nehru zoological park
-
హైదరాబాద్ జూపార్కు ఎంట్రీ టికెట్ ధరల పెంపు
హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్. సెలవు రోజున సరదాగా పిల్లలను తీసుకుని జూపార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీ జేబు బరువు పెరగాల్సిందే. ఎందుకంటే జూపార్కు ఎంట్రీ టికెట్ రేట్లు భారీగా పెరగబోతున్నాయి. పెద్దల టికెట్ రేటు రూ. 30, పిల్లలకు 5 రూపాయలు పెంచారు.హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ (Nehru Zoological Park) ఎంట్రీ టికెట్ రేట్లను పెంచారు. జూ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పెద్దలకు టికెట్ ధర రూ.100, చిన్నారులకు రూ.50కి పెంచారు. ఈ రేట్లు సందర్శకులకు మార్చి 1వ తేదీ (శనివారం) నుంచి అమలులోకి వస్తాయని జూ క్యూరేటర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఇప్పటివరకు సాధారణ రోజుల్లో ఒకలా.. శని, ఆదివారాలతో పాటు సెలవురోజుల్లో మరోలా టికెట్ రేట్లు ఉండేవి. ఇక నుంచి అన్నిరోజుల్లోనూ ఒకటే ధరలు ఉంటాయని జూ క్యూరేటర్ వెల్లడించారు. ఎంట్రీ టికెట్ రేట్లతో పాటు కెమెరా, బ్యాటరీ వెహికల్, టాయ్ట్రైన్, సఫారీ పార్కు డ్రైవ్ రేట్లు కూడా పెంచినట్టు తెలిపారు.చదవండి: రైలు టికెట్ ఇలా కొంటే క్యాష్బ్యాక్..ప్రస్తుతం సాధారణ రోజుల్లో పెద్దలకు రూ. 70, పిల్లలకు రూ.45 ప్రవేశ రుసుం వసూలు చేస్తున్నారు. వీకెండ్, సెలవు దినాల్లో పెద్దలకు రూ. 80, పిల్లలకు రూ.55 తీసుకుంటున్నారు. మార్చి 1 నుంచి అన్నిరోజుల్లోనూ పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 వసూలు చేస్తారు. ఆన్లైన్లో కూడా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం ఉంది. పూర్తి వివరాలకు nzptsfd.telangana.gov.in/home.do వెబ్సైట్ చూడొచ్చు.ఉమెన్స్ డే రోజు ‘రన్ ఫర్ యాక్షన్–2025’ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మార్చి 8న హైదరాబాద్ నగర షీ–టీమ్స్ ‘రన్ ఫర్ యాక్షన్–2025’పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. పీవీ నర్సింహారావు మార్గ్లోని పీపుల్స్ ప్లాజాలో జరిగే ఈ 5కే, 2కే పరుగుకు సంబంధించిన పోస్టర్ను కొత్వాల్ సీవీ ఆనంద్ మంగళవారం ఆవిష్కరించారు. వీటిలో పాల్గొనాలని భావించే వారు ( rfa.bebetter.run) వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మహిళా భద్రత విభాగం డీసీపీ లావణ్య తెలిపారు. ‘మహిళల భద్రతకు అవసరమైన చర్యలు వేగవంతం చేయండి’అనే థీమ్తో ఈ రన్ నిర్వహిస్తున్నారు. -
హైదరాబాద్ పాతబస్తీలో అతిపెద్ద ఫ్లై ఓవర్.. విశేషాలివే
హైదరాబాద్ పాతబస్తీలో అతిపెద్ద ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులన్నీ ఈ నెల 30 వరకు పూర్తి చేసి డిసెంబర్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే.. ఆరాంఘర్, శాస్త్రీపురం, కాలాపత్తర్, దారుల్ ఉల్ ఉలూం, శివరాంపల్లి, హసన్నగర్ తదితర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. బెంగళూర్ జాతీయ రహదారితో పాటు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే వారికి సౌకర్యంగా మారనుంది. ఇప్పటి వరకు బాటిల్ నెక్ రోడ్డుతో ఇబ్బందులకు గురైన స్థానిక బస్తీల ప్రజలతో పాటు దూర ప్రాంతాల వారికి ఈ ఫ్లై ఓవర్ ఎంతో అనుకూలంగా ఉంటుంది.ఎస్ఆర్డీపీ కింద.. నగరంలో ఇప్పటి వరకు 2– 7 కిలో మీటర్ల పొడవుతో షేక్పేట్ ఫ్లై ఓవర్ను నిర్మించారు. 4.04 కిలో మీటర్ల అతి పెద్ద ఫ్లైఓవర్ పాతబస్తీలో నిర్మాణమైంది. వచ్చే నెల మొదటి వారంలో వాహనదారులకు దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు గ్రేటర్ కమిషనర్ కె.ఇలంబర్తితో పాటు హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఈ నెల 26న ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. చదవండి: కాలిపోయిన కలల సౌధం.. రెండు రోజుల క్రితమే గృహప్రవేశం.. అంతలోనే ఇలాసర్వీస్ రోడ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇంకా 17 కట్టడాలను తొలగించాల్సి ఉందని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ విభాగం చీఫ్ ఇంజినీర్ దేవానంద్, ఎస్ఈ దత్తు పంతు తదితరులు కమిషనర్కు వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్నను కమిషనర్ ఆదేశించారు. 2023 మార్చి నాటికే పూర్తి కావాల్సింది.. జూ పార్కు నుంచి ఆరాంఘర్ వరకు రూ.736 కోట్లతో స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) కింద దాదాపు 4.04 కిలో మీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. 2021లో పనులు చేపట్టారు. 2023 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉండగా.. నత్తనడకన సాగడంతో ఈ ఏడాది నవంబర్ వరకూ కొనసాగాయి. ఇంకా 2 డౌన్ ర్యాంపులతో పాటు 2 అప్ ర్యాంపులు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో మొత్తం 163 ప్రాపర్టీలను స్వాధీనం చేసుకోవడానికి రూ.336 కోట్లు ఖర్చు చేయగా.. మిగిలిన నిధులతో ఆరు లేన్ల మేర ఫ్లైఓవర్ను నిర్మించారు. -
హైదరాబాద్ : నెహ్రూ జూ పార్క్కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)
-
జాతీయ పార్కుల్లో ఎస్టీపీలు తప్పనిసరి.. ఎందుకంటే!
సాక్షి, హైదరాబాద్: జీవ వైవిధ్యానికి, పర్యావరణ పరిరక్షణ, స్థానికులకు ఆహ్లాదాన్ని అందించే జాతీయ పార్కులు కలుషిత కాటుకు గురవుతున్న వైనంపై పీసీబీ సీరియస్గా దృష్టి సారించింది. నగరంలోని కేబీఆర్పార్కు, జూపార్క్ సహా మహవీర్ హరిణ వనస్థలి తదితర జాతీయ ఉద్యానవనాల్లో మురుగు నీరు చేరకుండా నిరోధించడంతోపాటు.. ప్రతి చుక్క నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీలు నిర్మించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీలు నెలరోజుల్లోగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించింది. హరిణ వనస్థలిలో కలుషిత కాటు ఇలా... నగర శివార్లలో విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న మహవీర్ హరిణ వనస్థలి జాతీయ పార్క్లోని సహజ సిద్ధమైన నీటికుంటలోకి ఆటోనగర్ పారిశ్రామిక వాడలోని ఆటోగ్యారేజ్లు, భారీ వాహనాల సర్వీసింగ్ సెంటర్లు, ఫెస్టిలైజర్ గోడౌన్ల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థజలాలతో కాలుష్య కాసారంగా మారింది. దీంతో ఈ పార్క్లోని వన్యప్రాణులకు ముంపు పొంచి ఉండడంతో పీసీబీ అప్రమత్తమైంది. నీటినమూనాలు సేకరించి పరీక్షించగా.. కలుషిత ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో విధిగా ఎస్టీపీ నిర్మించాలని..శుద్ధి చేసిన నీటిని కేవలం గార్డెనింగ్ అవసరాలకే వినియోగించాలని సంబంధిత విభాగాలకు స్పష్టం చేసింది. మిగతా వ్యర్థజలాలను పైప్లైన్లను ఏర్పాటు చేసి మూసీలోకి మళ్లించాలని సూచించింది. చుట్టూ సీసీటీవీల నిఘా తప్పనిసరి.. నగరంలో జాతీయ పార్క్లకు ఆనుకొని ఉన్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల నుంచి వ్యర్థజలాలు ఉద్యానవనాల్లోకి చేరకుండా చూసేందుకు ఆయా వాడల్లో సీసీ టీవీలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని పీసీబీ టీఎస్ఐఐసీ, బల్దియాను ఆదేశించింది. వ్యర్థజ లాలను బహిరంగ ప్రదేశాలు, నాలాలు, చెరువులు, జాతీయ పార్కుల్లోకి వదిలిపెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎస్టీపీల ఏర్పాటుతో ఉపయోగాలివే.. ► జాతీయ పార్క్ల్లోకి చేరే మురుగు, వ్యర్థజలాలను శుద్ధి చేసిన తరవాతనే లోనికి ప్రవేశించే ఏర్పాటుచేయవచ్చు. ► శుద్ధిచేసిన నీటిని మొక్కల పెంపకం, గార్డెనింగ్ అవసరాలకు వినియోగించవచ్చు. ► ఆయా పార్క్లలోని చెరువులు, కుంటలు కాలుష్యకాసారం కాకుండా చూడవచ్చు. ► ఆయా ఉద్యానవనాల్లోకి కేవలం వర్షపునీరు మాత్రమే చేరే ఏర్పాట్లు చేయాలి. ► ప్లాస్టిక్, ఇతర ఘన వ్యర్థాలు పార్కుల్లోకి చేరకుండా నిరోధించాలి. ► జీవ వైవిధ్యాన్ని పరిరక్షణపై అన్ని వర్గాల్లో అవగాహన కల్పించాలి. -
జూలో జంతువులకు ఆయుషు ఎక్కువ.. ఎందుకంటే..?
సాక్షి, హైదరాబాద్: వేళకు తిండి..సేద తీరేందుకు ఆవాసం ఉంటే ఏ జీవి అయినా పదికాలాలు బాగా ఉంటుందనే సామెత మన జూ పార్కులోని జంతువులకు సరిగ్గా సరిపోతుంది. అడవి జంతువులకంటే.. జంతు ప్రదర్శనశాలలోనే పుట్టి.. ఇక్కడే పెరిగిన ఆనేక జంతువులు తమ జీవితకాలంటే ఎక్కువగా జీవిస్తున్నాయి. పోషకాహారం.. అలనాపాలన బాగుండడంతో ఈ జీవులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని గడుపుతున్నాయి. అడవుల్లో స్వేచ్ఛగా పెరిగే జంతువులు వయోభారంతో వేటను కొనసాగించలేవు. ఒంట్లో సత్తువ తగ్గడం.. ఇతర ప్రాణులతో పోటీపడలేక ఆకలితో అలమటిస్తాయి. నీరసంతో కన్నుమూస్తాయి. అదే జూలో అయితే.. సహజసిద్ధమైన ఆహారానికి కొరత ఉండదు. బలవర్ధకమైన ఆహారం.. సప్లిమెంట్లు, ఆనారోగ్యానికి గురైతే ఔషధాలు అందిస్తుండడంతో ఈ ప్రాణుల జీవనకాలం పెరుగుతుందని జూ క్యూరేటర్ రాజశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. జూలో వేట లేదు, ఇతర జంతువులతో పోరాటాలు ఉండకపోవడం కూడా వీటి జీవితకాలం పెరగడానికి కారణమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అడవిలో పెరిగే జంతువులకంటే అధికకాలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న కొ న్ని జంతువుల వివరాలు మీ కోసం... ఆహార ఆవసరాలకు అనుగుణంగా డైట్ జూలో వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. వాటి ఆహార అవసరాలకు అనుగుణంగా పోషకాలతో కూడిన ఆహారం అందిస్తాం. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటిస్తాం. ఒక్కో వన్యప్రాణి ఒక్కోతీరుగా ఆహారం తీసుకుటుంది. సమయం, సరిపడా మోతాదులో ఆహారం అందజేస్తాం.ఆడవుల్లో ఉండే వన్యప్రాణుల కంటే జూలో ఉంటున్న వన్యప్రాణుల వయో పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటికి ఆహారం సమయానికి అందుతుంది. రోగాల బారినపడకుండా చూసుకుంటాం. – డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం, జూ డిప్యూటీ డైరెకర్ట్ (వెటర్నరీ) ఆపర్ణ (బెంగాల్ టైగర్) పుట్టినరోజు : డిసెంబర్ 3, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు జిరాఫీ ( సునామీ బసంత్) పుట్టినరోజు : ఫిబ్రవరి 13, 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు కునాల్, సమీరా (తెల్లపులులు) పుట్టినరోజు : సెప్టెంబర్ 9, 2006 వయసు : 16 ఏళ్లు సగటు జీవితకాలం : 12–15 ఏళ్లు సులేమాన్ (జాగ్వార్) పుట్టినరోజు : ఏప్రిల్ 5, 1998 వయసు : 24 ఏళ్లు సగటు జీవితకాలం : 20 ఏళ్లు బారసింగా (చిత్తడి జింక) పుట్టినరోజు : 27, ఏప్రిల్ 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 12 ఏళ్లు ఎలుగుబంటి పుట్టినరోజు : ఫిబ్రవరి 18, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు 30 ఏళ్ల నుంచి పక్షుల్లో కూడా హరన్బెల్ పక్షి, తెల్ల కొకాటో పక్షి వయస్సు కూడా దాదాపు 30 ఏళ్లు ఉంటుందని జూ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 20–25 ఏళ్లు వరకు ఈ సంతతి పక్షులు జీవిస్తాయి. (క్లిక్ చేయండి: డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్!) -
అంతరించిపోతున్న అరుదైన జీవి.. ప్రపంచంలోనే అతి చిన్న జీవాలు
దుష్టశిక్షణ..శిష్ట రక్షణ కోసం సాక్షాత్తు శ్రీమహావిష్ణువే నరుడు.. సింహం రూపాలతో నరసింహుడిగా అవతరించాడనేది పురాణ గాథ. నల్లమల అడవుల్లో మాత్రం మూషిక మొహం.. జింక దేహంతో ఓ బుల్లి ప్రాణి నరసింహుడి కంటే అంతకు ముందే అవతరించింది. ప్రపంచ జింక జాతుల్లో అతి చిన్న ప్రాణి అయిన దీనిని మూషిక జింక అంటారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల సంవత్సరాల క్రితమే పుట్టిన మూషిక జింక శరీర అమరికలో అప్పటినుంచి ఇప్పటివరకు ఎటువంటి మార్పులు జరగలేదట. అందుకే దీనిని సజీవ శిలాజంగా కూడా పరిగణిస్తారు. పెద్దదోర్నాల (ప్రకాశం): మూషిక జింక.. ప్రపంచంలోనే అతి బుల్లి జింక. ఆంగ్లంలో మౌస్ డీర్ లేదా చెవ్రోటేన్గా పిలిచే ఈ జీవి గుండ్రని దేహం.. చిన్న చిన్న కాళ్లతో 25 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు, 10 అంగుళాల ఎత్తు వరకు పెరుగుతుంది. నెమరు వేసుకునే జీవుల్లో పొట్టలో మూడు గదులుండే జీవి ఇదొక్కటే. ప్రపంచంలో క్రమేపీ అంతరించిపోతున్న మూగ జీవాలలో ఒకటైన మూషిక జింకలకు కొమ్ములు ఉండవు. నల్లమల అభయారణ్యంలో సంచరించే అత్యంత చిన్న జీవులు ఇవి. దక్షిణాసియా దేశాలైన భారత్, శ్రీలంక, దేశాలలోనే ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. గడ్డి పరకలు, ఆకులు, పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుని జీవిస్తాయి. బరువు తక్కువ.. భయం ఎక్కువ మూడు కిలోల వరకు బరువు పెరిగే ఈ జీవులు కొమ్ములు లేని కారణంగా పగలంతా గుబురు పొదల్లోనే దాగి ఉంటాయి. కేవలం రాత్రి పూట మాత్రమే ఆరు బయట సంచరిస్తుంటాయి. వీటి గర్భధారణ సమయం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. వీటి జీవిత కాలం కూడా ఆరేళ్లకు మించి ఉండదు. అడవిలో సంచరించే ఏ చిన్న మాంసాహార ప్రాణులైనా వీటిని అవలీలగా వేటాడే అవకాశం ఉంటుంది. ఆకాశంలో సంచరించే గద్దలు, గరుడ పక్షులు నుంచి కూడా వీటికి ఎక్కువగా ముప్పు ఉంటుంది. అవి అవలీలగా వీటిని నోటకరుచుకుని ఆకాశంలోకి ఎగిరిపోయే ప్రమాదం ఉన్నందున పగలు చెట్ల పొదల్లోనే దాగి రాత్రి పూట మాత్రమే అడవిలో సంచరిస్తుంటాయి. నడుం బిగించిన కేంద్ర ప్రభుత్వం అంతరించిపోతున్న వన్య ప్రాణుల జాతులను సంరక్షించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కేంద్ర జంతు సాధికార సంస్థ అంతరించిపోతున్న ఒక్కో వన్యప్రాణి జాతిని సంరక్షించే బాధ్యతను ఒక్కో జంతు సంరక్షణ కేంద్రానికి అప్పగించింది. తిరుపతి జూ పార్క్కు అడవి కోడి, విశాఖపట్నం జూ పార్క్కు వైల్డ్డాగ్, హైదరాబాద్ జూ పార్కుకు మౌస్డీర్ సంరక్షణ బాధ్యతల్ని కేటాయించింది. ఈ నేపథ్యంలో అంతరించిపోతున్న మూషిక జింకలను సంరక్షించటంతో పాటు వాటి పునరుత్పత్తి ప్రక్రియను హైదరాబాద్ జూ పార్క్ 2010లో చేపట్టింది. నాలుగు ఆడ మూషిక జింకలు, రెండు మగ మూషిక జింకలతో హైదరాబాద్ జూ పార్క్లో వీటి సంరక్షణçతో పాటు పునరుత్పత్తిని ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన ఐదేళ్లలోనే వాటి సంఖ్యను భారీగా పెంచగలిగారు. పునరుత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసి మూషిక జింకలను ఆమ్రాబాద్, అచ్చంపేట అడవుల్లో వదిలిపెట్టారు. రాత్రి పూట మాత్రమే సంచరిస్తాయి నల్లమల అభయారణ్యంలో వీటి సంచారం ఎక్కువగా ఉంది. మాంసాహార వన్యప్రాణులు, పక్షుల బారినుంచి కాపాడుకునేందుకు రాత్రి పూట మాత్రమే ఇవి అడవిలో సంచరిస్తుంటాయి. పగటి పూట చెట్ల పొదలోపల నివాసం ఉంటాయి. అంతరించిపోతున్న ఈ జాతిని సంరక్షించేందుకు గతంలో హైదరాబాద్ జూపార్క్ అధికారులు చర్యలు చేపట్టారు. – విశ్వేశ్వరావు, ఫారెస్ట్ రేంజి అధికారి -
పైపుల ద్వారా లోపలికి ప్రవేశించి.. సింగోజి చెరువులో..
సాక్షి, హైదరాబాద్: అది వన్యమృగాలు సంచరించే ప్రాంతం. పులులు, సింహాల సఫారీ కూడా అక్కడే ఉంది. ఈ ప్రదేశంలో జన సంచారం నిషేధం. కానీ.. నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో మాత్రం ఇక్కడ సంచరించేందుకు ఎలాంటి ఆంక్షల్లేవు. గతేడాది కురిసిన వర్షాలకు కూలిన జూ గోడను మళ్లీ కట్టకపోవడంతో జంతువులకే కాదు.. స్థానికులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. రక్షణ గోడ లేకపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలు చేపల వేటకు జంతు ప్రదర్శనశాలలోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ ఉన్న సింగోజి చెరువులో చేపలు వేట కోసం గోడ కూలిన ప్రాంతం నుంచి లోపలికి ప్రవేశిస్తున్నారు. కాగా.. సింగోజి చెరువులో భారీగా మొసళ్లు ఉన్నట్లు తేలింది. ఇటీవల ఓ మొసలి ఏకంగా గోడ కూలిన ప్రాంతం నుంచి నీటి ప్రవాహంలో బయటకు వచ్చి మూసీ నదిలో ప్రత్యక్షం కావడం గమనార్హం. జూ వెనుక భాగంలో.. ► గతేడాది భారీ వర్షాలకు జూ వెనుక భాగంలోని ప్రహరీ గోడ కూలిపోయింది. గోడను పునర్ నిర్మించకుండా కేవలం వరద నీరు బయటకు వెళ్లేలా కొన్ని పైపులు వేసి.. కల్వర్టు నిర్మించారు. దీంతో జూలోకి సులువుగా వెళ్లడానికి స్థానికులకు అవకాశమేర్పడింది. వానాకాలంలో విస్తారంగా కురిసిన వర్షాలకు జూలోని సింగోజి చెరువు నిండుకుండలా మారింది. ఇందులోకి చేపలు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే జూ వెనుక కిషన్బాగ్, బహుదూర్పురా ప్రాంతాలకు చెందిన యువకులు ఈ చెరువులో చేపలు పట్టడానికి.. గోడ కూలిన వేసిన వేసిన పైపుల నుంచి జూలోకి ప్రవేశిస్తున్నారు. ► సింగోజి చెరువులో మొసళ్లు ఉన్న విషయాన్ని జూ అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో ఈ ప్రాంతం నుంచే లోపలికి ప్రవేశించిన ఒకరు పులిని చంపిన ఘటన నేర్పిన పాఠాలను కూడా జూ అధికారులు మరిచిపోవడం దారుణమని జంతు ప్రేమికులు అంటున్నారు. ఇదే జూలో ఎలుగుబంటి కూడా బయటకు రావడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తోంది. బయటి వ్యక్తులను అడ్డుకుంటాం.. గోడ నిర్మాణ పనులను కాంట్రాక్టర్కు ఇచ్చాం. సకాలంలో పనులు పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశాడు. గోడ కూలిన ప్రాంతం నుంచి వ్యక్తులను లోపలి రాకుండా నిఘా పెడతాం. – రాజశేఖర్, జూ క్యూరేటర్ -
Hyderabad: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది తెలుసా!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చీతాల విషయంగా చర్చ జరుగుతోంది. అవి ఎలా ఉంటాయి, వాటి ప్రత్యేకతలేమిటన్న దానిపై అందరిలో ఆసక్తి మొదలైంది. అయితే మన హైదరాబాద్లోని నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది. కావాలనుకుంటే వెళ్లి చూడొచ్చు కూడా. 2012లో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సౌద్ నెహ్రూ జూపార్కులో జరిగిన ఓ సదస్సుకు హాజరయ్యారు. జూలో ఏర్పాట్లను చూసి ముచ్చటపడిన ఆయన జత చీతాలు, జత సింహాలను బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించారు. 2013లో అవి నెహ్రూ జూపార్కుకు చేరుకున్నాయి. 2016లో ఆడ చీతా ఈబా అనారోగ్యంతో చనిపోయింది. అబ్దుల్లాగా పిలిచే మగ చీతా ప్రస్తుతం జూలో ఉంది. ప్రధాని మోదీ ఈ నెల 17న మధ్యప్రదేశ్లో చీతాలను విడుదల చేసిన సందర్భంగా.. నెహ్రూ జూపార్కులోని చీతా ఎన్క్లోజర్ వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. కాగా సౌదీ యువరాజు బహుమతిగా ఇచ్చిన రెండు చీతాలు పెంపుడు జంతువులేనని.. సౌతాఫ్రికా నుంచి చిన్న పిల్లలను తెచ్చి పెంచుకున్న ఆయన తర్వాత నెహ్రూ జూపార్కుకు బహుమతిగా ఇచ్చారని జూపార్కు వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ హకీం తెలిపారు. ఆరు పిల్లలు పెట్టిన సింహాలు సౌదీ యువరాజు బహుమతిగా ఇచ్చిన ఆఫ్రికన్ సింహాలు మదన్, అభిషలకు నెహ్రూ జూపార్కులోనే ఆరు పిల్లలు పుట్టాయి. జూపార్క్లో ఆసియా సింహాల ఎన్క్లోజర్ పక్కనే ఈ ఆఫ్రికన్ సింహాల ఎన్క్లోజర్ ఉంది. చదవండి: చీతాల మేత కోసం చీతల్! తీవ్రదుమారం -
ఒకవైపు నిజం.. మరోవైపు ‘చిత్రం’
పులి అంటే రాజసం.. పౌరుషం..ఈ భావాలకు అద్దం పడుతూ తీసిన ఈ రెండు ఫొటోలను ఓ సారి గమనించండి. ఎడమ వైపు ఉన్న పులి హైదరాబాద్లోని జూ పార్కులో శుక్రవారం తీసిన ఫొటో అయితే.. కుడివైపున ఉన్న పులి ఇంటర్నేషనల్ టైగర్స్డే సందర్భంగా హైటెక్స్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లోని చిత్రం. -
హైదరాబాద్: జూపార్క్ సఫారీ జోన్లోకి పోటెత్తిన వరద నీరు
-
జూలోకి వరద నీరు.. లయన్ సఫారీ మూసివేత
సాక్షి, హైదరాబాద్: మీరాలం ట్యాంక్ ఓవర్ ఫ్లో కారణంగా వరదనీరు జూపార్కులోకి ఒక్కసారిగా వచ్చేసింది. దీంతో జూ అధికారులు వర్షపు నీరు సాఫీగా సాగేందుకు చర్యలు చేపట్టారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లయన్ సఫారీలోని వన్యప్రాణులను నైట్ ఎన్క్లోజర్లోకి తరలించారు. సందర్శకులు లయన్ సఫారీ వైపు వెళ్లకుండా సందర్శనను పూర్తిగా మూసివేశారు. జూపార్కు యథావిధిగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తెరిచి ఉంటుందని జూ అధికారులు తెలిపారు. (క్లిక్: హుస్సేన్సాగర్కు భారీగా వరద నీరు.. జీహెచ్ఎంసీ అలర్ట్) మంచినీటి సరఫరా యథాతథం కృష్ణా ఫేజ్–1 జంక్షన్ మరమ్మతు పనులు వాయిదా వేయడంతో బుధవారం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలకు యథావిధిగా మంచి నీటిసరఫరా జరగనుందని జలమండలి ప్రకటించింది. నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ఇంతకుముందు ప్రకటించిన విషయం విదితమే. భారీ వర్షాల కారణంగా ఈ పనులను తాత్కాలికంగా వాయిదా వేశామని.. తిరిగి మరమ్మతులు చేపట్టే తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. (క్లిక్: హైదరాబాద్ లో అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ?) -
హైదరాబాద్: జూపార్క్లో చేరిన వరద నీరు
-
సండే ఫన్ డే.. ’జూ’లో భలే ఎంజాయ్..
-
జపాన్ నుంచి నెహ్రూ జూ పార్క్కు అరుదైన అతిథులు! జనవరిలోనే..
అరుదైన అతిథులు అడుగిడనున్నాయి. చెంగు చెంగున గంతులేస్తూ కనువిందు చేయనున్నాయి. రానున్న వేసవిలో చిన్నారులను, పెద్దలను అలరించనున్నాయి. ఇక్కడి వాతావరణంలో కంగారూలు మనుగడ సాగిస్తాయా? లేదా అనే మీమాంస మధ్య జపాన్ నుంచి నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల (జూపార్క్)లోకి జత కంగారూలు రానున్నాయి. జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా వీటిని ఇక్కడికి తీసుకురానున్నారు. – సాక్షి, సిటీబ్యూరో జపాన్లోని యోకోహామా జంతు ప్రదర్శనశాలలోని జంతువుల మార్పిడి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని నెహ్రూ జూపార్క్ మధ్య ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర, రాష్ట్రాల అటవీ, పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ, విదేశీ వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ జనరల్ అనుమతి లభించిన తర్వాత కంగారూల తరలింపు ప్రక్రియ ఉంటుంది. మొత్తానికి ఎండాకాలం సెలవులు మొదలయ్యేనాటికి కంగారూలు రంగప్రవేశం చేస్తాయని నెహ్రూ జూపార్క్ క్యూరేటర్ రాజశేఖర్ వెల్లడించారు. జపాన్లోని యోకోహామా జూ నుంచి కంగారూలు, మీర్క్యాట్ (అడవి పిల్లి)కి బదులుగా యోకోహామా జూకు ఆసియా సింహాన్ని ఇవ్వనున్నట్లు క్యూరేటర్ తెలిపారు. గ్లాండ్ ఫార్మా ద్వారా ఎన్క్లోజర్ ►జూకు రానున్న కంగారూల కోసం ఎన్క్లోజర్ నిర్మాణ పనులకయ్యే ఖర్చును భరించడానికి దుండిగల్లోని గ్లాండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. కంగారూల ఎన్క్లోజర్ నిర్మాణ పనుల నిమిత్తం రూ.20 లక్షల చెక్కును గ్లాండ్ ఫార్మా అధికారులు ఇప్పటికే జూ అధికారులకు అందజేశారు. ఎన్క్లోజర్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ►కరోనా మహమ్మారి సీజన్లో నిధుల కొరత కారణంగా జూ అభివృద్ధికి రాజీ పడకుండా జంతువుల కందకాల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ సహకారం ఎంతగానో ఉపయోగపడుతుందని, జంతువులను దత్తత తీసుకుని జూలోని వన్యప్రాణుల సంరక్షణలో పాలుపంచుకునేందుకు పౌరులు, కార్పొరేట్ సంస్థలు అందరూ ముందుకు రావాలని క్యూరేటర్ విజ్ఞప్తి చేశారు. 173 జాతులు.. 1,800 ప్రాణులు.. 380 ఎకరాల్లో విస్తరించిన నెహ్రూ జూపార్క్లో ప్రస్తుతానికి 173 జాతులకు చెందిన 1,800 జీవాలు ఉన్నాయి. కొత్తగా రాబోయే కంగారూలు, మీర్ క్యాట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. జంతువుల మార్పిడిలో భాగంగా గత ఏడాది నెహ్రూ జూపార్కుకు రెండు హిప్పొపొటమస్, సింహం లాంటి తోకలుండే రెండు ముకాన్, బూడిద రంగు తోడేలు, జిరాఫీల జంట, నాలుగు కింగ్ కోబ్రాలను తీసుకొచ్చారు. జంతు మార్పిడి కింద తీసుకువచ్చినవి ఇవీ.. ►రాజ్కోట్ జంతు ప్రదర్శనశాలకు చెందిన ఆసియా జాతి సింహం ఆడ బదులుగా మగ ఆసియాటిక్ సింహం ఆగస్టులో వచ్చింది. ►రెండు జతల అడవి కుక్కలు, కొండ చిలువలు 2 జతలు మంగళూర్ బయోలాజికల్ పార్క్ నుంచి తీసుకువచ్చారు. వీటికి బదులుగా ఒకటి మగ, మూడు ఆడ మూషిక జింకలను జూ పార్కు నుంచి ఇచ్చారు. పెద్ద ఎగ్రెట్ 3 మగ , 3 ఆడ, గ్రే పెలికాన్ 1 మగ, 1 ఆడ మంగళూర్ పిలికుల జూకు అందజేశారు. ►త్రివేండ్రం జూ నుంచి సౌత్ అమెరికా వైట్ రియా 2 జతలు, బ్రౌన్ రియా 2 జతలకు ఎగరని పక్షి జాతి, జత ఎలుగుబంటి, తొండ జాతి ఇగ్వానా సెంట్రల్ అమెరికన్ జత వచ్చే జనవరిలో జూకు వచ్చే అవకాశం ఉంది ►జపాన్లోని ఓకోహామా జూ నుంచి ఒక జత బూడిద రంగు కంగారూ, 1 జత మీర్ క్యాట్ జూకు రానున్నాయి. బదులుగా 1 ఆడ ఆసియా సింహాన్ని ఇస్తారు. దత్తత తీసుకోవడం హర్షణీయం జంతు మార్పిడి పథకంలో భాగంగా జపాన్లోని యోకోహామా జూపార్కు నుంచి నెహ్రూ జూపార్కుకు జత కంగారూలు రెండు నెలల్లో రానున్నాయి. కంగారులు జూకు వచ్చిన తర్వాత ఏడాది అనంతరం వాటిని దత్తత తీసుకుంటామని పలు కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు. వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకు రావడం సంతోషకర విషయం. రానున్న రోజుల్లో జంతు మార్పిడిలో భాగంగా దేశంలోని ఇతర జూల నుంచి కూడా జంతువులు రానున్నాయి. నగర జూ నుంచి కూడా కొన్ని వన్యప్రాణులు బదులుగా ఇస్తాం. – రాజశేఖర్, నెహ్రూ జూ పార్క్ క్యూరేటర్ చదవండి: 2 రోజుల కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘన జరిమానాలు అక్షరాలా రూ. 1.5 కోట్లు! -
నెహ్రూ జూలాజికల్ పార్కు: సింహాల వద్ద వజ్రాలు, బంగారం ఉంటాయని...
బహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. నేరుగా సింహం ఎన్క్లోజర్లోకి దిగే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన సందర్శకుడు అరవడంతో అప్రమత్తమైన జూ సిబ్బంది చాకచాక్యంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని బహదూర్పురా పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3.30గంటలకు జరిగింది. జూ అధికారులు, బహదూర్పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాయి కుమార్ (31) జూపార్కును సందర్శించడానికి టికెట్టు తీసుకొని జూలోకి వెళ్లాడు. తోటి సందర్శకులు, జూ సిబ్బంది కళ్లు కప్పి సింహం ఎన్క్లోజర్ కొండచరియల గోడపైకి ఎక్కాడు. దీంతో అప్రమత్తమైన జూ యానిమల్ కీపర్, సిబ్బంది అతడిని పట్టుకున్నారు. సాయి కుమార్ తిరుమలగిరి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా రోడ్లపై నివాసముంటున్నట్లు బహదూర్పురా ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. సింహాల వద్ద వజ్రాలు, బంగారం ఉంటాయని... వాటి కోసమే సింహం దగ్గరకు వెళ్లానని చెప్పాడని, అతని మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు పేర్కొన్నారు. సాయి కుమార్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సన్నద్ధమైన సింహం... ఆసియా సింహాల ఎన్క్లోజర్ గోడ మీదికి ఎక్కిన యువకున్ని ఎన్క్లోజర్లో ఉన్న సింహం (మనోహర్–7) చూసింది. యువకుడు ఏ మాత్రం కిందికి దిగినా... అదును చూసుకుని దాడి చేసేందుకు సింహం సన్నద్ధమైంది. యువకుడినే గమనిస్తూ తన డెన్ ముందు అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. జూ సిబ్బంది చాకచాక్యంగా వ్యవహరించకపోతే ఆ సింహం చేతిలో యువకుడు సాయి కుమార్ మృత్యువాత పడాల్సి వచ్చేది. యువకుడు సురక్షితంగా బయటపడటంతో జూ సిబ్బంది, అధికారులు, సందర్శకులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ... నగరంలోని మెట్రో రైలు పనుల్లో కార్మికుడిగా పని చేస్తున్న ఓ యువకుడు 2016లో తాగిన మత్తులో సింహం ఎన్క్లోజర్లోకి దిగాడు. ఎన్క్లోజర్ చుట్టు ఉండే నీటిలో ఈత కొట్టుకుంటూ సింహం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన జూ సిబ్బంది, అధికారులు గంట పాటు శ్రమించి అతన్ని బయటికి తీసుకొచ్చారు. రాజస్తాన్కు చెందిన అతనిపై బహదూర్పురా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆ యువకుడు నాలుగు నెలల వరకు జైలు పాలయ్యాడు. -
నెహ్రూ జూపార్కులో యువకుడి హల్చల్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో నెహ్రూ జూపార్కులో ఒక యువకుడు హల్చల్ చేశాడు. ఈ క్రమంలో యువకుడు.. సింహం ఎన్క్లోజర్లో దూకేందుకు ప్రయత్నం చేశాడు. చాలా సేపు .. సింహం ఎన్క్లోజర్కు దగ్గరలోనే కూర్చోని ఉన్నాడు. దీన్నిగమనించిన సందర్శకులు జూ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆ యువకుడిని అక్కడ నుంచి బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో అక్కడి సందర్శకులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. -
హైదరాబాద్ జూపార్క్ను వదలని వరదలు
-
ZOOలో జంతువులను దత్తత తీసుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణులకు తమవంతు సేవ చేయాలనుకునే వారికి నెహ్రూ జూలాజికల్ పార్కు స్వాగతం పలుకుతోంది. వన్యప్రాణులను దత్తత తీసుకోవాలనుకునేవారికి ఎర్రతివాచీ పరుస్తోంది. జూపార్కును తిలకించేందుకు వస్తున్న సందర్శకులు తమకు నచ్చిన జంతువును లేదా పక్షిని ఎంచుకుని వాటి ఆలనా పాలనకయ్యే ఖర్చులను చెల్లించి దత్తత స్కీమ్లో చేరుతున్నారు. ఇటీవల ఓ కుటుంబంలోని చిన్నారులు అయిదు పక్షులను మూడు నెలల పాటు దత్తతకు స్వీకరించడమే ఉదాహరణగా చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన చెక్కును కుటుంబ సభ్యులతో కలసి క్యూరేటర్ వీవీఎల్ సుభద్రా దేవికి అందజేశారు. వన్యప్రాణుల దత్తత ద్వారా ఏడాదికి జూకు కోటి రూపాయల ఆదాయం వస్తోంది. ఏడాది జూ బడ్జెట్ రూ.15 కోట్లుగా ఉంది. పుట్టిన రోజు సందర్భంగా.. పక్షులను దత్తతకు స్వీకరించిన బేబీ సహస్ర శ్రీ, మాస్టర్ చర్విక్ తమ పుట్టిన రోజు వేడుకకు ఖర్చు చేసే మొత్తాన్ని పక్షుల ఆహారం కోసం ఇచ్చారు. సాధారణ సందర్శకులతో పాటు మెగా కోడలు కొణిదెల ఉపాసన, మహేష్బాబు కుమార్తె ఘట్టమనేని సితార, మాజీ ఐపీఎస్ అధికారి ఎన్ఎస్ రామ్జీ, తుమ్మల రచన చౌదరి, గ్లాండ్ ఫార్మా కంపెనీ యానిమల్ అడాప్షన్ స్కీమ్లో చేరారు. ఎస్బీఐ ఇప్పటికే ఇక్కడి పెద్ద పులులను దత్తతకు వరుసగా ప్రతి ఏడాది స్వీకరిస్తూ వస్తోంది. ఫార్మారంగ దిగ్గజం గ్లాండ్ ఫార్మాతోపాటు సినీనటుల కుటుంబ సభ్యులు, అవిశ్రాంత ఉద్యోగులు, ఐటీరంగ నిపుణులు ఉన్నారు. దత్తత ఇలా.. జూలోని వన్యప్రాణులను దత్తత తీసుకోవాలంటే జూ పార్కుకు వెళ్లి క్యూరేటర్ను సంప్రదించాలి. జూలోని మీకు నచ్చిన జంతువు లేదా పక్షులను ఎంపిక చేసుకోవాలి. దత్తత తీసుకున్న వన్యప్రాణి నివసించే ప్రదేశంలో మీరు దత్తత తీసుకున్నట్లు పేరు వివరాలు బోర్డుపై రాసి పెడతారు. దత్తత తీసుకున్న వన్యప్రాణిని చూడడానికి మీకు జూలో అనుమతి ఉంటుంది. సంప్రదించాల్సిన నంబర్లు: 040– 24477355, 94408 10182. ఎంతో సంతృప్తిగా ఉంది వ్యప్రాణుల పట్ల చిన్నప్పటి నుంచే సేవ చేయాలని ఉండేది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో జూలోని పక్షులను దత్తత తీసుకొవాలని నిర్ణయించాం. పుట్టిన రోజుకు అయ్యే ఖర్చుతో మూగ జీవాల ఆలనపాలన చూసుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. – సహస్ర శ్రీ -
హైదరాబాద్ జూపార్క్లో 8 సింహాలకు కరోనా పాజిటివ్
-
వినూ... ఇది మా మెనూ
సాక్షి, హైదరాబాద్: మనలో ఒకరికి పిజ్జా ఇష్టం.. మరొకరికి సమోసా ఇష్టం.. ఇంకొకరికి బిరియానీ అంటే ప్రాణం.. ఒక్కొక్కరిదీ ఒక్కో టేస్ట్.. మరి జంతువుల టేస్ట్ ఏంటో మీకు తెలుసా? మన నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోనే బోలెడన్ని జంతువులు ఉంటాయి కదా.. వాటి ఇష్టాయిష్టాలు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆలోచిద్దాం.. వాటి టేస్ట్లు ఏమిటో తెలుసుకుందాం? రోజూ ఏం తింటున్నాయో చూసి వద్దాం.. సో చలో జూ... అక్కడా, ఇక్కడా.. ఇలా తేడా! అడవుల్లో స్వేచ్ఛగా పెరిగే జంతువులు, పక్షులకు, ఇక్కడి వాటికి తేడా ఉంటుంది. అక్కడ వాటికి సహజసిద్ధమైన ఆహారం దొరుకుతుంది. అయితే అక్కడ వయస్సు పెరిగి ఒంట్లో సత్తువ తగ్గినప్పుడు ఆకలితో చచ్చిపోతుంటాయి. కానీ, ఇక్కడ బలవర్ధకమైన ఆహారం, అవసరం అయినప్పుడు మందులు ఇవ్వడం వల్ల బయటి జంతువుల కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. కొన్ని డైలీ.. మరికొన్ని వీక్లీ.. కొన్ని జంతువులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తింటూనే ఉంటాయి. మరికొన్ని ఒక పూట మాత్రమే తింటాయి. ఇక సరీసృపాలు వారానికి ఒక్కసారి మాత్రమే తింటాయి. నిద్ర కూడా ఒక్కో వన్యప్రాణిది ఒక్కో స్టైల్. కొన్ని రాత్రి మెలకువతో ఉంటాయి. పొద్దంతా నిద్రపోతాయి. ఆయా ప్రాణుల ఆహార అవసరాలు, జీవనశైలికి అనుగుణంగా జూ పార్క్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. వన్యప్రాణుల ఆహారం కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేశారు. పులులు, సింహాలు ఇలా.. పులులు, సింహాలకు ప్రతిరోజు ఏడు కిలోల నుంచి 12 కిలోల వరకు పశువు మాంసం, కాలేయం ఇస్తారు. పులులు, సింహాలు పసందుగా కాలేయం తింటాయి. పశువుల కిడ్నీలు, బ్రెయిన్ కూడా ఇస్తారు. ఇంతేకాదు మరిగించిన అర లీటర్ పాలు కూడా ఇస్తారు. చిరుతకు మూడు కిలోల పశువుల మాంసం, అరలీటరు పాలు ఇస్తారు. రోజుకు ఒకే పరిమాణంలో కాకుండా ఆహారం పెంచుతూ, తగ్గిస్తూ ఉంటారు. ఎలుగుబంటి జూ పార్కులో హిమాలయన్ బ్లాక్, స్లాత్ బేర్ ఎలుగుబంట్లు ఉన్నాయి. వీటికి రకరకాల పండ్లు, చెరకు ముక్కలు, రెండు వందల గ్రాముల తేనె, రెండు కిలోల మైదా జావా, రెండు కిలోల రొట్టెలు, లీటర్ పాలు ఇస్తారు. నీటి ఏనుగు ఒక్కో నీటి ఏనుగుకు 150 కిలోలకుపైగా రోజువారీ ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. 70 కిలోల పచ్చగడ్డి, పశుదాణా 20 కిలోలతోపాటు రకరకాల కూరగాయలను ఆహారంగా ఇస్తారు. దీనికి 3 పూటలా ఆహారం ఇస్తారు. పక్షి జాతులకు పక్షులకు ఇచ్చే ఆహారం పరిమాణం తక్కువగానే ఉంటుంది. విదేశీ పక్షులైన పెలికాన్ పక్షులకు రోజుకు కిలో చేపలు ఇస్తారు. చాలా రకాల పక్షులకు రోజుకు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు పప్పులు, గింజలు, ధాన్యాలు ఇస్తారు. ఏనుగులు అన్ని జంతువుల్లోకెల్లా భారీగా ఆహారం తినే జంతువు ఏనుగు. దీనికి రోజుకు 250 కిలోలకు తక్కువ కాకుండా ఆహారం అందించాల్సి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు తింటూనే ఉంటుంది. ప్రతిరోజు 150 కిలోల పచ్చగడ్డి, 50 కిలోల పశుదాణా, రాగి జావ, బెల్లం, ఉప్పు, అరటిపళ్ళు, 50 కిలోల చెరకు, కొబ్బరి ఆకులు అందించాల్సి ఉంటుంది. తాబేలు తాబేళ్ల ఆహారం తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. సుమారు 300 ఏళ్ల సుదీర్ఘ జీవితం గడిపే తాబేళ్లు రోజువారీ ఆహారం కేవలం 250 గ్రాములే. క్యాబేజి, క్యారెట్, పాలకూర వంటివి అన్నీ కలుపుకొని కేవలం 250 గ్రాములు మాత్రమే తింటాయి. ఇక నీటి తాబేలు రోజూ 200 గ్రాముల చేపను మాత్రమే తింటుంది. ఇతర జంతువులకు.. తోడేలుకు రెండు కిలోలపశువుల మాంసం ఇవ్వాల్సి ఉంటుంది. నక్కకు కిలో పశువు మాంసం మొసలికి 5 కిలోల చొప్పున పశువు మాంసంతోపాటు పుచ్చకాయలు, పండ్లు, చేపలు ఇస్తారు. దుప్పులు, ఇతర జింక జాతులకు కిలో పశుదాణాతోపాటు పచ్చగడ్డి అవసరాన్ని బట్టి, రెండు కట్టెల తోటకూర, పావుకిలో క్యారెట్, 100 గ్రాముల క్యాబేజీ, కొద్ది మోతాదులో కీరదోస, గుమ్మడి వంటివి పెడతారు. కొండచిలువకు వారానికి ఒక కోడి, ఒక ఎలుక సరిపోతుంది. ఇతర పాములకు వారానికి ఆరు నుంచి ఎనిమిది కప్పలు, ఒకటి లేదా రెండు ఎలుకలు ఒక ఆహారంగా ఇస్తారు. బర్డ్ఫ్లూ నివారణ చర్యల్లో భాగంగా జూలో చికెన్ వినియోగించడం లేదు. దీంతోపాటు పక్షులు సంచరించే ప్రాంతంలో అధికారులు నిఘా పెంచారు. -
తెల్ల పులులను చూడాలా..?
సాక్షి, బహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కుకు ప్రత్యేకమైన రాయల్ బెంగాల్ వైట్ టైగర్లు కొత్త సంవత్సరం నుంచి జూ సందర్శకులను అలరించనున్నాయి. జూపార్కు వ్యవస్థాపక దినమైన అక్టోబర్ 6న కునాల్, దివ్యానీ దంపతులకు నాలుగు పులి కూనలు జన్మించాయి. వాటిని కలుపుకొని జూలో మొత్తం 14 రాయల్ బెంగాల్ వైట్ టైగర్లు ఉన్నాయి. ఇందులో మగవి ఆరు, ఆడవి మూడు ఉన్నాయి. జూపార్కులో చేపట్టిన సంతానోత్పత్తిలో పుట్టిన ఈ పులులకు జూ అధికారులు, అటవీ శాఖ మంత్రులు పేర్లు పె ట్టారు. జూలో తెల్ల పులుల పేర్లు నాగమణి, కవి, సమీరా, అభిమన్యు, శంకర్ పేర్లు పెట్టారు. మన దేశంలో రాయల్ బెంగాల్ వైట్ టైగర్లు ప్రత్యేకమైనవి. ఇతర దేశాల్లో ఇవి అరుదు. -
ఐదు నెలల తర్వాత సందడిగా నెహ్రూ జూ పార్కు
-
‘రాణి’ని దత్తత తీసుకున్న ఉపాసన
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులోని ‘రాణి’ అనే ఏనుగును అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కొణిదెల ఏడాది కాలానికి దత్తత తీసుకున్నారు. సోమవారం జూ పార్కును సందర్శించిన ఆమె రాణిని ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి దాని పోషణకు అయ్యే ఖర్చు నిమిత్తం రూ. 5 లక్షల చెక్ను క్యూరేటర్, ఐఎఫ్ఎస్ అధికారిని క్షితిజకు అందజేశారు. ఈ సందర్భంగా క్యూరేటర్ క్షితిజ మాట్లాడుతూ... జూపార్కులో వన్యప్రాణుల సంరక్షణ బలోపేతం చేయడంలో భాగంగా ఉపాసన కొణిదెల చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. అడవి జంతువుల పరిరక్షణలో ఉపాసన కృషి అభినందనీయమన్నారు. ఉపాసన నిబద్ధత చాలా మందికి ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. కరోనా కాలంలో హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువులను దత్తత తీసుకోవడానికి ఎక్కువ మంది ముందుకు వస్తారని క్షితిజ ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు ఉపాసన పుట్టినరోజు కావడం విశేషం. (పూల హరివిల్లు మధ్య ఉపాసన: చెర్రీ విషెస్) (పెద్దపులి దత్తతకు రూ.5 లక్షల చెక్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెద్దపులి దత్తతకు రూ.5 లక్షల చెక్
బహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని రాయల్ బెంగాల్ టైగర్ను ఆరిజన్ ఫార్మా స్యూటికల్ సర్వీసు సీఈఓ రవి వెంకటరమణ సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. శనివారం జూ పార్కుకు వచ్చిన ఆయన రాయల్ బెంగాల్ టైగర్ (ప్రభాస్)ను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి దాని పోషణకు అయ్యే ఖర్చు నిమిత్తం రూ.5 లక్షల చెక్ను డిప్యూటీ క్యూరేటర్ నాగమణికి అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ క్యూరేటర్ మాట్లాడుతూ... కార్పొరేట్ సంస్థలు వన్యప్రాణుల దత్తతకు ముందుకు రావాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో ఆరిజన్ ఫార్మా సర్వీసు కంపెనీ ప్రతినిధులు దీపక్ రాజ్, జూపార్కు బయోలజిస్ట్ సందీప్, పీఆర్ఓ హనీఫుల్లా పాల్గొన్నారు. (రాయల్ బెంగాల్ టైగర్ కదంబ మృతి) చెక్ను అందజేస్తున్న ఆరిజన్ ఫార్మా సూటికల్ సర్వీసు సీఈఓ -
హైదరాబాద్ జూ పార్క్లో మరో పులి మృతి
-
అధికారులకు చిక్కిన చిరుత మృతి
సాక్షి, హైదరాబాద్/నల్గొండ : నల్గొండ జిల్లాలో అటవీ అధికారులకు చిక్కిన చిరుత మృతి చెందింది. ఈ విషయాన్ని నెహ్రూ జూపార్కు అధికారులు స్వయంగా తెలిపారు. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా మర్రిగూడం మండలం రాజపేట తండా వద్ద అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలో చిరుత చిక్కుకొంది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు చిరుతకు మత్తు ఇచ్చి జీప్లో హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. చిరుత కంచెలో ఇరుక్కు పోవడంతో దానికి బాగా గాయాలయి రక్తం బాగా పోయిందని వైద్యాధికారులు తెలిపారు. దీంతో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో వేడిమికి తట్టుకోలేక చిరుత మృతి చెందినట్లుగా నిర్థారించారు. -
కరోనా : రిలాక్స్ మోడ్లో జంతువులు
సాక్షి, చార్మినార్ : నిత్యం సందడిగా ఉండే జూ పార్కులో లాక్డౌన్ కారణంగా నిశ్శబ్దం ఆవహించింది. మామూలు సమయంలో వన్యప్రాణులను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చేవారు. వాటిని చూసిన ఆనందంలో చిన్నారుల కేరింతలు, అరుపులతో ఆ ప్రాంతం మార్మోగేది. కరోనా వైరస్ నుంచి వన్యప్రాణులను కాపాడేందుకు జూ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎండాకాలం కావడంతో వేడి నుంచి కాపాడేందుకు చర్యలు చేపట్టారు. వాటికి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. జూపార్కులో సందర్శకులు లేకపోవడంతో వన్యప్రాణులు ఎంజాయ్ చేస్తున్నాయి. ఫుల్ జోష్తో ఉండటంతో పాటు అడవిలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోని జంతువులు రోజంతా హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి. లాక్డౌన్ ప్రభావం ఇక్కడి జూ పార్కులో కనిపించడం లేదు. ఎలాంటి టెన్షన్ లేకుండా వణ్యప్రాణాలు సరదాగా గడుపుతున్నాయి. లాక్డౌన్ కారణంగా విజిటర్స్కు అనుమతి లేకపోయినప్పటికీ.. జూలో ఎప్పటిలాగే కార్యకాలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు విజిటర్స్తో సందడిగా ఉండే జూపార్కు.. కొద్దిరోజులుగా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. విజిటర్స్ చప్పుళ్లు, చిన్నారుల కేరింతలు, బ్యాటరీ వాహనాల రాకపోకలు, చిట్టిరైలు ప్రయాణాలతో జూపార్కులో సందడే.. సందడి. ఇవ్వన్నీ ఇక్కడి జంతువులన్నీ అలవాటైపోయాయి.(మ...మ... మాస్క్... టీమిండియా ఫోర్స్!) ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. విజిటర్స్ ఎవరూ రాకపోవడంతో ప్రతిరోజు ఎన్క్లోజర్ల వద్దకు యానిమల్ కీపర్స్, వెటర్నరీ డాక్టర్స్ ఇతర సిబ్బంది వెళ్తున్నారు. వీరితోనే కాలక్షేపం చేస్తున్న జంతువులకు ఎక్కడ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు, యానిమల్ కీపర్లు ఇతర సిబ్బంది రౌండ్ ది క్లాక్ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం జూలోని జంతువులన్నీ ప్రశాంతంగా గడుపుతున్నాయి. వేళకు ఫీడింగ్ అయిపోగానే.. ఎన్క్లోజర్స్లో కాలక్షేపం చేస్తున్నాయి. డే ఎన్క్లోజర్స్ సమయం ముగియగానే.. నైట్ ఎన్క్లోజర్స్లోకి వెళ్తున్నాయి. విజిటర్స్ లేనంత మాత్రానే జూలోని జంతువులను నైట్ ఎన్క్లోజర్స్కు పరిమితం చేయడం లేదు. యథావిధిగానే రోజువారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గుహలకే పరిమితం కావడం లేదు. వాటి ఎన్క్లొజర్స్లలో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఉదయం 10:30 గంటల కల్లా ఫీడింగ్ పూర్తి కాగానే జంతువులను రిలీజ్ చేస్తూ.. సాయంత్రం 4:30 గంటలకు తిరిగి నైట్ ఎన్క్లోజర్లకు పంపిస్తున్నారు. లాక్డౌన్ పీరియడ్లో.. గర్భినిగా ఉన్న సైనా అనే ఎల్లో టైగర్ పండంటి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అలాగే నక్క జాతికి చెందిన జకాల్ అనే జంతువు 6 పిల్లలకు జన్మనిచ్చింది. కట్టుదిట్టమైన చర్యలు.. నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోని వన్యప్రాణులపై కోవిడ్–19 వైరస్ ప్రభావం పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అమెరికా న్యూయార్క్లో ఓ పెద్ద పులికి కరోనా వైరస్ వచ్చినట్లు వార్తలు రావడంతో జూపార్కులోని అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. వన్యప్రాణుల ఎన్క్లోజర్ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ క్రిమిసంహారక మందులైన సోడియం హైపో క్లోరైడ్ను పిచికారీ చేస్తున్నారు. వన్యప్రాణుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలను సేకరిస్తున్నారు. యానిమల్ కీపర్లు మాస్క్లు, గ్లౌజ్లతో పాటు చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లను వాడుతూ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. సెంట్రల్ జూ అథారిటీ, పీసీసీఎఫ్ అధికారుల సూచన మేరకు జూలో కరోనా వ్యాప్తి చెందకుండా నెల నుంచే ఈ ముందు జాగ్రత్త చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు బయటి నుంచి జూపార్కులోకి వచ్చి విధినిర్వాహణ కొనసాగించే సిబ్బంది ద్వారా వణ్యప్రాణులకు ఎలాంటి వైరస్ ఎఫెక్ట్ లేకుండా ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. జూపార్కులోని సిబ్బందికి జూ సర్వీస్ గేట్ వద్ద థర్మల్ స్కానింగ్ జరుపుతున్నారు. అంతేగాకుండా ఎన్క్లోజర్ల వద్ద ఫూట్ బాత్ నిర్వహిస్తున్నారు. యాంటీ వైరస్ పౌడర్ను చల్లుతున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కూలర్స్తో పాటు నీటి తుంపర్లతో పిచికారీ చేస్తున్నారు. ప్రతి 2 గంటలకు ఆరోగ్య సమాచార సేకరణ.. కోవిడ్–19 ప్రభావం జంతువులపై పడకుండా జూ క్యూరేటర్ ఎప్పటికప్పుడు జూలోని వెటర్నరీ వైద్యుల ద్వారా ప్రతి రెండు గంటలకు ఆరోగ్య సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. ఓ వైపు కోవిడ్ వైరస్.. మరోవైపు వేసవి కాలం కావడంతో జూలోని జంతువుల ఆరోగ్యంపై నిరంతరం నిఘా కొనసాగుతోంది. విజిటర్స్ లేకపోయినా.. ప్రతిరోజు 120 మంది వరకు యానిమల్ కీపర్స్ జూలో విధినిర్వాహణ కొనసాగిస్తుంటారు. వీరందరూ ఆయా ఎనిమల్స్ ఎన్క్లోజర్స్ వద్దకు వెళ్లి జంతువులకు అవసరమైన ఫీడింగ్, ఇతర ఏర్పాట్లను చేస్తుంటారు. తద్వారా జంతువులకు కరోనా వైరస్ సోకకుండా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. జంతువుల్లో రోగ నిరోధక శక్తి పెరగడానికి శుభ్రమైన నీటిలో గ్లూకోన్ డీ, కొబ్బరి బోండాం, వాటర్ మిలన్, సీ విటన్ కోసం సంత్రాలు, ఆరేంజ్ పళ్లను అందిస్తున్నామని జూ అధికారులు తెలిపారు. జూపార్కులోని వన్యప్రాణులకు కరోనా వైరస్ సోకకుండా ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తున్నారు. జూ పార్కులోని వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో కరోనా లక్షణాలను పరిశీలించడంతో పాటు వైరస్ సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
సుజీ.. ఎంతపని చేసింది!!
బహదూర్పురా: జూలో తోడు లేక తల్లడిల్లుతున్న ఓ చింపాంజీ అక్కడ పనిచేసే హెడ్ మాలీపై దాడి చేసి గాయపరిచింది. హైదరాబాద్లోని నెహ్రూ జూపార్క్లో ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం ఎన్క్లోజర్లో నుంచి బయటికి వచి్చన ఆడ చింపాంజీ సుజీ.. హెడ్ మాలీ యాదయ్యపై దాడి చేసి కాలిపై గాయపరిచింది. సోమవారం జూపార్కుకు సెలవు కావడంతో పెద్ద గండం తప్పింది. ప్రముఖ వ్యాపార సంస్థ సహారా చైర్మన్ సుబ్రతోరాయ్ 2011లో బహుమతిగా ఆడ చింపాంజీ సుజీని జూకు అందించారు. అప్పట్నుంచి సుజీ జూలో సందర్శకులను అలరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే పెద్దదైన సుజీ ఒంటరితనం అనుభవిస్తోంది. ఇటు జూ సిబ్బంది ఇన్నాళ్లైనా దానికి ఓ తోడును తేవడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే సుజీ గతంలో ఆహారం కూడా మానేసి తీవ్ర అస్వస్థతకు గురై కోలుకుంది. ఎన్క్లోజర్లో నుంచి సుజీ బయటికి రావడం ఇది రెండోసారి. గతంలో యానిమల్ కీపర్ను ఎన్క్లోజర్లో ఉంచి బయటి నుంచి సుజీ గడియపెట్టింది. కాగా దాడి ఘటనపై సమాచారం అందుకున్న జూ వెటర్నరీ వైద్యులు, అధికారులు వెంటనే స్పందించి ఫుడ్కోర్ట్ వద్ద సుజీపై మత్తు మందు ప్రయోగించి పట్టుకున్నారు. గాయపడిన యాదయ్యను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జూ అధికారులు విచారణ చేపట్టారు. -
అంకితభావంతో పనిచేయాలి
బహదూర్పురా: అడవుల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని అటవీ సంక్షేమ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం నెహ్రూ జూలాజికల్ పార్కులో అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం ‘జంగల్ బచావో...జంగల్ బడావో’నినాదంతో అటవీ సంరక్షణకు కృషి చేస్తుందన్నారు. గత రెండేళ్ల నుంచి రాష్ట్రంలో సెప్టెంబరు 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 1984 నుంచి తెలంగాణ రాష్ట్రంలో 21 మంది అటవీ అమరవీరులు విధి నిర్వహణలో ప్రాణాలర్పించారన్నారు. అటవీ అమరవీరుల అంకితభావం, త్యాగనిరతిని ఆదర్శంగా తీసుకుని అటవీ సంరక్షణకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. పోలీసు శాఖ అనంతరం అత్యధిక ఉద్యోగాలు కలిగిన శాఖ అటవీ శాఖ అని, 4,500 మందికి ఉద్యోగాలు కల్పించామని, మరో 1,000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్లు శోభా, రఘువీర్, మునీంద్ర, స్వర్గం శ్రీనివాస్, గ్యాబ్రియల్, పృథ్వీరాజ్, లోకేశ్ జైశ్వాల్, అదనపు పీసీసీఎఫ్లు, విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అనారోగ్యంతో పెద్ద పులి మృతి
బహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో మంగళవారం వినయ్ (21) అనే పెద్దపులి అనారోగ్యంతో మృతి చెందింది. గత ఏడాదిగా తీవ్ర అనారోగ్యంతో పాటు వృద్ధాప్యంతో బాధపడుతున్న పెద్దపులి మంగళవారం ఉదయం మృతి చెందింది. గత కొంతకాలంగా సమ్మర్ హౌజ్లోని ఇన్టెన్సివ్ కేర్లో పశు వైద్య నిపుణులు డాక్టర్ ఎం.నవీన్ కుమార్ బృందం దానికి చికిత్స అందజేస్తోంది. డాక్టర్ లక్ష్మణ్, ప్రొఫెసర్ డాక్టర్ సదానంద్ తదితరులు పోస్టుమార్టం నిర్వహించారు. నమునాలను సేకరించి శాంతినగర్లోని వీబీఆర్ఐకు పంపినట్లు వారు తెలిపారు. -
జూపార్క్ను దేశంలోనే అగ్రగామిగా నిలపాలి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని జూపార్కుతో సహా రాష్ట్రంలోని తొమ్మిది జూపార్కుల్లో సందర్శకుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. సోమవారం జూపార్క్లో జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (జపాట్) గవర్నింగ్ బాడీ సమావేశంలో తెలంగాణలోని ఎనిమిది జూలు, పార్కుల తీరుతెన్నులను ఆయన సమీక్షించారు. టెక్ మహీంద్రా కంపెనీ సామాజిక బాధ్యత కింద రూ.కోటితో జూపార్క్ ఎంట్రీ గేట్ పునరాకృతి, ఫుడ్కోర్టు నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రాగా బోర్డు దానికి అనుమతినిచ్చింది. రోజురోజుకూ జూకు వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 2020–2040 పేరుతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు రూపొందించిన మాస్టర్ ప్లాన్పై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ ప్రశాంత్కుమార్ ఝా, అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర, జూ పార్కుల డైరెక్టర్ సిద్దానంద్ కుక్రేటి, సీసీఎఫ్ అక్బర్, ఓఎస్డీ శంకరన్, జూపార్క్ క్యూరేటర్ క్షితిజ తదితరులు పాల్గొన్నారు. జూపార్కుకు అదనపు ఆకర్షణలు.. నగరంలోని జూపార్కు అదనపు ఆకర్షణలతో సందర్శకులను మరింతగా అలరించనుందని ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. సోమవారం నెహ్రూ పార్క్లో ఆఫ్రికన్ సింహం, దాని రెండు కూనలు, ఆస్ట్రిచ్ పక్షులు, స్టార్క్ ఎన్క్లోజర్స్, డక్ ఫాండ్ వాక్ త్రూ ఇవరీలను మంత్రి ప్రారంభించారు. అనంతరం మహారాష్ట్ర అమరావతి యూనివర్సిటీకి చెందిన గడ్డి శాస్త్ర పరిశోధకుడు డా.మురాత్కర్ను మంత్రి సన్మానించారు. -
జూ పార్క్లో కూలిన భారీ వృక్షం.. మహిళ మృతి
సాక్షి, హైదరాబాద్ : నగరంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి జూపార్కులో చెట్టు నెలకొరగడంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు, జూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్కు చెందిన నిఖత్ ఫాతిమా (60) కుటుంబ సభ్యులతో కలిసి నెహ్రూ జూలాజికల్ పార్కు సందర్శనకు వచ్చింది. శనివారం సాయంత్రం ఈదురు గాలులకు పెద్ద వర్షం రావడంతో భారీ చెట్టు కూలి నెలకొరిగాయి. జూలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న నిఖత్ ఫాతిమాపై భారీ చెట్టు పడటంతో తీవ్ర గాయాలకు గురైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో పాటు మరో 10 మందికి స్వల్ప గాయాలకు గురైనట్లు పోలీసులు, జూపార్కు అధికారులు తెలిపారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన ఫారెస్ట్ అధికారులు పార్క్ సందర్శనకు వచ్చిన ఓ సందర్శకురాలు మృతి చెందడం...పదిమందికి పైగా సందర్శకులు గాయాల పాలవడంపై హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా విచారం వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూపార్కు డైరెక్టర్ సిదానంద్ కుక్రెట్టి, జూ క్యూరేటర్ క్షితిజాలు జూలో నెలకొరిగిన చెట్ల ప్రదేశాలను పరిశీలించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. గాలివాన దెబ్బకు నేలకూలిన చెట్లు శనివారం సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాల్లో కురిసిన గాలి వానకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలాయి.చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరునిలిచిపోయింది. సాయంత్రం 6 గంటల వరకు 47 చెట్లు కూలినట్లు, 18 ప్రాంతాల్లో నీరు నిలిచిపోయినట్లు జీహెచ్ఎంసీకి ఫిర్యాదులందాయి. వాన సమస్యలపై అందిన ఫిర్యాదులకు తక్షణమే స్పందిస్తూ జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు రంగంలోకి దిగి తక్షణ సహాయక చర్యలందించాయి. బహదూర్పురా పోలీస్స్టేషన్, కామినేని ఆస్పత్రి, హైకోర్టు వెనుక భాగంలో, హుస్సేనిఆలం పీఎస్ ముందు, మిశ్రీగంజ్ ఆయా హోటల్, శాలిబండ పీఎస్ వెనుక, హుస్సేనీఆలం హనుమాన్ మందిర్ వద్ద,తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. పాతబస్తీలోని నూర్ఖాన్ బజార్లో కొత్తగా నిర్మించిన భవనం పిట్టగోడ కూలింది. దాంతోపాటు చెట్లు కూడా నేలకొరిగి అక్కడున్న మూడు బైక్లపై పడ్డాయి. ఫలక్నుమా రైల్వేస్టేషన్ పార్కింగ్ ప్రదేశంలో భారీ చెట్టు నేలకూలింది. ఆయా ప్రాంతాల్లో గాయపడ్డవారికి డీఆర్ఎఫ్ బృందాలు ప్రాథమిక వైద్యసేవలందించాయి. జోనల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉండి, అత్యవసర ఫిర్యాదులపై క్షేత్రస్థాయి బృందాలు తక్షణ సాయమందించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ దానకిశోర్ సూచించారు. లోతట్టు ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఇంజినీర్లకు సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. -
జంతువులు ఎందుకు చనిపోతున్నాయి?
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్క్లో తరచుగా జంతువులు మృత్యువాత పడుతుండటంపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అటవీ అధికారుల నుంచి వివరణ కోరారు. ఈమేరకు ‘జూపై రోగాల దాడిì ’అనే శీర్షికతో ఈనెల 6న జంతువులు మరణిస్తున్న తీరును వివరిస్తూ ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. దీనిపై మంత్రి స్పందించారు. గురువారం సచివాలయంలో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జంతువుల మృతిపై వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ మునీంద్ర, జూపార్క్ డైరెక్టర్ సిద్ధాంత్ కుక్రేటీల నుంచి వివరణ కోరారు. వార్ధక్యం, తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడం వల్లనే అరుణ అనే సింహం, జమున అనే ఏనుగు, దీప అనే చిరుత మృతి చెందాయని అధికారులు మంత్రికి వివరించారు. జూపార్క్లో ఉన్న మిగతా జంతువుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. జంతువుల సంరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మెరుగైన వైద్యాన్ని అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను హెచ్చరించారు. -
'జూ’పై రోగాల దాడి
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల మృత్యువాత సీరియల్గా సాగుతోంది. తాజాగా మరో జంతువు చనిపోయింది. బుధవారం రాత్రి పొద్దుపోయాక దీప అనే ఆడ చిరుతపులి చనిపోయింది. దీని వయస్సు 22 ఏళ్లు. గత కొద్దికాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న చిరుతకు సరైన వైద్యం అందక చనిపోయింది. గడిచిన ఏడాది కాలంలో ఇక్కడి జూలో ఏనుగు, అడవిదున్న, నీటిగుర్రం, నీటి కుక్క, హైనా, సారస్ క్రేన్ పక్షి, చింపాంజి, ఎలుగు బంటి, నామాల కోతులతో సహా 70కి పైగా జంతు వులు చనిపోయాయి. వృద్ధాప్యంతోనే జంతువులు చనిపోతున్నాయని జూ అధికారులు చెబుతున్నప్పటికీ... ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులు చుట్టుముట్టడంతోనే జంతువులు మరణిస్తున్నాయని రిటైర్డ్ ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. అన్ని జంతువులకూ ఒకటే వ్యాధి చనిపోతున్న జంతువులన్నీ, శ్వాస, జీర్ణ సంబంధ వ్యాధులతోనే చనిపోతున్నట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. నెలల తరబడి ఎన్క్లోజర్లను శుభ్రం చేయకపోవటం, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వల్లే జంతువులు మరణిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. -
జూపార్కులో ఉద్యోగుల ధర్నా
హైదరాబాద్: ఎలాంటి కారణం లేకుండా ఇద్దరు జూపార్కు ఉద్యోగులను సస్పెండ్ చేశారంటూ ఉద్యోగులు ధర్నాకు దిగారు. బహదూర్ పురాలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు సిబ్బంది బిక్షపతి, శ్రీనివాస్ అనే వారు ఇటీవల సస్పెన్షన్కు గురయ్యారు. వారిని అకారణంగా శిక్షించారంటూ జూ ప్రాంగణంలో ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. సస్పెన్షన్ను వెంటనే తొలగించి వారిని విధుల్లోకి తీసుకోవాలని జూపార్కు జేఏసీ నాయకుడు దేవేందర్ డిమాండు చేశారు. ఆందోళన కారణంగా మూగ జీవులకు ఉదయం 10 గంటలకు అందాల్సిన ఆహారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందించారు. -
టైగర్ నిఖిల్ పరిస్థితి విషమం
- జూపార్కులో వరుసగా మృతి చెందుతున్న వన్యప్రాణులు హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులోని రాయల్ బెంగాల్ టైగర్ (నిఖిల్–18) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని జూపార్కు క్యూరేటర్ శివానీడోగ్రా తెలిపారు. జూపార్కులో 1999 అక్టోబర్ 8న జన్మించిన నిఖిల్ రెండు నెలల నుంచి నిమోనియా వ్యాధితో బాధపడుతుందన్నారు. జూపార్కు విశ్రాంత డాక్టర్ నవీన్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామని తెలి పారు. వారం రోజుల నుంచి వైద్యానికి నిఖిల్ శరీరం స్పందించడం లేదని అన్నారు. కొన్ని నెలల నుంచి జూపార్కులో వరుసగా అదురైన వన్యప్రాణులు మృతి చెందుతున్నాయి. వృద్ధాప్యంతో నీటి గుర్రం మృతి చెందగా... వ్యాధులతో చిరుతపులి, అడవి దున్న మృతి చెందాయి. జూపార్కులో ప్రతి ఏడాది 100కు పైగా కొత్త వన్యప్రాణులు జీవం పోసుకుంటున్నాయని చెప్పుకుంటున్న జూ అధికారులు వృద్ధాప్యంతో ఉన్న వన్యప్రాణుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. తరుచూ వన్యప్రాణులు వ్యాధులతో మృతి చెందితే వృద్ధాప్యం కారణమంటూ పేర్కొంటున్నారు. -
వాటి పునరుత్పత్తిలో జూకు మొదటిస్థానం
బహదూర్పురా: వన్యప్రాణుల పునరుత్పత్తిలో నెహ్రూ జూలాజికల్ పార్కు దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని వైల్డ్లైఫ్ పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ ఎ.కె. శ్రీవాత్సవ్ అన్నారు. జూపార్కు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం జూలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమష్టి కృషితో జూ పార్కు ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. దేశంలో మొట్ట మొదటిసారిగా ఓపెన్ లయన్ సఫారీ, సరిసృపాల జగత్తు, ఓపెన్ బటర్ ఫ్లై పార్కు ప్రారంభించామన్నారు. సందర్శకుల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న జూను మొదటి స్థానంలో తీసుకొచ్చేందుకు జూ అ«ధికారులు కృషి చేయాలన్నారు. మౌస్ డీర్ సంతానోత్పత్తితో గణనీయమైన ఫలితాలను సాధించినట్లు తెలిపారు. ఫిస్ అక్వెరియాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బెస్ట్ ఎన్క్లోజర్గా జిరాఫీ, సరిసృపాల జగత్తు, చింపాంజీ, మక్ హౌస్ ఎన్క్లోజర్లకు వరుసగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ పీసీసీఎఫ్ పృథ్వీరాజ్, క్యూరేటర్ శివానీ డోగ్రా, డిప్యూటీ చీఫ్ కన్జర్వేటర్, తదితరులు పాల్గొన్నారు. -
వరద సఫారీ!
నెహ్రూ జూలాజికల్ పార్క్ను ముంచెత్తుతున్న వరద నీరు - నాలాల కబ్జాతో ఉప్పొంగుతున్న మీరాలం చెరువు - ప్రహరీని దాటి పార్క్లోకి ప్రవాహం... జంతు ప్రేమికుల ఆందోళన హైదరాబాద్: ఇటీవల నగరంలో కురిసిన కుండపోత వర్షాలు ప్రఖ్యాత నెహ్రూ జూలాజికల్ పార్క్కు ప్రాణసంకటంగా మారాయి. భారీ వర్షాల కారణంగా జంతు ప్రదర్శనశాల ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న మీరాలం ట్యాంక్ ఉప్పొంగుతోంది. చెరువుకు సంబంధించిన నాలాలు కబ్జాకు గురికావడం.. వరద నీరు బయటికి సాఫీగా వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వరద నీరు నేరుగా జూపార్కులోకి ప్రవేశిస్తోంది. సుమారు 30 అడుగుల ఎత్తున్న జూ ప్రహరీని దాటిమరీ వరద నీరు పార్క్ను ముంచెత్తుతోంది. ఐదు రోజులుగా జూపార్కులోని సింహం, పులుల సఫారీల్లోకి భారీగా వరదనీరు చేరడంతో వన్యప్రాణులు బిక్కుబిక్కుమంటున్నాయి. కబ్జాలతోనే ఈ దుస్థితి.. జూపార్కు ప్రహరీగోడకు ఆనుకుని ఉన్న మీరాలం చెరువు భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఉప్పొంగుతోంది. చెరువుకు సహజసిద్ధంగా ఉన్న నాలాలు, తూములు కబ్జాలకు గురికావడంతో వరద నీరు బయటికి వెళ్లే పరిస్థితులు లేకుండాపోయాయి. సుమారు 30 అడుగుల ఎత్తున ఉన్న జూప్రహరీని దాటి వరదనీరు పార్క్ను ముంచెత్తుతోంది. దీంతో జూపార్కులోని ఓపెన్ లయన్ సఫారీలోకి వరదనీరు చేరుతోంది. ఇలా భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ లయన్ సఫారీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సందర్శకులకు వన్యప్రాణులను చూసే భాగ్యం దక్కడంలేదు. లయన్ సఫారీలోకి చేరిన నీరు బయటికి సక్రమంగా వెళ్లే ఏర్పాట్లు లేకపోవడంతో జూపార్క్ అధికారులు లయన్ సఫారీని మూసేస్తున్నారు. వరద నీరు చేరడంతో ఈ నెల 15, 16వ తేదీల్లో పార్కులోకి సందర్శకులను అనుమతించలేదు. వరదనీరు కొద్దిగా తగ్గడంతో 17వ తేదీన సందర్శకులను అనుమతించారు. ఆదివారం కూడా వరదనీరు జూపార్కులోని కుంటల్లోకి ప్రవేశించడంతో సందర్శకులను అనుమతించలేదు. దీంతో సెలవురోజున జూపార్కును చూసేందుకు వచ్చిన సందర్శకులు నిరుత్సాహానికి గురయ్యారు. పరిష్కారం ఇలా.. మీరాలం చెరువుకు సహజసిద్ధంగా ఉన్న తూములు, నాలాలను కబ్జా చెర నుంచి విముక్తి కల్పించాలి. ఆక్రమణలను పూర్తిగా తొలగించాలి. వరద ప్రవాహం సాఫీగా వెళ్లే ఏర్పాట్లు చేయాలి. జూపార్క్ ప్రహరీ గోడ ఎత్తును పెంచాలి. 80 ఎకరాలు కబ్జా..? 1963లో అందుబాటులోకి వచ్చిన నెహ్రూ జూలాజికల్ పార్కు అప్పట్లో 380 ఎకరాల్లో విస్తరించి ఉండేది. ఇందులో 80 ఎకరాల వరకు కబ్జాకు గురైనట్టు సమాచారం. జూపార్కు ఏర్పడిన కొత్తలో నిర్ధిష్టమైన ప్రహరీ లేకపోవడం, పక్కనే మీరాలం చెరువు ఉండటం, జూపార్కు చుట్టూ బస్తీలు ఏర్పడటం వంటి కారణాలతో జూపార్కు కుంచించుకుపోయింది. అరుదైన జీవజాలానికి ఆలవాలం.. జూపార్క్లో ప్రస్తుతం 158 జంతు జాతులకు చెందిన సుమారు 1,500 జంతువులు, అరుదైన పక్షులు, పాములు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. పర్యావరణ, జీవావరణ వ్యవస్థలు ఇక్కడ కొలువై ఉన్నాయి. హార్న్బిల్, పెలికాన్, ఫ్లెమింగో, సారాస్ క్రేన్, లవ్బర్డ్స్, తెల్ల చిలకల వంటి అరుదైన పక్షులతో పాటు దేవాంగపిల్లి, జంగిలికాట్, ముళ్ల పంది, కస్తూరీ పిల్లులు తదితర నిశాచరులు, ఆసియాటిక్ సింహాలు, తెల్లపులులు, చిరుత, జాగ్వార్ రకం చిరుత పులి, సరీసృపాల జగత్తులో రస్సల్ వైపర్, రాక్ఫైథాన్, లెటిక్యూలేటెడ్ పైథాన్ వంటి కొండ చిలువలు, ఆఫ్రికన్ చింపాంజీ, జంట ఖడ్గమృగాలు, నీటి గుర్రాలు జూకు ప్రత్యేక ఆకర్షణ. అడవిని పోలిన లయన్, టైగర్, బేర్, బైసన్(ప్రస్తుతం నీల్గాయ్) వంటి నాలుగు సఫారీ పార్కులు ఉన్నాయి. 25 అరుదైన వన్యప్రాణులను సందర్శకులు వాహనాల్లో ఉండి సురక్షితంగా తిలకించవచ్చు. సమస్య పరిష్కారానికి కృషి... జూపార్కులో సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులు అటవీ శాఖ మంత్రి జోగు రామన్నను కోరారు. విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే జూపార్కును సందర్శించి పరిస్థితిని స్వయంగా అంచనా వేశారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి మంత్రి సానుకూలంగా స్పందించారు. నీటి పారుదల శాఖ, అటవీ శాఖ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. - శివానీ డోగ్రా, జూపార్కు క్యూరేటర్ జంతువులకు ప్రమాదం లేదు మీరాలం వరదనీరు జూను ముంచెత్తినా.. జంతువులకు ఎలాంటి ప్రమాదం లేదు. లయన్ సఫారీలోని లయన్, టైగర్, అడవి దున్న, ఎలుగుబంటిలను నైట్హౌస్కు తరలించి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నాం. ఆరోగ్యపరంగా జంతువులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులో ఉంది. - ఎంఏ హకీం,జూ వెటర్నరీ అసిస్టెంట్ డెరైక్టర్ -
భారీ వర్షాలతో జూపార్కు మూసివేత
మిరాలం చెరువు నిండిపోవటంతో పక్కనే ఆనుకుని ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కును అధికారులు గురువారం తాత్కాలికంగా మూసివేశారు. మూడు రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలతో పార్కు చుట్టూ వరద నీరు నిలిచిపోయింది. దీంతో అధికారులు గురు, శుక్రవారాల్లో పార్కులోకి సందర్శకులను అనుమతించటం లేదని అధికారులు ప్రకటించారు. -
జూలో రాయల్ బెంగాల్ టైగర్ మృతి
బహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని రాయల్ బెంగాల్ టైగర్ (మున్నీ–23) సోమవారం అనారోగ్యం, వృద్ధాప్యంతో మృతి చెందింది. 1994లో జూలో జన్మించిన ఈ పులి కొంతకాలంగా ఇతర పులులతో జత కట్టి ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది. అడవుల జీవిత కాలం 18 ఏళ్లు కాగా మున్నీ 23 ఏళ్లు జీవించిందని జూ అధికారులు తెలిపారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో బాధపడుతూ కొంతకాలంగా జూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మృతి చెందిన మున్నీకి మంగళవారం జూ వెటర్నరీ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించినట్లు జూపార్కు క్యూరేటర్ శివానీ డోగ్రా తెలిపారు. -
కొత్తగా కళ్లు తెరిచెనే...
నెహ్రూ జూలాజికల్ పార్కు సరీసృపాల జగత్తులో శనివారం ఇండియన్ స్టార్ తాబేలు, గ్రీన్ ఇగ్వానా, ఇండియన్ చెమిలియన్లు పిల్లలకు జన్మనిచ్చాయి. వీటి జననంతో జూలో సరీసృపాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. పరిస్థితులను బట్టి శరీర రంగులను మార్చుకునే గ్రీన్ ఇగ్వానా, స్టార్ ఆకారంతో కూడిన చుక్కుల తాబేలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని జూ అధికారులు తెలిపారు. - బహదూర్పురా -
సింహంతో ఆటలాడబోయిన వ్యక్తికి రిమాండ్
హైదరాబాద్: నెహ్రూ జూపార్క్లో ఆదివారం సాయంత్రం సింహాల ఎన్క్లోజర్లోకి ప్రవేశించి వాటికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన వ్యక్తిపై బహదూర్పుర పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 448 సెక్షన్తోపాటు అటవీ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. ఎల్ అండ్టీ కంపెనీ ఉద్యోగి ముఖేష్ ఆదివారం స్నేహితులతో కలసి జూపార్క్కు రాగా మద్యం మత్తులో అతడు సింహాల ఎన్క్లోజర్లోకి దిగిన విషయం తెలిసిందే. జూ సిబ్బంది అప్రమత్తమై అతడ్ని బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. -
సింహంతో షేక్ హ్యాండ్..!
- మద్యం మత్తులో సింహాల ఎన్క్లోజర్లోకి దూకిన వ్యక్తి - సింహాలకు దగ్గరగా వెళ్లి హాయ్ చెప్పిన ముఖేశ్ - నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఘటన - క్షేమంగా బయటికి తీసుకొచ్చిన జూ కీపర్లు..అరెస్ట్ చేసిన పోలీసులు - భార్యతో గొడవల వల్లే సింహాల ఎన్క్లోజర్లోకి దూకానన్న ముఖేశ్ హైదరాబాద్: ఆదివారం సాయంత్రం 4.45 నిమిషాల సమయం.. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు.. ఆదివారం కావడంతో సందర్శకులతో కిటకిటలాడుతున్న జూపార్కు.. ఇంతలో ఒక్కసారిగా కలకలం.. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా సింహాల ఎన్క్లోజర్లోకి దూకేశాడు. సెక్యూరిటీ కళ్లుగప్పి ఎన్ క్లోజర్లోకి ప్రవేశించిన ఆ సందర్శకుడు సింహానికి షేక్హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనతో జూ అధికారులతో పాటు సందర్శకులు ఉలిక్కిపడ్డారు. అయితే జూ అధికారులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి అతడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మొత్తం మీద సాయంత్రం 4.45 గంటలకు ఎన్క్లోజర్లోకి ప్రవేశించిన ముఖేశ్ను సాయంత్రం 5.15 గంటలకు బయటికి తీసుకొచ్చారు. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ముఖేశ్(35) ఎల్అండ్టీ మెట్రో రైలు ప్రాజెక్టులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆదివారం జూపార్కు సందర్శనకు ముఖేశ్ వచ్చాడు. సాయంత్రం 4.45 గంటలకు సింహాల ఎన్క్లోజర్ వద్దకు చేరుకున్నాడు. ఉన్నట్టుండి ఎన్క్లోజర్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వారించడంతో కొంతసేపు అక్కడే తచ్చాడాడు. ఇంతలో సందర్శకులు ఎక్కువ మంది ఎన్క్లోజర్ వద్దకు పోటెత్తారు. అదే సమయంలో ముఖేశ్ ఒక్కసారిగా సింహాల ఎన్క్లోజర్లోకి దూకేశాడు. ఎన్క్లోజర్లోని నీటి మోడ్లో ఈదుకుంటూ సింహాలు ఉన్న వైపు వెళ్లి హాయ్ అంటూ పలకరించాడు. అతడిని చూసి ఒక సింహం వెనకడుగు వేయగా.. మరో సింహం అతడిపై దాడి చేసేందుకు సిద్ధమైంది. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న జూ కీపర్లు పాపయ్య, బషీర్ సింహాల దృష్టిని మళ్లించి.. సింహాలను ఎన్క్లోజర్ గేట్ లోపలికి తీసుకువెళ్లారు. పొడవాటి చెక్కను ఎన్క్లోజర్లోకి పెట్టి ముఖేశ్ను సురక్షితంగా బయటికి రప్పించారు. అనంతరం ముఖేశ్ను అదుపులోకి తీసుకున్న జూ అధికారులు అతడిని బహదూర్పురా పోలీసులకు అప్పగించారు. ముఖే శ్ ఎన్క్లోజర్లోకి దూకే సమయానికి మద్యం సేవించి ఉన్నాడని అధికారులు తెలిపారు. ముఖేశ్పై బహదూర్పురా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. భార్యతో ఉన్న చిన్నచిన్న గొడవల వల్లే సింహాల ఎన్క్లోజర్లోకి దూకానని ముఖేశ్ పేర్కొన ్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఇలా.. గతంలో కూడా జూపార్కులో ఈ తరహా ఘటనలు జరిగాయి. ఓ సందర్శకుడు పులికి బన్ను తినిపించేందుకు ప్రయత్నించగా.. అతడి చేతిని పులి కొరికేసింది. తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి చికిత్స పొందుతూ వారం తర్వాత మృతిచెందాడు. జూపార్క్లోని పులుల ఎన్క్లోజర్ చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప రాడ్ల ఎత్తు తక్కువ గా ఉండడంతో ఓ పులి బయటికి వచ్చింది. పులికి మత్తు మందు ఇచ్చి సురక్షితంగా జూలోకి పంపించారు. ఈ ఘటన తర్వాత రెయిలింగ్ ఎత్తును పెంచారే తప్ప.. సెక్యూరిటీ గార్డ్లను ఏర్పాటు చేయలేదు. జూలో క్రూర మృగాల ఎన్క్లోజర్ల వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను నియమించాల్సి ఉన్నా.. జూ అధికారులు గాలికి వదిలేసి నాలుగైదు ఎన్క్లోజర్లకు కలపి ఒక గార్డును ఏర్పాటు చేస్తున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా అధికారులు స్పందించడం లేదు. అదే విధంగా గతంలో ఢిల్లీ జూలో ఓ సందర్శకుడు పులి పంజా బారిన పడి దుర్మరణం చెందిన విషయం విదితమే. -
కోతి బావలు చిక్కాయోచ్..
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఎన్క్లోజర్ నుంచి బయటికి వచ్చిన స్క్విరెల్ కోతులను సోమవారం ఉదయం జూ అధికారులు సురక్షితంగా పట్టుకున్నారు. ఆదివారం సాయంత్రం ఎన్క్లోజర్ నుంచి బయటికి వచ్చిన ఈ కోతులను జూ అధికారులు రాయల్ బెంగాల్ ఎల్లో టైగర్ ఎన్క్లోజర్ వద్ద చెట్లపై గుర్తించారు.ఆదివారం రాత్రి చుట్టూ నె ట్ను ఏర్పాటు చేసి మరో చెట్టుపైకి వెళ్లకుండా కొమ్మలను నరికివేశారు. సోమవారం ఉదయం 5 గంటలకు ఈ కోతులను పట్టుకునేందుకు యానిమల్ కీపర్లతో కలసి చర్యలు చేపట్టారు. పులుల ఎన్క్లోజర్ వద్దనున్న చెట్లపై నుంచి ఐనా ఎన్క్లోజర్ వైపు స్క్విరెల్ కోతులను తరిమివేశారు. ఐనా ఎన్క్లోజర్ వద్ద ఏర్పాటు చేసిన బోనులో కోతులను పట్టుకునేందుకు గుడ్లు పెట్టారు. గుడ్లను తినేందుకు కోతులు ఉదయం 8.40 గంటలకు బోనులోకి వచ్చాయి. వెంటనే సురక్షితంగా బంధించిన అధికారులు జూలోని ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల్లో వీటిని సందర్శకుల కోసం ఎన్క్లోజర్లోకి విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. -
భల్లూకం భయపెట్టింది
జూ ఎన్క్లోజర్ దాటి ప్రహరీ ఎక్కి... గంటపాటు టెన్షన్ హైదరాబాద్: రాత్రి వేళ ఎన్క్లోజర్ నుంచి బయటకు వచ్చిన భల్లూకం జూ సిబ్బందికి చెమటలు పట్టించింది. గోడ దూకి జంప్ అయ్యే ప్రయత్నంలో గంట పాటు టెన్షన్ పెట్టింది. చివరకు ట్రాంక్వలైజేషన్ దెబ్బకు స్పృహ తప్పి పడిపోయింది. నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన మరోసారి అక్కడి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపింది. ఐదేళ్ల వయస్సున్న భల్లూకం సోమవారం రాత్రి ఎన్క్లోజర్ వెనుకున్న ఇనుప గొలుసుల ఫెన్సింగ్ ధ్వంసం చేసింది. అక్కడి నుంచి పక్కనే ఉన్న ప్రహరీ ఎక్కి... దానిపైనున్న ముళ్ల ఫెన్సింగ్ను దాటే ప్రయత్నం చేసింది. అయితే అవతలివైపు రహదారి, వ్యాపార సముదాయాలు ఉండటం... ఫెన్సింగ్ రెండడుగుల వెడల్పుతో ఏర్పాటు కావడం వల్ల కిందికి దూకలేకపోయింది. గంట సేపు ఆ గోడ మీదే చక్కర్లు కొట్టింది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమాచారంతో కళ్లు తెరిచిన జూ అధికారులు ఎలుగును పట్టుకొనేందుకు రంగంలోకి దిగారు. స్వల్ప గాయాలు: గంటకు పైగా శ్రమించినా అది ఓ దారికి రాకపోవడంతో ప్రత్యేక తుపాకీ ద్వారా మత్తు మందు ఇంజక్షన్ (ట్రాంక్వలైజేషన్) ఇచ్చారు. స్పృహతప్పిన భల్లూకాన్ని ఎన్క్లోజర్లోకి చేర్చారు. ఎలుగుబంటికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే భల్లూకం పూర్తి ఆరోగ్యంగా ఉందని జూ వెటర్నరీ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం తెలిపారు. ఎలుగుబంటి ప్రహరీ దూకి జనావాసాల్లోకి ప్రవేశించి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. కాగా, జూలో జంతువులకు, సందర్శకులకు రక్షణ కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే సెల్ఫీ తీసుకొనే క్రమంలో వాటర్ ఫౌంటెయిన్ మీద నుంచి కింద పడి ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రహరీ ఎత్తు, కొత్త చైన్ లింక్ను ఏర్పాటు చేసి భద్రత పెంచుతామని జూ డెరైక్టర్ జి.చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. -
జూలో మాధవ్ జన్మదిన వేడుకలు
- ఆఫ్రికా సింహం పుట్టిన రోజు నిర్వహించిన అధికారులు బహదూర్పురా నెహ్రూ జూలాజికల్ పార్కులో ఆఫ్రికా సింహం మాధవ్ 4వ జన్మదినోత్సవ వేడుకలను జూపార్కులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సౌదీ నుంచి మూడేళ్ల క్రితం హైదారబాద్ కి వచ్చిన ఈ సింహానికి పెద్ద బ్యాక్ గ్రౌండే ఉంది. సాక్షాత్తు సౌది యువరాజు మాధవ్ ను నెహ్రూ జూపార్క్ కు బహుమానంగా ఇచ్చారు. 2012 అక్టోబర్ లో నగరంలో జరిగిన కాప్ - 11 సందర్భంగా యువరాజు బందర్ బిన్ సౌద్ బిన్ మహ్మద్ అల్ సౌద్ జూపార్క్ సందర్శించారు. సహజ వాతావరణంలో.. విశాలంగా ఉన్న జంతుప్రదర్శన శాలను చూసి... ఆనందం వ్యక్తం చేసిన యువరాజు.. తన వద్ద ఉన్న ఆఫ్రికా సింహాలు, చీతాలకు ఇది అనువైన ప్రదేశం అని నిర్ణయించి.. వాటిని బహుమతిగా అందించారు. అలా మాధవ్ 2013లో అరబ్ నుంచి హైదరాబాద్ చేరుకుంది. నాలుగేళ్ల వయస్సున్న ఈ సింహం పుట్టిన రోజు సందర్భంగా జూ అసిస్టెంట్ క్యూరేటర్లు సరస్వతీ శ్రీదేవి, మురళీధర్, లక్ష్మణ్, బయోలజిస్ట్ సందీప్, జూపార్కు పీఆర్ఓ హనీఫ్, యానిమల్ కీపర్లు ఘనంగా వేడుకలు నిర్వహించారు. -
'గైడ్'గా పనిచేయాలని ఉందా?
బహదూర్పురా: రోటీన్కు భిన్నంగా ఏదైనా కొత్తగా చేయాలని మీరు తహతహలాడుతారా? ఎదుటివారికి చక్కగా వివరించే చెప్పే నైపుణ్యం, పర్యాటకులను ఆకట్టుకునే వాక్చాతుర్యం మీ సొంతమా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. నెహ్రూ జూవాలాజికల్ పార్కులో 'గైడ్' పోస్టులు మీకోసం ఎదురుచూస్తున్నాయి. పార్కులో స్వచ్ఛందంగా గైడ్లుగా, వాలంటరీలుగా పనిచేసేందుకు ఆసక్తి గల యువత ముందుకు రావాలని జూపార్కు క్యూరేటర్ గోపిరవి అన్నారు. అన్ని విభాగాల్లో అభివద్ధి చెందిన జూపార్కును గైడ్లను, వాలంటరీలను సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. స్వచ్ఛందంగా వాలంటరీలుగా, జూ గైడ్లుగా పనిచేసేందుకు ఆసక్తి గల వారు జూ ప్రధాన కార్యాలయంలో గానీ క్యూరేటర్ 9440810162 నంబర్లో సంప్రదించాలన్నారు. -
జూ పార్క్ 'చిల్డ్రన్స్ డే' గిఫ్ట్
నెహ్రూ జూలాజికల్ పార్కులో ఈ నెల 14వ తేదీన బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని 14 ఏళ్లల్లోపు విద్యార్థులకు జూలో ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నామని క్యూరేటర్ గోపిరవి గురువారం తెలిపారు. నగరంతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు కూడా ఈ సదుపాయం ఉంటుందని అన్నారు. వెంట ఉపాధ్యాయులు ఉంటేనే జూలో ఉచిత ప్రవేశం కల్పిస్తామన్నారు. 10 మంది కంటే ఎక్కువ విద్యార్థులు బృందాలుగా వచ్చినా వారికి ఉచిత ప్రవేశం ఇస్తామన్నారు. చిన్నారుల వెంట పెద్దలు ఉంటేనే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పాఠశాలల యజమానులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు. -
హ్యాపీ బర్త్ డే 'లయన్స్'
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఏషియాటిక్ లయన్స్ (హరీష్, హారిక, హర్షిత) ల మొదటి జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. చీఫ్ కన్జర్వేటర్ ఆధ్వర్యంలో జూలో కేక్ కట్ చేసి వేడుక చేశారు. ఈ వేడుకల్లో క్యూరేటర్ గోపిరవి, యానిమల్ కీపర్లు, వెటర్నరీ సెక్షన్ విభాగం వైద్యులు పాల్గొన్నారు. -
బెడిసికొట్టిన‘ పులి క్రాసింగ్’
బహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో కదంబా పులిని క్రాసింగ్ కోసం తెచ్చిన ఎన్క్లోజర్ ఇతర వన్యప్రాణుల కోసం నిర్మించిందని జూ పార్కు క్యూరేటర్ గోపిరవి పేర్కొన్నారు. కిందిస్థాయి అధికారులు ఐదు సంవత్సరాల వయస్సున్న పులితో సంతానోత్పత్తి కోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూ ఉన్నతాధికారులు బాధ్యులైన వారికి మెమోలను జారీ చేశారు. క్రాసింగ్ కోసం వినియోగించిన ఎన్క్లోజర్ వద్ద ఎలాంటి చర్యలు, కనీస నిబంధనలను పాటించలేదు. పులుల కోసం నిబంధనల ప్రకారం అయితే 18 ఫీట్ల ఎత్తు ఎన్క్లోజర్ నిర్మించాలి. కానీ కొత్తగా నిర్మించిన ఎన్క్లోజర్ ఎత్తు 12 ఫీట్లని జూ అధికారులు పేర్కొంటున్నా... వాస్తవంగా 10 ఫీట్లే ఉన్నట్లు సమాచారం. జూ లోని ఎన్క్లోజర్లను కాంట్రాక్టర్ కాకుండా జూ అధికారులే నిర్మిస్తుండటం గమనార్హం. జూలో డిప్యూటేషన్పై వచ్చిన ఓ అసిస్టెంట్ క్యూరేటర్ ఇప్పటికే లక్షలాది రూపాయల అభివృద్ధి పనులను నిర్వహించారు. కదంబా బయటికి దూకిన ఎన్క్లోజర్ను గత సంవత్సరం నుంచి నిర్మిస్తున్నారు. చిన్న చిన్న మృగాల కూనల కోసం నిర్మించిన ఈ ఎన్క్లోజర్లో 5 ఫీట్ల ఎత్తున్న పులితో క్రాసింగ్ చేయిస్తే ఎదురయ్యే పరిస్థితులను కూడా సంబంధిత అధికారులు పరిశీలించకుండా క్రాసింగ్కు మొగ్గు చూపారు. పులులతో సత్సంబంధాలు కలిగిన యానిమల్ కీపర్లను వేరే చోటుకు మార్చి అనుభవం లేని యానిమల్ కీపర్లను పులుల ఎన్క్లోజర్ల వద్ద అసిస్టెంట్ క్యూరేటర్ వేయించుకున్నట్లు సమాచారం. జూలో ఓ వర్గానికి అసిస్టెంట్ క్యూరేటర్ వత్తాసు పలుకుతూ... మరో వర్గానికి వేధింపులు గురి చేస్తున్నారని గతంలో ఎన్నో ఆరోపణలు రావడంతో పాటు కొందరు విధులను మానేశారు. తాజాగా శనివారం పులితో క్రాసింగ్ చేయించి పేరు తెచ్చుకోవాలని అసిస్టెంట్ క్యూరేటర్ చూడటం కొసమెరుపు. ఈ ఘటనతో అధికారుల పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
వేగం.. సొంతం
చెట్లను అవలీలగా ఎక్కడం, పాకడంతో పాటు నీటిలో ఈదడంలో ఆరితేరిన జంతువు చీతా (చిరుత పులి). ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే క్రూర జంతువు ఇది. గంటకు 120 కిలో మీటర్ల వేగంతో పరిగెత్తే ఈ చిరుతలు రెండు మూడు నిమిషాల్లోనే ఆహారాన్ని వేటాడతాయి. వేటాడిన ఆహారాన్ని వెంటనే తినకుండా 15 నిమిషాల పాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకుని భుజిస్తాయి. చీతాలు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రస్తుతం ఏడు చిరుత పులులున్నాయి. - బహదూర్పురా జీవితకాలం 23 ఏళ్లు చిరుతలు ఎక్కువగా ఆఫ్రికా ఖండంలోని మైదానాల్లో నివసిస్తాయి. చీతాల పొడవు 120-150 సెం.మీ. మధ్య ఉంటుంది. 50-80 కిలోల బరువుంటాయి. ఎంతో దూరాన ఉన్న జంతువులను సైతం గుర్తించి ఒడుపుగా వేటాడే సత్తా వీటి సొంతం. జీవిత కాలం 20-23 సంవత్సరాలు ఒకేసారి 15-20 కిలోల ఆహారాన్ని తీసుకుంటాయి. మన జూలో ఏడు జూపార్కులో సల్మాన్, సులేమాన్,సుచీ, లవ, కుశ, పూజారి,రోహన్ అనే చిరుతలు ఉన్నాయి. రోజూ ఆరు కిలోల చికెన్ చిరుతలకు జూలో రోజూ 6-8 కేజీల మాం సాన్ని ఆహారంగా అందిస్తారు. ఇందులో 2 కేజీల చికెన్, ఒక కేజీ బీఫ్, అర లీటర్ పాలు, ఉదయం, సాయంత్రం వేళల్లో అంది స్తారు. వీటితో పాటు విటమిన్స్తో కూడిన మినరల్స్ను నీటి ద్వారా అందిస్తారు. మీరు చూడాలంటే.. నెహ్రూ జూలాజికల్ పార్కు ప్రవేశ ద్వారం వద్ద నుంచి నేరుగా చిట్టి రైలు వద్దకు వెళ్లాలి. అక్కడి నుంచి ఎడమ వైపు తిరిగి నేరుగా వెళితే రాయల్ బెంగాల్ టైగర్ ఎన్క్లోజర్ పక్కనే ఈ చిరుతల ఎన్క్లోజర్ ఉంటుంది. -
చిల్డ్రన్స్ క్లిక్ అవుట్
ప్రోత్సహించే వారుంటే అడుగున దాక్కున్న ప్రతిభ కూడా అంబరాన్ని తాకుతుంది. అద్భుతాలను ఆవిష్కరించి అదరహో అనిపిస్తుంది. చదువే లోకంగా బతికే ఆ చిన్నారులకు కాసింత ఆటవిడుపు దొరికితే చాలు. వారి మస్తిష్కాల్లో అందరి మన్ననలు అందుకునే ఆలోచనలు అంకురిస్తాయి. చిన్నారుల్లో దాగి ఉన్న మరో కోణాన్ని వెలికితీసే ప్రయత్నం సాక్షి సిటీప్లస్ చేసింది. బాలల దినోత్సవం సందర్భంగా గడుగ్గాయిల చేతులకు కెమెరాలు అందించింది. వన్ డే ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లుగా స్వేచ్ఛనిచ్చింది. సాక్షి సపోర్ట్ను అందిపుచ్చుకున్న నవ్య గ్రామర్ స్కూల్, అంబర్పేటకు చెందిన 12 మంది విద్యార్థులు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లుగా మారిపోయారు. నెహ్రూ జూలాజికల్ పార్క్లో కలియ తిరిగారు. రాజసం ఉట్టిపడే వన్యప్రాణుల హావభావాలు లెన్స్తో చూసి మురిసిపోయారు. అంతే ఠీవీ ఉట్టిపడేలా వాటిని క్లిక్ మనిపించారు. వీరిలో ఒక్కొక్కరిదీ ఒక్కో కోణం.. ఒక్కో ఫొటో ఒక్కో జీవ వైవిధ్యం. పుస్తకాలతో కుస్తీ పట్టడంలోనే కాదు.. కెమెరాలు క్లిక్మనిపించడంలోనూ తామేం తక్కువేం కాదని నిరూపించారు. ఈ చిన్నారులు క్లిక్ మనిపించిన చిత్రాల్లో.. ‘బెస్ట్ సిక్స్’ ఇక్కడ ప్రచురిస్తున్నాం. పిల్లలతో ఇలా వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ తీయించడం చాలా మంచి ఆలోచన. భవిష్యత్తులో కూడా ‘సాక్షి సిటీప్లస్’ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడితే బాగుంటుంది. చిన్నారులకు వన్యప్రాణులు తదితర అంశాలపై అవగాహన పెరుగుతుంది. - జి.భాస్కర్రెడ్డి, నవ్య గ్రామర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ -
సఫారీ కేంద్రాలు...
పిల్లలు ప్రకృతిలో త్వరగా మమేకం అవుతారు. పిల్లి, కుక్క, ఆవు, గేదె.. అంటేనే అమితమైన ఆసక్తి కనబరుస్తారు. అలాంటిది వేల రకాల పక్షులు, ఎన్నడూ చూడని పులులు, ఏనుగులు, జిరాఫీలు, జింకలు.. పుస్తకాల్లో చూసినవి కళ్ల ముందు కనిపిస్తుంటే ఎగిరి గంతేస్తారు. ప్రపంచాన్ని మర్చిపోయి విహరిస్తారు. పిల్లల పండగైన నేడు మన దగ్గరలోనే ఉన్న సఫారీ కేంద్రాలకు తీసుకెళితే వారి సంబరం వెయ్యింతలు అవుతుంది. హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ 360 ఎకరాలలో విస్తరించి ఉంది. ఇందులో 100 రకాల పక్షులు, ఖడ్గమృగం, సింహం, బెంగాల్ టైగర్, చిరుత, అడవిదున్న, ఏనుగు, కొండచిలువ, జింకలు, ఎలుగు.. ఇతర వన్యప్రాణులెన్నో ఉన్నాయి. ఈ ఉద్యానం బాలలకు విజ్ఞాన విహారకేంద్రంగా ఉపయోగపడుతుంది. మ్యూజియాన్ని చుట్టి వచ్చేందుకు టాయ్ ట్రైన్ ఇందులో అందుబాటులో ఉంది. సికింద్రాబాద్ బస్స్టేషన్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న జూ పార్క్కు బస్సు సదుపాయాలు ఉన్నాయి. సోమవారం మినహా అన్ని రోజులు సందర్శన. ఉదయం 9:00- సాయంత్రం 5:00 వరకు. దగ్గరలో.. విమానాశ్రయం.. 11.1 కి.మీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్: 9.7 కి.మీ, కాచిగూడ రైల్వే స్టేషన్ : 7.కి.మీ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి 140 కి.మీ దూరంలో శ్రీశైలం వెళ్లేదారిలో ఉంది ఫర్హాబాద్ టైగర్ రిజర్వ్ పాయింట్. మన్ననూరు మెయిన్ రోడ్డు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వ్యూ పాయింట్కి అటవీశాఖాధికారులు ఏర్పాటు చేసిన జీపులలో వెళ్లాల్సి ఉంటుంది. మార్గమధ్యలో అందమైన పక్షులు, జింకలు, కోతులను చూస్తూ వెళ్లవచ్చు. 200 అడుగుల లోతున ఉండే లోయ ప్రాంతం (వ్యూ పాయింట్) మాటలకందని అద్భుతంగా కళ్లకు కడుతుంది. దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ పాయింట్ నాగార్జున సాగర్- శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ‘నాగార్జున సాగర్- శ్రీశైలం- హైదరాబాద్’టూరు ప్యాకేజీలో భాగంగా ఫర్హాబాద్ టైగర్ రిజర్వ్ పాయింట్ ను చూడవచ్చు. వివరాలకు: టోల్ఫ్రీ నెం: 1800 42545454 సం్రపదించవచ్చు. విశాఖపట్టణంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ దేశంలోని మూడవ అతి పెద్ద ఉద్యానం. 625 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానంలో 80 నుంచి 800 జాతుల వన్యప్రాణులు ఉన్నాయి. రైల్వేస్టేషన్కు 7.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఉద్యానంలో తెల్ల పులి, ఎలుగుబంటి, అడవిదున్న, జింకలు, మొసళ్ళతో పాటు రకరకాల అందమైన పక్షులు కనువిందు చేస్తాయి. ఈ ఉద్యానానికి దగ్గర ప్రాంతాలు: రుషికొండ బీచ్ .. 4.6 కి.మీ ఫోర్ట్ ఏరియా ... 9.7 కి.మీ విమానాశ్రయం .. 16.1 కి.మీ రైల్వే స్టేషన్ ... 7.7 కి.మీ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ 5,532 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండి ఆసియాలో రెండవ అతిపెద్ద ఉద్యానంగా పేరుగాంచింది. ఇందులో ఎనుగులు, జింకలు, తెల్ల పులులు, కొండచిలువలు, జిరాఫీ.. మొదలైన జంతువులు, వందల రకాల పక్షులు ఉన్నాయి. ఈ ఉద్యానానికి వలస పక్షులైనా ఫ్లెమింగోలు, పెలికాన్స్ వస్తుంటాయి. చలికాలంలో ఉదయం 9:00 గం.-సాయంకాలం 5:00 గం.ల వరకు. ఈ ఉద్యానానికి దగ్గరి ప్రాంతాలు: తిరుపతి... 6.5 కి.మీ గుర్రం కొండ కోట .. 6.5 కి.మీ. తిరుపతి విమానాశ్రయం - 19.5 కి.మీ రేణిగుంట రైల్వే స్టేషన్ - 16.1 కి.మీ -
జూలో కొత్త అతిథుల సందడి
బహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో రెడ్ ఆండ్రేడ్ టమారీన్ (గోల్డెన్) కోతులు సందడి చేస్తున్నాయి. ఇవి చైన్నై నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం జూకు చేరుకున్నాయని జూ క్యూరేటర్ బిఎన్ఎన్. మూర్తి తెలిపారు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వీటిని జూకు బహుమతిగా అందజేసిందన్నారు. కొలంబియా, సౌత్ అమెరికా, ఆమెజాన్ ప్రాంతాలకు చెందిన ఈ అరుదైన కోతులు గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ దత్తత తీసుకొని జూకు బహుమతిగా అందజేసిందన్నారు. వీటిని వారం రోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి సందర్శనార్ధం ఎన్క్లోజర్లలో ఉంచుతామన్నారు. అతి తక్కువ బరువు (250 గ్రాములు) గల ఈ కోతులకు పిగ్టెల్ మాకాక్ (పందితోక కోతులు) ఎన్క్లోజర్లోనే వీటిని ఉంచుతామన్నారు. జూకు చేరుకున్న ఈ కోతుల్లో మగది 4 ఏళ్లు, అడవి 3 ఏళ్ల వయస్సు గలవి. వీటి జీవిత కాలం 20 ఏళ్లు. ఇవి ఎక్కువగా గుంపులుగా ఉండేందుకు ఇష్టపడుతాయన్నారు. ఈ కోతులకు పండ్లు, చిన్న చిన్న కీటికాలు, మొలకెత్తిన విత్తనాలు ఆహారమన్నారు. జూలో వీటికి మొలకెత్తిన విత్తనాలు, పండ్లతో పాటు సెర్లాక్స్ను కూడా అందిస్తామన్నారు. జూకు మరిన్ని కొత్త వన్యప్రాణులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
జూ పార్కుకు సందర్శకుల తాకిడి
బహదూర్పురా, న్యూస్లైన్: నెహ్రూ జూలాజికల్ పార్కు మంగళవారం వేలాది మంది సందర్శకులతో సందడిగా కనిపించింది. 11,879 మంది పెద్దలు, 4,280 మంది చిన్నారులు, 90 కార్లలో వచ్చిన 450 మంది సందర్శకులల రాకతో మంగళవారం జూకు రూ. 3.79 లక్షల ఆదాయం సమకూరింది. కాలుష్య రహిత బ్యాటరీ వాహనాల నుంచి రూ.66,020, చేపల ఆక్వేరియంకు రూ.8672, చిట్టి రైలుకు రూ.10,335, నిశాచర జంతుశాలకు రూ.16,290 ఆదాయంతో కలిపి జూకు మొత్తం 4.80 లక్షల ఆదాయం సమకూరినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం జూకు సందర్శకుల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు. ఈనెల 1వ తేదీన 37,086 మంది సందర్శకులు రాగా, మంగళవారం రోజు 16,609 మంది సందర్శకులు వచ్చారు. ఆదివారం, సోమవారం ఆదాయాలను కలుపుకొని జూకు రూ.15 లక్షల ఆదాయం వచ్చింది. -
నెహ్రూ జూ పార్క్ స్వర్ణోత్సవాల్లో 12ఏళ్ల పిల్లలకు ప్రవేశం
బహదూర్పురా, న్యూస్లైన్: నెహ్రూ జూలాజికల్ పార్కు స్వర్ణోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాలను పురస్కరించుకొని 12 ఏళ్లలోపు చిన్నారులకు ఉత్సవాలు ముగిసే వరకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నేటి నుంచి 10వ తేదీ వరకు జరిగే ఉత్సవాలను ఆదివా రం ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రారంభించనున్నారు. నెహ్రూ విగ్రహం, జూపార్కు 50 వసంతాల లోగోను ఆవిష్కరిస్తారు. ఈనెల 7న రియా పక్షుల ఎన్క్లోజర్ను రాష్ట్ర అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ప్రారంభిస్తారు -
నెహ్రూ జూ పార్కులో చిరుతల సందడి
ఫోటోలు : అనిల్ కుమార్