North Carolina
-
నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు
అమెరికా(USA)లో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా నార్త్ కరోలినా రాష్ట్రం(North Carolina ) లోని కారీలో సాయి మందిరంతో పాటు షార్లెట్లోని శ్రీ సాయి గురుదేవ్ దత్త మందిరంలో రంగోలీ పోటీలు జనవరి 19 ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నాట్స్ కాన్సస్ విభాగం ఈ రంగోలి పోటీలను నిర్వహించింది. నార్త్ కరోలినా లోని తెలుగు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈ రంగోలి పోటీల్లో పాల్గొన్నారు. తమ సృజనాత్మకతను ప్రదర్శించి.. తెలుగు సంప్రదాయలను ప్రతిబింబించే ఎన్నో ముగ్గులు వేశారు. ఈ ముగ్గుల పోటీల్లో అత్యుత్తమంగా ఉన్న నాలుగింటిని ఎంపిక చేసి.. వాటిని వేసిన మహిళలకు నాట్స్ బహుమతులు పంపిణి చేసింది. నాట్స్ కాన్సస్ మహిళా నాయకత్వం ఈ రంగోలి పోటీలను దిగ్విజయంగా నిర్వహించింది. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నాట్స్ అభినందించింది. రంగోలి పోటీలను చక్కగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: డల్లాస్లో "శ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఫౌండేషన్" తరుపున రక్తదానం విజయవంతం) -
USA Presidential Elections 2024: వైట్హౌస్కు దారేది?..7 స్వింగ్ స్టేట్లే కీలకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే. వీటిని సేఫ్ స్టేట్స్గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. కనుక ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంటుంది. వాటిని స్వింగ్ స్టేట్స్గా పిలుస్తుంటారు. ఈసారి అలాంటి రాష్ట్రాలు ఏడున్నాయి. అవే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా. 93 ఎలక్టోరల్ ఓట్లు వీటి సొంతం. వాటిలో మెజారిటీ ఓట్లను ఒడిసిపట్టే వారే అధ్యక్ష పీఠమెక్కుతారు. ట్రంప్కు 51, హారిస్కు 44 అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. విజయా నికి కనీసం 270 ఓట్లు రావాలి. 48 రాష్ట్రాల్లో మెజారిటీ ఓ ట్లు సాధించిన అభ్యర్థి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మొ త్తం ఎలక్టోరల్ ఓట్లు దఖలు పడే (విన్నర్ టేక్స్ ఆల్) విధా నం అమల్లో ఉంది. ఆ లెక్కన సేఫ్ స్టేట్లన్నీ ఈసారి ఆయా పార్టీల ఖాతాలోనే పడే పక్షంలో హారిస్ 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. స్వింగ్ స్టేట్లలో ని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారడానికి కారణమిదే. ట్రంప్ గెలవాలంటే వాటిలో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్కు మాత్రం 44 ఓట్లు చాలు. గత కొద్ది ఎన్నికలుగా ఈ ఏడు స్వింగ్ స్టేట్ల ఓటింగ్ ధోరణి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాటిలో ఈసారి ఫలితాలు ఎలా ఉండవచ్చన్న దానిపై జోరుగా అంచనాలు, విశ్లేషణలు సాగుతున్నాయి.పెన్సిల్వేనియా కీలకం 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జనాభా వైవిధ్యం విషయంలో కూడా ఆ రాష్ట్రం అచ్చం అమెరికాకు నకలులా ఉంటుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం సాగే పెద్ద నగరాలు, రిపబ్లికన్ కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాలు పెన్సిల్వేనియా సొంతం. దాంతో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ నెలకొంది.రస్ట్ బెల్ట్–సన్ బెల్ట్ అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలను రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ మూడింట్లో కలిపి 44 ఓట్లున్నాయి. మిగతా దేశంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలను సన్ బెల్ట్ రాష్ట్రాలంటారు. వీటిలో మొత్తం 49 ఓట్లున్నాయి. → రస్ట్ బెల్ట్ నిర్మాణ రంగానికి నిలయం. దాంతో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటర్లపై కారి్మక సంఘాల ప్రభావం ఎక్కువే. → ఈ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగుతూ వస్తోంది. ఎంతగా అంటే, గత ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు ఈ మూడు రాష్ట్రాలూ ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్క 2016లో మాత్రం వాటిలో పూర్తిగా ట్రంప్ హవా నడిచింది. → ఈసారి కూడా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగితే 44 ఓట్లూ కమల ఖాతాలోనే పడతాయి. అదే జరిగితే తొలి మహిళా ప్రెసిడెంట్గా ఆమె చరిత్ర సృష్టిస్తారు. → అలాగాక 2016లో మాదిరిగా ట్రంప్ మరోసారి ఈ మూ డు రాష్ట్రాలనూ నెగ్గినా విజయానికి ఏడు ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడాయన విజయం కోసం కనీసం మరో స్వింగ్ స్టేట్ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. → ఒకవేళ హారిస్ రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా ఆమె గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. → హారిస్ రస్ట్ బెల్ట్లో సున్నా చుట్టినా నాలుగు సన్ బెల్ట్ రాష్ట్రాలను స్వీప్ చేస్తే విజయం ఆమెదే. → అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే 1948 తర్వాత డెమొక్రాట్లు సన్ బెల్ట్ను క్లీన్స్వీప్ చేయలేదు. → రిపబ్లికన్లకు మాత్రం సన్ బెల్ట్ను పలుమార్లు క్లీన్స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలా జరిగినా ట్రంప్ విజయానికి అది చాలదు. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ఆయన చేజిక్కించుకోవాలి. లేదంటే 269 ఓట్లకు పరిమితమై ఓటమి పాలవుతారు.రస్ట్ బెల్ట్లో విజయావకాశాలు → రస్ట్ బెల్ట్లో హారిస్ గెలవాలంటే పట్టణ ఓటర్లు భారీగా ఓటేయాల్సి ఉంటుంది. నల్లజాతీయులు, మైనారిటీలు, విద్యాధికులు, మధ్య తరగతి ఓట్లు, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూత్లకు తరలడం తప్పనిసరి. → అలాగాక గ్రామీణ ఓటర్లు భారీగా ఓటేస్తే 2016లో మాదిరిగా మరోసారి రస్ట్ బెల్ట్ ట్రంప్దే అవుతుంది. → ఈసారి గ్రామీణులతో పాటు యువ ఓటర్లు కూడా తనకే జైకొడతారని ఆయన ధీమాగా ఉన్నారు. సన్ బెల్ట్లో విజయావకాశాలు → ఇక్కడ విజయావకాశాలను అమితంగా ప్రభావితం చేసేది నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ ఓటర్లే. → జార్జియా, నార్త్ కరోలినాల్లో నల్లజాతి ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అరిజోనా, నెవడాల్లో లాటిన్ అమెరికన్ జనాభా నానాటికీ పెరుగుతోంది. → హారిస్ జమైకన్ మూలాల దృష్ట్యా నల్లజాతీయులు ఆమెవైపే మొగ్గుతారని భావిస్తున్నారు. ఇక ట్రంప్ ర్యాలీలో ప్యూర్టోరీకన్లు, లాటిన్ అమెరికన్లపై వెలువడ్డ వ్యంగ్య వ్యాఖ్యలపై ఆగ్రహంతో వారు కూడా హారిస్కే ఓటేస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సహాయక చర్యలపై తప్పుడు ప్రచారం: కమలా హారిస్
వాషింగ్టన్: మిల్టన్, హెలెన్ హరికేన్ల సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ట్రంప్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమలా హారిస్ మండిపడ్డారు. నార్త్ కరోలినాలో వారం రోజుల పర్యటనలో భాగంగా రెండోరోజైన ఆదివారం ఆమె.. పలు చర్చిలకు వెళ్లి నల్లజాతీయులను కలిశారు. కోయినోనియా క్రిస్టియన్ సెంటర్లో ఆమె మాట్లాడుతూ.. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు సహాయం చేస్తున్న వారు నిజమైన హీరోలని కొనియాడారు. కానీ ఒక కీలక వ్యక్తి సహాయం చేయకపోగా, సొంత ప్రయోజనాలకోసం తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేస్తున్నారని ట్రంప్ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలో రాజకీయ నాయకులు చేయాల్సింది అది కాదని హితవు పలికారు. హెలెన్ తుఫాను అనంతరం ఫ్లోరిడాలో పర్యటించిన ట్రంప్.. రిపబ్లికన్ల సహాయాన్ని ప్రభుత్వం కావాలనే నిలిపేస్తోందని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్న వలసదారుల కోసం ఖర్చు చేయడంతో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీకి ఇవ్వడానికి నిధులు లేకుండా పోయాయయని విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలపై హారిస్ పైవిధంగా స్పందించారు. కమలా హారిస్ ప్రసంగానికి ముందు బైడెన్ గల్ఫ్ తీరంలోని టంపా, సెయింట్ పీట్ బీచ్ మధ్య హెలికాప్టర్లో హరికేన్ నష్టాన్ని సర్వే చేశారు. మిల్టన్ ఊహించినంత నష్టం చేయలేదని, చాలామంది సర్వం కోల్పోయారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విపత్తు సమయంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఫస్ట్ రెస్పాండర్లను బైడెన్ ప్రశంసించారు. ఇలాంటి సమయాల్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లుగా కాకుండా అమెరికన్లుగా పరస్పరం సహాయం చేసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులకోసం నిధులను మంజూరు చేశారు. పోలింగ్కు ఇంకా మూడు వారాల సమయమే ఉన్న నేపథ్యంలో వరుస తుఫానులు ఎన్నికలకు మరో కోణాన్ని జోడించాయి. -
రూ. మూడు కోట్ల ఇల్లు.. 11 సెకెన్లలో కొట్టుకుపోయిందిలా..
అతని కలల ఇల్లు సముద్ర కెరటాలకు కొట్టుకుపోయింది. అవును.. ఇది నిజం. ఈ ఉదంతం అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటుచేసుకుంది. ఇక్కడి సముద్రతీరంలో నిర్మించిన విలాసవంతమైన, అందమైన ఇల్లు బలమైన అలల తాకిడికి కొట్టుకుపోయింది.ఆగస్టు 16న వచ్చిన ఎర్నెస్టో హరికేన్ ఈ రూ. మూడు కోట్ల విలువైన ఈ ఇంటిని కేవలం 11 సెకెన్లలో ధ్వంసం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో తుఫానుకు ఎగసిపడుతున్న సముద్రపు అలలు ఆ ఇంటిని సముద్రంలోనికి లాక్కెళ్లిపోవడాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈ అందమైన ఇల్లు 1973లో నిర్మితమయ్యింది. ఇంతకాలం ధృడంగా నిలిచిన ఈ ఇల్లు శక్తివంతమైన అలలకు కొట్టుకుపోయింది.ఈ వీడియోను ఆగస్టు 18న @CollinRugg హ్యాండిల్తో మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో పోస్ట్ చేశారు. క్యాప్షన్లో.. నార్త్ కరోలినా సముద్రపు ఒడ్డున నిర్మించిన ఈ సముద్రతీర ఇల్లు అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. అట్లాంటిక్లో ఎర్నెస్టో హరికేన్ కారణంగా ఈ సంఘటన జరిగింది. ఇంటి యజమాని ఈ నాలుగు బెడ్రూమ్లు, రెండు బాత్రూమ్ ఇంటిని 2018లో సుమారు రూ. 3 కోట్లు ($339,000) వెచ్చించి కొనుగోలు చేశారు’ అని రాశారు.ఈ పోస్ట్కు లక్షలాది వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. వందలాది మంది యూజర్స్ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్..‘అలాంటి స్థలంలో ఇల్లు కట్టుకోవడం ఒక మూర్ఖపు నిర్ణయం’ అని రాశారు. మరొక యూజర్ ‘నార్త్ కరోలినా సముద్రంలో తుఫానులు సర్వసాధారణం. ఈ ఇంటిని కొనుగోలు చేసిన వారు ఈ విషయాన్ని ముందుగా తెలుసుకొని ఉండాల్సింది’ అని రాశారు. JUST IN: Beachfront home falls into the Atlantic Ocean on North Carolina’s Outer Banks. The incident was thanks to Hurricane Ernesto which is off the coast in the Atlantic. The unfortunate owners purchased the 4 bed, 2 bath home in 2018 for $339,000. The home was built in… pic.twitter.com/MvkQuXz5SG— Collin Rugg (@CollinRugg) August 17, 2024 -
భారత సంతతి వ్యాపారి కాల్చివేత
వాషింగ్టన్: దోపిడీకి యత్నించిన దుండగుడు భారతసంతతికి చెందిన దుకాణదారును కాల్చిచంపాడు. ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం రొవాన్ కౌంటీలో చోటుచేసుకుంది. మైనాంక్ పటేల్(36) టొబాకో హౌస్ స్టోర్ పేరుతో దుకాణం నడుపుతున్నారు. మంగళవారం ఉదయం షాట్గన్తో దుకాణంలోకి ప్రవేశించిన శ్వేతజాతీయుడైన బాలుడు మైనాంక్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ∙బాలుడిని కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. -
అమెరికాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్య
అమెరికాలో భారత సంతతి వ్యక్తి మైనాంక్ పటేల్(36) ఓ మైనర్ జరిపిన కాల్పుల్లో హత్య చేయబడ్డారు. నార్త్ కరోలినాలోని తన కన్వీనియన్స్ స్టోర్లో దోపిడీకి వచ్చిన మైనర్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. 2580 ఎయిర్పోర్ట్ రోడ్లోని టొబాకో హౌస్ యజమాని అయన మైనాంక్ పటేల్పై మంగళవారం ఉదయం ఈ కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. కాల్పులు జరిపిన మైనర్ను రోవాన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులు అదుపులోకి తీసుకొని జువైనల్ హోంకు తరలించారు. ‘‘టొబాకో హౌస్ స్టోర్ నుంచి వచ్చిన ఫోన్కాల్కు స్పందించాం. స్టోర్లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న తర్వాత పటేల్ బుల్లెట్ గాయాలతో పడి ఉన్నాడు. దీంతో అతన్ని నోవాంట్ హెల్త్ రోవాన్ మెడికల్ సెంటర్కు తరలించారు. అతని పరిస్థితి విషమించటంతో షార్లెట్లోని ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించి చిక్సిత అందించినప్పటికీ చాలా తీవ్రమైన గాయాల వల్ల మృతి చెందాడు’’ అని రోవాన్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కెప్టెన్ మార్క్ మెక్డానియల్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి సంఘటన స్థలం నుంచి పారిపోతున్నట్లు వెల్లడైందని తెలిపారు. అతను తుపాకీని పట్టుకుని కనిపించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కాల్పులకు ఖచ్చితమైన కారణం స్పష్టం కాలేదని, దోపిడీ వచ్చిన మైనర్.. కాల్పులు జరిపినట్లు ప్రథమికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు చెప్పారు. మృతి చెందిన మైనాంక్ పటేల్కు భార్య అమీ, 5 ఏళ్ల కుమార్తెను ఉన్నారు. ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి. ఆయన మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అందరితో కలివిడిగా ఉండే ఆయన మృతికి బుధవారం పటేల్ షాప్ ముందు పలువురు పూలు, కార్డులు పెట్టి నివాళులు అర్పించారు. -
షార్లెట్లో వైఎస్సార్సీపీ సిద్ధం!
నార్త్ కరోలినా షార్లెట్లో నిర్వహించిన సిద్ధం సభ విజయవంతమైంది. కారుమూరు శివారెడ్డి నాయకత్వములో దుష్యంత్ ఎల్లపల్లి, సతీష్ కర్నాటి, సంజీవ రెడ్డి, సబ్బసాని, సతీష్ వద్దిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఏపీ సీఎం జగన్ కోసం తాము కూడా సిద్ధం అని అమెరికాలోని ప్రవాసులు ప్రకటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడ్డ తండ్రికి తగ్గ తనయుడుగా నేను విన్నాను నేను ఉన్నాను అని, కరోనా కష్టాలను కూడా అధికమించి ప్రజలకు ఎంతో మేలు చేసిన మన ప్రియతమా ముఖ్య మంత్రి వైఎస్ జగన్ని మళ్లీ గెలిపించు కోవడానికి మేము సిద్ధం అని అందరు నినదించారు. మహిళలు సైతం మేం సిద్ధం అంటూ మద్దతుగా కేరింతలు కొడుతూ.. సందడి చేశారు. జై జగన్ జై జగన్ అంటూ నినదించటంతో ఆడిటోరింలో సందడివాతావరణం నెలకొంది. వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. (చదవండి: చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వరన్పై మొత్తం 35 కేసులు) -
ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాం... యాత్ర 2 పబ్లిక్ టాక్
-
ఉత్తర కరోలినాలో శక్తి అవార్డ్స్ 2023
-
అమెరికాలో మరోసారి కాల్పులు
రాలీ: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. నార్త్ కరోలినా స్టేట్ ఛాపెల్ హిల్లోని యూనివర్సిటీ University Of North Carolina సైన్స్ భవనంలో తుపాకీతో వచ్చిన ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ఓ సిబ్బంది(ఫ్యాకల్టీ) మృతి చెందినట్లు తెలుస్తోంది. సోమవారం క్యాంపస్లో లాక్డౌన్ ఎత్తేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఆ వెంటనే ఈ కాల్పలు ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనలో మరెవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. ఎమర్జెన్సీ నెంబర్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడు గంటల తర్వాత అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడింది అతనేనా? అని ధృవీకరణ రావాల్సి ఉండగా.. దుండగుడు కాల్పులకు తెగబడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. గన్ కల్చర్కు సంబంధించిన ఈ ఘటనపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Law enforcement have Arrested the Suspect in University of North Carolina Shooting#ChapelHill #UNCShooting#UNC #NorthCarolina #shooting #breaking #chapelhill #Carolina #University #USA #Shotting #Firing pic.twitter.com/Nte6OxelM6 — Chaudhary Parvez (@ChaudharyParvez) August 29, 2023 -
విరిగిన రోలర్ కోస్టర్ పిల్లర్.. తప్పిన పెను ప్రమాదం
నార్త్ కరోలినా: అత్యంత ఎత్తులో నిర్మితమైన ఓ రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతున్న సమయంలో వీడియో తీశాడు ఓ సందర్శకుడు. వీడియోలో ఒక సన్నివేశం చూసి గగుర్పాటుకు గురై వెంటనే నిర్వాహకులను అప్రమత్తం చేశాడు. ఈ రోలర్ కోస్టర్ తాలూకా బ్రిడ్జి పిల్లర్ ఒకదానికి బీట రావడంతో రైడ్ సమయంలో పక్కకు కదులుతూ ప్రమాదకరంగా కనిపించింది. అలాగే నిర్లక్ష్యంగా దీనిని నిర్వహించి ఉంటే ఎంతటి దారుణం జరిగేదోనని అంటున్నారు నెటిజన్లు. ఫ్యూరీ 325 పేరుతో నడిచే రోలర్ కోస్టర్ కు స్థానికంగా విశేషమైన ప్రజాదరణ ఉంది. ఈ రైడ్ ను జీవితంలో ఒక్కసారి అయినా ఆస్వాదించాలని ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే దీని నిర్వహకులు దీనిలోని ఒక పిల్లర్ కు బీట వచ్చిన విషయాన్ని గమనించలేదు. రోలర్ కోస్టర్ స్థితిగతులను పట్టించుకోకుండా యధావిధిగా నిర్వహిస్తూ కాసులు గడించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడికి విచ్చేసిన ఓ సందర్శకుడు తన మొబైల్ లో రోలర్ కోస్టర్ రైడ్ ను బంధించాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో అతను ఓ ప్రమాదాన్ని పసిగట్టాడు. ఆయన తీసిన వీడియోని నిశితంగా గమనించగా దీని పిల్లర్లలో ఒక పిల్లర్ కు పెద్ద బీటే వచ్చినట్లు కనిపించింది. వీడియోలో బీట వచ్చిన పిల్లర్ గుండా రోలర్ కోస్టర్ వెళ్ళినప్పుడు పిల్లర్ కదులుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో ప్రస్తుతానికైతే ఈ రోలర్ కోస్టర్ రైడ్ ను నిలిపివేశారు. మరమ్మత్తులు పూర్తయిన తర్వాతే దీన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ వీడియోని ఆ సందర్శకుడు ట్విట్టర్లో పొందుపరిచాడు. రోలర్ కోస్టర్ ఏ మాత్రం పట్టుతప్పినా అందులో ఉన్నవారి ప్రాణాల సంగతేమి కాను. గాలిలోని ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. సందర్శకుడు ఈ అమ్యూజ్మెంటు సంస్థ మేనేజ్మెంటును అప్రమత్తం చేసి పెను విపత్తునే తప్పించాడని నెటిజన్లు అతడిని అభినందిస్తున్నారు. A visitor at a North Carolina amusement park spotted a large crack on a roller coaster's pillar on Friday. The ride, which was billed as one of the tallest of its kind, has now been closed as crews make repairs. https://t.co/9xqRRgXyWl pic.twitter.com/HTHculBdl9 — The New York Times (@nytimes) July 2, 2023 ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే.. -
US: యూనివర్సిటీల్లో ఆ రిజర్వేషన్లపై నిషేధం
వాషింగ్టన్ డీసీ: అమెరికా సుప్రీం కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. యూనివర్సిటీల అడ్మిషన్లలో జాతి సంబంధిత రిజర్వేషన్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఆఫ్రో-అమెరికన్లు, ఇతర మైనారిటీలకు విద్యావకాశాలను పెంపొందించే ఉద్దేశంతో యూనివర్సిటీ అడ్మిషన్లను అమలు చేస్తున్నారు. 1960 సంవత్సరం నుంచి ఇవి అమలు అవుతున్నాయి. ఈ మేరకు అడ్మిషన్ విధానాల్లో జాతి, తెగ పదాలను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే.. ఇకపై ఆ పదాలను ఉపయోగించడానికి వీల్లేదని.. ఆ పదాలను నిషేధిస్తూ అమెరికా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 👨⚖️ ఈ మేరకు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆ సంచలన తీర్పు చదువుతూ.. ఒక స్టూడెంట్ను అతని అనుభవాల ఆధారంగా పరిగణించబడాలిగానీ జాతి ఆధారంగా కాదు. యూనివర్సిటీలలో ఇకపై జాతి సంబంధిత అడ్మిషన్లు కొనసాగడానికి వీల్లేదు అంటూ తీర్పు కాపీని చదివి వినిపించారాయన. 👉 అమెరికాలో అత్యంత పురాతనమైన ఉన్నత విద్యాసంస్థలు హార్వర్డ్ యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా (UNC)ల్లో అడ్మిషన్ల విధానంలో పారదర్శకత కోరుతూ ఓ విద్యార్థి సంఘం వేసిన పిటిషన్ ఆధారంగా అమెరికా సుప్రీం కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 👉 ఒకప్పుడు అఫ్రో-అమెరికన్ల పట్ల విపరీతమైన జాతి వివక్ష కొనసాగేది. ఈ క్రమంలోనే అమెరికా ఉన్నత విద్యాసంస్థల్లో వాళ్లకు అవకాశాలు దక్కేవి కావు. 👉 అయితే.. 1960లో జరిగిన పౌర హక్కుల ఉద్యమం ఆధారంగా యూనివర్సిటీలలో నల్ల జాతి పౌరులకు,ఇతర మైనారీటీలకు విద్యావకాశాలు అందజేసే ఉద్దేశంతో పలు నూతన విధానాలు తీసుకొచ్చారు. 👉 అయితే.. జాతి సంబంధిత అడ్మిషన్ విధానాల వల్ల సమానత్వానికి తావు లేకుండా పోయిందని, పైగా మెరుగైన అర్హత కలిగిన ఆసియా అమెరికన్లకు అవకాశాలు దూరం అవుతున్నాయని సదరు గ్రూప్ సుప్రీం ముందు వాదించింది. 👉 నల్లజాతి అమెరికన్లకు చోటు కల్పించేందుకు ఆసియన్ల పట్ల వివక్ష చూపుతున్నారన్నది ప్రధాన అభ్యంతరం చాలా కాలంగా కొనసాగుతోందక్కడ. 👨⚖️ తాజాగా.. సుప్రీం కోర్టు ధర్మాసనంలోని 6-3 న్యాయమూర్తుల మెజార్టీ సదరు రెండు యూనివర్సిటీలలో జాతి సంబంధిత అడ్మిషన్లు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. ట్రంప్ తప్పా అంతా ఆగ్రహం యూనివర్శిటీ అడ్మిషన్లలో రిజర్వేషన్లపై నిషేధం తీర్పుపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తీర్పుతో తాను విబేధిస్తున్నట్లు తెలిపారాయన. అమెరికాలో వివక్ష ఇంకా మనుగడలోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారాయన. జాతుల పరంగా వైవిధ్యం ఉన్నప్పుడే అమెరికా విద్యాసంస్థలు బలోపేతంగా ఉంటాయని తాను భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పు తుది నిర్ణయం కాదంటూ ప్రధానంగా ప్రస్తావించారాయన. The odds have been stacked against working people for too long – we cannot let today's Supreme Court decision effectively ending affirmative action in higher education take us backwards. We can and must do better. pic.twitter.com/Myy3D5jUGH — President Biden (@POTUS) June 30, 2023 సుప్రీం తీర్పు.. భవిష్యత్తు తరాలకు అవకాశాలను నిరాకరించడమే అవుతుందని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ అభిప్రాయపడ్డారు. తీర్పును వర్ణాంధత్వం అంటూ అభివర్ణించిన ఆమె.. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లడమే అంటూ తీవ్రంగా వ్యతిరేకించారామె. Today’s Supreme Court decision in Students for Fair Admissions v. Harvard and Students for Fair Admissions v. University of North Carolina is a step backward for our nation. Read my full statement. pic.twitter.com/pIBCmVMr6d — Vice President Kamala Harris (@VP) June 29, 2023 రిజర్వేషన్లపై నిషేధం విధిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మండిపడ్డారు. అందరికీ అవకాశాల పేరిటే ఈ విధానాలు తెరపైకి వచ్చాయని.. తద్వారానే తాను, తన భార్య మిచెల్లీ లాంటి వాళ్లం వృద్ధిలోకి వచ్చామని అంటున్నారాయన. ఆ విధానాలు తెచ్చిన ఉద్దేశ్యాన్ని న్యాయవ్యవస్థ గుర్తించి ఉంటే బాగుండేదని అంటున్నారాయన. Affirmative action was never a complete answer in the drive towards a more just society. But for generations of students who had been systematically excluded from most of America’s key institutions—it gave us the chance to show we more than deserved a seat at the table. In the… https://t.co/Kr0ODATEq3 — Barack Obama (@BarackObama) June 29, 2023 ట్రంప్ మాత్రం ఇలా.. ఇది గొప్ప శుభదినం అంటూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన.. సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ సైతం ఉంచారు. అమెరికాకు ఇది గొప్ప రోజు. ఇది ప్రతి ఒక్కరూ ఎదురుచూసిన.. ఆశించిన తీర్పు. దీని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాలతో మనల్ని పోటీగా ఉంచుతుంది అంటూ ట్రూత్సోషల్లో పోస్ట్ చేశారాయన. -
శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా
వాషింగ్టన్: తన ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా రాజకీయ ప్రత్యర్థులు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్(76) ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని అన్నారు. అమెరికా అధ్యక్ష పోరు నుంచి తనను తప్పించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని విమర్శించారు. తాజాగా ఉత్తర కరోలినా, జార్జియాలో రిపబ్లికన్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో తాను నెగ్గకుండా ఉండేందుకే విచారణ చేపట్టారని చెప్పారు. ఎవరు ఎన్ని రకాలుగా వేధింపులకు గురి చేసినా, తనకు శిక్ష పడినా సరే వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడడం ఖాయమని తేల్చిచెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు. రిపబ్లికన్ను కావడం వల్లే తనను వేధిస్తున్నారని, తనపై ప్రారంభించిన విచారణ ప్రక్రియ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అధికార దుర్వినియోగంగా మిగిలిపోతుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తనను ఎన్నిక రకాలుగా ఇబ్బందులకు గురిచేసినా సరే రాజకీయాల నుంచి విరమించుకొనే ప్రసక్తే లేదన్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పుడు ప్రభుత్వ అధికారిక పత్రాలను ట్రంప్ తన ఇంటికి తీసుకెళ్లారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ట్రంప్ విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణలో భాగంగా మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారు. -
అదృష్టం మాములుగా లేదుగా! ఒకేసారి రెండు జాక్పాట్లు
అందరూ ఏదైనా మంచి జరగలాంటే మనకు అదృష్టం ఉండాలి అంటుంటారు. కాస్త మన హార్డ్వర్క్కి కొంచెం లక్ తోడైతే ఇక మనకు తిరుగుండదు. ఔనా! ఇంతకీ ఎందుకూ ఈ అదృష్టం గురించి చెబుతున్నానంటే ఇక్కడున్న మహిళకు అదృష్టం మాములుగా లేదు. ఒకేసారి ఉబ్బితబ్బిబై ఎగిరి గంతేసేంత పట్టరాని ఆనందం ఒకేసారి వరించింది. వివరాల్లోకెళ్లే...అమెరికాలోని నార్త్కరోలినాలోని ఒక మహిళ ఒకేసారి రెండు జాక్పాట్లు కొట్టేసింది. ఈ మేరకు బ్రెండా గోమెజ్ హెర్నాండెజ్ అనే 28 ఏళ్ల మహిళ పండటి బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపట్లోనే ఆమె రూ. 81 లక్షల లాటరీని గెలుచుకుంది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆమె అమెరికాలోని కాంకర్డ్ సిటీలోని ఒక క్విక్ట్రిప్ స్టోర్ నుంచి పవర్బాల్ టికెట్ను కొనుగోలు చేసింది. ఆమె సరిగ్గా నవంబర్ 9న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అదే రోజు కొద్ది నిమిషాల్లోనే ఆమె లాటరీ గెలిచుకున్నట్లు లాటరీ నిర్వహణ అధికారులు తెలిపారు. ఈ మేరకు హెర్నాండెజ్ మాట్లాడుతూ...కచ్చితంగా ఈ చిట్టితల్లి వల్లే తాను ఈ లాటరీ గెలుచుకున్నాను, ఆమె నా అదృష్టదేవత అంటూ మురిసిపోయింది. అలాగే మిగతా నా ఇద్దరు మగ పిల్లలు కూడా ఈ అదృష్టంలో భాగమే. ఎందుకంటే ఈ లాటరీని ఆ ఇద్దరు పిల్లల పుట్టిన రోజుల నెంబర్లను ఆధారంగా లాటరీ టిక్కెట్ని ఎంచుకుని కొనుగోలు చేయడంతో గెలవగలిగానని ఆనందంగా చెబుతోంది. (చదవండి: వామ్మో! కుక్కపిల్లకి చేయిస్తున్నట్లుగా కోబ్రాకి స్నానం చేయిస్తున్నాడు) -
అమెరికాలో కాల్పులు..పోలీస్ సహా ఐదుగురు మృతి
రేలీ: అమెరికాలోని నార్త్ కరోలినా రాజధాని రేలీలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. న్యూస్ రివర్ గ్రీన్వేలో నివాస ప్రాంతంలో రోడ్డుపై నడిచి వెళ్తున్న వారిపై ఒక బాలుడు(15)తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, పరారయ్యాడు. భారీగా రంగంలోకి దిగిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు మూడు కిలోమీటర్ల ప్రాంతాన్ని దిగ్బంధించి సోదాలు చేపట్టారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఓ ఇంట్లో దాక్కున్న బాలుడిని అరెస్ట్ చేశారు. -
ఉత్తర కరొలినాలో కాల్పుల కలకలం
రాలీ: యూఎస్లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర కరొలినాలో (North Carolina) ఓ దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. రాజధాని రాలీ Raleigh నగరంలోని న్యూస్ రివర్ గ్రీన్వే సమీపంలో అక్కడి కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడినట్లు మేయర్ మేరీ బల్డవిన్ ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఓ టీనేజర్ ఈ కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్న పోలీసులు.. ఓ ఇంట్లో దాక్కున్నాడనే సమాచారంతో చుట్టుమట్టి అదుపులోకి తీసుకునే యత్నం చేశారు. చివరకు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నార్త్ కరొలినా కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం అంచనా వేస్తున్నారు. మరణించినవారిలో ఒక పోలీస్(ఆఫ్ డ్యూటీలో ఉన్నారు) కూడా ఉన్నాడని పేర్కొన్నారు. గన్ వయొలెన్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు(యూఎస్ఏ) ప్రధాన సమ్యగా మారింది. 2021 ఏడాదిలోనే 49వేల మందికిపైగా మరణించారు. ఈ లెక్కన రోజుకు సగటున 130 మంది మరణించారన్నమాట. అంటే.. ఇది ఆత్మహత్యల కేసుల కంటే బాగా ఎక్కువనేది విశ్లేషకుల అభిప్రాయం. The Raleigh Police Department is currently on the scene of an active shooting in the area of the Neuse River Greenway near Osprey Cove Drive and Bay Harbor Drive. Residents in that area are advised to remain in their homes. — Raleigh Police (@raleighpolice) October 13, 2022 -
బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన వైద్యులు.. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్
వాషింగ్టన్: అమెరికా నార్త్ కరోలినాలో అనూహ్య ఘటన జరిగింది. డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించిన ఓ వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో కాళ్లు కదిపాడు. దీంతో వైద్యులు మారోమారు పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగుచుశాయి. అతని బ్రెయిన్ యాక్టివ్లోనే ఉన్నట్లు తెలిసి వైద్యులు నమ్మలేకపోయారు. వెంటనే అతనికి మళ్లీ చికిత్స ప్రారంభించారు. విల్క్స్ కౌంటీకి చెందిన ఈ వ్యక్తి పేరు ర్యాన్ మార్లో. పాస్టర్గా పని చేస్తున్నాడు. బాక్టీరియా ఇన్ఫెక్షన్తో వచ్చే అరుదైన లిస్టేరియా వ్యాధి బారినపడ్డాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు రెండు వారాల పాటు చికిత్స అందించారు. అనంతరం ఇన్ఫెక్షన్ వల్ల అతని మెదుడులో వాపు వచ్చిందని, బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు ప్రకటించారు. వైద్యపరంగా చెప్పాలంటే మరణించినట్లే అని పేర్కొన్నారు. తన భర్త పరిస్థితిని మేగన్ సోషల్ మీడియా వేదికగా అందరికీ తెలిపింది. తాను అవయవ దానం చేస్తానని ర్యానో గతంలోనే నమోదు చేసుకున్నాడు. దీంతో అతన్ని లైఫ్ సపోర్టుపై ఉంచారు వైద్యులు. అతని అవయవాలు పొందేందుకు సరైన రోగుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఆగస్టు 30న ర్యాన్కు అంతిమ వీడ్కోలు చెప్పేందుకు అందరూ సిద్ధమవుతుండగా.. మేగన్ కోడలు ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించింది. ర్యాన్ కాళ్లు కదిపారని, అది ఫోన్లో తీసిన వీడియోలో రికార్డయ్యిందని చెప్పింది. మళ్లీ పరీక్షలు.. వెంటనే మేగన్ వైద్యుల దగ్గరికి వెళ్లి తన భర్త బ్రెయిన్ పనితీరుపై మరోమారు పరీక్షలు చేయాలని కోరారు. ఆమె విజ్ఞప్తి మేరకు సీటీ స్కాన్ తీసిన వైద్యులు అవాక్కయ్యారు. ర్యాన్ బ్రెయిన్ యాక్టివ్లోనే ఉన్నట్లు అందులో తేలింది. దీంతో పొరపాటుగా వాళ్లు బ్రెయిన్ డెడ్గా ప్రకటించినట్లు స్పష్టమైంది. స్కాన్ రిపోర్టుల అనంతరం మేగన్ మళ్లీ సోషల్ మీడియాలో తన భర్త పరిస్థితి గురించి వెల్లడించింది. ర్యాన్కు బ్రెయిన్ డెడ్ కాలేదని చెప్పింది. దేవుడే తనను బతికించాడని పేర్కొంది. రీస్కాన్ తర్వాత ర్యాన్ హార్ట్బీట్ కొంచెం పెరిగింది. అయితే వైద్యుల చికిత్సకు స్పందనలో మాత్రం మార్పు లేదని మేగన్ చెప్పింది. ర్యాన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని పేర్కొంది. చదవండి: ఉక్రెయిన్తో యుద్ధం.. కొరియా కిమ్తో చేతులు కలిపిన పుతిన్! -
ఎమర్జెన్సీ ల్యాండింగ్ టైంలో అనూహ్య ఘటన!... దూకేశాడా? పడిపోయాడా!
న్యూయార్క్: యూఎస్లోని నార్త్ కరోలినాలో ఒక విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో కో పైలెట్ కిందపడి మృతి చెందాడు. ఐతే అతను విమానం అత్యవసర ల్యాండింగ్ టైంలో దూకేశాడా? లేక ప్రమాదవశాత్తు పడిపోయాడా అనేది తెలియరాలేదు. ఒకవేళ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో పారాచూట్ లేకుండా ఎలా దూకేశాడు అంటూ అధికారులు పలు అనుమానాలు లేవనెత్తారు. మృతి చెందిన సదరు కోపైలెట్ 23 ఏళ్ల చార్లెస్ హ్యూ క్రూక్స్గా గుర్తించారు అధికారులు. అతడి మృతదేహం విమానాశ్రయానికి దక్షిణంగా సుమారు 48 కిలోమీటర్లు దూరంలో లభించిందని అధికారులు తెలిపారు. అంతేకాదు విమానంలో మరో పైలెట్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ, నేషనల్ సేఫ్టి బోర్డు ఈ ఘటనకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రమాదానికి ముందు విమానం కుడివైపు ఉన్న చక్రం కోల్పోవడంతో పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాయం కోరినట్లు అధికారులు తెలిపారు. (చదవండి: సముద్రంలో తెల్లటి చుక్కల్లా....జెల్లీ ఫిష్ సముహం) -
నడి రోడ్డు పై ల్యాండ్ అయిన విమానం: వీడియో వైరల్
ఇటీవల కాలంలో పైలెట్లు విమానాలను దారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. విమానంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిన లేక ఏదైన ప్రమాద సంభవిస్తుందన్న అనుమానం వచ్చినా పైలెట్లు విమానాన్ని అత్యవసరంగా సురకక్షితమైన ప్రదేశంలో దించేస్తారు. అచ్చం అలానే ఇక్కడొక పైలెట్ కూడా విమానాన్ని అత్యవసర ల్యాండిగ్ చేశాడు గానీ, అదీ కూడా రద్దీగా ఉండే హైవే పై ల్యాండ్ చేయడం విశేషం. వివరాల్లోకెళ్తే...యూఎస్లోని నార్త్ కరోలినాలో వాహనాల రద్దీ మధ్య ఒక విమానం ల్యాండ్ అయ్యింది. విన్సెంట్ ఫ్రేజర్ అనే పైలెట్ తన మామతో కలిసి స్వైన్ కౌంటీలోని ఫోంటాన్ లేక్ నుంచి సింగిల్ ఇంజన్ విమానాన్ని నడుపుతున్నాడు. ఐతే అకస్మాత్తుగా ఇంజన్ పనిచేయడం మానేయడం మొదలైంది. దీంతో అతను సమీపంలోని హైవే పై సురకక్షితంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఫ్రేజర్ గతేడాదే పైలెట్గా లైసెన్సు పొందాడు. ఫ్లోరిడాకు చెందిన మెరైన్ అనుభవజ్ఞుడు, కానీ అతనికి 100 గంటలకు పైగా విమానన్ని నడపగల అనుభవం మాత్రం లేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. WATCH: New video shows a plane making an emergency landing on a Swain County highway Sunday morning. Hear from the pilot tonight on @WLOS_13 at 5 & 6! Video courtesy of Vincent Fraser. pic.twitter.com/hcxOGUUGgP — Andrew James (@AndrewJamesNews) July 7, 2022 (చదవండి: నాలాగే ఒంటరిగా ఉండండి!... అంటూ పిలుపునిచ్చిన మంత్రి!) -
బొద్దింకను చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది.. అట్లాంటిది వాటిని పెంచితే రూ.లక్షన్నర!
కాక్రోచ్ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఇంట్లో ఒక్క బొద్దింక కనబడితేనే దాన్ని చంపేదాకా మనసూరుకోదు. అలాంటిది ఇంటినిండా బొద్దింకలను ఒక నెలపాటు ఉంచడానికి... రెండు వేల డాలర్లు (సుమారు రూ.1,58,283) ఆఫర్ చేసిందో కంపెనీ. అందుకు 2,500మంది అంగీకరించారు కూడా. బొద్దింకలను పెంచమని ప్రోత్సహించ డం ఏంటనుకుంటున్నారా? వాటిని నిర్మూలించడానికి. అయితే పెంచడమెందుకు అంటే శాశ్వత నిర్మూలన ప్రయోగం కోసం. గతవారం నార్త్ కరోలినాకు చెందిన హైబ్రిడ్ పెస్ట్ కంట్రోల్/మీడియా కంపెనీ ‘ద పెస్ట్ ఇన్ఫార్మర్’ఒక ప్రకటన విడుదల చేసింది. 30 రోజులపాటు 100 అమెరికన్ బొద్దింకలను ఉంచి పరిశోధించడానికి ఏడు ఇళ్లు కావాలని తెలిపింది. ఆమోదం తెలిపేవాళ్ల వయసు 21ఏళ్లు నిండి ఉండాలి. సొంత ఇల్లు కలిగి ఉండాలి లేదా ఇంటి ఓనర్ ఆమోదం ఉన్నా సరిపోతుందని చెప్పింది. అలాగే వాటి నిర్మూలనకు ఎలాంటి పురుగుల మందులు వాడకూడదని, తాము ఇచ్చిన మందులను మాత్రమే ప్రయోగించాలని వివరించింది. వాళ్లు తయారు చేసిన పురుగుల మందు 30 రోజుల్లో ఆ బొద్దింకలను పూర్తిగా చంపలేకపోతే... 30 రోజుల తరువాత సాధారణ పద్ధతిలో వాటిని నిర్మూలిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు వారికి రెండు వేల డాలర్లు అంటే దాదాపు రూ.లక్షా60వేలు ఇస్తామని పేర్కొన్నది. ఎవ్వరూ ఆసక్తి చూపరేమోనని జూలై 31వరకు గడువు విధించింది. వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ.. 2,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. అది చూసి ఆశ్చర్యపోవడం కంపెనీ వంతయ్యింది. ఎవరూ ఆసక్తిచూపరని తామనుకుంటే... ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలోంచి తమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారిని ఎంపిక చేసుకుంటామని ప్రకటించింది. -
Viral Video: అభిమానికి బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్
రాజకీయ నాయకులు, సినీ తారలు, స్పోర్ట్స్ స్టార్స్కు ఫాలోవర్స్ ఉండటం సహజమే.. సెలబ్రిటీలు ఎక్కడికి వెళ్లినా అభిమానులు వారిని ఫాలో అవుతూనే ఉంటారు. సెల్ఫీలు, వీడియోలు ఉంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తుంటారు. దీంతో సెలబ్రిటీలు బయట తిరిగే సమయంలో ఫోటోగ్రాఫర్ల కంట పడకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీకొంత మంది మాత్రం ఎంతమంది అభిమానులు ఎదురైనా వారందరికీ ఒప్పిగ్గా ఆటోగ్రాఫ్, సెల్ఫీలు ఇస్తారు. తాజాగా ఓ అమెరికన్ ర్యాపర్ అభిమానుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. నార్త్ కరోలినాకు చెందిన రాపర్ డాబాబీ ఓ కార్యక్రమం నుంచి బయటకు రాగా.. అతన్ని అభిమానులు చుట్టుముట్టారు. ఇందులో మహిళా అభిమానులు కూడ ఉన్నారు. అయితే వారు సెల్ఫీలు తీసుకుంటుండా బాబీ అభిమానుల గుంపు వద్దకు వెళ్లి వారిని కౌగిలించుకున్నాడు. అంతేగాక ఓ మహిళా అభిమాని వద్దకు వెళ్లి ఆమె ముఖాన్ని తన చేతులతో దగ్గరకు తీసుకేందుకు ప్రయత్నించాడు. చదవండి: ఏం ఐడియా సామీ! పెళ్లిలో వధూవరులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన స్నేహితులు #DaBaby getting curved by fans 😂 pic.twitter.com/EiiP7NMfsX — No Jumper (@nojumper) April 7, 2022 అయితే సదరు అభిమాని అతనికి దూరంగా జరుగుతున్నప్పటికీ ర్యాపర్ ఆమెను ముద్దు పెట్టుకోడానికి బలవంతం చేయడంతో వెంటనే ముఖాన్ని వెనక్కి తిప్పుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ర్యాపర్ ప్రవర్దనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోకు 10 మిలియన్లకు పైగా వ్యూవ్స్వచ్చాయి. చదవండి: ఊహించని అదృష్టం.. పొరపాటున లాటరీ టికెట్ కొంటే.. కోటీశ్వరురాలిని చేసింది -
ఘోర విమాన ప్రమాదం.. ఏడుగురు యువకులు..
వాషింగ్టన్ : ఓ విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన అమెరికా నార్త్ కరోలినా రాష్ట్రంలోని ఔటర్ బ్యాంక్స్ వద్ద చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఎనిమిది మంది యువకులతో హైడ్ కౌంటీ ఎయిర్పోర్ట్ నుంచి పిలాటస్ పీసీ-12/47 అనే సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్అయింది. అనంతరం 25 నిమిషాల్లో 29 కిలోమీటర్ల(18 మైళ్లు) దూరం ప్రయాణించిన తర్వాత రాడార్తో ఆ విమాన సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయిందని కోస్ట్ గార్డ్ అధికారులు నిర్ధారించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది సముద్రంలో సహాయక చర్యలను ప్రారంభించింది. ఈ క్రమంలో సముద్రంలో విమాన శకలాలను సిబ్బంది గుర్తించారు. ఆ ప్రాంతంలోనే ఓ వ్యక్తి మృతదేహాన్ని కూడా కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గల్లంతైన మరో ఏడుగురి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, వీరంతా కార్టెరెట్ కౌంటీకి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. -
ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో..
This 25 year old Woman wore tight jeans for 8 hours then had to be admitted in ICU: ఈ రోజుల్లో టైట్ జీన్సే.. ఫ్యాషన్ ఐకాన్! ప్రపంచవ్యాప్తంగా కాలేజ్ గర్ల్స్ నుంచి ముసలమ్మలదాకా క్యాజువల్ డ్రెస్సింగ్లో జీన్స్ భాగమైపోయింది. ఐతే గంటల తరబడి జీన్స్ ధరిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఒక మహిళ 8 గంటల పాటు జీన్స్ ధరించినందుకు ఐసీయూలో 4 రోజులపాటు చికిత్స తీసుకున్న అనుభవాన్ని సోషల్మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త టాక్ ఆప్ ది టౌన్గా మారింది. నార్త్ కరోలినాకి చెందిన 25 ఏళ్ల సామ్ మూడేళ్ల క్రితం తన బాయ్ ఫ్రెండ్తో కలిసి డేటింగ్కు వెళ్లింది. అప్పడు ప్రియుడి కోరిక మేరకు బిగుతుగా ఉండే షార్ట్ జీన్స్ ధరించింది. 8 గంటల తర్వాత ఇంటికి చేరిన సామ్కు నడుము క్రింద నొప్పి ప్రారంభమైంది. మరుసటి రోజు డాక్టర్ని సంప్రదించడంతో సెప్సిస్, సెల్యులైటీస్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ సోకిందని తేలింది (ఈ ఇన్ఫెక్షన్ తీవ్రతరమైతే.. రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించి, అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించే ఆస్కారం ఉంది). చదవండి: Baldness Cure: గుడ్న్యూస్.. ఈ ప్రొటీన్తో బట్టతల సమస్యకు పరిష్కారం..! తొలుత ఆస్పత్రిలో చేర్పించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు వెంటనే ఆమెను ఐసీయూకి మార్చారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్సనందించారు. మరి కొన్ని రోజులపాటు ఆమె ఆసుపత్రిలోనే ఉండి వైద్యం చేయించుకుంది కూడా. చికిత్స సమయంలో మాటిమాటికీ ప్యాంట్ను తీసి వైద్యులకు గాయాన్ని చూపించాల్సి వచ్చేదని, ఇది చాలా చేదు అనుభవమని, దాదాపు మృత్యు కుహరం నుంచి బయటికి వచ్చానని తెల్పింది. తను చవిచూసిన చేదు అనుభవాన్ని టిక్ టాక్ ద్వారా తాజాగా పంచుకుంది. ఇంత అరుదైన వ్యాధి జీన్స్ వల్ల ఎలా వస్తుందని సర్వత్రా చర్చ కోనసాగుతోంది. అందుకే ఇన్ఫెక్షన్లు వస్తాయి.. నిజానికి బిగుతైన దుస్తులు ధరించినప్పుడు చర్మం కోతకు గురై ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా జీవించడానికి అనుకూలంగా ఉండే తేమలాంటి పదార్థం (అనోరెక్టల్ అబ్సెస్) పేరుకుపోతుంది. దీనికి తక్షణమే చికిత్స చేయకపోతే, ఆ ప్రదేశంలో చర్మగ్రంధులు మూసుకుపోయి ప్రాణాంతక ఇన్ఫెక్షన్గా మారుతుంది. సాధారణంగా ఇమ్యునిటీ బలహీణంగా ఉండే వారికి ఇది సోకే అవకాశం ఎక్కువని వైద్యులు సూచిస్తున్నారు. జీన్స్తో జర జాగ్రత్త!! చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. -
చేతి సైగతో మృగాడి చెర నుంచి తప్పించుకుంది...
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మైనర్ బాలిక కొన్ని రోజుల క్రితం కిడ్నాప్కు గురైంది. నిందితుడు బాలికను తనతో పాటు తీసుకెళ్తుండగా కారు ఓ చోట ట్రాఫిక్లో ఆగింది. అతడి చెర నుంచి బయటపడాలని భావించిన బాలిక తన చేతులతో పదే పదే ఒక సైగ చేయసాగింది. ఆమె చేతి సైగను గమనించి, అర్థం చేసుకున్న కొందరు విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన అధికారులు మైనర్ని కాపాడి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. నోరు విప్పకుండా.. అరవకుండా.. కేవలం ఓ సైగ ద్వారా సదరు బాలిక తన జీవితాన్ని కాపాడుకుంది. ఆ వివరాలు.. నార్త్ కరోలినాకు చెందిన ఓ మైనర్ బాలిక కొన్ని రోజుల క్రితం తన బంధువు అయిన నిందితుడితో కలిసి బయటకు వెళ్లింది. నమ్మి వెంట వచ్చిన బాలికను కిడ్నాప్ చేశాడు నిందితుడి. బయటకు వెళ్లిన కుమార్తె రోజులు గడిచినా ఇంటికి రాకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. బాధితురాలి అసభ్య ఫోటోలతో ఆమెను బెదిరించసాగాడు కిడ్నాపర్. ఈ క్రమంలో ఓ రోజు నిందితుడు సదరు బాలికను తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్తున్నాడు. (చదవండి: 18 రోజుల పాటు గాలింపు.. ఆ పాపను చూసి ఏడ్చిన అధికారులు) ఓ చోట కారు ట్రాఫిక్లో ఆగింది. అతడి చెర నుంచి తప్పించుకోవాలని భావిస్తున్న బాలిక.. చుట్టూ ఉన్న వ్యక్తులకు తన పరిస్థితిని వివరించడం కోసం చేతితో ప్రత్యేక సైగ చేయసాగింది. బొటనవేలిని ముడిచి.. మిగతా వెళ్లను ఎత్తి.. ఆ తర్వాత వాటిని బొటన వేలు మీదుగా బిగించి చూపించే ఆ సైగకు తాను గృహహింస బాధితురాలినని.. సాయం చేయాల్సిందిగా అర్థం. ఈ సైగ టిక్టాక్లో చాలా ట్రెండ్ అవ్వడంతో ఆమె సైగలు గమనించిన కొందరు విషయాన్ని పోలీసులకు తెలిపారు. (చదవండి: చిన్నారిని కిడ్నాప్ చేయించిన మేనమామ) వారు నిందితుడి కారును వెంబండించి.. బాలికను కాపాడారు. నిందితుడి మొబైల్ని స్వాధీనం చేసుకుని చూడగా.. దానిలో బాలిక అసభ్య ఫోటోలు ఉన్నాయి. వాటన్నింటిని తొలగించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. చదవండి: కాబూల్లో భారతీయుని అపహరణ ! -
బుల్లెట్ బండి: వైరల్ అవుతున్న ఎన్నారై బేబీ వీడియో
-
బుల్లెట్టు బండి: సూపర్.. జూనియర్ సాయి పల్లవిలా..
నార్త్ కరోలినా: సోషల్ మీడియాలో బుల్లెట్ బండి పాట ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ గాయని మోహన భోగరాజు ఆలపించిన ఈ పాట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారిని ఆకట్టుకుంటోంది. మంచిర్యాలకు చెందిన నవ వధువు సాయి శ్రీయ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్త.. పా అంటూ భర్తతో డ్యాన్స్ చేసిన వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు నైనిక అనే ఎన్నారై బేబీ సింగిల్ టేక్లో ఈ జానపదానికి తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అదరహో అనిపించింది. లిరిక్స్ ఆలపిస్తూ.. జోష్గా స్టెప్పులేస్తూ పురివిప్పిన నెమలిలా వీక్షకులకు కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ‘‘నువ్వు సూపర్ బుజ్జీ.. అచ్చమైన.. స్వచ్ఛమైన పల్లె పదాలకు ఎంతో అందంగా ఆడిపాడావు. హ్యాట్సాఫ్’’ అంటూ నెటిజన్లు ఆమెను ఆశీర్వదిస్తున్నారు. జూనియర్ సాయిపల్లవి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా నైనిక అమెరికాలోని నార్త్ కరోలినాలో నివసిస్తున్నట్లు సమాచారం. -
వింత పదార్థం.. దీని గురించి తెలిస్తే మాకు చెప్పండి..
సాధారణంగా మనం ఎప్పుడూ చూడని కొత్తవి, వింతవి ఎదురుగా కనిపిస్తే ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోతాం. ఒకవేళ అవి భయంకరంగా, వికారంగా ఉంటే మాత్రం భయపడతాం. ఈ విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా సముద్రాల్లో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. సముద్ర అడుగు భాగంలో ఇప్పటి వరకూ గుర్తించని, ఏముందో కనిపెట్టని జీవులూ ఉంటాయి. అచ్చం అలాంటి ఓ వింత పదార్థాన్ని నార్త్ కరోలినా తీరంలో నేషనల్ పార్క్ అధికారులు కనుగొన్నారు. ఇది చూడటానికి గజిబిజీగా, చాలా పెద్దగా ఉంది. కేప్ లుకౌట్ నేషనల్ సీషోర్ ఫేస్బుక్లో షేర్ చేసిన దీనికి కాళ్లు, చేతులు, తల వంటి భాగాలు కూడా లేవు. ‘అంతుచిక్కని పదార్థం’ అని క్యాప్షన్తో పోస్టు చేసిన ఈ ఫోటోలో ఉన్న జీవి కొన్ని నెలల క్రితమే సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో పంచుకోవడంతో దీన్నిచూసిన వారంతా ఏంటని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. దీని ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్గా మారుతున్నాయి. దీనిని గుర్తించడంలో అధికారులు ప్రజల సలహా కోరుతున్నారు. ఇదొక ప్రమాదకరమైన జీవి అనుకొని స్థానికులందరూ భయపడుతున్నారు. కాగా ఇది చేపలాగా ఉంటే స్క్విడ్ గుడ్డు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇది అనేక ఆకారాలను కలిగి ఉంది. చిన్న చిన్న తెలుపు రంగు బాల్స్తో ఉన్నట్లు కనిపిస్తోంది. ‘బీచ్ మిస్టరీ - ఈ రహస్యమైన జంతువేంటో ఏమిటో మీకు తెలుసా? ఇది కొన్ని నెలల క్రితం బీచ్లో కనుగొన్నాం.. ఇప్పటివరకు దీనిని గుర్తించలేకపోయాం. అయితే ఇది స్క్విడ్కు చెందిన గుడ్డుగా భావిస్తున్నాం. ఖచ్చితంగా తెలియదు. ఎవరైనా గుర్తించడంలో మాకు సాయం చేయగలరా అని పేర్కొన్నారు.’ కాగా ఈ పోస్టుపై స్పందించిన చాలామంది అవి స్క్విడ్ గుడ్లు అని చెప్పి, వాటిని తిరిగి సముద్రంలో వదిలి పెట్టమని అధికారులను కోరారు. -
సర్జికల్ మాస్కుపై క్లాత్ మాస్కు ధరిస్తే..
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే మాస్కు కచ్చితంగా ధరించాలని అందరికీ తెలుసు. రెండు మాస్కులు ధరిస్తే రెండింతల రక్షణ లభిస్తుందని తెలుసా? ఇలా ధరిస్తే వైరస్ బారినపడే అవకాశాలే లేవని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్తు కరోలినా(యూఎన్సీ) తాజా పరిశోధనలో తేలింది. ఈ వివరాలను జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ తాజా సంచికలో ప్రచురించారు. రెండు టైట్ ఫిట్ మాస్కులు సార్స్–కోవ్–2 సైజ్ వైరస్ను సమర్థంగా ఫిల్టర్ చేస్తాయని, నోరు, ముక్కులోకి వెళ్లకుండా అడ్డుకుంటాయని ఈ పరిశోధన చెబుతోంది. మాస్కుల్లో ఎక్కువ బట్ట పొరలు వాడడం వల్ల వాటి మధ్య ఖాళీ స్థలం తగ్గిపోతుంది. ఖాళీ లేకపోతే లోపలికి వైరస్ ప్రవేశించే అస్కారం లేదని యూఎన్సీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎమిలీ సిక్బర్ట్–బెన్నెట్ చెప్పారు. మాస్కు ముఖానికి సరిగ్గా అమరకపోతే రక్షణ పెద్దగా ఉండదని తెలిపారు. బట్ట పొరలను ఖాళీ లేకుండా బిగువుగా కలిపి కుట్టిన మాస్కు ఉత్తమమైనదని చెప్పారు. సాధారణ క్లాత్ మాస్కు 40 శాతం రక్షణ కల్పిస్తుందని అధ్యయనకర్తలు వెల్లడించారు. సర్జికల్ మాస్కు అయితే 40–60 శాతం రక్షణ ఇస్తుందన్నారు. సర్జికల్ మాస్కుపై క్లాత్ మాస్కు ధరిస్తే కరోనా నుంచి రక్షణ మరో 20 శాతం పెరుగుతుందన్నారు. సోమవారం అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలు మహారాష్ట్ర - 58,924 ఉత్తరప్రదేశ్- 30,566 ఢిల్లీ - 25,462 కర్ణాటక - 19,067 కేరళ - 18,257 ఛత్తీస్గఢ్ - 12,345 మధ్యప్రదేశ్ - 12,248 తమిళనాడు - 10,723 గుజరాత్ - 10,340 రాజస్తాన్ - 10,262 చదవండి: వామ్మో కరోనా.. గతవారం మనమే -
హెచ్1వీసాల పేరుతో మోసం
-
తెలుగు విద్యార్ధులను నట్టేట ముంచిన జంట..
సాక్షి, హైదరాబాద్: ఎఫ్1 వీసా ఉన్న విద్యార్థులకు హెచ్1 వీసా ఇప్పిస్తామంటూ ఓ జంట అమెరికాలోని తెలుగు విద్యార్థులను నట్టేట ముంచింది. స్టూడెంట్స్ వద్ద నుంచి సుమారు 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి.. పరారయ్యింది ఈ జంట. వివరాలు.. నిందితులు ముత్యాల సునీల్, ప్రణీతలు అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థులను హెచ్1 వీసా పేరిట మోసం చేశారు. ఎఫ్1 వీసా ఉన్న విద్యార్థులకు హెచ్1 వీసా ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. ఒక్కో విద్యార్థి దగ్గరి నుంచి 25 వేల డాలర్లు వసూలు చేశారు. ఈ మోసానికి సంబంధించి 30 మంది తెలుగు విద్యార్థులు నార్త్ కరోలినా హోం ల్యాండ్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటర్పోల్ ముత్యాల సునీల్, ప్రణీతలపైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం సునీల్, ప్రణీత పరారీలో ఉన్నారు. (చదవండి: అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?) ఇక, విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను సునీల్ తన తండ్రి ముత్యాల సత్యనారాయణ అకౌంట్కు బదిలీ చేశాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరిలో ఉంటున్న సత్యనారాయణ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. ఈ ఘటన వెలుగుచూడటంతో సత్యనారాయణ కూడా పరారీలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పోలీసులు సత్యనారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
లోయలో పడ్డ కుక్క.. చిరు తిండి చూపించి!
సాటి మనిషి కష్టాల్లో ఉంటే అయ్యో పాపం అనే మనసు అందరికి ఉంటుంది. కానీ సాయం చేసే మంచి మనసు చాలా అరుదు. పక్కనున్న వారినే పట్టించుకోవడంలేని నేటి సమాజంలో ప్రాణం పోయే స్థితిలో ఉన్న కుక్కను రక్షించి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓవ్యక్తి. అయితే ఆ వ్యక్తి కుక్కను రక్షించిన విధానం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు. వివరాలు.. కొందరు సభ్యులతో కూడిన బృందం నార్త్ కరోలినా ప్రాంతంలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో పక్కన ఉన్న లోయలో ఓ కుక్క పడిపోయి ఉండటాన్ని గమనించారు. దాదాపు 30 అడుగుల లోతు ఉన్న లోయలో కుక్క చిక్కుకొని చాలా రోజులవుతున్నట్లు తెలుస్తోంది. (వైరల్: ఈ కుక్క పిల్ల చాలా తెలివైంది) అయితే దానిని బయటకు తీసేందుకు ఆలోచించిన బైకర్లు వెంటనే సహాయం కోసం బుర్కే కౌంటీ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాన్ని పిలిచారు. అనంతరం వారంతా కుక్క చిక్కుకున్న లోయ వద్దకు వెళ్లి దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం చూపిస్తే ఉత్సాహంతో పరుగులు పెడుతుంది అనుకొని స్క్యూవర్స్ లోయ లోపలికి వెళ్లి కుక్కకు మాంసం, స్నాక్స్ ప్యాకెట్స్ చూపించారు. తర్వాత జీను సాయంతో దానిని సురక్షితంగా బయటకు తీశారు. కుక్కు ఎలాంటి గాయాలు కాలేదని, అయితే చాలా రోజుల నుంచి ఆకలితో ఆలమటిస్తుందని వారు తెలిపారు. కుక్కను రక్షించిన విధానాన్ని రెస్క్యూవర్స్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కుక్కకు సింకర్ అని పేరు పెట్టారు. దీని యజమానులు దొరక్కపోతే ఎవరైనా కుక్కను దత్తత తీసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. (ఆ సూట్కేస్ను చూడకపోతే ఏం జరిగేది?) -
అంచనాలు తలకిందులు, అన్నీ నాణేల గుట్టలే!
వాషింగ్టన్: అమెరికాలోని నార్త్ కరోలినా అక్వేరియం చాలా ఫేమస్. అక్కడికి రోజూ వేలాది మంది సందర్శకులు వస్తారు. అక్వేరియంలో ఉన్న స్మోకీ మౌంటేన్ నుంచి కిందకు జారే వాటర్ ఫాల్స్కు ఓ ప్రత్యేకత ఉంది. 30 అడుగుల లోతైన ఆ వాటర్ఫాల్స్లో నాణేలు వేసి ఏదైనా కోరుకుంటే అది తీరుతుందనే విశ్వాసం ఉంది. దాంతో సందర్శకులు ఆ వాటర్ఫాల్స్లో నాణేలు వేస్తుంటారు. సాధారణంగా జనాలతో కిక్కిరిసిపోయే ఆ అక్వేరియానికి ఆదాయానికి కూడా లోటు లేదు. అయితే, కరోనా పరిస్థితుల దృష్ట్యా దానిని మూసేయడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. రోజూవారి ఖర్చులు, జంతువుల సంరక్షణ కష్టమైంది. దాంతో అక్వేరియం నిర్వాహకులకు ఓ ఆలోచన తట్టింది. జనాల కోరికలు నెరవేరేందుకు వేసిన విషింగ్ కాయిన్స్ని బయటికి తీసేందుకు నిర్ణయించారు. అయితే, వారి అంచనాలు తప్పయ్యాయి. ఆ వాటర్ ఫాల్స్ ఫౌంటేన్లో జనాల కోరికలు రాశులుగా పోగుపడి దర్శనమిచ్చాయి. వారు ఊహించినదానికంటే చాలా ఎక్కువ.. అంటే దాదాపు 100 గాలన్ల నాణేలు ఆ ఫౌంటేన్లో లభించాయి. తమ అంచనాలు తలకిందులు చేసిన ఆ నాణేల రాశులకు సంబంధించిన ఫొటోలను అక్వేరియం నిర్వాహకులు ఫేస్బుక్లో ఫేర్ చేశారు. ఈ మొత్తం నాణేలు ఎంత విలువ చేస్తాయో చెప్పగలరా? అని నెటిజన్లకు క్విజ్ పెట్టారు. 48 వేల డాలర్లు అని ఒకరు, 64,427 డాలర్లు అని ఇంకొకరు తమ తోచిన మొత్తాన్ని చెప్పుకొచ్చారు. ఈ నాణేలన్నీ చలామణిలోకి వస్తే దేశంలో వాటి కొరత తీరుతుందని మరో నెటిజన్ పేర్కొన్నారు. దేవుడు అందరి కోరికలు నెరవేర్చాలి అని మరొకరు ఆకాక్షించారు. ఈ పోస్టుకు లక్షా 80 వేల లైకులు రావడం విశేషం. కాగా, సరైన మొత్తం ఎంతో వచ్చేవారం జవాబు చెబుతామని అక్వేరియం నిర్వాహకులు వెల్లడించారు. -
జాతి వివక్ష అంతమే లక్ష్యం
వాషింగ్టన్/బెర్లిన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ పోలీసుల దౌర్జన్యానికి బలి కావడంతో ఆగ్రహంతో ప్రారంభమైన ప్రదర్శనలు ఇప్పుడు జాతి వివక్ష అంతమే లక్ష్యంగా కొనసాగుతున్నాయి. అమెరికాలో ఫ్లాయిడ్ పుట్టిన ప్రాంతం నార్త్ కరొలినాలో కుటుంబ సభ్యులు రెండో సంస్మరణ సభ నిర్వహించారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1963లో చేసిన పేరుపొందిన ప్రసంగం ‘ఐ హేవ్ ఏ డ్రీం’ను పురస్కరించుకుని వాషింగ్టన్లో వచ్చే ఆగస్టులో స్మారక ర్యాలీ నిర్వహించనున్నట్లు రెవరెండ్ అల్ షార్ప్టన్ చెప్పారు. ‘అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మొత్తం న్యాయ వ్యవస్థ మారాలంటూ ప్రజా ఉద్యమానికి ఊపిరి పోస్తాం. అలా చేయకుంటే మరో ఏడాది గడిచిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ గుర్తుపెట్టుకోరు. ఎవరూ పట్టించుకోరు’అని ఓ ఇంటర్వ్యూలో నల్ల జాతీయులనుద్దేశించి పేర్కొన్నారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా.. ఆస్ట్రేలియా, యూరప్, ఆసియా దేశాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. జాతి వివక్షను ఇక సహించబోమంటూ నిరసనకారులు గొంతెత్తి నినదిస్తున్నారు. ఆస్ట్రేలియాలో కస్టడీ మరణాలకు వ్యతిరేకంగా సిడ్నీలో భారీ ప్రదర్శనలు జరిగాయి. ‘కరోనా వైరస్తో మరణించకపోతే, పోలీసులు క్రూరత్వానికి మేము బలైపోతాం’అన్న నినాదాలు హోరెత్తిపోయాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో వరసగా రెండో రోజు కూడా ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. నల్ల మాస్కులు, టీ షర్టులు ధరించిన వారంతా బ్లాక్స్కి కొరియన్స్ మద్దతు ఉంటుందని అంటూ నినదించారు. జపాన్ రాజధాని టోక్యోలో వందలాది మంది శాంతియుత నిరసనలు చేశారు. మేమూ మారాలి: ఇండో అమెరికన్ అడ్వొకసీ గ్రూప్ జార్జ్ ఫ్లాయిడ్, ఇతర ఆఫ్రికన్ అమెరికన్ల మరణాలతో అగ్రరాజ్యంలో నల్లజాతీయులపై కొనసాగుతున్న వివక్ష ఎంత భయానకంగా ఉంటుందో ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చిందని ఇండియన్ అమెరికన్ న్యాయవాదుల గ్రూప్ తెలిపింది. ఇలాంటి సమయంలోనూ భారత్, ఇతర దక్షిణాసియా దేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది మౌనంగా ఉండడమే మంచిదన్న అభిప్రాయంలో ఉంటారని, ఈ ధోరణి మారాలని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండియన్ అమెరిన్లను రాజకీయాల్లోకి చేర్చేందుకు సహకరించే ఈ సంస్థ మైనార్టీల దారుణ మరణాలపై తీవ్రంగా స్పందించింది. ‘కచ్చితంగా చెప్పాలంటే మేమేమీ నిరపరాధులం కాదు’అని ఆ ప్రకటనలో పేర్కొంది. ‘నల్లజాతీయులు, ఇతర పౌర హక్కులు అమెరికా ఇమిగ్రేషన్ కోసం నిరంతర పోరాటం చేయడం వల్ల మేము ఇప్పడు ఈ దేశంలో ఉన్నాం. వారు చేసిన కృషి ఫలితాలను అనుభవిస్తున్నాం. అయినప్పటికీ జాతి వివక్షకి సంబంధించిన దారుణాలు వెలుగులోకి వచ్చినప్పుడు భారతీయులు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. అది మారాలి’అని ఆ ప్రకటన వివరించింది. బెర్లిన్లో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న యువతి -
కరోనా భయం: మాస్క్ మాటున కన్నీళ్లు!
న్యూయార్క్: ‘నా జీవితం, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ప్రమాదంలో ఉన్నట్లు నేను నిజంగా భావించాను. నేను అక్కడ కూర్చుని నిశ్శబ్దంగా మాస్క్ మాటున ఏడ్చాను. ఎందుకంటే నేను ఎంతో ప్రమాదకరమైన స్థలంలో ఉన్నట్టు అనిపింది’.. ఎరిన్ స్ట్రెయిన్ అనే మహిళ అన్న మాటలివి. అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన ఆమె శనివారం అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన 338 విమానంలో న్యూయార్క్ సిటీ నుంచి షార్లెట్కు వచ్చారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఈ ప్రయాణం తనకు భయానక అనుభవం కలిగించిందని ఆమె ‘డైలీ మెయిల్’కు వెల్లడించారు. (కరోనా వైరస్: మరో దుర్వార్త) విమానం ప్రయాణికులతో కిక్కిరిసి ఉందని, ఎవరూ భౌతిక దూరం పాటించలేదని ఆమె వాపోయారు. కొంతమంది మాస్క్లు కూడా ధరించలేదని తెలిపారు. మిడిల్ సీటులో కూర్చున్న తనకు ఆరోగ్యం పట్ల ఆందోళన కలిగిందని చెప్పారు. ‘అసలు ఈ విమానం ఎందుకు ఎక్కానా అనిపించింది. నా చుట్టుపక్కల అంతా జనమే ఉన్నారు. ఎవరూ కూడా భౌతిక దూరం పాటించలేదు. తమకు తాముగా ఎవరూ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఎవరికైనా దగ్గు, తుమ్ము వస్తుందని తల తిప్పితే మనుషులు ఉన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఇలాంటి పరిస్థితిని చూసి నాకు ఏడుపు వచ్చింది. మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు ఇతరులకు హాని జరగకుండా మాస్క్ ధరించాలన్న కనీస విచక్షణ కూడా ప్రయాణికులకు లేకపోవడం బాధ కలిగించింద’ని ఎరిన్ స్ట్రెయిన్ పేర్కొన్నారు. విమానంలోని ఫొటోలు, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై అమెరికన్ ఎయిర్టైన్ స్పందించింది. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, వైద్యాధికారుల మార్గదర్శకాలకు అనుగుణంగా విమాన సర్వీసులను నడుపుతున్నామని తెలిపింది. విమానంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తున్నామని.. తమ సిబ్బంది గ్లోవ్స్, మాస్క్లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. తనకు ఎదురైన భయానక అనుభవం నేపథ్యంలో తిరుగు ప్రయాణం టిక్కెట్ను రద్దు చేసుకుంటానని ఎరిక్ స్ట్రెయిన్ చెప్పారు. కాగా, అమెరికాలో కరోనా విజృంభణ న్యూయార్క్లోనే అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే. న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 3 లక్షలకు చేరువలో ఉండగా, 17,303 మరణాలు సంభవించాయి. ఒక్క న్యూయార్క్ సిటీలోనే దాదాపు లక్షా 60 వేల కోవిడ్ కేసులు నమోదు కాగా, 12,287 మంది చనిపోయారు. కరోనా వ్యాక్సిన్: బిల్ గేట్స్ వ్యాఖ్యలు -
‘హృదయ విదారకం.. కన్నీళ్లు ఆగడం లేదు’
హృదయ విదారక సంఘటన. ఓ యువతి తన నిశ్చితార్థపు విషయాన్ని కిటికీ ద్వారా తన తాతతో పంచుకున్న తీరు ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బుధవారం సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారాయి. వివరాల్లోకి వెళితే... అమెరికాలోని నర్సింగ్ విద్యార్థిని కార్లీ బోయ్డ్ అనే యువతికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. నార్త్ కరోలినాలోని రీహాబిలిటేషన్ సెంటర్లో నివసిస్తున్న ఆమె తాత షెల్టాన్ మహాలా(87)తో ఈ విషయాన్ని కార్లీ పంచుకోవాలనుకుంది. కాగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రీహాబిలిటేషన్ సెంటర్ నిర్వహకులు ఆయనను కలుసుకునేందుకు అనుమతించలేదు. (కరోనా అలర్ట్ : మాస్క్లు, గ్లోవ్స్ కంటే ఇదే ముఖ్యం) దీంతో కార్లీ నేరుగా ఆ సెంటర్కు వెళ్లి తన తాత ఉండే గది వెనుకకు వెళ్లింది. అక్కడ ఉన్న అద్దం కిటికీ నుంచే తన నిశ్చితార్థపు ఉంగరం చూపిస్తూ భావోద్యేగానికి లోనయ్యింది. అలా కార్లీ అద్దంపై చేయి ఉంచగా.. ఆమె తాత కూడా చేతిని తాకుతున్నట్లుగా అద్దంపై చేయి ఉంచాడు. ఇక ఈ ఫొటోకు ఇప్పటి వరకూ 2 లక్షలకు పైగా లైక్లు రాగా వేలల్లో కామెంట్లు వచ్చాయి. ‘ఈ విషయాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు’ ‘ఈ సంఘటన చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు. వారి మధ్య ఉన్న అనుబంధం చూస్తుంటే ముచ్చటగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (కరోనా అసలైన మాత్ర.. ధైర్యం 500 ఎం.జి. ) ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అమెరికాలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వైరస్ సొకకుండా ఉండేందుకు ప్రభుత్వాలు ముందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ జనసముహాం ఉండకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు. అక్కడి నర్సింగ్ హోమ్స్, రిహబిటేషన్ సెంటర్లలో ఉన్న తమ వారిని కలిసేందుకు రోజుకు కొంత మందిని మాత్రమే అనుమతినిస్తున్నారు. -
అమెరికాను కుదిపేసిన తుపాను
లూయిస్విల్లే: అమెరికాను భారీ తుపాను వణికించింది. ఆ తుపాను ధాటికి అయిదుగురు మృతి చెందారు. దాదాపు 3 లక్షల ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈ తుపాను ఉత్తర కరోలినాలో భారీ ప్రభావం చూపింది. పెన్సిల్వేనియాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదాలు, వరదలు, వర్షం కారణంగా అయిదుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ వర్జీనియాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. చాలా చోట్ల పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉత్తర, దక్షిణ కరోలినా, వర్జీనియా, జార్జియాల్లో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. వాయు తీవ్రతకు చాలా చోట్ల చెట్లు విరిగిపడటంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అప్రమత్తంగా ఉండాలని తుపాను ప్రభావిత ప్రాంతాలోని ప్రజలను టెన్నెసీ లోయ ప్రాధికార సంస్థ కోరింది. మరోవైపు మంచు భారీగా కురుస్తుండటంతో అమెరికా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (చదవండి: విషాద ఛాయల మధ్య ఆనందోత్సవాలు..) -
లెమన్ ఎల్లో కుక్కపిల్లను చూశారా!
ఉత్తర కరోలీనాలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ పెంపుడు కుక్క లెమన్ ఎల్లో రంగు కుక్కపిల్లకు జన్మినిచ్చింది. నార్త్ కరోలినాకు చెందిన షానా స్టామీ అనే మహిళా తెల్లటి జర్మన్ షెపర్డ్ కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు జిప్సీ. ఈ క్రమంలో జిప్సీ గత శుక్రవారం ఉదయం 8 కుక్క పిల్లలకు జన్మినిచ్చింది. ఈ విషయాన్ని ఆ మహిళ బుధవారం ఫేస్బుక్లో షేర్చేశారు. ‘మా జర్మన్ వైట్ షెపర్డ్ బ్రైట్ గ్రీన్ కలర్ కుక్కపిల్లకు జన్మనిచ్చింది. పేరు హల్క్.. ప్రస్తుతం దీని వయసు 5 రోజుల’ అనే క్యాప్షన్తో షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ‘ దీంతో హల్కి ఫొటోలను చూసి నెటిజన్లంతా అశ్యర్యపోతూ ‘ఇట్స్ టైమ్ టూ మిస్టర్ లైమ్’, ‘వావ్ ఎంత ముద్దుగా ఉంది హల్క్. ఐ లవ్ హల్క్ కలర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు దీనిపై యాజమాని మాట్లాడుతూ.. జిప్సి శుక్రవారం ఎనిమిది కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో నాలుగవది నియాన్ గ్రీన్ కలర్లో జన్మించడంతో నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. హల్క్ నియాన్ రంగులో ఉన్నప్పటికీ మిగతా కుక్కపిల్లలాగే ఇది సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది’ అని చెప్పారు. ఇక హల్క్ రంగుపై వైద్య నిపుణులు మాట్లాడుతూ.. తల్లి కుక్క గర్బంతో ఉన్నప్పుడు గామా కిరణాలు పడకపోవడం వల్ల ఇలాంటి అరుదైన సంఘటనలు జరుగుతాయని తెలిపారు. గామా కిరణాలు తగలకపోతే గర్బధారణ సమయంలో కొన్ని ద్రవాలు విడుదల అవుతాయని, ఆ ద్రవాలు వివిధ రంగుల్లో ఉండటం వల్లే పుట్టే కుక్కిపల్లలు సాధారణ రంగులో కాకుండా భిన్నమైన రంగుల్లో జన్మిస్తాయన్నారు. అందువల్లే ‘హల్క్’ నియాన్ గ్రీన్లో జన్మించి ఉంటుందని నిపుణులు వివరణ ఇచ్చారు. Story tonight about a German Shepherd puppy born green just days ago in Canton. Animal experts say it happens from time to time, staining from birth fluids and not harmful, fades away. This pup's human family named him "Hulk. " More at 6. @WLOS_13 #LiveOnWLOS pic.twitter.com/7ex4i2wbOI — Rex Hodge (@RexHodge_WLOS) 15 January 2020 -
దెబ్బకు జిమ్ వదిలి పారిపోయారు..
వాషింగ్టన్: పాఠశాల జిమ్లో సరదాగా గడుపుతున్న విద్యార్థులను తుఫాను హడలెత్తించింది. తుఫాన్ ధాటికి గోడలు బద్దలు కావడంతో భయంతో వారంతా పరుగులు తీశారు. ఈ ఘటన సోమవారం నార్త్ కరోలినాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఘటన జరిగిన సమయంలో జిమ్లో దాదాపు పన్నెండు మంది విద్యార్థులు ఉన్నారని యూనియన్ ఇంటర్మీడియట్ స్కూల్ యాజమాన్యం తెలిపింది. తుఫాను సృష్టించిన బీభత్సంలో ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడినట్లు పేర్కొంది. ఇక నార్త్ కరోలినాలోని సాంప్సన్ కౌంటీలో తుఫాన్లు చెలరేగుతున్న క్రమంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తుఫాను ధాటికి భారీగా చెట్లు, భవనాలు నేలకూలుతున్నాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. 3 students were sent to the hospital after the roof of Union Intermediate School's gym in Sampson County, North Carolina, collapsed during a storm on Jan. 13. https://t.co/H0SEYmgmBa pic.twitter.com/uuWBlbylg1 — AccuWeather (@accuweather) January 15, 2020 -
అమెరికాలో కాల్పులు
విన్స్టన్సేలం: అమెరికాలోని నార్త్ కరొలినాలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. విన్స్టన్ సేలంలోని పబ్లిక్ వర్క్స్ భవనంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మరణించారని, మరో ఇద్దరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. కాల్పులకు పాల్పడిన వారి వివరాలను వెల్లడించలేదు. -
ఆ యాప్లో అసభ్యకర సందేశాలు!
క్రిస్మస్ పండుగ నేపథ్యంలో చిన్నపిల్లలను ఉద్దేశించి రూపొందించిన సాంటా క్లాస్ అనే మొబైల్ యాప్ అసభ్యకర సందేశాలను పంపిస్తోంది. పండుగ నేపథ్యంలో చిన్నపిల్లలను సర్ప్రైజ్ చేయడానికి తల్లిదండ్రులకు ఓ సాధనంగా ఉండేందుకు రూపొందించిన ఈ యాప్ వారికి లేని తలనొప్పిని తెచ్చిపెడుతోంది. నార్త్ కరోలినాకు చెందిన ఓ కుటుంబం ఈ యాప్ బారిన పడి తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ యాప్లో తన కూతురికి వచ్చిన అసభ్యకరమైన సందేశాన్ని చూసి అవాక్కైంది. అష్లే అడామ్స్ 8 ఏళ్ల కూతురు ఎంతో కుతూహలంగా ఐఓఎస్ యాప్ స్టోర్ ద్వారా ఈ సాంటా యాప్లోకి వెళ్లింది. ‘హాయ్’ అని టైప్ చేసింది. అయితే ఆ మెసేజ్కు బదులుగా వచ్చిన సందేశాన్ని చూసి నిర్ఘాంతపోయింది. హాయ్ మెసేజ్ సాంటా ఫీచర్స్ ‘నువ్వేం డ్రెస్ వేసుకున్నావ్’ అనే జుగుప్సాకరమైన సందేశాన్ని పంపించింది. ఈ సందేశం చూసి తాను షాక్ గురయ్యానని ఆ చిన్నారి తన స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలిపింది. వెంటనే ఆ మొబైల్ తీసుకొని పలు ప్రశ్నలతో యాప్ పరీక్షించిన అష్లే.. యాప్ తీరుపై పోలీసులతో పాటు యాపిల్ సంస్థకు ఫిర్యాదు చేశాడు. అయితే యాపిల్ కంపెనీ థర్డ్పార్టీ యాప్ అయిన సాంటాపై ఎలాంటి చర్యలు తీసుకుందనే విషయం తెలియరాలేదు. ఇక ఆ మధ్య అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ ఇలానే బూతులు తిడుతోందని అమెజాన్కు ఫిర్యాదు వచ్చిన విషయం తెలిసిందే. (చదవండి: అలెక్సా బూతులు తిడుతోంది!) -
యూఎస్లో కారు ప్రమాదం, టెకీ, కూతురు మృతి
సాక్షి, బెంగళూరు: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన తండ్రీ కుమార్తెలు మృత్యువాత పడ్డారు. బీదర్కు చెందిన టెక్కీ ముఖేశ్ శివాజీవార దేశ్ముఖ్ (27), ఆయన రెండేళ్ల కుమార్తె దివిజా రోడ్డు ప్రమాదంలో అసువులు బాసినట్లు ఇక్కడికి సమాచారం అందింది. బీదర్ జిల్లా భాల్కి తాలూకా కొంగళ్లికి చెందిన ముఖేశ్ అమెరికాలోని ఉత్తర కరోలినాలో ఐటీ ఇంజనీర్గా పని చేస్తున్నారు. శుక్రవారం తన సతీమణి మౌనిక, కుమార్తె దివిజాలతో కారులో వెళుతున్నారు. ముఖేశ్ కారును డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సమయంలో కారు అదుపు తప్పి ఓ ట్రక్ను ఢీ కొట్టడంతో తండ్రీకుమార్తెలు ఇద్దరూ అక్కడికక్కడే మరణించగా, మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చే విషయమై భారతీయ రాయబారి కార్యాలయంతో బీదర్ ఎంపీ భగవంత్ ఖోబా సంప్రదింపులు జరిపారు. -
అమెరికాలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతి
నార్త్ కరోలినా : అమెరికాలో నార్త్ కరోలినాలోని రాలేలో గుండెపోటుతో తెలుగు వ్యక్తి మృతిచెందాడు. నూకల జితేందర్ రెడ్డికి శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో డ్యూక్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే జితేందర్ రెడ్డి మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడికి భార్య కిరణ్, కుమారుడు రిషి ఉన్నారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు మృతి
-
అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి
నార్త్కరోలినా : అమెరికాలోని నార్త్ కరోలినాలో హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. రోడ్డు దాటుతుండటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. నల్లకుంటలోని పద్మ కాలానికి చెందిన బొంగుల సాహిత్ రెడ్డి ఎమ్ఎస్ చేసేందుకు అమెరికాకు వెళ్లాడు. అతడి హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృత దేహాన్ని ఇక్కడికి తరలించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని సాహిత్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : అమెరికాలో తెలుగు యువకుడు మృతి -
‘పరుగెత్తండి..దాక్కోండి..ఫైట్ చేయండి’
నార్త్ కరోలినా : అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీలో కాల్పులు కలకలం సృష్టించాయి. చార్లెట్ క్యాంపస్లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అకడమిక్ ఇయర్ ముగింపు రోజే యూనివర్సిటీలో ఈ ఘటన చోటుసుకుంది. ఇందుకు బాధ్యుడిగా భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో పోలీసులకు సమాచారమివ్వడంతో పాటుగా.. విద్యార్థులను వెంటనే అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘పరుగెత్తండి, దాక్కోండి, ఫైట్ చేయండి. మిమ్మల్ని కాపాడుకోండి. క్యాంపస్లో కాల్పులు జరిగినందు వల్ల పోలీసులు అన్ని బిల్డింగ్లలో దుండగుడి కోసం అన్వేషిస్తున్నారు’ అంటూ క్యాంపస్ ఎమర్జెన్సీ ఆఫీస్ ట్వీట్ చేసింది. ఈ విషయం గురించి ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ‘నాతో పాటు మరో 30 మంది ఫిల్మ్ క్లాసులో ఉన్నాం. అప్పుడు ఓ విద్యార్థి పరిగెత్తుకు వచ్చి క్యాంపస్లో కాల్పులు జరుగుతున్నాయని చెప్పాడు. అసలు ఏమవుతుందో అర్థం కాలేదు. షాక్ అయ్యాను. వెంటనే అప్రమత్తమై మేమందరం లోపల నుంచి లాక్చేసుకున్నాం. ఇక అప్పటి నుంచి ప్రతీ ఐదు నిమిషాలకు నా తల్లిదండ్రులకు మెసేజ్ చేస్తూనే ఉన్నాను. దాదాపు రాత్రి ఎనిమిది గంటల సమయంలో మమ్మల్ని గది నుంచి బయటికి రావాల్సిందిగా చెప్పారు భయానక అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు యూఎన్సీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ హ్యారీ స్మిత్ పేర్కొన్నారు. చార్లెట్లో క్యాంపస్లో చోటుచేసుకున్న ఈ హింస తమను తీవ్రంగా కలచివేసిందని, మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
నార్త్ కెరోలినాలో ‘యాత్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్
నార్త్కెరోలినా : దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ’యాత్ర’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మళయాళ మెగా స్టార్ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటించారు. వైఎస్సార్సీపీ రాలీ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏంతో ఆర్భాటంగా జరిగింది. యాత్ర సినిమా శ్రేయోభిలాషులు, వైఎస్ఆర్ అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఎంతో మంది వైఎస్సార్ అభిమానులు హాజరైన ఈ ఈవెంట్లో ఆయన చేపట్టిన ఎన్నో మంచి కార్యక్రమాలు, అంకురార్పణం చేసిన పధకాల గురించి వివరించారు. భారతదేశంలో జరుగుతున్న ‘యాత్ర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హజరు కాలేక పోతున్నామన్న వెలితిని ఇక్కడ ప్రవాస ఆంధ్రులు తమ శైలిలో ఈవెంట్ను ఆర్గనైజ్ చేసి తమ ప్రియతమ నాయకుడు స్వర్గీయ డా|| వై ఎస్ రాజశేఖర్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అభిమానులు యాత్ర టీషర్ట్స్ వేసుకుని తమ వంతు ఉడతా భక్తిని తెలియజేసారు. అభిమానులందరు జై వైఎస్ఆ ర్జై జగన్అని నినాదాలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఈరోజే (ఫిబ్రవరి 8) విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకుంది. రిలీజైన అన్ని చోట్లా సందడి వాతావరణం నెలకొంది. -
కారు బోల్తా.. భారతసంతతి మహిళ మృతి
నార్త్ కరోలినా : అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో భారతసంతతికి చెందిన ఓ మహిళ మృతిచెందారు. మిస్సోరీ స్టేట్ హైవే పెట్రోల్ పోలీసుల కథనం ప్రకారం.. మిన్నెసొటాలోని ఎడెన్ ప్రైరీకి చెందిన బాబు సెల్వం తన భార్య, కూతురుతో కలిసి నిస్సాన్ రోగ్ కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అతివేగంగా నడపడం వల్ల కారు అదుపుతప్పి ఎమర్జెన్సీ క్రాస్ ఓవర్ను ఢీకొట్టి గాల్లో ఎగిరి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో బాబు సెల్వం భార్య రమ్యభారతి మోహన్(34) మృతిచెందారు. సీటు బెల్టు ధరించకపోవడం వల్ల పల్టీలు కొడుతున్న కారులో నుంచి బయట పడటంతో అక్కడికక్కడే ఆమె మృతిచెందారు. కెమెరూన్కు 11 మైళ్ల దూరంలోని డేవీస్ కౌంటీలో ఇంటర్స్టేట్ 35 (ఐ-35) జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్వల్పగాయాలైన తియారా(1)ను కాన్సాస్లోని చిల్డ్రన్స్ మెర్సీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. -
కొడుకును కాపాడాలనుకుంది.. కానీ
నార్త్ కరోలినా : అమెరికాలో బీభత్సం సృష్టించిన ఫ్లోరెన్స్ హారికేన్ దాటి నుంచి కొడుకును రక్షించుకోలేక పోయిన ఓ తల్లిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తుపాను కొనసాగుతున్న సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించి చిన్నారి ప్రాణాలు తీసిందనే కారణంతో ఆమెపై అభియోగాలు నమోదు చేశారు. ఈ ఘటన ఉత్తర కరోలినాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తర రోలినాకు చెందిన దజియా లీ చార్లెట్ అనే మహిళ తన ఏడాది కొడుకుతో పాటు అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు కారులో బయల్దేరింది. అయితే ఆ సమయంలో హారికేన్ ప్రభావం తీవ్రంగా ఉందని హెచ్చరించినా వినకుండా మూసి ఉన్న రహదారి గుండా కారును పోనిచ్చింది. ఈ క్రమంలో వరద ఉధృతి తీవ్రమవడంతో ఓ చోట కారును నిలిపివేసింది. అక్కడి నుంచి బయటపడే క్రమంలో తన చిన్నారిని ఎత్తుకుని కారులో నుంచి దిగింది. కానీ ప్రమాదవశాత్తు ఈ ఆ చిన్నారి వరదలో పడి కొట్టుకుపోయాడు. మరుసటి రోజు చిన్నారి శవాన్ని పోలీసులు వెలికితీశారు. సెప్టెంబరు 16న జరిగిన ఈ ఘటనలో చార్లెట్కు 16 నెలల శిక్ష విధించే అవకాశం ఉందని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ యూనియన్ కంట్రీ షెరిఫ్ ఆఫీస్ అధికారులు పేర్కొన్నారు. (అమెరికాలో ఫ్లోరెన్స్ విధ్వంసం) కాగా చార్లెట్పై కేసు నమోదు చేయడంపై ఆఫ్రికన్ అమెరికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తన బిడ్డను కాపాడుకునే క్రమంలో దురదృష్టవశాత్తు అతడు ప్రాణాలు కోల్పోతే..తప్పంతా ఆమెదేనన్నట్లు ప్రచారం చేయడం, శిక్ష పడేలా చూస్తామనడం నల్లజాతీయుల పట్ల వివక్షకు నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. బిడ్డ ప్రాణాలతో చెలగాటమాడిన ఆ మహిళకు తగిన శాస్తి జరిగిందని, అమెరికా చట్టాలు ఇటువంటి విషయాల్లో ఎవరినీ ఉపేక్షించవని మరికొందరు చార్లెట్ను వ్యతిరేకిస్తున్నారు. -
మంచినీళ్లు ఇచ్చినందుకే రూ.7 లక్షలా!!
హోటల్కి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించడం.. వారి నుంచి ఆర్డర్ తీసుకోవడం... తర్వాత బిల్ ఇవ్వడం.. తమ సేవలను మెచ్చి టిప్ ఇస్తే తీసుకోవడం.. ఇవీ సాధారణంగా హోటల్ బేరర్ల పనులు. నార్త్ కరోలినాకు చెందిన అలియానా కస్టర్ కూడా ఇవే పనులు చేసింది. అయితే బిల్తో పాటు తనకు వచ్చిన టిప్ చూసి షాకవ్వడం ఆమె వంతైంది. ఎందుకంటే.. ఆమెకు టిప్గా లభించింది పదో పరకో కాదు ఏకంగా 10 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 7 లక్షల 38 వేల రూపాయలు. ఇంతకీ అంత విశాలమైన హృదయం ఉన్న ఆ కస్టమర్కి అలియానా సర్వ్ చేసింది కేవలం రెండు గ్లాసుల మంచినీళ్లే. అవును కేవలం మంచినీళ్లు తాగి హోటల్ను వీడిన ఆ కస్టమర్.. ‘రుచికరమైన నీళ్లు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు’ అంటూ ఓ పేపర్పై రాసి అలియానాను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతేకాదు మళ్లీ కాసేపటి తర్వాత తన సిబ్బందితో సహా తిరిగి వచ్చి అలియాకు ఓ హగ్ కూడా ఇచ్చి వెళ్లాడు. తనకు ఇన్ని స్వీట్ షాకులిచ్చిన ఆ కస్టమర్ యూట్యూబ్ స్టార్ మిస్టర్ బీస్ట్ అని తెలుసుకున్న అలియానా ఆనందంతో ఎగిరి గంతేసింది. సుమారు 8.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్న బీస్ట్, అలియానా భావోద్వేగాలను కూడా తన కెమెరాలో బంధించి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. దీంతో.. తన జీవితంలో ఇదో మరపురాని సంఘటన అంటూ మురిసిపోయింది అలియానా. ఇక బీస్ట్ ఇచ్చిన టిప్తో తనతో పాటు పనిచేసే, ఆర్థిక ఇబ్బంది వల్ల చదువు ఆపేసిన విద్యార్థులకు తన వంతు సాయం చేస్తానంటూ పెద్ద మనసు చాటుకుంది. -
అమెరికాలో తెలుగు టెకీ మృతి
సాక్షి, కంచికచర్ల: కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టెముక్కల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోగినేని నాగార్జున అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ అమెరికాలో ప్రమాదవశాత్తు మృతి చెందారు. విహారయాత్రలో భాగంగా నార్త్ కరోలినా ప్రాంతంలోని ఓ జలపాతంలో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందారు. ఈ విషయాన్ని నాగార్జున మిత్రులు, అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నాగార్జున మరణంతో ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతుడు నాగార్జున తండ్రి 7 సంవత్సరాల క్రితం మరణించారు. సోదరుడు యశ్వంత్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నారు. నాగార్జున చెల్లి పూజితకు వివాహం కాగా విజయవాడలో నివాసం ఉంటున్నారు. ఉన్నత చదువుల కోసం 10 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళి అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. తల్లి రాజేశ్వరి విజయవాడలో కూతురు వద్ద ఉంటున్నారు. -
సొంత కూతురినే పెళ్లి చేస్కొని..
లిట్చ్ఫీల్డ్ కౌంటీ : కన్న కూతురినే వివాహం చేస్కొని.. ఆమెతో కొడుకుని సైతం కన్నాడు ఓ వ్యక్తి. ఆమెపై అనుమానం పెంచుకుని ఆమెను-కొడుకును చంపేశాడు. చివరకు తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నార్త్ కరోలినాకు చెందిన స్టీవెన్ ప్లాదల్(42) తన కూతురు క్యాటీ(20)ని చిన్నతనంలోనే న్యూయార్క్కు చెందిన ఆంటోనీ ఫస్కో అనే వ్యక్తికి దత్తత ఇచ్చేశాడు. అయితే స్టీవెన్ మాత్రం గత కొన్నేళ్లుగా కూతురితోనే సంబంధం నెరుపుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో వీరికి వివాహం కాగా.. ఓ కొడుకు కూడా జన్మించాడు. చివరకు పెంపుడు తండ్రి వీరిద్దరి బంధానికి అడ్డుచెప్పటంతో.. క్యాటీ స్టీవెన్కు బ్రేకప్ చెప్పేసింది. అయితే స్టీవెన్ మాత్రం ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందేమోనన్న అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వాళ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. కొడుకు బెన్నెట్ను స్టీవెన్ చంపేశాడు. అనంతరం క్యాటీ, ఆమె పెంపుడు తండ్రి ఆంటోనీని ఓ ట్రక్కులో కొంత దూరం తీసుకెళ్లి కాల్చి చంపాడు. ఘటన తర్వాత పారిపోయిన స్టీవెన్ తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు స్టీవెన్ తన తల్లికి పూర్తి సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. న్యూమిల్ఫోర్డ్ సమీపంలోని ఓ ట్రక్కులో వీరిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. లిట్చ్ఫీల్డ్ కౌంటీలో స్టీవెన్ మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. స్టీవెన్ భార్య విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నట్లు సమాచారం. -
అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
-
అమెరికాలో తెలుగు విద్యార్థి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్ : సరదాగా బోటింగ్ కోసం వెళ్లిన అతడిని మృత్యువు కబళించింది. తీవ్ర విషాదాన్ని మిగిల్చిన ఈ సంఘటన అమెరికాలోని నార్త్ కరోలినా క్యారీలో చోటుచేసుకుంది. ఏపీకి చెందిన దేవినేని రాహుల్ (19) తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో నివాసం ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి సరదాగా బోటింగ్ కు వెళ్లాడు. అయితే ప్రమాదశావత్తు పడవ మునిగిపోవడంతో రాహుల్, అతని స్నేహితుడు నదిలో పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో రాహుల్ మృతి చెందగా, అతని స్నేహితుడు గాయపడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
బిల్లీ గ్రాహమ్ కన్నుమూత
మాంట్రీ(యూఎస్): విఖ్యాత క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రచారకర్త బిల్లీ గ్రాహమ్ కన్ను మూశారు. ఆయన వయసు 99 ఏళ్లు. గత కొన్నేళ్లుగా ప్రొస్టేట్ కేన్సర్, న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉత్తర కరోలినాలోని తన స్వగృహంలో మృతిచెందారు. అమెరికాలో ఉదారవాద ప్రొటెస్టాంట్లు, రోమన్ కేథలిక్లకు పోటీగా మత ప్రచార కార్యక్రమాలను ఆయన ఒక ఉద్యమంలా నిర్వహించారు. 185కు పైగా దేశాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించి సంప్రదాయ క్రైస్తవుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. కమ్యూనిస్టుల పాలనలోని క్రైస్తవులకు కూడా ఆశా కిరణం గా నిలిచారు. మత బోధనల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందికి చేరువైంది గ్రాహమే అంటే అతిశయోక్తి కాదు. ‘అమెరికా పాస్టర్’గా పేరొందిన గ్రాహమ్.. ఐసన్హోవర్ నుంచి జార్జి డబ్ల్యూ బుష్ వరకు పలువురు అమెరికా అధ్యక్షులకు ఆధ్యాత్మిక సలహాదారుగా, సన్నిహితుడిగా వ్యవహరించారు. బహిరంగ ప్రార్థనలే కాకుండా టీవీలు, రేడియోల ద్వారా కూడా గ్రాహమ్ మిలియన్ల కొద్ది అభిమానులను సంపాదించుకున్నారు. గ్రాహమ్ మృతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతాపం తెలిపారు. 21 కోట్ల మందికి ప్రసంగం 2005లో న్యూయార్క్ పట్టణంలో నిర్వహించిన తన చివరి ప్రార్థనలో ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల మందిని ఉద్దేశించి ప్రసంగించి రికార్డు సృష్టించారు. అయనలా మరో ఎవాంజలిస్ట్ ఇలాంటి బృహత్తర కార్యక్రమం తలపెట్టే అవకాశాలు దాదాపు అసాధ్యమే. 1983లో అప్పటి అధ్యక్షుడు రీగన్ నుంచి గ్రాహమ్ అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ను అందుకున్నారు. గ్రాహమ్ 1918, నవంబర్ 7న చార్లెట్లో సంప్రదాయ క్రైస్తవుల కుటుంబంలో జన్మించారు. కాలేజీలో చదువుతుండగా చైనాకు చెందిన రూత్ బెల్ అనే యువతితో పరిచయమైంది. 1943లో వారు వివాహం చేసుకున్నారు. -
రోడ్డును చీల్చుకొని వచ్చినట్లుంది కదా..!
-
రోడ్డును చీల్చుకొని వచ్చినట్లుంది కదా..!
న్యూయార్క్ : అమెరికాలో విపరీతంగా ఉన్న చలి జనాలనేకాదు.. జంతుజాలాన్ని సైతం బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా ఉత్తర కరోలినాలో గత వారం వాతావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకొని మునుపెన్నడూ లేనంత భయంకరంగా కనిపిస్తోంది. తీవ్రమైన చలి ధాటికి అక్కడి వాగులు, వంకలు, చిన్నచిన్న నీటి జలాశయాలు గడ్డకట్టుకుపోయాయి. పార్క్లల్లో ఏర్పాటు చేసిన నీటి గుంటలు కూడా గడ్డకట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో జంతువులు నరకం చూశాయి. అందుకు సాక్ష్యంమిచ్చేలా ఓ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా మొసళ్లు 40 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉండే నీటిలో జీవిస్తాయి. కానీ, విపరీతమైన చలికారణంగా గడ్డ కట్టుకుపోయిన స్వామ్ పార్క్లోని ఓ నీటి గుంటలో మొసళ్లన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రాణాలను రక్షించుకునేందుకు తమ బాడీ మొత్తం నీటిలో పెట్టి కేవలం శాసేంద్రియాలు బయటకు ఉండేలా తలపైకెత్తి రక్షించండి మహాప్రభో అన్నట్లుగా చూస్తున్నాయి. ఆ నీటి గుంటల్లో కేవలం అవి తల పైకి పెట్టిన చోట తప్ప మిగితా మొత్తం కూడా గాజు ఫలకలా నీరు గడ్డకట్టుకుపోయింది. వాటి పరిస్థితి ఏమిటో చూడాలంటే ఈ వీడియో చూడాల్సిందే.. -
అమెరికాపై సైక్లోన్ ‘బాంబ్’
న్యూయార్క్: అమెరికాపై మరో తుపాను విరుచుకుపడింది. ఆ దేశ తూర్పు తీరాన్ని తాకిన ‘బాంబ్ సైక్లోన్’ ధాటికి ఇప్పటి వరకు డజను మందికి పైగా చనిపోయినట్లు భావిస్తున్నారు. ఉత్తర కరోలినాలో ట్రక్కు ఓ బ్రిడ్జిపై నుంచి జారి ఓ కొండపై పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందినట్లు తెలిసింది. ఉత్తర, దక్షిణ కరోలినా, బోస్టన్, ఉత్తర ఫ్లోరిడా, న్యూయార్క్, వాషింగ్టన్, వర్జీనియాల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంది. చాలా ప్రాంతాల్లో మంచు తుపాను లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈదురు గాలులు, భారీ వర్షాలకు తోడు ఉష్ణోగ్రతలు మైనస్ స్థాయికి పడిపోవడంతో మంచుతో కప్పి ఉన్న రోడ్లపై ప్రయాణం కష్టమవుతోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు, శీతల పవనాలు ఈ వారమంతా కొనసాగే అవకాశాలున్నట్లు అమెరికా జాతీయ వాతావరణ సంస్థ వెల్లడించింది. వీధుల వెంట మంచు పేరుకుపోవడంతో స్కూళ్లను మూసివేయడంతో పాటు పలు విమాన సర్వీసులను రద్దుచేశారు. న్యూయార్క్లోని రెండు ప్రధాన రన్వేలను మూసివేశారు. నయాగరా జలపాతం దాదాపుగా గడ్డకట్టుకుపోయింది. న్యూయార్క్లో అత్యవసర పరిస్థితి... తుపాను ప్రభావం విద్యుత్, టెలీ కమ్యూనికేషన్లపై కూడా పడింది. వర్జీనియా, ఉత్తర కరోలినాలో ప్రజలకు విద్యుత్ ఇక్కట్లు తప్పలేదు. బోస్టన్ తీరంలో వరదల పరిస్థితిని మసాచుసెట్స్ గవర్నర్ చార్లి బేకర్ తీవ్రమైనదిగా పేర్కొన్నారు. న్యూయార్క్లో ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించి, 500 మంది సిబ్బందితో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఉత్తర ఫ్లోరిడా, సౌత్ ఈస్టర్న్ జార్జియాలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాబోయే రోజుల్లో న్యూయార్క్, బోస్టన్లలో అడుగు కన్నా ఎక్కువ ఎత్తులో మంచు పేరుకుపోవొచ్చని అంచనా వేస్తున్నారు. లాంగ్ ఐలాండ్, సౌత్ ఈస్టర్న్ కనెక్టికట్లలో గంటకు 88.5 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 29 డిగ్రీలకు పడిపోయే అవకాశముంది. వర్జీనియా తీరం వెంట వాషింగ్టన్, న్యూపోర్ట్ న్యూస్ల మధ్య రైలు సేవలను నిలిపివేశారు. బాంబ్ సైక్లోన్ అంటే.. ఇలాంటి తుపాన్ల సాంకేతిక నామం బాంబోజెనెసిస్ కాగా, సాధారణంగా ‘బాంబ్ సైక్లోన్’ అని పిలుస్తారు. వాతావరణ పీడనం ఒక్కరోజు వ్యవధిలోనే కనీసం 24 మిల్లీబార్లకు పడిపోయి హరికేన్ లాంటి పెను గాలులకు దారితీసే వాతావరణ మార్పులనే బాంబోజెనెసిస్గా పరిగణిస్తారు. ఉపగ్రహ ఛాయాచిత్రం -
కలలో భార్యను చంపేశాడు.. కానీ!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ వ్యక్తి చాలా విచిత్రంగా తన భార్యను హత్య చేశాడు. అయితే తాను మాత్రం కలలో భార్యను హత్య చేసి ఉండొచ్చునంటూ కథలు అల్లాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఆ వివరాలిలా.. నార్త్ కరోలినాకు చెందిన మాథ్యూ జేమ్స్ ఫెల్ప్స్ కు గతేడాది నవంబర్లో లారేన్ ఫెల్ప్స్ (29)తో వివాహం జరిగింది. గత శుక్రవారం అర్ధారత్రి ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసిన జేమ్స్.. తన భార్యను హత్య చేసినట్లుగా అనిపిస్తుందని అక్కడికి రావాలని దాదాపు ఆరు నిమిషాలు ఫోన్లో మాట్లాడాడు. అనంతరం ఎమర్జెన్సీ సర్వీస్ అధికారులతో పాటు పోలీసులు అక్కడికి వచ్చి లారెన్ మృతిచెందినట్లు నిర్ధారించారు. అనంతరం జేమ్స్ను అరెస్ట్ చేసి వేక్ కౌంటీ జైలులో హాజరు పరిచారు. పోలీసుల విచారణలో జేమ్స్ పలు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు. దగ్గు సమస్యతో ఉన్న తాను కొరిసిడిన్ టాబ్లెట్ వేసుకుని నిద్రపోయానని కొన్ని గంటల తర్వాత మెలకువ వచ్చి లైట్ ఆన్ చేసినట్లు చెప్పాడు. బెడ్ మీద రక్తపు మరకులున్నాయని, పక్కనే కత్తి ఉందని, తన భార్య లారేన్ రక్తపు మడుగులో పడి ఉందని విచారణలో వెల్లడించాడు. భార్య అంటే తనకు చాలా ఇష్టమని, ఆమెను హత్య చేయాల్సిన అవసరం లేదన్నాడు. టాబ్లెట్ డోస్ ఎక్కువైందని, దాని ప్రభావం వల్ల తనకు తెలియకుండా కలలోనే భార్యను హత్య చేసి ఉండొచ్చునని, ఇదే విషయాన్ని ఎమర్జెన్సీ సర్వీస్కు కాల్ చేసి చెప్పినట్లు వివరించాడు. ఉద్దేశపూర్వకంగా భార్యను హత్యచేసి జేమ్స్ కట్టుకథలు చెబుతున్నాడని పోలీసులు వివరించారు. -
షార్క్ తోక పట్టుకులాగాడు.. అంతే!
దారి తప్పి బీచ్ తీరానికి వచ్చిన చిన్న టైగర్ షార్క్ చేపను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. తోక పట్టుకునేందుకు ప్రయత్నించిన అతని చేతిని షార్క్ కొరికేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటన నార్త్ కరోలినాలోని వ్రైట్స్విల్లే బీచ్లో చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులు టైగర్ షార్క్ను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. దారి తప్పి లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలోకి వచ్చిందో టైగర్ షార్క్ చేప పిల్ల. తిరిగి లోతు ప్రాంతానికి వెళ్లడానికి యత్నిస్తున్న దాన్ని చూసిన ఇద్దరు స్నేహితులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. నడుము లోతు ఉన్న నీటిలోకి దిగి షార్క్ తోక పట్టుకున్నాడు ఇద్దరి స్నేహితుల్లో ఒక వ్యక్తి. అంతే ఒక్కసారిగా వెనక్కు మళ్లిన షార్క్ అతని చేతిని కొరికేసింది. దీంతో అతని చేతికి తీవ్రగాయమై రక్తం స్రావం కావడం మొదలైంది. ఉబికి వస్తున్న రక్తాన్ని మరో చేత్తో అదిమి పట్టుకున్న వ్యక్తి ఒడ్డుకు పరుగెత్తాడు. ఆ తర్వాత ఎలాగో షార్క్ను పట్టుకుని తిరిగి సముద్రంలోకి వదిలేశారని తెలిసింది. గాయాలైన వ్యక్తి పరిస్ధితి ఎలా ఉందనే విషయంపై సమాచారం లేదు. -
అమెరికాలో తెలుగు ఇంజనీర్ దుర్మరణం
రాలీ: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు ప్రదీప్ దుర్మరణం చెందారు. భార్యతో కలిసి ప్రయాణిస్తుండగా మినీ బస్సు ప్రమాదానికి గురికావడంతో ప్రదీప్ అక్కడిక్కడే మృతిచెందారు. నార్త్కరోలీనాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ప్రమాదంలో ప్రదీప్ భార్య కార్తీకతోపాటు మరికొందరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. వీరికి ఏడాది కిందటే వివాహమైంది. భువనగిరికి చెందిన ప్రదీప్ ఎనిమిదేళ్ల కిందటే అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డారు. ఏడాది కిందటే భువనగరికే చెందిన అమ్మాయితో అతనికి వివాహమైంది. అనంతరం భార్యను కూడా అమెరికా తీసుకెళ్లాడు. తన పుట్టినరోజు వేడుకలు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ప్రదీప్ అనూహ్యంగా చనిపోయారు. మృతుడు భువనగిరి మాజీ కౌన్సిలర్ మురళి కుమారుడు. మరణవార్త తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
అల్లరికి భయపడి... పిల్లలకు నో ఎంట్రీ!
ఇది ఒక ఇటాలియన్ రెస్టారెంట్.. నార్త్ కరోలినాలోని మూరెస్విల్లీలో ఉండే ఈ రెస్టారెంట్ ఎప్పుడూ కస్టమర్లతోకిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటి ఈ రెస్టారెంట్ ఇటీవల ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ఐదేళ్ల చిన్నారులను అనుమతించకపోవడం.. ఈ కఠిననిర్ణయంపై నెటిజన్లు సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. అయినప్పటికీ తాను తీసుకున్న నిర్ణయం తర్వాత వ్యాపారం మరింత అభివృద్ధి అయిందని ఆ రెస్టారెంట్ యజమాని నెటిజన్ల విమర్శలను కొట్టిపారేస్తున్నాడు. అసలు సంగతేంటంటే.. రెస్టారెంట్లోకి తల్లిదండ్రులు చిన్నపిల్లలను తీసుకురావడం.. అక్కడ వాళ్ల అల్లరి మితిమీరిపోవడం.. తద్వారా పక్కవారికి చాలా డిస్ట్రబ్ అవడం క్రమంగా జరుగుతోందట! కొన్నిసార్లు వాళ్ల అల్లరి శృతిమించి తోటి కస్టమర్లు యజమానికి ఫిర్యాదులు కూడా చేశారంటా.. దీంతో చేసేదేమీ లేక రెస్టారెంట్ యజమాని తాను నష్టపోయినా ఫర్వాలేదు... రెస్టారెంట్కున్న మంచి పేరు చెడకూడదని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఐదేళ్ల లోపు చిన్నారులకు తన రెస్టారెంట్లో అనుమతి లేదని బోర్డు పెట్టేశాడు. అయితే విభిన్నంగా అప్పటినుంచి రెస్టారెంట్కు వచ్చే వినియోగదారుల సంఖ్య మరింత పెరగడంతో తాను తీసుకున్న నిర్ణయం పొరపాటేమీ కాదని సదరు యజమాని సంబరపడిపోతున్నాడు. -
దొంగనుకుని భార్యను కాల్చేశాడు
వాషింగ్టన్: అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన భార్యను దొంగ అనుకుని భర్త తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ కరోలినాలోని గోల్డ్స్బరోలో గినా విలియమ్స్(48), బిల్లీ విలియమ్స్(49)లు నివసిస్తున్నారు. కాగా, గినా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఘటన జరిగిన రోజు నైట్ షిఫ్ట్ కావడంతో గురువారం సాయంత్రమే కార్యాలయానికి వెళ్లింది. మరుసటి రోజే ఆమె తిరిగి వస్తుందని భావించిన బిల్లీ ఇంట్లోకి ఎవరో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండటంతో అప్రమత్తమయ్యాడు. దొంగ భావించిన బిల్లీ తుపాకీతో వ్యక్తి మెడ భాగంలో కాల్చాడు. దీంతో బుల్లెట్ గాయమైన గినా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాగా బిల్లీపై ఇంకా ఎలాంటి కేసు నమోదు కాలేదు. పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు. -
స్కూల్లో షాకింగ్ సంఘటన
రోల్స్విల్లె: అమెరికాలో నార్త్ కరోలినాలోని రోల్స్విల్లె హైస్కూల్లో ఇద్దరు బాలికల మధ్య ఏర్పడ్డ చిన్న వివాదం పెద్ద దుమారం రేపింది. ఇద్దరు విద్యార్థుల మధ్య మాటామాట పెరిగి గొడవ పెద్దదయ్యింది. ఇద్దరూ కలియబడి కొట్టుకుని కిందపడ్డారు. ఈ తతంగాన్ని మరో అమ్మాయి తన సెల్ఫోన్తో వీడియా తీసింది. ఇంతలో ఓ పోలీస్ అధికారి వచ్చి ఓ అమ్మాయిని పైకెత్తి నేలపైన బంతిలా విసిరికొట్టాడు. దీంతో ఆ అమ్మాయి అక్కడే పడిపోయింది. బాధతో ఏడుస్తూ విలవిలలాడిపోయింది. పోలీస్ అధికారి ఆ అమ్మాయిని అక్కడి నుంచి లాక్కెళ్లిపోయాడు. మొత్తం ఎపిసోడ్ను వీడియో తీసిన అమ్మాయి దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది వైరల్ కావడం, పోలీసు అధికారిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. సంబంధిత అధికారి రూబెన్ డి లాస్ శాంటోస్ను లీవ్పై పంపారు. కాగా అమ్మాయిల మధ్య వివాదం ఏర్పడటానికి కారణం ఏంటి, వారి వివరాలు తెలియరాలేదు. -
ట్రంప్ పార్టీ కార్యాలయంపై బాంబు దాడి
వాషింగ్టన్: మరో 22 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో 'రాజకీయ ఉగ్రవాదం'గా పరిగణిస్తోన్న దుశ్చర్య అమెరికాలో కలకలం రేపింది. అధ్యక్ష స్థానం కోసం పోటీపడుతోన్న డోనాల్డ్ ట్రంప్ ప్రాతినిథ్యం వహిస్తోన్న రిపబ్లికన్ పార్టీ కార్యాలయంపై శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు బాంబు దాడి చేశారు. ఉత్తర కరోలినాలోని రిపబ్లికన్ పార్టీ ఆఫీసుపై గుర్తు తెలియని దుండగులు బాంబు దాడి జరిపారని, కిటికీ గుండా ఆఫీసులోపలికి బాంబులు విరిసారని, పేలుడు ధాటికి ఆఫీసులోని ఫర్నీచర్ తోపాటు ప్రచార సామాగ్రి కూడా కాలిపోయిందని ప్రకటించిన పోలీసులు.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఘటనా స్థలానికి అతి సమీపంలోని ఓ మూసి ఉన్న షెట్టర్ పై 'నాజీ రిపబ్లికన్లారా.. ఇక్కడి నుంచి వెళ్లిపొండి. లేకుంటే..' అని రాసిఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ ఘటనను రిపబ్లికన్ పార్టీ 'రాజకీయ ఉగ్రవాదం'గా అభివర్ణించింది. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకేసి 'హిల్లరీని సమర్థిస్తున్న జంతువులే ఈ ఘాతుకానికి ఒడిగట్టాయి'అని అన్నారు. ఈ చర్యను అమెరికా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొన్న నార్త్ కరొలినా గవర్నర్ పాట్ మెక్ క్రోరీ.. ఎన్నికల్లో హింసకు తావులేదని, ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించానని తెలిపారు. మరోవైపు డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సైతం రిపబ్లికన్ పార్టీ ఆఫీసుపై బాంబు దాడిని ఖండించారు. ఈ భయానక దాడిలో ప్రాణనష్టం జరగనందుకు సంతోషిస్తున్నానంటూ హిల్లరీ ఆదివారం ట్విట్టర్ లో పేర్కొన్నారు. రిపబ్లికన్ ఆఫీసుపై దాడిని మరింత రాజకీయం చేస్తూ ఆ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆదివారం వరుసగా ట్వీట్లు చేశారు. ఎన్నికల్లో కీలకమైన ఉత్తర కరొలినాలో హిల్లరీకి గట్టి పోటీ ఇస్తున్నందుకే తమపై ఇలాంటి దాడి జరిగిందని, కొన్ని జంతువులు ఆమె తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాయని ట్రంప్ అన్నారు. రిపబ్లికన్ పార్టీ గెలవబోతోందన్న అక్కసుతోనే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని, బాంబు దాడి ఘటనను ఎన్నటికీ మర్చిపోమని, అక్కడ తమ గెలుపు ఖాయమైందని ట్రంప్ పేర్కొన్నారు. -
అమెరికా నగరంలో ఎమర్జెన్సీ
షార్లట్: అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రంలో ఉన్న షార్లట్ నగరంలో అత్యవసర పరిస్థితి విధించారు. పోలీసు కాల్పుల్లో నల్లజాతీయుడి మృతి చెందడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. మంగళవారం పోలీసు అధికారి బ్రింట్లీ విన్సెంట్ జరిపిన కాల్పుల్లో 43ఏళ్ల కీత్ లామంట్ స్కాట్ మృతి చెందడంతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగారు. వరుసగా రెండో రోజు ఆందోళనలతో షార్లట్ అట్టుడికింది. దీంతో షార్లట్ తో పాటు పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో షార్లట్ నగరంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఉత్తర కరోలినా గవర్నర్ పాట్ మెక్ క్రోరీ ప్రకటించారు. ఆందోళనలను అదుపు చేసేందుకు అదనపు బలగాలను రంగంలోకి దించినట్టు తెలిపారు. ఆందోళనకారులు జరిపిన దాడుల్లో ఇప్పటివరకు ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. షార్లట్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చర్యలు చేపట్టామని మేయర్ జెన్నిఫర్ రాబర్ట్స్ తెలిపారు. ఆందోళనకారులు తమ ఇళ్లకు వెళ్లిపోవాలని, పోలీసు కాల్పుల ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపడతామని హామీయిచ్చారు. -
చెవిటివాడన్న కనికరం కూడా లేకుండా!
మియామి: అతను చెవిటి వ్యక్తి. సంకేత భాషలోనే ఎవరితోనైనా ముచ్చటిస్తాడు. వేగంగా వాహనాన్ని నడుపుతున్నాడనే సాకుతో అతన్ని ఓ జవాను వెంబడించాడు. ఇద్దరి మధ్య 13 కిలోమీటర్ల పాటు హోరాహోరీగా ఛేజింగ్ జరిగింది. చివరకు అతను తన ఇంటికి సమీపంలో వాహనాన్ని ఆపాడు. వాహనం దిగిన అతన్ని జవాను తుపాకీతో కాల్చాడు. సంఘటనా స్థలంలోనే అతను కుప్పకూలాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దుమారం రేపుతోంది. డానియెల్ హారిస్ అనే 29 ఏళ్ల చెవిటి వ్యక్తిని భద్రతాసిబ్బంది కాల్చిచంపడంపై ఇప్పుడు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నార్త్ కరోలినా రాష్ట్రంలోని చార్లెట్ లో సోమవారం ఈ ఘటన జరిగింది. అంతర్రాష్ట్ర హైవేపై వాహనంలో వేగంగా వెళుతున్న హారిస్ ను ఓ భద్రతా జవాను వెంబడించాడు. హారిస్ చార్లెట్ లోని తన ఇంటికి సమీపంలోకి వచ్చిన వాహనాన్ని నిలిపేసి కిందకు దిగాడు. అక్కడ జవానుతో జరిగిన వాగ్వాదం అనంతరం జవాను అతన్ని కాల్చిచంపినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే, చెవిటి వ్యక్తిని కనికరం లేకుండా జవాను కాల్చిచంపడంపై స్థానికంగా నిరసన వ్యక్తమవుతోంది. -
'వాడి తల్లినైనందుకు గర్వంగా ఉంది'
ఉత్తరకరోలినా: గుక్కపట్టి ఏడుస్తున్నాడనే కోపంతో ఓ తల్లి తన పసిబిడ్డను ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఈ ఘటన ఉత్తర కరోలినాలో చోటుచేసుకుంది. అయితే, ఆ ఘటన అనుకోకుండా జరిగిందే తప్ప కావాలని చేసింది కాదని ఆమె పోలీసులకు వివరణ ఇచ్చింది. ఉత్తర కరోలినాకు చెందిన ఐషియా మేరీ పచేకో(22) అనే మహిళకు టైలర్ అనే బాలుడు ఉన్నాడు. అతడు మే 20నే జన్మించాడు. ఇటీవల అతడు గుక్కపెట్టి ఏడుస్తుండటంతో ఆ బాలుడ్ని తన ఛాతీపై అదిమి పట్టుకుంది. దీంతో ఊపరి ఆడని బాలుడు ప్రాణాలుకోల్పోయాడు. దీంతో ఆమె ఎమర్జెన్సీ నంబర్ 911కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. అయితే, ఆమె ఇంటికొచ్చిన పోలీసులు బిడ్డ మూతి, ముక్కు లోపలికి నొక్కి ఉండటం గమనించి ఆమెనే ఈ హత్య చేసినట్లు కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఈ ఘటనపై వివరణ ఇచ్చిన ఆయేషా.. 'ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన. నన్ను క్షమించండి.. అలా చేయాలనుకోవడం నా ఉద్దేశంకాదు. నేను నా బిడ్డను ఎంతో ప్రేమస్తాను. వాడి తల్లిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. బాగా ఏడుస్తున్నాడని నా ఛాతీపై పెట్టుకున్నాను. అంతే తప్ప ఇంకే తప్పు చేయలేదు' అని ఆమె వివరణ ఇచ్చింది. -
ఆ సీడీ ఇవ్వనందుకు కార్లో నుంచి లాగి అరెస్టు
ఉత్తర కరోలినా: ఎప్పుడో అద్దెకు తీసుకున్న పాత సీడీ తిరిగి ఇవ్వలేదనే కారణంతో ఉత్తర కరోలినా పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. కారులో వెళుతున్న అతడిని బయటకు లాగి మరీ బేడీలు తగిలించారు. దీంతో అతడు బిత్తరపోయాడు. జేమ్స్ మేయర్స్ అనే వ్యక్తి 2002లో జే అండ్ జే అనే సంస్థకు చెందిన సీడీల షాపు నుంచి కామెడీ మూవీ ఫ్రెడ్డీ గాట్ ఫింగర్డ్ సీడీని తీసుకున్నాడు. కానీ, తిరిగి ఇవ్వడం మాత్రం మరిచిపోయాడు. ఎప్పుడో 2002 కింద తీసుకున్న సీడీ ఘటనను బహుశా అతడు మరిచిపోయాడనుకుంటా. పోలీసు కారులో నుంచి లాగి అతడిని అరెస్టు చేస్తున్నామని చెప్పినా కామెడీ అనే అనుకున్నాడు. బేడీలు చూశాక మాత్రం అతడికి బోధపడింది. ఈ సందర్బంగా పోలీసు అతడితో ఏమన్నాడంటే..'నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. 2002లో నువ్వు తీసుకున్న ఓ సీడీని రిటర్న్ ఇవ్వనందుకు అరెస్టు చేస్తున్నాను' అని అన్నాడు. దీంతో ఆ పోలీసు జోక్ చేస్తున్నాడేమో అని అనుకున్నానని, కానీ జీవితంలోనే మొదటిసారి చేతికి హ్యాండ్ కప్స్ వేసుకున్నానని చెప్పాడు. కాగా, జైలు శిక్ష మాత్రం వేయని కోర్టు దాదాపు రూ.12 వేల ఫైన్ వేసి విడిచి పెట్టింది. -
19 నెలలకే చదువుతున్నాడు!
న్యూయార్క్: పువ్వు పుట్టగానే పరిమళించినట్టు ఈ బుడతడు విద్వత్ పుణికిపుచ్చుకొని పుట్టినట్టున్నాడు. 19 నెలలకే 300 ఆంగ్ల పదాలను కంఠతా నేర్చేసుకున్నాడు. వాటిని ఇట్టే గుర్తుపట్టి అట్టే చదివేస్తున్నాడు. 50 వరకు అంకెలను తప్పులేకుండా లెక్కపెడుతున్నాడు. అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో నివసిస్తున్న లటోయ వైట్సైడ్ తన కొడుకు కార్టర్ గొప్పతనాన్ని తెలియజెప్పే వీడియో క్లిప్ను ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో ఈ బాల మేధావి గురించి నేడు ప్రపంచానికి తెల్సింది. తన కొడుకు ఏడు నెలల వయస్సు ఉన్నప్పుడే అక్షరాలను గుర్తుపట్టడం మొదలు పెట్టాడని, ఎవరూ ఏమీ చెప్పకుండానే 12 నెలలప్పుడు పదాలు పలకడం ప్రారంభించాడని తల్లి చెప్పింది. ఇటీవల తాను ఇంగ్లీషు పదాలున్న ఫ్లాష్ కార్డులను తీసుకొచ్చి ఒక్కసారి మాత్రమే చదివించానని, వాటిని ఇట్టే గుర్తు పెట్టుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని, అందుకే మళ్లీ చదివిస్తూ వీడియో తీశానని తెలిపింది. వీడియో క్లిప్లో బుడతడు కొన్ని పదాలను ఠక్కున చదవగా, కొన్ని కఠిన పదాలను కూడబలుక్కొని చదివాడు. తాను చదివింది కరెక్టేనా అన్నట్టు తల్లివైపు చూడడం, అవునన్నట్టు తల్లి తలూపగానే మరో పదాన్ని తీసుకొని చదవడం కనిపించింది. అన్ని ఫ్లాష్ కార్డులు చదవడం అయిపోయాక వాటిని తల్లికిచ్చేశాడు. సాధారణంగా చురుకైన పిల్లలు 18 నెలల వయస్సులో దాదాపు ఆరు పదాలు పలుకుతారు. మూడేళ్ల వయస్సులో పదాలు గుర్తుపట్టి చదవడం ప్రారంభిస్తారు. ఐదేళ్ల వయస్సులో సంపూర్ణ వాక్యాలు చదువుతారు. -
ఆకాశంలో ఏమిటీ విచిత్రం?
న్యూయార్క్: శాస్త్ర సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని విషయాలు మిస్టరీగానే ఉంటున్నాయి. ఆకాశంలో అరుదుగా కొన్ని దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. అయితే ఇవి ఏంటి అన్నది అంతుపట్టని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ఒక్కోసారి రాత్రివేళ గుండ్రని లోతు పళ్లెం ఆకారంలో, మరోసారి ఓ కాంతి సమూహంతో కూడిన దృశ్యం రంగులు, వేగం మారుతూ కనిపిస్తుంది. ఇంకోసారి ఎవరో నడచి వస్తున్నట్టుగా భ్రమ పడతాం. ఇలాంటి దృశ్యాలు చూసినపుడు ఒక్కోసారి వింతగాను, మరోసారి భయంగాను అనిపిస్తుంది. ఇలాంటి ఆకారాలను గుర్తించలేని ఎగిరే వస్తువులు (యూఎఫ్ఓ) గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఈ చిత్రంలోని దృశ్యాన్ని గమనించండి. ఓ జింకపై ఏదో ఆకారం దిగుతున్నట్టుగా కనిపిస్తోంది కదూ! అమెరికాలోని మిసిసిపి కి చెందిన ఒక దంపతులు అడవిలో జింకలను రాత్రి వేళ చిత్రీకరించే ప్రయత్నంలో వారి కెమెరాలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. అయితే ఆ ఆకారం ఏంటన్నది మిస్టరీగానే మిగిలింది. ఇదే కాదు ఇలాంటి సంఘటనలు, ఫొటోలు అంతుపట్టని విషయాలు చాలా ఉన్నాయి. ఇలాంటివి మచ్చకు కొన్ని. అమెరికాలోని నార్త్ కరోలినాలో రంగురంగుల కాంతులు ఆవిష్కృతమయ్యాయి. టెక్సాస్లో రెడ్ లైట్లను ఎవరో క్రమపద్ధతిలో మారుస్తుంటారని అధికారులు విశ్వసిస్తారు. ఓ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఏవో వింత దీపాలు ప్రత్యక్షమయ్యాయి. నదులు, సరస్సులపై ఎవో అద్భుత కాంతులు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. రష్యాలో ఈ మద్య కొందరు ఆందోళనకారులు ప్రదర్శనను నిర్వహించారు. ఆ ప్రదర్శన చిత్రాల్లో ఏవో వింత వింత వస్తువులు కనిపించాయి. ఆందోళనకారుల పైన ఎవరో నిలుచున్నట్టు, వారే ఉద్యమకారులను నడపిపిస్తున్నట్టు అనిపించింది. అమెరికాలోని విండీ సిటీ లో ఒక పెద్ద సరస్సుపైన ఏవో వింత కాంతులు కెమెరాలో కనిపించాయి. ఇవన్నీ ఏవో గ్రహంతర వాసులా లేక ఇతర గ్రహాల నుంచి మనకు తెలియని ఏవో సందేశాలు మోసుకొస్తున్న దూతలా లేక కళ్ల ముందు కలిగిన భ్రమా అన్నది శాస్త్రవేత్తలు తేల్చి చెప్పలేకపోతున్నారు. ఈ యుఫోల (యుఎఫ్ ఓలు) పై అమెరికా విస్తృతమైన అధ్యయనాలు నిర్వహిస్తోంది. అంతే కాదు దీని చుట్టూ అనేక సినిమాలు కూడా తయారయ్యాయి. హాలీవుడ్ సినిమాలైన ఈటీ, క్లోజ్ ఎన్ కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్, ది ఇండిపెండెన్స్ డే ల కథా వస్తువు గ్రహాంతర వాసులే. మన దేశంలోనూ క్రిష్, కోయి మిల్ గయా వంటి హిందీ సినిమాలు ఈ అంశంపైనే తయారయ్యాయి. మొత్తం మీద అమెరికాలో ఇప్పుడు ఈ వింత ఆకారాలపైన విస్తృత చర్చ జరుగుతోంది.