Newborn baby
-
వసతి గృహంలో కలకలం
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలోని ఒక మిషనరీ సంస్థకు చెందిన ఆధ్యాత్మిక శిక్షణ, వసతి గృహంలో ఆదివారం అమానుష ఘటన చోటుచేసుకుంది. ఈ భవనం నుంచి అప్పుడే పుట్టిన ఒక నవజాత శిశువును బయటకు విసిరేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనను సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ఓ మహిళ, పొరుగునున్న ఓ వాచ్మేన్ గమనించారు. దీంతో ఈ ఘటన దావానలంలా వ్యాపించింది. స్థానికులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఏలూరు అశోక్నగర్లోని మిషనరీ ఆధ్యాత్మిక శిక్షణా వసతిగృహంలో అనేక ప్రాంతాలకు చెందిన బాలికలు, యువతులు సిస్టర్స్(నన్స్)గా శిక్షణ పొందుతుంటారు. ప్రసవించిన బాలిక కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాలికగా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ బాలిక నగరంలోని ఓ మిషనరీ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. రోజూ వసతిగృహం నుంచి కళాశాలకు వెళ్లి వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ వసతి గృహం నుంచి అప్పుడే పుట్టిన పసికందును విసిరేయడం స్థానికులు గమనించారు. భవనంపైన బాలికలు నీళ్లతో రక్తపు మరకలు కడుగుతూ ఉన్న దృశ్యాలను వీరు వీడియో తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏలూరు టూటౌన్ సీఐ రమణ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లగా పసికందు విగతజీవిగా పడిఉండటాన్ని గమనించారు.బిడ్డకు బొడ్డు కూడా ఊడకపోవటం, ఒంటినిండా రక్తపు మరకలు ఉండటంతో అప్పుడే జన్మించి ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వసతిగృహాన్ని కూడా పోలీసు అధికారులు పరిశీలించారు. బాధిత బాలిక ఉండే గదిని పరిశీలించి ఆమె స్నేహితులను విచారించారు. ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్కుమార్ వసతిగృహ నిర్వాహకులతో మాట్లాడి హాస్టల్లోని పరిస్థితులను పరిశీలించారు. మరోవైపు.. వసతిగృహంలో ప్రసవించిన బాలికను చికిత్స నిమిత్తం 108లో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. నవజాత శిశువు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. నిర్వాహకులు గమనించలేదా?ఇక ఈ సంఘటనకు సంబంధించి ఆధ్మాత్మిక శిక్షణా కేంద్రంలోని మరో వసతిగృహంలో శిక్షణలో ఉన్న వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిషనరీ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఫాదర్లు తరచూ ఈ బాలికల వసతిగృహానికి వెళ్తుంటారని, ఈ క్రమంలోనే వారిలో ఒకరితో ఆమె సన్నిహితంగా ఉండడంతో బాలిక గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. మిషనరీ శిక్షణ, వసతిగృహంలో ఉంటున్న ఒక బాలిక గర్భం దాల్చి.. ప్రసవించే వరకూ ఆమెను ఇన్ని నెలలపాటు నిర్వాహకులు గమనించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాలికలో చోటుచేసుకునే శారీరక మార్పులను సైతం అటు కళాశాలలో, ఇటు వసతిగృహంలో ఎవరూ గుర్తించకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ఇక ప్రసవం సమయంలో బాధిత బాలికకు తోటి విద్యార్థినులే సహకరించారా? లేక నిర్వాహకుల ప్రమేయం ఉందా అనేది తేలాల్సి ఉంది.పోలీసుల అదుపులో అనుమానితుడు?ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ మట్లాడుతూ వసతిగృహాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
కిడ్నాప్ కు గురైన నెలరోజుల పసికందు సురక్షితం
-
కన్నవాళ్లు వద్దని విసిరేస్తే.. కిష్టయ్యగా పునర్జన్మ పొందాడు
ఆ పసికందు ఎక్కడ పుట్టాడో తెలీయదు. కన్నవాళ్లు కనీసం గుడి వద్దో, ఆస్పత్రి దగ్గరో వదిలేసిన ఆ నరకం తప్పేదేమో. కానీ, కర్కశంగా చెట్ల పొదల మధ్యకు విసిరేశారు. ఆ దెబ్బకు ఏడురోజుల వయసున్న ఆ పసికందు వీపు చిట్లిపోయింది. కాకులో, ఏ జంతువులో పొడిచాయో తెలియదు. గుక్కపట్టి ఏడ్చేందుకు శక్తిలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని గుర్తించి.. ఎవరో మహానుభావులు ఆస్పత్రిలో చేర్పించారు.ఆగష్టు 26వ తేదీ. యాభైకిపైగా గాయాలతో ఉన్న ఓ పసికందును ఉత్తర ప్రదేశ్లోని హమీర్పుర్ జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు కొందరు. అప్పటికే ఆ బిడ్డ పరిస్థితి విషమించింది. బతుకుతాడో లేదో కచ్చితంగా చెప్పలేమన్నారు డాక్టర్లు. అక్కడి నుంచి కాన్పూర్ లాలాలజపతి రాయ్ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడా వైద్యులు ఆ బిడ్డ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేకపోయారు. కానీ, ఏ దేవుడు చల్లగా చూశాడో తెలియదు. రెండు నెలలపాటు ప్రయత్నించి ఆ మగబిడ్డకు పునర్జన్మ పోశారు వైద్యులు.నరకం నుంచి రెండు నెలలకు.. కన్నతల్లి దూరమైనప్పటికీ.. ఆస్పత్రిలో అమ్మ ప్రేమ ఆయాల రూపంలో దొరికింది ఆ బిడ్డకు. మొదట్లో ఈ చిన్నారికి అయిన గాయాల కారణంగా ఎత్తుకునే ప్రయత్నంలోనూ ఏడ్చేవాడట. దీంతో.. ఊయలలో పడుకోబెట్టి దూరం నుంచే లాలించేవారట. ఆ సమయంలో ఆ బిడ్డ ఏడుపు.. అక్కడి సిబ్బందికి కన్నీళ్లు తెప్పించేదట. అయితే గాయాల నుంచి కోలుకునే కొద్దీ ఆ బిడ్డ కూడా వాళ్లకు అలవాటయ్యాడు.ఆగష్టు 26వ తేదీన ఆ బిడ్డ దొరికాడు. ఎవరో బ్రిడ్జి మీద నుంచి కిందకు విసిరేశారు. అయితే అదృష్టవశాత్తూ చెట్ల పొదల్లో పడ్డాడు ఆ చిన్నారి. అదే రోజు జన్మాష్టమి. అందుకే వైద్య సిబ్బంది ఆ బిడ్డకు ‘కృష్ణ’ అని పేరు పెట్టారు. రెండు నెలలపాటు ఆస్పత్రిలో ఉన్న ఆయాలందరూ.. మగ సిబ్బంది కూడా ఆ కిష్టయ్యను జాగ్రత్తగా చూసుకున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత అక్టోబర్ 24వ తేదీన పోలీసుల సమక్షంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు వైద్యులు. కృష్ణ ఆస్పత్రి నుంచి వెళ్లిపోతుంటే.. అక్కడున్న సిబ్బంది మొత్తం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఆ వెళ్తోంది తమ బిడ్డే భావించి.. అతనికి ఓ మంచి జీవితం దక్కాలని ఆశీర్వదించి పంపించేశారట. -
కొడుకుని ముద్దాడుతున్న హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)
-
కూతురి ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్
కన్నడ హీరోయిన్ మిలానా నాగరాజ్.. రీసెంట్గా పుట్టిన కుమార్తె ఫేస్ రివీల్ చేసింది. పరి అనే పేరు పెట్టిన విషయాన్ని కూడా బయటపెట్టింది. ఈమె భర్త డార్లింగ్ కృష్ణ కన్నడలో ఓ హీరో. నటుడు, దర్శకుడు, నిర్మాతగా పలు సినిమాలు చేశాడు.(ఇదీ చదవండి: OTT: ‘రఘు తాత’ మూవీ రివ్యూ)పలువురు అగ్రహీరోలతో కలిసి సినిమాలు చేసిన ఈమె.. 2013 నుంచి సినిమాలు చేస్తోంది. అప్పట్లో హీరోయిన్గా చేసింది. ఇప్పుడు మాత్రం ఓ వైపు నటిస్తూనే మరోవైపు భర్తతో కలిసి నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. 2021లో కృష్ణ-మిలానా పెళ్లి జరగ్గా.. ఈ ఏడాది మార్చిలో ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. రీసెంట్గా ఈమెకు పాప పుట్టింది.ఈ క్రమంలోనే పాపని ఇంటికి తీసుకొచ్చిన వీడియోని తొలుత పోస్ట్ చేసింది. తాజాగా పాప-భర్తతో కలిసి తీసుకున్న క్యూట్ అంట్ స్వీట్ ఫొటోల్ని మిలానా షేర్ చేసింది. వీటిని చూసి తోటీ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మీరు కూడా వీడియో, ఫొటోలపై ఓ లుక్కేసేయండి.(ఇదీ చదవండి: రెండోరోజు తగ్గిన దేవర కలెక్షన్స్.. బాలీవుడ్లో పెరిగిన క్రేజ్) View this post on Instagram A post shared by Darling Krishna (@darling_krishnaa) -
Bihar: ఆస్పత్రి నుంచి శిశువు అపహరణ
బెగుసరాయ్: బీహార్లోని బెగుసరాయ్లో ఆందోళనకర ఉదంతం వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రిలో శిశువు అపహరణకు గురయ్యింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటపడింది. అందులో ఒక వృద్ధ మహిళ శిశును తీసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మహిళ ఒక నవజాత శిశువును ఒక వస్త్రంలో చుట్టి తీసుకువెళ్లడం సీసీటీవీలో రికార్డయ్యింది.వివరాల్లోకి వెళితే బెగుసరాయ్లోని లోహియా నగర్కు చెందిన నందనీ దేవి డెలివరీ కోసం ఒక ఆస్పత్రిలో చేరింది. శనివారం ఆమె ఒక మగపిల్లవానికి జన్మనిచ్చింది. ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో ఆ శిశువు అదృశ్యమయ్యింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సివిల్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ కుమార్ సింగ్ ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి -
సోషల్ మీడియా క్రేజ్ కోసం ఓ తండ్రి పసికందుపై పిచ్చి ప్రయోగం! చివరికి..
ఇటీవల సోషల్ మీడియా పిచ్చితే యువత చేసే పనులకు అంతుపొంతు లేకుండా పోతోంది. ఇలాంటి పిచ్చి ఫీట్లతో కొందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా. ఇక్కడొక వ్యక్తి కూడా అలానే ఏకంగా సొంత కొడుకుపై పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి సెలబ్రెటీ అయిపోవాలనుకున్నాడు. నెలల పసికందు అని కూడా చూడకుండా అతడు చేసిన దారుణ కృత్యాలకు బలైపోయింది ఆ చిన్ని ప్రాణం. చివరికీ ఈ విషయం బయటపడి కటకటాలపాలయ్యాడు. ఇంతకీ అతడేం చేశాడంటే..? రష్యా కు చెందిన మాక్సిమ్ లైయూటీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్. పచ్చి కూరగాయలతో ప్రత్యేక ఆహారం తినడం గురించి చెబుతూ ఎక్కువ మంది యూజర్లను పొందే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో తను తీసుకునే ఆహారం, వాటి ద్వారా సమకూరే శక్తి నిజమైనదని నమ్మడలికి ఫేమస్ అవ్వాలనుకునేవాడు. ఆ నేపథ్యంలోనే తన సొంత కొడుకు పైనే ఇలాంటి చెత్త ప్రయోగాలే చేశాడు. నిజానికి ఒక మనిషి ఆహారం తీసుకుంటేనే బతుకగలడు. కానీ ఈ దుర్మార్గుడు సూర్యరశ్మితో కూడా ఓ మనిషి బతకగలడిని నిరుపించాలనేది మాక్సిమ్ ఆలోచన. అస్సలు ఇది సాధ్యమా..? సూర్యుడి ప్రతాపానికి చెట్టు చేమలు విలవిల్లాడతాయి. సూర్యుడి శక్తి మనకు ఆకలిపుట్టించేలా చేసి చైతన్యవంతం చేస్తుంది. అంతే దానితో బతకాలనుకోవడం అత్యంత పిచ్చి ఆలోచన. కానీ మాక్సిమా తన కొడుకు నెలల పనికందుపై ఈ ప్రయోగం చేశాడు. భార్య ఎంతలా చెప్పిన వినలేదు. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నారీతీలో మూర్ఖంగా ప్రవర్తించాడు. బిడ్డకు పాలు ఇవ్వకుండా సూర్మరశ్చిలోనే ఉంచేవాడు. పాపం ఆ భార్య అతడికి తెలియకుండా బిడ్డకు పాలు ఇస్తుండేది. రోజు రోజుకి బిడ్డ ఆరోగ్యం క్షీణించడం మొదలు పెట్టింది. మరోవైపు ఇతడి ఆగడాలు శృతిమించాయి. చల్లటి నీళ్లల్లో బిడ్డను ముంచి ఎండలో ఉంచడం వంటి పిచ్చి పనులు చేసేవాడు. గుక్కపెట్టి ఏడుస్తున్న కంగకుండా ఆకలిని అధిగమించేలా శక్తిని పొందుతున్నాడని భార్యకు ఏవేవో పిచ్చి కబుర్లు చెప్పేవారు. చివరికీ బాబు ఆరోగ్యం మరింతగా దిగజారిపోయింది. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితికి వచ్చేశాడు. దీంతో భార్య ఇతర కుటుంబ సభ్యులు గట్టిగా ఒత్తిడి తేవడంతో బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు అనుమతించాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయిజారిపోయింది. మాక్సిమ్ పిచ్చి ప్రయోగాలు ఆ బిడ్డ ప్రాణం బలైపోయింది. వైద్య పరిక్షల్లో ఆ పసికందు నిమోనియా సహా పలు సమస్యల వల్ల చనిపోయినట్లు వెల్లడయ్యింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో మాక్సిమ్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు పౌష్టికాహారం తీసుకోలేదని బుకాయించే యత్నం చేశాడు. అయితే అతడి భార్య ఈ బాధను ఓర్చుకోలేక పోలీసులు ముందు జరిగిన విషయం అంతా చెప్పేసింది. దీంతో కోర్టు జరిగిన నేరంలో తల్లి పాత్ర కూడా ఉందని భావించి ఇరువురకి జైలు శిక్ష విధించింది. మాక్సిమ్కు ఎనిమిదేళ్లు జైలు శిక్ష పడగా, అతడి భార్యకు రెండేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. విచిత్రమేమిటంటే తను చేసిన తప్పును ఒప్పుకోకుండా తన బిడ్డ బలమైన వ్యక్తిగా మారితే చూడలన్నాదే తన ఉద్దేశ్యమని వాదిస్తూనే ఉన్నాడు. అతడి వాదనతో కోర్టు ఏకభవించ లేదు. ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే..సోషల్ మీడియాలో పచ్చి కూరగాయాలతో మంచి ఆరోగ్యం అని చెప్పే మాక్సిమ్ కస్టడీలో ఉన్నప్పుడూ న్యూడిల్స్, మాంసాహారం అడిగేవాడట. దయచేసి ఇలాంటి పిచ్చి పనులతో సోషల్ మీడియా ఫేమ్ రాదు కదా..! ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. నాన్వెజ్ తినేవాళ్లకు వ్రతాలు, పూజలు పేరుతో నాన్వెజ్కి దూరం ఉంటేనే అబ్బా నాలుకు చప్పబడిపోయినా ఫీల్ వచ్చేస్తుంది. అలాంటిది పూర్తిగా శాకాహారం అంటే చాలా కష్టం. ఇది వ్యక్తిగతంగా రావాల్సిన మార్పు. అనుకున్నదే తడువుగా చేసేయడం అన్నది సాధ్యం కాదు. అందువల్ల సోషల్ మీడియా లేదా మరేదైనా క్రేజ్ కోసం అయినా ఏదైనా సాహసం చేయాలనుకుంటే సాధ్యసాధ్యాలు గురించి పూర్తిగా తెలుసుకుని ముందుకు సాగండి. -
తీవ్ర విషాదంలోనూ దుఃఖాన్ని దిగమింగుకుని..
అహ్మదాబాద్: నవమాసాలు మోసి కన్న తల్లికి, బిడ్డ కోసం ఎన్నో కలలు కన్న ఆ తండ్రికి చివరకు కన్నీళ్లే మిగిలాయి. పుట్టిన బిడ్డలో బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు చెప్పిన మాటలతో ఆ తల్లిదండ్రులు హతాశులయ్యారు. అయితే అంత దుఃఖంలోనూ వాళ్లు తీసుకున్న నిర్ణయం.. వార్తల్లోకి ఎక్కింది. డైమండ్ ఫ్యాక్టరీలో పని చేసే హర్షద్, చేతన దంపతులకు ఈ నెల 13న మగబిడ్డ పుట్టాడు. అయితే.. శిశువులో కదలికలేవీ లేకపోవడంతో బిడ్డను ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించి.. వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఐదురోజుల తర్వాత పసికందుకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని ప్రకటించారు. దీంతో ఆ తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు. ఈలోపు జీవన్దీప్ ఆర్గాన్ డొనేషన్ ఫౌండేషన్ శిశువు తల్లిదండ్రులను సంప్రదించింది. అంత బాధలోనూ అవయవదానానికి సమ్మతించడంతో పీపీ సవానీ ఆసుపత్రి వైద్యులు బుధవారం శిశువు రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు, కాలేయం, ప్లీహాన్ని సేకరించారు. వీటిని గుజరాత్లోని వివిధ ప్రాంతాల్లో అవసరం ఉన్న ఆరుగురు చిన్నారులకు విజయవంతంగా అమర్చినట్లు సదరు ఫౌండేషన్ ప్రకటించింది. బ్రెయిన్డెడ్ (జీవన్మృతి) అయిన అయిదు రోజుల పసికందు అవయవాలు.. ఆరుగురు పిల్లలకు కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. -
ఏడో నెలలో పుట్టిన శిశువు.. 750 గ్రాములే బరువు.. ప్రాణం పోసిన డాక్టర్లు..
జగిత్యాల: తక్కువ బరువుతో పుట్టిన శిశువుకు 40 రోజులపాటు చికిత్స అందించి.. ప్రాణాలు నిలిపారు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. బతుకుతుందో లేదోనన్న బిడ్డ ఆరోగ్యంగా బయటికి రావడంతో తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కథలాపూర్ మండలం తక్కళ్లపల్లికి చెందిన శ్రీలత డెలివరీకోసం మార్చి 29న కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. బ్లీడింగ్ అధికంగా కావడంతో అదేరోజు సిజేరియన్ చేయగా పాప జన్మించింది. ఏడో నెలలో పుట్టిన శిశువు కావడంతో 750 గ్రాముల బరువే ఉంది. శ్వాససంబంధ రుగ్మత, రక్తం ఇన్ఫెక్షన్, తీవ్ర రక్తహీనతతో ఉంది. బతుకుతుందా లేదా అనే ఆందోళన మొదలైంది. అయితే బంధువులు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. పాపను వెంటనే పరీక్షించిన వైద్యులు.. కంటికి రెప్పలా కాపాడుతూ 40 రోజులపాటు వైద్యం అందించారు. దీంతో శిశువు 1,100 గ్రాముల బరువుకు చేరడంతోపాటు, ఆరోగ్యంగా తయారైంది. దీంతో సోమవారం తల్లీబిడ్డను డిశ్చార్జి చేశారు. తమ పాపను కాపాడిన వైద్యులు, సిబ్బందికి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. శిశువుకు మెరుగైన చికిత్స అందించిన వైద్యులు, సిబ్బందిని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది ఉన్నారని, జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఆర్ఎంవో శశికాంత్రెడ్డి, ప్రొఫెసర్ అజామ్, డాక్టర్ స్నేహలత, నర్స్లు పాల్గొన్నారు. చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి -
90 గంటలు శిథిలాల కిందే.. మృత్యువును జయించిన10 రోజుల శిశువు.
భూకంపం తర్వాత టర్కీ, సిరియాలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి ప్రకోపానికి రెండు దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. వరుస భూకంపాల తర్వాత భవన శిథిలాల గుట్టలు ఆ భయానక దృశ్యానికి సాక్షాలుగా నిలిచాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మరణించిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. భూ ప్రళయంలో కన్నుమూసిన వారు ఇప్పటి వరకు 25 వేలు దాటింది. ఒక్క టర్కీలోనే 20 వేల మంది మరణించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. మరోవైపు గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. సహాయక చర్యలతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భీకర భూకంపం సంభవించి 100 గంటలు గడిచిపోయిన శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. ఘోర విపత్తు ద్వారా కూతురిని కోల్పోయిన తండ్రి, తల్లిని కోల్పోయిన చిన్నారులు, తోబుట్టువులు ఇలా పలు చోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొందరు సజీవంగా బయటపడటం ఊరట కలిగిస్తోంది. మృత్యుంజయులుగా బయటపడుతున్న చిన్నారులు తుర్కియేలో శిథిలాలను తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కరోజే 100 మందికిపైగా బాధితులు ప్రాణాలతో బయటకు వచ్చారు. తాజాగా హతయ్ ప్రావిన్సులో శిథిలాల కింద మరో మహిళ, నవజాత శిశువు మృత్యంజయులుగా నిలిచారు. భూకంపం సంభవించిన 90 గంటల తర్వాత శిథిలాల నుంచి తల్లితో సహా యాగిజ్ ఉలాస్ అనే పది రోజుల శిశువును అధికారులు రక్షించారు. నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి మరణాన్ని జయించింది చిన్నారి. అనంతరం దుప్పటిలో చుట్టి హతే ప్రావిన్స్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అదే హతే ప్రావిన్స్లో భూ ప్రళయం చోటుచేసుకున్న 100 గంటల తర్వాత శిథిలాల నుంచి 3 ఏళ్ల జైనెప్ ఎలా పర్లక్ అనే చిన్నారి ప్రాణాలతో బయటపడింది. చదవండి: Donald Trump: ట్రంప్ ఈజ్ బ్యాక్.. రెండేళ్ల తర్వాత..! -
శిథిలాల కిందే ప్రసవం.. ఆట గదరా శివ!
పుట్టుక.. మరణం.. రెండూ రక్తంతో కూడుకున్నవే. అందునా ప్రకృతి ప్రకోపంతో కన్నెర జేస్తే ఫలితం ఎలా ఉంటుందో తాజా భూకంపాలను చూస్తే సుస్పష్టమవుతుంది. అయితే.. లయకారుడి తాండవంతో సృష్టి వినాశనానికి మాత్రమే కాదు చావుపుట్టుకలకి కూడా కారణమని ప్రతీతి. అందునా కష్టకాలంలోనూ వెలుగు రేఖను ప్రసరించే ప్రయత్నం చేశాడేమో!. శిథిలాల కిందే బిడ్డను ప్రసవించి కన్నుమూసిందో కన్నతల్లి. మూగబోయిన సెల్ఫోన్లు.. మంచు కురిసేంత చలికి వణికిపోతూ చేతికి దొరికిన పేపర్లను, అట్ట ముక్కలను, కవర్లను కాల్చుతూ చలి మంట కాచుకుంటున్నారు భూకంప బాధితులు. టర్కీ, సిరియాలో ఎటు చూసినా భవనాల శిథిలాలు.. శవాల దిబ్బలను తలపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎటు చూసినా భూకంపాలకు సంబంధించిన దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి. తమవంతుగా సహాయక చర్యల్లో స్థానికులు సైతం పాల్గొని.. ఎందరినో కాపాడుతున్నారు. తాజాగా.. సిరియా అలెప్పోలో ఓ తల్లి బిడ్డను ప్రసవించింది. అదీ శిథిలాల కిందే!. దురదృష్టం కొద్దీ ప్రసవించిన వెంటనే ఆ తల్లి కన్నుమూసింది. శిథిలాల తొలగింపు క్రమంలో ఇది గమనించిన స్థానికులు.. ఆ బిడ్డను హుటాహుటిన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ పరిస్థితి నిలకబడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో సిరియాదే అయినా. టర్కీలోనిది అనే ప్రచారం కూడా నడస్తుండడం గమనార్హం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) The moment a child was born 👶 His mother was under the rubble of the earthquake in Aleppo, Syria, and she died after he was born , The earthquake. May God give patience to the people of #Syria and #Turkey and have mercy on the victims of the #earthquake#الهزه_الارضيه #زلزال pic.twitter.com/eBFr6IoWaW — Talha Ch (@Talhaofficial01) February 6, 2023 -
అమానుష ఘటన.. అపార్ట్మెంట్ వద్ద పసికందును వదిలేసిన వ్యక్తులు
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలో అమనుష ఘటన చోటుచేసుకుంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో పరిధిలోని కమలానగర్లో గుర్తు వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లారు. రెండ్ అపార్టమెంట్ల మధ్య ఆవరణలో కేవలం ఒకరోజు వయసున్న శిశువును వదిలి వెళ్లారు. దీనిని గమనించిన స్థానికులు.. పసికందు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి తక్షణమే పోలీసులకు సమాచారం అందజేశారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ సాయికుమార్ తక్షణమే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అపార్ట్మెంట్ వద్ద పసికందును చూసి చలించిపోయిన ఎస్సై స్వయంగా తన చేతుల్లోకి తీసుకొని వైద్యం నిమిత్తం అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పసికందుకు ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. శిశువు పట్ల మానవాత్వం చాటుకున్న ఎస్సైని స్థానికులు కొనియాడారు. చదవండి: పెళ్లి పేరుతో యువకుడికి ‘మాయలేడి’ వల.. రూ.31లక్షలకు టోకరా -
అంత్యక్రియల్లో జాప్యం.. నిలిచిన ప్రాణం
సాక్షి, హైదరాబాద్: ‘ఆలస్యం.. అమృతం విషం’ అంటారు. కానీ ఇక్కడ ఆలస్యమే అమృతమై పసికందుకు ప్రాణాలు పోసింది. వివరాల్లోకి వెళితే.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్ఖాన్గూడకు చెందిన అన్నం శ్రీకాంత్ భార్య ఘట్కేసర్ హాస్పిటల్లో మగ శిశువుకు ఇటీవల జన్మనిచ్చింది. బాబు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఉప్పల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో 10 రోజులపాటు వెంటిలేటర్పై చికిత్స అందించారు. వెంటిలేటర్ తీసేస్తే బాబు బతకడని చెప్పిన వైద్యులు, రూ.4 లక్షలు బిల్లు కట్టించుకుని బుధవారం రాత్రి డిశ్చార్జి చేశారు. ఇంటికి తీసుకొచ్చాక సమాధి చేసేందుకు ‘వసంత వ్యాలీ’ కాలనీలోని ప్రభుత్వ స్థలంలో గుంత తవ్వించారు. ఇంతలో కాలనీవాసులు ఇది శ్మశానవాటిక కాదని, ఇందులో సమాధి చేయొద్దని అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుండగానే.. అకస్మాత్తుగా పసికందులో కదలికలు ప్రారంభమయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు రాత్రి 11 గంటల సమయంలో నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. చదవండి: ఐఆర్సీటీసీ స్వదేశ్ దర్శన్ పర్యాటక రైళ్లు -
భద్రాచలంలో ‘బాహుబలి’ బేబీ
భద్రాచలంఅర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ.. బేబీ బాహుబలికి మంగళవారం జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వైద్యులు బుధవారం మీడియాకు వెల్లడించారు. అప్పుడే పుట్టిన పిల్లలు సాధారణంగా 2.3 కేజీల నుంచి 3.7 కేజీల వరకు బరువుంటారు. కానీ, ఈ పాప ఏకంగా 5 కేజీల బరువుంది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ సాకేత తెలిపారు. దుమ్ముగూడెం మండలం దబ్బనుతాళం గ్రామానికి చెందిన గంగా భవానీ ఈనెల 2న ఆస్పత్రిలో చేరగా మంగళవారం సిజేరియన్ చేశారు. (క్లిక్: వస్తామన్న బస్సు రానే వచ్చింది.. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్..) -
Viral Video: అమ్మాయి పుట్టిందని తండ్రి సంతోషం.. హెలికాప్టర్లో స్వాగతం
పుట్టేదీ ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే పిండాన్ని చిదిమేస్తున్న ఘటనలు ఎన్నో చూశాం. ఆడపిల్ల పుట్టిన తర్వాత చంపడం, చెత్తకుప్పల్లో పడేసే దారుణాల గురించి కూడా ఎన్నో విన్నాం. ఆడపిల్లగా పుట్టి పెరిగినా సమాజంలో చిన్న చూపు మాత్రం పోలేదు. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ పరిస్థితి కాస్త మారింది. పుట్టబోయేది ఎవరైనా సరే తల్లిదండ్రులు వారిని సంతోషంగా పెంచి పెద్ద చేస్తున్నారు. తాజాగా కూతురు పుట్టిందన్న సంతోషంలో ఓ కుటుంబం ఉబ్బితబ్బి అయిపోయింది. కూతురిని ఆసుపత్రి నుంచి ఇంటికి ఆహ్వానించేందుకు వినూత్నంగా ఆలోచించారు. లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఏకంగా హెలికాప్టర్తో స్వాగతం పలికారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూణే జిల్లాలోని ఖేడ్ పట్టణానికి చెందిన విశాల్ జరేకర్ అనే న్యాయవాదికి జనవరి 22న పాప పుట్టింది. బోసారి పట్టణంలో జన్మించిన ఆ పాపకు రాజలక్ష్మీ అని నామకరణం చేశారు. కాగా విశాల్ కుటుంబంలో చాలా ఏళ్ల తరువాత ఆడపిల్ల పుట్టింది. దీంతో చిట్టితల్లిని ఇంటిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని భావించారు. చిన్నారిని ఖేడ్లోని ఇంటికి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్ను బుక్ చేశారు. ఇందుకోసం లక్షరూపాయలు ఖర్చు చేశాడు. ఇంటి దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సరైన స్థలం లేకపోవడంతో వ్యవసాయ క్షేత్రంలో హెలికాప్టర్ ల్యాండ్ చేశారు. అలా హెలికాప్ట్ ద్వారా విశాల్ తన కూతురిని ఇంటికి తీసుకెళ్లాడు. చదవండి: హృదయ విదారకం: బిడ్డను కాపాడటం కోసం శత్రువుకెదురెళ్లి తల్లి ప్రాణ త్యాగం #WATCH Shelgaon, Pune | Grand Homecoming ! A family brought their newborn girlchild in a chopper We didn't have a girlchild in our entire family. So, to make our daughter's homecoming special, we arranged a chopper ride worth Rs 1 lakh:Vishal Zarekar,father (Source: Family) pic.twitter.com/tA4BoGuRbv — ANI (@ANI) April 5, 2022 ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ సందర్భంగా అమ్మాయి తండ్రి విశాల్ మాట్లాడుతూ.. ఇంట్లో ఆడపిల్ల పుట్టడాన్ని పండుగలా జరుపుకోవాలనే సందేశాన్ని సమాజానికి ఇచ్చేందుకే ఈ విధంగా చేసినట్లు తెలిపారు. ఆడపిల్ల పుడితే భారంగా భావించే మనషులకు విశాల్ ఆదర్శంగా నిలిచాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
వనస్థలిపురంలో కలకలం.. ముళ్లపొదల్లో మృతశిశువు తల లభ్యం
సాక్షి, హైదరాబాద్: మృత శిశువు తలను కుక్కలు పట్టుకొచ్చి చెట్ల పొదల్లో వదిలేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం సీఐ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సహారా మొదటి గేటు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఆదివారం ఉదయం మృత శిశువు తలను కుక్కలు తీసుకువచ్చాయి. దీనిని గుర్తించిన స్థానిక పాలబూత్ యజమాని కుక్కను తరిమి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మొండెం కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
జీజీహెచ్లో కిడ్నాప్కు గురైన బాలుడు సురక్షితం
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని జీజీహెచ్ ఆస్పత్రిలో కిడ్నాపైన పసికందు సురక్షితంగా ఉన్నాడు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నెహ్రూనగర్లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు. గుంటూరు జీజీహెచ్లో శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో..4 రోజుల పసికందును కిడ్నాప్ చేశారు. అయితే, కొద్ది గంటల్లో శిశువు ఆచూకీ లభించింది. అక్కడ వార్డు బాయ్ మరో మహిళతో కలిసి పసికందును అపహరించినట్టు పోలీస్ విచారణలో వెల్లడయ్యింది. పసికందు అపహరణకు గురైన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
AP: చంటిబిడ్డలతో ప్రమాణ స్వీకారానికి..
నెల్లూరు (పొగతోట) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక, ప్రమాణ స్వీకారానికి ఇద్దరు సభ్యులు తమ చంటిబిడ్డలతో హాజరయ్యారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జెడ్పీ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న, తడ జెడ్పీటీసీ సభ్యురాలు ఇందుమతి రోజుల బిడ్డలతో హాజరయ్యారు. వీరిని సహాయకుల వద్ద ఉంచి వారు ప్రమాణ స్వీకారం చేశారు. రాపూరు జెడ్పీటీసీ సభ్యురాలు చిగురుపాటి లక్ష్మీప్రసన్న జెడ్పీ వైస్ చైర్పర్సన్గా ఎంపికయ్యారు. -
భార్యాభర్తల మధ్య గొడవ.. 22 రోజుల పసికందు బలి
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ పరిధి పూసల బస్తీలో దారుణం చోటు చేసుకుంది. తాగిన మైకంలో పసికందును బలిచేశారు భార్యాభర్తలు. దంపతుల మధ్య తలెత్తిన గొడవ కాస్త పసికందు ప్రాణం తీసింది. బాలింత అయిన భార్య, రోజుల శిశువుపై నిందితుడు రాజు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో 22 రోజుల శిశువుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. పోలీసులు పసికందు తల్లిదండ్రులైన రాజేష్ అలియాస్ రాజు, జాహ్నవిలను అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: సైదాబాద్ ఘటన: మత్తు రహిత సింగరేణిగా మారాలి) రాజేశ్, జాహ్నవి దంపతులకు ఈ శిశువు రెండో సంతానం. రెండేళ్ల క్రితం ఈ దంపతులు వారి తొలి సంతానం.. ఐదు నెలల బాబును మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి విసిరేశారు. విషయం తెలుసుకున్న అధికారులు బాలుడిని కాపాడి.. అతడి సంరక్షణ కోసం యూసుఫ్గూడలోని శిశువిహార్ చేర్చారు. రెండో సంతానం కూడా వీరి ఘర్షణకు బలైన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పసికందు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: పెళ్లి కాకుండానే గర్భం.. బిడ్డను కిటికీలోంచి విసిరేసి.. -
చెత్తకుప్పలో నవజాత ఆడశిశువు
నాగర్కర్నూల్ క్రైం: తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రపోవాల్సిన నవజాత శిశువు చెత్తకుప్పలోకి చేరింది. కళ్లు తెరవని పసికందు చెత్తకుప్పల నడుమ ఆకలికేకలతో దర్శనమిచ్చింది. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రం శివారులోని గొల్లగేరి సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో చెత్తకుప్పల మధ్య ఆదివారం ఓ నవజాత ఆడశిశువు కన్పించింది. శిశువు ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్సై విజయ్కుమార్ శిశువును ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని, ఐదురోజుల ఆడశిశువుగా గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. కాగా, డంపింగ్యార్డులో శిశువు ను వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల ఆచూకీ కోసం పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పెళ్లి కాకుండానే గర్భం.. బిడ్డను కిటికీలోంచి విసిరేసి..
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): అక్రమ సంబంధంతో గర్భం దాల్చిన అవివాహిత ప్రైవేట్ క్లినిక్లో బిడ్డకు జన్మనిచ్చి పురిటిబిడ్డను శౌచాలయం కిటికీలోంచి విసిరేసిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో చోటుచేసుకుంది. హెసరఘట్టకు చెందిన మహిళ (22) అక్రమ సంబంధం కారణంగా గర్భం దాల్చింది. నెలలు నిండడంతో ప్రైవేటు ఆస్పత్రికి వచ్చి దాఖలయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె పురిటిబిడ్డను శౌచాలయంలోని కిటికీలోంచి విసిరేసి పరారైంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన హాస్పిటల్ సిబ్బంది మాదనాయకనహళ్లి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆమెను గుర్తించి అరెస్టు చేసి అనంతరం చికిత్స కోసం లక్ష్మివిలాస్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన నవజాత శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆమె గర్భం దాల్చడానికి కారణమైన గుడేమారనహళ్లికి చెందిన శశాంక్ (25) అనే వ్యక్తిని అరెస్టు చేసారు. ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. -
అమానుషం: పసికందును డ్రైనేజీలో పడేసిన తల్లి
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): భర్త వేధింపులు తాళలేక ఓ తల్లి తన కొడుకును డ్రైనేజీలో పడేయగా బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడలోని కామినేనినగర్ డొంకరోడ్డు కాలనీలో జరిగింది. వల్లెపు మీనాక్షి డొంకరోడ్డు కాలనీకి చెందిన జయరాంను ద్వితీయ వివాహం చేసుకుంది. వీరికి 6 నెలల కిందట సామ్యేలు జన్మించాడు. మీనాక్షిపై భర్తకు అనుమానం పెరిగింది. జయరాంకు మద్యం, గంజాయి సేవించే అలవాటు ఉంది. ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్తతో విసిగిపోయిన మీనాక్షి బుధవారం ఉదయం 5 గంటలకు సామ్యేలును తీసుకొని కాలనీ పక్కనే ఉన్న గుంటతిప్ప డ్రైనేజీలో పడేసింది. కాలనీ వాసులు సామ్యేలు కోసం డ్రైనేజీలో గాలించారు. సామ్యేలు మృతదేహాన్ని బయటకు తీసి విషయాన్ని పటమట పోలీసులకు చెప్పారు. వారు ఘటనాస్థలికి చేరుకొని పంచనామా అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జయరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలు మీనాక్షిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: AP: నేటి నుంచి 12వ విడత ఫీవర్ సర్వే -
అప్పుడే పుట్టిన పసిబిడ్డ చెత్తకుప్పలో..
కుభీర్(ముథోల్): నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సిలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుప్పల్లో పారేశారు. గ్రామంలోని సాయిబాబా ఆలయం వెనక నిర్మానుష్య ప్రదేశంలో చెత్తకుప్పల నుంచి ఆదివారం ఉదయం ఏడుపు వినిపించడంతో అటుగా వ్యవసాయ పనులకు వెళ్తున్న స్థానికులు శిశువును గుర్తించారు. గ్రామస్తులు స్థానిక ఎస్సై ప్రభాకర్రెడ్డికి సమాచారం అందించడంతో ఆయన అక్కడకు చేరుకుని శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. ఐసీడీఎస్ సీడీపీవో నాగలక్షి్మ, సూపర్వైజర్ భారతి శిశువును భైంసా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం శిశువును ఆదిలాబాద్లోని శిశు గృహకు తరలించారు. శిశువును చెత్తకుప్పలో ఎవరు పడేశారన్నదానిపై పోలీసులు విచారణ చేపట్టారు. -
కోటనందూరు పీహెచ్సీలో శిశుమరణం
సాక్షి, కోటనందూరు: కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశుమరణం సంభవించింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ సోమవారం స్థానిక పీహెచ్సీ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యాధికారి, వైద్య, పారామెడికల్ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఇదీ పరిస్థితి ఈనెల 26వ తేదీ శనివారం కోటనందూరుకు చెందిన గర్భిణి లక్ష్మీ రాధను కుటుంబ సభ్యులు మధ్యాహ్నం ఒంటిగంటకు స్థానిక పీహెచ్సీకి తీసుకొచ్చారు. రెగ్యులర్ స్టాఫ్నర్సు సెలవులో ఉండడంతో ఆ స్థానంలో విధులు నిర్వహిస్తున్న హెచ్వీ, ఏఎన్ఎంలు, ఫార్మాసిస్టు కేసును చేర్చుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు వారి పర్యవేక్షణలోనే లక్ష్మీరాథ ఉంది. సాయంత్రం ఆరు గంటలకు నైట్ డ్యూటీ స్టాఫ్నర్సు విధులకు హాజరయ్యారు. రాత్రి ఎనిమిది గంటల వరకూ గర్భిణీ పరిస్థితి అంతా సవ్యంగానే ఉంది. డెలివరీ సమయం సమీపించడంతో హెచ్వీ, ఫార్మాసిస్టు సహకారంతో స్టాఫ్నర్సు రాత్రి 10.15 నిమిషాలకు ప్రసవం చేసారు. పసికందు పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో తుని ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు వైద్యసిబ్బంది తెలిపారు. అప్పటికే శిశువు మృతి చెందినట్టు అక్కడ డాక్టర్లు ధ్రువీకరించారు. ఎటువంటి సమాచారం లేదు: వైద్యాధికారి ఈ విషయంపై వైద్యాధికారి ఇందిరాప్రియదర్శిని వివరణ కోరగా శనివారం అంతా ఎన్సీడీసీడీ సర్వేలో ఉన్నామని, ఈ కేసు సమాచారం తనకు తెలియదని చెప్పారు. జరగాల్సిన నష్టం జరిగాక రాత్రి 12.30 గంటలకు సమాచారమిచ్చారన్నారు. ఆదివారం ఉదయం వచ్చి కేసును పరిశీలించానన్నారు. డీడీఓ వైద్యాధికారి డిప్యుటేషన్పై వెళ్లడంతో పనిభారం పెరిగిందని, ప్రసవాల విషయంలో అప్రమత్తంగా ఉంటామని వివరించారు. (చదవండి: అనగనగా ఒక పోలీసు! ఆ కథ విందామా..) సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలా.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం వైద్యాధికారి విధుల్లో లేరని, సిబ్బంది, మెడికల్ అధికారి మధ్య సమన్వయం కొరవడడంతోనే సమస్య తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శిశువు బొడ్డు దగ్గర ప్రేగు మెడకు చుట్టుకోవడం, చేయి మడత పడి ఉండడం వల్ల శిశువు ఇబ్బందులకు గురైందని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ విషయం స్కానింగు రిపోర్ట్లో ఎక్కడా లేకపోవడం, డెలివరీ సమయం సమీపించడంతో ఇక్కడ ప్రసవం చేసామని వివరించారు. స్కానింగ్ రిపోర్ట్ అంతా సవ్యంగా ఉండడంతోనే ఆసుపత్రిలో చేర్చుకున్నట్టు చెప్పారు. -
బాత్రూంలో ప్రసవం.. భయంతో బిడ్డను
న్యూయార్క్ : ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా సరే కన్నతల్లి తన బిడ్డపై చూపించే ప్రేమ ఒకేలా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా బిడ్డకు మాత్రం హాని తలపెట్టదు. తాను కష్టాలు ఎదుర్కొనైనా సరే బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కన్నతల్లి ప్రేమ అలాంటిది. కానీ ఇక్కడ ఒక కన్నతల్లి మాత్రం అప్పుడే పుట్టిన పసికందును కిటీకీలోంచి విసిరేసి మాతృత్వం అనే పదానికి కళంకం తెచ్చింది. ఈ హృదయవిదారక ఘటన అక్టోబర్ 10న అమెరికాలో న్యూయార్క్లో చోటుచేసుకుంది. (చదవండి : రాక్షసి: గర్భిణిని చంపి, బిడ్డను తీసుకొని...) వివరాలు ... న్యూయార్క్లోని క్వీన్స్ ఏరియాలో భారత సంతతికి చెందిన అమెరికా 23 ఏండ్ల యువతి సబితా దూక్రమ్ భర్తతో కలిసి నివసిస్తుంది. గర్భవతి అయిన సబితా దూక్రమ్ ఈనెల 10న బాత్రూమ్లో స్నానం చేస్తుండగా ప్రసవించింది. భయంతో ఏం చేయాలో తెలియక అప్పుడే పుట్టిన పసికందును బాత్రూం వెంటిలేటర్ నుంచి బయటికి విసిరేసింది. అనంతరం బాత్రూంను శుభ్రపర్చి స్నానం చేసి యధావిథిగా వచ్చి బెడ్పై పడుకుంది.అయితే పసికందు ఏడుపు శబ్ధం విన్న ఇరుగుపొరుగు వారు ఆ పసికందును ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రసవించిన విషయాన్ని కుటుంబసభ్యులు ఎవరికీ చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారని అడిగిన ప్రశ్నకు సబితా దూక్రమ్ చెప్పిన సమాధానం పోలీసులనే ఆశ్చర్యపరిచింది. అసలు ఈమె కన్నతల్లేనా అనే అనుమానం కూడా వస్తుంది. 'నేను బాత్రూం వెళ్లి స్నానం చేస్తుండగా బాబు పుట్టాడు. అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు చాలా భయం వేసింది. బాత్రూంలో ఉన్న కత్తెరతో బొడ్డుతాడు కట్చేసి బాబును బయటికి విసిరేశా. ఆ తర్వాత నా దుస్తులను బాత్రూంలోని వాషింగ్మెషిన్లో పడేసి, బాత్రూంను శుభ్రంగా కడిగి బయటికి వచ్చి బెడ్రూంలో పడుకున్నా' అని చెప్పింది. అసలు సబితా దుక్రమ్ భయంతో నిజంగానే బిడ్డను పారేసిందా లేక మతిస్థిమితం తప్పి అలా ప్రవర్తించిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంలో సబితా దూక్రమ్ను కఠినంగా శిక్షించాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
16వ బిడ్డకు జన్మనిస్తూ మహిళ మృతి
భోపాల్: 16వ బిడ్డకు జన్మనిస్తూ.. ఓ మహిళ చనిపోయింది. విషాదం ఏంటంటే తల్లి మరణించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే నవజాత శిశువు కూడా మరణించింది. వివరాలు.. మధ్యప్రదేశ్ దామోహ్ జిల్లాకు చెందిన సుఖ్రాని అహిర్వర్ 16వ సారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆమెకు నొప్పులు వచ్చాయి. దాంతో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద గుర్తింపు పొందిన ఆశా కార్యకర్త కల్లో బాయి విశ్వకర్మ సుఖ్రానికి డెలివరీ చేసింది. మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి నిమిషాల వ్యవధిలోనే కన్ను మూసింది. మరి కాసేపటికే నవజాత శిశువు కూడా మృతి చెందింది. (చదవండి: చెన్నూర్లో వింత శిశువు జననం) ఈ సందర్భంగా విశ్వకర్మ మాట్లాడుతూ.. ‘డెలివరీ తర్వాత సుఖ్రాని, ఆమె నవజాత శిశువు పరిస్థితి విషమంగా మారటంతో వారిద్దరిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాము. అక్కడ చేరిన వెంటనే తల్లి.. కాసేపటికే బిడ్డ చనిపోయినట్లు తెలిసింది. సుఖ్రాని గతంలో 15 మంది పిల్లలకు జన్మనిచ్చింది. కానీ వారిలో ఏడుగురు చనిపోయారు’ అని తెలిపింది. దీని గురించి జిల్లా చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సంగీత త్రివేది పీటీఐకి తెలపడంతో వెలుగులోకి వచ్చింది. -
చెన్నూర్లో వింత శిశువు జననం
సాక్షి, చెన్నూర్: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వింత శిశువు జన్మించింది. కానీ పుట్టిన గంటకే మరణించినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు అరుణశ్రీ వివరాల ప్రకారం.. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన ప్రియాంక శనివారం ఉదయం ప్రసూతి కోసం ఆస్పత్రిలో చేరింది. సాధారణ ప్రసవంలో మగ శిశువు పుట్టింది. శిశువు నుదుటిపైన ఒంటి కన్నులాంటి అవయవం ఉండటంతో గంటకే మృతి చెందింది. జన్యుపరమైన లోపంతో ఇలాంటి వింత ఆకారంలో శిశువులు పుడుతారని వైద్యులు తెలిపారు. ఆసంపల్లి ప్రియాంక శంకర్ దంపతులకు మొదటి కాన్పులో అమ్మాయి పుట్టింది, రెండో కాన్పులో మగ బిడ్డ వింత రూపంతో పుట్టడంతో పాటు గంటకే మృతి చెందడంతో దంపతులు కన్నీటి పర్యాంతమయ్యారు. (నాడు తల్లి.. నిన్న తండ్రి మృతి) -
లాక్డౌన్: కూతురు జన్మించి 12 రోజులైనా..
లక్నో: దేశ ప్రజానీకమంతా లాక్డౌన్ నేపథ్యంలో కుటుంబాలతో గడుపుతుండగా.. పోలీసు, వైద్య సిబ్బంది మాత్రం కరోనా పోరులో ముందుండి, ప్రాణాలను రిస్కులో పెట్టి సేవలందిస్తున్నారు. 35 డిగ్రీల ఎండ వేడిలో మొబైల్ చూసుకుంటున్న ఈయన రమాకాంత్ నాగర్ (25). కోవిడ్ వారియర్స్లో ఒకరైన పోలీసు. కూతూరు జన్మించి 12 రోజులవుతున్నా ఇంటిముఖం చూడకుండా విధుల్లో తలమునకలయ్యారు. నవజాత శిశువు ఫొటోల్ని కుటుంబ సభ్యులు వాట్సాప్లో పంపించడంతో చూసి మురిసిపోతున్నారు. కూతురును చూసేందుకు వెళ్దామని ఉన్నా.. లాక్డౌన్ పూర్తయితేగాని ఇంటికి వెళ్లనని చెప్తున్నారు. తన సహోద్యోగులంతా డ్యూటీ చేస్తుండగా.. తాను మాత్రం ఎలా వెళ్లగలనని అంటున్నారు. ఇటావా ప్రాంతంలో డ్యూటీ చేస్తున్న రమాకాంత్ ఫొటోపై కొందరు నెటిజన్లు ‘ప్రజా సేవకు అంకితమైన ఓ పోలీసు.. మీకు సలాం’ అని కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: మహమ్మారి నెమ్మదించాలంటే..) ఇక దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, జనాభా పరంగా పెద్దదైన ఉత్తర ప్రదేశ్ లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తుండటంతో ఇప్పటివరకు 657 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 49 మంది కోలుకున్నారు. 5 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 కంటైన్మెంట్లు ఉండగా.. ఒక్క కేసు మాత్రమే ఉన్న ఇటావా ఆ జాబితాలో లేదు. మంగళవారం సాయంత్రం నాటికి కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 10,815 కు చేరగా.. 1189 మంది కోలుకున్నారు. 353 మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 9272గా ఉంది. (చదవండి: లాక్డౌన్ పొడిగింపుకు అసలు కారణం ఇదేనా..!) -
లాక్డౌన్: ‘ఇది మనసును చిత్రవధ చేస్తోంది’
మిచిగాన్: మనవరాలు పుట్టాడని తెలిసిన క్షణం నుంచీ ఆ పెద్దాయన మనసు మనసులో లేదు. ఎప్పుడెప్పుడు బుడ్డదాన్ని చేతుల్లోకి తీసుకుని ఆడించాలా అని తెగ ఉబలాటపడిపోతున్నాడు. కానీ కాలం బాగోలేదు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా మహమ్మారి పట్టి పీడించేందుకు సిద్ధంగా ఉంటుంది. దీన్ని దష్టిలో పెట్టుకున్న ఆ పెద్దాయన నడక ప్రారంభించాడు. మితిమీరిన వయసును మర్చిపోయి హుషారుగా కొడుకింటికి చేరుకున్నాడు. ఈ లోకంలోకి కొత్తగా అడుగుపెట్టిన మనవరాలిని కళ్లారా చూసుకున్నాడు. కానీ తనివితీరా ఎత్తుకోలేకపోయాడు. బయట నుంచే చూసి అటునుంచి అటే వెనుదిరిగాడు హదయాలను హత్తుకున్న ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మిచిగాన్లోని జోషువా గిల్లెట్కు కూతురు ఇలియానా జన్మించింది. (కోవిడ్ -19 విధ్వంసం : పేదరికం గుప్పిట్లోకి 40 కోట్ల మంది) సరిగ్గా అదే సమయంలో కరోనా వ్యాప్తి నివారించేందుకు అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. కానీ ఆ తాతయ్యకు ప్రాణం అంతా చిన్నారిమీదే. అందుకే తరచూ నాలుగు మైళ్లు(ఆరు కి.మీ) నడిచి కొడుకింటికి రావడం, మనవరాలిని బయట అద్దంలో నుంచే చూసి సంతోషించడం పరిపాటైంది. దీనికి సంబంధించిన ఫొటోను జోషువా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. "నా కన్నతండ్రి, తన మనవరాలిని కనీసం తాకడానికి కూడా వీలు లేదు. ఇది నా మనసును చిత్రవధ చేస్తోంది" అని భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఎప్పటికప్పుడు శిశువు ఫొటోలను తన తండ్రికి పంపిస్తున్నానని చెప్పాడు. ఈ విపత్కర సమయంలో అందరూ తమతమ ఇళ్లలోనే ఉండాలని సూచించాడు. (భారత్కు పెరుగుతున్న డిమాండ్) -
పాల కోసం ఎమర్జెన్సీ నెంబర్కు కాల్ చేసింది!
వాషింగ్టన్ : శాంతి భద్రతలు, పౌరులకు మెరుగైన రక్షణ, క్విక్ రెస్పాన్స్ విషయంలో అమెరికా పోలీసులు వహ్వా అనిపించారు. అర్ధరాత్రి సమయంలో ఓ మహిళ విన్నపాన్ని మన్నించి.. ఆమె బుజ్జి పాపాయికి పాలు, బేబీ ఫార్ములా తీసుకెళ్లి అందించారు. అమెరికాలో ఎమర్సెన్సీ నెంబర్ 911. ఆపత్కాలంలో ఈ నెంబర్కు డయల్ చేసి పోలీసుల సాయంతో బయటపడొచ్చు. యూఎస్లోని ఉత రాష్ట్రానికి చెందిన షానన్ బర్డ్కు జనవరి 28, అర్ధరాత్రి 2 గంటల సమయంలో తలెత్తిన పరిస్థితి కూడా అలాంటిదే. స్పందన కరువైంది..! నెలల తన బుజ్జి పాపాయికి బ్రెస్ట్ ఫీడ్ చేద్దామంటే షానన్ దగ్గర పాలు లేవు. ఇంట్లో ఉన్న పాలు కూడా అయిపోయాయి. పనిమీద వేరే ప్రాంతానికి వెళ్లిన భర్త కూడా ఆ సమయంలో అందుబాటులో లేడు. సమయమేమో అర్ధరాత్రి రెండవుతోంది. తన మిగతా పిల్లలు (నలుగురు) నిద్రిస్తూ ఉన్నారు. ఇక ఇరుగుపొరుగు వారి సాయం అడుగుదామంటే ఎవరూ స్పందించలేదు. అప్పటికే తన చిన్నారి కూతురు ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తోంది. దాంతో, షానన్కు ఏం చేయాలో పాలు పోలేదు. ఇలా కాసేపు మానసిక వేదనకు గురైన ఆమెకు ఆపత్కాలంలో ఆదుకునే 911 గుర్తుకు వచ్చింది. వెంటనే 911కు కాల్ చేసి.. తన పరిస్థితిని పోలీసులకు విన్నవించింది. స్పందించిన లోన్ పీక్ ప్రాంత పోలీసులు ఓ పాల డబ్బా, బేబీ ఫార్ములాను తీసుకెళ్లి ఇచ్చారు. పోలీసుల సాయానికి కృతజ్ఞతలు తెలిపిన షానన్ తన బ్లాగులో ఈ వివరాలు వెల్లడించింది. ఇక అమెరికన్ పోలీసుల ఔదార్యం, షానన్ తెలివైన పనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. చిన్నారి ఆకలి తీర్చిన పోలీసులు సంతోష పడి ఉంటారని కొందరు, ‘మనసు’పెట్టి పనిచేసిన పోలీసులకు సెల్యూట్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కష్టకాలంలోనూ బిడ్డ ఆకలి తీర్చగలిగిన అమ్మకు సలాం అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. -
రెండోసారి కూతురే; మాతృత్వానికి మచ్చ..!
భోపాల్ : సృష్టిలో అమ్మను మించిన దైవం లేదంటారు. కానీ, మధ్యప్రదేశ్లోని ఓ మహిళ మాత్రం మాతృత్వానికి మచ్చ తెచ్చింది. కొడుకు పుట్టలేదనే ఆగ్రహంతో.. రోజుల పసికందు ప్రాణాలు తీసింది. వివరాలు.. మంజు సింగ్ (26) ఈ నెల 12 (బుధవారం)న ఓ పాపకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నుంచి అమా ఖోరియాలోని పుట్టింటికి వచ్చింది. కొడుకు పుట్టలేదనే ‘పిచ్చి’తనంతో పాప తలపై, పొట్టపై కొడవలి పిడితో కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ శిశువును తొలుత షాజాపూర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఇండోర్లోని ఎంవై ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పాప శనివారం మరణించింది. బాబు పుట్టలేదనే మనస్తాపంతోనే పాపను చంపినట్టు కసాయి తల్లి పోలీసుల ముందు నేరం ఒప్పుకుంది. ఇప్పటికే ఓ పాప ఉందని, రెండోసారి కూడా పాపే పుట్టడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని చెప్పుకొచ్చింది. నిందితురాలిని అరెస్టు చేసి జైలుకు తరలించామని ఉదయ్సింగ్ అలవా ఇన్స్పెక్టర్ మోహన్ బదోదియా వెల్లడించారు. -
కన్నతల్లే కఠినాత్మురాలై..
నిడదవోలు రూరల్: పసికందును కన్నతల్లే మురుగు డ్రెయిన్లో పడవేసిన విషాదఘటన నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన 18 ఏళ్ల ఓ యువతి ఈ ఘాతుకానికి పాల్పడింది. పెళ్లి కాకుండానే గర్భిణి అయిన ఈ యువతి గురువారం అర్ధరాత్రి ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆ పసికందు గర్భంలోనే మృతిచెందడంతో డ్రెయిన్లో పడవేసినట్లు తెలిసింది. స్థానికులు శుక్రవారం ఉదయం మురుగు డ్రెయిన్లో ఉన్న శిశువును చూసి పంచాయతీ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక ఆరోగ్య, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటా సర్వే చేసి అనారోగ్యంతో ఉన్న ఆ యువతిని గుర్తించి నిలదీయడంతో జరిగిన విషయం చెప్పింది. తాడిమళ్ల పీహెచ్సీ వైద్యాధికారి సుధీర్కుమార్ పర్యవేక్షణలో నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి యువతికి వైద్యపరీక్షలు చేశారు. యువతి సమాచారం మేరకు సమిశ్రగూడెం ఎస్సై టీవీ సురేష్ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పనులకు వెళ్లి పరిచయం పెంచుకుని.. యువతితో పాటు ఆమె తండ్రి ఇద్దరూ కలిసి ఈ ఏడాది జనవరిలో జంగారెడ్డిగూడెం మండలంలో పొగాకు నారుమడుల పనికి వెళ్లారు. వారికి బంధువైన చాగల్లు మండలం ఊనగట్ల గ్రామానికి చెందిన యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో గర్భం దాల్చినట్లు పోలీసులు చెబుతున్నారు. తనకు గర్భం వచ్చిందని తెలియదని ఆ యువతి చెప్పినట్లు తెలుస్తోంది. -
బంజారాహిల్స్లో పసికందు తల భాగం
-
ఒక మహిళ.. ముగ్గురు భర్తల కథ..!
కోల్కతా: నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ ఆడబిడ్డకు ‘తండ్రిని నేనే’ అంటూ ముగ్గురు వ్యక్తులు ముందుకొచ్చారు. శిశువు తల్లిని తానే భర్తనని ముగ్గురూ ప్రకటించుకున్నారు. వివరాలు.. నెలలు నిండటంతో శనివారం రాత్రి ఓ గర్భిణీ (21) నగరంలోని ఐఆర్ఐఎస్ ఆస్పత్రిలో చేరారు. ఆమెతో పాటు ఒక పురుషుడు, ఒక మహిళ కూడా ఉన్నారు. సదరు మహిళను డెలివరీ కోసం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఇంతవరకూ బాగానే సాఫీగా ఉంది. కానీ, ఇంతలో ఓ వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడు. డెలివరీ కోసం వెళ్లిన మహిళ తన భార్య అని.. ఆమెను కలుసుకోవాలని చెప్పడంతో ఆశ్చర్యపోవడం సిబ్బంది వంతైంది. ఎందుకంటే, మహిళతో పాటు వచ్చిన వ్యక్తి... ఆమె భర్తగా చెప్పుకున్నాడు. ఆపరేషన్ ఫారంలలో సంతకం కూడా చేశాడు. ఇదే విషయం రెండో వ్యక్తికి చెప్పారు. అంతేగాక, అతన్ని మహిళ కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్ళి విషయం చెప్పారు. ఇద్దరూ ఆ గర్భిణీ భర్తలేనంటూ వారు సమాధానమివ్వడంతో సిబ్బంది మరోమారు ఆశ్చర్యపోక తప్పలేదు. ఇదిలాఉండగా.. ఆమె ఇద్దరు భర్తల మధ్య అసలు భర్తను నేనంటే నేనంటూ తన్నులాట మొదలైంది. పరిస్థితి గందరగోళంగా మారడంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ లోపు ఆపరేషన్ థియేటర్లో ఉన్న మహిళ పండంటి ఆడశిశువుకు జన్మనివ్వడం.. పోలీసులు ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయాయి. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నా.. పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని.. విచారణ ప్రారంభించారు. సదరు మహిళతో వివాహం అయినట్లు ఆధారాలు చూపించమన్నారు పోలీసులు. దాంతో రెండో వ్యక్తి ఇంటికి వెళ్లి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకువచ్చి పోలీసులకు చూపించాడు. ఈ పరిణామంతో మొదటి వ్యక్తి దారిలోకి వచ్చాడు. తాను సదరు మహిళకు కేవలం స్నేహితుడినని తెలిపాడు. హమ్మయ్యా సమస్య పరిష్కారం అయ్యిందనుకొంటుండగా.. మరో సమస్య వచ్చిపడింది. ఇంతలో మహిళ తల్లి... రెండో వ్యక్తిని తన అల్లుడిగా నిరాకరించింది. దాంతో పోలీసులు మహిళ స్పృహలోకి వస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావించి ఎదురు చూడసాగారు. ఈ లోపు కొత్త సమస్య ఎదురైంది. ఇద్దరిలో ఎవరు అసలు భర్తో తెలియని తికమక వాతావరణంలో ఇంకో వ్యక్తి వచ్చి పుట్టిన బిడ్డకు తానే తండ్రినని మరో బాంబు పేల్చాడు. భర్తను కాదు.. తండ్రిని ఈ సారి తలపట్టుకోవడం పోలీసుల వంతైంది. సదరు మహిళకు తాను భర్తను కాదని, పుట్టిన బిడ్డకు మాత్రం తండ్రిని తానేనని మూడో వ్యక్తి వాదులాట మొదలెట్టాడు. ఈ పంచాయితీ పోలీసులకు సవాల్గా మారింది. మహిళ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తే తప్ప ఈ డ్రామాకు శుభం కార్డు పడేలా కనిపించలేదు. ఈ లోపు మహిళకు స్పృహ రావడంతో.. ఆమె స్టేట్మెంట్ రికార్డు చేశారు. జరిగిన విషయాలన్నీ చెప్పారు. తన నిజమైన భర్త ఎవరో చెప్పాల్సిందిగా కోరారు. ఆమె ఏ మాత్రం కంగారు పడకుండా మ్యారేజ్ సర్టిఫికేట్తో వచ్చిన రెండో వ్యక్తే తనకు భర్త అని వెల్లడించింది. అతనే తన బిడ్డకు తండ్రి అని తేల్చింది. అసలు విషయం ఏంటంటే.. మరి సదరు మహిళ తల్లి రెండో వ్యక్తిని తన అల్లుడిగా అంగీకరించకపోవడం గురించి ప్రశ్నించారు పోలీసులు. అందుకు మహిళ సమాధానమిస్తూ.. ‘మా ఇద్దరికి తొలుత ఓ క్లబ్లో పరిచయమైంది. ప్రేమించుకున్నాం. ఈ లోపు నేను గర్భవతిని అయ్యాను. పెళ్లి గురించి అడిగితే.. తప్పించుకోవాలని చూశాడు. దాంతో అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్లో పోలీసుల జోక్యంతో మా వివాహం జరిగింది. అయితే మా వివాహాన్ని రెండు కుటుంబాలు అంగీకరించలేదు. దాంతో మేం వారి నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నాం. ఆ కోపంతో మా అమ్మ నా భర్తను తన అల్లుడిగా ఒప్పుకోలేదు’ అని తెలిపింది. చివరకు ఈ కథ ఇలా సుఖాంతం అయ్యింది. -
తల్లి వద్దనుకుంది.. మూగజీవులు కాపాడాయి
చండీగఢ్ : ఇంకా కన్ను కూడా తెరవని పసిపాపను నిర్దాక్షిణ్యంగా మురికి కాల్వలోకి విసిరేసింది ఓ కసాయి తల్లి. కానీ నోరు లేని మూగజీవులు ఆ బిడ్డను కాపాడి మానవత్వం చాటుకున్నాయి. ప్రస్తుతం ఆ చిన్నారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ దారుణం హరియాణలోని కైతాల్ జిల్లాలో చోటు చేసుకుంది. సీసీటీవీ రికార్డులో ఉన్న దాని ప్రకారం శుక్రవారం ఓ మహిళ డోగ్రన్ గేట్ ప్రాంతంలో ఓ పసిపాపను ప్లాస్టిక్ కవర్లో చుట్టి మురికి కాల్వలోకి విసిరి వెళ్లి పోయింది. అయితే కుక్కలు ఆ కవర్ను బయటకు తీసుకురావడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ప్లాస్టిక్ కవర్లో పసిపాపను చూసి కుక్కలు అరుస్తూ.. బాటసారులను అప్రమత్తం చేశాయి. పసిబిడ్డను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. చిన్నారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. విసిరేయడం మూలానా చిన్నారి తలకు బలమైన గాయం అయినట్లు వైద్యులు తెలిపారు. త్వరలోనే నయమవుతుందన్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ దారుణానికి పాల్పడిన మహిళ గురించి ఆరా తీస్తున్నాం. త్వరలోనే ఆమెను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. -
విజయవాడ ఆస్పత్రిలో శిశువు అదృశ్యం
-
‘గీత నీ మంచి మనసుకు సలాం’ ; వీడియో వైరల్
చెన్నై : పాలు అమ్మే వ్యక్తి పిలుపుకు బయటకు వచ్చిన గీతకు చిన్న మూలుగు శబ్దం వినిపించింది. పాపం ఏదో పిల్లి పిల్ల డ్రైనేజీ గుంత దగ్గర చిక్కుపడిందేమో అనుకున్న గీతకు అక్కడ కనపడిన దృశ్యం చూడగానే ఒక్కసారి ఒళ్లు జలదరించింది. కారణం ఆ అరుపులు పిల్లివి కాదు.. ఇంకా పూర్తిగా కళ్లు తెరవని ఓ పసిగుడ్డువి. అంతే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ పసివాణ్ణి బయటకు తీసింది గీత. ఆ చిన్నారికి దెబ్బలు ఏమైనా తగిలాయేమో పరిశీలించింది. అనంతరం ఆ పసివాణ్ణి శుభ్రం చేసి సమీప ఆస్పత్రికి తీసుకెళ్లింది. చెన్నైలోని వలసరవక్కంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘నీ మంచి మససుకు సలాం’ అంటూ నెటిజన్లు గీతను తెగ పొగుడుతున్నారు. ప్రస్తుతం చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ పసివాడు క్షేమంగానే ఉన్నాడని డాక్టర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు. ఈ విషయం గురించి గీతా ‘పాలు అమ్మే వ్యక్తి చెప్పడం వల్ల నేను శబ్దం వస్తోన్న వైపుగా వెళ్లాను. అదృష్టం కొద్ది పసివాడు ఉన్న చోట నీరు లేదు కాబట్టి క్షేమంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత చిన్నారుల సంక్షేమ గృహానికి చేరుస్తాం అని అధికారులు తెలిపారన్నారు గీత. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ సంఘటన చోటు చేసుకుంది కాబట్టి ఈ బాలునికి ‘సుతంథిరమ్’(తమిళ పదం. దానికి అర్ధం స్వేచ్ఛ) అనే పేరు పెట్టినట్లు తెలిపారు గీత. -
మూడో సంతానం ఆడబిడ్డే... హత్య చేసిన తల్లి
థానే: మూడో సంతానం కూడా ఆడ్డపిల్లే పుట్టిందని ఓ తల్లి చేతిగోళ్లతో గొంతు కోసి శిశువును దారుణంగా చంపేసింది. మహారాష్ట్రలోని థానే సమీపంలో గత శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వైశాలి ప్రధాన్ (27) అనే మహిళకి ఇదివరకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూడో సంతానం కూడా ఆడ శిశువు కావడంతో వారంరోజుల వయస్సు గల నవజాత శిశువును గొంతుకోసి హత్య చేసింది. తనకేమి తేలియనట్టు పాపను దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. శిశువు గొంతుపై రక్తపు మరకలు, గాయలు ఉండటంతో వైద్యులు ఆమెను ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకొచ్చింది. తన భర్త తాగుడికి బానిసగా మారడం.. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో వైశాలి తన బిడ్డను చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదివరకే ఇద్దరు బిడ్డలు ఉన్నారని, మూడో బిడ్డ వద్దని అబార్షన్ కోసం అప్పు చేస్తే ఆ డబ్బును తన భర్త తాగుడు కోసం వాడుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వైశాలిని ఆదివారం అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్ల పోలీసులు తెలిపారు. -
శోకాన్ని దిగమింగుకొని భర్త అంత్యక్రియలకు..
న్యూఢిల్లీ : ఓ మహిళా ఆర్మీ అధికారి శోకాన్ని దిగమింగుకొని తన ఐదు రోజుల పసి బిడ్డతో భర్త అంత్యక్రియలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆర్మీ అధికారికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. మేజర్ కుముద్ దోగ్రా భర్త, భారత ఏయిర్ఫోర్స్ అధికారి, వింగ్ కమాండర్ డీవాట్స్ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 15న అస్సాం మజులీ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన మరణించిన రెండు రోజులకే కుముద్ దోగ్రా ఓ పాపకు జన్మనిచ్చింది. గత బుధవారం డీవాట్స్ అంతక్రియలు జరగగా ఆమె తన ఐదు రోజుల పాపతో హజరయ్యారు. కుముద్ దోగ్రాకు సెల్యూట్ అంటూ ట్విటర్లో ఈ ఫొటోను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. దేశం కోసం భారత్ సైన్యం ఎలాంటి త్యాగం చేస్తుందో అనడానికి ఈ ఘటన ఓ నిదర్శనమని ఒకరు, ఆర్మీని విమర్శించే వారంత ఈ ఘటనను చూసి బుద్దితెచ్చుకోవాని ఇంకొకరు ఆమెకు మద్దతుగా పోస్ట్లు చేస్తున్నారు. -
నవజాత శిశువుకు అరుదైన చికిత్స
సాక్షి, హైదరాబాద్ : గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ నవజాత శిశువుకు కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చికిత్స చేశారు. చికిత్స అనంతరం శిశువు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. హృద్రోగ నిపుణుడు డాక్టర్ తపన్ కె.దాస్, డాక్టర్ నాగేశ్వర్ గురువారం ఇక్కడ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చికిత్స వివరాలు వెల్లడించారు. నగరంలోని పాతబస్తీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖదీర్ దంపతులకు ఇటీవల మగశిశువు జన్మించాడు. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతున్న శిశువును స్థానిక వైద్యుల సూచన మేరకు తల్లిదండ్రులు కేర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల్లో శిశువు పుట్టుకతోనే హృద్రోగ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం మూసుకుపోయినట్లు గుర్తించారు. రక్తనాళ మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. మైట్రల్వాల్వ్ పునరుద్ధరణ ద్వారా... సాధారణంగా ప్రతి వందమంది పిల్లల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఇలాంటి సమస్యతో జన్మిస్తుంటారు. తల్లిదండ్రుల అంగీకారంతో 11 రోజుల క్రితం శిశువుకు ఓపెన్హార్ట్ సర్జరీ చేసి, మైట్రల్వాల్వ్ను పునరుద్ధరించారు. సాధారణం గా ఇలాంటి కేసుల్లో ఆవు ద్వారా సేకరించిన రక్తనాళం కానీ మెటల్వాల్వ్ కానీ రీప్లేస్ చేస్తారు. గుండె కండరాలకు అతుక్కుపోయిన రక్తనాళాన్ని కట్ చేసి సరి చేశారు. 2.6 కేజీల బరువుతో జన్మించిన శిశువుకు ఇలాంటి సర్జరీ చేయడం ప్రపంచంలోనే చాలా అరుదని వైద్యులు ప్రకటించారు. ఇలాంటి చికిత్సలకు రూ.ఆరు లక్షల వరకు ఖర్చు అవుతుండగా, శిశువు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వైద్య ఖర్చులో 50శాతం రాయితీ ఇచ్చినట్లు ఆస్పత్రి సీఈవో రియాజ్ తెలిపారు. శిశువుకు భవిష్యత్లో ఎలాంటి సమస్య ఉండదని, మరోసారి సర్జరీ చేయాల్సిన అవసరం కూడా రాబోదని డాక్టర్ తపన్ కె.దాస్ స్పష్టం చేశారు. -
ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్
-
చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువు
హైదరాబాద్: ఎల్బీనగర్ మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఏమాత్రం కనికరం లేకుండా అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో పడేసి వెళ్లారు. చిన్నారి ఏడుపు విని గుర్తించిన కాలనీ వాసి శేఖర్ శిశువును తీసుకెళ్లారు. తనకు పిల్లలు లేనందున పెంచుకుంటానని ఆయన చెబుతున్నారు. ఏం కష్టమొచ్చిందని పురిటిలోని పిల్లవాడిని చెట్ల పొదల్లో పడేశారు అంటూ స్థానికులు తల్లిదండ్రులను దూషిస్తున్నారు. -
చెట్లపొదల్లో ఆడశిశువు
ఎవరో అప్పుడే పుట్టిన శిశువును రోడ్డుపక్కన పడేసి వెళ్లారు. బాటసారులు గమనించి ఆస్పత్రికి చేర్చేలోగానే ఆ పసిగుడ్డు ఈ లోకాన్ని వీడి పోయింది. బాలానగర్లో గురువారం ఉదయం ఈ ఘోరం చోటుచేసుకుంది. బాలానగర్ ఐడీపీఎల్ సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును వదిలేసి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అటుగా వెళ్లిన వారు గమనించి 108కు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని, శిశువును ఆస్పత్రికి చేర్చారు. అయితే, అప్పటికే శిశువు చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. -
పంట కాలువలో శిశువు మృతదేహం
సారంగపూర్ : ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో పంట కాలువలో శిశువు మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమచారం అందించారు. ఎవరు పడేసి ఉంటారని స్థానికులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైద్యం వికటించి బాలింత, శిశువు మృతి
-
వైద్యం వికటించి బాలింత, శిశువు మృతి
జహీరాబాద్(మెదక్): వైద్యం వికటించి బాలింత మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా జహీరాబాద్లో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళతో పాటు అప్పుడే పుట్టిన బాబు మృతిచెందారు. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఆస్పత్రి పై దాడి చేశారు. ఈదాడిలో ఆస్పత్రి ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకున్నారు. -
అమ్మా.. నేను క్షేమం!
కర్నూలు(హాస్పిటల్): నవజాత శిశువు ఆదివారం మధ్యాహ్నం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల వార్డులో కనిపించింది. మధ్యాహ్నం వేళ గుర్తుతెలియని వ్యక్తి వచ్చి వార్డులోని పీఐసీయు వద్ద నేలపై శిశువును పడుకోబెట్టి వెళ్లిపోయారు. పది రోజులు వయస్సుండే ఈ ఆడశిశువు తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతున్నట్లు బక్కచిక్కి కనిపిస్తోంది. తల్లి కోసమే, అనారోగ్యం బాధ తట్టుకోలేకో తెలియదు కానీ గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. ఆసుపత్రి సిబ్బంది ఆ చిన్నారిని వార్డులో చేర్చుకుని చికిత్స చేస్తున్నారు. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీస్స్టేషన్ ఏఎస్ఐ రవికుమార్ అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేదు
ఉన్నతస్థాయి విచారణపై మీనమేషాలు న్యాయం జరగదంటున్న బాధిత కుటుంబం అందుకు కలెక్టర్ ప్రకటనే నిదర్శనం శిశువు మరణంతోనైనా మారని తీరు విజయవాడ : ప్రభుత్వాస్పత్రిలో చీమలు కుట్టి పసివాడి ప్రాణం గాల్లో కలిసిపోయినా పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కేవలం సర్కారు నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పసికందు బంధువులు, విపక్షాలు ఆరోపిస్తూ ఆందోళన చేసినప్పటికీ అధికారులు మొద్దునిద్ర వీడలేదు. విదేశాల్లో ఉన్న వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఉన్నత స్థాయి విచారణ జరిపిస్తామంటూ ప్రగల్భాలు పోతూ ప్రకటనలు చేసినా.. ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. లేక లేక పుట్టిన పండంటి బిడ్డ మృత్యువాత పడగా శోకంలో ఉన్న ఆ కుటుంబంపై పాలకులు కనికరం చూపడం లేదు. ఇంతజరిగినా తప్పు కప్పిపుచ్చుకునేందు కు.. విపక్షాలది అనవసర రాద్ధాంతమంటూ ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేయడాన్ని పలువురు ఖండిస్తున్నారు. మాఫీ చేసే ప్రయత్నం శిశువు మరణంపై ఉన్నత స్థాయి విచారణకు ప్రభుత్వం సుముఖత చూపడం లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. విచారణ జరిపితే లోపాలు బయటపడి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న విమర్శలు వస్తాయనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్తో ప్రాథమికంగా విచారణ జరిపి శిశువుకు వైద్యం బాగానే చేశారని, చీమలే లేవని నిర్ధారించినట్లు చెబుతున్నారు. వాస్తవంగా ప్రభుత్వాస్పత్రిలో ఏదైనా మృతి ఘటన జరిగినప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు వైద్య నిపుణులతో కమిటీ వేసి విచారణ చేస్తారు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా ఎలాంటి విచారణా లేకుండా ఘటనను మాఫీచేసే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే విచారణ కమిటీని నియమించలేదని తెలుస్తోంది. సర్కారు వైఫల్యాన్ని కప్పిపుచ్చేలా.. ప్రసూతి విభాగంలో ఉన్న ప్రత్యేక నవజాత శిశు విభాగాన్ని జిల్లా కలెక్టర్ బాబు.ఎ సందర్శించిన సమయంలో సైతం ఒక్కో ఇంక్యుబేటర్లో ఇద్దరు, ముగ్గురు చిన్నారులను ఉంచారు. అలా ఉంచడం వల్ల ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే పుట్టిన బిడ్డలకు ఇన్ఫెక్షన్ సోకితే ప్రాణాంతకమని అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వార్డును సందర్శించిన కలెక్టర్.. లోపాలను ప్రత్యక్షంగా చూసి కూడా బాగానే వైద్యం జరుగుతోందని మీడియాకి చెప్పారు. అంటే ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చడమేనని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రసూతి విభాగంలోనూ అదే దుస్థితి.. ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాల కల్పన విషయంలో ప్రభుత్వ వైఫల్యంపై విపక్షాలతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు దుమ్మెత్తిపోస్తున్నా వారి తీరులో మాత్రం మార్పు రాలేదు. ప్రతి నిరుపేదకూ మెరుగైన వైద్యం అందిస్తామంటూ ఊదరగొట్టే నాయకులు ఒక్కసారి ప్రసూతి విభాగానికి వెళితే అక్కడి పరిస్థితి అర్థమవుతుంది. సిజేరియన్ అయిన మహిళలు, పురిటినొప్పులతో బాధపడి అప్పుడే ప్రసవమైనవారు ఒకే బెడ్పై ఇద్దరు పడుకుని ఉండడం చూపరులను కలచివేస్తుంది. అక్కడ మంగళవారం కూడా అదే స్థితి నెలకొంది. -
విచారణకు ఆదేశించని.. కామినేని
విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చీమలు కోరికి నవజాత శిశువు మృతి చెందిన ఘటన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఈ ఘటనపై విచారణకు సర్కార్ ముందుకు రాలేదు. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నుంచి ఈ ఘటనపై ఇంకా విచారణకు ఆదేశాలు వెలువడలేదు. కాగా ఈ ఘటనపై విచారణ జరపాలన్న తమ డిమాండ్ను ఏపీ సర్కార్ పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే సదరు శిశువు సహజ మరణంగానే భావిస్తున్నట్లు వైద్యుల అభిప్రాయాన్ని మంత్రి పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అందువల్లే ఈ ఘటనపై విచారణకు ఇంకా ఆదేశాలు రాలేదని తెలిసింది. -
ఆడపిల్ల పుట్టిందని...
పురిటి బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిన తల్లి పోలీసుల చొరవతో తిరిగి తల్లి ఒడి చేరిన చిన్నారి దొడ్డబళ్లాపురం : పురిటి బిడ్డను ఆడపిల్ల అనే కారణంతో ఆస్పత్రిలోనే వదిలిలోనే కన్నతల్లి వదిలివేసిన సంఘటన తాలూకాలో చోటు చేసుకుంది, తాలూకాలోని మేలిన జూగానహళ్లి గ్రామానికి చెందిన పరమేశ్కు గౌరిబిదనూరు తాలూకా చిక్కనహళ్లికి చెందిన గౌరమ్మ కూతురు భాగ్యమ్మతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. గత నెల 31న భాగ్యమ్మ బెంగళూరులోని వాణివిలాస్ ఆస్పత్రిలో చేరింది. అదే రోజు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాప కడుపులో సమస్య ఉందని చిన్న ఆపరేషన్ చేసిన వైద్యులు మరో పది, పదిహేను రోజులు అక్కడే ఉండి చికిత్స తీసుకోమన్నారు. అయితే పాపను డిశ్చార్జి చేసే రోజు ఆస్పత్రికి వచ్చిన భాగ్యమ్మ తన తల్లిమాట విని కన్నపేనుగు ఆస్పత్రిలోనే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆస్పత్రి వారిచ్చిన చిరునామా ఆధారంగా పాప తండ్రి పరమేశ్ను, అతని తల్లి లక్ష్మినరసమ్మను, పాప కన్న తల్లి భాగ్యమ్మను పిలిపించారు. ఆడపిల్లను వద్దనుకున్న భాగ్యమ్మ తొలుత ఆబిడ్డ తమది కాదని పోలీసులతో బుకాయించారు. బిడ్డను తీసికెళ్లడానికి ససేమిరా అన్నారు. అయితే పోలీసులు అతి కష్టం మీద తమదైన శైలిలో మాట్లాడి ఒప్పించి పాపను భాగ్యమ్మకు అప్పగించారు. -
తల్లి గర్భం నుంచి బిడ్డను తీసి ట్రోఫీలాగా పట్టుకొని..
మెక్సికో: సాధారణంగా తల్లి గర్భంలో నుంచి శిశువు బయటకొచ్చే సమయం ఎంతో టెన్షన్గా ఉంటుంది. ఆ బిడ్డ క్షేమంగా బయటి ప్రపంచంలో అడుగుపెట్టడం ఒకెత్తయితే ఆ బిడ్డను అంతే సురక్షితంగా శుభ్రం చేసి తల్లి ఒడిలో పెట్టడం మరో ఎత్తు. ఈ విషయంలో ఎంతో సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ పనిచేయడంలో వైద్యులు మాత్రమే సిద్ధహస్తులు. ఆ సమయంలో వారు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. కానీ, మెక్సికోలో వైద్యులు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారు. అప్పుడే పుట్టిన శిశువును లేబర్ రూంలోనే ఒక ట్రోపీని పట్టుకున్నట్లుగా పట్టుకోవడమే కాకుండా ఆపరేషన్ చేసిన వైద్యుడి భుజంపై కూర్చొబెట్టే ప్రయత్నం చేశారు. అలా చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటో ఇప్పుడు ఆన్ లైన్లో బయటకు రావడంతో పెద్ద వివాదమై కూర్చుంది. ముక్కుపచ్చలారని ఆ పసిగుడ్డును అలా చేసినందుకు తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఆ దేశ ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఆ ముగ్గురు వైద్యులను అరెస్టు చేసేందుకు పోలీసులు కదిలారు. మెక్సికోలోని కాల్పులాల్పాన్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
పసిపాపను పన్నెండుసార్లు పొడిచి పాతిపెట్టినా..
బ్యాంకాక్: కత్తితో పొడిస్తే శారీరక దారుఢ్యం కలవారే ప్రాణాలు కోల్పోతారు. కానీ, థాయిలాండ్లో మాత్రం అప్పుడే పుట్టిన శిశువు మాత్రం బతికి బయటపడింది. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు కత్తిపోట్లకు గురై. మరింత ఆశ్యర్యకర విషయమేంటంటే కత్తిపోట్లతోపాటు ఆ పసిగుడ్డును బతికుండగానే పాతిపెట్టి పోయినా ప్రాణాలతో తిరిగి లోకం చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. థాయిలాండ్లోని ఖాన్ కేన్ అనే ప్రావిన్స్లో పశువులను కాసేందుకు వెళ్లిన మహిళ అక్కడి పొలాల్లో పసిపాప ఏడుపును విన్నది. దగ్గరికి వెళ్లి చూడగా పాప ఒళ్లంతా కత్తితోపొడిచిన గాయాలు. పైగా ఆ గుంటతీసి అందులో పాపను పెట్టి పైన ఆకులు అలమలు కప్పి వెళ్లారు. ఆ పాపను చూసిన ఆమె చేతుల్లోకి తీసుకోవడమే కాకుండా పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆపాపను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పాప ఆరోగ్యం సురక్షితంగా ఉంది. పోలీసులు ఆ పాప తల్లిదండ్రుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పాపకు కత్తి గాయాలు తల్లిదండ్రులు చేశారా? లేక వేరేవరైనా చేసి ఉంటారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చైనాలో మిరాకిల్కే మిరాకిల్
బీజింగ్: చైనాలో అద్బుతం చోటుచేసుకుంది. చనిపోయాడని వైద్యులు నిర్ధారించిన ఓ నెల రోజులు కూడా నిండని బాలుడు తిరిగి బతికి వైద్యులను ఖిన్నులను చేశాడు. అది కూడా గడ్డగట్టే శీతలగదిలో 15 గంటలపాటు ఉండి. ఓ పక్క ఇలాంటి మిరాకిల్ ఎలా సాధ్యమైందబ్బా అని వైద్యులు ఆలోచిస్తుండగా అప్పటికే ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లిన ఆ పసి బాలుడి తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. చైనాలో జిన్ హువా లూ అనే వ్యక్తికి నెలలు నిండకుండా ఓ రెండు నెలలు ముందుగా బాలుడు జన్మించాడు. అయితే, అతడిని 23 రోజులపాటు ఇంక్యూబేటర్లో పెట్టారు. అనంతరం ఇప్పుడు ఆ పసిబిడ్డ పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నాడని వైద్యులు చెప్పడంతో అతడిని ఇంటికి తీసుకెళ్లారు. కానీ, పసిబిడ్డను ఇంటికి తీసుకెళ్లిన రెండు రోజులకే తిరిగి అనారోగ్యంతో కనిపించడంతో అతడిని పరీక్షించిన వైద్యులు బాలుడి గుండె ఆగిపోయినట్లు గుర్తించారు. అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆ బాలుడిని రెండు దుప్పట్లో చుట్టేసి మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ శీతల శవాల గదికి మార్చారు. 15గంటల అనంతరం అతడిని ఖననం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఏర్పాట్లు పూర్తయ్యాయి. అతడిని పూడ్చిపెట్టేందుకు వారు తీసుకురావడానికి దుప్పట్లు విప్పగా అందులో నుంచి కేర్ మని బాలుడు గట్టిగా ఏడ్చాడు. ఈ ఘటన చూసి అక్కడి వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. వైద్యులు చనిపోయాడని నిర్థారించిన కొన్ని గంటల తర్వాత ఆ పసిబాలుడు బ్రతకడం ఒక మిరాకిల్ అయితే, మైనస్ 12 డిగ్రీల సెల్సియస్లో ఆ బాబు 15గంటలపాటు ఉండి బ్రతకడం మిరాకిల్కే మిరాకిల్. -
మనసెలా వచ్చిందమ్మా..!
వెల్గటూరు: కరీంనగర్ జిల్లా ధర్మపురిలోని సరస్వతీమాత ఆలయంలోని బాత్రూంలో గురువారం మూడురోజుల ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. బాత్రూంలో నుంచి శిశువు అరుపులు విన్న చుట్టుపక్కలవారు అక్కడికి వెళ్లి చూడగా శిశువు కనిపిం చింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ సంతోష్ సంఘటనాస్థలానికి వచ్చి శిశువును పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించగా, వారు శిశుగృహకు తరలించారు. చూడగానే ముద్దొస్తున్న శిశువును వదిలించుకోవడానికి ఆ తల్లికి మనసెలా వచ్చిందోనని స్థానికులందరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడశిశువు కావడంతోనే వదిలేశారా.. లేక మరేవైనా కారణాలున్నాయూ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అంబులెన్స్లో పేలుడు: నవజాత శిశువు మృతి
థానే : మహారాష్ట్ర థానేలో విషాదం చోటుచేసుకుంది. మెరుగైన వైద్యం కోసం నవజాత శిశువును తరలిస్తుండగా సీఎన్జీ గ్యాస్ రూపంలో మృత్యువు కాటేసింది. అంబులెన్స్ లోని సీఎన్జీ గ్యాస్ సిలిండర్ పేలి రెండురోజుల పసిగుడ్డు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి...థానే నగరంలో ఓ మహిళ.. శిశువుకి బుధవారం జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో, స్థానిక వేదాంత ఆసుపత్రికి తరలించాలని ఆస్పత్రి వైద్యులు సూచించారు. దీంతో చిన్నారిని అక్కడకు తరలించారు. కానీ వేదాంత వైద్యులు కూడా శిశువు పరిస్థితి విషమంగా ఉన్నందున... ముంబైలోని స్పెషాలిటి కేర్ సెంటర్కి తరలించాలని సూచించారు. గురువారం ఆర్థరాత్రి అంబులెన్స్ను సిద్ధం చేసి అందులో శిశువును తరలిస్తున్నారు. ప్రమాదవశాత్తూ సీఎన్జీ గ్యాస్ సిలిండర్ పేలింది. అంబులెన్స్లోని పేలుడు సంభవించింది. అగ్నికీలలు ఎగసిపెడ్డాయి. ఇంతలో నవజాత శిశువు అగ్నికి ఆహుతి అయింది. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్లోని శిశువు తల్లితో పాటు మరొకరిని రక్షించారు. అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు... శిశువు తల్లితోపాటు మరొకరికి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎన్జీ కిట్లో పేలుడు సంభవించడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
కదులుతున్న బ్యాగు.. లోపల ఓ శిశువు
గోపాలపట్నం (విశాఖపట్నం) : సంతాన భాగ్యం లేక ఎంతో మంది వేదన పడుతుంటే... అప్పుడే పుట్టిన మగ శిశువును బ్యాగులో పెట్టి చెత్తకుప్పల్లో వదిలేసి వెళ్లిపోయారు మనసులేని మనుషులు. విశాఖ నగరంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నర్సింహనగర్లో చెత్తకుప్పల్లో కదులుతున్న బ్యాగు ఆదివారం ఉదయం స్థానికుల కంటపడింది. దాన్ని తెరచి చూడగా అప్పుడే పుట్టిన మగశిశువు కనిపించాడు. దీంతో ఆ చిన్నారిని స్థానికులు అక్కున చేర్చుకున్నారు. మాకు కావాలంటే మాకు కావాలంటూ పలువురు పోటీ పడడం కనిపించింది. కాగా ఈ సమాచారాన్ని కొందరు గోపాలపట్నం పోలీసులకు అందించారు. -
ముళ్ల కంపల్లో పసిపాప
పెద్ద దోర్నాల (ప్రకాశం జిల్లా) : రోజుల వయసున్న ఆడ శిశువును అమానుషంగా కంప చెట్లలో వదిలేసి వెళ్లారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం తిమ్మాపురం గ్రామ శివారులోని వంతనె సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. ముళ్లు గుచ్చుకుని పసిపాప ఏడవడంతో స్థానికులు చూసి పాలు పట్టించి ఎస్ఐ నాగరాజుకు విషయం తెలియజేశారు. ఆయన వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేయించి చిన్నారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. మొత్తానికి స్థానికుల చొరవతో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. -
రోడ్డుపై నవజాత శిశువు
జలుమూరు ( శ్రీకాకుళం) : అప్పుడే పుట్టిన మగ శిశువును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై విడిచి వెళ్లిపోయారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం రాణా జంక్షన్లో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు గుర్తించగా.. శిశువు శరీరంపై గాయాలు ఉండడంతో నర్సన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అప్పడే పుట్టిన శిశువు ... చంపేసిన తల్లి
విజయవాడ: విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ నిండు గర్భిణి ప్రసవానికి బుధవారం ఉదయం ఆసుపత్రికి వచ్చింది. దాంతో సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్పించుకున్నారు. ఇంతో నొప్పులు మొదలు కావడంతో టాయిలెట్ అంటూ బాత్రూమ్కి వెళ్లింది. అక్కడ ఆడ శిశువును ప్రసవించింది. అనంతరం అక్కడి నుంచి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయింది. టాయిలెట్ వద్ద రక్తపు మడుగులో శిశువు మృతదేహం పడి ఉండటంతో సిబ్బంది వెంటనే ఆసుపత్రి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. యువతి కోసం సిబ్బంది ఆసుపత్రి పరిసర ప్రాంతాలలో గాలించిన ఫలితం కనిపించకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో యువతి శిశువును చంపేసి వెళ్లి పోయిందని పోలీసులు భావిస్తున్నారు. యువతి 108 వాహనంలో ఆసుపత్రికి వచ్చిందని సిబ్బంది తెలిపారు. దాంతో ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
బావిలో శిశువు.. స్పందించిన స్థానికులు
అనంతపురం: ఇంకా తెల్లవారలేదు... చిన్నారి శిశువు గుక్కపట్టి ఏడుస్తుంది. మన ఇంట్లో కాదులే అని అనుకున్నారంతా... కానీ ఎంత సేపటికి శిశువు ఏడుపు ఆపడం లేదు. దాంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూశారు. ఎక్కడ ఎవరు కనిపించలేదు. దాంతో ఏడుపు ఎక్కడ నుంచి వస్తుందంటూ పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. బావిలో నుంచి అని గుర్తించిన స్థానికులు. ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. వెంటనే బావిలోకి దిగి గోనె సంచిని వెలికి తీశారు. అందులోని శిశువును బయటకు తీశారు. శిశువు శరీరం మొత్తం రక్తంతో నిండి ఉండటం.. ఇంకా బొడ్డు కూడా తెగకపోవడంతో శిశువును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. -
చెత్తకుప్పలో ఆడ శిశువు
విజయవాడ (కృష్ణా జిల్లా) : రోజుల వయసున్న ఓ ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో వదిలి వెళ్లారు. విజయవాడ బాలాజీ పేటలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. శిశువును ఓ కవర్లో ఉంచి బాలాజీపేటలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న చెత్త కుప్పలో పడేసి వెళ్లారు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచార మిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును.. శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. చిన్నారి తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈ పాపం ఎవరిది ?
నల్గొండ: నల్గొండ జిల్లా చిలుకూరు మండలం కొత్త కొండాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అభంశుభం తెలియని పసికందు మృతదేహన్ని స్థానిక గ్రామ వంతెన వద్ద ఆగంతకులు వదిలి వెళ్లారు. మంగళవారం ఉదయం శిశువు మృతదేహన్ని గుర్తించి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే శిశువు మృతదేహం గుర్తు పట్టేందుకు వీలు లేకుండా ఉండటంతో శిశువు ఎవరనేది తెలియరాలేదు. మృతదేహం పూర్తిగా దెబ్బతినడంతో రెండు రోజుల కిందటే... శిశువు మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
కుమార్తె గొంతు నులిమి చంపిన తల్లి
వికారాబాద్: అప్పుడే పుట్టిన ఆడ శిశువు గొంతును కన్నతల్లి నులిమి చంపేసింది. ఆ దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని ఉందూరు తండాలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది కన్నతల్లి కవితని నిలదీశారు. ఇప్పటికే రెండు సార్లు ఆడపిల్లలు జన్మించారని... మరోసారి కూడా ఆడపిల్ల జన్మించిందని కవిత తెలిపింది. అదికాక కుటుంబంలో కూడా ఒత్తిడి అధికమైన నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు ఆమె ఆసుపత్రి సిబ్బంది వద్ద తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. శనివారం సాయంత్రం ఆడ శిశువు జన్మించిందని ఆ సమయంలో తల్లిబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అయితే రాత్రి శిశువును పరీక్షించగా చనిపోయినట్లు గ్రహించామని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. దాంతో కన్నతల్లి కవితను ఆసుపత్రి సిబ్బంది నిలదీశారు. -
శ్మశానంలో శిశువుని వదిలి వెళ్లిన ఆగంతకులు
-
శ్మశానంలో శిశువుని వదిలి వెళ్లిన ఆగంతకులు
మెదక్ : మెదక్ జిల్లా సిద్ధిపేటలోని కోమటిచెరువులో దారుణం చోటు చేసుకుంది. కోమటిచెరువు పక్కనే ఉన్న శ్మశానవాటికలో అప్పుడు పుట్టిన శిశువును శనివారం తెల్లవారుజామున ఆగంతకులు వదిలి వెళ్లారు. శ్మశానంలో శిశువు ఏడుపు వినిపించడంలో స్థానికలు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం వారు శిశువును చేరదిసి... 108కి సమాచారం అందించారు. 108 వాహనంలో ఆ శిశువును ఆస్పత్రికి తరలించారు. ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. శ్మశానంలో శిశువు దొరికిన విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఈ అంశంపై ఐసీడీఎస్ అధికారులతో చర్చిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి శిశువును శ్మశానంలో వదిలి వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. -
అరుదైన శిశువు జననం
హైదరాబాద్ : ఛాతీపై స్పందిస్తున్న గుండెతో నవజాత శిశువు జన్మించింది. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్లోని చంపాపేటలో చోటుచేసుకుంది. చంపాపేట డివిజన్ సామ నర్సింహారెడ్డి కాలనీకి చెందిన ఓ మహిళ మొదటిసారిగా గర్భం దాల్చింది. స్థానిక కృష్ణసాయి మెటర్నిటీ ఆసుపత్రిలో ఐదవ నెలలో వైద్యులు ఆమెకు టిప్ఫా (గర్భంలో వున్న శిశువు ఎదుగుదల నిర్ధారణ కోసం చేసే పరీక్ష) పరీక్ష చేయగా కవలలు ఉన్నట్లు తేలింది. అందులో ఒక బేబి పూర్తి స్థాయిలో ఆరోగ్యంతో ఉండగా రెండవ బేబి శరీరం పైభాగంలో వేలాడుతున్న గుండె, గ్రహణం మొర్రితో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించి, గర్భంలో ఆ శిశువు ఎదుగుదల వల్ల మొదటి బేబీకి, తల్లి ప్రాణానికి కూడా ప్రాణాపాయం ఉండవచ్చనే విషయాన్ని గర్భిణికి తెలిపారు. గర్భస్రావం చేయించుకోవడం ఇష్టం లేక ఆమె నవమాసాలు మోసేందుకే నిర్ణరుుంచుకుంది. తొమ్మిది నెలలు నిండడంతో ఈ నెల 6న ఆసుపత్రిలో చేరింది. ఆదివారం రాత్రి ఆసుపత్రి గైనకాలజిస్టు మందడి అపర్ణ, సివిల్ సర్జన్ దుర్గాప్రసాద్ నేతృత్వంలో ఆమెకు శస్త్రచికిత్స చేసి కవల బాబులను బయటికి తీశారు. అందులో ఒక బాబు 2.9 కిలోల బరువుతో ఆరోగ్యంగా వుండగా రెండవ బాబు 2.1 కేజీతో ఆరోగ్యంగా వున్నప్పటికీ శరీరం బయట వేలాడుతున్న గుండె, గ్రహణం మొర్రితో జన్మించడంతో వెంటనే ఆ పసికందును వైద్యుల సలహా మేరకు నీలోఫర్కు తరలించారు. ప్రస్తుతం తల్లి, మొదటి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి అరుదైన జననం 20 లక్షల మందిలో ఒకరికి మాత్రమే సంభవిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. -
మొదటికాన్పు... బిడ్డకు పాలుపట్టడం ఎలా?
నా వయసు 22. నాకిది మొదటికాన్పు. నెల రోజుల తర్వాత ప్రవసం కానుంది. నవజాత శిశువునకు తల్లిపాలు పట్టడం ఎప్పుడు మొదలుపెట్టాలి? ఎంతకాలం తాగించాలి? అవి సమృద్ధిగా రాకపోతే బయటిపాలలో ఏవి మంచివి? నాకు మంచి సలహా ఇవ్వగలరు. - విమల, వనస్థలిపురం ప్రసవసమయంలో తల్లితోపాటు శిశువు కూడా శ్రమకు గురవుతాడన్న విషయం గుర్తుంచుకోవాలి. జన్మించిన పిదప సేదదీరడం కోసం మూడు నాలుగు గంటలపాటు శిశువుకు విశ్రాంతినివ్వాలి. ఏమీ తాగించనవసరం లేదు. అనంతరం శిశువు ఆరోగ్యం బాగుందని నిర్ధారణ చేసిన పిదప తల్లిపాలు ఇవ్వడానికి ప్రయత్నించాలి. అలా పాలు తాగగలగడం శిశువునకు సంక్రమించే సహజసిద్ధమైన ప్రక్రియ. తల్లి సంతోషంతో శిశువును చూడటం, తాకడం, స్తనాన్ని నోటికి అందించడం ‘స్తన్యం’ స్రవించడం సఫలమవుతుంది. తనకెంత కావాలో శిశువుకి తెలుసు. అనంతరం తల్లి ప్రయత్నించినా తాగడు. అది గుర్తించి బలవంతంగా తాగించవద్దు. శిశువు ఏడవడానికి చాలా కారణాలుంటాయి. అందులో ‘ఆకలి’ కూడా ఒకటి. ముర్రుపాలు (కొలొస్ట్రమ్) శిశువుకు చాలా మంచిది. బలకరం. విరేచనం సాఫీగా అయ్యేట్టు చేస్తాయి. బిడ్డకు ఒక సంవత్సరం వయసు వచ్చేవరకు స్తన్యం తాగించాలి. ఆరవనెలలో ఫలప్రాశన, పదవ నెలలో అన్నప్రాశన తప్పనిసరి. ఇతర పోషకవిలువలు బిడ్డకందించడానికి ఇది చాలా అవసరం. సరియైన ఫలాలు లభించకపోతే ఆరవనెలలోనే అన్నప్రాశన చేయాల్యల్సి ఉంటుంది. ఇది సుశ్రుతాచార్యులు చెప్పిన విషయం. శిశువులో రోగనిరోధక శక్తి పరిపుష్టమవడానికి, శారీరక, మానసిక వికాసానికి, ఆయుఃవృద్ధికి, సంపూర్ణ ఆరోగ్యానికి స్తన్యపానం అత్యంతావశ్యకమని ఆయుర్వేద గ్రంథాలన్నీ నొక్కివక్కాణించాయి. దీనినే ‘ఓజోవర్థనం’ అంటారు. తల్లిపాలు తక్కువయిన పక్షంలో ‘ఆవుపాలు, మేకపాలు’ శ్రేష్ఠమని ఆయుర్వేదోక్తం. వీటిలో నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. ఒక చిటికెడు పసుపువేసి మరిగించి, చల్లార్చి, చక్కెర కలిపి తాగించవచ్చు. శతావరీ చూర్ణం (5 గ్రాములు), పాలతో కలిపి, రెండుపూటలా తల్లి సేవిస్తే, తల్లికి సమృద్ధిగా స్తన్యం ఉత్పత్తి అవుతుంది. తల్లికి జ్వరం గాని, రొమ్ముపై స్థానికంగా రోగాలుగాని ఉన్నప్పుడు తాత్కాలికంగా బిడ్డకు స్తన్యపానాన్ని ఆపాల్సి ఉంటుంది. ఒక నెల వయసు దాటిన అనంతరం బిడ్డకు ఒకటి లేదా రెండు చుక్కల గాడిదపాలు తాగిస్తే చాలా జబ్బులను నివారించే రోగనిరోధకశక్తి కలుగుతుందని శాస్త్రోక్తం. ప్యాకెట్ పాలుగాని, డబ్బాపాలు గాని తెచ్చుకోవడం అనివార్యమైతే అవి ‘కల్తీ’ లేనివని నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. ‘నువ్వులు, బెల్లం, వెల్లుల్లి, తాజాఫలాలు, పాలు’ సేవిస్తే తల్లికి స్తన్యోత్పత్తి పుష్కలంగా జరుగుతుంది. ముడిబియ్యంతో వండిన అన్నం మంచిది. సాత్వికాలోచన, సంతోషం స్తనకరం. శోకం, దుఃఖం, చింత, అసూయ వంటి ప్రతికూల ఉద్వేగాలు స్తన్యనాశనకరం.