ మాయావతికె ఆర్మ్స్ట్రాంగ్ హత్యపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. ‘ఆర్మ్స్ట్రాంగ్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన్ను గుర్తుతెలియని దుండగులు హత్య చేయటం విచారకరం. ఆయన వృత్తిరీత్యా అడ్వకేట్గా పనిచేశారు. తమిళనాడులో బలమైన దళిత నాయకుడిగా తన గళాన్ని వినిపించేవారు. నిందితులను ప్రభుత్వం శిక్షించాలి’ అని ‘ఎక్స్’వేదికగా స్పందించారు. మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.The gruesome killing of Mr. K. Armstrong, Tamil Nadu state Bahujan Samaj Party (BSP) president, outside his Chennai house is highly deplorable and condemnable. An advocate by profession, he was known as a strong Dalit voice in the state. The state Govt. must punish the guilty.— Mayawati (@Mayawati) July 5, 2024 -
లోక్సభ ఎన్నికల ఫలితాలు.. ముందంజలో ఎన్డీయే కూటమి
Live Updates...వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ ఘన విజయం.. 1.52 లక్షల మెజారిటీ సాధించిన మోదీఇండోర్ బీజేపీ అభ్యర్థికి రికార్డ్ మెజార్టీ.. 10.08 లక్షల ఓట్లతో శంకర్ లాల్వానీ అఖండ విజయంమధ్య ప్రదేశ్ విదిశలో మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ గెలుపురెండు చోట్లా రాహుల్ గాంధీ గెలుపు. వయనాడ్, రాయబరేలీ స్థానాలలో ఘన విజయంఅమేథిలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఓటమి. కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ శర్మ విజయ కేతనంఈసీ ట్రెండ్స్ ప్రకారం.. ఎన్డీయే కూటమి 290 స్థానాల్లో ముందంజఇండియా కూటమి 234 స్థానాల్లో ముందంజ. మారుతున్న సమీకరణాలు..లక్నో లోక్సభ స్థానం నుంచి రాజ్నాథ్ సింగ్ ముందంజ. 17వేల ఆధిక్యం.యూపీలో సమాజ్వాదీ పార్టీ మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉండటంతో పార్టీ కార్యకర్తల సంబురాలు.జార్ఖండ్లో కాంగ్రెస్, జేఎంఎం కార్యకర్తల సంబురాలు. కేంద్ర మంత్రి బీజేపీ అభ్యర్థి అర్జున్ ముండా వెనుకంజ.మధ్యప్రదేశ్లో వింత పరిస్థితి..ఇండోర్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీకి 7లక్షల 89వేల ఆధిక్యం. అక్కడ నోటాకు లక్షా69వేల ఓట్లు.(రెండో స్థానంలో నోటా)మూడో స్థానంలో బహుజన్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి సంజయ్ Madhya Pradesh: BJP candidate from Indore Lok Sabha seat Shankar Lalwani leading with a margin of 7,89,625 NOTA (None of the Above) is currently on the second position with 1,69,228 votes pic.twitter.com/BWGsCrruxZ— ANI (@ANI) June 4, 2024 👉ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడికి భారీ ఆధిక్యం..51వేల ఓట్ల ఆధిక్యంలో ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు సరబ్సింగ్ ఖల్సామాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్ సింగ్ కుమారుడే సరబ్జీత్ సింగ్ ఖల్సా ముందంజలో ఉన్నారు.పంజాబ్లోని ఫరీద్కోట్లో తన సమీప ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై 51వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 👉సీఎం నవీన్ పట్నాయక్ వెనుకంజఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బిజు జనతాదళ్ మధ్య గట్టి పోటీకాంటాబంజిలో సీఎం నవీన్ పట్నాయక్ 1158 ఓట్ల వెనుకంజపోటీ చేస్తున్న రెండో స్థానం హింజిలిలో స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ 👉లోక్సభ ఎన్నికల్లో అమిత్ షా ఘన విజయంగుజరాత్లోని గాంధీనగర్లో కేంద్రమంత్రి అమిత్ షా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్భాయ్పై 3.7లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 👉ప్రస్తుత ట్రెండ్స్ ఇలా..ఫలితాల్లో ఎన్డీయే కూటమి-294 ముందంజఇండియా కూటమి-239 ముందంజ యూపీలో ఇండియా కూటమి-40ఎన్డీయే-38ఇతరులు-2హర్యానాలో ఇండియా కూటమి-6బీజేపీ-4తమిళనాడులో ఇండియా కూటమి-37ఎన్డీయే-1కర్ణాటకలో ఇండియా కూటమ10ఎన్డీయే- 18రాజస్థాన్లో బీజేపీ-13ఇండియా కూటమి-12బెంగాల్లో టీఎంసీ-31బీజేపీ-10కాంగ్రెస్-1మధ్యప్రదేశ్లో బీజేపీ-29కాంగ్రెస్-0అసోంలో ఎన్డీయే-10ఇండియ కూటమి-4జార్ఖండ్లో ఎన్డీయే-9ఇండియా కూటమి-5బీహార్లో ఎన్డీయే- 32ఇండియా కూటమి- 8మహారాష్ట్రలో ఇండియా కూటమి-28ఎన్డీయే-19పంజాబ్లో కాంగ్రెస్-7ఆప్-2ఒడిషాలో బీజేపీ-16బీజేడీ-4ఇండియా కూటమి-1ఛత్తీస్గఢ్లో బీజేపీ-10కాంగ్రెస్-1కేరళలో యూడీఎఫ్-17ఎన్డీయే-2ఎల్డీఎఫ్-1 👉కాంగ్రెస్ 100 దాటితే కూటమిదే అధికారం: సంజయ్ రౌత్శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఒకవేళ కాంగ్రెస్ 100 స్థానాల్లో విజయం సాధిస్తే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే ప్రధాని అవుతారు. దేశ ప్రజలు కోరుకుంటే రాహుల్ గాంధే పీఎం. 👉 ఇప్పటి వరకు సమీకరణాలు ఇలా..బెంగాల్లో దూసుకెళ్తున్న అధికార టీఎంసీదాదాపు 31 స్థానాల్లో టీఎంసీ ముందంజ.బీజేపీ 10 స్థానాల్లో ముందంజ. కాంగ్రెస్-1మధ్యప్రదేశ్లో బీజేపీ క్లీన్ స్వీప్.. 29 స్థానాల్లో ముందంజతమిళనాడులో ఇండియా కూటమి 36 స్థానాల్లో ముందంజఎన్డీయే-1ఏడీఎంకే-2ఒడిషాలో బీజేపీ-18బీజేడీ-2ఇండియా కూటమి-1ఛత్తీస్గఢ్లో బీజేపీ-9కాంగ్రెస్-2కర్ణాటకలో ఎన్డీయే-20కాంగ్రెస్-8కేరళలో యూడీఎఫ్-17ఎన్డీయే-2ఎల్డీఎఫ్-1 అమేఠీలో స్మృతి ఇరానీ వెనుకంజయూపీలోని అమేఠీలో సిట్టింగ్ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వెనుకబడ్డారుఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ దాదాపు 15వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.హాసనలో ప్రజ్వల్ రేవణ్ణకు ఆధిక్యంకర్ణాటకలోని హాసనలో జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆధిక్యంకాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ ఎం. పాటిల్పై 2369 ఓట్లతో ముందంజవారణాసిలో 600 ఓట్ల ఆధిక్యంలో మోదీప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో హోరాహోరీఇక్కడ మళ్లీ ముందంజలోకి వచ్చిన మోదీప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై 619 ఓట్ల ఆధిక్యంలో మోదీ లీడ్ ఇలా...బీహార్లో 11 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం. పశ్చిమ బెంగాల్లో 21 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ అమేథీలో స్మృతీ ఇరానీ వెనుకంజ. కర్ణాటకలో 17 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం. ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లీడింగ్. యూపీలో ఇండియా కూటమి లీడ్. వారణాసిలో మళ్లీ ఆధిక్యంలోకి ప్రధాని మోదీ.మణిపూర్లో ఆధిక్యంలో బీజేపీ. 👉 తాజా సమీకరణాల ప్రకారం..ఎన్డీయే-294ఇండియా కూటమి-223ఇతరులు-19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. 👉 ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఒడిషా అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ 13 స్థానాల్లో ముందంజ, బీజేడీ ఆరు స్థానాలు, ఇండియా కూటమి ఒక్క స్థానంలో ముందంజ. As per initial trends by ECI, BJP is leading on 13 seats, BJD leading on 6 seats in the Odisha Assembly elections. pic.twitter.com/T25jvjZxoo— ANI (@ANI) June 4, 2024 👉ఇప్పటి వరకు వీరు లీడ్లో..వారణాసిలో మోదీ వెనుకంజ. ఆరు వేల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థిరాజస్థాన్లో 20 స్థానాల్లో బీజేపీ లీడింగ్. మాండ్యాలో హెచ్డీ కుమారస్వామి లీడింగ్. మధురలో బీజేపీ నేత హేమామాళిని ముందంజ కోయంబత్తూరులో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై వెనుకంజకురుక్షేత్రలో బీజేపీ నేత నవీన్ జిందాల్ వెనుకంజ. 👉వయనాడ్, రాయబరేలీ స్థానాల్లో రాహుల్ గాంధీ ముందంజ. Congress candidate from Uttar Pradesh's Raebareli Lok Sabha seat Rahul Gandhi leading from the seat with a margin of 2126 votes. (file pic) #LokSabhaElections2024 pic.twitter.com/VdMDwab4jP— ANI (@ANI) June 4, 2024 👉లీడింగ్లో కేంద్రమంత్రులు అమిత్షా, కిరణ్ రిజుజు, Union Home Minister and BJP candidate from Gujarat's Gandhinagar Lok Sabha seat Amit Shah leading from the seat with a margin of 7311 votes. (file pic) #LokSabhaElections2024 pic.twitter.com/fWF987QsA8— ANI (@ANI) June 4, 2024 As per initial trends by ECI till 9 am, the BJP is leading on 75 seats, Congress leading on 25 seats, Samajwadi Party leading on 8 seats, AAP leading on 5 seats. #LokSabhaElections2024 pic.twitter.com/4CcM5XHaJh— ANI (@ANI) June 4, 2024 👉 ఇప్పటి వరకు రాష్ట్రాల్లో లీడ్ ఇలా..యూపీలో ఎన్డీయే కూటమి 53 స్థానాల్లో, ఇండియా కూటమి 24 స్థానాలు.మహారాష్ట్రాలో ఎన్డీయే కూటమి 25 స్థానాల్లో ఇండియా కూటమి 21 స్థానాలు.పంజాబ్లో కాంగ్రెస్ ఐదు స్థానాల్లో, బీజేపీ మూడు స్థానాల్లోమధ్యప్రదేశ్లో బీజేపీ 25, కాంగ్రెస్ 2రాజస్థాన్ బీజేపీ 20, ఇండియా కూటమి 4కేరళలో యూడీఎఫ్ 14, ఎల్డీఎఫ్ 6, ఎన్డీయే-0కర్ణాటకలో ఎన్డీయే 22, కాంగ్రెస్-6అసోం ఎన్డీయే 9, ఇండియా-3బీహార్ ఎన్డీయే 26, ఇండియా-9 👉ఎన్డీయే కూటమి 300 స్థానాల్లో ఆధిక్యం👉ఇండియా 170 స్థానాల్లో ఆధిక్యం. ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఇలా.. As per initial trends by ECI till 8.47 am, the BJP is leading on 42 seats, Congress leading on 17 seats, AAP leading on 4 seats, Samajwadi Party leading on 2 seats. #LokSabhaElections2024 pic.twitter.com/PqudCi2uZf— ANI (@ANI) June 4, 2024 👉ఇప్పటి వరకు ఎన్డీయే కూటమి 253, 135 స్థానాల్లో ముందుంజ.👉ఒడిషా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 8 స్థానాల్లో ముందంజ, బీజేపీ 6 స్థానాల్లో ముందంజ.👉మండిలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఆధిక్యం As per initial trends by ECI, the BJP is leading on 17 seats, Congress leading on one seat.#LokSabhaElections2024 pic.twitter.com/7651efxe82— ANI (@ANI) June 4, 2024 👉తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ వెనుకంజ👉గునాలో బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా ముందంజ 👉ఎన్డీయే కూటమి 231 స్థానాల్లో ముందంజ👉ఇండియా కూటమి 123 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. 👉ఇతరులు 15 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. 👉పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో దూసుకుపోతున్న బీజేపీఇప్పటి వరకు 180 స్థానాల్లో బీజేపీ ముందుంజఇండియా కూటమి 90 స్థానాల్లో ముందంజఇతరులు 10 స్థానాల్లో ముందంజ 👉ప్రారంభ ఫలితాల్లో బీజేపీ దూకుడు👉100పైగా స్థానాల్లో బీజేపీలో ముందంజలో కొనసాగుతోంది. #WATCH | Uttarakhand | Counting of postal ballots started amid tight security in Haridwar. Visuals from a counting centre here.#LokSabhaElections2024 pic.twitter.com/zdeAuRkEYC— ANI (@ANI) June 4, 2024 👉పోస్టల్ బ్యాలెట్లో అమేథీలో బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ ముందుంజ.👉వయనాడ్లో ఆధిక్యంలో రాహుల్ గాంధీ. 👉రాయబరేలీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. #WATCH | Uttar Pradesh: Counting of postal ballots underway at a counting centre in Raebareli Parliamentary constituency. #LokSabhaElections2024 pic.twitter.com/Gm9abdEyzd— ANI (@ANI) June 4, 2024 👉పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడుతున్నాయి.. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 100 స్థానాల్లో ముందంజఇండియా కూటమి 41 స్థానాల్లో ముందంజఇతరులు 10 స్థానాల్లో ముందుంజ. 👉 కౌంటింగ్ ప్రారంభం Counting of votes for the #LokSabhaElections2024 begins.The fate of candidates on 542 of the 543 Parliamentary seats is being decided today. BJP won the Surat seat unopposed. pic.twitter.com/qfuRFSn4xi— ANI (@ANI) June 4, 2024 #WATCH | Punjab: Counting of votes for the #LokSabhaElections2024 begins. (Visuals from a counting centre in Amritsar) pic.twitter.com/uqZUzcvbCK— ANI (@ANI) June 4, 2024 👉దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 542 పార్లమెంట్ స్థానాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఏపీలో, ఒడిషాలో కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభం. Counting of votes for the #LokSabhaElections2024 begins. The fate of candidates on 542 of the 543 Parliamentary seats is being decided today. Postal ballot counting to begin first.Counting is also being done for Andhra Pradesh and Odisha Assembly elections as well as… pic.twitter.com/3tu7Opjasf— ANI (@ANI) June 4, 2024 👉గోరఖ్పూర్ బీజేపీ అభ్యర్థి రవికిషన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. ఇది చారిత్రాత్మకం. రామరాజ్యం కొనసాగుతుంది. మోదీపై దేశ ప్రజలు నమ్మకం ఉంచారు. బీజేపీ గెలుపు ఖాయం. #WATCH | BJP MP and candidate from Gorakhpur, Ravi Kishan says, "This is historic, Ram Rajya will continue. The biggest leader of the world is going to be the Prime Minister for the third time...People of the country have made the country win and placed their trust in PM Modi..."… pic.twitter.com/5z2B7NAb6G— ANI (@ANI) June 4, 2024 👉ఢిల్లీ పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి, సుష్మా స్వరాజ్ కూతురు భన్సూరి స్వరాజ్ మాట్లాడుతూ.. బీజేపీ అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు నమ్మకం ఉంచారు. బీజేపీని కచ్చితంగా గెలిపిస్తారనే నమ్మకం ఉంది. మూడోసారి ప్రధాని మోదీ ప్రధాని అవడం ఖాయం. #WATCH | BJP candidate from New Delhi Lok Sabha seat, Bansuri Swaraj says, "...I am completely confident that today the people of India will choose the public welfare policies of BJP, will choose the development policies of our Prime Minister Narendra Modi...I know Teesri Baar… pic.twitter.com/8VgHIrxDXj— ANI (@ANI) June 4, 2024 👉ఎన్నికల్లో విజయం మాదే అంటున్న కాంగ్రెస్ నేతలు. యూపీలో మధువా కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధన్గర్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కచ్చితంగా గెలుస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. #WATCH | Uttar Pradesh: Congress candidate from Mathura, Mukesh Dhangar says, "...INDIA Alliance will form a government. There is no doubt about it...This victory (Dhangar's victory) will be of the people of Brij. This will 1000% be the victory of Banke Bihari and Maa Yamuna."… pic.twitter.com/IP6Def2u81— ANI (@ANI) June 4, 2024 👉దేశవ్యాప్తంగా తెరుచుకుంటున్న స్ట్రాంగ్ రూమ్స్ #WATCH | Karnataka: Strong room being opened in Bengaluru district ahead of the counting of votes for the #LokSabhaElections2024The counting of votes will begin at 8 am. pic.twitter.com/ACGhbarIbx— ANI (@ANI) June 4, 2024 👉మధ్యప్రదేశ్లోని ఇండోర్లో స్ట్రాంగ్ రూమ్ను తెరిచిన ఎన్నికల అధికారులు. స్ట్రాంగ్ వద్ద పార్టీల ఏజెంట్స్, అధికారులు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. #WATCH | Madhya Pradesh: Strong room being opened in Indore district ahead of the counting of votes for the #loksabhaelections2024phase5 Vote counting for #LokSabhaElections2024 to begin at 8 am. (Source: Madya Pradesh I&PR) pic.twitter.com/ntfmwhTEPC— ANI (@ANI) June 4, 2024 👉కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి కార్తీ చిదంబరం. శివగంగ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా కార్తీ చిదంబరం. #WATCH | Tamil Nadu: Congress candidate from Sivaganga Lok Sabha seat Karti Chidambaram arrives at a counting centre in Karaikudi, Sivaganga districtVote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/fKLk5uJf3u— ANI (@ANI) June 4, 2024 👉కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మనీష్ తివారీ కామెంట్స్.. ప్రజలు తీర్పు ఈవీఎం బ్యాలెట్స్ ఉంది. కాసేపట్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రజా తీర్పును ప్రతీ ఒక్కరూ గౌరవించాలి. #WATCH | Congress MP and party candidate from Chandigarh Manish Tewari says, "..It is Tuesday, Hanuman's day. People have expressed their opinions. The opinions are locked in the EVMs. The EVMs will open and the opinion will come out. Whatever the people's decision will be,… pic.twitter.com/yptpWNkKN4— ANI (@ANI) June 4, 2024 👉దేశంలో 543 లోక్సభ నియోజకవర్గాలకు 8,360 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1996లో అత్యధికంగా 13,952 మంది పోటీ చేశారు. 👉బరిలో 53 మంది మంత్రులు 53 మంది సిటింగ్ మంత్రులు ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. 17వ లోక్సభలో ఎంపీలుగా ఉన్నవారిలో 327 మంది మళ్లీ ఇప్పుడు పోటీ చేశారు. వారిలో 34 మంది పార్టీ మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 27% మంది ఇప్పటికే కనీసం ఒక్కసారైనా ఎంపీగా పనిచేసినవారే. 👉 దేశంలో బీజేపీ పార్టీ ఎన్నికలను లూటీ చేసింది. మేము గత ఆరు రోజులుగా ఇదే చెబుతున్నాం. కౌంటింగ్ అనేది కేవలం నామమాత్రమే. కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసమే పోరాటం చేస్తారు. మేము ఓడినా, గెలిచినా ప్రజల్లోనే ఉంటాం. #WATCH | Delhi: Congress worker Jagdish Sharma says, "I have already said 6 days ago that the election has been looted, it (counting of vote) is just a formality because the people of the country believe in the Constitution system. All Congress party leaders will come but I will… pic.twitter.com/vzkn3YrKT4— ANI (@ANI) June 4, 2024 👉దేశవ్యాప్తంగా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత పెంపు.. హర్యానా, గుజరాత్, ఒడిషా, మహారాష్ట్రలో మోహరించిన పోలీసులు, భద్రతా బలగాలు #WATCH | Security heightened at a counting centre in Jind, Haryana. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/YXFo7YXRhU— ANI (@ANI) June 4, 2024 #WATCH | Security heightened at a counting centre in Raebareli, Uttar Pradesh. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/iq06WWob5Q— ANI (@ANI) June 4, 2024 #WATCH | Security heightened at a counting centre in Bhubaneswar, Odisha. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/NhoU4qURN0— ANI (@ANI) June 4, 2024#WATCH | Security heightened at a counting centre in Purba Medinipur, West Bengal. Vote counting for #LokSabhaElections to begin at 8 am. pic.twitter.com/bgdJ3KPgou— ANI (@ANI) June 4, 2024 👉దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. 80 రోజులకు పైగా ఏడు విడతల్లో సాగిన సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల క్రతువు తుది దశకు చేరింది. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. 👉కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నెహ్రూ రికార్డును సమం చేస్తారా? లేదంటే కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి అనూహ్యమేమైనా చేసి చూపించనుందా? సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించనుంది. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు జరగనుంది. 👉ఏకగ్రీవమైన సూరత్ మినహా 542 లోక్సభ స్థానాలు, ఏపీలో 175, ఒడిశాలో 147 అసెంబ్లీ స్థానాల్లో విజేతలెవరో తేలనుంది. కౌంటింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సూరత్లో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఇక, ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. మధ్యాహా్ననికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. -
బొటాబొటిగా జాతీయం!
చండీగఢ్ టూ పట్నా. జాతీయ రాజకీయాలకు ఆయువుపట్టు. సారవంతమైన గంగా–యమునల మైదాన ప్రాంతం ఇదే. కొద్దిగా సింధూ బేసిన్ కూడా ఇందులో చేరి ఉండవచ్చు. కాస్త విస్తరిస్తే ‘కౌబెల్ట్’ అని కూడా పిలుస్తాము. మనం ఏ రకమైన మాంసం తినాలో, ఏ రకమైనది తినకూడదో తెలియజెప్పే కౌబాయ్స్కు ఇది పరమ పూజనీయమైన ప్రాంతం. అనాదిగా పిలుచుకుంటున్నట్టు ‘ఆర్యావర్తం’ కూడా ఇదే! ఈ ప్రాంతం మీద పట్టు సాధించకుండా దేశంలో రాజ్యాధికారాన్ని సంపాదించడం చాలా కష్టం.మొదటి ఐదు సాధారణ ఎన్నికల్లో ఆర్యావర్తం, ద్రవిడదేశం అనే తేడాల్లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరిచింది. ఆరోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్రకు కళ్లెం వేసిన జనతా పార్టీ మాత్రం అచ్చంగా ఉత్తరాది పార్టీయే! అప్పుడు జనతా పార్టీకి 295 లోక్సభ స్థానాలు దక్కాయి. ఇందులో వింధ్య పర్వతాలకు దిగువన గెలిచిన సీట్లు రెండు డజన్లు దాటలేదు. అవి కూడా ప్రధానంగా మహారాష్ట్రలో గెలిచినవే!భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గడచిన పదేళ్లుగా అధికారంలో ఉన్నది. అయినప్పటికీ ఒక్క కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాదిలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఈసారి అదనంగా తెలంగాణపై కూడా ఆశలు పెట్టుకున్నది. కానీ, మూడోసారి వరసగా అధికారాన్ని చేపట్టాలంటే కచ్చితంగా గోమాత ప్రాంతమే కాషాయ దళాన్ని కరుణించి కాపాడాలి. గత ఎన్నికల్లో భారీ సీట్లను ప్రసాదించిన ఈ ప్రాంతంలో బలమైన గండి పడితే మాత్రం ఇతర ప్రాంతాలు పూడ్చగలిగే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈసారి కూడా ఆర్యావర్తం బీజేపీని గట్టెక్కిస్తుందా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న.చండీగఢ్ నుంచి హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ల మీదుగా బీహార్లోని పట్నా వరకు మొత్తం 157 స్థానాలను అప్పట్లో జనతా పార్టీ క్లీన్స్వీప్ చేసింది. ఇప్పటికీ అదే రికార్డు. ఇందిరాగాంధీ హత్యానంతరం వెల్లువెత్తిన సానుభూతి ప్రభంజనం (1984)లో కూడా ఈ రికార్డు చెక్కుచెదరలేదు. అప్పుడు యూపీ, బీహార్లలో ఎనిమిదిమంది ఇతర పార్టీల వారు గెలిచారు. కొత్త రాష్ట్రాలుగా అవతరించిన ఉత్తరాఖండ్, జార్ఖండ్లను కూడా కలుపుకొంటే ఇదే ప్రాంతంలో బీజేపీకి 2019లో 113 సీట్లు దక్కాయి. ఎన్డీఏ భాగస్వాములతో కలిసి 131 సీట్లలో గెలిచారు.ఇప్పుడా సంఖ్యను బీజేపీ నిలబట్టుకోగలదా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్లను కూడా కలిపి చూస్తే కౌబెల్ట్ పూర్తవుతుంది. ఇందులో రాజస్థాన్ (25), గుజరాత్ (26), హిమాచల్ (4)లో అప్పుడు బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మధ్యప్రదేశ్ (29)లో 28, ఛత్తీస్గఢ్ (11)లో 9 సీట్లను గెలుచుకున్నది. ఈ దూకుడును ఇప్పుడు కూడా ప్రదర్శించగలుగుతుందా? దాదాపు 90 శాతం స్ట్రయిక్ రేట్తో విజృంభిస్తేనే కౌబెల్ట్లో బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోగలుగుతుంది.ఈ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలుగా పేరున్న రాజ్పుత్, జాట్, యాదవ కులాలు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న జాట్ నాయకులు రాజస్థాన్, హర్యానాల్లో ఇప్పటికే ‘ఇండియా’ కూటమికి మద్దతు ప్రకటించారు. పశ్చిమ యూపీలోని జాట్లు మాత్రం చరణ్సింగ్ పరివారానికి చెందిన ఆర్ఎల్డీతోనే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ పార్టీ ఎన్డీఏలో చేరినందువల్ల యూపీ జాట్ల మద్దతు బీజేపీకి లభించవచ్చు.ఉత్తరాదిలో తొలి నుంచీ బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న రాజ్పుత్ల తాజా వైఖరి ఆ పార్టీని కొంత కలవరపరుస్తున్నది. ఈ వర్గానికి ప్రాతినిధ్యం వహించే కర్ణిసేన సభ్యులు బహిరంగ సభలు పెట్టి మరీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిస్తున్నారు. రాజ్పుత్ వర్గం మీద వీరి పిలుపు ప్రభావం చూపితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలోని కనీసం 30 నియోజకవర్గాల్లో బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నది. రాజ్పుత్ వర్గానికి చెందిన యోగీ బాబానే యూపీ సీఎంగా ఉన్నందువలన ఆ రాష్ట్రంలో పెద్దగా భయపడవలసిన అవసరం లేదని బీజేపీ భావిస్తున్నది.యూపీ, బీహార్లలో గణనీయమైన సంఖ్యలో ఉన్న యాదవులు చాలాకాలంగా ఎస్పీ, ఆర్జేడీల వెనుకనే సమీకృతమై ఉన్నారు. ఇప్పుడీ సమీకరణ మరింత సంఘటితంగా ఉన్నట్టు సమాచారం. అఖిలేశ్, తేజస్వీ యాదవ్లను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రులను చేయాలనే పట్టుదల యువతలో కనిపిస్తున్నది. యాదవ వర్గం వ్యతిరేకతకు విరుగుడుగా యాదవేతర ఓబీసీలను మచ్చిక చేసుకుంటూ బీజేపీ ఇన్నాళ్లుగా నెట్టుకొస్తున్నది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తారని జరిగిన ప్రచారం వల్ల ఈ వర్గం మద్దతును కూడా ఎంతోకొంత బీజేపీ కోల్పోవచ్చనే అభిప్రాయం బలపడుతున్నది. రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచన తమకు లేదని ప్రధాని సహా పలువురు నేతలు వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.వాజ్పేయి హయాంలోని ఎన్డీఏ సర్కార్ చేసుకున్న ‘షైనింగ్ ఇండియా’ ప్రచారం వికటించినట్టుగానే మోదీ సర్కార్ చేస్తున్న ‘వికసిత భారత్’ కూడా వికటిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఉపాధి రంగం దారుణంగా దెబ్బతిన్నది. పెద్దనోట్ల రద్దు, కోవిడ్ వరస దెబ్బలతో కుదేలైన చిన్న వర్తకులు ఇప్పటికీ కోలుకోలేదు. నిరుద్యోగిత రేటుపై నిన్ననే విడుదలైన పీరియాడిక్ లేబర్ శాంపుల్ సర్వే నివేదిక నిరాశాజనకంగానే ఉన్నది. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 38 శాతం మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు లభించలేదని వచ్చిన తాజా వార్త పరిస్థితికి అద్దం పడుతున్నది.ఉత్తరాది రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు సైనిక బలగాల్లో చేరడం ఒక ప్రత్యామ్నాయం. అందులో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నివీర్’ పథకం ఈ యువతను తీవ్రంగా నిరాశపరిచింది. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ప్రపంచస్థాయి ఆర్థికవేత్తలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్ఫామ్ వంటి సంస్థలు క్రమం తప్పకుండా ఇచ్చే నివేదికల్లో ఈ అన్యాయాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఒకే దేశంలోని మనుషుల మధ్య వంద రెట్లు, వేయి రెట్లు కాదు లక్షల రెట్ల ఆర్థిక తారతమ్యాలు వెక్కిరిస్తున్నాయి.2012 నుంచి 2021 మధ్యకాలంలో భారత జాతి సృష్టించిన సంపదలో నలభై శాతం సొత్తు జనాభాలోని ఒకే ఒక్క శాతం కుబేరుల జేబుల్లోకి వెళ్లింది. యాభై శాతం మంది అడుగు జనాభా దోసిళ్లలో ఎంగిలి మెతుకులు రాలిపడ్డట్టు ఒకే ఒక్క శాతం సొమ్ము ఉమ్మడిగా జారిపడింది. దీన్నే కొందరు ’ట్రికిల్ డౌన్ థియరీ’గా పిలుచుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలతో ఎన్డీఏ రాజ్యమేలుతున్నది.ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే శామ్ పిట్రోడాతో సహా పలువురు ఆర్థికవేత్తలు కూడా దేశంలో వారసత్వ పన్ను విధించాలన్న ప్రతిపాదన చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఇటువంటి సూచనలపై విస్తృతమైన చర్చను ఆహ్వానించడం అవసరం. కానీ, పిట్రోడాకు ఉన్న కాంగ్రెస్ సంబంధాలను ఆసరా చేసుకొని స్వయంగా ప్రధానమంత్రే ఎదురుదాడికి పూనుకున్నారు. ‘ప్రతిపక్షం అధికారంలోకి వస్తే మీరు సంపాదించుకున్న సొమ్మును లాగేసుకుంటారట’ అంటూ రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. ఈ ప్రచారం బీజేపీకి మేలు చేసిందా... కీడు చేసిందా అనే విషయం ఓట్ల లెక్కింపు తర్వాత తేలిపోనున్నది.ఈ రకమైన సామాజిక – ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన కంచుకోటలను ఏ మేరకు కాపాడుకోగలదన్న చర్చ జరుగుతున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎటువంటి గాలి లేదని అభిప్రాయపడిన పక్షంలో గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 స్థానాలను బీజేపీ చేజార్చుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీటితోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా గత ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది. ఈసారి రెండు రాష్ట్రాల్లో కనీసం 15 స్థానాల వరకు ఆ పార్టీ పోగొట్టుకోవచ్చనే అంచనాలున్నాయి.శరద్ పవార్, బాల్ఠాక్రేలు స్థాపించిన పార్టీలను చీల్చడం బీజేపీకి కలిసివచ్చే అంశం కాదనే అభిప్రాయం మహారాష్ట్రలో ఉన్నది. ఎన్నికల హామీల అమలులో చతికిలబడ్డ కర్ణాటక కాంగ్రెస్కు బీజేపీ మిత్రపక్షం జేడీఎస్ మళ్లీ ఊపిరిపోసింది. దేవెగౌడ పౌత్రరత్నం చేసిన నిర్వాకంపై కన్నడిగులు మండిపడుతున్నారు. ఇక బెంగాల్, ఒడిషా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఓ పదిహేను స్థానాలను బీజేపీ అధికంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కోల్పోయే అవకాశం ఉన్న సీట్లు 65 అనుకుంటే, అదనంగా తెచ్చుకునే సీట్లు పదిహేను వరకు ఉండవచ్చని అంచనా. అంటే కనీసం యాభై సీట్లను బీజేపీ నికరంగా కోల్పోతుంది.వ్యతిరేక గాలి బలంగా లేకపోతేనే గత ఎన్నికలతో పోలిస్తే యాభై స్థానాలను బీజేపీ కోల్పోవచ్చు. కూటమిలోని మిత్రపక్షాలన్నీ ఉమ్మడిగా మరో పాతిక, ముప్పయ్ సీట్లను గెలవచ్చు. ఇది దాదాపు తొంభై శాతం స్థానాలకు పోలింగ్ పూర్తయిన తర్వాత పరిశీలకుల్లో నెలకొని ఉన్న అభిప్రాయం. అంటే బొటాబొటి మెజారిటీతో ఎన్డీఏ మూడోసారి గద్దెనెక్కడానికి అవకాశాలు ఉన్నాయనుకోవాలి. బీజేపీకి సొంతంగా 370 సీట్లు కావాలనీ, కూటమికి 400 సీట్లు కావాలని ప్రధానమంత్రి చేసిన అభ్యర్థనను జనం పట్టించుకోలేదు. మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తే ఈ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వెనకాడదనే వాదనను జనం విశ్వసిస్తున్నారనే అనుకోవాలి.విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉండి ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రజలు కచ్చితంగా ఓడించేవారే. ప్రజల ఆకాంక్షలకు, ప్రభుత్వ విధానాలకు మధ్యన ఓ పెద్ద అగాధమే ఉన్నది. కానీ, ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన పార్టీగా మిగిలిపోయింది. సాధారణ మెజారిటీకి అవసరమైన 272 స్థానాల్లో కనీసం సగం సీట్లను కూడా కాంగ్రెస్ గెలవగలదన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో అతుకుల బొంతతో అస్థిర ప్రభుత్వ ప్రయోగాలకు మెజారిటీ ప్రజలు సిద్ధపడకపోవచ్చు. పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ప్రధాని పదవికి ప్రతిపాదించి ఉంటే కూటమి సభ్యుల ఆమోదం లభించేది. సాహసోపేతమైన ఈ ప్రయోగాన్ని దేశ ప్రజలు స్వాగతించేవారు. కానీ రాహుల్గాంధీ మాటల్లో కనిపించేంత ఔదార్యం, అభ్యుదయం చేతల్లో కనిపించవు. అదే విషాదం. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో సెంచరీ కొట్టే ఒక మంచి అవకాశం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
Bihar politics: పాత కత్తులు.. కొత్త పొత్తులు
కులాల కుంపట్లు, పొత్తుల కత్తులు, కిచిడీ కూటములు, జంపింగ్ జపాంగ్లకు పెట్టింది పేరైన బిహార్లో రాజకీయాలు ఎప్పుడూ కాక పుట్టిస్తూనే ఉంటాయి. 40 సీట్లతో లోక్సభ నియోజకవర్గాల పరంగా దేశంలో నాలుగో స్థానంలో నిలుస్తున్న ఈ తూర్పు రాష్ట్రానిది జాతీయ రాజకీయాల్లో ఆది నుంచీ కీలక పాత్రే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ మొదలు జగ్జీవన్రాం, నుంచి లాలూ ప్రసాద్, నితీశ్కుమార్ దాకా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్ధండ నేతలకు పుట్టిల్లు బిహార్. అధికారం కోసం ప్రాంతీయ, జాతీయ పార్టీల మధ్య కుమ్ములాటలు, వర్గ పోరు, పవర్ పాలిటిక్స్ ఇక్కడ సర్వసాధారణం. స్టేట్ స్కాన్ రాజకీయంగా చైతన్యవంతమైన బిహార్లో లోక్సభ ఎన్నికల ముంగిట కొత్త పొత్తులు పొడిచాయి. గత ఎన్నికల్లో బీజేపీ, జేడీ (యూ), లోక్ జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఏకంగా 39 సీట్లను ఒడిసిపట్టింది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసి అన్నీ గెలుచుకుంది. జేడీ(యూ) 17 సీట్లకు 16 చోట్ల, ఎల్జేపీ ఆరింటికి ఆరూ కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీల మహాకూటమి మహా ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ 9 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు గెల్చుకోగా ఆర్జేడీ 19 స్థానాల్లో తలపడినా సున్నా చుట్టింది. మిగతా పార్టీలదీ అదే పరిస్థితి. కేంద్రంలో మోదీ 2.0 బలమైన సర్కారు ఏర్పాటులో బిహార్ ఘనవిజయానిది ప్రధాన పాత్ర. ఈసారి పాత మిత్రులతో పూర్వ వైభవానికి కాంగ్రెస్ ప్రయతి్నస్తోంది. బిహార్లో 40 స్థానాల్లో ఆరింటిని ఎస్సీలకు కేటాయించారు. నితీశ్ పిల్లిమొగ్గలు... బిహార్ రాజకీయాల్లో వెలుగు వెలిగిన లాలు అవినీతి కేసుల్లో జైలుపాలైన నాటి నుంచీ రాష్ట్రంపై నితీశ్ కుమార్ పట్టుబిగించారు. ఏదో ఒక పార్టీతో పొత్తుతో 15 ఏళ్లుగా సీఎం పీఠాన్ని అంటిపెట్టుకున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సమాజ్వాదీ, జేడీ(ఎస్), కాంగ్రెస్ మహా కూటమిగా పోటీ చేశాయి. ఆర్ర్జేడీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా నితీశ్ సీఎం పదవి దక్కించుకున్నారు. రెండేళ్లు తిరిగేసరికి మహాకూటమికి గుడ్బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో సీట్ల సర్దుబాటు చేసుకుని అత్యధిక ఎంపీ సీట్లను దక్కించుకున్నారు. అదే జోరులో 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ భాగస్వామిగా పోటీ చేసి సీఎం పీఠమెక్కారు. జేడీ(యూ) (43) కంటే బీజేపీ (74)కే ఎక్కువ సీట్లు దక్కినా నితీశ్ మళ్లీ సీఎం పదవి దక్కించుకోవడం విశేషం. రెండేళ్లలోనే ఆయన మళ్లీ ప్లేటు ఫిరాయించారు. లోక్సభ ఎన్నికల్లో మోదీని ఢీకొట్టడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామంటూ ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చేశారు. మహాకూటమి దన్నుతో మళ్లీ సీఎం అయ్యారు! ఇండియా కూటమి ఏర్పాటు కీలక పాత్ర పోషించారు. తీరా గత జనవరిలో ఎన్డీఏలోకి గెంతి మహాకూటమికి, ఇండియా కూటమికీ కోలుకోలేని షాకిచ్చారు. బీజేపీ దన్నుతో సీఎం పదవిని కాపాడుకున్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీకి కలిసొస్తుందా...? నితీశ్తో కలిసి 2019 ఫలితాలను రిపీట్ చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కానీ దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎన్డీఏ సీట్లకు గండి కొట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టడాన్ని నితీశ్ సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అది తమ ఘనతేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆ హామీ ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీజేపీ అయోధ్య రామ మందిరంతో హిందుత్వ నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంపై ఆశలు పెట్టుకుంది. ఈసారి బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ 5, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవామ్ మోర్చా, రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. కులగణన ఎవరికి ప్లస్! బిహార్ రాజకీయాలు చిరకాలంగా కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. నితీశ్ చేపట్టిన కులగణన మరోసారి రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. రాష్ట్రంలో 94 లక్షల కుటుంబాలు (34.13%) నెలకు రూ.6,000 సంపాదన కూడా లేక పేదరికంలో మగ్గుతున్నాయని కులగణనలో వెల్లడైంది. రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాల్సిందేనని నితీశ్ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 19.65 శాతం ఎస్సీలు, 1.68 శాతం ఎస్టీలున్నారు. వారిలో ఏకంగా 42.7 శాతం మంది నిరుపేదలని కులగణనలో తేలింది. 27.13 శాతం ఓబీసీలున్నారు. వీరిలో 14.26 శాతం యాదవులు. దాదాపు 17 శాతం మంది ముస్లింలున్నారు. మహాకూటమి యాదవులు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ గురిపెట్టింది. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగాల ని డిమాండ్ చేస్తోంది. అగ్రవర్ణాలతో పాటు ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలనూ ఆకర్షించేలా బీజేపీ, జేడీయూ పావులు కదుపుతున్నాయి. ప్రధాని మోదీ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సర్వేల సంగతేంటి...? బిహార్లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. ఇండియా కూటమి పైచేయి సాధిస్తుందా? ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచిన నితీశ్కు గుణపాఠం నేర్పాలని కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. ఆయనది పచ్చి అవకాశవాదమంటూ కాంగ్రెస్, ఆర్జేడీ దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో కులగణన తమ సంకీర్ణ సర్కారు ఘనతేనని ప్రచారం చేస్తున్నాయి. ఇది దేశానికి ఎక్స్రే వంటిదని, కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నారు. మోదీ హయాంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, కార్పొరేట్ దోపిడీ తదితరాలను ప్రచారా్రస్తాలుగా మలచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వోద్యోగాలతో పాటు పలు సంక్షేమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 6 న్యాయాలు 25 గ్యారంటీలతో విడుదల చేసిన జాతీయ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ ఊరూవాడా ప్రచారం చేస్తోంది. పొత్తులో భాగంగా ఆర్జేడీకి 26, కాంగ్రెస్ 9కి, లెఫ్ట్ పార్టీలకు 5 సీట్లు దక్కాయి. ఆర్జేడీ తమ 26 సీట్లలో మూడింటిని మాజీ మంత్రి ముకేశ్ సాహ్ని సారథ్యంలోని వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి కేటాయించింది. అబ్బాయ్–బాబాయ్ పోరు బిహార్లో అబ్బాయ్–బాబాయ్ అమీతుమీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన వారసత్వం కోసం కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి పరాస్ హోరాహోరీ తలపడ్డారు. చివరికి పార్టీని పరాస్ చేజిక్కించుకున్నారు. చిరాగ్కు ఎల్జేపీ (రాం విలాస్), పశుపతికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) పేర్లను ఎన్నికల సంఘం కేటాయించింది. పశుపతి పార్టీకి బీజేపీ ఒక్క సీటూ ఇవ్వకపోవడంతో ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. చిరాగ్కు బీజేపీ ఐదు సీట్లు ఇవ్వగా పట్టుబట్టి పాశ్వాన్ల కంచుకోట అయిన హాజీపూర్ను సాధించుకున్నారు. అక్కడ బాబాయ్ పశుపతిపై చిరాగ్ నేరుగా తలపడుతుండటం విశేషం! సర్వేల సంగతేంటి...? బిహార్లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. యూపీఏ హయాంలో భారత్ను బలహీన దేశంగా చూసేవారు. చిన్నాచితకా దేశాల నుంచి కూడా ఉగ్రవాదులు మనపై దాడులకు తెగబడేవారు. కాంగ్రెసేమో చేతకానితనంతో వేరే దేశాలకు ఫిర్యాదు చేస్తుండేది. నేటి భారత్ అలాకాదు, అవసరమైతే ఉగ్రవాదుల ఇళ్లలో దూరి మరీ అంతం చేస్తుంది. – బిహార్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ మహాకూటమి దెబ్బకు బీజేపీ, ఎన్డీఏ కంగుతిన్నాయి. అందుకే మోదీతో సహా అగ్ర నేతలంతా బిహార్లోనే తిరుగుతున్నారు. విపక్షాలపై కత్తిగట్టి ఈడీ, సీబీఐ కూడా ఇక్కడే మరింత ఫోకస్ చేస్తున్నాయి. పేదరికం, ఉపాధి, బిహార్ చిరకాల కోరికైన ప్రత్యేక హోదా గురించి మోదీ మాట్లాడాలి. – ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏపీ రాజకీయాలకు చంద్రబాబు గుడ్బై?
చిత్తూరు, సాక్షి: ఏపీలో రాజకీయాలు ఊహించిన దానికంటే శరవేగంగా మారుతున్నాయి.. ఒక్క పొత్తులో సీట్ల పంపకం విషయంలో తప్ప!. తాజాగా కుప్పం నుంచి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పోటీ చేయడానికే జంకుతున్నారనే చర్చ నడుమ.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. ఆయన రాష్ట్ర రాజకీయాలకే పూర్తిగా దూరం అవుతారనే టాక్ ఒకటి నడుస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం. టీడీపీకి, చంద్రబాబు నాయుడికి కంచుకోటలా ఉంటూ వస్తోంది. 1989 నుంచి వరుసగా ఏడుసార్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చంద్రబాబు నెగ్గుతూ వచ్చారు. అయితే ఈసారి మారిన రాజకీయ సమీకరణాలు ఆయనలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కుప్పంలో ఓడిపోతానని భయం ఆయనకు పట్టుకుంది. అందుకు కారణం.. సీఎం జగన్ ఈ నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టిసారించడం. దీంతో.. ఆయన మరో నియోజకవర్గానికి షిఫ్ట్ అవుతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో తెరపైకి వచ్చిందే పెనమలూరు స్థానం. కృష్ణా జిల్లా పెనమలూరు స్థానంలో 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ నెగ్గాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో సాగిన జన ప్రభంజనంతో వైఎస్సార్సీపీ ఇక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు.. మిగతా నియోజకవర్గాల్లో మాదిరే ఇక్కడా టీడీపీలో వర్గపోరు ఉన్నా.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గ ఇంఛార్జి బోడే ప్రసాద్కే టికెట్ కేటాయిస్తారంటూ తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇప్పుడు చంద్రబాబు ఈ స్థానంపై కన్నేసినట్లు సమాచారం. నాయుడుగారూ.. ఇంకెన్నిరోజులు?: ఢిల్లీ అధిష్టానం! పొలిటికల్ సర్కిల్స్ సమాచారం మేరకు.. బీజేపీతో పొత్తుల చర్చల కోసం టీడీపీ అధినేత మొన్నామధ్య ఢిల్లీ వెళ్లారు. అయితే అక్కడి అధిష్టానం ఆయన్ని రాష్ట్ర రాజకీయాల నుంచి రెస్ట్ తీసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘ఏపీలో టీడీపీ గెలిచే పరిస్థితులు లేవు. మీ వయసు డెబ్భై ఏళ్లు దాటింది. ఇంకెంత కాలం కష్టపడుతారు. పైగా అవినీతి కేసులు చుట్టుముట్టాయి. ఇలాంటి టైంలో వయసురిత్యా రాష్ట్ర రాజకీయాలకు స్వచ్ఛందంగా దూరం జరగండి. కావాలంటే జాతీయ రాజకీయాల వైపు రండి’’ ఆయనకు ఢిల్లీ పెద్దలు సూచించారట. శరద్ పవార్, దేవగౌడ.. ఇలా వయసు మళ్లిన కొందరు నేతల పేర్లను సైతం ఉదాహరించినట్లు కూడా తెలుస్తోంది. అందుకే కుప్పం నుంచి ప్యాకప్ చేసుకోవడంతో పాటు పూర్తిగా.. ఏపీ రాజకీయాలకు చంద్రబాబు గుడ్బై చెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అంతటి అవమానం కంటే ముందు.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన భావిస్తున్నారట!. పెనమలూరులో పోటీ కోసం చంద్రబాబు నాయుడు తొలి నుంచి ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణాలో టీడీపీ అభిమానులు ఎక్కువే. పైగా పెనమలూరు సెగ్మెంట్లో కమ్మ వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉండడం కూడా చంద్రబాబు ఆసక్తికి మరో కారణంగా స్పష్టమవుతోంది. కానీ, ఆ విషయాన్ని బయటపడనివ్వలేదని అర్థమవుతోంది. ఎందుకంటే.. వర్గ పోరు మరీ ఎక్కువగా ఉంది. అందుకే బోడే ప్రసాద్ను ఆ వరుసలో ముందు నిల్చోబెట్టారు. చివరకు ఐవీఆర్ఎస్ సర్వేలో వ్యతిరేక ఫలితం వచ్చిందని చెబుతూ బోడేను పక్కన పెట్టేశారు. ఇక్కడా చంద్రబాబు తన వెన్నుపోటు బుద్ధిని ప్రదర్శించారు. స్కిల్ కేసులో జైలుకు వెళ్లిన సమయంలో.. బోడే తనకు సంఘీభావంగా దీక్ష సైతం చేపట్టిన సంగతిని సైతం చంద్రబాబు విస్మరించారు. -
PM Modi: టార్గెట్ 400.. అసలు సాధ్యమేనా??
డబ్బులు ఊరికే రావు.... తళతళా మెరిసే గుండుతో టీవిలో కనబడినప్పుడల్లా ఊదరగొడుతూ ఉంటాడు ఓ పెద్దాయన... వాస్తవమే కదా మరి.. దీన్నే రాజకీయ భాషలో చెప్పాల్సి వస్తే... అధికార పీఠం కూడా ఊరికే దక్కదు.. దశాబ్ద కాలంగా దేశాన్నిఏలుతున్న ఎన్డీయే కూటమికి మాత్రం ఈ సూత్రం వర్తించదనే చెప్పొచ్చు. మరో రెండు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి అధికారం అవలీలగానే దక్కబోతోంది కాబట్టి! విపక్షాల బలహీనతే ఎన్డీయే కు ఇప్పుడు పెద్ద బలం. అదే అధికారాన్ని మరోమారు బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించబోతోంది. 2014 కు ముందు పదేళ్లు నిరాటంకంగా పాలించిన యూపీఏ కూటమి స్వయంకృత చేష్టలు ఆ పార్టీని అప్పట్లో అధికారానికి దూరం చేశాయి. ఫలితంగా ఎన్డీయే కూటమి కేంద్రంలో కొలువు తీరింది.. ఆనాటి నుంచీ నానాటికీ బలపడుతూ.. విపక్ష పార్టీలకు అందనంత ఎత్తుకు ఎదిగి పోయింది. . రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించడం ద్వారా మరోమారు హస్తినలో పాగా వేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్డీయే కూటమికి ఈసారి విజయం నల్లేరుపై నడకే కావొచ్చు కానీ... తన ప్రాబల్యాన్ని ఈమేరకు పెంచుకుంటుంది అన్నదే ప్రధాన ప్రశ్న. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. తాను పార్టీ అధ్యక్షునిగా ఉన్న కాలంలో, 400 పైచిలుకు సీట్లు 50 శాతం ఓటు బ్యాంకు లక్ష్యంగా ముందుకు సాగాలని పార్టీ శ్రేణులతో తరచూ అంటూ ఉండేవారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే... ఈసారి ఎన్నికల్లో ఆ లక్ష్య సాధన కష్టమేమీ కాబోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మధ్య ఇండియా టీవీ సిఎన్ఎక్స్ చేపట్టిన ఒక సర్వే ప్రకారం 61 శాతం ప్రజానీకం మళ్ళీ మోదీ నే ప్రధానిగా చూడాలి అనుకుంటున్నామని చెప్పగా.. రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపింది మాత్రం కేవలం 21 శాతం మందే కావడం గమనార్హం. . బ్రిటన్ కు చెందిన ‘ది గార్డియన్‘ పత్రిక తాజాగా ఒక విశ్లేషణ వెలువరిస్తూ.. కేంద్రంలో ఉన్నబలహీన ప్రతిపక్షమే ప్రస్తుత అధికార పక్షాన్ని హ్యాట్రిక్ దిశగా నడిపించడం ఖాయమని అంచనా వేసింది. తదనుగుణంగానే ఇటీవలి రెండు సంఘటనలు ఈ అంచనాల్ని మరింత పెంచాయి.అందులో ఒకటి అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠాపన కాగా... రెండోది మిత్రునిగా మారిన ’ప్రియమైన శత్రువు’ నితీష్ కుమార్ ఎన్డీయే తీర్థం పుచ్చుకోవడం. మోదీ హవా ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆ రాష్ట్రం భూకంపం తాకిడికి అతలాకుతలమై ఆర్ధిక వ్యవస్థ చితికిపోయి ఉంది. దీని తాలూకు దుష్పరిణామాల నుంచి ఆ రాష్ట్రాన్ని కేవలం మూడేళ్ళలో బయట పడేయడమే కాదు.. గుజరాత్ ను ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్ది దేశ విదేశాల్లో ఆ రాష్ట్ర కీర్తి ఇనుమడిల్లేలా చేశారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు. పెచ్చుమీరిన ద్రవ్యోల్బణం, వేళ్లూనుకున్న అవినీతి, నిరుద్యోగ భూతం, మౌలిక వసతుల లేమి, ఉగ్రవాదం, జాతీయ భద్రతా సవాళ్లు, ఆర్ధిక తిరోగమనం, కరెంటు ఖాతా లోటు రికార్డు స్థాయికి పెరిగిపోవడం, రూపాయి విలువ పడిపోవడం.. ఇలా ఎన్నో సమస్యలు దిగ్బంధం చేసిన ఆ తరుణంలో 2014 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 31 శాతం ఓట్లతో 335 సీట్లు చేజిక్కించుకోవడం ద్వారా తొలిసారి ప్రధాని పగ్గాలు చేపట్టి తన సత్తా ఏమిటో నిరూపించుకోవడం చరిత్ర చెబుతున్న సత్యమే. బలాలు ఎన్ని ఉన్నప్పటికీ హిందీ బెల్ట్ సహకరించినట్లుగా తూర్పు, దక్షిణ భారతాల్లో బీజేపీ ఇప్పటికీ తగిన పట్టు మాత్రం సంపాదించలేక పోతోంది. అక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. ఇప్పటికిప్పుడు ఈ రాష్ట్రాల నుంచి ప్రమాదకర సంకేతాలేవీ లేనప్పటికీ ఈ రాష్ట్రాలపై ఫోకస్ పెడితే ఇక ఇప్పట్లో మోదీ టీం కు తిరుగే ఉండదు. రాబోయే ఎన్నికల్లో విజయ భేరి మోగించడం ద్వారా ముచ్చటగా మూడోమారూ అధికార దండాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్న ఎన్డీయే కూటమి ప్రగతికి దోహదం చేసిన పరిణామాలు, సంస్కరించాల్సిన అంశాలను పరిశీలిద్దాం. అయోధ్య రామాలయం: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 2019 లో బీజం పడింది. కోట్లాది హిందూ ఓటర్ల మనసులు గెలుచుకునేలా ఎప్పటికప్పుడు పావులు కదుపుతూ వచ్చిన బీజేపీ... తాజా ఎన్నికల వేళకు తనదైన శైలిలో అడుగులు వేయగలిగింది. ఆగమేఘాల మీద పనులు ప్రారంభించి మొన్న జనవరి లో బాల రాముని విగ్రహ ప్రతిష్ఠాపన తో తన లక్ష్యాన్ని చేరుకోవడంలో కృతకృత్యమైంది. ఓటు బ్యాంకును పెంచే వాటిలో ఇదొక తాజా పరిణామం. పెట్టుబడులు స్టాక్ మార్కెట్లు: ఆర్ధిక, సామాజిక, ఆరోగ్య రంగాలతో పాటు విదేశీ పొర్టుఫోలియో మదుపర్లపై విధిస్తున్న సర్ చార్జీని రద్దు చేయడం వంటి విదేశీ విధానాల్లోనూ అనుసరించిన విప్లవాత్మక విధానాలు మోదీ సర్కారు కీర్తి ప్రతిష్టలను దేశ విదేశాల్లో ఇనుమడింప జేశాయి. కేంద్రంలో స్థిరమైన సర్కారు ఏర్పడిందన్న భరోసా, మోదీ పై ఉన్న అచంచల విశ్వాసం.. విదేశీ మదుపరులకు స్థైర్యాన్నిచ్చాయి. దీంతో పెట్టుబడుల వరద మొదలైంది. మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. మధ్యలో కొవిడ్ పరిణామాలు వెనక్కి లాగినా.. అవన్నీ తాత్కాలికమేనని నిరూపిస్తూ ప్రస్తుతం స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిల్లో దూసుకెళ్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా పేరిట దేశాన్ని గ్లోబల్ డిజైనింగ్ హబ్ గా తీర్చిదిద్దడం. శిశు మరణాలను తగ్గించేందుకు, లింగ వివక్షని రూపు మాపేందుకు భేటీ బచావో, భేటీ పడావో కార్యక్రమం. యువతలో నైపుణ్యాలను వెలికితీసే స్కిల్ ఇండియా, ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా డిజిటల్ ఇండియాలపై దృష్టి. మురికివాడల సంస్కృతికి చర్మ గీతం పాడే రీతిలో అర్హులైన పేద ప్రజానీకానికి ఇల్లు దక్కేలా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. యువ భారతంలో వ్యాపార నైపుణ్యాలను వెలికి తీసేందుకు, వారిని భవిష్యత్ వ్యాపారవేత్తలుగా తీర్చి దిద్ధేందుకు దోహదం చేసేలా అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రోత్సహించడం. తద్వారా నైపుణ్యాలకు కొదువ లేక నిధుల లేమితో సతమతమయ్యే ఎంతోమంది నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చడం. నల్లధనంపై పోరాటం లో భాగంగా డీమోనిటైజేషన్ పేరిట పెద్ద నోట్ల ఉపసంహరణ ముస్లిం మహిళలకు షాదీ షాగున్ యోజనతో పాటు సౌభాగ్య, ప్రధాన మంత్రి ధన్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, ప్రధాన మంత్రి యువ యోజన, సంకల్ప్ సే సిద్ది, ఉడాన్, ఈశ్రమ పోర్టల్ ఆవిష్కరణ వంటి పథకాలు. ఆరోగ్య రంగంలో పేదలకు ఉపకరించేలా రూ. 10 లక్షల వరకు ఆరోగ్య బీమా విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ జాతీయ విద్యా విధానాన్ని 2026 నాటికి దేశమంతటా అందుబాటులోకి తెచ్చేలా చేయడం. గత దశాబ్ద కాలంలో వివిధ ఎక్సప్రెస్ వే ల నిర్మాణం, రవాణా సదుపాయాలకు దూరంగా ఉండే గ్రామాలకు సైతం రైల్వే సదుపాయాలను కల్పించడం, వందే భారత్ రైళ్లు, చిన్నపట్టణాలు, నగరాల్లో విమానాశ్రయాల నిర్మాణం. విద్యుత్ వెలుగులకు నోచుకోని గ్రామాలకు కరెంట్ సదుపాయాలూ అందించడం. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల ఖాతాల్లో నేరుగా సొమ్ములను బదిలీ చేసే జన్ ధన్ యోజన పథకం. చిన్న వర్తకులు, వ్యాపారస్థులకు ప్రయోజనం చేకూరేలా డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు శ్రీకారం చుడుతూ యూపీఐ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టడం. సమస్యలూ ఉన్నాయి.. అవినీతి నల్లధనం: కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అవినీతి, లంచగొండితనం వేళ్ళూనుకుపోయాయి. ఇది అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేది కానే కాదు. అవినీతి, కుంభకోణాలకు ఆమడదూరం ఉంటామని చెప్పే పార్టీ లో వాటితో నేరుగానో, పరోక్షంగానో ప్రమేయం ఉన్న కొందరు రాజకీయ వేత్తలు ఉండటం ఓ పెద్ద మచ్చ. నల్ల ధనం నిరోధం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరిగానే ఉంది. బ్లాక్ మనీ నిరోధం దిశగా పెద్ద నోట్ల రద్దు వంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం వేసిన అడుగులు నామమాత్రమే. ధరలు రైతులు: ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందంటూ రిజర్వు బ్యాంకు చెబుతున్నప్పటికీ ధరలు మాత్రం దిగివచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. సామాన్యుడి నడ్డి విరుగుతూనే ఉంది. దళారీ వ్యవస్థ నిర్మూలనలోనూ చర్యలు నామమాత్రమే. పంజాబ్, హర్యానా రైతులు దేశ రాజధానిలో లబోదిబో మంటూ నిరసనలకు దిగుతున్నా వారి సమస్యల పరిష్కారం దిశగా సరైన అడుగులు పడటం లేదు. ►డిజిటల్ పేమెంట్ వ్యవస్థకు సంబంధించి ఇప్పటికీ పరిష్కారం కాని విషయాలు చాలానే ఉన్నాయి. చెల్లింపులు చేసినప్పుడు ఎదురయ్యే అవాంఛనీయ పరిణామాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది. ►వందే భారత్ రైళ్లు ఓ గొప్ప విజయమని చెప్పుకునే దేశంలో.. ఇప్పటికీ గబ్బుకొట్టే రైళ్లు, అక్కరకు రాని స్టేషన్లు, సరైన పహారా వ్యవస్థ లేని రైల్వే క్రాసింగ్ లు వంటి సమస్యలతో రైల్వే రంగం కొట్టుమిట్టాడుతోంది. ►జనాభా విస్తరణతో నగరాలుగా మారుతున్న పట్టణాలు, పట్టణాలుగా రూపు సంతరించుకుంటున్న మండల స్థాయి గ్రామాల్లో మౌలిక వసతుల లేమి ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ఈనేపథ్యంలో స్మార్ట్ నగరాల నిర్మాణం ఎప్పటికి, ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. పాలకులు మారొచ్చు గాక.. ప్రభుత్వాలు కొత్త రూపు సంతరించుకోవచ్చు గాక.. కాలానుగుణ మార్పుల్లో భాగంగా కొత్త విధానాలతో ప్రజలకు ఉపయుక్తమయ్యే రీతిలో కార్యాచరణ ఉన్నప్పడే అసలైన అడుగు పడినట్లు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల్లో మూడో స్థానం దిశగా భారతావని అడుగులు వేస్తోందని మోదీ సర్కారు చెబుతోంది. వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేననే సంకేతాలు ఇప్పటికే వెలువడుతున్నాయి. కొలువు దీరబోయే కొత్త ప్రభుత్వం అఖండ భారతంలో వెలుగులు విరబూయించాలంటే ప్రజల తలరాతలు మార్చగలగాలి. లేకుంటే అంకెలన్నీ హంగూ ఆర్భాటాలతో కాగితాలపై కనిపించే మెరుపు తీగలు గానే మిగిలిపోతాయి. అలా జరగదనే భావిద్దాం. ఈసారి బృహత్తర లక్ష్యాలతో ఎన్డీయే సర్కారు ముందుకు సాగాలని, స్వర్ణ భారతం ఆవిష్కృతమవ్వాలని ఆశిద్దాం. ✍️బెహరా శ్రీనివాస రావు సీనియర్ పాత్రికేయులు -
ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్గా మారిందా?
కాంగ్రెస్ కేంద్ర రాజకీయాలకు హైదరాబాద్ మహానగరం కేంద్ర బిందువుగా మారిందా? ఇతర రాష్ట్రాల్లో సంక్షోభాలను చక్కదిద్దడానికి తెలంగాణ రాష్ట్రాన్ని వాడుకుంటోందా? తెలంగాణలో అధికారం సాధించిన కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లోని తన పార్టీ, మిత్ర పక్షాల ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇక్కడ క్యాంప్లు నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ఎమ్మెల్యేలకు హైదరాబాద్లో క్యాంప్లు నిర్వహించారు. తర్వాత ఏ రాష్ట్రం అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణకు ఏఐసీసీ ఎందుకింత ప్రాధాన్యం ఇస్తోంది? కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్రం కీలకంగా మారాయి. తమ పార్టీ జాతీయ స్థాయిలో టీ.కాంగ్రెస్కు బాధ్యత పెరిగింది. ఇటీవల కాలంలో 5 రాష్ట్రాలలో ఎన్నికల్లో జరిగితే ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అందుకే కీలక విషయాల్లో జాతీయ నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్ను విశ్వాసంలోకి తీసుకుంటోందని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో కూడా టీపీసీసీ కీలకంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీ వాడుతున్న అత్యాధునిక వోల్వో బస్సును కూడా తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన నేతలు సమకూర్చారు. జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాలను కాపాడటంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ముందుంటోంది. ఇటీవల జార్ఖండ్లో ఇండియా కూటమి ప్రభుత్వానికి ఆపద వస్తే..అక్కడి ఎమ్మెల్యేలను కాపాడటంలో టీపీసీసీ అత్యంత చాకచక్యంగా వ్యహరించింది. జార్ఖండ్ నుంచి వచ్చిన 39 మంది ఎమ్మెల్యేలకు మూడు రోజుల పాటు శామిర్ పేటలోని ఓ రిసార్ట్లో వసతి కల్పించింది. జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో తోడ్పాటును అందించింది. ఇప్పుడు బీహార్ టాస్క్ను సైతం టీపీసీసీకే ఏఐసీసీ అప్పగించింది. బీహార్లో ఇండియా కూటమి నుంచి జేడీయూనేత నితీష్కుమార్ బయటకు వచ్చి.. ఎన్డీఏలో చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఈనెల 12న అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకోవాలని ఏఐసీసీ భావించింది. అందుకే వెంటనే వారిని కాపాడే టాస్క్ను టీపీసీసీకి అప్పగించింది. దీంతో బీహార్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇబ్రహీంపట్నం లోని ఓ రిసార్ట్లో వసతి కల్పించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎటువంటి పొత్తు లేకుండా అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం మూడు మాత్రమే. అందులో కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. ఇందులో లో హిమాచల్ ప్రదేశ్ చాలా చిన్న రాష్ట్రం. అందువల్ల ఎదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తి ఈ రాష్ట్ర నాయకత్వానికి ఉండదు. ఇక మిగిలిన రెండు రాష్ట్రాలలో కర్ణాటకలో బీజేపీ చాలా బలమైన పార్టీ.. కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలంటే కర్ణాటక కంటే బీజేపీ బలం తక్కువగా ఉన్న తెలంగాణ బెటర్ అని ఏఐసీసీ భావిస్తోంది. అందుకే దేశంలో ఏ రాష్ట్రంలో పార్టీ క్రైసిస్ లో ఉన్నా దాన్ని తెలంగాణకు షిఫ్ట్ చేస్తుంది ఏఐసీసీ. దీనికి తోడు నార్త్ ఇండియా కంటే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉండడంతో హైదరాబాద్ ను క్యాంపు కేంద్రంగా ఏఐసీసీ భావిస్తోందని పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తం మీద ఏఐసీసీకి తెలంగాణ సేఫ్ జోన్గా మారింది. అయితే ఇదే సమయంలో తెలంగాణ సొమ్మును ఏఐసీసీకి దోచి పెడుతున్నారనే విమర్శలు కూడా వినిస్తున్నాయి. ఏది ఏమైనా దేశ రాజకీయాల్లో టీ కాంగ్రెస్ ప్రాధాన్యత అయితే పెరిగిందనేది నిజం. ఇక్కడ పార్టీ అధికారంలోకి రావడమే అందుకు కారణమని వేరే చెప్పక్కర్లేదు. -
విజయకాంత్ను తల్చుకుని ప్రధాని మోదీ భావోద్వేగం
చెన్నై: ప్రముఖ నటుడు, దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (డీఎండీకే) వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్ను తల్చుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం తిరుచిరాపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అక్కడ కెప్టెన్ విజయకాంత్ ప్రస్తావన తెచ్చి మరీ నివాళులర్పించారు. ‘‘కొన్నిరోజుల కిందటే.. విజయకాంత్ గారిని మనం కోల్పోయాం. ఆయన సినీ ప్రపంచంలో మాత్రమే కెప్టెన్ కాదు.. రాజకీయ రంగంలో కూడా కెప్టెనే. సినిమాల ద్వారా అశేష ప్రజాభిమాన సంపాదించుకున్న విజయకాంత్.. ఒక నేతగా రాజకీయం కంటే దేశ ప్రయోజనమే ముఖ్యమనుకునేవారు.. అని ప్రధాని మోదీ విజయకాంత్ను కొనియాడారు. ఆయన మరణం తమిళ భూమికి.. దేశానికి తీరని లోటు అని పేర్కొంటూ.. విజయకాంత్ కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. PM Modi’s heartfelt condolences to the family and admirers of his dear friend Captain Vijaykanth ❤️#VanakkamModi #Vijayakanth pic.twitter.com/31N8MPYCLx — இந்தா வாயின்கோ - Take That (@indhavaainko) January 2, 2024 తమిళనాడులో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. తొలుత... తిరుచిరాపల్లిలోని భారతిదశన్ యూనివర్సిటీలో స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారాయన. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత త్రిచీ ఎయిర్ పోర్ట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టెర్మినల్ను ప్రారంభించారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ డిసెంబర్ 28వ తేదీన కన్నుమూశారు విజయకాంత్(71). ‘కెప్టెన్’ మృతిపట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ సమయంలో ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ సైతం సంతాపం ప్రకటించారు. తమిళ సినీ రంగంలోనే కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ విజయకాంత్ తనదైన ముద్ర వేశారు. Extremely saddened by the passing away of Thiru Vijayakanth Ji. A legend of the Tamil film world, his charismatic performances captured the hearts of millions. As a political leader, he was deeply committed to public service, leaving a lasting impact on Tamil Nadu’s political… pic.twitter.com/di0ZUfUVWo — Narendra Modi (@narendramodi) December 28, 2023 -
బీజేపీ మాస్టర్ ప్లాన్.. మూడు రాష్ట్రాల సీఎంల ఎంపికలో వ్యూహం ఇదే!
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటిని తన ఖాతాలో వేసుకున్న బీజేపీ, వాటి ముఖ్యమంత్రులను ఎంపిక చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో కుల సమీకరణాలకు పెద్దపీట వేసిన తీరు ఆసక్తికరమైన రాజకీయ చర్చకు తెర తీసింది. ఈ విషయంలో బీజేపీ ఆచితూచి, అన్ని అంశాలనూ లోతుగా వడపోసి మరీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం ఏకంగా వారం రోజులకు పైగా మేధోమథనం చేయడం విశేషం! దాని ఫలితాలు సీఎంల ఎంపికలో కొట్టొచి్చనట్టుగానే కనిపించాయి. గిరిజన ప్రాబల్య ఛత్తీస్గఢ్లో గిరిజన నేతను, ఓబీసీలు గణనీయంగా ఉన్న మధ్యప్రదేశ్లో అదే సామాజిక వర్గ నాయకున్ని ఎంపిక చేసి చతురత ప్రదర్శించింది. రాజస్తాన్లో బ్రాహ్మణ నేతకు అవకాశమిచ్చింది. సీఎంల ఎంపిక కసరత్తు పూర్తిగా రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నట్టుగా స్పష్టమవుతోంది. అగ్రవర్ణ పారీ్టగా తనకున్న ముద్రను చెరిపేసుకునే క్రమంలో రాష్ట్రపతిగా ఎస్సీని, అనంతరం ఎస్టీని ఎంపిక చేసిన కమలం పార్టీ, సీఎంల ఎంపికలోనూ అదే పోకడ కనబరిచింది. ఆ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో దిగ్గజాల వంటి నేతలను కూడా ఎలాంటి శషభిషలూ లేకుండా పక్కన పెట్టడం విశేషం!. మధ్యప్రదేశ్లో సీఎంగా పార్టీని విజయ తీరాలకు చేర్చిన శివరాజ్సింగ్ చౌహాన్ అంతటి సీనియర్ మోస్ట్ నాయకునికి మరో చాన్సివ్వలేదు. రాజస్తాన్, ఛత్తీస్ల్లో పలుమార్లు సీఎంలుగా చేసిన వసుంధరా రాజె సింధియా, రమణ్సింగ్ పేర్లనైతే పరిశీలించనే లేదని తేటతెల్లమైంది. అగ్రవర్ణ ముద్రను వదిలించుకుని అందరి పార్టీగా మారే దిశగా కొన్నేళ్లుగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు సీఎంల ఎంపిక మరోసారి అద్దం పట్టిందని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్త కులగణనను ప్రధానాంశంగా చేసుకునేందుకు కాంగ్రెస్, జేడీ(యూ) వంటి విపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో దానికి గట్టిగా చెక్ పెట్టే దిశగా కమలనాథులు చేస్తున్న ప్రయత్నాలు కూడా తాజా నిర్ణయాల్లో ప్రతిఫలించాయి. మధ్యప్రదేశ్లో ‘బీసీ’ రూటు.. మధ్యప్రదేశ్లో సీఎంగా పూర్తి ఆరెస్సెస్ నేపథ్యమున్న ఓబీసీ నేత మోహన్ యాదవ్ ఎంపిక కూడా బీజేపీ ప్రాథమ్యాలకే అద్దం పట్టింది. ఇది సరిహద్దు రాష్ట్రమైన యూపీతో పాటు బిహార్లోనూ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బాగా కలిసొస్తుందని పార్టీ భావిస్తోంది. అక్కడి ప్రధాన పార్టీలైన సమాజ్వాదీ, ఆర్జేడీల సారథ్యం యాదవ్ల చేతుల్లోనే ఉండటం తెలిసిందే. పైగా 80 లోక్సభ స్థానాలున్న యూపీలో మరోసారి క్లీన్స్వీప్ చేయడం, 40 సీట్లు బిహార్లోనూ భారీగా సీట్లు నెగ్గడం బీజేపీకి చాలా కీలకం. ఈ నేపథ్యంలో అక్కడ సంఖ్యాధికులైన యాదవులను ఆకట్టుకునేందుకు కూడా ఓబీసీ సీఎం ఎంపిక ఉపయోగపడుతుందన్నది బీజేపీ అంచనా. ఎందుకంటే ఏకంగా 120 లోక్సభ స్థానాలున్న యూపీ, బిహార్లలో ఓబీసీల ఓట్లు అతి కీలకం. వారిలోనూ యాదవులు యూపీలో దాదాపుగా 10 శాతం, బిహార్లో ఏకంగా 14 శాతమున్నారు. ఇక దళితుడైన జగదీశ్ దేవ్డా, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రాజేంద్ర శుక్లాలను ఉప ముఖ్యమంత్రులను చేయడం యూపీలోనూ బాగా కలిసొస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఉత్తరాది అంతటా రాజకీయంగా గట్టి ప్రభావం చూపే రాజ్పుత్ సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని నరేంద్రసింగ్ తోమర్ను స్పీకర్గా ఎంచుకుంది. ఛత్తీస్గఢ్లో ‘గిరిజన’ జపం.. గిరిజన రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో వారి ప్రాబల్యం సహజంగానే ఎక్కువ. ఇక్కడ గిరిజన జనాభా ఏకంగా 32 శాతం! దాంతో గిరిజన ఎమ్మెల్యే విష్ణుదేవ్ సాయ్ని ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంచుకుంది. ఓబీసీ నేతకు చాన్సివ్వాలన్న ప్రతిపాదన కూడా ఒక దశలో తెరపైకి వచ్చినా అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజన ప్రాబల్య ప్రాంతాలైన సర్గుజా, బస్తర్ఱ గుండుగుత్తగా బీజేపీకే జైకొట్టిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గంవైపే మొగ్గినట్టు సమాచారం. ఆ ప్రాంతాల్లోని 26 ఎస్టీ ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ ఏకంగా 22 సీట్లు నెగ్గింది. ఈ నేపథ్యంలో సాయ్ ఎంపిక దేశవ్యాప్తంగా గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో కలిసొస్తుందని భావిస్తోంది. సరిహద్దు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్లో 22 శాతం, జార్ఖండ్లో 26 శాతం గిరిజన జనాభా ఉండటం తెలిసిందే. ఇక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వరాష్ట్రమైన ఒడిశాలోనూ 23 శాతం గిరిజనులున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో 20 ఎస్టీ లోక్సభ స్థానాలున్నాయి. మరో 10 స్థానాల్లోనూ గిరిజన ఓట్లు కీలకంగా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే సాయ్ ఎంపిక జరిగినట్టు కనిపిస్తోంది. రాజస్తాన్లో కుల సమతౌల్యం.. రాజస్తాన్లో తొలిసారి ఎమ్మెల్యే అయిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భజన్లాల్ శర్మకు సీఎంగా జాక్పాట్ దక్కడం కూడా బీజేపీ కుల సమీకరణల వ్యూహంలో భాగమేనంటున్నారు. నిజానికి రాజస్తాన్లో 7 శాతం దాకా ఉన్న బ్రాహ్మణ జనాభా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేయదు. కానీ శర్మ ఎంపిక వెనక ఆంతర్యం రాజస్తాన్తో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హరియాణాల్లో గణనీయంగా ఉన్న బ్రాహ్మణ వర్గాలను ఆకట్టుకోవడంగా కనిపిస్తోంది. బ్రాహ్మణులు హరియాణాలో 12 శాతం, యూపీలో 10 శాతానికి పైగా ఉంటారు. అదే సమయంలో మిగతా సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకుంటూ రాచ కుటుంబీకురాలైన దియాకుమారి, దళిత నేత ప్రేమ్చంద్ బైర్వాలను ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేసింది. రాష్ట్రంలో శర్మ, మధ్యప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా శుక్లా ఎంపిక ఉత్తరాది అంతటా బీజేపీకి పెట్టన కోటగా నిలుస్తూ వస్తున్న అగ్ర వర్ణ ఓటర్లను మరింత ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా కన్పిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్. -
ఢిల్లీ లీడర్స్ రాకతో.. కేడర్లో జోష్
కె.రాహుల్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనసంఘ్ (బీజేపీగా ఏర్పడడానికి ముందు) తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గెలుస్తూ వచ్చారు. 1982కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా తీరు, రాజకీయాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్న సందర్భంలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ఓ రాజకీయశక్తిగా ఎదిగేందుకు సానుకూల పరిస్థితులున్నట్టు పార్టీ నేతలు అంచనా వేశారు. అయితే టీడీపీ ఆవిర్భావం, ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం వంటి పరిణామాలు, టీడీపీతో పొత్తు, 1995లో ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసి చంద్రబాబు సీఎం అయ్యాక, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పుచేర్పులు, టీడీపీతో పొత్తుల కొనసాగింపు వంటివి రాష్ట్రంలో బీజేపీకి నష్టం చేశాయని చెప్పొచ్చు. తర్వాత 1998 లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీచేసి 4 ఎంపీ సీట్లు గెలుపొంది సత్తా చాటింది. అయితే ఆ వెంటనే 1999లో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకోక తప్పలేదు. ఆ పరిస్థితి తెలంగాణ ఏర్పడేదాకా కొనసాగడం రాజకీయంగా బీజేపీకి తీరని నష్టం చేసిందని ఆ పార్టీ అగ్రనేతలే చెబుతుండడం గమనార్హం. 12 సీట్ల నుంచి ఒక్క సీటుకు.. ఉమ్మడి ఏపీలో..1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో పోటీచేసి బీజేపీ 12 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. ఉమ్మడి ఏపీ, ఆ తర్వాత తెలంగాణలో అవే కమలదళం గెలిచిన అత్యధిక సీట్లు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక 2014లో తొలిసారి ఐదు సీట్లు సాధించినా, 2018లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేసినప్పుడు కేవలం 8 శాతం ఓట్లతో ఒక్క స్థానానికే పరిమితమైంది. కానీ అనూహ్యంగా 2019 ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే 4 సీట్లు గెలుచుకోవడంతో పాటు ఓటింగ్ శాతాన్ని ఒక్కసారిగా 20 శాతానికి పెంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్తో నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన పోటీలో విజయం సాధించడం, ఈ రెండు ఉప ఎన్నికల మధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 48 సీట్లు (దీనికి ముందు 4 సీట్లే) గెలుపొందడంతో ఒక్కసారిగా బీజేపీపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో జరిగిన మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్రెడ్డి విజయం సాధించడం ఖాయమని పార్టీ వర్గాలు అంచనా వేసినా, 12 వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్చేతిలో ఆయన ఓటమి చవిచూశారు. అయితే అంతకు ముందు అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పడిన 13 వేల ఓట్లు 90 వేల ఓట్లకు పెరగడం బీజేపీకి కొంత ఊరటనిచ్చింది. ఈ విధంగా ఈ అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మూడో స్థానానికే పరిమితం చేయడం విశేషం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన కుందూరు జానారెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముచ్చటగా మూడోసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భవితవ్యం ఎలా ఉంటుందో చూడాలి. మూడు వేర్వేరు గుర్తులపై జంగారెడ్డి విజయదుందుభి 1967లో భారతీయ జన సంఘ్ (బీజేఎస్) దీపం గుర్తుపై ఉమ్మడి ఏపీలో మూడుసీట్లు గెలవగా అందులో ఒక స్థానంలో తెలంగాణ నుంచి చందుపట్ల జంగారెడ్డి గెలు పొందారు. ఎమర్జెన్సీ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జాతీయ స్థాయిలో ఇందిరతో విభేదించి బయటకు వచ్చిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో బీజేఎస్, ఇతర పార్టీలు కలిపి జనతా పార్టీ ఏర్పడింది. 1978లో ఉమ్మడి ఏపీలో జనతా పార్టీ నాగలిపట్టిన రైతు గుర్తుపై 60 మంది గెలుపొందగా, వారి లో తెలంగాణ నుంచి జంగారెడ్డి ఉన్నారు. ఇక 1980లో బీజేపీ ఏర్పడ్డాక ఇందిరాహత్యానంతరం జరిగిన 1984 లోక్సభ మధ్యంతర ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకుని ఏపీలో టీడీపీ 30 సీట్లు గెలిచింది. ఆ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీ రెండే రెండు సీట్లు గెలవగా అందులో ఒకటి హన్మకొండ. ఇక్కడ కమలం గుర్తుపై పోటీ చేసిన జంగారెడ్డి నాటి కేంద్రమంత్రి పీవీ నరసింహారావును ఓడించి చరిత్ర సృష్టించారు. బండి సంజయ్ మార్పుతో.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ఏడాది మార్చిలో మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న బండి సంజయ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిసే దాకా పదవిలో కొనసాగుతారని అంతా భావించారు. కానీ కొన్నాళ్లకే సంజయ్ను మారుస్తున్నారంటూ ప్రచారం మొదలై రెండు, మూడు నెలలు కొనసాగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డిని నాలుగోసారి (ఉమ్మడి ఏపీలో రెండు సార్లు, ఈ విడత కలుసుకుని తెలంగాణలో రెండోసారి) రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. దీంతో కేడర్లో స్తబ్దత, కొంత అయోమయ వాతావరణం ఏర్పడింది. మోదీ సభలతో నయా జోష్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోగానే ప్రధాని మోదీ ఈ నెల 1న మహబూబ్నగర్, 3న నిజామాబాద్లలో జరిపిన పర్యటన పార్టీలో కొత్త ఉత్సాం నింపిందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు తొమ్మిదేళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రధాని వివరించడం ప్రజల్లో సానుకూలత పెరగడానికి దోహదపడిందని అంటు న్నారు. ఇక షెడ్యూల్ వెలువడిన మరుసటి రోజే బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఆదిలాబాద్లో జనగర్జన సభ నిర్వహించారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడాల్సి ఉండగా, ఎన్నికల ప్రచార గడువు ముగిసే నాటికి పది ఉమ్మడి జిల్లాల పరిధిలో మూడేసి చొప్పున మోదీ, అమిత్షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల బహిరంగ సభలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ సభల విజయవంతం, వీటిలో ప్రస్తావించే అంశాలు, ఇచ్చే హామీలు పార్టీకి మరింత మేలు చేస్తాయని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. బీజేపీ విజయం ఇలా.. 1980లో పార్టీ ఏర్పడ్డాక ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఎమ్మెల్యే సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 2018లో కేవలం ఒకేఒక్క సీటు టి.రాజాసింగ్ గెలుపొందగా..అంతకుముందు వరుసగా మూడుసార్లు గెలిచిన జి.కిషన్రెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎం.రఘునందన్రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందారు. 1983 నుంచి వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం పెరుగుతూ... తగ్గుతూ వచ్చింది. -
ఎన్సీపీలో కీలక పరిణామం.. రాజీనామా వెనక్కి తీసుకున్న శరద్ పవార్..
ముంబై: ఎన్సీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం అధ్యక్ష పదివికి రాజీనామా చేసిన శరద్పవార్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పార్టీ కార్యకర్తల ప్రేమ, అభిమానం, నమ్మకం తనను కదిలించాయని తెలిపారు. అందుకే వాళ్ల ఇష్టం మేరకు రాజీనామా ఉససంహరించుకుంటున్నట్లు చెప్పారు. తాను ఎప్పుడైనా కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా వాళ్లు తనతో ఉంటున్నారని చెప్పారు. వాళ్ల సెంటిమెంట్ను కాదనలేనన్నారు. మంగళవారం తన ఆత్మకథ రెండో భాగం పుస్తకం విడుదల చేస్తూ రాజీనామా విషయాన్ని ప్రకటించారు శరద్పవార్. ఆ వెంటనే ఎన్సీపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రాజీనామా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. దీంతో మూడు రోజుల తర్వాత పవార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కాగా.. మంగళవారం రాజీనామా అనంతరం పార్టీ అధినేతగా తన వారసుడిని ఎంపిక చేసేందుకు శరద్ పవార్ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం సమావేశం అయ్యింది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, సోదరుడి కుమారుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దక్షిణ ముంబైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో శరద్పవార్ రాజీనామా నిర్ణయాన్ని ఎన్సీపీ కమిటీ తిరస్కరించింది. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని పార్టీ ప్యానెల్ శరద్ను కోరింది. దేశమంతా శరద్ పవార్ ప్రభావం ఉందని ఆ పార్టీ సినియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామా చేస్తానంటే మేం ఊరుకోమని అన్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే రాజీనామా ఉపసంహరించుకుంటున్నట్లు పవార్ ప్రకటించడంతో ఎన్సీపీ శ్రేణులు ఆనందం వ్యక్యం చేశాయి. చదవండి: వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'కి మద్దతు తెలిపిన మోదీ -
శరద్ పవార్ రాజీనామా చేశారంటే.. దేశ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది..!
ముంబై: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం తనను షాక్కు గురి చేసిందని తెలిపారు ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్. ఆయన అంత పెద్ద నిర్ణయం తీసుకన్నారంటే కచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ ఏదో అలజడి జరగబోతోందని అన్నారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంతో చూసి తాము ఓ నిర్ణయం తీసుకుంటామని రౌత్ చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై ఓ కన్నేసి ఉంచిననట్లు తెలిపారు. గతంలో బాలాసాహెబ్ థాక్రే కూడా దిగజారుడు రాయకీయాలు చూసి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే శివసైనికుల విజ్ఞప్తులతో బాలాసాహెబ్ అప్పుడు తన నిర్ణయాన్ని ఉపసంహరిచుకున్నారని, ఇప్పుడు పవార్ కూడా రాజీనామాను వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. పవార్ను బాలాసాహెబ్తో పోల్చారు. చదవండి: శరద్ పవార్ రాజీనామా తదనంతరం మరో ఎన్సీపీ నేత రాజీనామా కాగా.. తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్ల పవార్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్సీపీ కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజీనామా చేయవద్దని ప్రాధేయపడుతున్నారు. ఓ కార్యకర్త అయితే రాజీనామా ఉపసంహంరించుకోవాలని పవార్కు రక్తంతో లేఖ రాశాడు. మరోవైపు పవార్ రాజీనామా అనంతరం ఎన్సీపీ కార్యదర్శి జితేంద్ర అవ్హాద్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. థానే ఎన్సీపీ ఆఫీస్ బేరర్లు అందరూ కూడా రాజీనామ ా చేసినట్లు తెలిపారు. పవార్ తప్పుకోవడం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు.. -
బీజేపీలో చేరిన కాంగ్రెస్ దిగ్గజ నేత కుమారుడు.. తండ్రి హర్ట్..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. తండ్రి సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన కమలం గూటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని హోదాలకు రాజీనామా చేసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక కార్యక్రమం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, వీ మురళీధరన్, కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్.. అనిల్ ఆంటల్ని పార్టీలోకి ఆహ్వానించారు. పుష్పగుచ్చం ఇచ్చి, పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అనిల్ ఆంటోని కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ను నిర్వహించేవారు. అయితే కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ విడుదల చేసిన అనంతరం.. బీజేపీకి మద్దతుగా ఆయన ట్వీట్ చేయడం కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఈ డాక్యుమెంటరీని అతను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్ను వీడటం గమనార్హం. బీజేపీలో చేరిన అనంతరం కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు అనిల్ ఆంటోని. దేశంలోని కాంగ్రెస్ నాయకులంతా కేవలం ఒక్క కుటుంబం కోసమే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కలిసి పనిచేసిన నాయకులపైనా తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి రియాక్షన్.. మరోవైపు కుమారుడు బీజేపీలో చేరడం తనను తీవ్రంగా బాధించిందని ఏకే ఆంటోని ఆవేదన వ్యక్తం చేశారు. అతను పూర్తిగా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నారు. కొడుకులా తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. లౌకికవాదమే భారతదేశ ఐక్యత అని, కానీ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని మండిపడ్డారు. దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చదవండి: నాది కాంగ్రెస్ రక్తం.. కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ -
పొలిటికల్ రివ్యూ: 2022లో చేయి కాలిందా? పట్టు జారిందా?
2022లో కాంగ్రెస్ పార్టీ మరి కొంచెం పతనమైంది. 2014 నుంచి కాంగ్రెస్ పార్టీని అపజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. రెండు మూడు మినహా చెప్పుకోదగ్గ రాష్ట్రాల్లో అధికారం లేదు. మూడేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంది. చాలాకాలం తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి అధ్యక్షుడు ఎన్నికయ్యారు. గాంధీ కుటుంబ సభ్యులు మాత్రం ఈడీ ఆఫీస్ చుట్టూ తిరిగారు. ఈ ఏడాది ఒక రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుని..మరో రాష్ట్రంలో అధికారం సాధించుకుంది. ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుస వైఫల్యాలు, అంతర్గత కుమ్ములాటలు, కీలక నేతలు పార్టీకి గుడ్బై చెప్పడంతో మరింత కుదేలైన హస్తం శ్రేణుల్లో.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాస్త జోష్ నింపింది. వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీని.. 2022లోనూ వైఫల్యాలు వెంటాడాయి. ఈ ఏడాది ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అధికారంలో ఉన్న పంజాబ్ను కోల్పోయింది. బీజేపీ నుంచి హిమాచల్ ప్రదేశ్ను గెలుచుకుంది. మిగిలిన ఐదు రాష్ట్రాల్లో బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకుంది. గుజరాత్లో అయితే ఏడవసారి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది హస్తం పార్టీ. ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టి తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు బీహార్లో బీజేపీ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ కమలానికి టాటా చెప్పి.. కాంగ్రెస్ కూటమిలో చేరారు. ఆ విధంగా మహారాష్ట్ర చేజారితే.. బీహార్ కూటమి ప్రభుత్వంలో కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ పోయే.. ఖర్గే వచ్చే 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీకి అధ్యక్షుడే లేకుండా మూడున్నరేళ్ళ పాటు సాగింది. సోనియా గాంధీ ఆరోగ్యం బాగా లేకపోయినా తాత్కాలికంగా పార్టీ బాధ్యతలు నిర్వహించారు. అధ్యక్ష ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడానికి ప్రక్రియ కొనసాగుతున్న దశలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. 22 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మరోసారి గాంధీయేతర కుటుంబం నుంచి ఓ నేత అధ్యక్షుడయ్యారు. కర్నాటకకు చెందిన 80 ఏళ్ళ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొత్త నాయకుడు వచ్చినా.. పార్టీ పరిస్థితుల్లో మార్పులేదు, అధికారంలో ఉన్న రాజస్థాన్ నుంచి అధికారం పోగొట్టుకున్న తెలంగాణ వరకూ అన్ని రాష్ట్రాల్లోనూ అంతర్గత కుమ్ములాటలే. రాజస్థాన్లో ముఖ్యమంత్రి గెహ్లాట్, యువనేత పైలట్ వర్గాలు బహిరంగంగా మాటల తూటాలు విసురుకుంటున్నా ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో కాంగ్రెస్ హైకమాండ్ అల్లాడుతోంది. పార్టీని వెంటాడుతున్న పాపాలు ఓవైపు కాంగ్రెస్ పార్టీని కష్టాలు వెంటాడుతుంటే.. మరోవైపు నేషనల్ హెరాల్ట్ కేసు గాంధీ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలిసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ. సోనియాను మూడుసార్లు, రాహుల్ గాంధీని ఐదు రోజులు విచారించారు ఈడీ అధికారులు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులతో.. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ఉన్న లింకులపై ఆరా తీశారు. గాంధీలు విచారణకు హాజరైన అన్ని రోజులు దేశవ్యాప్తంగా ఆందోళనలు, హర్తాళ్లు చేపట్టారు కాంగ్రెస్ శ్రేణులు. ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సోనియా గాంధీ విచారణ నేపథ్యంలో రోడ్డెక్కిన రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జోడో.. తెచ్చే మార్పు ఎంత? చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టున్న కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసేందుకు, పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు..సెప్టెంబర్లో భారత్ జోడో యాత్ర ప్రారంభించారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగేలా ప్లాన్ చేశారు. కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర.. తొమ్మిది రాష్ట్రాలు దాటుకుని..ప్రస్తుతం ఢిల్లీ చేరుకుంది. బీజేపీ విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా దేశ ఐక్యత కోసమే భారత్ జోడో అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పార్టీలో నెలకొన్న విపరీత పరిస్థితులు.. నేతల మధ్య అంతరాలను తొలగించి, కాంగ్రెస్ను తిరిగి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్. ఒకవైపు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా రాహుల్ గాంధీ వాటి గురించి సీరియస్గా తీసుకోకుండా తన జోడో యాత్ర కొనసాగించడంపై విమర్శలు వినిపించాయి. ముందుంది ముసళ్ల పండగ వరుజ పరాజయాలు..అంతర్గత కుమ్ములాటలతో నిస్తేజంగా మారిన కాంగ్రెస్ పార్టీలో భారత్ జోడో యాత్ర కాస్త ఉత్సాహం నింపింది. జనంలో ఉండేందుకు..ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు రాహుల్ గాంధీకి అవకాశం దక్కింది. అయితే రాహుల్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల లబ్ధి మాత్రం ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు 2023లో కీలకమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోనుంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్ పాటు ఖర్గే సొంత రాష్ట్రం కర్నాటక సహా 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రభావం ఆయా రాష్ట్రాల్లో ఏమేరకు ఉందో..త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు తేల్చేయనున్నాయి. కొండ లాంటి బీజేపీ, బలమైన ప్రాంతీయ పార్టీలతోపాటు కాంగ్రెస్కు అతిపెద్ద సవాల్గా మారింది ఆమ్ ఆద్మీ పార్టీ. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కాంగ్రెస్ నుంచి పంజాబ్ను చేజిక్కించుకున్నారు. గుజరాత్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును అడ్డంగా చీల్చేశారు. ముందు ముందు ఆప్ వల్ల కాంగ్రెస్కు తీవ్ర నష్టం జరుగుతుందనే అంచనాలు కాంగ్రెస్ హైకమాండ్ను కంగారు పెడుతున్నాయి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ 2022 లో భారత రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, హోం మంత్రి అమిత్ షా చాణక్యంతో బిజెపి అప్రతిహత విజయాలను నమోదు చేస్తోంది. బిజెపి బండిని జోడెద్దుల లాగా ఈ ఇద్దరు నేతలే తమ భుజస్కందాలపై పెట్టుకుని లాగుతున్నారు. దేశంలోని అన్ని పార్టీలకు కంటే అందనంత పై స్థాయిలో బిజెపిని నిలబెట్టగలిగారు. ఏడాది ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. తొలుత ప్రధమార్ధంలో మార్చి నెలలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగగా నాలుగు రాష్ట్రాలలో బిజెపి జెండా ఎగరేసింది. ఉత్తరప్రదేశ్ ,ఉత్తరాఖండ్, మణిపూర్ , గోవాలలో వరుసగా రెండోసారి బిజెపి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా ఢిల్లీ అవతల తన సత్తా చాటింది. ఇక ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక రాష్ట్రాన్ని బిజెపి తిరిగి నిలబెట్టుకుంది. గుజరాత్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 151 సీట్లు గెలిచి నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని సృష్టించారు. వరుసగా ఏడోసారి బిజెపి ప్రభుత్వాన్ని నిలబెట్టారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు కమ్యూనిస్టుల పేరుతో ఉన్న చరిత్రను సమం చేశారు. అయితే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తన జెండా ఎగరేసి పరువు కాపాడుకుంది. అయితే కేవలం 0.9% తేడాతోనే అది బిజెపిపై విజయం సాధించగలిగింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఓటమి చవి చూడడం ఆ పార్టీకి షాక్ కలిగించింది. అయితే దీనికి జేపీ నడ్డా గ్రూపు రాజకీయాలే కారణమని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒక రోజున జేపీ నడ్డాను ఇంటికి సాగనంపడం ఖాయమని వార్తలు గుప్పుమంటున్నాయి. సునాయసంగా.. ఇక ఈ ఏడాదిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోను బిజెపి సజావుగా సునాయాసంగా తన అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము ను నరేంద్ర మోదీ ఎంపిక చేసి ప్రతిపక్షాలను చల్లా చెదురు చేయడంలో విజయం సాధించగలిగారు. తొలుత ప్రతిపక్ష క్యాంపులో చేరిన జెడిఎస్, జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి పార్టీలు సైతం తిరిగి బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి మోదీ కల్పించారు. విపక్షాల మధ్య ఐక్యతను దెబ్బతీయడంలో మోడీ సఫలీకృతులయ్యారు. 60 శాతానికి పైగా ఓటింగ్ సాధించి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ఇటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం బిజెపి అభ్యర్థి జగదీప్ దంకర్ సునాయాసంగా గెలుపొందారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన జగదీప్ దంకర్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి నరేంద్ర మోడీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే దాని వెనుక నరేంద్ర మోడీ రాజకీయ ఎత్తుగడ కనిపించింది. ఏడాదిన్నర పాటు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీని ముట్టడించిన రైతుల అత్యధికమంది జాట్ వర్గానికి చెందిన వారే. ఈ నేపథ్యంలో రైతులను సంతృప్తి పరచేందుకు ఆ వర్గానికి చెందిన జగదీప్ దంకర్ ను నరేంద్ర మోదీ ఎంపిక చేసి వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అంతకుముందే పశ్చిమబెంగాల్లో జగదీప్ దంకర్ తనదైన స్టైల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇబ్బంది పెడుతూ నరేంద్ర మోడీ దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలన్నీ జగదీష్ ధన్కర్కు కలిసి వచ్చాయి. 16 రాష్ట్రాల్లో అధికారం.. 2022 సంవత్సరం ప్రారంభంలో బిజెపి చేతిలో 17 రాష్ట్రాలు ఉన్నాయి. ఏడాది ముగిసే సరికి బిజెపి 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బీహార్ లో బిజెపికి నితీష్ కుమార్ రామ్ రామ్ చెప్పడంతో రాష్ట్రం బిజెపి చేయి జారింది. అయితే మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే సహకారంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూలగొట్టి , బిజెపి తిరిగి ఆ రాష్ట్రాన్ని తన చేతిలోకి తీసుకోగలిగింది. ఒక రాష్ట్రం చేజారినా మరో రాష్ట్రాన్ని దక్కించుకొని తన 17వ రాష్ట్రాన్ని బిజెపి కాపాడుకోగలిగింది. అయితే ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్ చేజారడంతో ప్రస్తుతం బిజెపి ఈ ఏడాది ఒక రాష్ట్రాన్ని కోల్పోయి 16 రాష్ట్రాలలో అధికారంలో కొనసాగుతోంది. ఏడాది ప్రారంభంలో రాజ్యసభలో బిజెపికి 96 సీట్లు ఉండగా మే నెలలో అది 100 సీట్ల మార్కు దాటింది. కానీ ఆ తర్వాత జూన్లో జరిగిన రాజ్యసభ ద్వై వార్షిక ఎన్నికల్లో అపార్టీ సంఖ్య 92 కు పడిపోయింది. లోక్సభలో బిజెపికి ఉప ఎన్నికల్లో ఒక సీట్ పెరిగింది. మోదీ మాటే వేదం.. బిజెపిలో నరేంద్ర మోదీ మాటే వేదవాక్కుగా కొనసాగుతోంది. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోడీ అవతరించడంతో మిగిలిన నాయకులందరూ ఆయన మాట శిరోధార్యంగా భావించి ముందుకు నడుస్తున్నారు. మోడీ కున్న ప్రజాదరణను ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకునేందుకు అమిత్ షా అత్యంత పదునైన వ్యూహాలు రూపొందిస్తున్నారు. సుశిక్షితులైన బిజెపి కార్యకర్తల యంత్రాంగం , ఆర్ఎస్ఎస్ అండతో ఆ పార్టీ పక్కడ్బందీగా ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది . వరుసగా 8 ఏళ్ల నుంచి అధికారంలో బిజెపి కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీకి అపారమైన వనరులు అందుబాటులోకి వచ్చాయి. ఖర్చుకు వెనకాడకుండా పార్టీ ప్రచారాన్ని దూకుడుగా కొనసాగిస్తుంది. దీనికి తోడు కార్పొరేట్ వ్యూహకర్తలు రంగంలోకి దిగి, క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని ఎప్పటికప్పుడు పసిగట్టి పార్టీకి చేరవేస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తూ మిగిలిన పార్టీలకంటే ఒక అడుగు ముందంజలో ఉంటున్నారు. తన పార్టీని బలోపేతం చేసుకోవడంతోపాటు ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడంలోనూ బిజెపి అదే దూకుడును ప్రదర్శిస్తుంది. రకరకాల ఎత్తుగడలతో విపక్షాలను చెల్లాచెదురుచేసి తన ఆధిపత్యాన్ని సృష్టినం చేసుకుంటుంది. కాంగ్రెసే ప్రత్యామ్నాయం.. మొత్తానికి ఏడాది బిజెపి తన ఆధిపత్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించింది. మిగిలిన పార్టీలతో పోలిస్తే నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి 90% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకుపోతోంది. ఏడాది మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగా ఐదు రాష్ట్రాలను బిజెపి తన ఖాతాలో వేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ను, కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ను గెలుచుకుంది. బిజెపికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తీవ్రమైన పోరాటం ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఇప్పటికీ బిజెపిని ఎదుర్కోగలిగిన ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ కొనసాగుతోంది. ఇక వచ్చే ఏడాది లోక్ సభకు ఎన్నికల సన్నాహక సంవత్సరం. కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , చత్తీస్గడ్ లాంటి ఐదు కీలక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలోనూ బిజెపి కాంగ్రెస్ ముఖాముఖిగా తలపడుతున్నాయి. అయితే అసెంబ్లీకి, లోక్సభకు ఎన్నికలకు మధ్య ఎజెండా వేరువేరుగా ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో గెలిస్తేనే లోక్సభ ఎన్నికలకు నైతిక బలం, జోష్ ఆయా పార్టీలకు లభిస్తుంది. మరి 2023 ఏ పార్టీ దశను ఎలా తిప్పుతుందనేది ప్రజలే డిసైడ్ చేయాలి. చదవండి: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. కేంద్రమంత్రి జోస్యం.. -
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్.. మాస్టర్ ప్లాన్తో కేసీఆర్
సాక్షి ప్రత్యేకం: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) పార్టీ ఆవిర్భావం అయితే జరిగింది. మరి మిగతా రాష్ట్రాల్లో కార్యకలాపాలు ఎప్పుడు?. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పడం మొదలయ్యేది ఎప్పుడు? ఆ ప్రశ్నలకు ఓ సమాధానం ఇప్పుడు దొరికింది. డిసెంబర్ నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్నాయి. పార్టీ పేరును మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటీవల అధికారికంగా సమాచారం వచ్చిన వెంటనే అధినేత కేసీఆర్ కార్యక్రమాలను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ను అధికారికంగా ప్రకటించి వెంటనే ఢిల్లీ పర్యటన చేపట్టారు. వీలయినంత త్వరలో ఢిల్లీలో జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ముందుకు సాగారు. ఢిల్లీలో జాతీయ కార్యాలయ ప్రారంభం.. దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తి : కేసీఆర్ డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతున్నదనే నేపథ్యంలో.. ఆ లోపే బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించి, ఢిల్లీలో వేదికను సిద్దం చేయాలనే తలంపుతో వున్న అతికొద్ది సమయంలోనే ఢిల్లీ టూర్ ను అధినేత కెసిఆర్ చేపట్టారు. అటు ఉత్తరాదినుంచి ఇటు దక్షిణాది నుంచి అఖిలేష్ యాదవ్., కుమార స్వామి వంటి మాజీ సిఎం లు, ప్రముఖ పార్టీల అధ్యక్షులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశ రాజకీయ విమర్శకులు మేథావులు ఆశ్చర్యపోయేలా అత్యద్భుతంగా బిఆర్ఎస్ కార్యాలయాన్ని డిసెంబర్ 14 న అధినేత కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలనుంచి ఢిల్లీ కి చేరుకున్న సీనియర్ రాజకీయ నాయకులు, రచయితలు, మేథావులు, ప్రముఖులు వందలాదిగా బిఆర్ఎస్ అధినేతకు స్వయంగా కలిసి సంఘీభావం తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ లో సభ్యత్వం తీసుకుని పనిచేయడానికి తమ సంసిద్దతను వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాలనుంచి ఎంతో మంది సీనియర్ రాజకీయ నాయకులు పలు సామాజిక వర్గాల సంఘాల నేతలు, పలు రంగాలకు చెందిన వృత్తులకు చెందిన మేధావులు, యువతీ యువకులు బిఆర్ఎస్ లో చేరి అధినేత కేసీఆర్ వెంట కలిసి నడిచేందుకు ఉత్సాహం చూపిస్తున్న వర్తమాన పరిస్తితి దేశవ్యాప్తంగా నెలకొన్నది. పలు రాష్ట్రాల్లో భారత రాష్ట్ర కిసాన్ సమితి ( బీఆర్కేఎస్) ప్రారంభం : ‘‘ఎద్దు ఏడ్సిన యవుసం.. రైతు ఏడ్సిన రాజ్యం ముందట పడదు’’ అనే నానుడి వ్యవసాయాధారిత దేశంలోని ప్రజల నాలుకల మీద వుంటుంది. అటువంటి అత్యంత ప్రాముఖ్యతనివ్వాల్సిన వ్యవసాయం సాగునీటి రంగాన్ని దశాబ్దాలుగా దేశ పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆవేదనను అధినేత కెసిఆర్ పలు మార్లు ప్రకటించారు. ఈ తాత్వికతతోనే తెలంగాణ సాధన అనంతరం తక్షణమే వ్యవసాయం సాగునీటి రంగానికి పెద్ద పీట వేశారు. అనతికాలంలోనే దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారడంలో సిఎం కెసిఆర్ దార్శనికత అకుంఠిత ధీక్ష ప్రధాన కారణం. నేడు రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులను ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వ్యవసాయం సాగునీటి రంగాన్ని కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పటిష్ట పరిచి అన్నం పెట్టే దేశ రైతన్నను కాపాడుకోవాలనే దీర్ఘకాలిక ధ్యేయంతో మహోన్నత ధ్యేయంతో బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ స్పూర్తితో ముందడుగు వేసిండు. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ ఈ నేపథ్యంలో ‘ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ ’ అనే నినాదంతో ముందుకు పోవాలని పార్టీ అధికారిక ఆవిర్భావం నాడు హైద్రాబాద్లో ప్రకటించిన అధినేత కేసీఆర్ అందుకు అనుగుణంగా ముందస్తుగా 6 రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తులు పూర్తి చేసుకుని క్రిస్మస్ పండగ అనంతరం ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అటు ఉత్తర భారతం, ఇటు తూర్పు, మధ్య భారతాలకు చెందిన పలు రాష్ట్రాలనుంచి అనేకమంది మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ రాజకీయ నాయకులు, తమ టీం లతో, అనుచరులతో వచ్చి స్వయంగా అధినేత కేసీఆర్ తో సంప్రదింపులు జరిపుతున్నారు. చర్చల అనంతరం ఏర్పాట్లు చేసుకోవడానికి తిరిగి వారి వారి రాష్ట్రాలకు వెలుతున్నారు. ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక సామాజిక సాంస్క్రతిక పరిస్తితులు నేపథ్యాలను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎటువంటి విధానాలను అవలంభించాల్నో వారికి సుధీర్ఘంగా అధినేత కేసీఆర్ వివరించి వారిని ఆ దిశగా సమాయత్తం చేసి పంపుతున్నారు. ఈ నెలాఖరుకల్లా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, సహా ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో కూడా బిఆర్ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ భావజాల వ్యాప్తి : ఈ నేపథ్యంలో ఇప్పటికే కన్నడ, ఒరియా, మరాఠా,వంటి పలు భారతీయ భాషలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా, బిఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే కార్యాచరణ గురించి భావజాల వ్యాప్తి కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ దేశంలో.. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో అందుకోవాల్సిన గుణాత్మక మార్పులు ఏమిటి.? వాటిని బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దేశ ప్రజలకు అందించబోతున్నది..ప్రత్యామ్న్యాయ రాజకీయ వేదికగా బిఆర్ఎస్ తన పాత్రను భవిష్యత్తులో ఎట్లా పోశించబోతున్నది ? ఈ దేశ సకల జనులకు సబ్బండ వర్గాల ఆకాంక్షలకు చిరునామాగా బిఆర్ఎస్ ఎట్లా నిలవబోతున్నది ? అనే తాత్విక సైద్దాంతిక అంశాలను పలు భాషా సాహిత్యాలు రచనలు పాటల ద్వారా భావజాల ప్రచారం జరగనున్నది. ఆయా రంగాల వారిగా సాహిత్య సాంస్కృతిక మాధ్యమాల ద్వారా దేశవ్యాప్తంగా భావజాల వ్యాప్తి చేయడానికి అధినేత కేసీఆర్ ఇప్పటికే పలు నెలలనుంచి సాహితీ వేత్తలతో లోతైన విశ్లేషణలు చర్చలు చేపట్టారు. త్వరలో అవి కార్యరూపం దాల్చడానికి రంగం సిద్దమైంది. ఊపందుకోనున్న బీఆర్ఎస్ కార్యాచరణ క్రిస్మస్ పండుగ తర్వాత నుంచి బిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల ఉదృతి పెరగనున్నది. ఈ మేరకు ముందస్తుగా 6 రాష్ట్రాల్లో బిఆర్ ఎస్ కే కార్యకలాపాలను ప్రారంభం కానున్నాయి. తద్వారా బిఆర్ఎస్ జాతీయ స్థాయిలో తన వాణిని వినిపిస్తూ., దేశ ప్రజలను ఆకర్షిస్తూ చారిత్రక దశలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించనున్నది. డిసెంబర్ నెలాఖరున ఢిల్లీలో జాతీయ మీడియాతో సమావేశం : బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో జాతీయ మీడియా లో ఇప్పటికే ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. దేశంలో గుణాత్మక రాజకీయాలు వాటితో పాటు కేంద్రంలో గుణాత్మక పాలన రావాలంటే ఏ దిశగా అడుగులు వేయాలో, ఈ దేశ ప్రజల కర్తవ్యం ఏమిటో ఇప్పటికే బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్ పలుమార్లు ఉద్ఘాటించారు. ‘‘గెలవాల్సింది రాజకీయ నాయకులు పార్టీలు కాదు.. ప్రజలు.. ప్రజా ప్రతినిధులు’’ అని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఈ దేశానికి ప్రత్యామ్న్యాయం అంటే.. కొన్ని పార్టీలతో జతకట్టే రాజకీయ ఫ్రంటులు కాదనీ.. దేశ ప్రజలకు మేలు చేసే ప్రత్యేక ఎజెండాతో ముందుకు పోయే రాజనీతిజ్జత కావాలని సిఎం కేసీఆర్ ప్రకటించిన నేఫథ్యంలో బిఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణ పై జాతీయ మీడియాలో ఉత్కంఠ నెలకొంది. బిఆర్ఎస్ పార్టీ విధి విధానాలు ఏమిటి ? రాజకీయ సైద్దాంతికత ఏమిటి .? అభివృద్ధి నమూనా ఏమిటి అనే విషయంలో ఇప్పటికే జాతీయ మేధావి వర్గం చర్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘‘అంధకారబంధురంగా మారిన వర్తమాన రాజకీయ పాలన యవనికమీద వెలుగు దివ్వెను వెలిగిస్తాం..’’..అనే అధినేత సిఎం కెసిఆర్ ప్రకటన దేశవ్యాప్తంగా అటుమీడియా ఇటు రాజకీయ విమర్శకుల లాబీల్లో చర్చనీయాంశంగా మారిన సందర్బంలో...ఢిల్లీ వేదికగా జాతీయ మీడియాతో కెసిఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు, వార్తా సంస్థల జర్నలిస్టులతో బీఆర్ఎస్ అధినేత సమావేశం కానున్నారు. డిసెంబర్ నెలాఖరు లో ఢిల్లీ లో నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసి బిఆర్ఎస్ పార్టీ సిద్దాంతాలు భవిష్యత్తు కార్యాచరణ సహా విధి విధానాలను ప్రకటించనున్నారు. -
ప్చ్.. ములాయంకు ఆ కోరిక మాత్రం తీరలేదు
ఢిల్లీ: ప్రాంతీయ పార్టీ ద్వారా జాతీయ నేతగా ఎదిగిన ములాయం సింగ్ యాదవ్కు.. అభిమాన గణం ఎక్కువే. పదిసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా పని చేసిన ఈ రాజకీయ దిగ్గజం.. ఎన్నికల్లో ఓటమి ఎరుగని యోధుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ములాయంకు ఒక్కగానొక్క కోరిక మాత్రం తీరలేదు. యూపీ రాజకీయాల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతుతో చక్రం తిప్పిన ములాయం.. జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. అయితే ఆ రాజకీయాల్లో ప్రముఖంగా రాణించడం మాత్రం ఎందుకనో ఆయన వల్ల కాలేకపోయింది. సమర్థవంతమైన పార్లమెంటేరియన్గా, రక్షణ మంత్రిగా పేరు దక్కినప్పటికీ.. అంతకు మించి ముందుకు వెళ్లడం ఆయన వల్ల కాలేదు. జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు దక్కినప్పటికీ.. అప్పటికే కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పార్టీల హవా ముందు ఆయన పాచికలు పారలేకపోయాయి. అంతెందుకు.. మూడో దఫా ముఖ్యమంత్రి అయిన టైంలోనూ.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆశతో 2004 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి మెయిన్పురి నుంచి ఎంపీగా నెగ్గారు. అయితే.. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో అధికారం కొనసాగించింది. దీంతో ములాయం, సమాజ్వాదీ పార్టీకి కేంద్రంలో అంతగా ప్రాధాన్యం దక్కలేదు. దీంతో రాష్ట్ర రాజకీయాలకు మళ్లి.. యూపీ సీఎంగానే కొనసాగారాయన. 2007 ఎన్నికల్లో బీఎస్పీ చేతిలో ఓటమి పాలయ్యేదాకా ఆయన సీఎంగా కొనసాగారు. ఆపై తనయుడిని సీఎం పీఠంపై కూర్చోబెట్టి.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనుకున్నప్పటికీ.. ఎస్పీ వర్గపోరు, ఆపై అనారోగ్యం తదితర కారణాలతో ఆయన జాతీయ రాజకీయాల్లో నెగ్గుకురాలేకపోయారు. అయితే.. ములాయం సింగ్ యాదవ్ తన తరం రాజకీయ నాయకులలో తన విలువలను చెక్కుచెదరకుండా, తన రాజకీయాలను కార్పొరేట్ పరం కాకుండా కాపాడుకుంటూ వచ్చిన నేతనే చెప్పొచ్చు. -
ఎస్పీకి ఆయనో నేతాజీ.. కుస్తీల వీరుడు కూడా!
సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగడం ఒక ఎత్తు అయితే.. యూపీ రాజకీయాలతోపాటు జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారాయన. ఓటమెరుగని నాయకుడిగా, రాజకీయ దురంధరుడిగా.. భారతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ అధ్యాయం లిఖించుకున్నారు. బీసీ నేతగా.. యూపీలో అత్యధికంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి, ఔనత్యానికి ఆయన చేసిన కృషి విశేషమైనది. అంతేకాదు.. అభిమానుల చేత ముద్దుగా ‘నేతాజీ’ అని పిలిపించుకుంటూ.. లక్షల మంది ఎస్పీ కార్యకర్తలను విషాదంలో ముంచేసి వెళ్లిపోయారు. ► ములాయం సింగ్ యాదవ్.. 1939 నవంబర్ 22న ఎటావా జిల్లా సైఫయి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు మూర్తి దేవి, సుఘార్ సింగ్లు. పేద కుటుంబం అయినప్పటికీ కష్టపడి బాగా చదువుకుని పైకొచ్చారు ములాయం. ► ములాయం సోదరి కమలా దేవి, శివపాల్ సింగ్ యాదవ్, రతన్సింగ్ యాదవ్, అభయ్ రామ్ యాదవ్, రాజ్పాల్ సింగ్ యాదవ్ సోదరులు. దగ్గరి బంధువు రామ్ గోపాల్యాదవ్ కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ► ములాయం చదివింది ఎంఏ. సోషలిస్ట్ మూమెంట్లో, రాజకీయాల్లో చేరకముందు మెయిన్పురిలోని ఓ కాలేజీలో లెక్చరర్గా పాఠాలు చెపారు ములాయం. ► సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు, కీలక నేతలు అంతా ములాయంను నేతాజీ( గౌరవ నేత) అని పిలుస్తుంటారు. ఎప్పుడైతే ఆయన పార్టీ అధ్యక్ష పదవికి దూరం అయ్యారో.. అప్పటి నుంచి అఖిలేష్కు ఆ పిలుపు సొంతం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఎస్పీ నుంచి ఆ గౌరవం అందుకునే అర్హత ఒక్క ములాయంకే పార్టీ శ్రేణులు బలంగా ఫిక్స్ అయిపోయాయి. ప్రొఫెషనల్ రెజ్లర్ ములాయం సింగ్ యాదవ్ ప్రొఫెషనల్ కుస్తీ వీరుడు కూడా. రాజకీయాలు ఛాయిస్ కాకుంటే ఆయన మల్లు యుద్ధవీరుడిగా గుర్తింపు దక్కించుకునేవారేమో. మెయిన్పురిలో ఓసారి జరిగిన కుస్తీ పోటీల్లో కుర్రాడిగా ములాయం పాల్గొన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న నాథూ సింగ్.. ములాయం కుస్తీ పట్లకు ఫిదా అయిపోయాడు. ఆ తర్వాత జస్వంత్ నగర్ సీటును ములాయంకు ఇప్పిదామని నాథు సింగ్ ప్రయత్నాలు చేసినా అది ఎందుకనో కుదర్లేదు. ఇక ములాయంను ముద్దుగా పహిల్వాన్ అని పిలుస్తుంటారు. రెండు వివాహాలు.. ములాయం సింగ్ యాదవ్కు రెండు వివాహాలు జరిగాయి. మొదటి వివాహం మాలతీ దేవి. వీరికి అఖిలేష్ యాదవ్ సంతానం. దీర్ఘకాలిక సమస్యలతో 2003లో మాలతీ దేవి కన్నుమూశారు. మొదటి భార్య బతికున్న సమయంలో.. 1980 సమయంలో సాధనా గుప్తాతో ఆయన సహజీవనం కొనసాగించారు. వీళ్లకు ప్రతీక్ యాదవ్ అనే కొడుకు ఉన్నాడు. 2007 ఫిబ్రవరిలో ములాయం చెప్పేదాకా వీళ్లిద్దరికీ వివాహం అయ్యిందనే విషయం ఈ సమాజానికి తెలియలేదు. జులై 9, 2022న సాధనా గుప్తా అనారోగ్యంతో కన్నుమూశారు. రాజకీయాలు ఇలా.. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన.. రామ్ మనోహర్ లోహియా ఆదర్శాలతో ఇటుగా అడుగులేశారు. పదిహేనేళ్ల వయసులో ములాయం.. జానేశ్వర్ మిశ్రా, రామ్ సేవక్ యాదవ్, కర్పూరీ థాకూర్.. ఇలా ఎందరినో కలిశారు. ► 1960లో జనతా దళ్లో చేరారు ములాయం. 1962లో ములాయం.. షికోహాబాద్లోని ఏకే కాలేజీ విద్యార్థి విభాగానికి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ► 1967లో తొలిసారిగా యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. 1977ల తొలిసారి రాష్ట్ర మంత్రి అయ్యారు. 1989లో జనతాదళ్ పార్టీ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1980లో ఏకంగా జనతా దళ్కు జాతీయాధ్యక్షుడు అయ్యాడు. ► 1982లో యూపీ కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. మూడేళ్లపాటు అలా ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 1985లో జనతా దల్ చీలిపోయాక.. చంద్ర శేఖర్, సీపీఐలతో కలిసి క్రాంతికారి మోర్చాను స్థాపించారు. ఈ పార్టీ ఆధ్వర్యంలోనే 1989లో తొలిసారి ఉత్తర ప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారాయన. ► 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం కుప్పకూలాక.. చంద్ర శేఖర్ జనతా దల్(సోషలిస్ట్)లో చేరారు ములాయం. కాంగ్రెస్, జనతా దల్ మద్దతుతో సీఎంగా కొనసాగారు. ► 1991 ఏప్రిల్లో.. కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకోగా.. అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. జూన్లో జరిగిన ఎన్నికల్లో ములాయం.. బీజేపీ చేతిలో ఓడిపోయారు. ► ఆ తర్వాత 1992లో సమాజ్వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్సీ)తో కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అలా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ► ఆపై దేశ రాజకీయాల్లో ఆయన పాత్ర కొనసాగింది. పార్లమెంటేరియన్గా ఆయన ప్రస్థానం మొదలైంది. అదే సమయంలో(1996లో) మెయిన్పురి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ములాయం. దీంతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిగా ములాయం సింగ్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ► అయితే.. 1998లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగాయి. దీంతో ఆయన రక్షణ మంత్రి కోల్పోవాల్సి వచ్చింది. 1999 ఏప్రిల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంభల్, కన్నౌజ్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో నెగ్గారు ఆయన. అయితే తనయుడు అఖిలేష్ కోసం కన్నౌజ్ స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ► 2003, సెప్టెంబర్లో తిరిగి.. స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయానికి ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. శాసనసభకు ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో.. గున్నావుర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి.. రికార్డు స్థాయి బంపర్మెజార్టీతో 2004 జనవరిలో గెలిచారాయన. ఆ ఎన్నికల్లో 94 శాతం ఓటింగ్ నమోదు కావడం గమనార్హం. అందుకే సైకిల్ సింబల్! పేద కుటుంబంలో పుట్టిన ములాయంకు.. చిన్నప్పుడు సైకిల్ నడపాలనే కోరిక విపరీతంగా ఉండేదట. కానీ, తండ్రి సంపాదన తక్కువగా ఉండడంతో ఆ స్తోమత లేక చాలా కాలం ఆ కోరిక తీరలేదు. ఇక కొంచెం సంపాదన వచ్చాక.. అద్దె సైకిల్తో ఇరుగు పొరుగు ఊర్లకు వెళ్తూ సరదా తీర్చుకున్నారాయన. ఎప్పుడైతే.. సమాజ్వాదీ పార్టీ ప్రకటించారో.. అప్పుడే తన పార్టీకి సైకిల్ గుర్తుగా ఉంటే బాగుంటుందని ఆయన ఫిక్స్ అయిపోయారట. ► తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగానూ ఉన్నారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2012-17 మధ్య అఖిలేశ్ యాదవ్ యూపీ సీఎంగా వ్యవహరించారు. ► ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. మొత్తం జీవిత కాలంలో వివిధ రకాల ఉద్యమాలు, ఇతరత్రాలతో తొమ్మిసార్లు జైలుకు వెళ్లారు. వివాదాలు.. ► అయోధ్యలో వివాదాస్పద కట్టడం కూల్చివేతకు ముందు.. తరువాత జరిగిన పరిణామాలు ములాయం సింగ్ యాదవ్ రాజకీయ జీవితాన్ని కీలక మలుపులు తిప్పాయి. ► 2012 నిర్భయ ఘటనపై స్పందించే క్రమంలో ములాయం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మగాళ్లు అన్నాక తప్పులు చేయడం సహజమని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో ఐరాస సెక్రెటరీ జనరల్ బాన్ కీ మూన్ సైతం స్పందించారు. ఇక ములాయం చేఏసిన వ్యాఖ్యలకు మోహాబా జిల్లా కోర్టు ఆయనకు సమన్లు సైతం జారీ చేసింది. ► టిబెట్ సార్వభౌమాధికారం కోసం చేసిన వ్యాఖ్యలు సైతం దుమారం రేపాయి. ► ఇక ములాయం పెద్ద కొడుకు అఖిలేష్ యాదవ్ 2012లో యూపీ సీఎం అయ్యాక.. కుటుంబ కలహాలు బయటపడ్డాయి. సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్ వేరు కుంపటితో వివాదం రచ్చకెక్కింది. ఒక గ్రూప్కు అఖిలేష్, రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వం వహించగా.. మరో గ్రూప్నకు ములాయం, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్లు, అమర్ సింగ్లు నేతృత్వం వహించారు. ► తండ్రికి ఎదురు తిరిగేలా అఖిలేష్ నిర్ణయాలు తీసుకోవడం.. చర్చనీయాంశంగా మారింది. చివరికి.. 2016 డిసెంబర్ 30న ఏకంగా కొడుకు అఖిలేష్, బంధువు రామ్ గోపాల్ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తూ ములాయం నిర్ణయం తీసుకున్నారు. అయితే.. 24 గంట్లోలనే ఆ నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకున్నారు. కానీ.. ► దానికి బదులుగా తన తండ్రికి పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ.. తనను తాను పార్టీ చీఫ్గా ప్రకటించుకున్నారు. ఈ మేరకు జనవరి 1, 2017 నిర్వహించిన జాతీయ సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ములాయం బహిరంగంగా ఖండించారు. అయితే.. ఎన్నికల సంఘం కూడా అఖిలేష్ నిర్ణయానికి మద్దతుగా.. ములాయం ఆదేశాలను తప్పుబట్టడంతో.. అప్పటి నుంచి అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ జాతీయ నేతగా కొనసాగుతూ వస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ మీద 2021లో డైరెక్టర్ సువేందు రాజ్ ఘోష్ ‘మెయిన్ ములాయం సింగ్ యాదవ్’ అనే చిత్రాన్ని తీశాడు. అమిత్ సేథీ ఇందులో ములాయం పాత్రలో కనిపించారు. ఇక 2019లో విజయ్ గుట్టే డైరెక్ట్ చేసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ చిత్రంలో సుభాష్ త్యాగి, ములాయం సింగ్ యాదవ్ పాత్రలో కనిపించారు. -
డిసెంబర్ కల్లా నేషనల్ హైవేపై కేసీఆర్ జాతీయ పార్టీ
సాక్షి, హైదరాబాద్: కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ ప్రకటన ముహూర్తాన్ని వాయిదా వేసే యోచనలో ఉన్నారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు పూర్తిగా కొలిక్కి రాకపోవడం, జాతీయ స్థాయిలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా.. ముందు భావించినట్టు దసరాకు కాకుండా కొంత వెనక్కి జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పార్టీ ఏర్పాటు కసరత్తు కొలిక్కి వచ్చే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు తాజాగా వెల్లడించాయి. జెండా, ఎజెండాపై లోతుగా చర్చ ప్రస్తుతం జాతీయ పార్టీ జెండా, ఎజెండా, పేరు సంబంధిత అంశాలపై, టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చడంలో ఎదురయ్యే సాంకేతిక అవరోధాలపై లోతుగా చర్చిస్తున్నారు. తెలంగాణ మోడల్ను జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన నిధులు, అనుసరించాల్సిన ప్రణాళిక తదితరాలపైనా ఆయా రంగాలకు చెందిన నిపుణులతో మంతనాలు కొనసాగుతున్నాయి. కొత్త జాతీయ పార్టీ ఎజెండాలో చేర్చే ప్రతి అంశాన్నీ ఆచరణ సాధ్యం చేసేందుకు తమ వద్ద ఉన్న ప్రణాళికలను కూడా వివరించాలని కేసీఆర్ నిర్ణయించారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి న్యాయ నిపుణులు, గతంలో ఎన్నికల సంఘంలో పనిచేసిన కొందరు కీలక అధికారులతో కూడిన బృందం సలహాలు కూడా తీసుకుంటున్నారు. విపక్షాలు, ప్రాంతీయ పార్టీల వైఖరి పరిగణనలోకి తీసుకుని లెక్కలు మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా హరియాణాలో ఈ నెల 25న జరిగిన సమ్మాన్ దివస్కు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇండియన్ నేషనల్ లోక్దళ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరితో పాటు పలువురు విపక్ష నేతలు పాల్గొన్నారు. కాగా నితీష్తో పాటు పలువురు నేతలు కాంగ్రెస్తో కలిసి పనిచేసేందుకు మొగ్గు చూపుతుండటంతో సీఎం కేసీఆర్ సమ్మాన్ దివస్కు దూరంగా ఉన్నట్లు తెలిసింది. బిహార్లో బీజేపీతో నితీష్ తెగతెంపులు, సోనియాతో భేటీ, మహారాష్ట్ర శివసేనలో చీలిక వంటి పరిణామాలను పార్టీ అధినేత నిశితంగా పరిశీలిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలతో సయోధ్యతో పనిచేస్తూనే కొత్త జాతీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై కేసీఆర్ విభిన్న కోణాల్లో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రాంతీయ పార్టీల్లో చాలావరకు కాంగ్రెస్తో కలిసి పనిచేయడంపైనే ఆసక్తి చూపుతుండటాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కలు వేసుకుంటున్నట్లు తెలిసింది. డిసెంబర్లోగానే ముహూర్తం..! కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్న పార్టీలు, నేతలతో వేదిక పంచుకుంటే ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే హరియాణా భేటీకి కేసీఆర్ దూరంగా ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో జాతీయ పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే పలుసార్లు ప్రకటనలు చేసిన నేపథ్యంలో.. ఆ దిశగా అడుగులు ముందుకు పడకపోతే ప్రతికూల ప్రచారం జరిగే అవకాశముందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ కారణంగానే ఈ ఏడాది డిసెంబర్లోగా పార్టీ ముహూర్తాన్ని ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అప్పటివరకు వివిధ రంగాలు, వర్గాలకు చెందిన వారితో జాతీయ అంశాలపై భేటీలు, మంతనాలు కొనసాగించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రతి రాష్ట్రం నుంచి ఒకరిద్దరు పార్టీలో చేరేలా.. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటించే నాటికే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకరిద్దరు బలమైన నేతలు కొత్త పార్టీలో చేరేలా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్తో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వఘేలా, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్తో రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఎంపీ ఎన్కే ప్రేమ్చంద్రన్ ఇటీవల భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ను ఆహ్వానించడంతో పాటు తాము కూడా కొత్త పార్టీలో చేరేందుకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు. పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తూనే, చిన్నా చితకా పార్టీల విలీనం, వారి నుంచే వచ్చే డిమాండ్లను తట్టుకోవడం తదితరాలపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే దసరా నాటికి కొత్త జాతీయ పార్టీకి తుది రూపునివ్వడం కష్టమనే అభిప్రాయంతో టీఆర్ఎస్ అధినేత ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజాస్వామిక, సమాఖ్య స్ఫూ ర్తి పరిఢవిల్లేలా ప్రాంతీయ పార్టీల ఐక్యత ప్రస్తుత దేశ రాజకీయాల్లో తక్షణ అవసరం. కాంగ్రెస్ నాయ కత్వంపై దేశ ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితుల్లో బీజేపీకి ఆ పార్టీ ఎంతమాత్రం ప్రత్యా మ్నాయం కాదనే విషయం తేటతెల్లమైంది. జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ రోజురోజు కూ నాపై ఒత్తిడి పెరుగుతోంది. బీజేపీ మతతత్వ విధా నాలు, మోదీ ప్రజా వ్యతిరేక.. నిరంకుశ వైఖరిపై పోరాడాల్సిందిగా వెళ్లిన ప్రతిచోటా ప్రజలు కోరు తున్నారు. జాతీయ పార్టీని స్థాపించి బీజేపీని ఇంటికి పంపాల్సిందిగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్ఎస్ కార్యవర్గాలు తీర్మానం చేస్తున్నాయి..’ అని సీఎం కేసీఆర్ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి వివరించారు. ఆదివారం ప్రగతిభవన్లో వీరిద్దరూ భేటీ అ య్యారు. ఈ సందర్భంగా ఇటీవల రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను కూడా కేసీఆర్ తెలియజేశారు. మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగించి, ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించినట్లు తెలిపారు. త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయొచ్చు.. ‘వ్యవసాయంతో పాటు ఆర్థిక, సామాజిక రంగాలను అధోగతి పాలు చేస్తూ బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి పలువురు రైతు సంఘాల నేతలు ఇటీవల రాష్ట్రాన్ని సందర్శించారు. తెలంగాణలో అమలవుతున్న సాగు సంక్షేమ పథకాలను పరిశీలించారు. జాతీయ రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ తరహాలోనే రైతు రాజ్యం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. తెలంగాణలో రైతులకు ఇస్తున్న నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ తదితర పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయొచ్చు..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. కేసీఆర్కు మా సంపూర్ణ మద్దతు ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరం ఉంది. వర్తమాన రాజకీయాలు, పాలనలో ప్రత్యామ్నాయ శూన్యత నెలకొన్న నేప థ్యంలో కేసీఆర్ వంటి నాయకుడు అత్యవసరం. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషిస్తున్న కేసీఆర్కు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఆయన జాతీయ పార్టీని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. గుణాత్మక మార్పు కోసం స్థాపించే ఆ పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తాం. తెలంగాణలో రైతుల శ్రేయస్సు లక్ష్యంగా అమలవుతున్న పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో పాలన, పథకాలపై కర్ణాటక సహా అనేక రాష్ట్రాలు ఆసక్తి చూపుతు న్నాయి. తెలంగాణ మోడల్ దేశానికి అవసరం ఉంది. దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ స్థాపించే రాజకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తాం’ అని కుమారస్వామి ప్రకటించారు. విభజన కుట్రలను సమష్టిగా తిప్పికొడతాం దేశంలో విచ్ఛిన్నకర పాలనతో ప్రజల నడుమ విభ జన సృష్టించేందుకు జరుగుతున్న కుట్రలు తిప్పి కొట్టడం సహా పలు అంశాలపై కేసీఆర్, కుమార స్వామి చర్చించారు. దేశం విచ్ఛిన్నం అంచుల్లోకి నెట్టబడకుండా కాపాడుకోవాలని, ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు ఏకం కావాలని అభిప్రాయపడ్డారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం సమష్టి కృషి చేయాలని నిర్ణయించారు. భేటీలో ప్రస్తావనకు వచ్చిన మరికొన్ని ముఖ్యాంశాలు.. ♦ దేశ చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ సాగిస్తున్న రాజకీయ ఎత్తుగడలను తిప్పికొట్టకపోతే దేశంలో రాజకీయ, పాలన సంక్షోభం తప్పదు. అన్ని వర్గాలను కలుపుకొనిపోతూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకు రాబోయే సార్వత్రిక ఎన్నికలను వేదికగా మలుచుకోవాలి. ♦ దేశ రాజకీయాల్లో 75 ఏళ్లుగా సాగుతున్న మూస రాజకీయాల పట్ల దేశ ప్రజలు విసుగెత్తి పోయారు. వర్తమాన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సరిపడే చైతన్యవంతమైన పాలన అవసరం ఉందనే సంకేతాలు అందుతున్నాయి. ప్రత్యామ్నాయ రాజకీయ పంథాపై ఏకాభిప్రాయం అంతర్జాతీయంగా పలు దేశాలలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను, అభివృద్ధి దిశగా ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను నేతలు పరిశీలించారు. ప్రత్యామ్నాయ రాజకీయ పంథానే నేడు దేశానికి అత్యవసరమనే అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. సాదర స్వాగతం, వీడ్కోలు మధ్యాహ్నం ప్రగతిభవన్కు చేరుకున్న కుమార స్వామికి సీఎం కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూ దనాచారి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, రాజేందర్రెడ్డిని కేసీఆర్ పరిచ యం చేశారు. ప్రగతిభవన్లో కుమార స్వామితో కలిసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భోజనం చేశారు. సుమారు మూడు గంటల పాటు జరిగిన భేటీ అనంతరం బెంగళూరుకు బయలుదేరిన కుమారస్వామికి కేసీఆర్ మర్యాద పూర్వకంగా వీడ్కోలు పలికారు. కాగా ‘ప్రకాశవంతమైన దార్శనికత, వినూత్న ఆలోచనలు, బలమైన నాయకత్వం, వ్యక్తిత్వం కలిగిన కేటీఆర్తో జరిగిన చర్చ అర్థవంతంగా సాగింది. కేటీఆర్ అభిమానం, గౌరవంతో నా హృదయం నిండిపోయింది’ అని కుమారస్వామి ట్వీట్ చేశారు. -
దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం.. ఉద్యమ నేత చరిత్ర సృష్టించారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో జాతీయ రాజకీయాలు చర్చించేందుకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి నగరానికి వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఆదివారం కేసీఆర్తో కుమారస్వామి ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. వీరిద్దరూ దాదాపు 3 గంటల పాటు నేషనల్ పాలిటిక్స్పై చర్చించారు. ఇక, భేటీ అనంతరం మాజీ సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. ప్రస్తుతం దేశానికి కేసీఆర్ అనుభవం అవసరం. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాను. దేశానికి తెలంగాణ మోడల్ కానుంది. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక అవసరం. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను సైతం తప్పుపడుతున్నారు. నిరుదోగ్యం పెరిగిపోయిందని, రూపాయి విలువ పతనమైందని, ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ అమ్మేస్తోందని ఆరోపించారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముక్త్ భారత్ కావాలని దేశ ప్రజలను కోరారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీల సీఎంలు, కీలక నేతలను కలుస్తున్నారు. -
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ -
సైద్ధాంతిక శూన్యతను పూరించేందుకే...
నాడు తెలంగాణ ఉద్యమం లాగా నేడు దేశం సమర్థవంతమైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్నది. మోదీ–షా నేతృత్వం లోని బీజేపీ పాలనలో భారతదేశం తన మూలసూత్రాలైన ప్రజాస్వామ్యం, లౌకి కత్వం, సమాఖ్యతత్వాన్ని పోగొట్టుకునే దుర్దశలో ఉంది. దేశాన్ని కాపాడుకోవటం, మూసదోరణులను విడిచిపెట్టి నవ్య మార్గాన అభివృద్ధి చేయటం తక్షణ అవ సరం. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఒక కొత్త ఎజెండాకు రూప కల్పన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నాడు అడ్డుకోవటానికి చిట్టచివరి క్షణం వరకూ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించిన శక్తులు... ఆ తర్వాత కొత్త రాష్ట్రాన్ని ఎలా నగుబాటు చేయాలా అన్నదానిపై దృష్టి పెట్టాయి. తెలంగాణలోనే పుట్టినప్పటికీ, జన్మభూమి మీద ఎంతమాత్రం మమకారం లేని కిరాయి వ్యక్తులను ఉపయోగించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చటానికి కుట్రలు జరిపాయి. కరెంటు, సాగునీరు వంటి మౌలిక రంగాల్లో సహాయ నిరాకరణకు దిగాయి. ఇన్ని దాడులనూ అక్షరాలా ఒంటి చేత్తో ఎదుర్కొని, ఆ కుట్రలను బద్దలు చేశారు కేసీఆర్. ఇటీవల పలు సమావేశాల్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న భూమి, జల వనరులు, విద్యుత్తు, వ్యవసాయం, నిరుద్యోగం, జీడీపీ, స్వాతంత్య్రా నంతరం దేశాన్ని పాలించిన పార్టీల విధానాలు... మొదలైన అంశాలపై గణాంకాల సహితంగా వివరిస్తున్నప్పుడు కేసీఆర్ తెలంగాణ కోసం ఎంత లోతైన అధ్యయనం చేశారో దేశ పరిస్థి తుల గురించి కూడా అంతే సీరియస్గా ఆలోచిస్తున్నారని ఆయ నతో సన్నిహితంగా గడిపిన నాలాంటి వాళ్ళకు అర్థమయింది. కేంద్రం కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న విధానాలు, ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వంటి విషయాలపై సీఎం ఘాటుగా స్పందిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మరోరకంగా వ్యవహరిస్తున్న వివక్షను ఎండగడుతున్నారు. దేశానికి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్న నాయకుడు నేతృత్వం వహించాల్సిన అవసరం ఏర్పడింది. మతం పేరిట యాగీ చేస్తూ సంక్షేమాన్నీ, అభివృద్ధినీ పట్టించుకోని బీజేపీ ద్వంద్వ నీతిని ప్రజలు గ్రహించారు. ప్రజలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డను ప్రాధాన్యతగా పెట్టుకొని సేవ చేసే వ్యక్తులు దేశాన్ని పరిపాలించాలని జనమంతా కోరుకుంటున్నారు. (క్లిక్ చేయండి: విమోచన కాదు, సమైక్యత!) కలగూర గంప వ్యవహారాలతో, రాజకీయ అధికారం వస్తుందేమో గానీ, దేశాన్ని మార్చటం సాధ్యపడదు. భారత దేశ సంస్కృతి, సంప్రదాయాల మీద, సనాతన ధర్మం మీద పూర్తి అవగాహన ఉన్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆయనకున్న అసాధారణ ప్రతిభ, పట్టు, సమస్యల మీద పోరాడగల ధీర గుణం కేసీఆర్కు మాత్రమే ఉన్నాయని పలువురి అభిప్రాయం. పరాజయాల పరంపరను పక్కన పెట్టినా, వేగంగా నిర్ణయాలు తీసుకోలేని కాంగ్రెస్ పార్టీ నిష్క్రియాపరత్వం, ఆ పార్టీ నాయకత్వం ఎవరి చేతిలో ఉన్నదో కూడా తెలియని విషాద పరిణామం ఆ పార్టీని బ్రెయిన్ డెడ్ స్థితికి చేర్చాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ లాంటి నాయకుడి ప్రత్యామ్నాయ ఎజెండాను బలపరచి దేశ రాజకీయాల్లో నెలకొన్న రాజకీయ, సైద్ధాంతిక శూన్యతను పూరించడం ఒక చారిత్రక అనివార్యత. (క్లిక్ చేయండి: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర) - పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ రవాణా శాఖ మంత్రి -
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్
నల్లగొండ టూటౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరమని, దేశ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండలో మీడియతో మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మత వైషమ్యాలను రెచ్చగొడుతోందని విమర్శించారు. దేశ అభ్యున్నతి కోసం ఎవరో ఒకరు ముందుకు రావడం అనివార్యంగా మారిందని, ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల చూపు సీఎం కేసీఆర్ వైపు ఉందని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, దేశానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావ అని, ఇప్పట్లో ఆ పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు పసలేని విమర్శలు చేస్తూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొన్నారు. -
‘దేశ భవిష్యత్తు కోసం.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి’
సాక్షి, హైదరాబాద్: దేశ బంగారు భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షులు ముక్తకంఠంతో కోరారు. దేశంలో మోదీ సారథ్యంలోని రాక్షసపాలన అంతం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఉద్యమించి సాధించడంతో పాటు ఏ విధంగానైతే అభివృద్ధి చేశారో, ఆ విధంగా దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు జాతీయ పార్టీ ఏర్పాటు చేసి, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో అందుబాటులో ఉన్న 21 మంది టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శుక్రవారం తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందిగా సీఎం కేసీఆర్ను కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కావాలి కేసీఆర్.. రావాలి కేసీఆర్ బీజేపీ ముక్త్ భారత్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని దేశ ప్రజలు భావిస్తున్నారని బాల్క సుమన్ చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమై రాజకీయ శూన్యత ఏర్పడిందని, ఈ పరిస్థితుల్లో కేసీఆర్తో ప్రత్యామ్నాయ శక్తి ఏర్పాటవుతుందని అన్ని రాష్ట్రాల నేతలు, ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రధాని మోదీ పాలన లో దేశంలోని ఏ వర్గానికీ మేలు జరగడం లేదని జీవన్రెడ్డి విమర్శించారు. రైతులు, యువత, మహి ళలు, దళిత, బలహీన వర్గాలకు చెందిన వారంతా కేసీఆర్ను కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ తరహా అభివృద్ధి కోసం దేశ ప్రజలంతా చూస్తున్నా రని చెప్పారు. కావాలి కేసీఆర్.. రావాలి కేసీఆర్ అని ప్రజలు అంటున్నారని తెలిపారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేసిందని లింగయ్య యాదవ్ విమర్శించారు. జిల్లాల పార్టీ అధ్యక్షులే కాదని, అన్ని స్థాయిల్లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ జాతీయ రాజకీ యాల్లోకి రావాలని కోరుతున్నారని తెలిపారు. తెలంగాణపై మోదీ సర్కారు కుట్ర అమిత్ షా ఆగడాలకు అడ్డుకట్ట పడాలన్నా, మోదీ మెడలు వంచాలన్నా కేసీఆర్తోనే సాధ్యమని మాలోత్ కవిత చెప్పారు. దేశ ప్రజలంతా ఆయన రాకకోసం ఎదురుచూస్తు న్నారని అన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని ధ్వజమెత్తారు. దేశాన్ని మోదీ బ్రష్టు పట్టించారని, ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమని మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావాలంటే కేసీఆర్తోనే సాధ్యమని, ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని పద్మాదేవేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని చింతా ప్రభాకర్ చెప్పారు. ప్రజల ఆకాంక్ష మేరకు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని దాస్యం వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఒక విజన్ ఉన్న నాయకుడి కోసం దేశమంతా ఎదురుచూస్తున్నదని గువ్వల బాలరాజు పేర్కొన్నారు. దేశానికి కేసీఆర్ అవసరం ఉంది దేశానికి ప్రస్తుతం కేసీఆర్ అవసరం ఎంతో ఉందని, ఆయన దేశాన్ని పాలించాలని కోరుకంటి చందర్ పేర్కొన్నారు. దేశాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని సంపత్రెడ్డి అన్నారు. దేశాన్ని ఆవహించిన చీకటిని తొలగించే కాంతి రేఖ సీఎం కేసీఆర్ అని తాత మధు చెప్పారు. ఎంతో దూరదృష్టి కలిగిన సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లోకి రావాలని శంభీపూర్ రాజు అన్నారు. యావత్ దేశం కేసీఆర్ కోసం తెలంగాణ వైపు చూస్తున్నదని ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. పీవీ తర్వాత దేశానికి మరోసారి ప్రధానమంత్రిని అందించాలని కరీంనగర్ ఎదురు చూస్తోందని, కేసీఆర్ దేశానికి దారి చూపాలని జీవీ రామకృష్ణారావు చెప్పారు. మంచిరెడ్డి కిషన్రెడ్డి, ముజీబ్, తోట ఆగయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇదీ చదవండి: పాన్ ఇండియా పార్టీ.. దరసరాకు విడుదల! -
పాన్ ఇండియా పార్టీ.. దసరాకు విడుదల!
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరాను ముహూర్తంగా ఎంచుకున్నారు. విజయదశమి రోజున హైదరాబాద్ వేదికగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ పార్టీ పేరు, పతాకం, ఎజెండా తదితరాలపై ఇప్పటికే కసరత్తు పూర్తిచేసిన కేసీఆర్.. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేలా పార్టీ ప్రకటన ఉండాలని భావిస్తున్నారు. పార్టీ ప్రారంభానికి జాతీయస్థాయిలో భావ సారూప్యత కలిగిన పార్టీలు, ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు మంతనాలు జరుగుతున్నాయి. కొత్త జాతీయ పార్టీ ప్రకటనను స్వాగతిస్తూ తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా వేడుకలు జరిగేలా సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. పార్టీ ప్రకటన తర్వాత సుమారు రెండు నెలల పాటు వివిధ రాష్ట్రాల్లో విస్తృతస్థాయిలో పర్యటించేలా షెడ్యూల్ కూడా రూపొందిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. గులాబీ జెండా.. భారతదేశ చిత్రపటం? వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమాతోపాటు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమ్మేళనంగా కేసీఆర్ జాతీయ పార్టీ ఎజెండా ఉంటుందని అంచనా. రైతులు, దళితులు, సైనికులు, యువత తదితర వర్గాలకు పార్టీ ఎజెండాలో పెద్దపీట వేయనున్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ జెండా తరహాలోనే జాతీయ పార్టీ జెండా కూడా గులాబీ రంగులో భారతదేశ చిత్రపటంతో ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ పార్టీకి ‘భారతీయ రాష్ట్ర్ర సమితి’గా పేరు ఉంటుందనే ప్రచారం జరుగుతున్నా చివరి నిమిషం దాకా పేరుపై సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. జిల్లాల్లో పార్టీ నేతల తీర్మానాలు సుమారు ఏడాదిన్నరగా జాతీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ప్లీనరీ, పార్టీ సమావేశాలు, బహిరంగ సభల్లో కొత్త పార్టీ ఏర్పాటుకు ఆమోదం కోరుతూ వస్తున్నారు. తాజాగా శుక్రవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఇదే తరహాలో పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ నేతలు కూడా ప్రకటన చేయనున్నారు. సోమ, మంగళవారాల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ ప్రసంగాల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించే అవకాశం ఉందని తెలిసింది. ఇక కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ జిల్లా, మండల స్థాయిలోనూ టీఆర్ఎస్ నేతలు తీర్మానాలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కీలక టీమ్లో వినోద్, కవిత? కొత్త జాతీయ పార్టీ విస్తరణకు అవసరమైన టీమ్ను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. వీరితోపాటు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ తదితరుల సేవలను కూడా కొత్త జాతీయ పార్టీలో కేసీఆర్ ఉపయోగించుకుంటారని సమాచారం. రేపు రాష్ట్రానికి జేడీఎస్ నేత కుమారస్వామి ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పలువురు బీజేపీయేతర, కాంగ్రెసేతర సీఎంలు, ముఖ్య నేతలతో కేసీఆర్ వరుసగా భేటీలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్ ఆహ్వానం మేరకు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ఆదివారం హైదరాబాద్కు వస్తున్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసే జాతీయ పార్టీలో చిన్నా, చితకా ప్రాంతీయ పార్టీలు, దేశవ్యాప్తంగా పేరొందిన కొందరు ప్రముఖ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఆయా పార్టీల విలీనం, చేరికలకు సంబంధించి ఇప్పటికే మంతనాలు పూర్తయినట్టు సమాచారం. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన తర్వాత.. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే దేశవ్యాప్త పర్యటనల ద్వారా కొత్త పార్టీ విస్తరణ, బలోపేతం దిశగా కృషి చేయనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: ఎన్నికలే టార్గెట్గా ఇన్చార్జ్ల నియామకం.. బీజేపీ మాస్టర్ ప్లాన్స్! -
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్!
సాక్షి, హైదరాబాద్: త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లనున్నారు. హైదరాబాద్ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉంది. జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాతే ఫ్రంట్లు, పొత్తులపై వివిధ పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఈ నెల 11న హైదరాబాద్కు మాజీ సీఎం కుమారస్వామి రానున్నట్లు తెలిసింది. చదవండి: రాజ్భవన్.. నివురుగప్పిన నిప్పు! ఈ క్రమంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శుక్రవారం మీడియాతో మాట్లాడూతూ కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిందేనన్నారు. జాతీయ రాజకీయాల కోసం కేసీఆర్ మరో ఉద్యమం చేయాలన్నారు. మేమంతా కేసీఆర్ వెంట ఉంటామని వారు ప్రకటించారు. ప్రత్యామ్నాయ శక్తి కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. కార్పొరేట్ గద్దలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని మండిపడ్డారు. దేశంలో మత విద్వేషాలను రగిలిస్తున్నారని బాల్కసుమన్ మండిపడ్డారు. -
విపక్షాల ఐక్యత చాటేలా జాతీయ స్థాయి సదస్సు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సన్నద్ధమవు తున్న ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు.. కొంతకాలంగా దేశంలో ని వివిధ రాజకీయ పక్షాలు, సంఘాలు, వివి ధ రంగాలకు చెందిన నిపుణులతో విస్తృత మంతనాలు జరుపుతున్నారు. అందులో భాగంగానే రెండురోజుల క్రితం బిహార్ పర్యటనకు వెళ్లారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్తో జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ప్రధాని మోదీ పాలన వైఫల్యాలపై లోతుగా చర్చించారు. దేశ వ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాల్సిన ఆవశ్యక తపైనా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో విపక్ష పార్టీల ఐక్యతను చాటేందుకు జాతీయ స్థాయిలో బీజేపీయేతర ముఖ్యమంత్రులు, ముఖ్యనేతల సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఢిల్లీ లేదా హైదరాబాద్ వేదిక గా ఈ సదస్సు జరిపేందుకు సిద్ధంగా ఉన్న ట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు నితీశ్, తేజస్వీ అంగీకరించడంతో పాటు విపక్ష పార్టీల నడుమ ఏకాభి ప్రాయ సాధనకు ఈ తరహా సదస్సులు ఉపయోగపడతాయనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపుల తర్వాత సదస్సు తేదీ ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమల వుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, అవి సాధించిన ఫలితాలను వివరించిన కేసీఆర్.. వాటి అధ్యయానికి రాష్ట్రానికి రావాల్సిందిగా నితీష్ను ఆహ్వానించారు. కేసీఆర్ సుదీర్ఘ వివరణ.. ముగించేందుకు నితీశ్ యత్నం! మధ్యాహ్న భోజనం తర్వాత సీఎం కేసీఆర్, బిహార్ సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సంయు క్తంగా మీడియా భేటీలో మాట్లాడారు. కేసీఆర్ సుమారు అరగంట సేపు జాతీయ రాజకీయాలపై మాట్లాడటంతో పాటు బీజేపీ, మోదీ అను సరిస్తున్న విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చివరలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ప్రెస్మీట్ ముగించేందుకు నితీశ్ పలుమార్లు లేచి నిలబడగా.. కేసీఆర్ ఆయన చేయి పట్టుకుని ఆçపడం కన్పించింది. -
ఉత్తరాదిన జై కిసాన్.. పక్కా ప్లాన్ రెడీ చేసుకున్న సీఎం కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో ప్రవేశానికి కొంతకాలంగా పునాది వేసుకుంటూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పలు రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులతో రెండురోజుల పాటు హైదరాబాద్లో సమావేశమయ్యారు. వారితో విస్తృతంగా చర్చలు జరపడంతో పాటు తెలంగాణ వ్యవసాయ విధానాన్ని వివరించిన కేసీఆర్.. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతు సదస్సులు నిర్వహించడం ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లోని రైతు సంఘాలు, భావసారూప్య రాజకీయ పార్టీలకు సదస్సుల్లో భాగస్వామ్యం కల్పించాలనే యోచనలో ఉన్నారు. చెక్కులు పంపిణీ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన కేసీఆర్.. ఈ మేరకు గత మే నెలలో చండీగఢ్లో బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఇదే తరహాలో త్వరలో ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగే రైతు సదస్సుల్లోనూ పరిహారం చెక్కులను అందజేయనున్నారు. అదే సమయంలో తెలంగాణ వ్యవసాయ విధానాన్ని వివరిస్తారు. రైతు సదస్సుల నిర్వహణ, షెడ్యూల్ ఖరారు, రైతు సంఘాలతో సమన్వయ బాధ్యతలను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డికి అప్పగించారు. జాతీయ పార్టీపై ఆచితూచి.. వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, గతంలో ప్రకటించిన తరహాలో కాకుండా జాతీయ పార్టీ ఏర్పాటుపై కొంత ఆచితూచి వ్యవహరించాలనే ధోరణిలో టీఆర్ఎస్ అధినేత ఉన్నట్లు ఆయన సన్నిహితవర్గాలు వెల్లడించాయి. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలు, నేతలతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే కేసీఆర్ బుధవారం బిహార్ పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారు. వాస్తవానికి మే 29, 30 తేదీల్లోనే బిహార్, పశ్చిమ బెంగాల్ పర్యటన షెడ్యూల్ను ప్రకటించిన సీఎం.. చివరి నిమిషంలో రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ విధానాలను వ్యతిరేకించే పార్టీల ముఖ్యమంత్రులు, నేతలతో త్వరలో జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం బిహార్ సీఎం నితీష్కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్తో జరిగే భేటీలో జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ తీరుతో పాటు ఈ సదస్సు నిర్వహణపై చర్చించే అవకాశముందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. దేశ రాజధాని ఢిల్లీ లేదా హైదరాబాద్లో సదస్సు ఉండే అవకాశమున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో బీజేపీ దూకుడును అడ్డుకునేలా.. ఇక రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ దూకుడు పెంచుతున్న నేపథ్యంలో.. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ, టీఆర్ఎస్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయడంపై కేసీఆర్ దృష్టి సారించారు. అందులో భాగంగానే ఈ నెల 3న రాష్ట్ర కేబినెట్ భేటీ, సాయంత్రం పార్టీ శాసనసభ, పార్లమెంటరీ పార్టీల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో నూతన కలెక్టరేట్ భవన సముదాయాలు, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాలను ప్రారంభించిన కేసీఆర్.. సెప్టెంబర్ 5న నిజామాబాద్, 10న జగిత్యాల కలెక్టరేట్లు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించనున్నారు. మరోవైపు 12వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై సీఎం కసరత్తు చేస్తున్నారు. ధరణి, పోడు భూముల సమస్య, ఉపాధ్యాయుల పదోన్నతులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలు ఈ నెల 3న జరిగే కేబినెట్ భేటీ ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశముందని సమాచారం. మళ్లీ రెవెన్యూ సదస్సులు ధరణి సమస్యల పరిష్కారం కోసం గతంలో ప్రకటించిన రెవెన్యూ సదస్సులు వరుస వర్షాలతో వాయిదా పడిన నేపథ్యంలో వాటిని తిరిగి ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. 3న జరిగే కేబినెట్ భేటీలో ఈ మేరకు షెడ్యూల్ను ప్రకటించే అవకాశముంది. రెవెన్యూ సదస్సుల్లో ఎమ్మెల్యేలు క్రియాశీల భాగస్వాములు కావాలని 3న వారితో జరిగే భేటీలో సీఎం ఆదేశించనున్నారు. మునుగోడు ఉప ఎన్నిక, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీకి పూర్తి స్థాయి కమిటీల ఏర్పాటు వంటి అంశాలు కూడా చర్చిస్తారు. మొత్తం మీద తాను జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించకుండా, రాష్ట్రంలోనే కట్టడి చేయాలనే బీజేపీ వ్యూహాన్ని సమర్ధంగా తిప్పికొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలను గాడిన పెట్టడం, జాతీయ రాజకీయాలపై పట్టు సాధించడంపై ముఖ్యమంత్రి సీరియస్గా దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాదిలో బీజేపీ ప్రభావమున్న ఏవైనా ఐదు రాష్ట్రాల్లో అక్టోబర్, నవంబర్ మాసాల్లో రైతు సదస్సులు జరిగే అవకాశం ఉంది. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాలు కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయి. ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు జరిగే గుజరాత్లోనూ ఈ తరహా సదస్సును నిర్వహించాలనే యోచనలో ఆయన ఉన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ, ఆసరా వంటి సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ రైతు సదస్సుల ప్రధాన ఎజెండాగా ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
టార్గెట్ మోదీ.. సీఎం నితీష్తో కేసీఆర్ భేటీ.. ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. జాతీయ రాజకీయాలపై కొద్దిరోజులుగా ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో భాగంగా ఇప్పటికే పలువురు సీఎంలను, ప్రముఖులను కలిశారు. కాగా, నేషనల్ పాలిటిక్స్పై చర్చించేందుకు కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ను కలిసేందుకు సీఎం కేసీఆర్ బుధవారం బీహార్కు వెళ్లనున్నారు. బీహార్ పర్యటనలో భాగంగా గాల్వాన్లో అమరులైన ఐదుగురు సైనికుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక సాయం అందించనున్నారు. అలాగే, ఇటీవలే సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో మృతిచెందిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు సైతం ఆర్థిక సాయం అందజేయనున్నారు. సీఎం నితీష్ కుమార్తో కలిసి బాధితులకు కేసీఆర్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం, నితీష్తో కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ దొంగల బూట్లు మోసే సన్నాసులు ఇక్కడున్నారు: కేసీఆర్ ఫైర్ -
దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ భారతదేశ గతిని మార్చగలరని, ఆయన నాయకత్వం దేశ రాజకీయాలకు అవసరమని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు, తెలంగాణీయులు తీర్మానించారు. కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో వెళుతోందని, దేశ రాజకీయాల్లోనూ గుణాత్మక మార్పు తెచ్చేందుకు ఆయన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించబోతుందన్న వార్తల నేపథ్యంలో ప్రవాస తెలంగాణీయుడు మహేశ్బిగాల ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నారైలతో ఆదివారం జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రస్థానం, స్వయం పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా రూపొందుతున్న తీరును చర్చించారు. బిగాల ప్రవేశపెట్టిన ‘దేశ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవసరం’ అనే ఏకవాక్య తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించిందని, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులంతా ముక్తకంఠంతో కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారని తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని, ఆ మార్పు కేసీఆర్తోనే సాధ్యమని ఎన్నారైలు అభిప్రాయడ్డారని తెలిపాయి. ఈ సమావేశంలో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
గెలుపుపై నమ్మకం లేకే పీకే చెంత కేసీఆర్: ఈటల రాజేందర్
పాలమూరు: తెలంగాణ ప్రజల నాడి తెలిసిన కేసీఆర్కు పీకే అవసరం ఎందుకు వచ్చిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. మహబూబ్నగర్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు డబ్బులు లేని సర్కార్ రూ.250 కోట్లు వెచ్చించి ఇతర రాష్ట్రాల్లో ప్రకటనలు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఇక్కడి రైతులను పట్టించుకోని ఈ ప్రభుత్వ అధినేత.. దేశ ప్రధాని కావాలనే ఆశతో ఇతర రాష్ట్రాల్లోని రైతులకు నష్టపరిహారంగా ఇస్తున్న సొమ్ము తెలంగాణ ప్రజలది కాదా?.. అని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవటం ఖాయమని ఈటల జోస్యం చెప్పారు. ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అవతరించబోతోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు ఓటేసినా.. టీఆర్ఎస్కు ఓటేసినా కేసీఆరే తిరిగి అధికారంలోకి వచ్చి ఆయనే సీఏం అవుతారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీనే భావిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని అందిపుచ్చుకునేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ç -
‘కేసీఆర్ జాతీయ పార్టీ’తో బీజేపీ, కాంగ్రెస్ల్లో వణుకు: బాల్క సుమన్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ జాతీయ పార్టీ అనగానే బీజేపీ, కాంగ్రెస్ల వెన్నులో వణుకు మొదలైందని ప్రభు త్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కులగజ్జి రేవంత్, మత పిచ్చి సంజయ్కి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీలు టి.భానుప్రసాద్ రావు, దండే విఠల్తో కలిసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు జాతీయ పార్టీలకు ఇద్దరు పిచ్చోళ్లు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారని, వారిని చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ కాదు.. ప్రాణం పోసే సంజీవని అని ప్రజలకు తెలుసన్నారు. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని సుమన్ హెచ్చరించారు. బండి సంజయ్కి చేతనైతే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందే రాష్ట్ర విభజన హామీలు అమలు చేయించి చూపించాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ టి.భాను ప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ అంటేనే కాంగ్రెస్ భయపడుతోందని, ప్రతిపక్ష పాత్ర పోషించే స్థితిలో లేదన్నారు. దేశంలో నియంత పాలన సాగుతోందని, దాన్ని సరిదిద్దేందుకు కేసీఆర్ కొత్త ఎజెండా సిద్ధం చేస్తున్నారని తెలిపారు. -
దేశంలో రాజకీయ శూన్యతను పూరించాలి.. సీఎం కేసీఆర్–పీకే భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: దేశంలో నెలకొన్న రాజకీయ శూన్యతను పూరించేందుకు జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించాల్సిందేనని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కృత నిశ్చయంతో ఉన్నారని.. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలతో సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారని తెలిసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని త్వరలోనే ఖరారు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 10న జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలకు అనుగుణంగా.. జాతీయ స్థాయిలో రాజకీయ అరంగేట్రంపై సరైన సమయంలో, సరైన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఆదివారం ప్రగతిభవన్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో భేటీ అయిన సీఎం కేసీఆర్.. జాతీయ పార్టీ ప్రకటన, రాష్ట్రపతిఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రాబోయే ఎన్నికలు, ఎమ్మెల్యేలు– ప్రభుత్వ పనితీరుపై పీకే బృందం చేసిన సర్వే నివేదికలపై చర్చించారు. ప్రగతిభవన్లో సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో కేసీఆర్, పీకేతోపాటు మంత్రి హరీశ్రావు కూడా పాల్గొన్నారు. జాతీయ పార్టీ కావాలంటే ఎలా..? ‘‘కేంద్రంలో బీజేపీ పాలనలో అశాంతి పెరిగిపోయింది. నియంతృత్వ పోకడలు పెచ్చుమీరాయి. ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైన నేపథ్యంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను పూరించేందుకు జాతీయ రాజకీయాల్లో బలీయమైన శక్తిగా అవతరించడమే మార్గం..’’అని సీఎం కేసీఆర్, పీకే భేటీలో అభిప్రాయానికి వచి్చనట్టు తెలిసింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ను జాతీయ పారీ్టగా మార్చడంపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలపైనా చర్చించినట్టు సమాచారం. రాష్ట్రాల వారీగా అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న పారీ్టలు, ఆయాచోట్ల కొత్త జాతీయ పారీ్టకి ఉన్న అనుకూలతలపై చర్చించినట్టు తెలిసింది. దేశంలో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పశి్చమబెంగాల్తోపాటు ఇతర రాష్ట్రాలకు విస్తరించే ఆలోచనతో ఉంది. ఢిల్లీలో ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో అధికారాన్ని కైవసం చేసుకొని దేశం వైపు చూస్తోంది. శరద్పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబోయే పార్టీ విధివిధానాలు ఎలా ఉండాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ‘దీదీ’సమావేశానికి వెళ్లాలని నిర్ణయం! రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థని నిలబెట్టి బీజేపీకి షాకివ్వాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ) ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సహా 22 మంది వివిధ పార్టీల నేతలకు లేఖలు రాశారు. సీఎం కేసీఆర్కు స్వయంగా ఫోన్ చేసి 15న ఢిల్లీలో జరిగే సమావేశానికి రావాలని కోరారు. ఈ నేపథ్యంలోనే గతంలో తృణమూల్ కాంగ్రెస్కు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్తో ప్రస్తుత పరిణామాలపై సీఎం కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. 15న జరిగే సమావేశానికి వెళ్లాడమా, లేదా అన్న అంశంపై అభిప్రాయాలు పంచుకున్నట్టు సమాచారం. కేసీఆర్ వెళ్లలేని పక్షంలో కేటీఆర్నుగానీ, పార్టీ తరఫున మరో ప్రతినిధినిగానీ ఢిల్లీకి పంపాలని నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. ఇదే సమయంలో జాతీయ రాజకీయాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు సాగాలని భావనకు వచి్చనట్టు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికలు, సర్వేలపైనా చర్చ? రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే అంశాలపై ప్రశాంత్కిషోర్ నేతృత్వంలోని ఐప్యాక్ బృందం ఇటీవల సర్వే చేసి కేసీఆర్కు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత ఎర్రవల్లి ఫామ్హౌజ్లో కేసీఆర్తో పీకే భేటీ అయి చర్చించారు కూడా. ఈ నేపథ్యంలో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై వారు మరోసారి చర్చించినట్టు తెలిసింది. పార్టీ బలహీనంగా ఉన్న చోట ఆప్షన్లు ఎలా ఉండాలనే దానిపైనా మంతనాలు సాగించినట్టు సమాచారం. కేసీఆర్తో ఉండవల్లి భేటీ – జాతీయ రాజకీయాలపైనే చర్చ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఆదివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రవేశంపై చర్చ సాగుతున్న నేపథ్యంలో.. ఏపీకి చెందిన ఉండవల్లి ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించే అంశం, కొత్త పార్టీ ఏర్పాటు, టీఆర్ఎస్ను జాతీయ పారీ్టగా మార్చడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందులపై చర్చించినట్టు తెలిసింది. ప్రశాంత్ కిషోర్తో భేటీ ముగిశాక సాయంత్రం 6 గంటల తర్వాత ఈ భేటీ జరిగింది. ఇందులో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి కూడా పాల్గొన్నారు. -
పీకే తో సీఎం కేసీఆర్ కీలక చర్చలు
-
సాక్షి కార్టూన్ 12-06-2022
దేనిలో అభివృద్ధో కూడా చెప్పండి సార్! -
రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల.. కేసీఆర్ దారెటు..?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ను ప్రకటించిన నేపథ్యంలో.. గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల దిశగా పయనిస్తున్న ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు వేసే అడుగులపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేసీఆర్ ఏ విధంగా ముందుకు వెళతారు? బీజేపీతో తలపడేందుకు ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు? ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తారు? అనే చర్చ మొదలైంది. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని పదేపదే చెబుతున్న సీఎం..కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ బీజేపీయేతర ముఖ్యమంత్రులు, విపక్ష పారీ్టల కీలక నేతలతో వరుస భేటీలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలో గత వైఖరికి పూర్తిగా భిన్నమైన పంథాను అనుసరించే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. పోయినసారి జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ప్రతిపాదిత అభ్యరి్థకి ఆయన మద్దతు పలికిన సంగతి విదితమే. కాగా తాజా ఎన్నిక ప్రక్రియ రాజకీయంగా మరింత వేడి రగిలించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి అభ్యరి్థపైనే చర్చలు! మూడు నెలల్లో దేశ రాజకీయాల్లో సంచలనం చూస్తారని గత నెల చివరి వారంలో జరిగిన బెంగళూరు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తుండగా, తాజాగా ఎన్నిక షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే దిశగా తన ప్రయత్నాలను వేగవంతం చేయాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. బీజేపీయేతర పారీ్టలకు చెందిన ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, పినరయి విజయన్, నవీన్ పటా్నయక్లతో ఆయన గతంలో భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో సీఎంలు ఉద్దవ్ ఠాక్రే, స్టాలిన్, హేమంత్ సొరేన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తోనూ వివిధ సందర్బాల్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అలాగే పలు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలకు నేతలుగా ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎంలు శరద్ పవార్, కుమారస్వామి, అఖిలేశ్ యాదవ్, బిహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్తో కూడా సమావేశమయ్యారు. ప్రత్యామ్నాయ జాతీయ రాజకీయ ఎజెండాతో పాటు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలపడమే లక్ష్యంగా ఈ భేటీల్లో చర్చించినట్లు సమాచారం. త్వరలో ప్రత్యేక సమావేశం పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సామాజిక కార్యకర్త అన్నా హజారేతోనూ గత నెల చివరి వారంలో కేసీఆర్ భేటీ కావాల్సిన ఉన్నా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే ప్రస్తుతం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో కేసీఆర్ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయనున్నారు. ఈ క్రమంలో మరోమారు బీజేపీయేతర సీఎంలు, ఇతర కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశం కావాలని సీఎం నిర్ణయించారు. హైదరాబాద్ లేదా ఢిల్లీ వేదికగా త్వరలో ఈ భేటీ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కేసీఆర్తో పీకే భేటీ.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేకంగా భేటీ అయినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో టీఆర్ఎస్ రాజకీయ వ్యవహారాలను మదింపు చేస్తూ పీకే బృందం నివేదికలు ఇస్తున్న విషయం తెలిసిందే. జాతీయస్థాయి రాజకీయాలతోనూ విస్తృత సంబంధాలు ఉన్న పీకే కొంతకాలంగా వివిధ పార్టీల నేతలను ఏకతాటిపైకి తీసుకు రావడం, ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా రూపకల్పనలో తన వంతు సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిసింది. గురువారం జరిగిన భేటీలో.. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యరి్థ, గెలుపు అవకాశాలు, జాతీయ స్థాయిలో పార్టీల నడుమ అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయ సాధన, విపక్ష ఓట్లు చీలకుండా అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచి్చనట్లు తెలిసింది. -
సాక్షి కార్టూన్: 09-06-2022
జయలలిత అని పెట్టేసుకోండి మేడమ్! -
ప్రాంతీయం నుంచి జాతీయానికి...
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి అప్పుడే ఎనిమిదేళ్లు పూర్తయింది. కొంతకాలంగా ప్రతిపక్షాల నుంచి పోటాపోటీ పరిస్థితి కొంత ఎదురవుతోంది. అయితే టీఆర్ఎస్కు తాము ప్రత్యామ్నాయం అని కాంగ్రెస్, బీజేపీ రుజువు చేసుకోవలసి ఉంది. ఇటీవలి కాలంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఒక ప్రాంతీయ పార్టీ నేతగా ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తారన్నది అప్పుడే చెప్పలేం. కానీ కేసీఆర్ను జాతీయస్థాయి నేతగా చూపడానికి టీఆర్ఎస్ గట్టిగా యత్నిస్తోంది. గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ ఇదే వ్యూహం అవలంబించారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వంపై దాదాపు ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లుగా కేసీఆర్ వ్యవహరి స్తున్నారు. దేశ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు బీజేపీకి కాస్త చీకాకు తెప్పిస్తున్నాయి. తొలుత మోదీతో కేసీఆర్ సత్సంబంధాలు కొనసాగించారు. నోట్ల రద్దు లాంటి అంశాలలో మద్దతిచ్చారు. కారణం ఏమైనా తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందన్న భావన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పడింది. ప్రస్తుతం మోదీతో సంబంధాలు ఎంత చెడ్డాయంటే ఒకరినొకరు ముఖం చూసుకోనంతగా అని చెప్పాలి. మోదీ శంషాబాద్ వద్ద రామానుజ విగ్రహ ఆవిష్కరణకు వస్తే, కేసీఆర్ అక్కడకు వెళ్లలేదు. బిజినెస్ స్కూల్లో కాన్వకేషన్కు మోదీ హాజరైతే, ఆయనకు స్వాగతం పలకకుండా గైర్హాజరై, అదే రోజు కేసీఆర్ బెంగళూరు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వరకూ కేసీఆర్ వర్సెస్ మోదీ అన్న పరిస్థితి నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే శాసనసభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నట్లు కనబడుతోంది. తెలంగా ణలో బీజేపీ ముఖాలుగా ప్రస్తుతానికి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నప్పటికీ, ఎన్నికల సమ యంలో మోదీకి ఉన్న పలుకుబడినే బీజేపీ వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ ఏం సాధించారన్నది విశ్లేషించుకుంటే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది సుమారు లక్ష కోట్ల వ్యయంతో అతి భారీ కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టును నిర్మించడం. నిజానికి గోదావరి నది తెలంగాణ భూమట్టం కన్నా చాలా దిగువన ఉంటుంది. ఎత్తిపోతల ద్వారానే సాగునీటిని మళ్లించే అవకాశం ఉంది. ఇది వ్యయప్రయాసలతో కూడిన విషయమని తెలిసినా, సాహసంతో చేపట్టారు. కాకపోతే ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టుపై పలు విమర్శలు చేస్తున్నాయి. ప్రాజెక్టుపై పెట్టిన వ్యయానికీ, దానివల్ల వస్తున్న ప్రయోజనానికీ మధ్య చాలా తేడా ఉందన్నది కాంగ్రెస్, బీజేపీ వాదన. అలాగే అవినీతి ఆరోప ణలూ చేస్తున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, తెలంగాణలో విద్యుత్ కొరత లేకుండా చేయడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం. అయితే దీనిపై కూడా విమర్శలు లేకపోలేదు. విద్యుత్ను అధిక వ్యయంతో కొంటున్నందున వినియోగదారులపై ఎక్కువ భారం పడుతోందన్నది ప్రధానమైన విమర్శ. కేసీఆర్ ఆరంభించిన మరో స్కీమ్... రైతుబంధు. చిన్నా, పెద్ద, ధనిక, పేద రైతులన్న తేడా లేకుండా ఎకరాకు పదివేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం పంపిణీ చేస్తున్నారు. 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ విజయానికి ఇది బాగా ఉపయోగపడింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఆయన ప్రభుత్వం కాపాడుకోగలిగింది. మున్సిపల్ మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు కె.తారక రామారావుకు ఈ విషయంలో మార్కులు వస్తాయని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతిందన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. అలా అని హైదరాబాద్లో సమస్యలు లేవని కాదు. ‘దిశ’ అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. దళితబంధు స్కీమును కేసీఆర్ ప్రకటించడం ఒక సంచలనం అని చెప్పాలి. ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమై, కొందరికి అమలు కూడా చేశారు. దీనివల్ల పార్టీకి కొంత నష్టం కూడా జరిగింది. కేవలం ఎస్సీ వర్గాలకే ఈ స్కీము ఇస్తుండటంతో బీసీ, తదితర వర్గాలలో అసంతృప్తి ఏర్పడి హుజూరా బాద్లో టీఆర్ఎస్ ఓటమికి ఒక కారణం అయింది. రాజకీయ విషయాలు చూస్తే కేసీఆర్ తొలి పదవీ కాలం నల్లేరు మీద నడకలా సాగిపోయింది. తన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిన చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసు ద్వారా ఫిక్స్ చేశారు. రాజీ ఫార్ములాలో భాగంగా చంద్రబాబు హైదరాబాద్ వదలి పోయేలా చేయడంలో సఫలమయ్యారు. తెలంగా ణలో ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. ఇది అనైతికమే అయినా, వర్తమాన రాజకీయాలలో ప్రధాన ప్రతిపక్షాలను బలహీనం చేయడానికి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు గానీ, రాష్ట్రాలలో ఉన్న పార్టీలు గానీ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నాయి. ఈ మాత్రానికే ప్రతిపక్షాలు పూర్తిగా బలహీనం అవుతాయని చెప్పలేం. కాకపోతే దాని ప్రభావం కొంత పడవచ్చు. తొలి టరమ్లో ఏ ఎన్నిక అయినా తిరుగులేని విజయం సాధిస్తే, 2019 లోక్సభ ఎన్నికలలో తొలిసారిగా కేసీఆర్ ఎదురుదెబ్బ తిన్నారు. స్వయంగా ఆయన కుమార్తె కవిత లోక్సభ ఎన్నికలలో ఓటమి చెందారు. అలాగే మరో ముఖ్యనేత వినోద్ కుమార్ కూడా పరాజయం పొందారు. అనూహ్యంగా బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ బలపడే పరిస్థితి ఉందనుకున్న సమయంలో ఆయన బీజేపీ పెరగడానికి కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించారన్న అభిప్రాయం ఉన్నా, ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీల మధ్య విమర్శలు హద్దులు దాటాయనే చెప్పాలి. కాగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం అప్పగించడం, సామాజిక సమీకరణలలో మార్పునకు కాంగ్రెస్ యత్నించడం వంటి పరిణామాలు ఉన్నా, ఇప్పటికైతే కేసీఆర్ పెద్దగా ఇబ్బంది పడక పోవచ్చు. కాగా ప్రభుత్వపరంగా అప్పుల సమస్య కేసీఆర్ను వెంటాడుతోంది. గత రెండు నెలలుగా బాండ్లు విక్రయించి రుణాలు తీసుకుందామని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఆర్బీఐ గండి కొట్టి, ఎట్టకేలకు నాలుగు వేల కోట్లకు ఓకే చేసింది. కేంద్రంపై ఎంత పోరాడుతున్నట్లు కనిపించినా, ప్రజలలో దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. రైతుల ధాన్యం కొనుగోలు అంశం కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. దానిని కేంద్రంపైకి నెట్టడంలో కొంత సఫలీకృతమైనా, ప్రాథమికంగా టీఆర్ఎస్పై కూడా కొంత బాధ్యత ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం వివిధ సామాజిక వర్గాలలో టీఆర్ఎస్ పట్టు ఉంది. దానిని అలాగే కొనసాగించగలిగితే కేసీఆర్కు తిరుగుండదు. కానీ ఆ విషయంలో మార్పు తేవడానికి ప్రతిపక్షాలు గట్టిగా యత్నిస్తు న్నాయి. ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షాలు బలహీనపడటం లాంటి విషయాలు ఎలా ఉన్నా, తెలంగాణవాదం గణనీయంగా తగ్గి ఇతర రాజకీయ, సామాజిక, ఆర్థికాంశాల ప్రాతిపదికగా రాజకీయం మారడం కూడా ఒకరకంగా మంచిదే. కానీ దీనివల్ల కూడా విపరి ణామాలు ఉంటాయని మంత్రి మల్లారెడ్డికి ఎదురైన చేదు అనుభవం చెబుతోంది. కేసీఆర్ తెలివిగా రెడ్డి వర్గాన్ని కూడా తనతో కలుపుకొని వెళ్లే యత్నం చేస్తున్నారు. అలాగే బీసీలనూ, దళితులనూ తనతోనే ఉండేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికలకు టీఆర్ఎస్ సన్నద్ధమవుతూనే, కేసీఆర్ను జాతీయస్థాయి నేతగా ప్రొజెక్టు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలే అతి పెద్ద రాజకీయ పరిణామంగా చూడాలి. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు -
‘మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త’
సాక్షి, బెంగుళూరు: జాతీయస్థాయిలో పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం కర్ణాటకలో పర్యటించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో మార్పు తథ్యం అని, కొన్ని నెలల్లో దేశంలో భారీ మార్పులు జరుగుతాయన్నారు. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానన్నారు. దేశంలో బడుగు బలహీన వర్గాలు సంతోషంగా లేవన్నారు. భారత్లో పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయన్నారు. చదవండి: తెలంగాణ ఆ కుటుంబ దోపిడీకి గురవుతోంది: ప్రధాని మోదీ కాగా, ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దేవెగౌడతో చర్చించినట్లు సమాచారం. -
Mamata Banerjee: దేశంలో పరిస్థితి ఏం బాగోలేదు
కోల్కతా: ప్రస్తుతం కొనసాగుతున్న విభజించు–పాలించు, విభజన రాజకీయాల ఫలితంగా దేశం పరిస్థితి బాగోలేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మంగళవారం ఆమె కోల్కతాలోని రెడ్ రోడ్లో రంజాన్ ప్రార్థనల్లో పాల్గొని, మాట్లాడారు. ‘దేశంలో పరిస్థితి బాగోలేదు.. ప్రస్తుతం కొనసాగుతున్న విభజన రాజకీయాలు, విభజించు–పాలించు విధానాలు సరికావు. హిందూముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’ అని ఆరోపించారు. ‘బెంగాల్ ప్రజల్లో ఐక్యతను చూసి అసూయతోనే వారు నన్ను వేధించారు. కానీ భయపడను. ఎలా పోరాడాలో నాకు తెలుసు’ అన్నారు. -
దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కామెంట్స్
-
కేసీఆర్ దూకుడు.. టార్గెట్ ఢిల్లీ!..
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమని ప్రకటిస్తున్న టీఆర్ఎస్ అధినేత ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తున్నారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ సీఎం కేసీఆర్ గత కొన్నాళ్లుగా నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీని బంగాళాఖాతంలో కలపాలని, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని పిలుపునిస్తున్న ముఖ్యమంత్రి ఆ దిశగా కార్యాచరణ కూడా ప్రారంభించారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులు, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతూ జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర ప్రతిపక్షాన్ని బలంగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషించేలా అడుగులు ముందుకు వేస్తున్నారు. త్వరలో ముంబయికి వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో భేటీ కానున్నట్టు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలో హైదరాబాద్కు వస్తారని ప్రకటించారు. గతంలో మమతా బెనర్జీతో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులతో భేటీ అయిన కేసీఆర్.. ఇటీవలి కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, వామపక్ష నాయకులు సీతారాం ఏచూరి, ఎ.రాజాతో, అలాగే ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్తోనూ సమావేశమైన విషయం తెలిసిందే. త్వరలో ఢిల్లీలో బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించగా, ఇటీవల తాను తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులతో మాట్లాడిన విషయాన్ని మమతా బెనర్జీ సోమవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరిగే బీజేపీయేతర సీఎంల సమావేశం ఎజెండా అంశాలను రూపొందించే పనిలో కేసీఆర్ ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు బీజేపీ, నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై ఈ భేటీలో పలు నివేదికలు విడుదల చేసేలా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షతో పాటు నిరుద్యోగం, విద్యుత్ సంస్కరణలు, పారిశ్రామిక వృద్ధి తిరోగమనం, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి వంటి అంశాలు ఈ నివేదికల్లో పొందుపరిచే అవకాశముందని తెలుస్తోంది. వైఫల్యాలు, అవినీతి ఆరోపణలపై అధ్యయనం ఎనిమిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై జాతీయ స్థాయిలో వివిధ రంగాలకు చెందిన నిపుణులతో కేసీఆర్ నిరంతరం సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుమారు ఏడాదికాలంగా ఆయన జాతీయ అంశాలు, రాజకీయాలపై ఈ తరహా కసరత్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం. బీజేపీ అనుసరిస్తున్న విదేశాంగ, ఆర్థిక, అభివృద్ధి, సంక్షేమ విధానాలు, వాటి వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ రాష్ట్రాల హక్కులు హరించి వేస్తుందనే విమర్శలను సాక్ష్యాధారాలతో వివరించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాల్లో విడుదల చేసిన నివేదికలపై దృష్టి పెట్టారు. ఇటీవలి కాలంలో రాష్ట్రాల పాలన వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకుంటున్న తీరు తదితరాలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి అందుతున్న వివరాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ అధ్యయనంలో తేలిన అంశాల మేరకే ఇటీవలి జనగామ, భువనగిరి బహిరంగ సభలతో పాటు రెండురోజుల క్రితం మీడియా సమావేశంలో కేసీఆర్ పలు వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి. కాంగ్రెసేతర కూటమి లేదా ప్రత్యేక పార్టీ.. దశాబ్దాలుగా సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడంలో కాంగ్రెస్, బీజేపీది ఒకే తరహా విధానమని ఆరోపిస్తున్న బీజేపీయేతర పార్టీలు జాతీయ స్థాయిలో కొత్త కూటమి లేదా పార్టీగా ఏర్పడే అవకాశాలున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రాల్లో ఎవరికి వారుగా ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే జాతీయ స్థాయిలో ఏకం కావాల్సిన తీరు, విధి విధానాలు, అందుకు అడ్డంకిగా ఉండే అంశాలపై ఇప్పటికే టీఆర్ఎస్, టీఎంసీ, ఆర్జేడీ, సమాజ్వాదీ తదితర పార్టీల మధ్య చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. సమాఖ్య వ్యవస్థను కాపాడేందుకు ప్రాంతీయ పార్టీలు అవగాహనకు రావాలని మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్తో నిమిత్తం లేకుండా, తమ దారిలో తాము వెళ్లాలనే అభిప్రాయం బీజేపీయేతర పార్టీల్లో వ్యక్తమవుతోందని టీఆర్ఎస్ మాజీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. -
భవిష్యత్ ఎలా చెప్పగలం?
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓటర్లను మతం చుట్టూ తిప్పడం మినహా ఎలాంటి అభివృద్ధి చేయలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మారుస్తామన్న ప్రకటనలు ఉత్తి రాజకీయ స్టంట్ అని విమర్శించారు. గురువారం కేటీఆర్ ట్విట్టర్లో ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట నెటిజన్లతో సంభాషించారు. ట్విట్టర్లో జాతీయస్థాయి పాలిటిక్స్ కేటగిరీ ట్రెండింగ్లో ఈ సెషన్ తొలిస్థానంలో నిలవడం గమనార్హం. ఇందులో కేటీఆర్ ఇచ్చిన సమాధా నాలు, చెప్పిన పలు అంశాలివీ.. జాతీయ రాజకీయాలపై చెప్పలేం.. ‘దేశ శ్రేయస్సు కోసం ప్రాంతీయ పార్టీలను ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి వెళతారా?’ అని గట్ల సతీశ్ అనే నెటిజన్ ప్రశ్నించగా.. ‘‘సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే విషయాన్ని ఇప్పుడే ఎలా చెప్పగలం? భవిష్యత్తులో ఏం రాసిపెట్టి ఉందో ఎవరికి తెలుసు?..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామంటూ గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ.. ఈ శతాబ్దంలోనే అతిపెద్ద అబద్ధం (జుమ్లా ఆఫ్ ది సెంచురీ)గా అభివర్ణించారు. ఐటీ రంగంలో తెలంగాణ కంటే మహారాష్ట్రలోని పుణే బాగా రాణిస్తోందంటూ రాష్ట్ర బీజేపీ ఎంపీలు చేస్తున్నవి మూర్ఖపు వ్యాఖ్యలని.. వాటిని వదిలేయడమే ఉత్తమమని పేర్కొన్నారు. యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా టీఆర్ఎస్ ప్రచారం చేస్తుందా అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఈ విషయంలో వారితో సంప్రదింపులు జరిగాక వెల్లడిస్తామని కేటీఆర్ చెప్పారు. యూపీ బీజేపీ ప్రభుత్వం నుంచి ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు బయటికి రావడమంటే.. త్వరలో అక్కడ జరిగే ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ పట్ల ఓటర్ల మొగ్గును సూచిస్తోందన్నారు. ►‘జాతీయ రాజకీయాల్లో, కేంద్ర ఐటీ మంత్రిగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం’ అని కొందరు నెటిజన్లు ప్రస్తావించగా.. రాష్ట్రంలో అందిస్తున్న సేవల పట్ల సంతోషంగా ఉన్నానని, ఇక్కడి ప్రజలకు ప్రాతినిధ్యం వహించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని కేటీఆర్ చెప్పారు. ∙టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అంశాన్ని ఓ నెటిజన్ ప్రస్తావించగా.. ‘‘రేవంత్ నాతో కాకుండా ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో చర్చిస్తే మంచిది. రేవంత్ లాంటి నేరస్తులు, 420లతో చర్చల్లోకి దిగ బోను.’’ అని వ్యాఖ్యానించారు. కరోనా పరిస్థితిని బట్టి లాక్డౌన్ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడం, లేదా వైద్యారోగ్యశాఖ అధికారులు చేసే సూచనల మేరకు లాక్డౌన్ లేదా నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేటీఆర్ చెప్పారు. ఇంటింటికి ఇంటర్నెట్ అందించే టీఫైబర్ తొలిదశ పనులు ఏప్రిల్ నాటికి పూర్తవుతా యని తెలిపారు. ఇక వరంగల్లో బస్టాండ్ నిర్మాణం, ములుగు జిల్లా కమలాపురంలో బిల్ట్ పరిశ్రమ పునరుద్ధరణ, గ్రేటర్ హైదరా బాద్లో పారిశుధ్యం, రోడ్లు, ఫ్లైఓవర్ల అంశాలపైనా కేటీఆర్ స్పందించారు. -
జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన మమతా బెనర్జీ
-
బెంగాల్ బెబ్బులి జాతీయ స్వప్నం
‘యూపీఏనా? అదెక్కడుంది? ఇప్పుడది గత చరిత్ర!’ ఇది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ గురించి ఏ ప్రత్యర్థి బీజేపీనో అన్న మాట కాదు. బీజేపీకి బద్ధశత్రువుగా యూపీఏతో కలసి నడచిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్య. మహారాష్ట్రలో శరద్ పవార్తో బుధవారం నాటి భేటీ అనంతరం మమత వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం. కేంద్రంలో బీజేపీ సర్కారును గద్దె దించడానికి కాంగ్రెస్ సత్తా సరిపోవట్లేదనేది ఈ బెంగాల్ బెబ్బులి మాటల సారాంశం. ఎనిమిది నెలల క్రితం మార్చి 31న బీజేపీపై ఐక్యపోరాటం అవసరమంటూ కాంగ్రెస్ సహా 15 ప్రతిపక్షాలకు లేఖలు రాసిన దీదీ ఇప్పుడు రూటు మార్చారు. జాతీయ స్థాయిలో పగ్గాలు పట్టాలని ఆమె భావిస్తున్నట్టు ఇటీవలి పరిణామాలతో తేటతెల్లమవుతోంది. శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేతలను కలుసుకొనేం దుకు 3 రోజుల ముంబయ్ పర్యటనకు వచ్చారు మమత. ‘దేశంలోని ఫాసిజమ్ వాతావరణాన్ని ఎదుర్కోవాలంటే, బలమైన ప్రత్యామ్నాయం అవసరం’ అన్నారామె. ‘పోరాడాల్సిన వారు (కాంగ్రెస్) సమర్థంగా పోరాడకపోతే ఏం చేయాలి’ అనడం ద్వారా కాంగ్రెస్తో సంబంధం లేని కొత్త ప్రతిపక్ష కూటమి వాదనను పరోక్షంగా తెరపైకి తెచ్చారు. మహారాష్ట్రలో కాంగ్రెస్తో పొత్తున్న ఎన్సీపీ నేత పవార్ సైతం ప్రతిపక్షాలకు బలమైన ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరమని పునరుద్ఘాటిం చారు. అంటే ఇప్పుడున్న నాయకత్వం బలంగా లేదనీ, దానికి బదులు మరొకటి రావాలనీ ఆయన కూడా స్థూలంగా అంగీకరించారన్న మాట. ఇన్నాళ్ళుగా ప్రతిపక్షాలకు పెద్దన్నలా ఉంటున్న కాంగ్రెస్కు ఇది ఊహించని ఎదురుదెబ్బ. ‘రాజకీయాల్లో నిరంతరం శ్రమించాలి. విదేశాల్లో రోజుల తరబడి గడిపితే కుదరదు’ అంటూ రాహుల్పై మమత బాణాలు సంధించడం గమనార్హం. కాంగ్రెస్, తృణమూల్ సంబంధాలు దెబ్బతిన్నాయనడానికి ఇలాంటి ఎన్నో సూచనలున్నాయి. ఈ నవంబర్లో మమత 4 రోజులు ఢిల్లీలో పర్యటించారు. అక్కడ మోదీని కలిశారే తప్ప, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాను కలుసుకోలేదు. సరికదా... అసంతృప్త కాంగ్రెస్ నేతల్ని కలిశారు. పైపెచ్చు, ఆమె ఢిల్లీలో ఉన్నప్పుడే మేఘాలయ కాంగ్రెస్ శాఖ నిట్టనిలువునా చీలింది. మాజీ సీఎం ముకుల్ సంగ్మా వచ్చి తృణమూల్ గూటిలో చేరారు. ఒక్క సంగ్మానే కాదు... ఇటీవల ఢిల్లీలో కీర్తీ ఆజాద్, అశోక్ తన్వార్, యూపీలో లలితేశ్ త్రిపాఠీ, గోవాలో లుయిజిన్హో ఫలీరో, అస్సామ్లో సుస్మితా దేవ్– ఇలా హస్తం వదిలేసి, దీదీ చేయి పట్టుకున్నవాళ్ళు సమీప గతంలో అనేకులున్నారు. వారిని ఆపి, అసంతృప్తిని తీర్చలేక కాంగ్రెస్ నిస్సహాయంగా మిగిలిపోయింది. భావసారూప్య శక్తులన్నీ జాతీయస్థాయిలో కలసివచ్చి, సమష్టి నాయకత్వం పెట్టుకోవడం మంచిదే. కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ పేరిట ఇంతకాలం జరిగింది ఒకరకంగా అదే. కానీ, ఇప్పుడు టీఎంసీ లాంటివి కొత్త ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయంటే, అది కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యమే. దాదాపు 135 ఏళ్ళ వయసున్న కాంగ్రెస్కు ఏకంగా 18కి పైగా రాష్ట్రాల్లో బలమైన ఉనికి ఉంది. ఇప్పటికీ దేశంలో ప్రధాన ప్రతిపక్షం అదే. అయితే, ప్రస్తుతం పంజాబ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ – ఈ 3 రాష్ట్రాల్లోనే ఆ పార్టీ అధికారంలో ఉంది. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో, జార్ఖండ్లో ద్వితీయశ్రేణి భాగస్వామిగా కొనసాగుతుండడం చేదునిజం. దేశంలో 3 నుంచి 3.5 కోట్ల మంది కార్యకర్తలు ఇప్పటికీ కాంగ్రెస్కు ఉన్నారని లెక్క. జాతీయ స్థాయిలో అంత బలం, బలగం ఉన్నప్పటికీ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతోంది. నాయకత్వ లేమి, రాహుల్ అపరిపక్వత, పార్టీలో అసంతృప్తి దాన్ని బీజేపీకి దీటుగా నిలపలేకపోతున్నాయి. ఫలి తంగా ప్రతిపక్షంలో శూన్యత ఏర్పడింది. అదే ఇప్పుడు మమతకు కలిసొచ్చేలా ఉంది. రాగల మూడు నెలల్లో పార్టీ రాజ్యాంగాన్నీ, చివరకు పేరును కూడా జాతీయ స్థాయికి తగ్గట్టు మార్చే యోచనలో టీఎంసీ ఉంది. కానీ, జాతీయస్థాయి విస్తరణకు దీదీ వద్ద సమగ్రవ్యూహమే ఏమీ ఉన్నట్టు లేదు. ముప్పుతిప్పలు పెట్టిన బీజేపీపై వ్యక్తిగత లెక్కలు తేల్చుకోవడమే ధ్యేయంగా కనిపిస్తోంది. తగ్గట్టే ఇప్పుడు బీజేపీ పాలిత త్రిపుర, గోవాలలో సైతం తృణమూల్ బరిలోకి దిగింది. ఈ గందరగోళంలో బీజేపీ కన్నా కాంగ్రెస్కే దెబ్బ తగులుతోంది. 2016లో కేవలం 3 స్థానాలున్న బెంగాల్లో ఇవాళ బీజేపీ దాదాపు 70 సీట్లకు ఎదిగింది. కానీ, గత పదేళ్ళలో అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల్లో అధికభాగం దీదీ వైపు వచ్చేశారు. గతంలో బీజేపీతో, కాంగ్రెస్తో దోస్తీ మార్చిన తృణమూల్ నిజానికి సిద్ధాంతాల కన్నా దీదీ ఛరిష్మాపై ఆధారపడుతున్న సంగతీ మర్చిపోలేం. రెండు సార్లు ఎంపీ, వరుసగా మూడుసార్లు బెంగాల్ సీఎం అయిన దీదీకి కావాల్సినంత అనుభవం ఉంది. పోరాటానికి కావాల్సిన దూకుడూ ఉంది. బెంగాల్లో ఈ ఏటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించిన ఘనతా ఉంది. కానీ, మోదీకి, మమత పోటీ అవగలరా? అసలు కాంగ్రెస్ లేని ప్రతిపక్షం సాధ్యమా? అలాంటి కూటమి విజయం సాధిస్తుందా? బెంగాల్ బయట తృణమూల్ విస్తరణవాదం బీజేపీనేమో కానీ, ప్రతిపక్షాలనే దెబ్బతీసేలా ఉంది. అసలు జాతీయ స్థాయిలో 2014తో పోలిస్తే, 2019లో టీఎంసీకి సీట్లు తగ్గాయనీ, కాబట్టి జాతీయ వేదికపై దాని బలం ఏమంత గొప్పగా లేదనీ కొందరు గుర్తుచేస్తున్నారు. అయినా, పాలకపక్షంతో పోరాడాల్సిన ప్రతిపక్షాలు కొత్త నాయకత్వం కోసం కలహించుకుంటే ఏమవుతుంది? పిట్ట పోరు, పిట్ట పోరు... పిల్లి తీరుస్తుంది. -
చిన్న పార్టీల జోరు.. అధిక సీట్ల కోసం బేరసారాలు
లక్నో: ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనుండడంతో ఇప్పట్నుంచే ఆ రాష్ట్రంలో పొత్తులు ఎత్తులు, వ్యూహాలు ప్రతివ్యూహాలతో రాజకీయాలు వేడెక్కాయి. అందులోనూ చిన్న పార్టీల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. కుల ప్రాతిపదికన ఏర్పడిన ఈ పార్టీలపై ప్రధాన పార్టీలు వల వేశాయి. వారిని తమ వైపు లాక్కుంటే ఓట్లు చీలకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ఎన్నికల్లో వారిని కలుపుకొని వెళ్లాలని ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఎందుకంటే కొన్ని వందల ఓట్లను ఈ పార్టీలు దక్కించుకున్నా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం అధికంగా ఉంది. దీంతో డజనుకి పైగా చిన్న పార్టీలు గొంతెమ్మ కోర్కెలకి దిగుతున్నాయి. అధిక సీట్లను ఆశిస్తూ బేరసారాలకు దిగుతున్నాయి. 2017 ఎన్నికల్లో వివిధ చిన్న పార్టీలకు చెందిన ఎనిమిది మంది అభ్యర్థులు వెయ్యి ఓట్ల తేడాతో విజయాన్ని సాధించినట్టు ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చిన్న పార్టీలకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయని సమాజ్వాదీ పార్టీ చెబుతూ ఉంటే, బీజేపీ కూడా వారితో పొత్తుకు సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం సంస్థాగతంగా బలపడి తాము ఒంటరిపోరాటానికి దిగుతామని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ గడువు 2022 మార్చి 14తో ముగియనుంది. ఆలోపే రాష్ట అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఏ పార్టీ సత్తా ఎంత అప్నాదళ్, నిషాద్ పార్టీ, జేడీ(యూ), ఆర్పీఐ, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ యోచిస్తోంది. అయితే సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఏర్పాటైన నిషాద్ పార్టీకి దాదాపుగా ఆరు లోక్సభ స్థానాల్లో గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. ఇక అప్నాదళ్ (ఎస్), ఓం ప్రకాశ్ రాజ్భర్ నేతృత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీలకు (ఎస్బీఎస్పీ) ఓబీసీల్లోని కుర్మీ వర్గంపై పట్టు ఉంది. బీజేపీతో కలిసి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్బీఎస్పీ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్న ప్రకాశ్ రాజ్భర్ 2019 లోక్సభ ఎన్నికలకు ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చారు. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశారు. తూర్పు యూపీలో యాదవుల తర్వాత రాజ్భర్ల ప్రాబల్యమే ఎక్కువ. ఇటీవల ఓం ప్రకాశ్ రాజ్భర్ పార్టీ ఆధ్వర్యంలో 10 చిన్నాచితకా పార్టీలతో భగధారి సంకల్ప్ మోర్చా ఏర్పాటైంది. ఈ కూటమిలో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. 100 సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ మినహా మరే ఇతర పార్టీలైనా తమతో చేతులు కలపవచ్చునని ఆ కూటమి పిలుపునిచ్చింది. ఇక సమాజ్వాదీ పార్టీకి రాష్ట్రీయ లోక్ దళ్, మహన్ దళ్, జన్వాడీ సోషలిస్టు పార్టీ, మరికొన్ని ఇతర పార్టీల మద్దతు ఉంది. మహన్ దళ్ పార్టీకి శక్య, సైని, మౌర్య, కుష్వాహ ఓబీసీ వర్గాల్లో పట్టు ఉంది. రాష్ట్రంలోని ఓబీసీ జనాభాల్లో వీరి ఓట్లే దాదాపు నలభై శాతం వరకు ఉన్నాయి. సంజయ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని జన్వాడీ సోషలిస్టు పార్టీకి బింద్, కశ్మప్ వర్గాల్లో మంచి పట్టు ఉంది. డజనుకు పైగా జిల్లాల్లో ఈ పార్టీ తన ప్రభావాన్ని చూపించగలదు. శివపాల్ యాదవ్ నాయకత్వంలోని ప్రగతి శీల సమాజ్వాదీ పార్టీ బీజేపీయేతర పార్టీలతో చేతులు కలపాలని ప్రణాళికలు రచిస్తోంది. గత ఎన్నికల్లోకి తొంగి చూస్తే.. ► 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 200పైగా పార్టీలు తమ అభ్యర్థుల్ని బరిలో దింపాయి ► 2017 ఎన్నికల్లో ఏకంగా 290 పార్టీలు పోటీ చేశాయి ► ఎస్బీఎస్పీ పార్టీ ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తే నాలుగు స్థానాల్లో గెలిచింది. ఈ పార్టీ తాము పోటీ చేసిన స్థానాల్లో 34.14 శాతం ఓట్లను కొల్లగొట్టింది. ► అప్నాదళ్ (ఎస్) 11 స్థానాల్లో పోటీ చేసి 39.21 శాతం ఓట్లను సాధించింది. మొత్తం అన్ని స్థానాల ఓట్ల పరంగా చూస్తే 0.98 శాతం ఓట్లను దక్కించుకున్నట్టయింది. ► పీస్ పార్టీ 68 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఎక్కడా విజయం సాధించలేదు. అయితే తాము పోటీ చేసిన స్థానాల్లో 1.56 శాతం ఓట్లను సాధించింది. మొత్తం ఓట్లలో 0.26% ఓట్లు ఆ పార్టీకి వచ్చాయి. ► 2017 ఎన్నికల్లో 32 చిన్న పార్టీలకు 5 వేల నుంచి 50 వేల మధ్య ఓట్లు వచ్చాయి. ► మరో ఆరు చిన్న పార్టీలు 50 వేలకు పైగా ఓట్లు సాధిస్తే, ఇంకో ఆరు పార్టీలు లక్షకు పైగా ఓట్లు సాధించాయి. ► గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ చిన్న పార్టీలు 56 అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలకు గండికొట్టాయి. -
ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించండి: కేసీఆర్కు ఎంపీల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాల్సిందిగా సీఎం కేసీఆర్ను కొందరు టీఆర్ఎస్ ఎంపీలు కోరినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, దీనిపై సరైన సమయంలో స్పందిస్తానని అన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2,3 రోజుల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన లేదా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ నెల 19 నుంచి పార్ల్లమెంటు సమావేశాలు ప్రారంభమ వుతున్న నేపథ్యంలో శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఎంపీలతో చర్చించడంతో పాటు వివిధ అంశాలపై వారికి కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగానే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశం, టీఆర్ఎస్ పోషించాల్సిన పాత్రపైనా చర్చ జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హక్కులు హరిస్తున్న కేంద్రం ‘దేశ రాజకీయాలు రోజురోజుకూ పూర్తిగా మారిపోతున్నాయి. కొత్త రాష్ట్రమైనా మనం తెలంగాణను బలంగా అభివృద్ధి చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం సాయం లేకున్నా అభివృద్ధి బాటలో సాగుతున్నాం. అయితే రాష్ట్రాన్ని బలహీన పరిచేందుకు అనేక ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్రం మన హక్కులను హరించి వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. అయినా టీఆర్ఎస్ వల్లే తెలంగాణ ఈ రోజు దేశం ముందు సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. రాష్ట్రాలకు వాటా మేరకు నిధుల కేటాయింపులు జరగడం సహజమే అయినా, కొత్త రాష్ట్రానికి ఎలాంటి అదనపు సాయం లేదు. దేశ రాజకీయాలపై ప్రస్తుతం వేచి చూసే ధోరణిలో ఉన్నాం. సరైన సమయంలో స్పందిస్తా..’ అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాగునీటి విషయంలో అన్యాయం జరక్కూడదు ‘సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదు. లోక్సభ, రాజ్యసభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటా కోసం కేంద్రాన్ని నిలదీయాలి. గట్టిగా కొట్లాడాలి. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కృషి చేయాలి. రాష్ట్రానికి సంబంధించిన పెండింగు సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించాలి. సంబంధిత కేంద్ర మంత్రులను కలుస్తూ వినతిపత్రాలను అందచేయాలి..’ అని పార్టీ ఎంపీలకు కేసీఆర్ సూచించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు సంబంధించి సమస్యలు పెండింగులో ఉన్నాయని, వాటిని పరిష్కరించుకునే దిశగా సంబంధిత మంత్రిని కలవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కేఆర్ సురేశ్రెడ్డి, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్సభ సభ్యులు బి.బి పాటిల్, పోతుగంటి రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, బి.వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
PK: ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా..?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయిన నేపథ్యంలో.. కాంగ్రెస్లో ఆయన చేరడంపై ఊహాగానాలు పెరిగాయి. 2024 లోక్సభ ఎన్నికలతో పాటు, ఆ లోపు రానున్న పలు అసెంబ్లీల ఎన్నికలకు కాంగ్రెస్ సిద్దమవుతున్న పరిస్థితుల్లో.. పార్టీలో ప్రశాంత్ కిషోర్ పోషించాల్సిన కీలక పాత్రపై సోనియా, రాహుల్, ప్రియాంకలతో భేటీ సందర్భంగా చర్చ జరిగి ఉండవచ్చని పార్టీ వర్గాలు సంకేతాలిచ్చాయి. సోనియా, రాహుల్, ప్రియాంకలతో ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ఇదే మొదటిసారి కాదని వెల్లడించాయి. రాహుల్ గాంధీ నివాసంలో మంగళవారం జరిగిన భేటీ అందరూ అనుకున్నట్లు పంజాబ్, లేదా ఉత్తరప్రదేశ్లో పార్టీ వ్యవహారాల గురించి కాదని.. అంతకు మించిన అంశంపై వారి మధ్య చర్చ జరిగిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్కు విజయం సాధించిపెట్టే బృహత్తర బాధ్యతను ప్రశాంత్ కిషోర్పై పెట్టాలని సోనియా భావిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తన వ్యూహాలతో పశ్చిమబెంగాల్లో టీఎంసీకి, తమిళనాడులో డీఎంకేకు ప్రశాంత్ కిషోర్ విజయం సాధించిపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ తరహా బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు చేస్తున్న పనిని కొనసాగించాలని అనుకోవట్లేదు. ఇప్పటివరకు చేసింది చాలు. విరామం తీసుకుని, కొత్తదేదైనా చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నా’ అని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మే నెలలో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆయన స్పష్టం చేశారు. మళ్లీ రాజకీయాల్లోకి వెళ్తారా? అన్న ప్రశ్నకు.. ‘నేను ఒక విఫల రాజకీయవేత్తను. ముందుగా, నేనేం చేయగలను అనే విషయాన్ని సమీక్షించుకోవాల్సి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలోనూ కాంగ్రెస్తో ప్రశాంత్ కిషోర్ కలిసి పని చేశారు. పంజాబ్ ఎన్నికల్లో కిషోర్ వ్యూహాల సాయంతోనే కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే, ఆ తరువాత పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రశాంత్కిషోర్ విమర్శించారు. కాంగ్రెస్ 100 ఏళ్ల వయస్సున్న రాజకీయ పార్టీ. ఆ పార్టీ పనితీరు ప్రత్యేకంగా ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ వంటి వ్యక్తుల నుంచి సలహాలు తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉండరు. నా పనితీరు వారికి సరిపడదు’ అని గతంలో వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?'
సాక్షి, హైదరాబాద్: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఘోర పరాభవం మూటగట్టుకుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు నామరూపాల్లేకుండాపోయింది. ఆ స్థానాన్ని బీజేపీ భర్తీ చేసింది. ఇక కేరళలో కమ్యూనిస్టులతో కలిసి యూడీఎఫ్గా ఉన్న కాంగ్రెస్ మరోసారి ఓటమిని చవిచూసింది. ఒక్క తమిళనాడులో తన మిత్రపక్షం డీఎంకే విజయం పొందడం కొంత సానుకూల పరిణామం. పుదుచ్చేరిలో చేదు ఫలితాలు పొందింది. ఈశాన్య రాష్ట్రం అసోంలో కూడా అదే ఫలితాలను చవిచూసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ మరింత క్షీణించి ఒక ప్రాంతీయ పార్టీ కన్నా తక్కువ స్థాయిలో ఓట్ల శాతం పొందింది. 150 ఏళ్ల చరిత్ర ఉన్న జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అవసాన దశకు చేరుకుంది. అత్యంత గడ్డు పరిస్థితులు ఆ పార్టీ ఎదుర్కొంటోంది. ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతోంది. స్వాతంత్ర్య భారతదేశాన్ని 60 ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు గడ్డు రోజులు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. మహారాష్ట్రలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. దక్షిణ భారతదేశంలో ఒక్క కేరళ మినహా ఎక్కడా కూడా కాంగ్రెస్ అధికారంలో లేదు. తెలుగు రాష్ట్రాల్లో హస్తం పార్టీ క్షీణ దశకు చేరుకుంది. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్లో నామరూపాల్లేకుండా పోగా.. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మూడో పార్టీగా నిలిచింది. నాగార్జున సాగర్లో రెండో స్థానం పొందగా, తిరుపతిలో అసలు కనీసం ఆ పార్టీ ఉన్నట్టు కూడా జనాలకు తెలియదు. ఈ విధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేదు ఫలితాలను పొందుతోంది. ఇక హస్తం పార్టీ హస్త'గతమేనా..?' అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితికి ప్రధాన కారణం.. పార్టీకి నాయకత్వ లోపం. పార్టీకి జవసత్వాలు కల్పించే నాయకుడు లేకపోవడం.. ఆ పార్టీకి ప్రధాన నెగటివ్. చదవండి: ఈ విజయం కేసీఆర్కు అంకితం..నోముల భగత్ చదవండి: గెలుపు సంబరం.. పొంచి ఉన్న కరోనా విస్ఫోటనం -
నా ఆందోళనను పంచుకోండి: మమత లేఖ వైరల్
కోల్కత్తా: ‘రండి.. ఏకమవుదాం.. నిరంకుశ బీజేపీకి వ్యతిరేకంగా జత కడుదాం’ అని బీజేపీయేతర పార్టీలకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఎన్నికలు ముగియగానే చేతులు కలుపుదాం అని పిలుపునిచ్చారు. మొత్తం ఏడు ప్రధానాంశాలపై మమత లేఖ రాస్తూ వారికి పంపించారు. ఎన్సీపీ, డీఎంకే, శివసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేడీ, ఎస్పీ, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు మమతా పంపారు. రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడిని తిప్పి కొట్టాల్సిన అవసరాన్ని మమతా గుర్తుచేశారు. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే.. ‘నేను మీకు లేఖ రాస్తున్నా. నా తీవ్రమైన ఆందోళనను మీతో పంచుకోవాలనుకుంటున్నా..’ అంటూ మమతా లేఖ మొదలుపెట్టారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ దారుణంగా దాడి చేస్తోందని, సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని లేఖలో మమత ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విధానాలు, నైతిక విలువలు బీజేపీకి వ్యతిరేకమని, అలాగే వదిలేస్తే దేశానికే ప్రమాదం అని గుర్తుచేశారు. ఆ పార్టీపై పోరాటానికి అన్ని పార్టీలు ఏకం కావాలని, అలాగైతేనే ఓడించగలమని మమత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీకి సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును మమత ప్రస్తావించారు. ఢిల్లీలో ప్రజా ప్రభుత్వం కాకుండా పూర్తిస్థాయి లెఫ్టినెంట్ ప్రభుత్వం నడిపించేలా కొత్త చట్టం తెస్తోందని ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సూచించారు. రెండుసార్లు కేజ్రీవాల్ ఓడించారని, మళ్లీ గెలిచే నమ్మకం లేకనే ఈ కొత్త తెస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసి మున్సిపల్ స్థాయికి తీసుకొస్తోందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ పరిణామాలతో బీజేపీ ఏక పార్టీ అధికారమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోందని మమత స్పష్టం చేశారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మమతా ఇతర పార్టీల నాయకులకు పిలుపునిచ్చారు. మమత లేఖ పంపినది వీరికే.. శరద్ పవార్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) స్టాలిన్, ద్రవిడ మున్నేట కజగమ్ (డీఎంకే) ఉద్దవ్ ఠాక్రే, శివసేన వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నవీన్ పట్నాయక్, బిజూ జనతాదళ్ (బీజేడీ) తేజస్వి యాదవ్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అఖిలేశ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ చదవండి: ‘టార్చ్లైట్’ విసిరివేత: కోపమేలా కమల్ హాసన్ -
ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచేనో?
న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత కీలక రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వీటితో పాటు అస్సాం, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. వీటికి షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కెంది. పశ్చిమబెంగాల్ ఈ ఎన్నికలను జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇప్పటికే నరేంద్ర మోదీకి పోటీగా ఎదగాలనుకుంటున్న మమతా బెనర్జీకి ఈ ఎన్నికలు సవాల్గా మారనున్నాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు శక్తియుక్తులు పెడుతోంది. మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనే పట్టుదలతో మమతా బెనర్జీ దూకుడుగా వెళ్తున్నారు. అయితే కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్లో మమతాకు పరిణామాలు గడ్డుగా తయారయ్యాయి. ఈసారి ప్రధాన పోటీ బీజేపీతోనే ఉండనుంది. కమ్యూనిస్టులను అణగదొక్కిన మమతా కమలదళాన్ని రాష్ట్రంలో అణచివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే బీజేపీకి అనూహ్యంగా బలం పెరిగింది. 2019 లోక్సభ ఎన్నికల్లో టీఎంసీకి పోటీగా బీజేపీ నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు తృణమూల్లోని ప్రధాన నాయకులందరూ కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే మమతకు పోరాటం కొత్తేం కాదు. ఎంతమంది వెళ్లినా ఆమె ఒంటిచేత్తో సత్తా చాటగల ధీరశాలి.. అపర కాళీగా పేరు ఉంది. దీంతో బీజేపీకి ధీటుగా ప్రచారం చేసి పదేళ్ల తన పాలనను వివరించడంతో పాటు మోదీ పాలనను ఎండగడుతూ ఎన్నికలకు మమత వెళ్తున్నారు. అయితే పదేళ్ల మమత పాలన వైఫల్యాలను ఎండగడుతూనే మోదీ చరిష్మాను ఈ ఎన్నికలకు వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే తృణమూల్లోని కీలక నాయకులను పార్టీలో చేర్చుకుని మమతకు పెద్ద దెబ్బ కొట్టారు. ఇక ఎన్నికల్లోనూ ఇలాంటి చావుదెబ్బ టీఎంసీకి తప్పదని కమల దళం భావిస్తోంది. తమిళనాడు తొలిసారిగా తమిళ రాజకీయాల్లో ఉద్ధండ నాయకులైన జయలలిత, కరుణానిధి లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళ రాజకీయాలను ఇప్పటివరకు జాతీయ పార్టీలు అంతగా ప్రభావితం చేయలేదు. కానీ ఈసారి ఆ పరిస్థితి మారేలా కనిపిస్తోంది. ముఖ్యంగా నాయకత్వ లేమి అనేది తమిళనాడులో స్పష్టంగా కనిపిస్తోంది. జయలలిత ఆకస్మిక మరణంతో అన్నాడీఎంకే, కరుణానిధి మృతితో డీఎంకేలు డీలా పడ్డాయి. శ్రేణులను నడిపించే నాయకత్వం లేదు. అన్నాడీఎంకేలో వర్గ విబేధాలు తారస్థాయిలో ఉన్నాయి. పైకి విబేధాలు లేవని చెబుతున్నా ముఖ్యంగా పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య తీవ్ర విబేధాలు ఉన్నాయి. పదేళ్లుగా అధికారానికి దూరమైన డీఎంకే శ్రేణులు నిరాశలో ఉన్నారు. స్టాలిన్ ఉన్నా అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఇక ఇటీవల జైలు నుంచి వచ్చిన జయలలిత స్నేహితురాలు శశికళ ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అన్నాడీఎంకేను చీల్చే అవకాశం ఉంది. అన్నాడీఎంకే, డీఎంకే మధ్యలో శశికళ వర్గం లబ్ధి పొందేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే అన్నాడీఎంకేకు పరోక్షంగా బీజేపీ మద్దతు తెలుపుతోంది. జయలలిత మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీ పాత్ర ఉందని అందరికీ తెలిసిన రహాస్యమే. ఇప్పుడు కూడా అన్నాడీఎంకే రహాస్య సంబంధాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభావం అంతంతగానే ఉండవచ్చు. అయితే ఈ నడిమధ్యలో సినీ నటులు కమల్హాసన్ ఉన్నా అతడి ప్రభావం ఏం ఉండకపోవచ్చు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేసి ఉంటే తమిళ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం ఉండేది. అయితే ఈ ఎన్నికల్లో రజనీ ఎవరికి మద్దతు తెలుపుతారనే అంశం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. కేరళ దక్షిణాదిలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా కేరళను చెబుతారు. ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది. సీపీఎంతో కూడిన కూటమి పాలన సాగిస్తోంది. ఇక్కడ మళ్లీ పినరయి విజయనే అధికారంలోకి వచ్చేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. రాహుల్గాంధీ విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. సీపీఎం నేతృత్వంలో ఎల్డీఎఫ్ లేదా కాంగ్రెస్తో కలిసి ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఈసారి ఎలాగైనా ప్రభావం చూపాలని తహతహలాడుతోంది. గత ఎన్నికల్లో ఒక స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. అస్సాం ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతోంది. గత ఎన్నికల్లో సత్తా చాటి అధికారం చేపట్టిన బీజేపీ ఈసారి కూడా అదే ఊపుతో కొనసాగే అవకాశం ఉంది. మోదీ చరిష్మా, ఐదేళ్ల పాలనను వివరిస్తూ బీజేపీ ఎన్నికలకు వెళ్తుండగా.. కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వ వైఫల్యాలతో పాటు మోదీ పాలనలో జరుగుతున్న పరిణామాలు, జాతీయ అంశాలను కీలకంగా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో సత్తా చాటితే భవిష్యత్లో ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభావం చూపే అవకాశం ఉంది. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరిలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనకు లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేశారు. అయితే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ఉన్నాయి. నువ్వానేనా అన్నట్టు రెండు జాతీయ పార్టీల మధ్య రాజకీయం నడిచే అవకాశం ఉంది. 2016 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పశ్చిమ బెంగాల్: 294 స్థానాలు ►టీఎంసీ- 211 ►వామపక్షాలు- 79 ►బీజేపీ-3 ►ఇతరులు-1 పుదుచ్చేరి: 30 స్థానాలు ►ఏఐఎన్ఆర్సీ-8 ►కాంగ్రెస్-17 ►ఏడీఎంకే-4 ►ఇతరులు-1 అసోం: 126 స్థానాలు ►కాంగ్రెస్- 26 ►బీజేపీ+: 86 ►ఏఐడీయూఎఫ్-13 ►ఇతరులు-1 తమిళనాడు: 234 ►ఏడీఎంకే- 136 ►డీఎంకే+: 98 కేరళ: 140 స్థానాలు ►ఎల్డీఎఫ్: 91 ►యూడీఎఫ్: 47 ►బీజేపీ:1 ►ఇతరులు: 1 -
రౌండప్ 2020: కమ్మేసిన కాషాయం
నేతల మధ్య విమర్శలు, వివాదాలు. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు. ప్రత్యర్థిని మట్టికరిపించేందుకు ఎత్తుకు పై ఎత్తులు. రాజకీయ చదరంగంలో చాణిక్యుడిని మించేలా ఒకరికిమించి మరొకరి వ్యూహరచనలు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ వరకు అధికార విపక్షాల మధ్య పేలిన మాటాల తూటాలు. ఓవైపు దేశంలో కరోనా వైరస్ విజృంభణకు దేశ ప్రజలకు చిగురుటాకులా వణికినా.. నేతల పుట్టించిన రాజకీయ వేడి మాత్రం అంతాఇంతా కాదు. సవాళ్లుకు ప్రతి సవాలు విసురుతూ.. ఏడాది ఆసాంతం రాజకీయాన్ని రక్తికట్టించారు. 2020 ఏడాది దేశ రాజకీయ రంగంలో సంచలన మార్పులకు కేంద్రబిందువైంది. ఉత్తరాన వికసించిన కమళం.. దక్షిణాదికి పాకేందుకు బాటలు వేసింది. ఆరేళ్లుగా ఓటమి ఎరుగని కారు పార్టీకి కాషాయదళం ముచ్చెమటలు పట్టించింది. దుబ్బాక దంగల్.. కారు జోరుకు బ్రేకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికార టీఆర్ఎస్ తొలి ఎదురుదెబ్బ తగిలింది. స్వరాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేజిక్కించుకన్న టీఆర్ఎస్కు.. దుబ్బాక దంగల్లో ఊహించని పరాజయం ఎదురైంది. గులాబీ కోటలో కమలం వికసించింది. ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డి తలపడ్డ దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. క్షణక్షణానికి ఆధిక్యం మారుతూ.. విజయం బీజేపీ, టీఆర్ఎస్లతో ఆఖరి వరకు దోబూచులాడింది. తీవ్ర ఉత్కంఠను రేపిన పోరులో చివరకు కాషాయదళ అభ్యర్థి మాధవనేని రఘునందన్రావు 1,079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి గులాబీ దళానికి కంచుకోటగా ఉన్న దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు 63,352 ఓట్లు , టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 62,273 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 22,196 ఓట్లు వచ్చాయి. గ్రేటర్లో వికసించిన కమళం.. ఈ ఏడాది డిసెంబర్ తొలివారంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించాయి. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ భారీ ఎదురుదెబ్బ తగలగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ముఖ్యంగా ఎవరి ఊహలకు అందని విధంగా బీజేపీ 47 స్థానాల్లో జెండా పాతింది. టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తామే ప్రత్నామ్నాయమని సవాలు విసిరింది. ఈ ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాతబస్తీపై మరోసారి పతంగి ఎగిరింది. 2016లో గెలిచిన 44 సీట్లను తిరిగి దక్కించుకొని మేయర్ పీఠం సాధనలో కీలకంగా మారింది. అసద్ వ్యూహరచన.. అక్బర్ వాడి వేడి ప్రసంగాలతో మైనార్టీ ఓటు బ్యాంకును తమవైపే నిలుపుకొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ మట్టికరిచింది. ఆ పార్టీ కేవలం రెండింటితో సరిపెట్టుకుంది. టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ పోరులో పోటీపడలేక చతికిలపడింది. టీడీపీని వెంటాడుతున్న కష్టాలు... గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా పరాజయం పాలైన టీడీపీకి ఈ ఏడాది (2020) కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆ పార్టీకి చెందిన చాలామంది సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడుకు దూరం అయ్యారు. బాబు నాయకత్వంపై బహిరంగ విమర్శలు చేస్తూ పలువురు సీనియర్ నేతలు అధికార వైఎస్సార్సీపీలో చేరారు. మరికొంత మంది మాత్రం ఏ పార్టీలోనూ చేరకుండా టీడీపీకి దూరంగా ఉన్నారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కి మూలిగి తెచ్చుకున్న 23 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చంద్రబాబుకు తలకు మించిన భారంగా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యే సైతం ఆకర్శితులై ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు సైతం చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపించి... అధికారపక్షం వైపు నిలుచున్నారు. అంతేకాకుండా కరోనా సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కనీసం పట్టించుకోకుండా పూర్తిగా హైదరాబాద్కే పరిమితమైన టీడీపీ నేతకు ఆ పార్టీ కార్యకర్తలు సైతం మిగలకుండా పోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలో చేరారు. మొత్తానికి 2020లో టీడీపీ పెద్ద నష్టాన్నే చేకూర్చింది. రంగుమారిన పవన్ రాజకీయం.. రాజకీయాల్లో మార్పు అనే నినాదంతో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ టాప్ హీరో పవన్ కళ్యాణ్.. బొక్క బోర్లా పడ్డారు. ఇప్పటికే అనేక పార్టీలతో పొత్తు పెట్టుకున్న పవన్ ఈ ఏడాది కొత్త భాగస్వామ్య పక్షాన్ని ఎంచుకున్నారు. జనసేన ఆవిర్భావం సమయంలో ప్రకటించిన సిద్దాంతాలకు విరుద్ధంగా బీజేపీతో జట్టుకడుతున్నట్లు ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. రానున్న అన్ని ఎన్నిల్లోనూ ఇరు పార్టీలు కలిసి పనిచేస్తాయని బీజేపీ-జనసేన నేతలు ఉమ్మడి సమావేశం ద్వారా వెల్లడించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించిన పవన్ ఆ తరువాత కొంత కాలానికే చంద్రబాబు నాయుడుతో విభేదించారు. అనంతరం 2019 ఎన్నికల్లో వామపక్షాలతో జట్టుకట్టారు. ఈ ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల ఘోర ఓటమి చవిచూడటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒకే ఒక్కస్థానంలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే రూటుమార్చక తప్పదని భావించిన పవన్ కాషాయ పార్టీతో జట్టుకట్టారు. ఈ పరిణామం సొంత పార్టీ కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొత్తానికి 2020లో బీజేపీతో కలిసి తన రాజకీయ భవిష్యత్కు మార్పుకు పవన్ శ్రీకారం చుట్టారు. భాగ్యనగర్లో బీజేపీ విస్తరణ.. కీలక నేతలు చేరిక ఉత్తరాన వికసించిన కమళం.. దక్షిణాదిపై కన్నేసింది. హస్తిన నుంచి బయలుదేరి కర్ణాటకలో పాగా వేసిన కమళనాథులు హైదరాబాద్పై గురిపెట్టారు. గత పార్లమెంట్ ఎన్నికలు నింపిన జోష్ను కొనసాగిస్తూ దుబ్బాక మీదుగా హైదరాబాద్ గడ్డపై కాలుమోపారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిచిన బీజేపీ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.అంతేకాకుండా కేవలం 15 రోజుల వ్యవధిలోనే జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీకి.. ఈ ఏడాది అన్నీ అనుకుల పరిణామాలే ఎదురైయ్యాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు చేప్టటిన అనంతరం దూకుడుగా వ్యహరిస్తూ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్నారు. నితీష్ విజయం.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా తేజస్వీ సూపర్ ఓవర్ వరకు సాగిన ఉత్కంఠభరిత టీ 20 మ్యాచ్ లాంటి బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో చివరకు అధికార ఎన్డీయే విన్నింగ్ షాట్ కొట్టింది. చివరి ఓవర్ వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ నేతృత్వంలోని మహా కూటమి విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, 124 సీట్లతో బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రానుంది. అయితే, అత్యధిక స్థానాలు గెలుచుకుని ‘పార్టీ ఆఫ్ ది మ్యాచ్’ గా ఆర్జేడీ నిలిచింది. ఆ పార్టీ అత్యధికంగా 76 స్థానాలు గెలుచుకుంది. రెండో స్థానంలో 73 సీట్లతో బీజేపీ నిలిచింది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది. విపక్ష మహా కూటమిలో ఆర్జేడీ 76, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలు 16 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా మహా కూటమికి 111 స్థానాలు వచ్చాయి. ఎంఐఎం 5, ఇండిపెండెంట్ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. విజయం మహా కూటమిదేనని, కాబోయే ముఖ్యమంత్రి తేజస్వీ యాదవేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటి అంచనాను తలక్రిందులు చేస్తూ ఎన్డీయే విజయం సాధించింది. ఎన్డీయే తరుఫున నితీష్ కుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సింధియా కలకలం.. కుప్పకూలిన కమల్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జోతిరాధిత్య సింధియా ఆ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరడం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆయనతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడటంతో కమల్నాథ్ సర్కార్ పడిపోయింది. అనంతరం శాసనసభలో సంఖ్యాబలం పూర్తిగా తగ్గిపోవడంతో బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన సీఎం బాధ్యతలు స్వీకరించడం ఇది నాలుగో సారి. మొత్తం 230 మంది సభ్యులు ఉన్న మధ్యప్రదేశ్లో బీజేపీకి తొలుత 107 మంది సభ్యుల బలం ఉండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా అనంతరం ఆ పార్టీకి కేవలం 92 మంది సభ్యుల బలం మాత్రమే మిగిలింది. దీంతో సభ బలం 206కు తగ్గగా, మెజారిటీ 104కు పడిపోయింది. దీంతో బీజేపీకి ఎవరి అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల బలం వచ్చింది. సింధియా రాజీనామా అనంతరం జరిగిన పలు పరిణామాల నేపథ్యంలో కమల్నాథ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ సీఎం పీఠాన్ని చేరడానికి మార్గం సుగమమైంది. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని సాధించి ప్రభుత్వాన్ని సురక్షితంగా నిలబెట్టుకుంది. రాజస్తాన్ సంక్షోభం.. సచిన్ పైలట్ తిరుగుబాటు ఎడారి రాష్ట్రం రాజస్తాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం దేశ వ్యాప్తంగా ఈ ఏడాది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీ కీలక నేత సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్తో విభేదించి.. ఏకంగా 18 ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఈ వ్యవహారం.. కోర్టుల వరకు చేరింది. చివరికి సుదీర్ఘ చర్చల అనంతరం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బుజ్జగించడంతో సచిన్ వెనక్కి వచ్చారు. ఓ సమయంలో మధ్యప్రదేశ్లో మాదిరీగానే రాజస్తాన్లో కాంగ్రస్ ప్రభుత్వం పడిపోతుందని పెద్ద ఎత్తున వార్తలు వాచ్చాయి. కానీ సీనియర్ నేతలు రంగంలోకి దిగి.. తిరుగుబాటు నేతల్ని వెనక్కి తీసుకురావడంతో గహ్లోత్ ఊపిరిపీల్చుకున్నారు. దేవుడు శాసించాడు అరుణాచల్ పాటించాడు.. తమిళనాట మార్పుకు సమయం ఆసన్నమైందని ప్రకటించిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది అభిమాలను తీవ్ర నిరాశకు గురిచేశారు. దేవుడు శాసిస్తాడు ఈ అరుణాచల్ పాటిస్తాడు అంటూ ఇకపై తాను రాజకీయ రంగ ప్రవేశం చేయలేనంటూ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన చేస్తానని తొలుత ప్రకటించిన రజనీకాంత్ ఆ తరువాత అనారోగ్య సమస్యలకు గురికావడంతో వెనకడుగు వేశారు. మరోవైపు రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో స్టార్ నటుడు కమల్ హాసన్ సిద్ధమయ్యారు. రజనీతో కలిసి పనిచేయాలని భావించిన అతనికి తలైవా ప్రకటనతో ఏడాది చివరన నిరాశే మిగిలింది. కేరళ ‘స్థానికం’లో ఎల్డీఎఫ్ జయకేతనం కేరళలో సీపీఎం నేతృత్వంలోని అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేసింది. గ్రామ పంచాయతీ, బ్లాక్ పంచాయతీల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మంచి విజయం సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఫ్) మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో సానుకూల ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్ పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 86 మున్సిపాల్టీలు, 6 కార్పొరేషన్లకు డిసెంబర్ 8, 10, 14వ తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి కశ్మీర్లో వికసించిన కమళం జమ్మూకశ్మీర్కు స్వయంప్రతిపత్తి తొలగించి.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత మొదటిసారిగా అక్కడ ఎన్నికలు జరిగాయి. జమ్మూ కశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్కు జరిగిన ఎన్నికల ఫలితాలు ఎన్నికల కమిషన్ డిసెంబర్ 23న వెల్లడించింది. మొత్తం 20 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 14 చొప్పున 280 సీట్లకు 8 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పీఏజీడీ(గుప్కార్ కూటమి) 110 స్థానాల్లో గెలుపొంది అగ్రస్థానంలో నిలిచింది. 75 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచిన సింగిల్ పార్టీగా అవతరించింది. ఫలితాలపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 370 రద్దుకు కశ్మీర్ ప్రజలు మద్దతు తెలిపారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ట్రంప్ ఓటమి.. కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ప్రభావం చూపిన అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఉత్కంఠ బరితంగా సాగిన అధ్యక్ష పోరులో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు.538 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజీలో 306 ఓట్లతో బైడెన్ ముందంజలో నిలబడగా, ట్రంప్కి 232 ఓట్లు వచ్చాయి. అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారతీయ మూలాలున్న కమలా హ్యారీస్ విజయం సాధించారు. ఫలితాలపై కోర్టును ఆశ్రయించిన ట్రంప్ అక్కడ కూడా ఎదురుదెబ్బ తగలడంతో ఓటమిని అంగీకరించక తప్పలేదు. జనవరి 20న అమెరికాలో కొత్త ప్రభుత్వం కోలువుదీరనుంది. అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో జరిగిన ఈ ఎన్నికలు చరిత్రలో ఎన్నడూలేనంతగా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్శించాయి. రెండోసారి ప్రధానిగా జెసిండా అర్డెర్న్ న్యూజిలాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార లిబరల్ లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. లెక్కించిన ఓట్లలో లేబర్ పార్టీకి దాదాపు 49 శాతం ఓట్లు లభించగా, ప్రధాన ప్రతిపక్షం నేషనల్ పార్టీకి 27 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ప్రస్తుత ప్రధాని జెసిండా అర్డెర్న్ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. న్యూజిలాండ్ ఎన్నికల్లో ఒక పార్టీకి ఇంతలా ఘనవిజయం దక్కడం దాదాపు ఐదు దశాబ్దాల్లో ఇదే తొలిసారని జెసిండా వ్యాఖ్యానించారు. ఆ దేశంలో ప్రపోర్షనల్ ఓటింగ్ విధానం ఉంది. ఈ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఒక పార్టీకే పూర్తి మెజార్టీ రావడం ఇదే తొలిసారి.న్యూజిలాండ్లో ఎన్నికల ప్రచారం ఆరంభమైన్పటినుంచే జెసిండా హవా పూర్తిగా కొనసాగుతూ వచ్చింది. ఆమె ఎక్కడ ప్రచారానికి వెళ్లినా జననీరాజనాలు కనిపించాయి. ముఖ్యంగా దేశాన్ని కరోనా రహితంగా మార్చడంలో ఆమె కృషికి ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. 2017లో సంకీర్ణ ప్రభుత్వానికి సారధిగా జెసిండా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో గతేడాది జరిగిన మసీదులపై దాడుల వేళ ఆమె సమర్ధవంతంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. -
ఈ ప్రజా తీర్పు మత దురభిమాన సంకేతమేనా?
సందర్భం ప్రజాస్వామ్యం అంటే ఒక పెద్ద ఎన్నిక మాత్రమే అని సూత్రీకరించడం కష్టం. అది ప్రతి రోజూ లక్షలాది, కోట్లాది ప్రజాస్వామిక ప్రక్రియలకు, ప్రతీ నిత్యం జరిగే సూక్ష్మ ఘర్షణలకు సంబంధించినది. ప్రజాస్వామ్యంలో ఈ సూక్ష్మాతిసూక్ష్మ ఘర్షణలు నిత్యం జరుగుతూంటాయి. జరుగుతూనే ఉండాలి కూడా. ఈ కోణంలో చూస్తే, మనలో చాలామందికి 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు దేశాన్ని, ప్రజలను అంధకారంలోకి నెట్టివేయనున్నట్లుగా కనిపిస్తుండవచ్చు. 2014 వేసవిలో కూడా చాలామంది ఇదేరకమైన అభిప్రాయాన్ని కలిగి ఉండేవారు. కానీ 2019 వేసవి ఒక అధికారాన్ని సుస్థిరపరిచిందని, దాన్ని తిరగతోడటం ఇక సాధ్యం కాదని పెరుగుతున్న భయాందోళనలను తోసిపుచ్చలేం. నరేంద్రమోదీ హయాంలో తొలి ఐదేళ్లు చాలామందికి విధ్వంసకర ఫలితాలను అందించాయి కాబట్టి నేటి ఫలితాలు వీరిని మరింత నిరాశలోని నెట్టవచ్చు. కానీ ఇలాంటివారే మోదీని తిరిగి ఎన్నుకున్నారు. ఈ ఫలితాలను మనం అంగీకరించితీరాలి. అన్ని నివేదికలూ మోదీ అసాధారణ జనాదరణను నిలబెట్టుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పాల్గొన్న ఓటర్లు చాలామంది గత అయిదేళ్ల పాలనలో తమకేమీ ఒరగలేదని, ఉద్యోగాలు రాలేదని, పెద్దనోట్ల రద్దు తమను విపరీతంగా దెబ్బతీసిందని భావిస్తున్నప్పటికీ మోదీకి మరొక్క అవకాశం ఇవ్వాలని భావించారు. దాని పర్యవసానమే ఈ అసాధారణ ఫలితం. దేశాన్ని కాపాడగలరని, దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో గర్వించేలా చేశారని దేశానికి భవిష్యత్తులోనూ మంచి చేస్తారని భావించి నందునే జనం ఆయనకు ఓటేశారు. ఒకటి మాత్రం నిజం. ఈ ప్రజాతీర్పును విద్వేష రాజకీయాల, మత దురభిమానాల ప్రతిఫలనంగా తక్కువచేసి మాట్లాడలేం. ఈ ఎన్నికల్లో హిందూ ముస్లిం సమస్యపై కనీవినీ ఎరుగని స్థాయిలో సమాజాన్ని విభజించివేసిన వాస్తవాన్ని మనం తోసిపుచ్చలేం. కానీ ప్రజా మద్దతు స్థాయిని దీని ఆధారంగా వివరించలేం. మోదీని ఆయన ప్రభుత్వాన్ని బలపర్చిన కోట్లాది మంది వ్యక్తుల ఉద్దేశాలకు వక్రభాష్యాలు పలికే హక్కు మనకు లేదు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నిజమైన నేతగా ఆవిర్భవించారని కొంతమంది భావిస్తూ ఉండవచ్చు. కానీ ఓటర్లు, ప్రత్యేకించి హిందీ ప్రాబల్య ప్రాంత ఓటర్లు రాహుల్ని పూర్తిగా తిరస్కరించారు. అంటే దీనర్థం రాహుల్ పోరాడలేదని కాదు. ప్రతిపక్షం మొత్తంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్రమైన దాడి చేసిన మొట్టమొదటి నేత రాహుల్. చివరివరకూ దాన్ని కొనసాగిం చారు. కానీ మోదీ పట్ల ప్రజాదరణ మొగ్గు చూపిన తీరుతో రాహుల్ చెప్పిందీ, చేసింది పూర్తిగా అపరిపక్వతతో కొనసాగినట్లు కనిపించింది. గత ఎన్నికల్లో 44 ఎంపీ స్థానాలు సాధించిన కాంగ్రెస్ ఈ దఫా ఎన్నికల్లో కాస్తంత భిన్నంగా కనిపించలేకపోయింది. తమ శక్తికి, ప్రభావానికి మించిన ప్రచారంలో ఆ పార్టీ మునిగితేలింది. కానీ మోదీ విషయానికి వస్తే ప్రారంభం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. తన ముందున్న మార్గంలో సిద్ధాంతపరంగా, సంస్థాగతంగా తనకు ఎదురుగా నిలబడింది కాంగ్రెస్ పార్టీయేనని, తన విధానాలపై నిర్భీతిగా, రాజీలేని విధంగా పోరాడుతున్నట్లు కనిపించిన ఒకే ఒక వ్యక్తి రాహుల్ గాంధీ అని మోదీ స్పష్టంగా గుర్తించారు. అందుకే ఇప్పటికీ బీజేపీ రాహుల్ను నిర్మాణాత్మకమైన ఆగ్రహంతో వెన్నాడుతోంది. ఎన్నడూ లేనివిధంగా ఈ దఫా ఎన్నికల్లో భావజాలం రీత్యా కాకుండా వ్యక్తిత్వం ఆధారంగా పోరాడుతూ వచ్చారు. తానెంతగానో అభిమానించే అమితాబ్ బచ్చన్ శైలిలో మోదీ తన్ను తాను తీర్చి దిద్దుకున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఒక దశాబ్దం పాటు అమితాబ్ 1 నుంచి 10 వరకు అన్నీ తానై పేరు గాంచారు. ప్రస్తుత వాతావరణంలో మోదీ కూడా భారత రాజకీయాల్లో 1 నుంచి 10 వరకు అన్నీ తానై నిలుస్తున్నారు. చాలామంది 2014 నాటి ఆధిపత్యాన్ని మోదీ ఈసారి చలాయించలేరని భావించారు. కానీ ఆధిపత్యంతో పనిలేకుండానే భారత రాజకీయాలను శాసించే స్థాయిని మోదీ ప్రస్తుతం చేరుకున్నారు. చాలా అంశాల్లో రాహుల్ మోదీకి సరి సమానంగా నిలబడాలని చూశారు కానీ మోదీకి సమీప దూరంలోనే నిలబడిపోయారు. ఈ దఫాకూడా మోదీకే ప్రజలు ఓట్లు వేశారు. కానీ విద్వేష రాజకీయాలకు, మత ఛాందస వాదానికి అనుకూలంగా వారు ఓటేశారని చెప్పడం అసందర్భం అనే చెప్పాలి. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ మత దురభిమాన ప్రచారాన్ని నేను తక్కువ చేసి చెప్పడం లేదు. కానీ, సోషల్ మీడియాలోని విద్వేష శక్తులకంటే ఓటర్లు పరిణతి ప్రదర్శిం చారు. అలాగని ప్రజలు విజ్ఞతతో ఓటు వేయలేదని చెప్పడానికీ లేదు. ప్రజలు ఏం కోరుకున్నారు అని నిర్ణయించడానికి మనం ఎవరం? అలాగే ప్రజలు తప్పు అని మనం ఏ కోణంలోంచి నిర్ధారించగలం? జాతి మానసిక స్థితి ఎలా ఉందో గ్రహించడానికి సర్వేలకేసి పరిశీలించండి. దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఉగ్రవాదం ప్రధానమైందని భారతీ యులు భావిస్తున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యల తీసుకోగల నాయకుడిని వారు కోరుకుంటున్నప్పుడు ప్రజల నిర్ణయం తప్పు ఎలా అవుతుంది? 1980లు, 90లలో పుట్టి పెరిగినవారికి పాకిస్తాన్ ఉగ్రవాద అనుకూల చర్యలతో భారత్ ఎంత గాయపడిందో స్పష్టంగా తెలుసు. అలాంటప్పుడు పాకిస్తాన్కు గట్టి సమాధానం ఇవ్వగల నేత కనబడినప్పుడు ప్రజలు అలాంటి నేతకు మద్దతు ఇవ్వడం తప్పెలా అవుతుంది? ఇకపోతే ముస్లింల విషయం ఏమిటి? మోదీకి ముస్లింల పట్ల ప్రేమ లేదంటే ఆశ్చ ర్యపడాల్సింది లేదు. నిజానికి హిందూ వైభవం పునాదిని కలిగిన బీజేపీకే ఆ భావం లేదు. అలాగే తొలినుంచి ముస్లింలకు కూడా ఆరెస్సెస్ అన్నా, బీజేపీ అన్నా ప్రేమ లేదు. అయితే రాడికల్ రాజకీయాల స్వభావాన్ని చరిత్ర నేపథ్యంలో చూసినట్లయితే ఒకనాటి కరడుగట్టిన ఛాందసవాదులు తదనంతరం కాస్త ఉదారవాదంవైపు మళ్లడం తెలిసిందే. మనదేశంలోనూ ముస్లింల పట్ల అలాంటి మార్పు వస్తుందని ఎదురుచూడాల్సిందే మరి. ముస్లి ఓటు అనేది ఇప్పుడు అసందర్భ విషయంగా మారింది. గత అయిదేళ్లుగా ముస్లింలు ఈ దేశంలో చాలా భయభీతులతో జీవిస్తున్నారన్నది నిజం. అయితే దేశవిభజనానంతర హింసాత్మక పరిస్థితుల్లోనూ వారు జీవించగలిగారు. గత కొన్ని దశాబ్దాలుగా మహానగరాలు, పట్టణాల్లో తమపై జరిగిన దాడుల నేపధ్యంలోనూ వారు జీవించగలిగారు. గత అయిదేళ్ల బీభత్స పరిస్థితుల్లోనూ వారు జీవించగలిగారు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? కానీ, అంబేడ్కర్ ఆనాడు చెప్పినట్లుగా ప్రజల జీవితాల్లో సూక్ష్మాతిసూక్ష్మమైన ఘర్షణలు, పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ఈ దేశంలోని 20 కోట్లమంది ముస్లింలతో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై ఆరెస్సెస్ పునరాలోచించాల్సిన అవసరముంది. ఇన్ని కోట్లమందిని నిషేధించలేం. వీరిని క్యాంపుల్లో పెట్టి నిర్బంధించలేం. హతమార్చలేం. లేక వారు ఈ దేశంనుంచి మాయమైపోరు కూడా. భారతదేశంలోని అయిదింట ఒకవంతు జనాభాను రెండో తరగతి పౌరులుగా ముద్రిస్తూ వారిలో తీరని అసంతృప్తి, అశాంతిలను పెంచి పోషిస్తున్నంత కాలం ఈ దేశం వైభవంతో, సౌభాగ్యంతో ఉంటుందనుకోవడం సందేహమే. ముస్లింలను చిన్న చూపు చూసే రాజకీయాల్లో దేశభక్తి ఉండదు పైగా అవి జాతీయవాద వ్యతిరేకమైనవి కూడా. భారత్ అభివృద్ధి చెందాలని నిజంగా కోరుకుంటున్న భారత భక్తాదులు ఈ విషయాన్ని పదే పదే మననం చేసుకోవాల్సి ఉంది. మహ్మద్ ఫారూఖీ వ్యాసకర్త పాత్రికేయుడు, ‘ది వైర్’ సౌజన్యంతో.. -
మీరు లేని ఎన్ని‘కళా’?
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ఎక్కడో పుట్టారు. ఎక్కడో పెరిగారు.. రాజకీయాల చెట్టు నీడలో కలిశారు.. ఒకే పార్టీలో ఉంటూ కరచాలనం చేసుకున్నారు.. వేర్వేరు పార్టీల్లో కత్తులూ దూసుకున్నారు.. రాజకీయ రణక్షేత్రంలో ఎత్తుకు పై ఎత్తులతో ఓటర్లను ఫిదా చేసింది కొందరైతే, నిండు సభలో కవిత్వపు జల్లులతో పన్నీరులా పలకరించినవారు మరొకరు.. ఎన్నికల సభల్లో హాస్య చతురతతో ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు విసిరి టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు ఫక్కున నవ్వేలా చేసిన నేతలు కొందరైతే.. మహిళలైనా మహారాణుల్లా వెలిగిపోయి సంక్షేమానికి మరో రూపంలా మారింది కొందరు. కాల చక్రంలో గిర్రున అయిదేళ్లు తిరిగిపోయాయ్. జీవిత కాలం చివరి మలుపులో వీడలేమంటూ వీడుకోలంటూ ఒకనాటి రాజకీయ యోధులు ఈసారి ఎన్నికల రణక్షేత్రానికి దూరమయ్యారు. మరణం కొందరినీ, వయోభారం, అనారోగ్యం మరికొందరిని ఈ సార్వత్రిక ఎన్నికలకు దూరం చేశాయి. తమ వ్యక్తిత్వాలతో ఓటర్ల మదిలో మరపురాని తిరిగిరాని గుర్తులను వేసిన రాజకీయ దిగ్గజాలు వాజ్పేయి, కరుణానిధి, జయలలిత, మనోహర్ పరికార్ వంటి నేతలు లేకుండా జరుగుతున్న ఎన్నికలివి. మై డియర్ సర్స్, మేడమ్స్, రాజకీయ ఉద్ధండుల్లారా.. రియల్లీ వి మిస్ యూ.. వాజ్పేయి: జోహారోయి రాజకీయానికి – భావ కవిత్వానికి అవినాభావ సంబంధం ఉందని ఎవరైనా అనుకోగలరా? మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్పేయి సభలోకి అడుగుపెట్టాక ఆ విషయం ప్రపంచానికి తెలిసింది. ఆయన మాటే ఒక మంత్రం.. ఆయన ఉపన్యాసం స్వరరాగ కవితా ప్రవాహం. 12 సార్లు పార్లమెంటేరియన్గా వాజ్పేయి ప్రదర్శించిన రాజనీతిజ్ఞత భావితరాలకు ఆదర్శం. బీజేపీలో వాజ్పేయి దళం ఉంది. అద్వానీ దళం ఉంది అని విపక్షాలు విమర్శిస్తే, వాజ్పేయి ‘నేను దళ్దళ్ (బురద)లో లేను. కానీ బురదలో కమలదళాన్ని వికసింపజేయగలను‘ అంటూ ఎదురుదాడికి దిగిన ఘనత ఆయనది. గత ఏడాది ఆగస్టు 16న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వాజ్పేయి వ్యక్తిత్వం చరిత్ర పుటల్లో ఒక పేజీగా మిగిలిపోయింది. రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీగా పేరు సంపాదించిన ఈ అజాతశత్రువు ఇక లేరని తలచుకుంటే అభిమానుల మనుసులు భారమైపోతాయి. వి మిస్ యూ అటల్జీ అంటూ మౌనంగా రోదిస్తాయి. పురుచ్చితలైవి: సంచలనాలేవీ? ఆమెను చూస్తే అమ్మ గుర్తుకు వస్తుంది. ప్రజల ఆకలి తెలుసుకొని కడుపు నింపే అమ్మ. నడిచొచ్చే సంక్షేమానికి నిలువెత్తు రూపం. కుట్రలు, కుతంత్రాలకు నిలయమైన ద్రవిడ నాట ఉక్కు మహిళ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మరణం ఒక మిస్టరీ. ఆమె సృష్టించారు ఒక హిస్టరీ. రాజకీయాల్లో జయలలిత ప్రభావం, పార్టీపై ఆమె సాధించిన పట్టు ఎంత అంటే 2016లో అనుమానాస్పదంగా జయ మరణించిన తర్వాత ఏఐఏడీఎంకేకి సమర్థుడైన నాయకుడు లేక పార్టీ ‘ఆకులు’ ఆకులుగా విడిపోయి ఛిన్నాభిన్నమైంది. జయ లేకుండా తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో ఆ పార్టీ జయకేతనం ఎగురవేయగలదా అన్న సందేహాలతో ఆమె అనుచరగణం కంటతడి పెడుతున్నారు. కరుణానిధి: జ్ఞాపకాల నిధి ద్రవిడ భాషా ఉద్యమ సూరీడు కరుణానిధి. తమిళ రాజకీయాల్లో ఈయనదీ ఒక చరిత్ర. డీఎంకే పార్టీ అధినేతగానే కాదు, పదునైన మాటలతో ఒక సినీ కవిగా ఆయన వేసిన ముద్ర తిరుగులేనిది. స్నేహానికి ప్రాణమిచ్చే కరుణ మనస్తత్వానికి ఎవరైనా తలవంచి జోహార్ అనాల్సిందే. ప్రాణమిత్రుడు ఎంజీఆర్ తన పక్కనే ఆయనకి ఒక పడక సిద్ధం చేశారేమో మరి వయోభారంతోనే నింగికెగిశారు. నిండు జీవితాన్ని గడిపినప్పటికీ కరుణానిధి ఇక లేరన్న వార్త తమిళ తంబిల మనసుల్లో అగ్నిపర్వతాల్ని బద్దలు చేసింది. అందులోంచి లావా ఎప్పటికీ ఎగజిమ్ముతూనే ఉంటుంది. ఆయన జ్ఞాపకాల కన్నీరు ఉబికి వస్తూనే ఉంటుంది. పారికర్: ఎక్స్ట్రార్డినరీ.. రాజకీయాల్లో అతి సామాన్యుడిగా బతికిన అసామాన్యుడు ఎవరైనా ఉన్నారంటే ఠక్కుమని మనోహర్ పారికర్ పేరు చెప్పొచ్చు. గోవా ముఖ్యమంత్రిగా సైకిల్పై అసెంబ్లీకి వెళ్లగలరు. జనంతో మనోహరంగా కలిసిపోగలరు. రక్షణ మంత్రిగా సరిహద్దుల్ని సమర్థవంతంగా కాపలా కాయగలరు. అత్యంత కష్టపడే మనస్తత్వంతో పొలిటికల్ బరిలో విజేతగా నిలిచిన ఆయన కేన్సర్ వ్యాధిని జయించలేక ఈ ఏడాది మార్చిలో కన్నుమూశారు. మనోహర్ లేకపోవడం నిజంగా బీజేపీకి తీరని లోటే. అడ్వాణీ నుంచి పవార్ వరకు రేసులో లేనివారెందరో.. తన రథయాత్రలతో పెరిగి పెద్దదైన భారతీయ జనతా పార్టీ దేశాన్ని ఏలుతూ కూడా అడ్వాణీని సాధారణ ఓటరుగా మార్చేసింది. 75 ఏళ్ల వయసు దాటిందని సాకుగా చూపించి మురళీ మనోహర్ జోషి వంటి నేతని ఎన్నికలకి దూరం చేసింది. ఎన్నికల్లో మాటల తూటాలు పేల్చే సుష్మా స్వరాజ్ అనారోగ్యం వేధిస్తుంటే తనకు తానుగా ఈ రాజకీయ ప్రహసనం నుంచి తప్పుకున్నారు. దళిత పతాకం మాయావతి తన లక్ష్యమైన మోదీని ఓడించడానికి పోటీకి దూరంగా ఉంటూ ప్రచారానికే పరిమితమయ్యారు.రాజకీయాలను ఓ ఆటాడుకుని, క్రీడల్లోకి రాజకీయాల్ని దట్టించిన మరాఠా యోధుడు శరద్ పవార్ వయోభారం చేతో, వారసుడిని బరిలో నిలపడం వల్లో.. రేసు నుంచి తప్పుకున్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కూడా ఈ స్వార్వత్రిక ఎన్నికల బరిలో లేనని ప్రకటించి అభిమానుల్ని విస్మయానికి గురి చేశారు. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి గంగా ప్రక్షాళన చేయడం కోసం ఎన్నికలనే విడిచి పెట్టేశారు. భారతీయ జీవన వేదమైన గంగానదిని కాపాడుకోవడం కోసం ఆమె ఏడాదిన్నర పాటు యాత్ర చేయనున్నారు. లోక్జనశక్తి నేత రామ్విలాస్ పాశ్వాన్ని అనారోగ్యం వేధిస్తోంది. ఎన్నికల్లో పోటీచేసే శక్తి లేక ఆయన కూడా దూరంగా ఉన్నారు.ఇలా అరుదైన రాజకీయ నేతలు బరిలో లేని ఎన్నికలు ఎందరో అభిమానుల్ని నిరాశపరుస్తున్నాయి. ప్చ్.. అని నిట్టూర్చడం తప్ప ఎవరైనా ఏం చేయగలరు?. -
జాతీయ శక్తిగా వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల అనంతరం ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ స్థాయిలో ప్రబల రాజకీయ శక్తిగా ఆవిర్భవించనున్నారని పలు జాతీయ చానళ్లు స్పష్టం చేస్తున్నాయి. అత్యంత ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించనుందని ఆ చానళ్ల సర్వేల్లో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకు అనుగుణంగానే వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానంపై ఎంతో ఆసక్తికనబరుస్తూ పలు చానళ్లు ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో జగన్ ఎంత కీలక పాత్ర పోషించనున్నారో విశ్లేషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన నేత అనతికాలంలోనే జాతీయస్థాయిలో ఇంతటి గుర్తింపు సాధించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరమైన అంశంగా మారింది. సభలకు భారీగా పోటెత్తుతున్న ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయంతో వైఎస్ జగన్ జాతీయ స్థాయిలో కూడా కీలకపాత్ర పోషించనున్నారని జాతీయ చానళ్లు చెబుతున్నాయి. కేంద్రంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడితే జగన్ రాజకీయ ప్రాధాన్యం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్, కేసీఆర్, మమతా బెనర్జీ తదితరులు జాతీయ స్థాయిలో కీలకంగా మారే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. అందుకు తగ్గట్లుగానే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి జాతీయ చానళ్లు వైఎస్సార్సీపీపై చాలా ఆసక్తి కనబరుస్తున్నాయి. జాతీయ స్థాయిలో వీక్షకుల ఆసక్తికి అనుగుణంగా వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. ఇండియాటుడే చానల్ ‘పొలిటికల్ గ్లాడియేటర్’ పేరుతో వైఎస్ జగన్పై శనివారం రాత్రి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వివిధ దశల్లో ఆయన కనబర్చిన పరిణితి, పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమైన తీరు, ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడం, ఆయనకు తోడుగా వైఎస్ విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచార సరళి తదితర అంశాలను ఆసక్తికరంగా విశ్లేషించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వం, జనాదరణఫై టైమ్స్ నౌ, సీఎన్ఎన్ న్యూస్ 18, ఇండియా టుడే, ఎన్డీటీవీ చానెళ్లు కూడా శనివారం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాయి. దేశంలో ప్రముఖ జర్నలిస్టులుగా గుర్తింపు పొందిన ఎన్డీటీవీకి చెందిన ప్రణయ్రాయ్, ఇండియాటుడేకు చెందిన రాజ్దీప్ సర్దేశాయి, తిరంగా టీవీకి చెందిన బర్కాదత్ టైమ్స్ నౌ చానల్కు చెందిన నావికా కుమార్ తదితరులు ఇప్పటికే వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలను జాతీయ స్థాయిలో ప్రసారం చేయడంతోపాటు ఇంత భారీ ప్రజాదరణతో కూడిన సభలను తాము దేశంలో ఎక్కడా చూడలేదని పేర్కొనడం గమనార్హం. ఏపీతోపాటు దేశ రాజకీయాల్లో జగన్ భవిష్యత్తులో అనుసరించనున్న వైఖరిని తెలుసుకునేందుకు వీరంతా ఆసక్తి కనపరిచారు. మరికొద్ది రోజుల్లో వైఎస్ జగన్ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో పోషించనున్న కీలక పాత్రకు ఇది సంకేతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సర్వే ఏదైనా ఫలితం ఒక్కటే.. ఏపీలో వైఎస్సార్సీపీ తిరుగులేని విజయం సాధించి లోక్సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని తాజాగా ఇండియా టీవీ సర్వేలో వెల్లడైంది. ఆ ఛానల్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల సర్వే ఫలితాలను శనివారం వెల్లడించింది. బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ల తరువాత వైఎస్సార్ సీపీ 18 ఎంపీ సీట్లతో పెద్ద పార్టీగా నిలుస్తుందని ఈ సర్వేలో తేలింది. టీడీపీ 7 ఎంపీ స్థానాలకే పరిమితం కానుంది. దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 275 ఎంపీ సీట్లు, యూపీఏ 147 సీట్లు, ఇతరులు అంతా కలిపి 121 సీట్లలో గెలుపొందే అవకాశాలున్నాయని ఆ ఛానల్æ తెలిపింది. ఏపీకి సంబంధించినంతవరకు అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉందని కొందరు భావిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం స్పష్టంగా వైఎస్సార్సీపీ వైపే మొగ్గు చూపుతున్నారని తేల్చి చెప్పింది. వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టంగా కనిపిస్తోందని తెలిపింది. పలు ఇతర జాతీయ ఛానళ్లు కూడా వైఎస్సార్సీపీ 20 – 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తమ సర్వేల్లో వెల్లడైనట్లు ఇప్పటికే ప్రకటించాయి. -
ఉత్తరాది.. ఏ గాలి వీచేది?
సాక్షి, సెంట్రల్డెస్క్ : బిహార్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పన్నెండు లోక్సభ స్థానాల్లో వివిధ పార్టీలకు చెందిన హేమాహేమీలు హోరాహోరీ తలపడుతున్నారు. మరికొద్ది రోజుల్లో వీరి భవితవ్యం తేలనుంది. హిందీ ప్రాంతంలోని ఈ కీలక నియోజకవర్గాల్లో ఈ బడా నేతలు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులున్నాయంటే.. యూపీ: సూపర్ సిక్స్ అమేథీ: రాహుల్తో స్మృతి ఢీ కాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి అభ్యర్థిని నిలపడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. కిందటి ఎన్నికల్లో ఆమె రాహుల్ చేతిలో ఓడిపోయినా ఈ నియోజకవర్గంలో స్మృతి క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. అనేక సమస్యలపై పోరాడుతూ, నెహ్రూ–గాంధీ వారసుడిపై ఆమె విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. మోదీ ప్రభంజనంలో సైతం బీజేపీకి చిక్కని అమేథీ.. ఈసారైనా ఆ పార్టీ వశమవుతుందా అనేది అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. ఈ స్థానానికి మే 6న పోలింగ్ జరగనుంది. ముజఫర్నగర్: సీటు మారిన అజిత్ రాష్ట్రీయ లోక్దళ్ (ఆరెల్డీ) నేత అజిత్సింగ్ ఈసారి ఇక్కడి నుంచి లోక్సభకు పోటీచేస్తున్నారు. మాజీ ప్రధాని చరణ్సింగ్ కుమారుడు, జాట్ నేత అయిన ఈయన ఈ ఎన్నికల్లో నియోజకవర్గం మారారు. బీజేపీ సిట్టింగ్ సభ్యుడు సంజీవ్ బలియాన్ కూడా జాట్ కులస్తుడే కావడంతో స్థానికంగా ఉన్న పట్టుతో మరోసారి గెలవడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ, బీఎస్పీ, ఆరెల్డీ కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న అజిత్కు జాట్లు, ముస్లింలు, దళితులు కలిసి ఇచ్చే మద్దతును బట్టి ఆయన గెలుపు ఆధారపడి ఉంది. వచ్చే నెల 11న ముజఫర్నగర్ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. బాగ్పత్: వారసుడొచ్చాడు అజిత్సింగ్ కుమారుడు, మథుర మాజీ ఎంపీ జయంత్ చౌధరీ తన కుటుంబానికి కంచుకోట అయిన బాగ్పత్ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ స్థానంలో ఆయన తండ్రి అజిత్ను బీజేపీ టికెట్పై పోటీచేసిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్సింగ్ ఓడించారు. తన గెలుపు ద్వారా కుటుంబ గౌరవం మళ్లీ సంపాదించడానికి జయంత్ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పీ–బీఎస్పీ కూటమి మద్దతు వల్ల జాట్లతోపాటు ముస్లింలు, దళితుల ఓట్లు కూడా పడితే జయంత్ గట్టెక్కుతారు. మారిన పరిస్థితుల్లో సత్యపాల్ విజయం అంత తేలిక కాదు. ఏప్రిల్ 11న ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఆమ్రోహా: ముగ్గురిలో ఎవరు? ఆమ్రోహా ప్రస్తుత ఎంపీ కన్వర్సింగ్ తన్వర్ (బీజేపీ).. ఈసారి బీఎస్పీ అభ్యర్థి దనిష్ అలీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. గతంలో జేడీఎస్ టికెట్పై రాజ్యసభకు ఎన్నికైన దనిష్ 20 శాతానికి పైగా ఉన్న ముస్లింలు, ఇతర సైనీలు, జాట్లు, దళితుల మద్దతుపై ఆశ పెట్టుకున్నారు. బీఎస్పీ మాజీ ఎంపీ రషీద్ అల్వీని కాంగ్రెస్ పోటీకి దింపడంతో త్రిముఖ పోటీ ఏర్పడింది. ముస్లింల ఓట్లు ప్రత్యర్థుల మధ్య చీలిపోతే బీజేపీ అభ్యర్థి గెలిచే వీలుంది. (పోలింగ్: ఏప్రిల్ 18). ఫిరోజాబాద్: దాయాదుల పోరు ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్ కుటుంబసభ్యులిద్దరి మధ్య పోరుకు ఫిరోజాబాద్ స్థానం వేదికైంది. ములాయం తమ్ముడు శివపాల్ కొత్తగా ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ (పీఎస్పీ) స్థాపించి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకు వరుసకు అన్న అయిన ఎస్పీ ఎంపీ రాంగోపాల్యాదవ్ కొడుకు, సిట్టింగ్ ఎంపీ అక్షయ్యాదవ్ (ఎస్పీ) తో ఇక్కడ ఎన్నికల యుద్ధం జరుగుతోంది. పాత తరం ఓటర్లు, ఎస్పీ కార్యకర్తలతో ఉన్న పరిచయాలు, పలుకుబడి ఉన్నప్పటికీ శివపాల్ గెలవకున్నా.. అక్షయ్కు గట్టి పోటీ ఇవ్వగలరు. వచ్చే నెల 23న విజేతలెవరో తేలనుంది. బదాయూన్: ధర్మేంద్ర వర్సెస్ సంఘమిత్ర ఎస్పీ కంచుకోటల్లో ఒకటైన బదాయూన్ను గత ఆరుసార్లుగా ఈ పార్టీ గెలుచుకుంటూనే ఉంది. 15 శాతం ముస్లింలు, 15 శాతం యాదవులున్న ఈ స్థానం ఎస్పీకి అత్యంత అనుకూలమైనది. ములాయం అన్న కొడుకైన ధర్మేంద్ర ప్రస్తుత బదాయూన్ ఎంపీ. ఆయనపై యూపీ మంత్రి స్వామి ప్రసాద్మౌర్యా కూతురు సం ఘమిత్ర బీజేపీ అభ్యర్థిగా దిగడంతో యాదవేతర బీసీల ఓట్లు ధర్మేంద్రకు పడకపోవ చ్చు. మాజీ ఎస్పీ నేత, ఇక్కడి నుంచి నాలుగుసార్లు గెలిచిన సలీం షేర్వానీ కాంగ్రెస్ టికెట్పై పోటీచేస్తున్నారు. (పోలింగ్: ఏప్రిల్ 23). బిహార్: ‘ఫోర్’కాస్ట్ బెగూసరాయ్: తరాల అంతరాలు బిహార్లో హోరాహోరీ పోటీ జరుగుతున్న స్థానాల్లో ఒకటి బెగూసరాయ్. ఇక్కడ కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్ (బీజేపీ)తో విద్యార్థి నేత కన్హయ్యకుమార్ (సీపీఐ) పోటీ పడుతున్నారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమిలో సీపీఐ భాగస్వామి కాకపోవడంతో సీపీఐ గెలుపు అంత తేలిక కాదు. ఒకప్పటి కమ్యూనిస్ట్ కంచుకోట అయిన ఈ స్థానాన్ని భారత లెనిన్గ్రాడ్గా పిలుస్తారు. సింగ్, కుమార్ ఇద్దరూ భూమిహార్ వర్గానికి చెందినవారే. ఈ అగ్రకులం ఓట్లలో చీలిక వస్తే మధ్యలో ఆర్జేడీ అభ్యర్థి తన్వీర్ హసన్కు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. ఏప్రిల్ 29న ఈ లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. జముయీ: బరిలో పాశ్వాన్ కుమారుడు కేంద్రమంత్రి, ఎల్జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్తో స్థానిక పార్టీ ఆర్ఎల్ఎస్పీ అభ్యర్థి భూదేవ్ చౌధరీ తలపడుతున్నారు. చౌధరీ 2009లో జేడీయూ టికెట్పై ఎన్నికయ్యారు. ఆయన ఈసారి విజయానికి దళితులు, బీసీ ఓట్లపై ఆధారపడుతున్నారు. అగ్రవర్ణాలు, దళితుల మద్దతుతో గెలవాలని చిరాగ్ ఆ«శిస్తున్నారు. వచ్చే నెల 11న ఈ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. గయ: జీతన్కు పరీక్ష బీజేపీ కిందటిసారి గెలిచిన గయ స్థానాన్ని ఈసారి పొత్తులో భాగంగా జేడీయూకు కేటాయించింది. హెచ్ఏఎం పార్టీ నేత, మాజీ సీఎం జీతన్రాం మాంఝీ ఈ ఎన్నికల్లో జేడీయూ నేత విజయ్ మాంఝీని ఎదుర్కొంటున్నారు. ఇదే సీటులో 2014లో జీతన్రాం జేడీయూ టికెట్పై పోటీచేసి మూడో స్థానంలో నిలిచారు. అయితే, ఆర్జేడీ కూటమిలో భాగస్వామి కావడంతో ప్రస్తుతం ఆయన బలమైన అభ్యర్థి. ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జేడీయూ అభ్యర్థి విజయ్ మాంఝీ 1996లో ఇక్కడి నుంచి ఎన్నికైన భగవతీ దేవి కుమారుడు. ఏప్రిల్ 11న ఎన్నిక జరగనుంది. పూర్ణియా: పప్పూతో పోటీ అంత ఈజీ కాదు కిందటి ఎన్నికల్లో బలమైన మోదీ గాలిని తట్టుకుని జేడీయూ గెలిచిన రెండు సీట్లలో ఒకటి పూర్ణియా. అప్పుడు బీజేపీ టికెట్పై పోటీచేసిన ఉదయ్సింగ్ అలియాస్ పప్పూసింగ్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మహాగఠ్బంధన్ తరఫున రంగంలోకి దిగారు. ఈ స్థానంలో 50 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ ఓట్లు, 30 శాతం ముస్లిం ఓట్లున్న కారణంగా జేడీయూ సిటింగ్ సభ్యుడు సంతోష్కుమార్ సింగ్ కుష్వాహా ఎదురీదుతున్నారు. కిందటిసారి కుష్వాహాకు పెద్దసంఖ్యలో పడిన ముస్లిం ఓట్లు ఈసారి కాంగ్రెస్కు పడే అవకాశముంది. (పోలింగ్: ఏప్రిల్ 18). ఉత్తరాఖండ్: ఆ రెండూ.. గఢ్వాల్: ఇద్దరి గురి బీసీ ఖండూరీపైనే.. ఉత్తరాఖండ్లోని ఈ స్థానంలో బీజేపీ మాజీ మంత్రి, ఎంపీ బీసీ ఖండూరీ కొడుకు మనీష్ ఖండూరీ కాంగ్రెస్ టికెట్పై పోటీచేస్తుండగా, ఖండూరీ శిష్యుడు తీరథ్సింగ్ రావత్ను బీజేపీ తన అభ్యర్థిగా నిలిపింది. బీజేపీ టికెట్పై ఐదుసార్లు గఢ్వాల్ నుంచి బీసీ ఖండూరీ గెలిచారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆయనకు ఇక్కడ మంచి పలుకుబడి ఉంది. ఆయన కొడుకు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుండటంతో రెండు పార్టీల మధ్య పోటీ కొత్త మలుపు తిరిగింది. ఇద్దరు అభ్యర్థులూ తమకు బీసీ ఖండూరీ ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. ఏప్రిల్ 11న భవితవ్యం తేలనుంది. నైనిటాల్–ఉధంసింగ్ నగర్: ‘రావత్’ రాజ్? ఇక్కడ బీజేపీ తరఫున పోటీచేస్తున్న పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అజయ్ భట్కు కాంగ్రెస్ మాజీ సీఎం హరీశ్ రావత్ నుంచి గట్టి పోటీ ఉంది. ఈ స్థానంలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 2017 ఎన్నికల్లో బీజేపీ 12 గెలుచుకున్నా రాజపుత్ర ఓటర్లలో రావత్కు ఉన్న పలుకుబడి కారణంగా భట్ ఎదురీదుతున్నారు. ఇదే వర్గానికి చెందిన బీజేపీ మాజీ సీఎం బీఎస్ కోషియారీకి టికెట్ ఇవ్వకపోవడంతో రాజపుత్రుల ఓట్లు, బ్రాహ్మణ వర్గానికి చెందిన భట్కు పడకపోవచ్చని అంచనా. వచ్చే నెల 11న ఈ స్థానానికి పోలింగ్ జరగనుంది. -
ఓట్లు పెరిగాయి మరి సీట్లేవీ?
సాక్షి, సెంట్రల్ డెస్క్ : తొట్టతొలి ఎన్నికల నుంచి నేటి వరకూ ప్రతి ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం పెరుగుతూ వస్తోంది. ఓటుహక్కుని వినియోగించుకొంటోన్న స్త్రీల సంఖ్య క్రమేణా పెరుగుతోన్నా, రాజకీయ భాగస్వామ్యం మాత్రం స్త్రీలకు అందనంత దూరంలోనే ఉంది. అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో మాత్రం మహిళలకి సీట్ల కేటాయింపులో కొంత పరిణతి కనపడుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా దీదీ మహిళలకు 41 శాతం సీట్లిచ్చి తాను మహిళా పక్షపాతినని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. శతాబ్దాలుగా రాజకీయాల్లో మహిళలకు వారి వాటా వారికి దక్కని పరిస్థితుల్లో ఈ రెండు ప్రకటనలూ భారత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యానికి పునాదిగా నిలవబోతున్నాయి. మమతా బెనర్జీ, మాయావతి, ప్రియాంకాగాంధీ వాద్రా భారత రాజకీయాల్లో బాగా రాణిస్తోన్న నేటి తరుణంలో కూడా క్షేత్రస్థాయిలో మహిళల నాయకత్వానికి ఆమోదం అంతంతగానే ఉంది. ప్రత్యక్షంగా స్త్రీలకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వకపోవడం ఒకవైపు ఉంటే, మరోవైపు ప్రతి ఎన్నికల్లోనూ స్త్రీల ఓట్ల శాతం మాత్రం పెరుగుతోందని ఇటీవలి ఓ అధ్యయనం వెల్లడించింది. 1962 నుంచీ దేశంలో స్త్రీల ఓట్ల శాతం మొత్తం ఓట్లలో దాదాపు సగభాగంగా ఉన్నా 47 నుంచి 48 శాతమే పోలవుతున్నాయి. పురుషులకన్నా ఓటుహక్కును వినియోగించుకునే స్త్రీల సంఖ్య తక్కువగానే ఉంది. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోంది. 2014లో పోలైన మొత్తం ఓట్లలో మహిళా ఓటర్లు 65 శాతం ఉన్నారు. ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం 1967 నుంచి ఇంత అధికసంఖ్యలో మహిళలు ఓటుహక్కుని వినియోగించుకోవడం ఇదే తొలిసారి. 2014లోనే పురుషుల పోలింగ్ శాతం 67గా ఉంది. జమ్మూ కశ్మీర్లో 2014లో అతి తక్కువగా 48 శాతం మాత్రమే మహిళల ఓట్లు పోలయ్యాయి. నాగాలాండ్, లక్షద్వీప్లో అత్యధికంగా 88 శాతం మహిళల ఓట్లు పోలయ్యాయి. పెరుగుతున్న స్త్రీల ఓటింగ్ శాతం ప్రణయ్రాయ్, దోరబ్ సుపారీవాలా ఇటీవల విడుదల చేసిన పుస్తకంలో పెరిగిన మహిళల ఓట్ల శాతాన్ని నమోదు చేసింది. 2017, 18 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, వచ్చే లోక్సభ ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళల ఓట్ల శాతం పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయ శాంతి సంస్థ కార్నేగీ ఎండోమెంట్ ప్రకారం ఎన్నికల్లో మహిళల భాగస్వామ్యం పెరగడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనవి మహిళల నిర్ణాయకశక్తి, అక్షరాస్యత పెరగడం. భారత ఎన్నికల కమిషన్ సైతం ఎక్కువమంది మహిళలు ఓటుహక్కు వినియోగించుకునేలా అనేక ప్రయత్నాలు చేస్తోంది. మహిళలకు ప్రత్యేక వరుసలు, ప్రత్యేక పోలింగ్ బూత్లు, పింక్ బూత్ల పేరుతో సౌకర్యాలు కల్పిస్తోంది. ఓటూ లేదు.. సీట్లూ లేవు.. 2014లో 65 శాతం మహిళల ఓట్లు పోలైనా.. ఇంకా అధికసంఖ్యలో స్త్రీలు ఓటుహక్కును వినియోగించుకోవడం లేదు. 2011 సెన్సెస్ ప్రకారం దేశంలో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకి 943 మంది మహిళా ఓటర్లున్నారు. 2019 గణాంకాల ప్రకారం ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకి కేవలం 925 మంది మహిళా ఓటర్లే ఉన్నట్టు తేలింది. ఇదే వివక్ష పార్లమెంటులో మహిళల భాగస్వామ్యాన్ని సైతం ప్రతిబింబిస్తోంది. లోక్సభలోని మొత్తం 524 సీట్లలో 66 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అందులో ఎక్కువమంది (32) బీజేపీ నుంచే ఉన్నారు. 1952లో లోక్సభలో మహిళల సంఖ్య 22. 2014 ఎన్నికల నాటికి ఇది 61కి పెరిగింది. ప్రతి పది మంది లోక్సభ సభ్యుల్లో 9 మంది పురుషులుండటం లింగవివక్షకు నిదర్శనం. ప్రపంచ స్థాయిలో చట్టసభల్లో మహిళల సగటు భాగస్వామ్యం 20 శాతం ఉంది. అయితే మన దేశంలో 1952లో 4.4 శాతం ఉండగా, 2014 నాటికి 11 శాతానికి చేరింది. సీట్ల పంపకంలో జాతీయ రాజకీయ పార్టీలు వివక్షను పాటిస్తూనే ఉన్నాయి. మహిళలు గెలవలేరనే భావంతో జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు స్త్రీలకు సీట్లు కేటాయించడం లేదు. అయితే, మహిళలకు సీట్ల కేటాయింపులో కొంతలో కొంత కాంగ్రెస్ ముందుంది. 2004 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 355 మంది మహిళలు పోటీ చేయగా 45 మందే (కాంగ్రెస్–12, బీజేపీ–10, ఇతరులు– 23 మంది) గెలిచారు. 2009 ఎన్నికల్లో 556 మంది పోటీచేయగా 59 మంది (కాంగ్రెస్–23, బీజేపీ–13, ఇతరులు–23) గెలిచారు. 2014 ఎన్నికల్లో 668 మంది మహిళలు పోటీచేయగా 61 మంది (కాంగ్రెస్–4, బీజేపీ–28, ఇతరులు–29) గెలిచారు. -
సీనియర్లకు ‘నమో’ నమః
సాక్షి, సెంట్రల్డెస్క్ : లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 184 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గడ్కరీ వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, సీనియర్ నేతలయిన ఎల్కే ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ వంటి వారికి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేదు. మరి కొందరు సీనియర్ నాయకులు స్వచ్ఛందంగానే ఎన్నికల బరి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. మొత్తమ్మీద చూస్తే పార్టీ నాయకత్వం సీనియర్ నేతలు పలువురిని పక్కకు తప్పించినట్టు తెలుస్తోంది. 75 ఏళ్లు దాటిన వారిని ఎన్నికల్లో నిలబెట్టి వారిని ఇబ్బంది పెట్టవద్దన్న ఆర్ఎస్ఎస్ సూచనను బీజేపీ నాయకత్వం పాటించినట్టు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, బీజేపీకి పెద్దదిక్కుగా, ఆ పార్టీకి జాతీయ గుర్తింపు రావడానికి కారకుడిగా పేరొందిన ఆడ్వాణీని కూడా తప్పించడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు వరసగా గెలిచిన ఆడ్వాణీ స్థానంలో అమిత్ షాను బరిలో దింపింది. కావాలనే పక్కన పెడుతున్నారా? నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత పార్టీలో సీనియర్లను పథకం ప్రకారం పక్కన పెడుతున్నారన్న విమర్శలున్నాయి. వాజ్పేయి హయాంలో అత్యంత గౌరవనీయ స్థానం పొందిన ఆడ్వాణీని మోదీ అసలు పట్టించుకోలేదు. ఎదుట పడినా పలకరించకుండా ముఖం చాటేసిన సందర్భాలున్నాయి. దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా ఉన్న జశ్వంత్సింగ్, యశ్వంత్సింగ్, మురళీ మనోహర్ జోషీ, ఆడ్వాణీ, శాంతకుమార్ వంటి సీనియర్లను మోదీ బోర్డు నుంచి తొలగించారు. వారిని మార్గదర్శక్ మండల్ పేరుతో ఏర్పాటు చేసిన కమిటీలో వేశారు. ఇన్నేళ్లలో ఈ కమిటీ ఒక్కసారీ సమావేశం కాలేదు. దీన్నిబట్టి మోదీ ఉద్దేశపూర్వకంగానే సీనియర్లను పక్కన పెడుతున్నారన్న భావన కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేతల్లో చాలామంది మోదీ పాలనను విమర్శించిన వారే కావడం గమనార్హం. ఇంకొందరు తప్పుకున్నారు.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనని ఆడ్వాణీయే చెప్పినట్టు బీజేపీ నాయకత్వం ప్రచారం చేస్తోంది. అయితే, నాయకత్వం ఆడ్వాణీని టికెట్ విషయంలో సంప్రదించనే లేదని ఆయన కార్యదర్శి చెబుతున్నారు. మరో సీనియర్ నాయకుడు, గతంలో మంత్రిగా పనిచేసిన మురళీ మనోహర్ జోషీ, బండారు దత్తాత్రేయకు కూడా ఈసారి టికెట్ లభించలేదు. అలాగే, సుమిత్ర మహాజన్, కరియ ముండా, శాంతకుమార్, బీజీ ఖండూరి వంటి అనుభవజ్ఞులనూ బీజేపీ ఈ ఎన్నికల్లో పక్కన పెట్టేసింది. కల్రాజ్ మిశ్రా, భగత్సింగ్ కోషియారి ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు స్వచ్ఛందంగా ప్రకటించారు. -
నవీనమా...వికాసమా
సాక్షి, సెంట్రల్డెస్క్ : చీకట్లో మగ్గిన ఒడిశా రాష్ట్రంలో పారిశ్రామిక వెలుగులు నింపిన ప్రజాకర్షక నాయకుడు ఇప్పుడు ఏటికి ఎదురీదుతున్నారా? పందొమ్మిదేళ్లుగా రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న నవీన్ పట్నాయక్ పాలనకు ఇక తెరపడుతుందా? బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోందా? 120 సీట్లు తమ లక్ష్యమని బీజేపీ ప్రకటిస్తే, 123 గెలుస్తామన్న ధీమా నవీన్ది. ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో రాజకీయ ముఖచిత్రం ఎలా ఉండనుంది? అయిదోసారి కూడా నవీనపథంలో ప్రజలు నడుస్తారా? లేదంటే ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపుతారా?.. ఇప్పుడు అందరిలోనూ అదే ఆసక్తి.. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఒడిశా అత్యంత వెనుకబడిన రాష్ట్రం. కొండలు, గుట్టలు, దట్టమైన అడవులున్న ఈ రాష్ట్రంలో ఆదివాసీలే ఎక్కువ. ఎటు చూసినా పేదరికం, ఆకలి కేకలు, ఉద్యోగాల కొరత.. వీటికి తోడు పులి మీద పుట్రలా ఎప్పుడు తుపాన్లు ముంచేస్తాయో తెలియదు. అలాంటి రాష్ట్రానికి ఆపద్బాంధవుడిలా వచ్చారు బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్. 2000 సంవత్సరంలో ఒడిశా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఆయన.. అవినీతి బురదలో కూరుకుపోయిన అధికారులు, రాజకీయ నాయకుల్లో మార్పు తెచ్చారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని పరుగులు తీయించారు. సుపరిపాలన, ప్రజాసేవ, ఇతరుల్ని గౌరవించడమే పార్టీ నినాదాలుగా మార్చుకొని జనంలో పట్టు పెంచుకున్నారు. పేదలకు తక్కువ ధరకే బియ్యం, పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి పక్కా ఇళ్ల నిర్మాణం వంటి పథకాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఒకప్పటి ముఖ్యమంత్రి, ఒడిశా ప్రజల ఆరాధ్య దైవం బిజూ పట్నాయక్ కుమారుడైన నవీన్ పట్నాయక్ తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయలేదు. బొగ్గు, బాక్సైట్, ఉక్కు, ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉండడంతో వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేశారు. మైనింగ్ కార్యకలాపాలతోనే మధ్య తరగతి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. గత అయిదేళ్లలో రాష్ట్ర జీడీపీ సగటున 6.66 శాతం పెరుగుతూ వచ్చింది. ఆదివాసీల జీవన ప్రమాణాలను పెంచడానికి చర్యలు చేపట్టారు. గత ఏడాది దేశవ్యాప్తంగా నెలకొన్న మోదీ ప్రభంజనంలోనూ నవీన్ పట్నాయక్ సొంతంగానే అఖండ మెజార్టీని సొంతం చేసుకున్నారు. 147 అసెంబ్లీ స్థానాలకు 117 కైవసం చేసుకున్నారు. 21 లోక్సభ స్థానాల్లో 20 సీట్లలో విజయకేతనం ఎగురవేశారు. నవీన్కు ఎందుకింత ఆదరణ? సిక్కింలో పవన్కుమార్ చామ్లింగ్, త్రిపురలో మాణిక్ సర్కార్, పశ్చిమ బెంగాల్లో జ్యోతిబసు.. ఒకే రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ముఖ్యమంత్రుల సరసన నవీన్ పట్నాయక్ కూడా చేరారు. నాలుగేళ్లు వరసగా అధికారం దక్కించుకోవడానికి ఎన్నో కారణాలున్నాయి. పెళ్లి చేసుకోకుండా ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేశారని జనం బలంగా నమ్మడం మొదటి కారణం. రెండోది– ప్రతిపక్షాల బలహీనతలు. కాంగ్రెస్ పార్టీలో జేబీ పట్నాయక్ హవా తగ్గిపోయాక నవీన్ పట్నాయక్ను ఢీకొట్టే నాయకుడే కనిపించలేదు. బీజేపీ కూడా ఇప్పటివరకు సమర్థుడైన నాయకుడ్ని తయారు చేయలేకపోయింది. 2008లో ఆదివాసీల అభ్యన్నతి కోసం పనిచేస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన మత ప్రచారకుడు గ్రహం స్టెయిన్స్, ఆయన పిల్లల్ని వీహెచ్పీ కార్యకర్తలు ఖందమాల్లో దారుణంగా హత్య చేశారన్న ఆరోపణతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో అప్పటివరకు ఎన్డీయేతో ఉన్న నవీన్ పట్నాయక్ ఆ కూటమితో తెగదెంపులు చేసుకొని సెక్యులర్ నాయకుడిగా ఎదిగారు. వరదలు, ప్రకృతి వైపరీత్యాల బారిన పడే ఒడిశాలో 2013లో ఫైలాన్ తుపాను సమయంలో ఆయన చూపించిన సన్నద్ధత తీసుకున్న చర్యల్ని ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసించింది. అంతర్గత పోరే ఎసరు పెడుతుందా? నవీన్ పట్నాయక్కు జనంలో ఎంత చరిష్మా ఉన్నా.. సొంత పార్టీలో వ్యతిరేకత ఈసారి బలంగానే కనిపిస్తోంది. రెండో స్థాయి నాయకత్వాన్ని ఎదగనీయకుండా పార్టీని తన గుప్పెట్లో ఉంచుకోవడం మైనస్గా మారింది. గత కొన్నేళ్లలో 36 మంది మంత్రులపై ఏకపక్షంగా వేటు వేశారు. బీజేడీని స్థాపించిన తొలినాళ్లలో నవీన్కు అండదండగా ఉన్నవారినే తొలగించారు. వ్యవస్థాపక సభ్యుడు బిజయ్ మహాపాత్రో, రాజకీయ సలహాదారు పైరిమోహన్ మహాపాత్రో వంటి వారిని చాలా ఏళ్ల క్రితమే పార్టీ నుంచి గెంటేశారు. మూడేళ్లుగా నవీన్ పట్నాయక్ ప్రైవేటు సెక్రటరీ వి.కె.పాండ్యన్ ఆడింది ఆటగా మారింది. పోస్కో స్టీల్ప్లాంట్, మరికొన్ని నేచురల్ ప్రాజెక్టుల చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. పాండ్యన్ రాజ్యాంగేతర శక్తిగా ఎదగడంతో ఎంపీ బలభద్ర మాఝి, ఎమ్మెల్యేలు సుకాంత నాయక్, త్రినాథ్ గొమాంగో పార్టీని వీడారు. బీజేపీ బలం ఎలా పెరుగుతోందంటే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా చాలాకాలంగా ఒడిశాపై దృష్టి పెట్టారు. 120+ సీట్లు లక్ష్యంగా పని చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపరచడానికి షా.. వ్యూహంతో ముందుకెళ్తున్నారు. మోదీ, షా తరచూ ఒడిశాలో పర్యటిస్తున్నారు. 2012లో 36 జిల్లా పరిషత్లను సాధించిన బీజేపీ, గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 297 స్థానాల్లో గెలుపొందింది. ఇది కచ్చితంగా నవీన్ పట్నాయక్ సర్కార్కు డేంజర్ బెల్స్ మోగినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక బలభద్ర మాఝీ వంటి వారి చేరికతో మరింత బలం చేకూరింది. బాలాకోట్ దాడుల తర్వాత ఒడిశాలో జాతీయ భావం బాగా పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్రేజ్ పెరిగింది. ఇవన్నీ బీజేపీకి కలిసొచ్చే అంశాలు. అయితే రాష్ట్ర స్థాయిలో పేరున్న నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి మైనస్గా మారింది. మరోవైపు రాహుల్ గాంధీ కూడా హిందీ రాష్ట్రాల్లో గెలుపొందిన ఆత్మవిశ్వాసంతో ఒడిశాలో పార్టీ బలోపేతానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు. తరచూ ఒడిశా వెళుతూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే బీజేడీ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలు ఆకలి మరణాలు, ఆదివాసీలు ఎక్కువుండే ఈ రాష్ట్రంలో కోటి మంది కరువు ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు నిరుద్యోగం 6.6 శాతానికి చేరుకుంది. 85 లక్షల మంది యువత ఉద్యోగాల్లేక ఖాళీగా ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి వ్యాపారాలన్నీ అగ్రవర్ణాల చేతుల్లోనే ఉండటంతో సామాన్యుల్లో అసంతృప్తి.. ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తం బీజేడీ అనుకూల అంశాలు సీఎం నవీన్ పట్నాయక్పై జనంలో సడలని నమ్మకం 19 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమాలతో పాటు పారిశ్రామిక ప్రగతి మహిళలకు 33 శాతం టికెట్ల కేటాయింపు ప్రతికూల అంశాలు 19 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత బీజేడీ నుంచి నాయకులు పార్టీని వీడడం బీజేపీ అనుకూల అంశాలు క్షేత్ర స్థాయిలో పెరుగుతున్న పట్టు బీజేడీ నుంచి తరలివస్తున్న నాయకగణం పుల్వామా తర్వాత ప్రజల్లో పెరిగిన దేశభక్తి ప్రతికూల అంశాలు సమర్థులైన నాయకుల కొరత నవీన్ పట్నాయక్కు ఉన్న జనాకర్షణ -
గెలుపే లక్ష్యంగా ‘ఎంపి’క
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా కేంద్రంలో ఈసారి కీలకపాత్ర పోషించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దీనికి అనుగుణంగా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకుగాను టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో 11 స్థానాలను గెలుచుకుంది. స్వల్ప తేడాతో 2 స్థానాల్లో ఓటమిపాలైంది. ఈసారి మిత్రపక్షం ఎంఐఎం పోటీ చేసే హైదరాబాద్ మినహా మిగిలిన 16 స్థానాల్లో గెలవాలని టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎక్కువ స్థానా ల్లో సిట్టింగ్లకే టికెట్ ఇవ్వాలని యోచిస్తోంది. గెలుపు ప్రాతిపదికగా అన్ని అంశాలపై సర్వేలు నిర్వహిస్తోంది. అభ్యర్థుల ఖరారులో సర్వే అంశాలే కీలకం కానున్నాయని టీఆర్ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. ► 16 లోక్సభ స్థానాల్లో కచ్చితంగా గెలవాలని పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ పది స్థానాల్లో అభ్యర్థులపై ఇప్పటికే స్పష్టతకు వచ్చింది. 9 స్థానాల్లో సిట్టింగ్లకు మళ్లీ టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మహబూబ్నగర్, నల్లగొండ, భువనగిరి, వరంగల్ లోక్సభ నియోజకవర్గాల్లో సిట్టింగ్లకే అవకాశం ఇవ్వా లని భావిస్తోంది. పెద్దపల్లిలో మాజీ ఎంపీ జి.వివేకానంద పేరు దాదాపుగా ఖాయమైంది. నల్లగొండ సిట్టింగ్ ఎంపీకి రాష్ట్రంలో కీలక పదవి ఇచ్చి ఈ లోక్సభ సెగ్మెంట్లో కొత్త అభ్యర్థిని బరిలో దింపే అవకాశం ఉంది. ► మల్కాజ్గిరి అభ్యర్థి కోసం మర్రి రాజశేఖర్రెడ్డి, కె.నవీన్రావు, బండారి లక్ష్మారెడ్డి పేర్లతో టీఆర్ఎస్ సర్వేలు నిర్వహిస్తోంది. సామాజిక సమీకరణలు, గెలుపు అవకాశాల ప్రాతిపదికగా అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ► సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని గెలుచుకుంటేనే టీఆర్ఎస్ విజయం పరిపూర్ణమవుతుం దని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. తలసాని సాయికిరణ్యాదవ్, బొంతు శ్రీదేవియాదవ్, దండె విఠల్ ఇక్కడ టీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ అధిష్టా నం వీరి పేర్లతో సర్వేలు నిర్వహించింది. ► చేవెళ్లలో టీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. జి.రంజిత్రెడ్డి, మాజీమం త్రి పట్నం మహేందర్రెడ్డి, శాసనమండలి చైర్మన్ వి.స్వామిగౌడ్ పేర్లతో ఇక్కడ సర్వేలు నిర్వహించింది. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి కుమారుడు పి.కార్తీక్రెడ్డి పేరును కూడా ఈ స్థానానికి టీఆర్ఎస్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ► ఖమ్మం లోక్సభ ఎన్నికలతో ఈ జిల్లాలో పట్టు నిలుపుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నా రు. సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్రావును అభ్యర్థులుగా పరిశీలిస్తున్నారు. సర్వే నివేదికల ఆధారంగా టికెట్ కేటాయించనున్నారు. ► మహబూబాబాద్ పరిధిలోని ఏడింటిలో 3 స్థానాల్లో టీఆర్ఎస్, నాలుగింట కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. సిట్టింగ్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు మాలోతు కవిత, సత్యవతి రాథోడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామచంద్రునాయక్ పేర్లతో సర్వేలు నిర్వహించారు. సత్యవతిరాథోడ్కు ఇటీవలే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మిగిలిన ముగ్గురిలో ఒకరికి అభ్యర్థిత్వం దక్కే అవకాశం కనిపిస్తోంది. ► గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో దక్కకుండా పోయిన నాగర్కర్నూల్ స్థానంలో గెలుపుపై టీఆర్ఎస్ ఈసారి ధీమాగా ఉంది. మాజీ మంత్రి పి.రాములు, గాయకుడు సాయిచంద్, మాజీ ఎంపీ మందా జగన్నాథం ఇక్కడ అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. -
లోక్సభ బాధ్యత మీదే!
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. రాష్ట్రంలో 16 లోక్సభ స్థానాల్లో గెలుపునకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఇప్పటికే వ్యూహం సిద్ధం చేశారు. టీఆర్ఎస్ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసేలా ప్రతి లోక్సభ సెగ్మెంట్లో సన్నాహక సమావేశాలు మొద లయ్యాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఆధ్వర్యంలో ఈ సదస్సులు జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు, నాయకులను ఎన్నికలకు సిద్ధం చేయడంతోపాటు లోక్సభ నియోజకవర్గాల వారీగా ఎన్నికల వ్యూహం అమలుపై కేసీఆర్ పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. మంత్రులకు లోక్సభ నియోజకవర్గాల వారీగా ప్రచార వ్యూహం అమలు బాధ్యతలను అప్పగించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశాల్లో ఈ మేరకు అందరికీ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజులుగా తనను కలిసిన మంత్రులకు ఒక్కొక్కరికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలను మంత్రులకు అప్పగిస్తున్నారు. నలుగురు మంత్రులకు ఏకంగా రెండు లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మంత్రివర్గంలో స్వయంగా కేసీఆరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో మెదక్ లోక్సభ నియోజకవర్గ ప్రచార వ్యూహాన్ని ముఖ్య మంత్రే పర్యవేక్షించనున్నట్లు తెలిసింది. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు తీవ్రమైన ప్రతికూల ఫలితాలొచ్చాయి. పది అసెంబ్లీ స్థానాల్లో ఒక్క నియోజకవర్గంలోనే గెలిచింది. 16 ఎంపీ సీట్లను కచ్చితంగా గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్న కేసీఆర్ ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ విషయంలో ప్రత్యేక వ్యూహం రూపొందించారు. ఖమ్మం లోక్సభ ఎన్నికల వ్యూహం అమలు బాధ్యతను కూడా ఆయనే స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయించారు. మంత్రులు గుంతకండ్ల జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, చామకూర మల్లారెడ్డికి రెండు చొప్పున లోక్సభ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. మిగిలిన మంత్రులకు వారి ఉమ్మడి జిల్లాల పరిధిలోని లోక్సభ సెగ్మెంట్లకు ఇన్చార్జి అప్పగించారు. అన్నీ వారే... అలాగే ప్రతి లోక్సభ సెగ్మెంట్కు మంత్రితోపాటు టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇన్చార్జీలుగా ఉండనున్నారు. లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఆయా సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు బాధ్యులుగా ఉంటారు. అలాగే ప్రతి లోక్సభ సెగ్మెంట్కు ఇద్దరు లేదా ముగ్గురు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శులకు సమన్వయ బాధ్యతలను అప్పగించారు. కేటీఆర్ ఆధ్వర్యంలో వీరంతా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయనున్నారు. కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వ్యూహం, ప్రచార అంశాలను పర్యవేక్షించనున్నారు. మండలాలు, గ్రామాల వారీగా ఎప్పటికప్పుడు పార్టీల బలాబలాలను అంచనా వేసేలా టీఆర్ఎస్ వ్యవస్థను సిద్ధం చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల సన్నాహక సదస్సులు ముగియగానే రెండోదశలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచార వ్యూహం అమలు చేసేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. లోక్సభ ఎన్నికల బాధ్యులు... వరంగల్, మహబూబాబాద్: ఎర్రబెల్లి దయాకర్రావు చేవెళ్ల, మల్కాజ్గిరి: చామకూర మల్లారెడ్డి నల్లగొండ, భువనగిరి: జగదీశ్రెడ్డి నిజామాబాద్, జహీరాబాద్: వేముల ప్రశాంత్రెడ్డి ఆదిలాబాద్: ఇంద్రకరణ్రెడ్డి పెద్దపల్లి: కొప్పుల ఈశ్వర్ కరీంనగర్: ఈటల రాజేందర్ సికింద్రాబాద్: తలసాని శ్రీనివాస్యాదవ్ మహబూబ్నగర్: శ్రీనివాస్గౌడ్ నాగర్కర్నూల్: సింగిరెడ్డి నిరంజన్రెడ్డి -
ఏకపక్షానికి ‘ఎదురుగాలి’
పన్నెండు నెలలు.. కేవలం పన్నెండు నెలలు భారత రాజకీయ చరిత్రనే తిరగరాశాయి. ఈ ఏడాది వేసవిలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో నిజమైన పోటీని మనం చూడబోతున్నాం. 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరాటంతో నరేంద్రమోదీ, అమిత్షా ద్వయాన్ని కలవరపర్చిన రాహుల్ గాంధీ కాంగ్రెస్కు కొత్త ఊపిరి పోశారు.మూడు కీలకమైన హిందీ ప్రాబల్య రాష్ట్రాల్లో బీజేపీని చావు దెబ్బ తీయడం ద్వారా మోదీ, షా వ్యూహాలకు రాహుల్ తొలి సవాలు విసిరారు. బీజేపీ రూపంలో ఏకధ్రువ పాలన తప్పదన్న పరిస్థితిని మార్చి రెండో ధ్రువంగా కాంగ్రెస్ను నిలిపిన రాహుల్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీని ఏమాత్రం ఢీకొనగలరనేది అసలు ప్రశ్న. చాలామంది రాజకీయ విశ్లేషకులు 2017 శీతాకాలం వరకు మూడు అంశాలలో ఏకాభిప్రాయంతో ఉండేవారు: అవేమిటంటే, నరేంద్ర మోదీ రెండో దఫా అధికారంలోకి రావడం ఖాయం; రాహుల్ గాంధీకి, ఆయన నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి తుది పతనం తప్పదు; ఇందిరాగాంధీ హయాం ముగిసిన చాలాకాలం తర్వాత భారత్ సుదీర్ఘకాలం పాటు ఏక పార్టీ పాలన, ఏకధ్రువ పాలన వైపుగా నడుస్తోంది. ఈ మూడు అంశాలకు దన్నుగా, ఉత్తరప్రదేశ్లో పొందిన భారీ విజయంతో దేశంలోని 21 రాష్ట్రాలు బీజేపీ ఏలుబడిలోకి వచ్చాయి. మోదీ ప్రభుత్వ పాలనలో మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లోనూ, 2019లో జరిగే అతిపెద్ద పరీక్షలోనూ సంభవించనున్న ఫలితాలకు తగిన భూమికను ఇవి నిర్దేశించినట్లే కనిపించింది. అయితే 2017 డిసెంబర్ మధ్యనాటికి పరిస్థితిలో ఏదో మార్పు వచ్చింది. అవును.. గుజరాత్లో వరుసగా ఆరోసారి కూడా బీజేపీ గణనీయ విజయం సాధించింది. కానీ ఎవరూ ఊహించని విధంగా తీవ్రమైన పోటీ నెలకొంది. నరేంద్రమోదీ, అమిత్ షాలు తమ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రదర్శించిన ఆందోళనలు గుజరాత్ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి కూడా. గుజరాత్ ఎన్నికలు జరిగిన కొద్ది కాలంలోనే జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని అటు విజయమూ, ఇటు ఉపశమనమూ కలగలిసిన భంగిమతో కన్నీళ్లు కార్చారు కూడా. ఆ సన్నివేశం గుజరాత్ ఎన్నికలు ఎంత పోటాపోటీగా జరిగాయో తేల్చి చెప్పింది. దీంతో మోదీషా రాజకీయాల్లో ఇది మౌలిక మార్పును తీసుకొస్తుందని అప్పట్లే రాజకీయ వ్యాఖ్యాతలు రాశారు కూడా. అంతవరకు అభివృద్ధి, ఉద్యోగాల కల్పన గురించి ఆలోచించకుండా వీరు హిందుత్వ, కరడుగట్టిన జాతీయవాదం, సంక్షేమవాదం, అవినీతిని నిర్మూలించే భారీ స్థాయి ప్రచారంలో తలమునకలై ఉండేవారు. అలాంటి సమయంలో సరైన పిలుపునే ఇచ్చామని మేం ఒకరకంగా సంతృప్తి చెందాం కూడా. అయితే గుజరాత్ ఎన్నికలు ఏమంత ముఖ్యమైన మార్పుగా కనిపించలేదు. కానీ దాని ప్రభావాన్ని అంచనా వేయడంలో రాజకీయ వ్యాఖ్యాతలుగా మేం విఫలమయ్యాం. భారత రాజకీయాలు తదుపరి 12 నెలల్లో దాని ఏకధ్రువ పరిస్థితిని కోల్పోనున్నాయన్న విషయాన్ని 2017 డిసెంబర్18న ఎవరూ పెద్దగా ఊహించలేకపోయారు. కానీ ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఒక టీవీ చానల్ కార్యక్రమంలో ఆ చానల్ యాంకర్ నవికా కుమార్కు, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్కి మధ్య జరిగిన సంవాదం మన రాజకీయాలు ఎంత ఏకధ్రువ స్వభావాన్ని సంతరించుకున్నాయో స్పష్టంగా తెలిపింది. కర్ణాటక ఎన్నికలో అధికారం చేజిక్కించుకోవడానికి తగిన సంఖ్యను సాధించలేకపోతే, బీజేపీ ఏం చేయగలదని ఆ టీవీ యాంకర్ ప్రశ్నించారు. దానికి పాలక పార్టీలో అత్యంత శక్తిమంతుడైన రామ్ మాధవ్, ‘అయితే ఏంటి, మాకు అమిత్ షా ఉన్నారు’ అని సమాధానమిచ్చారు. అది సొంత డబ్బా మాత్రం కాదు. బీజేపీకి తగినన్ని స్థానాలు రాకపోతే గెలిచిన మిగిలిన పార్టీల సభ్యులను బీజేపీలోకి ఆకర్షిస్తాం అనే ధీమాను రామ్ మాధవ్ వ్యాఖ్య వ్యక్తం చేసింది. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు సాధించిన అతి పెద్ద పార్టీగా బరిలో నిలబడలేకపోయినప్పటికీ, మేఘాలయాలో మైనారిటీలో ఉన్నప్పటికీ బీజేపీ ఆ రాష్ట్రాల్లో అధికారం సాధించగలిగింది. సీట్లు ముఖ్యం కాదని, తనకు పోటీయే లేదని బీజేపీ ఇక్కడ నిరూపించుకుంది. అది అమిత్షా వ్యూహంతో గెల్చుకున్న అధికారమని రామ్ మాధవ్ సూచించారు. కానీ తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీ ఫలితాలతో ఈ పరిస్థితిలో మార్పువచ్చింది. అతిచిన్న పొత్తుదారుకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రత్యర్థిని నివ్వెరపర్చింది. దీంతో నూతన రాజకీయాలకు నాంది ఏర్పడింది. బీజేపీని అధికారంలోంచి తప్పించాలని బలంగా కోరుకుంటున్న పార్టీలన్నీ పొత్తుకు అంగీకరించే ధోరణి పెరిగింది. దానికోసం ఎలాంటి మూల్యాన్ని చెల్లించడానికైనా ఈ పార్టీలు ఇప్పుడు సిద్ధపడిపోయారు. ఇది నిజంగానే అమిత్ షా రాజకీయాలకు సవాల్ విసిరింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం బీజేపీ ఎన్ని పన్నాగాలూ పన్నినప్పటికీ, ఎన్ని కుయుక్తులు అల్లినప్పటికీ, అతిపెద్ద పార్టీగా నంబర్ల గేమ్ను ఆడినప్పటికీ అధికారాన్ని కైవసం చేసుకోలేకపోయింది. తొలిసారిగా, మోదీ, షాలు ఓటమి ఎరుగని, పరాజయం తెలీని మహా వ్యూహకర్తలు కాదని కర్ణాటక నిరూపించింది. వ్యూహాత్మకంగా బీజేపీని ఓడించగల సమయస్ఫూర్తిని కాంగ్రెస్ ప్రదర్శించింది. పైగా, మోదీ కేంద్రంగా నడిచే ఎన్నికల ప్రచార పోరాటంలో మోదీ తొలిసారిగా విఫలమయ్యారు. బీజేపీకి దన్నుగా నిలిచే అధికార వనరులూ, ఏజెన్సీలు కర్ణాటకలో ఎమ్మెల్యేలను గెల్చుకోవడంలో పరాజయం పొందాయి. ప్రధానంగా సుప్రీంకోర్టు బీజేపీ ఎత్తుగడలకు అడ్డుకట్ట వేసింది. గుజరాత్లో అహ్మద్ పటేల్ను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాకుండా చూడాలని మోదీ, షా ద్వయం చేసిన ప్రయత్నాలకు తొలి సంస్థాగత వైఫల్యం సంభవించిన సంవత్సరం తర్పాత బీజేపీని అధికారం నుంచి తప్పించగలమని, ఉనికి కాపాడుకోవడమే కాదు. గెలుపు కూడా సాధించగలమనే నమ్మకాన్ని కర్ణాటక ఫలితాలు స్పష్టం చేశాయి. సరిగ్గా ఇదే హిందీ ప్రాబల్య ప్రాంతాల్లో తదుపరి జరిగిన ఎన్నికలకు ఒక విభిన్న పొందికను నిర్దేశించింది. మోదీని ఓడించవచ్చని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఇప్పుడు నమ్మసాగాయి. 2017 డిసెంబర్మధ్యనాటికి కలలో కూడా ఇలాంటి స్థైర్యం వాటికి ఉండేది కాదు. 2018 డిసెంబర్ మధ్య నాటికి అధికారం తమకు చేరువలో ఉందని తొలిసారిగా కాంగ్రెస్తో సహా ప్రతిఫక్షాలకు విశ్వాసం కలిగింది. అందుకే 2017 డిసెంబర్ నుంచి 2018 డిసెంబర్ మధ్య కాలం అత్యంత ముఖ్యమైన రాజకీయ సంవత్సరంగా మనం పిలుస్తున్నాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ ఫలితాలు ప్రకటితమైన మధ్యాహ్నమే, మోదీ ప్రవచిస్తూ వచ్చిన కాంగ్రెస్ విముక్త భారత్ భావన కథ ముగిసిపోయిందని వ్యాఖ్యాతలుగా చెప్పాం. ఇటీవల ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ కూడా పరోక్షంగా ఈ వాస్తవాన్ని గుర్తించారు. కాంగ్రెస్ ముక్త్ అనే తన భావనకు అర్థం కాంగ్రెస్ పార్టీని నిర్మూలించాలని కాదని, దాని భావజాలం, ఆలోచనలు ఉనికిలో లేకుండా పోవాలన్నది తన అభిమతమని మోదీ తొలిసారిగా నిర్వచనమిచ్చారు. కాంగ్రెస్ అలోచనలు అంటే కులతత్వం, వంశపారంపర్య రాజకీయాలు, అప్రజాస్వామికమైన, బంధుప్రీతితో కూడిన రాజకీయాలు మాత్రమేనని మోదీ వివరణ ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ బరిలో ముందుకురావడం, ఉత్తరప్రదేశ్లో కుల ప్రాతిపదిక పార్టీలైన సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు కూటమి బీజేపీకి హెచ్చరికలు పంపడం, మోదీపై అవినీతి ఆరోపణలతో కాంగ్రెస్ ఎదురుదాడికి దిగటం వంటి పరిణామాలు బీజేపీకి అడ్డం తిరిగాయి. కాంగ్రెస్ ఆలోచనలు నశించాలి అనే మోదీ నిర్వచనం సరైందే అనుకుందాం. కానీ 2010 తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ తనను తాను శక్తివంతమైన పార్టీగా మార్చుకుని ముందుకొచ్చింది. భారతీయ రాజకీయాల్లో గత మూడేళ్ల తర్వాత ఏర్పడిన రెండో ఏక ధ్రువపార్టీగా కాంగ్రెస్ అవతరించింది. అయితే మోదీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో దుర్భల స్థితిలో ఉన్నారని చెప్పడానికి మీకు కాస్త దమ్ముండాలి మరి. ఆయన వ్యక్తిగత ప్రజాదరణ, తన శ్రోతలతో తానేర్పర్చుకున్న అనుసంధానం, ఆకర్షణ శక్తి ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. మనం ముందే చెప్పుకున్నట్లుగా భారతదేశంలో మెజారిటీని కలిగివున్న ఒక బలమైన నాయకుడిని ఇంతవరకూ ఏ పోటీదారు ఓడించలేకపోయారు. అలాంటి బలమైన నాయకుడు లేక నాయకురాలు (1977లో ఇందిరాగాంధీ లాగా) తనను తాను ఓడించుకోవలసిందే. ఇలా జరగాలంటే తప్పనిసరిగా మూడు పరిణామాలు సంభవించాల్సి ఉంది. ఆ బలమైన నాయకుడు తనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసేంత స్థాయిలో ప్రజాదరణ కోల్పోవాలి. తమలోని విభేదాలను, ఆకాంక్షలను, దురాశలను పక్కనబెట్టి ఆ బలమైన నాయకుడికి వ్యతిరేకంగా విభిన్న రాజకీయ శక్తులు పొత్తు కుదుర్చుకుని అతడి ఓటమికి ప్రాతిపదికను ఏర్పర్చుకోవాలి. కాబోయే ప్రధాని స్థాయిని ప్రకటించుకోనప్పటికీ ఇలాంటి రాజకీయ శక్తులను ఒక చోటికి చేర్చగలిగిన సమున్నత వ్యక్తిత్వం ఉన్న వారు ముందుకు రావాలి. 1977లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ ఇలాంటి పాత్రనే పోషించారు. 1989లో రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా వీపీ సింగ్ ఇలాంటి పాత్రనే పోషించారు. ఒక సంవత్సరం క్రితం వెలిసిపోతున్న రాజవంశానికి ప్రతినిధిగా ఉన్న స్థితినుంచి రాహుల్ గాంధీ ఇప్పుడు రెండో ఏకధ్రువ స్థితికి కాంగ్రెస్ను అమాంతంగా తీసుకొచ్చారు. 2019 కోసం రాజకీయ క్రీడ ఇప్పుడు సిద్ధంగా ఉంది. ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటుకు కూడా హాజరుకాకుండా తన రాజకీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం వెనకున్న బలీయమైన కారణం ఇదే మరి. - శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
వీరే రేపటి జాతీయ రాజకీయ నిర్ణేతలు
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ ఓడినా భారత రాజకీయాలు ఉపరితలం మీది నుంచి చూస్తే ఒకే తీరుగా కనిపిస్తాయి. ఏడాదికేడాది పెద్దగా మార్పు కనిపించదు. కొత్త పార్టీలు పుడుతుంటాయి. పాత పార్టీలు మరింత పాత పార్టీల్లో విలీనం అవుతుంటాయి. కానీ నిశితంగా పరిశీలిస్తే ఏడాదికేడాదికే కొట్టొచ్చినట్లుండే మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా 2018 సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటే కనుమరుగవుతారనుకున్న నాయకులు అనూహ్యంగా మళ్లీ జీవం పోసుకున్నారు. మరోపక్క యువతరం నాయకుడు అలుపెరగని పాదయాత్రతో ప్రజాహృదయాలను హత్తుకుంటూ వెచ్చని ఉదయ భానుడిలాపైకొచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను శాసించే స్థాయికి చేరుకున్న వారే అఖిలేష్ యాదవ్, మాయావతి, తేజస్వీ యాదవ్, కేసీఆర్, వైఎస్ జగన్లు. మాయావతి ఉత్తరప్రదేశ్కు నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీకి 2014లో జరిగిన లోక్సభ ఎన్నికలు షాకిచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆమె పార్టీ కనీసం ఒక్క సీటును కూడా గెల్చుకోలేకపోయింది. ఇక 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 80 సీట్లను గెలుచుకుంది. యూపీలోని గోరక్పూర్, ఫూల్పూర్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు మద్దతిచ్చి గెలిపించడం ద్వారా మాయావతి బలపడ్డారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ రెండు సీట్లను గెలుచుకొంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని ఎస్పీతో కలిసి యూపీలోని 80 లోక్సభ స్థానాలకు బీఎస్పీ పోటీ చేయనుంది. ఎస్పీ-బీఎస్పీ కూటమి గురించి ఆమె తన 63వ పుట్టిన రోజైనా జనవరి 15వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. అఖిలేష్ యాదవ్ అంతకుముందు జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 సీట్లలో 224 సీట్లను గెలుచుకున్న అఖిలేష్ యాదవ్ పార్టీ సమాజ్వాది పార్టీ 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేసి కేవలం 54 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. తండ్రి ములాయం సింగ్తో, బాబాయి శివపాల్ యాదవ్తో తగాదా పడడం ఆయనను రాజకీయంగా బాగా దెబ్బతీసింది. తండ్రిని దగ్గరికి తీసుకొని పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని ములాయం వారసుడిగా ప్రజల ముందుకు వచ్చారు. బీఎస్పీ మద్దతుతో గోరఖ్పూర్, ఫుల్పూర్ లోక్సభ స్థానాలకు గెలుచుకోవడం ద్వారా ఆయన రాజకీయంగా బరింత బలపడ్డారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తాను చాటుకోవడం ద్వారా రాష్ట్రంలోను తిరిగి పట్టు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తేజస్వీ యాదవ్ బీహార్లో జేడీయూతో పార్టీకున్న అధికార బంధం తెగిపోవడం, తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లడం తదితర పరిణామాలు ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వీ యాదవ్ను కుంగదీసాయనడంలో సందేహం లేదు. పార్టీ కూడా ఇప్పట్లో కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ బీహార్లోని అరారియా లోక్సభ, జెహనాబాద్ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా తేజస్వీ యాదవ్ రాజకీయంగా పునర్జీవం పొందారు. అరారియా సీటును ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ ఆలం 55వేల మెజారిటీతో స్వాధీనం చేసుకున్నారు. జెహనాబాద్ అసెంబ్లీ సీటును సుజయ్ యాదవ్ 35ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకున్నారు. ఈ రెండు చోట్ల పాలకపక్ష జేడీయూ–బీజేపీ అభ్యర్థులను ఓడించింది. అంతేకాకుండా ప్రముఖ మహాదళిత నాయకుడు జితన్ రామ్ మాంఝీ చివరినిమిషంలో జేడీయూకు మద్దతిచ్చినప్పటికీ జెహనాబాద్ సీటును గెలుచుకోవడం విశేషం. ఈ పరిణామాలతో ఆయన నాయకత్వం పట్ల పార్టీ కార్యకర్తల్లో విశ్వాసం పెరిగింది. కే. చంద్రశేఖర రావు వ్యూహ ప్రతి వ్యూహాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు చక్రం తిప్పే ఈ కాలపు రాజకీయ చతురుడిగా పేరు పొందిన టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర రావు తెలంగాణలో రెండోసారి పార్టీని విజయపథాన నడిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతత్వాన మహా కూటమి బలపడుతున్న తరుణంలో తెలివిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి పక్కా వ్యూహంతో గతం కన్న ఎక్కువ సీట్లను సాధించారు. ప్రజాకర్షక, ప్రజాసంక్షేమ పథకాలతో పాటు మళ్లీ బాబు వస్తారన్న బూచీని చూపించి ఆయన మహా కూటమిని పటాపంచలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 17 సీట్లలో అత్యధిక సీట్లను సాధించి ఆయన కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ 2018 సంవత్సరమంతా అవిశ్రాంతంగా పాద యాత్రలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. ఓదార్పు యాత్రతో ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం కొన్ని ఒడిదుడుకుల తర్వాత సుస్థిర బాట పట్టింది. ఆయన తన పాద యాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తూ వారి ప్రియతమ నాయకుడిగా ముద్రపడిపోయారు. వచ్చే రాష్ట్ర ఎన్నికల్లో కాకుండా రాష్ట్రం నుంచి 25 లోక్షభ సీట్లకు జరుగనున్న ఎన్నికల్లో కూడా ఆయన ప్రభంజనం సష్టించే అవకాశం ఉందని ఇప్పటికే పలు సర్వేలు సూచించాయి. అప్పుడు జగన్ కూడా కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించక తప్పదు. ప్రస్తుత అంచనాల ప్రకారం కేంద్రంలో పాలకపక్ష బీజేపీగానీ, కాంగ్రెస్ నేతత్వంలోని కూటమికిగానీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ కారణంగానే పశ్చిమ బెంగాల్లో ఇప్పటికీ బలంగా ఉన్న తణమూల్ కాంగ్రెస్, ఒరిస్సా పాలకపక్ష పార్టీ బిజూ జనతాదళ్ సహా అన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలను శాసించనున్నాయి. -
జూన్లో సీఎంగా రాబోతున్నారా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు(కేసీఆర్) హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారని ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) స్పష్టం చేశారు. తెలంగాణ సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తారని వెల్లడించారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన కేటీఆర్ శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్న నేపథ్యంలో మే లేదా జూన్లో మీట్ ది ప్రెస్కు ముఖ్యమంత్రిగా ఏమైనా కేటీఆర్ రాబోతున్నారా అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా.. అలాంటిదేమి లేదని కొట్టిపారేశారు. ‘జాతీయ రాజకీయాలంటే ఢిల్లీలోనే కూర్చుని చేయాలని లేదు. అలా అని రూల్ ఎక్కడా లేదు, రాజ్యాంగంలో ఎక్కడా రాసిలేదు. జాతీయ రాజకీయాలను హైదరాబాద్ నుంచి శాసించొచ్చు. తెలంగాణ సీఎంగా ఉంటూ కూడా జాతీయ రాజకీయాల్లో మన ముద్ర వేయొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ ఆనాడు దేశ రాజకీయాలను కూడా శాసించారు. తెలంగాణ రాష్ట్రానికి మరో పది, పదిహేనేళ్లు కచ్చితంగా కేసీఆర్ నాయకత్వం అవసరముంది. నాతోపాటు, లక్షలాది మంది కార్యకర్తలు బలంగా ఇదే కోరుకుంటున్నారు. పార్టీ కార్యనిర్వహక అధ్యక్ష పదవి నాకు ఇచ్చారని, మరేదో పెద్ద పదవి నాకు ఇస్తారని ఊహించి రాసి ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు. హైదరాబాద్లో సీఎంగానే ఉంటూనే మన పాత్ర పోషించవచ్చు. గతంలో పెద్దవాళ్లు చేశారు. ఇప్పుడు కూడా చేసే అవకాశముంద’ని కేసీఆర్ వివరణయిచ్చారు. సీఎం పోస్టు మరో పది, పదిహేనేళ్లు ఖాళీగా లేదన్నారు. తన సోదరి, నిజామాబాద్ ఎంపీ కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. -
చంద్రబాబు సరికొత్త కాపురం కాంగ్రెస్తో..
సాక్షి, న్యూఢిల్లీ: పరస్పరం బద్ధ శత్రువులైన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల పొత్తుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పురుడు పోసుకున్న తెలుగుదేశం ఇప్పుడు అదే పార్టీతో కలిసి కాపురం చేసేందుకు సన్నద్ధమైంది. ఇన్నాళ్లూ నరనరాన జీర్ణించుకున్న కాంగ్రెస్ వ్యతిరేకతకు ఇక మంగళం పాడేయాలని తెలుగుదేశం నిర్ణయించుకుంది. గతంలో ఉన్న వైరుధ్యాలను మరిచిపోవాలని, ఇకపై కలిసి నడవాలని ఇరు పార్టీలు నిర్ణయానికొచ్చాయి. తమ మధ్య గతాన్ని మరిచిపోయి, ఇద్దరం కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ప్రకటించారు. చంద్రబాబు గురువారం ఢిల్లీలో రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా బాబు వెంట టీడీపీ ఎంపీలు, పలువురు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలు ఉన్నారు. రాహుల్ గాంధీతో పరిచయాలు అయ్యాక ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలు బయటకు వచ్చేశారు. తర్వాత రాహుల్, చంద్రబాబు గంటకుపైగా ఏకాంతంగా భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. భేటీ తర్వాత రాహుల్, చంద్రబాబు కలిసి మీడియాతో మాట్లాడారు. దేశ రక్షణకు విపక్షాలన్నీ ఏకం కావాలి ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశ భవిష్యత్తు కోసం మేం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం. గతంలో మా మధ్య చాలానే వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవమే. దాన్ని మేం కూడా అంగీకరిస్తాం. ఎన్ని ఉన్నా ప్రస్తుతానికి పాత విషయాల జోలికి వెళ్లడం లేదు. వాటిని మరిచిపోయి కలిసి పనిచేయాలని నిర్ణయించాం. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దేశ పరిరక్షణ కోసం విపక్షాలు అన్ని ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, అఖిలేశ్తో చంద్రబాబు యువతకు ఉపాధి లేదు. రాఫెల్ కుంభకోణంలో అనిల్ అంబానీకి రూ.30,000 కోట్లు దోచిపెట్టారు. ఈ పరిస్థితుల్లో దేశ రక్షణకు, ప్రజాస్వామ్య బలోపేతానికి అన్ని విపక్షాలు కలిసి పని చేయాలి. దానికి అనుగుణంగా చంద్రబాబు, నేను కలిసి పనిచేస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించే పనిలో పడతాం. ఇక విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరుంటారన్నది ప్రస్తుతానికి అనవసరం. మీడియాకు దీనిపైనే ఆసక్తి ఎక్కువ. కానీ, మాకు మాత్రం దేశ రక్షణపైనే ఆసక్తి. ముందు బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలను ఏకంచేసి ముందుకెళ్లడంపై ప్రణాళికలు రచిస్తాం. వాటిని త్వరలోనే వెల్లడిస్తాం’’అని రాహుల్గాంధీ ఉద్ఘాటించారు. వ్యవస్థలను నాశనం చేశారు ‘‘ఎన్డీయే ప్రభుత్వం దేశంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. దేశ రక్షణ కోసం రాహుల్ గాంధీ, నేను కలిసి పనిచేయాలని నిర్ణయించాం. అన్ని విపక్షాలను కలుపుకొనిపోతాం. దేశంలో ప్రస్తుతంæ సాగుతున్న అరాచక పరిపాలనను గతంలో ఎన్నడూ చూడలేదు. వ్యవస్థలను నాశనం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐ, గవర్నర్ల వ్యవస్థ, సుప్రీంకోర్టు వ్యవస్థలను నాశనం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరం కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతానికి అనవసరం. రాఫెల్ కుంభకోణాన్ని రాహుల్ గాంధీ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. దీనిపై మేము కూడా మాట్లాడుతున్నాం. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తాం. అన్ని పార్టీలతో చర్చించి, ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాం’’అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పవార్, ఫరూక్ కంటే చిన్నవాడినే.. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా దేశంలో చాలా సీనియర్ నేతలని, తాను వారికంటే చిన్నవాడినేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. అనంతరం ముగ్గురు నేతలు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశాన్ని రక్షించేందుకు ఎన్డీయేయేతర పక్షాలను ఎలా కలుపుకొని ముందుకెళ్లాలన్న దానిపై చర్చించినట్టు తెలిపారు. శరద్ పవార్, ఫరూఖ్ అబ్దుల్లాతో చంద్రబాబు దీనిపై ఇంకా ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరిగాయని పేర్కొన్నారు. మున్ముందు బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల నాయకులతో మాట్లాడిన తరువాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని, ప్రస్తుతానికి ఇంతకుమించి ఏమీ చర్చించలేదని శరద్ పవార్ వెల్లడించారు. భావసారూప్యం గల పార్టీలను ఏకం చేసేందుకు త్వరలో బీజేపీయేతర పక్షాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని, దానికి తాము ముగ్గురం కన్వీనర్లుగా ఉంటామని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇతర పార్టీలతో మాట్లాడే బాధ్యతను పవార్, ఫరూక్ తనకు అప్పగించారని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం కాగానే, తనకు ఫ్లైట్ టైం అయిందంటూ ఫరూక్ అబ్దుల్లా లేచి వెళ్లిపోయారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్లతో వారి నివాసంలో చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబును బీజేపీ తిరుగుబాటు నేత అరుణ్ శౌరీ ఏపీ భవన్లో కలిశారు. అలాగే సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. -
ప్రత్యామ్నాయంగా నిలిచే వ్యూహం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై.. తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు.. కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా, కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలను పూర్తిగా నిలువరించేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగిన సమయంలో.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ను కట్టడి చేసేలా పావులు కదిపారు. అటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా విపక్షం పట్ల కటువుగా వ్యవహరించారు. తెలంగాణ జేఏసీ కార్యాచరణపైనా, కోదండరాంను కట్టడి చేయడంపైనా అదే నిర్బంధ వైఖరిని అమలు చేశారు. టీడీపీని పూర్తిగా ఖాళీ చేసే చర్యలూ కొనసాగించారు. మరోవైపు గతేడాది కాలంలో రాష్ట్రంలో పలు కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీజేఏసీ చైర్మన్ కోదండరాం నేతృత్వంలో ‘తెలంగాణ జన సమితి’పేరిట కొత్త పార్టీ ప్రారంభమైంది. టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. కేంద్రంతో పెరిగిన వైరం.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లపాటు సీఎం కేసీఆర్ రాజకీయపరంగా, ప్రభుత్వపరంగా కేంద్ర ప్రభుత్వంతో సానుకూల దృక్పథంతోనే వ్యవహరించారు. అయితే గతేడాదిగా మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా తెలంగాణ పర్యటన సందర్భంగా వైరం మొదలైంది. అమిత్షా టార్గెట్గా కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంతరం పలు పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో దూరం పెరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, నియోజకవర్గాల పునర్విభజన, జోన్ల విభజన వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వ మద్దతుకోసం కేసీఆర్ ప్రయత్నించారు. ఇందుకోసం పలుమార్లు ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ ప్రధాని అపాయింట్మెంట్ లభించలేదు. ఇదే సమయంలో రాష్ట్రాల హక్కులను కేంద్రం గౌరవించడం లేదని, ఫెడరల్ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని పేర్కొంటూ కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ కూటమికోసం పిలుపునిచ్చారు. దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ఆయన.. పలువురు ప్రాంతీయ పార్టీల అధినేతలతో సమావేశమై చర్చించారు. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్యాదవ్, కర్ణాటకలో జేడీఎస్ అధినేత దేవెగౌడ, కుమారస్వామి, పశ్చిమబెంగాల్లో తృణమూల్ సారథి మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకే సారథి కరుణానిధి, స్టాలిన్, కనిమొళి, జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ తదితరులతో భేటీ అయ్యారు. త్వరలోనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో కేసీఆర్ సమావేశం కానున్నారు. అన్నివర్గాలనూ ఆకర్షించేలా.. రైతులను, యాదవ, ముదిరాజ్ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి కేసీఆర్ పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల కోసం రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, వ్యవసాయ పెట్టుబడి సాయం కోసం ‘రైతు బంధు’పథకం, రైతు బీమా వంటి భారీ పథకాలతో రైతులను టీఆర్ఎస్కు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. యాదవులకు సబ్సిడీపై గొర్రెలు, ముదిరాజ్, బెస్తవారికోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ వంటి పథకాలను అమలుచేశారు. వీటితోపాటు రాజకీయంగా గుర్తిస్తున్నామనే సంకేతాన్ని ఇవ్వడానికి యాదవ, ముదిరాజ్ సామాజిక వర్గాలకు చెందినవారికి రాజ్యసభ అవకాశం కల్పించడం గమనార్హం. ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధికారంలో ఉన్న పార్టీపై దూకుడుగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు తామే ఆత్మరక్షణలో పడిపోయేలా కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. పూర్తి మెజారిటీ లేకున్నా కేసీఆర్ పక్కా వ్యూహంతో టీఆర్ఎస్ మూడు స్థానాలనూ కైవసం చేసుకోవడం గమనార్హం. ఇదే సమయంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్ల శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడం వంటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు విపక్ష కాంగ్రెస్ సభ్యులందరినీ బడ్జెట్ సమావేశాలు మొత్తంగా సస్పెండ్ చేయడం వంటి నిర్ణయాలను తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో నిరుద్యోగ, రైతు, నిర్వాసితుల సమస్యలపై పోరాటాలు చేసిన తెలంగాణ జేఏసీపైనా నిర్బంధాన్ని ప్రయోగించారు. -
ఫెడరల్ ఫ్రంటే గేమ్ చేంజర్: ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాల్లో గేమ్ చేంజర్గా నిలుస్తుందని ఎంపీ కె. కవిత అన్నారు. ఢిల్లీలోని ఇండియన్ విమెన్స్ ప్రెస్ కార్ప్లో మంగళవారం జరిగిన చర్చాగోష్ఠిలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఎన్నికలకు ఏడాదే గడువు ఉండటంతో ఇప్పటికైనా రైతులకు మేలు చేస్తుందేమో చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పరిగణనలోకి తీసుకోకుండా మోదీ సర్కార్ విధానాలు రూపొందించడం సరైంది కాదని చెప్పారు. తమది బలమైన పార్టీ కాబట్టే బీజేపీ ఏజెంట్, కాంగ్రెస్ ఏజెంటూ అంటూ టీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యవస్థలో మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని, విధానాలు నచ్చి తమతో కలసి వచ్చే వారందరినీ స్వాగతిస్తామని చెప్పారు. రైతులను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేందుకే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని, ఇది రైతులను వడ్డీ వ్యాపారుల బారి నుంచి రక్షిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
జాతీయ పార్టీలపై నమ్మకం లేదనే..
సాక్షి, నిజామాబాద్ : కర్టాటక ప్రజలు ఇచ్చిన తీర్పు మాత్రం జాతీయ పార్టీలపై విశ్వాసం లేదనే అర్థం అవుతుందని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కర్టాటకలో ఏ పార్టీకి ఓటు వేయాలో అర్ధం కాని కన్ఫ్యూజన్ ప్రజల్లో ఏర్పడిందన్నారు. జాతీయ పార్టీలకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. సీఎం కేసీఆర్ కూడా ఇదే చెబుతున్నారు. సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బీజేపీ ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి..వారం అయితే తప్ప ఏం జరుగుతుందో చెప్పలేమని మంత్రి తెలిపారు. ‘కాంగ్రెస్ నుంచి వచ్చిన డీఎస్ శ్రీనివాసులుకి టీఆర్ఎస్ సముచిత గౌరవం ఇచ్చింది. ఆయనకు టీఆర్ఎస్లో చాలా ఫ్రీడం ఉంది.. ఏవిధమైన ఇబ్బంది లేదు. కానీ డీఎస్ ఆనుచరులు అసంతృప్తి ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే సమన్వయం చేసుకుంటాం. అంతేకాక జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం. రైతులకు రైతుబంధు పతకంలో ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా సీఎం కేసీఆర్ నగదు ఏర్పాటు చేయించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతోంది. అంతేకాక క్రీడాకారులకు కూడా ప్రోత్సాహం ఇస్తున్నాం. ఎక్కడా లేని విధంగా సీఎం రైతులకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ను ప్రకటించారు. ఎర్రజొన్న రైతులకు మంచి ధర కల్పించి కొనుగోలు చేశాం. నీటి పారుదల, రైతు, వ్యవసాయం ఈ మూడు అంశాలకు టీఆర్ఎస్ అధిక ప్రాధాన్యం ఇచ్చింది’. అని ఎంపీ కవిత తెలిపారు. -
గులాబీ ఆశలు
-
హస్తినలో మమత కీలక భేటీలు!
న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కసరత్తు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. ఈరోజు రాత్రి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద పవార్ ఏర్పాటు చేసిన విందుకు ఆమె హాజరవుతారు. మమతా బెనర్జీ మంగళవారం మధ్యాహ్నం పార్లమెంటుకు వచ్చి పలువురు ప్రతిపక్ష నేతలతో మాట్లడతారని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు చెప్పారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధీతో ఆమె భేటీ అయ్యే అవకాశముంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కూడా కలవనున్నట్లు సమాచారం. కేజ్రీవాల్ను కలిసిన తొలి నాయకురాలు మమత బెనర్జీనే. జాతీయ రాజకీయల్లో రాణించేందుకు కేజ్రీవాల్ సలహాలు తీసుకోవాలని ఆమె భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లో బలమైన ఫ్రంట్ ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. తమ నాయకురాలు జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని తృణముల్ పార్టీ నేతలు కూడా అభిలషిస్తున్నారు. -
దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలకం
నేరడిగొండ(బోథ్): దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నా రు. శనివారం మండలంలోని ఆరెపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో నిర్మించిన మిషన్ భగీరథ గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో కలిసి మంత్ రిపరిశీలించారు. భారీనీటి సామర్థ్యంతో నిర్మించిన జీఎల్బీఆర్ లోకి దిగి పంప్హౌజ్లో నిర్మించిన ఇన్లెట్, ఔట్లెట్ పనులతో పాటు పంప్హౌజ్కు సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. నిర్మల్ జిల్లాలోని మాటేగాం నుంచి ఆరెపల్లి పంప్హౌజ్ వరకు వచ్చే పైపులైన్తో పాటు ఆరెపల్లి పంప్హౌజ్ నుంచి ఆదిలాబాద్ పట్టణానికి వచ్చే పైపులైన్ పూర్తయిన పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని, త్వరలోనే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం కొర్టికల్లో ఎంపీపీ బర్దావల్ సునిత నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కమల్సింగ్, కొర్టికల్ సర్పంచ్ ఆడె రవీందర్, బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు దావుల భోజన్న, జిల్లా నాయకులు రాథోడ్ సజన్, నారాయణసింగ్, ప్రేమ్సింగ్, యూనుస్అక్బానీ, ఖయ్యుం, రవి, తేజ్రావు, తదితరులు ఉన్నారు. -
కేంద్రం దిశగా కేసీఆర్ మరో ముందడుగు
-
కేంద్రం దిశగా కేసీఆర్ మరో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర రాజకీయాలపై రోజుకో ప్రకటన చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. వివిధ రంగాల ప్రముఖులతో భేటీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదట విడత రిటైర్డ్ సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు వుంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కేంద్రంలో కీలక పదవుల్లో పనిచేసిన అధికారులు, సైనిక రంగంలో పనిచేసిన వారితో సమావేశంలో పలు అంశాలపై కేసీఆర్ చర్చించనున్నారు. అయితే ఈ భేటీలు కేవలం హైదరాబాద్కు పరిమితం కాకుండా ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగుళూరులలో నిర్వహించనున్నట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. మరోవైపు జాతీయస్థాయిలో వివిధ పార్టీలకు చెందిన నాయకుల నుంచి కేసీఆర్కు ఫోన్లు వస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో కూటమి ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పొలిటికల్ కారిడర్ 22nd Jan 2018
-
ఆశల మోసులు
కాల ప్రవాహంలో మరో ఏడాది గడచిపోతున్నది. మరి కొన్ని గంటల్లో ఈ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగిడబోతోంది. పాత, కొత్తల పొలిమేరల్లో నిలబడి నిన్నటి చేదు, తీపి జ్ఞాపకాలను మననం చేసుకుంటేనే...వాటినుంచి గుణపాఠాలను నేర్చుకుంటేనే మెరుగైన రేపటిని పొందడం సాధ్యమవుతుంది. ఈ ఏడాది మొదట్లో తమిళనాట యథాలాపంగానో, యాదృచ్ఛికంగానో జరిగినట్టు కనబడిన ఉదంతం దాదాపు ఏడాదంతా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు రూపాల్లో ఒక ధోరణిగా ముందుకు రావడం ప్రజాస్వామ్య ప్రియులందరినీ కలవరపాటుకు గురిచేసింది. దాని పేరు అసహనం. దాని ఊపిరి విద్వేషం. సుప్రసిద్ధ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ జనవరి నెలలో చేసిన ప్రకటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘రచయిత పెరుమాళ్ మురుగన్ మరణించాడు. ఇకపై పి. మురుగన్ అనే సాధారణ టీచర్ మాత్రమే మిగులుతాడు. ఇకనుంచి ఎవరూ ఎలాంటి సాహితీ సమావేశాలకూ పిలవొద్దు’అంటూ ఫేస్బుక్లో ఉంచిన సందేశమది. నాలుగేళ్లక్రితం ప్రచురించిన నవలపై ఉద్యమం పుట్టుకురావడం, అది ఉద్రిక్తతలకు దారితీయడం, జిల్లా యంత్రాంగం మొత్తం కదిలి ఒత్తిళ్లు తీసుకొచ్చిన పర్యవసానంగా ఆ రచయిత సాహితీసృజన నుంచి తప్పుకుంటున్నానని ప్రకటిం చడం ఒక విషాదకరమైన పరిస్థితి అయితే... ఆ మరుసటి నెలలోనే మహారాష్ట్రలో హేతువాద భావాలను ప్రచారం చేస్తున్నారన్న నెపంతో సీపీఐ నాయకుడు గోవింద్ పన్సారేను దుండగులు కాల్చిచంపారు. ఆగస్టు నెలలో ప్రముఖ కన్నడ సాహితీవేత్త, హంపీ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ కల్బుర్గిని కూడా అలాంటి కారణాలతోనే పొట్టనబెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన దేశ రాజధాని నగరం ఢిల్లీలో వరసబెట్టి చర్చిలపై దాడులు జరగడం అందరినీ ఆందోళనపరిచింది. విద్వేషాలను రెచ్చగొట్టే ఏ మత బృందాన్నయినా అనుమతించబోమని ప్రధాని నరేంద్ర మోదీ కఠినంగా హెచ్చరిం చాకగానీ పరిస్థితి చక్కబడలేదు. అంతకు ముందూ, ఆ తర్వాతా ఎన్నికల సంద ర్భంగా కొందరు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో గొడ్డు మాంసం అమ్మకాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకురావడం, బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా, గుజరాత్, చత్తీస్గఢ్లు దాన్ని అనుసరించడం...జైన మతస్తులు పాటించే పర్యూషణ్ సందర్భంగా ముంబై నగరం, దాని శివార్లలో కొన్ని రోజులపాటు మాంసం అమ్మకాలను నిషేధించడంలాంటి చర్యలు కొత్త చర్చను లేవనెత్తాయి. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో పశువుల్ని కబేళాలకు తరలిస్తున్నారన్న అనుమానంతో నలుగురు ట్రక్కు డ్రైవర్లను కొట్టి చంపడం వంటివి చోటు చేసుకున్నాయి. వీటన్నిటికీ పరాకాష్ట అనదగ్గది ఢిల్లీ శివార్లలో ఉన్న యూపీ పరిధిలోని దాద్రీలో జరిగింది. ఒక ముస్లిం కుటుంబం గొడ్డు మాంసం తింటున్నదని వదంతులు సృష్టించి, దాడిచేసి కుటుంబ పెద్దను కొట్టి చంపడం, అతని కుమారుణ్ణి తీవ్రంగా గాయపర్చడంఅందరినీ విస్మయానికి గురిచేసింది. వీటన్నిటికీ నిరసనగా వివిధ రాష్ట్రాల్లోని పేరెన్నికగన్న రచయితలు, కవులు, కళాకారులు, శాస్త్రవేత్తలు తమకొచ్చిన సాహిత్య అకాడమీ అవార్డుల్ని, పద్మ పురస్కారాలనూ వెనక్కి ఇచ్చారు. ఒక రచయితను బెదిరించడంతో మొదలైన అసహనం, విద్వేషాలపై మేధావి వర్గం ఈ స్థాయిలో ఏకమై ధ్వజమెత్తడం ఈమధ్య కాలంలో తొలిసారని చెప్పాలి. ఏడాది ప్రారంభంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు షాకిస్తే... చివరిలో జరిగిన బిహార్ ఎన్నికలు దాన్ని మరింత కుంగదీశాయి. పార్లమెంటు యధాప్రకారం వాయిదాల్లోనే పొద్దుపుచ్చుతోంది. ఈసారి కూడా ప్రకృతి కన్నెర్రకూ, పాలకుల నిర్లక్ష్యానికీ రైతు బలయ్యాడు. ఎందరెందరో రైతులు రుణాల ఊబిలో కూరుకుపోయి ఊపిరి తీసుకోవడమే పరిష్కారమనుకున్నారు. ఇప్పుడున్న పార్లమెంటు భవనం శిథిలావస్థకు చేరుకుంటున్నదని, దాని స్థానంలో కొత్త భవనం నిర్మించాల్సి ఉన్నదని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన ప్రతిపాదన భిన్నాభిప్రాయాలకు తావిచ్చింది. శతాబ్దాల చరిత్రతో, సంప్రదాయంతో ముడిపడి ఉన్న అలాంటి విశిష్టమైన భవనాన్ని వారసత్వ సంపదగా పరిగణించి, దాన్ని పరిరక్షించుకోవడానికి అవసరమైన మార్గాలను అన్వేషించాలని పలువురు సూచించారు. భూసేకరణ చట్టానికి తీసుకొచ్చిన సవరణలను పార్లమెంటులో నెగ్గించుకోలేక చేత్తులెత్తేసిన ఎన్డీఏ సర్కారుకు... న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ఎన్జేఏసీ చట్టాన్ని, అందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు కొట్టేయడం పెద్ద ఎదురుదెబ్బ. ప్రధాని నరేంద్ర మోదీ సంప్రదాయ దౌత్య పద్ధతులను పక్కనబెట్టి పాకిస్తాన్తో చర్చల కోసం తీసుకున్న చొరవకు ఇంటా బయటా కూడా ప్రశంసలు లభించాయి. దీనికి కొనసాగింపుగా వచ్చే ఏడాది ఇరు దేశాలమధ్యా వివిధ స్థాయిల్లో జరగబోయే చర్చలు మంచి ఫలితాలనివ్వాలని అందరూ కోరుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చెలరేగిన మాటల యుద్ధం చివరకు శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలను కొనడానికి టీడీపీ ప్రయత్నించడంతో పతాకస్థాయికి చేరింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రేవంత్రెడ్డి ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరెన్సీ నోట్ల కట్టల్ని ఎరజూపుతూ అరెస్టయ్యారు. ఏసీబీ దాడిచేసి పట్టుకున్న ఆ కేసు ఇంతవరకూ ఓ కొలిక్కి రాలేదు. ఈ ఏడాదంతా ఆత్మవిశ్వాసాన్ని పెంచే, సంభ్ర మాశ్చర్యాలకు గురిచేసే పరిణామాలు ఓ పక్కా...మనోవేదన కలిగించే, దిగ్భ్రాంతిపరిచే అమానవీయ ఉదంతాలు మరోపక్కా సాగాయి. 2016 సంవత్సరం సమున్నత విలువలకు వేదికగా కాంతులీనాలని ఆశిద్దాం! -
విజయమా? వీర స్వర్గమా?
బిహార్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు ఈ విజయం అన్ని పార్టీలకు అత్యవసరం దేశ రాజకీయాలు, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు భవిష్యత్తులో ఏ దిశగా సాగనున్నాయనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు బిహార్ ఎన్నికలు అవకాశం కల్పిస్తున్నాయి. జాతీయ రాజకీయాలు, మోదీ, బీజేపీ రాజకీయ భవిష్యత్తు.. మొదలైన వాటిపై ఈ ఎన్నికలు గణనీయ ప్రభావం చూపనున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల నాటి కాంగ్రెస్పై వ్యతిరేకత, మోదీపై సానుకూలత ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదు. మోదీ గాలి, గుజరాత్ అభివృద్ధి మోడల్ మొదలైన అంశాలు మరుగునపడ్డాయి. అదీ కాక, లోక్సభ ఎన్నికల సమయంలో మోదీ ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుకు మధ్య అంతరం స్పష్టం గా కనిపిస్తోంది. నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకత, మోదీపై తొలగిన భ్రమలు.. ఈ రెండు ఓటర్లపై సమాన ప్రభావం చూపుతున్నాయి. మోదీ ఇటీవల ప్రకటించిన రూ. 1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కూడా ఓటర్లపై ప్రభావం చూపలేకపోయింది. ప్రగతి వర్సెస్ సంక్షేమం.. మరో కోణంలో చూస్తే.. గత మూడు దశాబ్దాలుగా బిహార్ రాజకీయాలను శాసిస్తున్న సామాజిక న్యాయం, సామాజిక సాధికారతలను సవాలు చేస్తూ.. ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు, సుపరిపాలన తదితర అంశాలు కొత్తగా తెరపైకి వచ్చాయి. వీటిని ఆకాంక్షిస్తున్న కొత్త వర్గం పుట్టుకొచ్చింది. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి పథంలో, పెట్టుబడుల ప్రవాహంలో బిహార్ ఆర్థిక వ్యవస్థను కూడా కలుపుకోవడం మోదీ నాయకత్వంలోనే సాధ్యమవుతుందన్న వాదనతో బీజేపీ ఒకవైపు.. మెరుగైన విద్య, వైద్యం, పటిష్టమైన ప్రజా పంపిణీ, ఇతర సంక్షేమ పథకాలు, సుపరిపాలనను నమ్ముకున్న నితీశ్ నేతృత్వంలోని లౌకిక కూటమి మరోవైపు ఎన్నికల పోరులో నిలిచాయి. వీటితో పాటు విద్యార్థినులకు సైకిళ్లు, శానిటరీ నేప్కిన్స్ ఇవ్వడం లాంటి ప్రజాకర్షక పథకాలతో నితీశ్ వివిధ వర్గాల ప్రజల్లో అభిమానం సంపాదించుకున్నారు. వేగవంతమైన అభివృద్ధి, అత్యాధునిక మౌలిక వసతులు మొదలైన వాటితో దశాబ్దాల బిహార్ వెనకబాటుతనాన్ని రూపుమాపుతామన్న బీజేపీ వైపు బిహార్ ఓటర్లు మొగ్గు చూపుతారో.. లేక ప్రజాకర్షక, సంక్షేమ పథకాలను నమ్ముకున్న లౌకిక కూటమి వెంట నడుస్తారో వేచి చూడాలి. కొత్త సామాజిక సమీకరణాలు.. బిహార్ ఎన్నికలతో వెలుగులోకి వచ్చిన మరో కొత్త కోణం.. మారుతున్న సామాజిక సమీకరణాలు. కొత్త సామాజిక వర్గాల ఆవిర్భావం. ఈ సమీకరణాలను అర్థం చేసుకుని, కొత్త వర్గాలను ఆకట్టుకోవడం పైననే ఇరు కూటముల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఓబీసీలు, ముస్లింలు, దళితుల్లో అంతర్గత విభజన జరుగుతూ కొత్త వర్గాలు రూపొందుతున్న క్రమంలో ఉన్న సమయంలోనే.. బిహార్లో ఆ విభజన స్పష్టమైన రూపు తీసుకుంది. అలాగే, ఆ చీలిక వర్గాలు ఈ ఎన్నికల్లో స్పష్టమైన ప్రభావం కూడా చూపుతున్నాయి. ఓబీసీల్లో ఈబీసీ(ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు), ఎంబీసీ(అత్యంత వెనుకబడిన వర్గాలు).. దళితుల్లో మహా దళితులు.. ముస్లింలలో పస్మండ ముస్లింలు ఈ కేటగిరీల్లోకి వస్తారు. వీరి ఓట్ల కోసం పార్టీలు ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసినా ఈ ఎన్నికలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే భవిష్యత్ ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. అగ్రకులాలా? అణగారిన వర్గాలా? ముస్లింలు, యాదవులు, ఈబీసీలు, మహాదళితుల ఓట్లు లక్ష్యంగా లౌకికకూటమి పావులు కదుపుతుండగా.. అగ్రకులాలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. మాజీ సీఎం మాంఝీ, కేంద్రమంత్రి పాశ్వాన్ల మద్దతుతో మహాదళితుల ఓట్లు కూడా తమ ఖాతాలోకే వస్తాయని బీజేపీ ఆశిస్తోంది. ఎంఐఎం పార్టీ ప్రవేశంతో ముస్లిం ఓట్లు చీలుతాయనుకుంటోంది. యాదవుల ఓట్లపైనా కన్నేసి 30 స్థానాల్లో యాదవులను నిలిపింది. మోదీ కూడా యదువంశీయులంటూ యాదవులను మంచి చేసుకునేందుకు ప్రయత్నించారు. హిందువుల ఓట్లు లక్ష్యంగా, మత ప్రాతిపదికన ఓటర్లను చీల్చే వ్యూహంతో ముస్లింలెవరికీ టికెట్లివ్వలేదు. రిజర్వేషన్లను సమీక్షించాలన్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్య కూడా అగ్రకులాల ఓట్ల విషయంలో తమకు అనుకూలిస్తుందని బీజేపీ భావిస్తోంది. అయితే, అదే వ్యాఖ్యను లౌకిక కూటమి తనకు అనుకూలంగా మల్చుకుంది. అవినీతి, యువత, సాగు ఊసు లేదు ఈ ఎన్నికలను, ఓటర్లను, ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే అంశాలను పక్కనబెడితే.. పార్టీలు పట్టించుకోకుండా వదిలేసిన ముఖ్యమైన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి అవినీతి, యువత, వ్యవసాయం మొదలైనవి. అవినీతి మరకలు రెండు కూటములపైనా ఉన్నాయి. యువత ప్రత్యేక ఓటుబ్యాంకుగా రూపొందకపోవడంతో ఆ వర్గాన్ని పార్టీలు పట్టించుకోవడం లేదు. ఒకరకంగా ఈ ఎన్నికలు ‘మోదీ వర్సెస్ నితీశ్’గా మారాయి. వారిద్దరి వ్యక్తిత్వాలు, పనితీరు, నాయకత్వ లక్షణాలు కూడా కొంతవరకు ఓటర్లను ప్రభావితం చేస్తాయి. లౌకిక కూటమి ఓటమి పాలైతే.. ఆర్జేడీకి, కాంగ్రెస్కు బిహార్లో దారులు మూసుకుపోయినట్లే. జేడీయూకు కూడా కష్టకాలమే. బీజేపీ ఓడితే.. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి అది పెద్దదెబ్బ అవుతుంది. వ్యక్తిగతంగా మోదీ ఇమేజ్ దారుణంగా దెబ్బతింటుంది. శత్రుపక్షాలకు ఆసరాగా నిలుస్తుంది. (రాజకీయ, ఎన్నికల అధ్యయన సంస్థ పీపుల్స్ పల్స్ సౌజన్యంతో) -
బిహార్ ఎన్నికల వేళ ‘బీఫ్’ వివాదం!
పశుమాంసం చుట్టూ దేశ రాజకీయాలు దేశంలో ఒక్కసారిగా ‘బీఫ్’ రాజకీయాలు ఊపందుకున్నాయి. గోసంరక్షణ వర్సెస్ గోమాంస భక్షణపై చర్చ మొదలైంది. బీఫ్నిర్వచనం, పశుమాంసం పరిధిలోకి ఏయే జంతువుల మాంసం వస్తుంది? అనే అంశాలూ చర్చకొచ్చాయి. బిహార్ ఎన్నికల్లోనూ అభివృద్ధి, అవినీతి పక్కకెళ్లి.. ప్రచార తెరపైకి ‘ఆవు’ వచ్చి చేరింది. ఈ అంశం ఇంత అకస్మాత్తుగా ప్రాధాన్యం సంతరించుకోవడం వెనుక అసలు కారణం కూడా బిహార్ ఎన్నికలేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మత ప్రాతిపదికన ఓట్లను చీల్చేందుకే ‘బీఫ్’ను తెరపైకి తెచ్చారని వారంటున్నారు. మరోవైపు, గోమాంసం తిన్నాడన్న ఆరోపణలపై గతవారం ఉత్తరప్రదేశ్లోని దాద్రీలో ఓ వ్యక్తి హత్యకు గురవడం అక్కడ ఉద్రిక్తతలకు, దేశవ్యాప్త చర్చకు దారితీసింది. గోమాంసాన్ని నిషేధిస్తూ కశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గోమాంస గొడవపై విశ్లేషణ.. - సెంట్రల్ డెస్క్ ఎగుమతుల్లో మొదటి స్థానం.. భారతదేశంలో గోమాంసం సహా పశుమాంస భక్షణ అనాదిగా చర్చనీయాంశమే. హిందువులు గోహత్య మహాపాతకంగా భావిస్తారు. గోవధ నిషేధానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల్లోని ఆర్టికల్ 48లో పొందుపర్చారు. ఒకవైపు పవిత్ర గోమాతగా పూజలందుకుంటూనే, మరోవైపు, పెద్దఎత్తున దేశీయంగా, ఎగుమతులపరంగా గోమాంసం వినియోగమవుతోంది. దేశంలో సగటున 36.43 లక్షల టన్నుల పశుమాంసం ఉత్పత్తి అవుతుండగా, అందులో 19.63 లక్షల టన్నులు దేశీయంగా, 16.80 లక్షల టన్నులు ఎగుమతుల పరంగా వినియోగమవుతున్నాయి. పశుమాంస ఉత్పత్తిలో భారత్ బ్రెజిల్ తరువాత రెండో స్థానంలో ఉంది. దేశీయ వినియోగంలో ఏడవ స్థానంలో, ఎగుమతుల్లో 24 లక్షల టన్నుల ఎగుమతుల్తో(2014-15 ఆర్థిక సంవత్సరంలో) ప్రథమ స్థానంలో నిలుస్తోంది. అత్యధిక రాష్ట్రాల్లో గోవధ నిషేధం.. 2015 మార్చిలో బీజేపీ పాలిత మహారాష్ట్ర, హరియాణాలు బీఫ్ అమ్మకాలు నిషేధించడంతో వివాదం మొదలైంది. ఆ నిషేధాన్ని ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టల్ని మార్చారు. ఆ సమయంలో మహారాష్ట్ర పశుసంరక్షణ(సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ బిల్లును 1996లోనే శివసేన, బీజేపీ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం రాష్ట్రంలో దూడలు, ఎద్దులను చంపడమూ నిషేధమే. గోవధను మహారాష్ట్ర 1976లోనే నిషేధించింది. యూపీ, తమిళనాడు, రాజస్తాన్, పంజాబ్, ఒడిశా, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఢిల్లీ, బిహార్ లలో గోవధ నిషేధ చట్టాలున్నాయి. అయితే వాటి అమలు ఆ రాష్ట్రాల రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటోంది. రాజస్తాన్, పంజాబ్, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ల్లో అన్ని రకాల పశువుల వధను నిషేధించే కఠిన చట్టాలున్నాయి. ఆవులు, ఆవుదూడలు, లేగదూడలు మినహా వ్యవసాయ, ఇతర అవసరాలకు ఉపయోగపడని, ‘వధకు అర్హమైనవి’ అన్న సర్టిఫికెట్ ఉన్న పశువులను వధించడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అనుమతి ఉంది. పశ్చిమబెంగాల్, కేరళ, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ల్లో పశువధపై నిషేధం లేదు. విశేషమేమిటంటే.. బీఫ్ అమ్మకాన్ని, వినియోగాన్ని నిషేధించే జాతీయ చట్టమేమీ లేదు. రాష్ట్రాల్లో అమల్లో ఉన్న చట్టాల్లోనూ పశుమాంసం ఆహారంగా వాడడంపై నిషేధమూ లేదు. దేశ జనాభాలో గణనీయంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు పశుమాంసాన్ని ఆహారంగా తీసుకుంటారు. సాధారణంగా బీఫ్ వాడకం, వ్యాపారంలోనూ ముస్లింలది ప్రధాన పాత్ర. ఈ నేపథ్యంలోనే బీఫ్ బ్యాన్ మతం రంగు పులుముకుంటోంది. పశుమాంసానికి సంబంధించి ఇటీవల వివాదాస్పదమైన కొన్ని ఘటనలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరగడం ఈ వాదనకు బలాన్నిస్తోంది. పశువధ వల్ల వ్యవసాయం దెబ్బతింటుందన్న వాదనను కొందరు కొట్టేస్తున్నారు. వ్యవసాయంలో ప్రగతి సాధించిన బెంగాల్లో పశువధపై కఠిన నిషేధం లేదంటున్నారు. ఇటీవలి వివాదాస్పద ఘటనలు.. ►జైనుల పండగ వల్ల సెప్టెంబర్ 17, 18, 27 తేదీల్లో మాంసం, చేపల అమ్మకాలను నిషేధిస్తూ రాజస్తాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ►జమ్మూకశ్మీర్లో బీఫ్ అమ్మకాలను నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ►సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు, వారం రోజుల పాటు ఆవు, గేదె, ఎద్దు, మేక.. తదితర జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వధించడాన్ని ముంబై పోలీసులు నిషేధించారు. అధికారిక వధశాల్లలో వాటిని చంపడాన్ని నిషేధించలేదు. ముంబై పోలీసుల నిర్ణయంపై బీజేపీ మిత్రపక్షం శివసేన, ప్రతిపక్షం ఎమ్ఎన్ఎస్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసి, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. మతఘర్షణలపై కఠినంగా ఉండండి: కేంద్రం న్యూఢిల్లీ: మతసామరస్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే వారిపట్ల, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి లాభపడాలని చూసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. దాద్రీ ఘటనతో పాటు దేశంలో పలుచోట్ల మతపరమైన ఘర్షణలు చోటుచేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు హోంశాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. గెలిస్తే గోవధపై నిషేధం: బీజేపీ పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలిస్తే రాష్ట్రంలో గోవధపై నిషేధం విధిస్తామని బీజేపీ సీనియర్ నేత సుశీల్కుమార్ మోదీ చెప్పారు. 14 ఏళ్లలోపు వయసున్న గోవులను వధించకూడదని ఇప్పటికే బిహార్లో చట్టం అమలులో ఉందని, గత ప్రభుత్వాలు దీన్ని సమర్థంగా అమలు చేయలేదని పేర్కొన్నారు. బిహార్ ఎన్నికలు గొడ్డుమాంసం తినడంలో తప్పులేదనే వారికీ, గోవధపై నిషేధం ఉండాలని కోరుకునే వారికీ మధ్య పోరాటంగా మారాయన్నారు. మోదీ ఓ ధృతరాష్ట్రుడు: లాలూ హాజీపూర్: యూపీలో జరిగిన దాద్రీ ఘటనపై ప్రధాని మౌనాన్ని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా ఆక్షేపించారు. మోదీని ధృతరాష్ట్రుడితో పోల్చారు. ‘హస్తినలో కూర్చొన్న ఈ కలియుగ ధృతరాష్ట్రుడు అంధుడే కాదు మూగ, చెవిటి కూడా. పైకే గంభీర ఉపన్యాసాలు. లోపల పిరికివాడు. మాట్లాడాల్సిన అవసరం ఉన్నపుడు మౌనాన్ని ఆశ్రయిస్తాడు. సమాజాన్ని అల్లకల్లోలం చేయడానికి ధుర్యోధనులకు బాహటంగా అనుమతిచ్చేశారు’ అని సోమవారం ఓ సభలో అన్నారు. -
ఆశల పల్లకిలో..
రాయలసీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు తన రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ఏపీలో పార్టీ పుంజుకోవడం అనేది ఇప్పట్లో అసాధ్యమనే అంచనాతోనే ఆ పార్టీ నాయకులున్నారు..అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగడం వల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ రాబోయే రోజుల్లో ఆశాభావంతో ఉన్నారట... కర్ణాటక రాజకీయాలతో సంబంధం ఉన్న ముఖ్య నేత తనకు ఆ రాష్ట్రం నుంచి భవిష్యత్తులో రాజ్యసభ సీటు రావొచ్చునని ఆశాభావంతో ఉన్నారట.. ఒక వేళ అదీ సాధ్యం కాకపోతే 2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏదో ఒక చిన్న రాష్ట్రానికి గవర్నర్గానైనా నియమిస్తారన్న ఆశలు పెట్టుకున్నారట. ఆ దిశలో ఇప్పటికే ఆయన హైకమాండ్ వద్ద మంచి మార్కులే కొట్టేశారట. చూడాలి మరి.. భవిష్యత్తులో ఆయన ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో...