nurses
-
నర్సుల విశాల హృదయం..సేవతో కొత్త ఏడాదికి స్వాగతం..!
హైదరాబాద్(Hyderabad) నగర వీధుల్లో చలికి గజగజ వణుకుతూ ఇబ్బంది పడుతున్న నిరుపేదలు, నిర్భాగ్యుల((Homeless People)ను ఆదుకునేందుకు ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి(Aster Prime Hospital) నర్సులు(Nurses) సహృదయంతో ముందుకొచ్చారు. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో వీధుల్లో ఉంటున్న సుమారు 50 మంది నిరుపేదలకు రగ్గులు పంచిపెట్టారు. సుమారు 120 మంది నర్సులు తాము సంపాదించిన దాంట్లోంచి తలా కొంత వేసుకుని ఈ రగ్గులు కొని, వీధుల్లో ఉంటున్నవారికి ఉచితంగా పంచిపెట్టారు. ప్రతిరోజూ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్న ఏంజెల్ నర్సులు ఈసారి కొత్త సంవత్సరం సందర్భంగా ఏదైనా మంచి పని చేయాలని తలపెట్టి, నిరుపేదలను చలి నుంచి రక్షించేందుకు రగ్గులు పంచాలని నిర్ణయించారు. మంగళవారం సాయంత్రం ఎస్ఆర్ నగర్ ప్రాంతానికి వెళ్లి, అక్కడ రోడ్లపై ఉంటున్న 50 మందికి ఈ రగ్గులు అందించారు. ఈ సందర్భంగా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ లిండామోల్ జోయ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం క్రిస్మస్, కొత్త సంవత్సరం సందర్భంగా ఏదో ఒక సంబరాలు చేసుకుంటామని, ఈసారి అలా కాకుండా.. పేదలను ఆదుకోవడానికి ఏమైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. వెంటనే తమ నర్సింగ్ గ్రూపులో పోస్ట్ చేయగా, ఏంజెల్ నర్సులు అంతా ముందుకొచ్చి తమకు చేతనైనంత సాయం చేశారన్నారు. వచ్చే ఏడాది కూడా మరింత మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు. నర్స్ ఎడ్యుకేటర్ రాహుల్ కమర్ మాట్లాడుతూ..అన్నీ ఉన్న మనమే చలిని తట్టుకోలేకపోతున్నామని.. అలాంటిది కనీసం గూడు కూడా లేకుండా నడివీధిలో పడుకుంటున్న నిర్భాగ్యులను చూసి తామంతా చలించిపోయామని అన్నారు.అందుకే ఈసారి వీరికి చలిని తట్టుకునేందుకు వీలుగా రగ్గులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో కూడా ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి సిబ్బంది నిరుపేదలను ఆదుకునేలా వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తారని తెలిపారు.(చదవండి: చిరుత ఎంట్రీతో..ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోం ఆఫర్ ..!) -
గత సర్కారు ముందుచూపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవ వనరుల కొరతకు చెక్ పెట్టడం కోసం 2019–24 మధ్య ఏకంగా 54 వేల వైద్యులు, నర్సులు, ఇతర సహాయ సిబ్బంది పోస్టులను భర్తీ చేసింది. ఫలితంగా జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్యుల అందుబాటు అత్యంత మెరుగ్గా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల పార్లమెంట్లో వెల్లడించింది.ప్రివెంటివ్ కేర్లో అత్యంత కీలకమైన గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) దేశవ్యాప్తంగా గతేడాది మార్చి నాటికి 41,931 మంది మెడికల్ ఆఫీసర్ల(ఎంవో)కు గాను 32,901 మంది అందుబాటులో ఉన్నారని 22.30 శాతం మేర ఎంవోల కొరత ఉందని స్పష్టం చేసింది. అదే ఏపీలో 2,313 మందికి గాను 2,293 మంది అందుబాటులో ఉండగా, కేవలం 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది. ఈ లెక్కన రాష్ట్రంలో 0.86 శాతం కొరత మాత్ర మే ఉన్నట్టు స్పష్టమైంది. గత ప్రభుత్వంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేనట్టుగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేసింది.ఇందులో భాగంగా ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు, ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను అమలు చేసింది. మరోవైపు పట్టణ పీహెచ్సీల్లో దేశవ్యాప్తంగా 19.08 శాతం వైద్యుల కొరత ఉండగా, ఏపీలో అది 3.32 శాతమేనని పార్లమెంట్ వేదికగా వెల్లడైంది. కేరళ రాష్ట్రంలోని గ్రామీణ పీహెచ్సీల్లో సైతం 5.22 శాతం ఎంవోల కొరత ఉంది. కర్ణాటకలో 14.21 శాతం, తమిళనాడులో 11.58, తెలంగాణలో 36.27 శాతం మేర వైద్యుల కొరత ఉంది.ఉత్తరాదిలోని యూపీలో ఏకంగా 36.44 శాతం, బిహార్లో 34.62, గుజరాత్లో 17.69 శాతం వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీల్లో దేశం మొత్తం 46,692 నర్సు పోస్టులకు గాను 10,814 పోస్టులు(23.16 శాతం) ఖాళీగా ఉన్నాయి. యూపీలో 64.94 శాతం, బిహార్లో 35.59 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేలింది. ఏపీలో 4.74 శాతం పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. నాడు ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ⇒ 2019–24 మధ్య వైద్యశాఖలో ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా జీరో వేకెన్సీ పాలసీని అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసింది. దీంతో ఉద్యోగ విరమణలు, వీఆర్ఎస్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేసేవారు. కేవలం వైద్య శాఖ నియామకాల కోసమే ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ⇒ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని సెకండరీ హెల్త్, బోధనాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులను అందుబాటులో ఉంచడం కోసం పలు దఫాలు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి, వైద్యులు అడిగినంత వేతనాలను ఇచ్చి మరీ పోస్టులను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో గైనిక్ వైద్యులకు 50 శాతం కొరత ఉంటే ఏపీలో 1.4 శాతం, అదే స్పెషలిస్ట్ పోస్టులు 61 శాతం దేశవ్యాప్తంగా కొరత ఉండగా, రాష్ట్రంలో 6.2 శాతం మేర మాత్రమే ఉండేది. వీటన్నింటికీ తోడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులను సైతం అందుబాటులో ఉంచింది. ⇒ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీరో వేకెన్సీ విధానానికి తూట్లు పొడించింది. దీంతో వివిధ కారణాలతో ఆస్పత్రుల్లో ఏర్పడిన ఖాళీలు భర్తీ అవ్వక ప్రజలకు వైద్య సేవల కల్పనపై తీవ్ర ప్రభావం పడుతోంది. -
విదేశాల వైపు.. నర్సుల చూపు
రూ.లక్షల్లో జీతం... ఇండియాతో పోలిస్తే తక్కువ పని ఒత్తిడి... వీలైతే వసతి సౌకర్యం.. ఇలా అన్ని అంశాలు కలసి వస్తుండటంతో విదేశాల్లో నర్సుల ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. అలాగే ఏపీ నుంచి కూడా విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న యువ నర్సుల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందుతోంది. విదేశాలకు వెళ్లే వారి సర్టిఫికెట్లను నర్సింగ్ కౌన్సిల్, నర్సింగ్ కళాశాలల్లో వెరిఫికేషన్ చేస్తారు. ఈ విధంగా 2023లో ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో 2,821 వెరిఫికేషన్లు చేపట్టారు. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య 1,662 వెరిఫికేషన్లు పూర్తయ్యాయి. – సాక్షి, అమరావతివైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేష కృషియువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీన్లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నర్సింగ్ కౌన్సిల్తో ఎంవోయూ కుదుర్చుకుని నర్సింగ్ కోర్సులు చేసిన యువతలో నైపుణ్యాల పెంపునకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. జర్మనీ, జపాన్వంటి దేశాలకు పంపేందుకు అక్కడి భాషల్లో శిక్షణ కూడా ఇప్పించింది.పెద్ద దేశాల్లో విస్తృత అవకాశాలుభారత్ నుంచి ఎక్కువ మంది ఐర్లాండ్, సింగపూర్, అరబ్ దేశాలకు వెళ్తున్నారు. ఆ దేశాల్లో కొన్నేళ్లు పని చేసి నైపుణ్యం పెంచుకుని ఆస్ట్రేలియా, అమెరికా వంటి పెద్ద దేశాలకు వెళుతున్నారు. నర్సింగ్, జీఎన్ఎం కోర్సులు పూర్తి చేసి ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోజుకు 12 గంటలపైగా గొడ్డు చాకిరి చేస్తే రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్య వేతనాలు ఇస్తున్నట్టు నర్సులు చెబుతున్నారు. అదే యూఎస్ఏలో సగటున నెలకు రూ.3.15 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.4.70 లక్షలు, జర్మనీలో రూ.3.15 లక్షలు, సింగపూర్లో రూ.2.50 లక్షలపైనే ఉంటోంది. దీనికి తోడు అక్కడ పని గంటలు కూడా మనతో పోలిస్తే చాలా తక్కువ.. ఇలాంటి అంశాలను బేరీజు వేసుకోవడంతో వలసలపై ఆసక్తి పెరుగుతోంది. యూకేలో భారతీయులే అధికంవిదేశాల్లో మన వైద్యులు, సిబ్బంది చాలామందే పనిచేస్తున్నట్లు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. యూకే 2022–23 ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ ప్రకారం ఆ దేశంలో కొత్తగా రిక్రూట్ అయిన వైద్యుల్లో 20%, నర్సుల్లో 46% భారతీయులు ఉన్నట్టు వెల్లడైంది. నర్సింగ్, మిడ్వైఫరీ రిజిస్టర్ బోర్డ్ ఐర్లాండ్లో 2023లో 15,060 మంది భారతీయ నర్సులు నమోదు చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 17 శాతం అధికం. 2022లో 11,957 మంది రిజిస్టర్ చేసుకున్నారు. విద్యార్హతలునర్సింగ్ రంగంలో విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లాలనుకునే వాళ్లు తొలుత బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో అర్హత సాధించాలి. అనంతరం సంబంధిత రాష్ట్ర/నేషనల్ నర్సింగ్ కౌన్సెల్లో రిజిస్ట్రర్ చేసుకుని ఉండాలి. కనీసం రెండేళ్ల క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు విదేశాల్లో త్వరగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఓటీ, ఐసీయూ వంటి విభాగాల్లో అనుభవజ్ఞులైన వారికి విస్తృత అవకాశాలుంటాయి. విదేశాలు వెళ్లాలంటే...ఎంపిక చేసుకున్న దేశాన్ని బట్టి అక్కడి నిబంధనల ప్రకారం అర్హత సాధించిన వారికి వీసా ప్రాసెస్ చేస్తారు. ఉదాహరణకు కెనడా వెళ్లాలనుకునే వాళ్లు తొలుత నేషనల్ కౌన్సిల్ లైసెన్సర్ ఎగ్జామినేషన్ (ఎన్సీఎల్ఈఎక్స్) అర్హత సాధించాలి. దీంతో పాటు ఐఈఎల్టీఎస్/టోఫెల్ వంటి ల్యాంగ్వేజ్ పరీక్షలో అర్హత సాధిస్తే.. వారికి వీసా ప్రాసెస్ చేసి, అక్కడ ఉద్యోగం చేయడానికి వీలు కల్పిస్తారు. అదే సింగపూర్ వెళ్లాలనుకునే వాళ్లు ఎస్ఎన్బీ లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇది పాసైన వాళ్లకు యూకే, న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి దేశాల్లోను పని చేయడానికి అర్హత లభిస్తుంది. భారత్లో కొరతఇదిలా ఉంటే, మన దేశంలో జనాభాకు సరిపడా ఆస్పత్రుల్లో నర్సుల సంఖ్య తక్కువగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ముగ్గురు నర్సులు ఉండాలి. అయితే ప్రస్తుతం దేశంలో ప్రతి ఐదు వేల మందికి సగటున 10 మంది నర్సులే విధులు నిర్వహిస్తున్నారు. ఈ రకంగా దేశంలో కేవలం సుమారు 35 లక్షలమంది ఉన్నట్లు అంచనా. ఓ మోస్తరు పెద్ద ప్రైవేట్ ఆస్పత్రులు నర్సుల కొరతను అధిగమించేందుకు ఏకంగా కాలేజీలను కూడా ప్రారంభించడం పరిపాటిగా మారింది.ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ (ఈసీఆర్) కింద ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ నుంచి 2015–21 మధ్య విదేశాలు వెళ్లిన నర్సుల సంఖ్య -
నర్సులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన నర్సులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంకోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ సంయుక్తంగా ఎస్ఎమ్ కేర్, హాలో లాంగ్వేజ్ సంస్థలతో మంగళవారం ఎంవోయూ కుదుర్చుకున్నాయి. రాష్ట్రంలోని ఆసక్తి కలిగిన నర్సింగ్ అభ్యర్థులకు ఉచితంగా జర్మన్ భాషలో శిక్షణ ఇవ్వనున్నట్టు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ గణేష్ వివరించారు. ఆరు నెలల్లో ఏ1, ఏ 2, బీ1, బీ2 దశల్లో శిక్షణ ఇచ్చి, బీ2 పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేసి జర్మనీలోని ఆస్పత్రుల్లో ఎస్ఎం కేర్ సంస్థ ద్వారా నియమిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు విమాన టికెట్లు, వీసా, డాక్యుమెంట్ ట్రాన్స్లేషన్ వంటి సదుపాయాలు ఉచితంగా కల్పిస్తారన్నారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎంతో పాటు రెండు సంవత్సరాల కనీస అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులని వివరించారు. -
డ్యూటీలో ఉండగానే.. నర్సులు చేసిన పని చూస్తే షాక్ అవుతారు
-
సైగల చికిత్స
మూగ, వినికిడి సమస్య ఉన్న ఆ దంపతులకు లేకలేక సంతానం కలిగింది. అదీ పూర్తి ప్రసవ సమయానికి రెండు నెలల ముందుగానే. కవలల్లో పేగు సమస్యతో అబ్బాయి చనిపోయాడు. ఇక ఇప్పుడు పాప ఒక్కత్తే ఆశాజ్యోతి. కేవలం 450 గ్రాముల బరువుతో మనుగడ అవకాశాలు తక్కువ. పాపను ఎలాగైనా దక్కించుకునేందుకు ఏ విధంగానైనా ఆమెను బతికించుకునేందుకు పేరెంట్స్తో కమ్యూనికేట్ చేయడం తప్పనిసరి అయ్యింది.] కనీస సంభాషణల కోసం కష్టపడి పదిరోజుల్లోనే సైగల భాషనూ, సంజ్ఞాశాస్త్ర పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంలో విజయ సాధించారు అక్కడి కొందరు డాక్టర్లూ, నర్సులు. ఆ పాప ఇప్పుడు బతుకు బ్యారియర్స్ను బద్దలు కొట్టింది. నాలుగు నెలల వయసుకే అనేక అడ్డంకుల్ని అధిగమించింది. జీవన సమరంలో తొలి విజయం సాధించింది. విజయవంతంగా మనుగడ పోరాటం సాగిస్తోంది. హైదరాబాద్కు చెందిన దంపతులు రాజ్కుమార్ వయసు 55 ఏళ్లు. భాగ్యమ్మకు 47. ఇద్దరూ మూగవారు. వినికిడి, మాట సమస్యలున్నాయి. అప్పటికే ఓ చిన్నారిని కోల్పోయారు. ఎలాగైనా తమకు సంతానం కావాలని కోరిక. ఎట్టకేలకు భాగ్యమ్మ గర్భవతి అయ్యింది. తన 47వ ఏట ప్రసవించింది. కానీ 28 వారాలకే ప్రీమెచ్యూర్గా పుట్టిన పిల్లలు. అంటే ఏడునెలలకే జరిగిన ప్రసవం. రెండు నెలలు ముందుగానే ప్రసవం కావడంతో కవలలు బాగా తక్కువ బరువుతో పుట్టారు. బాబు కేవలం 900 గ్రాములు. పాప బరువు మరీ తక్కువ. కేవలం 450 గ్రాములు!! మరో ఆసుపత్రిలో ప్రసవం తర్వాత... పుట్టీ పుట్టగానే ఆ బిడ్డలకు కొన్ని సమస్యాత్మకమైన రుగ్మతలు ఉండటంతో తల్లినీ, బిడ్డను కొండాపూర్లోని కిమ్స్–కడల్స్ నియోనేటాలజీ విభాగంలో చేర్చారు. ఆ విభాగం డైరెక్టర్ డాక్టర్ అపర్ణ నేతృత్వంలో చికిత్స మొదలుపెట్టారు. బాబుకు నెక్రొటైజింగ్ ఎంటరోకొలైటిస్ అనే పేగుల సమస్య ఉండటంతో శస్త్రచికిత్స తప్పలేదు. కానీ బాబు దక్కలేదు. ఎన్నో వైద్య ప్రక్రియల తర్వాత, మరెన్నో నోముల తర్వాత పండిన పంట అది. ఒడి నిండినట్టే నిండిందిగానీ... ఒడిబియ్యంలో సగం జారిపోయింది. పాప తల్లిదండ్రుల వయసుపరంగా, లేదా మరేరకంగా చూసినా ఆ బంగారు తల్లిని కాపాడుకోక తప్పని పరిస్థితి. కొంగున మిగిలింది సగం బంగారమే కావడంతో ఇప్పుడా కొంగుబంగారం మరీ మరీ అపురూపం. కానీ పాప బరువు అరకిలో కంటే మరో 50 గ్రాములు తక్కువే. వైద్యసిబ్బందికి ఇదో సవాల్గా మారింది. తొలినాళ్లలో కుటుంబ స్నేహితుడి సాయంతో సంభాషణలు... పాప తల్లిదండ్రులిద్దరూ మూగ, వినికిడి సమస్యలున్నవారైనప్పటికీ వైద్యులకు వారితో సంభాషించడం తప్పదు. తొలి నాళ్లలో రాజ్కుమార్కు తెలిసిన ఓ అబ్బాయే ఆ దంపతులకూ, వైద్య సిబ్బందికి మధ్య సంజ్ఞావారధిగా నిలబడ్డాడు. అతడో కాలేజీ విద్యార్థి. సంజ్ఞల భాష (సైన్ లాంగ్వేజ్) తో సంభాషణలు జరిపేవాడు. కొన్నాళ్ల సెలవు తర్వాత రాజ్కుమార్ తన విధులకు హాజరవ్వక తప్పనిస్థితి. తండ్రి ఆఫీసులో, తల్లి ఆసుపత్రిలో. సంజ్ఞల వారధి తన చదువుల్లో, తన పనుల్లో మరో చోట. అయినప్పటికీ ఎలాగోలా పేపర్ల మీద రాసిచూపుతూనో, వీడియోకాల్స్ ద్వారానో సంభాషణలు కొనసాగుతున్నాయి. ఇంతలో ఇంటర్ప్రెటర్గా ఉన్న వ్యక్తికి పరీక్షలు వచ్చాయి. ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడేందుకు అవకాశం లేకపోయింది. ఆసుపత్రిలో చేర్చిన తొలినాళ్లలో రాజ్కుమార్ కొందరు వైద్యసిబ్బందికి సంకేతభాష (సైన్ లాంగ్వేజీ) నేర్పించేందుకు కొంత ప్రయత్నించారు. అప్పుడెవ్వరికీ దాని అవసరం అంతగా ఉన్నట్లు తోచలేదు. కానీ ఇప్పుడు తప్పని స్థితి! ఇక డాక్టర్లూ, వైద్యసిబ్బందీ సంభాషించక తప్పలేదు... పాపకు జరిగే వైద్య పరీక్షల గురించి తల్లిదండ్రులకు చెప్పాలి. చిన్నారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ, చేపట్టాల్సిన విధానాల్ని తల్లికి వివరించాలి. పాలు పట్టాల్సినప్పటి ప్రక్రియలను, ఆహారమివ్వాల్సిన తీరుతెన్నులను, బిడ్డను తల్లిగుండెలకు దగ్గరగా ఉంచేందుకు అనుసరించాల్సిన ‘కంగారూ కేర్’ ప్రక్రియల్ని విపులీకరించాలి. ఇందుకు ఇరువురికీ అర్థమ్యే భాష కావాలి. కానీ ఎలా? పది రోజుల్లో అవసరమైనమేరకు శిక్షణ... తొలినాళ్లలో రాజ్కుమార్ తమకు కొన్ని బేసిక్స్ నేర్పడానికి ప్రయత్నించడం గుర్తొచ్చింది. అంతే... చిన్నారిని కాపాడుకునేందుకు అవసరమైన మేరకు సైన్ లాంగ్వేజ్ను ఆయననుంచే నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు మెడికల్ టీమ్లోని కొందరు. మొత్తం పది మంది వైద్యబృందంలో కొందరు డాక్టర్లు, మరికొందరు నర్స్లూ, ఇంకొందరు సహాయక వైద్య సిబ్బంది సంజ్ఞాభాష నేర్చుకోవడం మొదలుపెట్టారు. దాదాపు పదిరోజుల్లో సైగల భాషలోని అల్ఫాబెట్స్, సంఖ్యలూ, రోజులూ, వారాల పేర్లు, ఇతర వివరాలను కష్టపడి నేర్చుకున్నారు. కమ్యూనికేట్ చేస్తున్నారు. తొలి విజయం ఆ మృత్యుంజయురాలిదే... గత ఏడాది ఆగష్టులో ఆసుపత్రిలో చేరిన ఆ తల్లి దాదాపు మూడు నెలల పాటు (సరిగ్గా చెప్పాలంటే 79 రోజులు) ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. కేవలం 450 గ్రాములున్న ఆ చిన్నారి క్రమంగా 1200 గ్రాములకు చేరింది. నవంబరులో డిశ్చార్జ్ నాటికి ఆ పాప బరువు 1800 గ్రాములు. మనుగడ పోరాటంలో తొలి అవరోధాలన్నింటినీ అధిగమించింది... బతుకుకు అడ్డంకి లేని బరువు సాధించింది. ప్రస్తుతం తనకు 4 నెలల వయసు. డాక్టర్ల అంచనాల ప్రకారం... అందరిలాగే మరో మూడు–నాలుగు నెలల్లో ముద్దుమాటలు (బ్యాబ్లింగ్స్) మొదలుపెట్టాలి. అందుకు వైద్యపరంగా ఎలాంటి అవరోధాలూ, అడ్డంకులూ లేవు. ప్రస్తుతానికి... ముందు ముద్దులు మూటగడుతోంది. మున్ముందు మాటలు దండగట్టాల్సి ఉంది. – యాసీన్ మేము, మా సిబ్బంది అవసరమైన మేరకు సైన్లాంగ్వేజీలో పరిజ్ఞానం సంపాదించాం... పాపను రక్షించుకునేందుకు సైన్ లాంగ్వేజ్ నేర్చుకోక తప్పలేదు. కొందరిలో కొత్తభాషను నేర్చుకునే పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది కదా. అలాంటివారు ఇతరులకు నేర్పారు. ఇలా ఆ టీమ్లోని పదిమంది డాక్టర్లలో ఐదారుగురు, నర్సుల్లో నలుగురైదుగురు, ఇతర సిబ్బందిలో మరికొందరు... తల్లిదండ్రులకు అవసరమైన మేరకు వివరాలను సూచించేంతగా సైన్లాంగ్వేజీలో ప్రాక్టీస్ సాగించారూ, నైపుణ్యం సాధించారు. చిన్నారిని బతికించుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమయంలో కంటి పరీక్షలూ, న్యూరో... ఇలా అన్ని రకాల పరీక్షలూ నిర్వహించాం. మరీ ముఖ్యంగా వినికిడి పరీక్షలు. ఆ చిన్నారిలో ఎలాంటిలోపాలూ లేవు. అన్నీ నార్మల్. – డాక్టర్ అపర్ణ, క్లినికల్ డైరెక్టర్–నియోనేటాలజీ -
కల్లోల ఇజ్రాయెల్లో ఇండియన్ సూపర్ ఉమెన్
బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు... అనుకునే భయానక పరిస్థితుల్లో ఉండి కూడా, తమకు ఏమైనా ఫరవాలేదు, నిస్సహాయులైన వృద్ధదంపతులకు ఏమీ కాకూడదని వారిని కంటికి రెప్పలా కాపాడారు ఇజ్రాయెల్లో హోమ్ నర్స్లుగా పనిచేస్తున్న కేరళకు చెందిన సబిత, మీరా మోహన్లు... దక్షిణ ఇజ్రాయెల్... గాజా సరిహద్దుకు రెండో కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్ ఓజ్ కిల్బట్జ్ పట్టణంలో ఒక ఇంట్లో... 85 సంవత్సరాల షౌలిక్, 76 సంవత్సరాల రహెల్ దంపతులకు నలుగురు పిల్లలు. పిల్లలు వేరు వేరు ప్రాంతాలలో ఉంటున్నారు. రహెల్ అనారోగ్యంతో బాధ పడుతోంది. ఆమెను చూసుకోవడానికి ఆరోజు ఆ ఇంట్లో సబిత, మీరా మోహన్ అనే ఇద్దరు హోమ్నర్స్లు ఉన్నారు. ఉదయం ఆరున్నర ప్రాంతంలో సైరన్ మోత వినిపించింది. ప్రజలు బాంబ్ షెల్టర్లలో తల దాచుకోవాలని చెప్పే సైరన్ అది. ‘ఆ ఉదయం సైరన్ మోగేసరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. సెకండ్ల వ్యవధిలో సేఫ్టీరూమ్లోకి వెళ్లాలి. ఇంతలో రహెల్ కుమార్తె నుంచి ఫోన్ వచ్చింది. బయట పరిస్థితి భయానకంగా ఉంది అని ఆమె చెప్పింది. మాకు ఏం చేయాలో తోచలేదు. ఇంటిముందు, వెనుక తలుపులకు తాళాలు వేసి అమ్మానాన్నలను తీసుకొని, పాస్పోర్ట్, డైపర్లు, యూరిన్ పాట్, మందులతో సెక్యూర్ రూమ్లోకి వెళ్లాలని ఆమె చెప్పింది. షౌలిక్, అనారోగ్యంతో ఉన్న రహేల్ను నడిపించుకుంటూ షెల్టర్ రూమ్లోకి వెళ్లాం. ఈలోపే మిలిటెంట్లు ఇంట్లోకి ప్రవేశించారు. అద్దాలు బద్దలు కొట్టారు. వస్తువులు ధ్వంసం చేశారు. షెల్టర్రూమ్పై కాల్పులు జరుపుతున్నారు. ఐరన్ డోర్ వెనకే మా శరీరాలను గట్టిగా ఆనించి ఎన్నో గంటలపాటు నిల్చున్నాం. అదృష్టవశాత్తు ఐరన్ డోర్ ధ్వంసం కాలేదు. ధ్వంసం అయి ఉంటే ఎవరి ప్రాణాలు మిగిలేవి కావు’ అంటూ ఆ భయానక ఘటనను గుర్తు తెచ్చుకుంది 39 సంవత్సరాల సబిత. కేరళకు చెందిన సబిత, మీరా మోహన్ల సాహసం, మానవత్వం గురించి దిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ‘ఇండియన్ సూపర్ ఉమెన్’ అంటూ ప్రశంసించింది. -
సేవాజ్యోతి
అనారోగ్యాలను దూరం చేసే చల్లని చిరునవ్వు .. విధి నిర్వహణలో అంకితభావం .. రోగులపాలిట ఆమె అపర నైటింగేల్ ... సమాజ క్షేమం కోరేవారికి తర తమ భేదాలుండవు అని తన చేతల్లో చూపుతోంది కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్నర్స్గా పనిచేస్తున్న ఆరోగ్యజ్యోతి. పాతికేళ్లుగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ఎంతోమంది మన్ననలు అందుకున్నారు ఆరోగ్యజ్యోతి. ఆమె సేవలను గుర్తించి ది నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ది న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నాటక వారు ‘నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్–2023’ అవార్డుకు ఆమెను ఎంపిక చేశారు. మంగళవారం బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకుని సేవాజ్యోతిగా గుర్తింపు పొందింది అరోగ్యజ్యోతి. బోధన్ పట్టణానికి చెందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో హెడ్నర్స్గా విధులు నిర్వహిస్తోంది. 1998లో స్టాఫ్ నర్స్ ఉద్యోగంలో చేరి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రెండేళ్లు పనిచేసిన ఆమె 2000 సంవత్సరంలో బోధన్ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి అక్కడే ఇరవై ఏళ్లుగా విధులు నిర్వర్తించింది. 2019 లో హెడ్ నర్స్గా పదోన్నతి పొందిన ఆరోగ్యజ్యోతి బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి బదిలీ అయి, అక్కడే విధుల్లో కొనసాగుతోంది. కరోనా కాలంలో వైద్యులతో కలిసి రోగులకు ఎన్నో సేవలందించిన ఈ నైటింగేల్ పాతికేళ్ల కాలంలో ఎక్కడ ఉద్యోగం చేసినా విధి నిర్వహణకు అంకితమై పనిచేస్తూ వచ్చింది. దీంతో ఆమె అందరికీ తలలో నాలుకలా మారింది. ఆపరేషన్ థియేటర్తోపాటు ప్రసూతి వార్డుల్లోనే ఆమె ఎక్కువగా విధులు నిర్వర్తించింది. అధికారుల నుంచి ఎన్నో మన్ననలు, సామాజిక సేవలకు గాను అవార్డులనూ పొంది సేవాగుణంలో ముందువరసలో నిలిచింది. కూతురి మరణంతో.. ఆరోగ్య జ్యోతి కూతురు అనుకోని పరిస్థితుల్లో విద్యుత్షాక్కు గురై మరణించింది. కూతురి మరణంతో ఆవేదనకు గురైన ఆరోగ్యలక్ష్మి తన సేవలను మరింత విస్తృతం చేయాలని సంకల్పించింది. ఆరోగ్యజ్యోతి చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలు చేపట్టింది. వైద్యరంగంలో తనకున్న పరిచయాలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేసే కార్యక్రమాలు చేపడుతుంటుంది. బీపీ, షుగర్, గుండె సంబంధ వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపట్టి రోగులకు అండగా నిలుస్తోంది. అలాగే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు కూడా చేపట్టి, గర్భిణీలు, బాలింతలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం శిబిరాలు ఏర్పాటు చేసి ఆదుకుంటుంది. – ఎస్.వేణుగోపాల్ చారి, సాక్షి, కామారెడ్డి మాకెంతో గర్వకారణం సేవతో అందరి మన్ననలు పొందే ఆరోగ్యజ్యోతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్–2023 అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మేమంతా గర్వించదగ్గ విషయం. ఈ అవార్డు స్ఫూర్తి మిగతా అందరిలో కలగాలని కోరుకుంటున్నాను. – డాక్టర్ శ్రీనివాసప్రసాద్, సూపరింటెండెంట్, బాన్సువాడ ఏరియా ఆస్పత్రి అందరి సహకారంతో... సేవా కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో ఉంది. ఉద్యోగ నిర్వహణలో తోటి ఉద్యోగులు, వైద్యుల సహకారం,ప్రోత్సాహంతోనే ముందుకు సాగుతున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మానాన్నలు ఎంతోమందికి సాయం అందించేవారు. వాళ్లను చూసి నాకూ అలవాటైంది. నా ప్రయత్నాల్లో మా వారు అండగా నిలిచారు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నాను. – ఆరోగ్యజ్యోతి, హెడ్నర్స్, బాన్సువాడ -
కుష్టు వ్యాధి నియంత్రణ యూనిట్ల ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో హేతుబద్దీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు వైద్యాధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో కుష్టు వ్యాధి నియంత్రణ, మెటర్నరీ హెల్త్, టెంపరరీ హాస్పిటలైజేషన్ తదితర సేవలు ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఆయా సేవలన్నీ ఆసుపత్రుల్లో సాధారణ సేవలుగా ప్రధాన స్రవంతిలో కలిసిపోయాయి. దాంతో ఈ యూనిట్లు నిరుపయోగంగా మారాయని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. అలాగే చిన్న జిల్లాల ఏర్పాటుతో సబ్–డివిజనల్ స్థాయిలో ఉన్న డిప్యూటీ డీఎంహెచ్వో కార్యాలయాలు కూడా నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో వాటిని కూడా ఎత్తివేసి అందులోని సిబ్బందిని ఇతర చోట్ల సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 235 యూపీహెచ్సీల్లో వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్ పోస్టులను కాంట్రాక్ట్ సిబ్బందితో భర్తీ చేసి నడిపిస్తున్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, వ్యాక్సినేషన్, అంటువ్యాధుల సమయంలో పర్యవేక్షించడం తదితర సేవల్లో యూపీహెచ్సీల సిబ్బంది కీలకం. దీంతో.. ఎత్తివేసే యూనిట్ల నుంచి సిబ్బందిని వీటిల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. 40 మండలాల్లో పీహెచ్సీలు, 6 డీఎంహెచ్వోలు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం (పీహెచ్సీ) లేని మండలాలు రాష్ట్రంలో 40 ఉన్నాయి. సిబ్బందిని హేతుబద్దీకరించడం, పునర్విభజించడం వల్ల ఆ 40 మండలాల్లోనూ పీహెచ్సీలను ప్రారంభించడానికి వీలు కలుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగింది. కొత్తగా రూపొందించిన 23 జిల్లాల్లోని డీఎంహెచ్వో కార్యాలయాలు కాంట్రాక్టు సిబ్బందితో నడుస్తున్నాయి. ఈ కార్యాలయాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో సిబ్బందిని డీఎంహెచ్వో కార్యాలయాలకు తిరిగి పంపిస్తారు. జీహెచ్ఎంసీ జనాభా పెరుగుదలతో ప్రజారోగ్య పరిపాలనను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆరు డీఎంహెచ్వోలను కొత్తగా నియమిస్తారు. 80 శాతం డాక్టర్లు ఇతర ప్రాంతాల్లోనే నివాసం గ్రామాల్లో వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు పట్టణాలకే పరిమితమవుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి గతంలో ఓ నివేదిక సమరి్పంచింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్సీ)లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బందిలో 80 శాతం మంది ఇతర ప్రాంతాలు, పట్టణాల్లో నివాసం ఉంటున్నారని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో వారు పనిచేసే ఆసుపత్రికి వెళ్లి రావడానికే ఎక్కువ సేపు ప్రయాణం చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఎక్కువమంది విధులకు డుమ్మా కొడుతున్నారని, 40% గైర్హాజరు ఉంటోందని నివేదిక స్పష్టం చేసింది. దీంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందించడం ప్రధాన సవాల్గా మారిందని ఆ నివేదిక అభిప్రాయపడింది. అధికంగా ఉన్న చోట నుంచి లేని చోటకు సిబ్బంది ఇక రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రుల్లో ఎక్కువ మంది, కొన్నిచోట్ల మరీ తక్కువ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతం, అక్కడి జనాభా అవసరాలకు అనుగుణంగా వైద్యులు, ఇతర సిబ్బందిని సర్దుబాటు చేయాలని ఆ నివేదిక సర్కారుకు ప్రతిపాదించింది. ఆ ప్రకారమే ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. ఎంతమంది సిబ్బందిని ఒకచోట నుంచి మరో చోటకు మార్చాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. త్వరలోనే సిబ్బందిని గుర్తించి వారిని అవసరమైనచోటకు పంపిస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు జిల్లా కేంద్రాల్లోనే ఏళ్లుగా పాతుకుపోయిన వారికి స్థానచలనం తప్పకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
స్టాఫ్ నర్స్.. ఇక నర్సింగ్ ఆఫీసర్
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సు హోదాను నర్సింగ్ ఆఫీసర్గా కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. అలాగే అనేక నర్సింగ్ పోస్టుల హోదాలను మార్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎయిమ్స్, ఈఎస్ఐ, రైల్వే ఆసుపత్రులు సహా ఇతర ఆసుపత్రుల్లో కొత్త హోదాను అమలు చేస్తోంది. దీన్ని కొన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. ఆ ప్రకారం తెలంగాణలోనూ నర్సింగ్ పోస్టుల్లో ఉన్న వారికి కొత్త హోదాలు ఇవ్వాలని నర్సులు కోరుతున్నారు. హోదాను మార్చడం వల్ల సమాజంలో గౌరవం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కేంద్రం వీటిని తె చ్చింది. హోదాను మార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికపరమైన భారం ఏమీ ఉండదంటున్నారు. బీఎస్సీ నాలుగేళ్లు, ఎంఎస్సీ రెండేళ్లు, పీహెచ్డీ ఏళ్లు చదివినా కూడా ప్రాథమికంగా స్టాఫ్ నర్సు పోస్టే ఉంటుంది. దీనివల్ల ఉన్నతస్థాయిలోని నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన వారు సరైన గౌరవం పొందలేకపోతున్నారని చెబుతున్నారు. ఆసుపత్రుల్లో అనేక విధానపరమైన నిర్ణయాల్లో డాక్టర్లు భాగస్వాములుగా ఉంటున్నారని, అధిపతులుగా కూడా వారే ఉంటున్నారన్న విమర్శలున్నాయి. ఇలా నర్సులపై వివక్ష కొనసాగుతోందన్న ఆందోళన ఉంది. పైగా నర్సింగ్ డైరెక్టరేట్ లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు నర్సులు చెబుతున్నారు. -
డాక్టర్ల బదిలీలకు రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలోని స్పెషలిస్ట్ డాక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. వారికి జోనల్ కేటాయింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. 317 జీవో ప్రకారం జోనల్ కేటాయింపులు చేపట్టనున్నారు. మల్టీ జోనల్ కేడర్ పరిధిలోకి వచ్చే సివిల్ అసిస్టెంట్ సర్జన్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ కేడర్లో ఉన్న డాక్టర్ల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని తన పరిధిలోని అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు ఇచ్చారు. జోనల్ కేటాయింపు పూర్తయ్యాక కొన్ని ఆసుపత్రుల్లో అవసరానికి మించి ఎక్కువ మంది డాక్టర్లు ఒకేచోట పనిచేస్తున్నారు. వారిలో అనేకమందిని అవసరం ఉన్నచోటకు బదిలీ చేసేందుకుగాను డాక్టర్ల రేషనలైజేషన్(హేతుబద్ధీకరణ) ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత నర్సులు, పారామెడికల్, క్లర్క్లకు కూడా జోనల్ కేటాయింపు చేసి బదిలీలు చేస్తారు. 600 మంది డాక్టర్లు... 2 వేలకుపైగా నర్సులు రాష్ట్రంలో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్యులకు, ఇతర ఉద్యోగులకు ఇప్పటికే బదిలీలు జరిగిన విషయం విదితమే. ఏడు జోన్ల పరిధిలో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్యసిబ్బందికి పెద్దఎత్తున జోనల్ కేటాయింపులు, బదిలీలు జరిగాయి. అప్పుడు జోనల్ కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని అనేకమంది ఉద్యోగులు ఆందోళన చెందారు. కానీ, ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉండటంతో వారంతా ఎక్కడికక్కడే ఉండిపోయారు. ప్రస్తుతం టీవీవీపీ పరిధిలోని జిల్లా, ఏరియా, సామాజిక ఆసుపత్రుల్లో జోనల్ కేటాయింపులు, అనంతరం బదిలీలు జరగనున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో 600కుపైగా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఇతరులు స్పెషలిస్ట్ వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు 2 వేలకుపైగా నర్సులు, 500కుపైగా ఉన్న పారామెడికల్ సిబ్బందికి బదిలీలు జరుగుతాయి. ముందుగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ కేడర్లోని డాక్టర్లు, ఆ తర్వాత నర్సులు, ఇతర ఉద్యోగులకు జోనల్ కేటాయింపులు జరిపి బదిలీలు చేస్తారు. జోనల్ కేటాయింపులు కఠినంగా కాకుండా, ఉద్యోగుల ఆప్షన్ల ప్రకారమే చేపడతారు. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇష్టారాజ్యంగా జోనల్ మార్పులు జరిగాయని వచ్చిన విమర్శల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోనున్నారు. చేనేతపై జీఎస్టీ రద్దుచేయాలి కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి లేఖ సాక్షి, హైదరాబాద్: చేనేతపై విధించిన 5% జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ సూచన మేరకు చేపట్టిన పోస్ట్ కార్డ్ ఉద్యమంలో భాగంగా ఎర్రబెల్లి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం చేనేతను ప్రోత్సాహకాలిచ్చి ఆదుకుంటుంటే, కేంద్రం మాత్రం జీఎస్టీతో వారి నడ్డి విరుస్తోందన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత ప్రజలు ఎక్కువగా ఆధార పడిన చేనేత రంగంపై జీఎస్టీ విధించడం అన్యాయమన్నారు. -
వీడియోకాల్లో డాక్టర్ సూచనలు.. గర్భిణికి ప్రసవం చేసిన నర్సులు.. శిశువు మృతి
సాక్షి, చెన్నై: ఆస్పత్రిలో విధులకు రాకుండా వీడియో కాల్ ద్వారా నర్సుల సాయంతో ఓ గర్భిణికి డాక్టర్ ప్రసవం చేయించే ప్రయత్నం చేశాడు. శిశువు మరణించడం, తల్లి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆగమేఘాలపై పెద్దాస్పత్రికి తరలించారు. మధురాంతకంలో ఈ ఘటన మంగళవారం పెద్ద వివాదానికి దారి తీసింది. వివరాలు.. మదురాంతకం సునాంబేడు అండార్ కుప్పం గ్రామానికి చెందిన మురళి(36) ఎలక్ట్రిషియన్. ఆయన భార్య పుష్ప (33) రెండోసారి గర్భం దాల్చింది. అప్పటి నుంచి వీరు ఇల్లిడు గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకుంటూ వస్తున్నారు. పురిటి నొప్పులు రావడంతో పుష్పను సోమవారం సాయంత్రం ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో అక్కడ వైద్యులు లేరు. ఉన్న ముగ్గురు నర్సులో ఆమెను అడ్మిట్ చేశారు. గంట తర్వాత క్రమంగా నొప్పులు అధికం కావడంతో ప్రసవం చేయడానికి నర్సులు సిద్ధమయ్యారు. అయితే, బిడ్డ తల బయటకు రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో వైద్యుడిని సంప్రదించగా వీడియో కాల్ సాయంతో ప్రసవం చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. రక్తస్రావం అధికం కావడంతో 108 ద్వారా పుష్ప, శిశువును మధురాంతకం ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గం మధ్యలో శిశువు మరణించింది. పుష్ప పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో శిశువు మరణించిన సమాచారం అందించడం, వీడియో కాల్ ద్వారా నర్సులు ప్రసవం చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో పుష్ప బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం మధురాంతకం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగడంతో పోలీసులు రంగంలోకి దిగి సముదాయించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. చదవండి: ‘చిన్న చిన్న తప్పులు చేశాను’..అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని -
నర్సులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం
సాక్షి, అమరావతి: నర్సులకు శిక్షణ ఇచ్చే స్టేట్ మిడ్వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఎస్ఎంఐటీ)లను రాష్ట్రంలోని 10 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో దశలవారీగా ప్రారంభించాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఇప్పటికే తిరుపతి, గుంటూరు నర్సింగ్ కాలేజీల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మాతా, శిశు సంరక్షణ, ప్రసూతి సేవలను నర్సుల ద్వారా అందించే ఉద్దేశంతో.. వారిలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ‘పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరీ’ కోర్సును కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరీ(ఎన్పీఎం) కోర్సుకు సంబంధించి పలు మార్గదర్శకాలతో వైద్య శాఖ గురువారం ఉత్తర్వులిచ్చింది. 18 నెలల పాటు నర్సులకు మిడ్వైఫరీ శిక్షణ ఇస్తారు. ఇందులో ఏడాది పాటు శిక్షణ, 6 నెలలు ఇంటర్న్షిప్ ఉంటుంది. వీరికి శిక్షణ ఇవ్వడానికి ప్రతి ఎస్ఎంఐటీలో ఆరుగురు మిడ్వైఫరీ ఎడ్యుకేటర్లు ఉంటారు. ఎన్పీఎం శిక్షణ పొందడానికి ఇన్సర్వీస్లో ఉన్న శాశ్వత, కాంట్రాక్ట్ నర్సులు అర్హులు. 45 ఏళ్లలోపు వయసు, జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్ విద్యార్హత, ప్రసవాలు నిర్వహించడంలో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఈ కోర్సు వ్యవహారాలను డీఎంఈ పర్యవేక్షిస్తారు. శిక్షణ అనంతరం నర్సులకు సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. -
ఎనలేని సేవకు ప్రతిరూపం
దేవుడు అన్నిచోట్లా ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడని అంటారు.. అనారోగ్యంపాలై.. ఆస్పత్రిలో ఉన్నప్పుడు అమ్మ కన్నా మిన్నగా చూసే నర్సునూ సృష్టించాడంటే అతిశయోక్తి కాదు.. తెల్లని దుస్తుల్లో మిలమిలా మెరుస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. వారు అందించే సేవలు నిరుపమానం. కరోనా సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి రోగులకు పునర్జన్మనిచ్చిన ఆ అమృతమూర్తులకు నేడు నర్సుల దినోత్సవం సందర్భంగా వందనం.. అభివందనం. గుంటూరు మెడికల్: అనారోగ్యం పాలైనప్పుడు రక్తసంబంధీకులే దరి చేరని రోజులివీ.. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకూ మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ.. ఆస్పత్రి బెడ్పై కాలిన, కుళ్లిన గాయాలతో, దుర్గంధం వెదజల్లే శరీరభాగాలతో ఉన్న స్థితిలో ఎవరైనా ఆ రోగివైపు కన్నెత్తి చూస్తారా? కానీ ఆ స్థితిలోనూ అతనితో ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో సకల సేవలూ చేసే నర్సులు దేవతలతో సమానం. ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. జీవితాంతం కృతజ్ఞత చూపించడం తప్ప. ఈ రోజే ఎందుకంటే.. రెండో ప్రపంచ యుద్ధకాలంలో గాయపడిన సైనికులకు విశేష సేవలందించిన నర్సు ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు మే 12న. అందుకే ఏటా ఆ రోజున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటారు. నర్సింగ్ పోస్టుల భర్తీకి సీఎం ప్రాధాన్యం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని టీచింగ్ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్నర్సుల పోస్టులు మంజూరు చేశారు. గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం ఏఎన్ఎంలు ఉండేవారు. ఇప్పుడు వారి స్థానంలో జీఎన్ఎం నర్సులను నియమించారు. గ్రామాల్లోనూ బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని మిడ్లెవల్ హెల్త్ ప్రొవైడర్లుగా నియమించారు. 200 మందికి ఇన్ సర్వీస్ కోటాలో జీఎన్ఎం కోర్సును అభ్యసించే అవకాశం కల్పించారు. గుంటూరు జీజీహెచ్లో ఒకే సారి 250 స్టాఫ్నర్సు పోస్టులను మంజూరు చేశారు. అమ్మ కూడా నర్సే అమ్మ సముద్రాదేవి స్టాఫ్నర్సుగా గుంటూరు జీజీహెచ్లో వైద్యసేవలు అందించారు. ఆమెతోపాటు అప్పుడప్పుడు ఆస్పత్రికి వచ్చేదానిని. ఆమె స్ఫూర్తితో నేనూ ఈ వృత్తిలోకి వచ్చా. హైదరాబాద్లో 2000లో జీఎన్ఎం కోర్సును పూర్తి చేశా. ప్రభుత్వ నర్సుగా ఉద్యోగం వచ్చింది. తొలి పోస్టింగ్ డిచ్పల్లిలో. 22 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నా. రోగులకు సేవలందించడం సంతృప్తినిస్తోంది. – చిలువూరి కిరణ్మయి, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్ డాక్టర్ కావాలనుకున్నా.. డాక్టర్ కావాలనుకున్నా.. కానీ అనివార్య కారణాల వల్ల కుదరలేదు. అందుకే నర్సునయ్యా. 22 ఏళ్లుగా పనిచేస్తున్నా. కోవిడ్ సమయంలో చేసిన సేవలకు ఉన్నతాధికారులు వచ్చి అభినందించడం మరిచిపోలేని అనుభూతి. – పొట్లూరు మంజు, జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్–2) అమ్మ కోరిక మేరకు.. అమ్మ కోరిక మేరకు నర్సింగ్ వృత్తిలోకి ప్రవేశించాను. 39 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను. ఎక్కువగా పసికందులకు చికిత్స అందించే ఎన్ఐసీయూలో పనిచేశాను. చికిత్స అనంతరం పిల్లలు వెళ్లే సమయంలో వారి తల్లిదండ్రులు చేతులు జోడించి చూపే కృతజ్ఞతతో పడిన కష్టమంతా మరిచిపోతాను. – షేక్ సమీనా, జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ (గ్రేడ్–2) -
డబ్ల్యూహెచ్వో కీలక సూచనలు.. ఇకపై నర్సులూ..
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక వైద్యంలో నర్సులకు స్థానం కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. మందుల చీటీ (ప్రిస్కిప్షన్) రాసే అవకాశం కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు మన దేశానికి కొన్ని సూచనలు చేస్తూ నివేదిక విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ పూర్తయిన నర్సులకు ఆరు నెలల శిక్షణ ఇచ్చి వారితో మందులు ఇప్పించవచ్చని తెలిపింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లకు ప్రత్యేకంగా నిర్ణీత కోర్సు చేసినవారికి ప్రిస్కిప్షన్ రాసే అవకాశం కల్పించారు. ఆ రాష్ట్రంలో రూరల్ మెడికల్ అటెండర్ (ఆర్ఎంఏ) వ్యవస్థ ఉంది. వారికి కొన్ని రకాల మందులు రాసే అధికారం, వైద్యం చేసేందుకు అవకాశం కల్పిం చారు. ఎసిడిటీ మందులు, యాంటీబయోటిక్స్, టీబీ, మలేరియా, లెప్రసీ, అమీబియాసిస్, గజ్జి, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరస్కు సంబంధించిన మందులు ఇవ్వొచ్చు. వాంతులు, జ్వరాలు, నొప్పు లు, విరేచనాలు, ఆస్తమా, దగ్గు, గర్భం ఆపే మందులు, విటమిన్లు, సాధారణ ప్రసవాలు జరిగాక మందులను ఇచ్చే అవకాశం ఆర్ఎంఏలకు ఇచ్చారు. వాళ్లే కొన్ని ఆపరేషన్లు చేస్తున్నారు. దెబ్బతగిలితే కుట్లు వేయడం, కాలిన గాయాలకు డ్రెసిం గ్ చేయడం, ఎముకలు విరిగితే కట్లు కట్టడం, ప్రమాదం జరిగితే రక్తస్రావం జరగకుండా చేయడం, ప్రసవాలు చేయడం, ప్రసవాల్లో చిన్నచిన్న సమస్యలు వస్తే వాటికి చికిత్స చేయడం, రక్తస్రావాలు జరిగితే ఆపడం వంటివి చేయాలి. అయితే పోస్ట్మార్టం, మెడికల్ లీగల్ కేసులు వంటి వాటిలో నర్సులకు అవకాశం కల్పించలేదు. ఇలా చత్తీస్ఘడ్ మాదిరిగా దేశవ్యాప్తంగా అమలుచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)లో మిడ్ లెవల్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు మందుల చీటీ ఇవ్వొచ్చని ఉంది. ఆ ప్రకారం నర్సులకు కూడా అవకాశం కల్పించాలని సూచించింది. డాక్టర్ల కొరత ఉన్నందున... కోవిడ్ వల్ల దేశంలో డాక్టర్లు ఆయా చికిత్సలపై దృష్టి సారించాల్సి వచ్చింది. పైగా భారత్లో డాక్టర్లు కొరత ఉంది. 11 వేల మందికి ఒక ప్రభుత్వ డాక్టర్ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. వెయ్యి జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. తక్కువ ఉన్నందున ఆ కొరతను నర్సులతో పూడ్చవచ్చు. దేశంలో యూనివర్సల్ హెల్త్ కేర్ను తీసుకురావాలని భావిస్తున్నారు. కాబట్టి వైద్య సిబ్బందిని వాడుకోవాలి. వైద్య పరిశోధనల్లో తేలిందేంటంటే.. ప్రాథమిక ఆరోగ్యంలో నర్సులు, వైద్యులు చేసే వైద్యంలో పెద్దగా తేడా లేదు. డాక్టర్లు, నర్సులు చేసిన చికిత్సలు సమానంగా ఉన్నాయి. అంతేకాదు అమెరికాలో శిక్షణ పొందిన నర్సులు వైద్యంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మరికొన్ని అంశాలు ►నర్సులు రోగంపై సొంతంగా నిర్ణయం తీసుకొని మందులు ఇవ్వడం లేదా డాక్టర్ పర్యవేక్షణలో ఇవ్వడం లేదా రెండు పద్ధతుల్లో ఇవ్వడం వంటివి చేయవచ్చు. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్లో ఈ పరిస్థితి ఉంది. పోలండ్లో మాస్టర్ నర్సింగ్ కోర్సు చేసినవారికి మందులు ఇచ్చే అవకాశం కల్పించారు. డెన్మార్క్లో డాక్టర్ పర్యవేక్షణలో నర్సులు మందులు ఇచ్చే పరిస్థితి ఉంది. ►భారత్లో దశల వారీగా కొన్ని నిర్ణీత జబ్బులకు మందులు ఇచ్చే అవకాశం కల్పించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ►ప్రస్తుతం ఇండియాలో మెడికల్ ప్రాక్టీషనర్లు మాత్రమే మందులు ఇవ్వాలన్న నిబంధన ఉంది. దాన్ని సవరించాలి. ఆ ప్రకారం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ట్ యాక్ట్–1940ని సవరించాలి. అలాగే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యాక్ట్–1947ను సవరిస్తూ, వారికి అధికారాలు కల్పించాలి. ఎన్ఎంసీ–2019 యాక్ట్లో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ జాబితాలో నర్సులను చేర్చాలి. ►నర్సింగ్ విద్యలో పెనుమార్పులు తీసుకురావాలి. ప్రాక్టీస్ చేయడానికి ముందు వారికి శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం మాస్టర్ నర్సింగ్లో నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ క్రిటికల్ కేర్ అనే కోర్సు ఉంది. దాని తరహాలో నర్సింగ్లో కోర్సు పెట్టాలి. ►కొన్ని మందులతో ప్రారంభించి వాటిని పెంచుకుంటూ పోవాలి. ప్రాథమిక వైద్యం డిగ్రీ నర్సింగ్లోనే కోర్సు ఉండాలి. ïజిల్లా, మెడికల్ కాలేజీల్లో పనిచేసే వారికోసం పీజీ లెవల్లో ప్రత్యేక కోర్సు ఉండాలి. -
Gandhi Hospital: కరోనా విధుల్లో కాబోయే అమ్మలు
గాంధీఆస్పత్రి: కడుపులో పెరుగుతున్న శిశువులను మోస్తూ వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. బాధితులకు మేమున్నామనే భరోసా కల్పిస్తున్నారు. పేగుబంధం.. పడకపై ఉన్న ప్రాణం రెండూ తమకు ముఖ్యమేనంటున్నారు కరోనా విధులు నిర్వహిస్తున్న కాబోయే అమ్మలు. కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పలువురు గర్భిణులు రెండు ప్రాణాలను పణంగా పెట్టి నర్సింగ్ విధులు నిర్వహిస్తూ నైటింగేల్ వారసులుగా నిరూపించుకుంటున్నారు. గర్భంతో ఉండి కరోనా డ్యూటీ చేస్తున్నావా? అని ముక్కున వేలేసుకున్న ఇరుగుపొరుగువారి మాటలు పట్టించుకోకుండా, కుటుంబ సభ్యులు, సన్నిహితులు వారిస్తున్నా లెక్కచేయలేదు. కడుపులో పెరుగుతున్న శిశువుకు ఎటువంటి హాని కలగకుండా.. తాము ఒత్తిడికి గురికాకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ బాధ్యతలు సమపాళ్లలో నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. గాంధీఆస్పత్రిలో నర్సింగ్ విధులు నిర్వహిస్తున్న వారిలో పదిమంది గర్భిణులు ఉన్నారు. నాలుగు నుంచి ఎనిమిది నెలలు నిండినవారు కరోనాను లెక్క చేయకుండా విధులు నిర్వహించడం విశేషం. గర్భిణులైన నర్సింగ్ సిస్టర్స్ అశ్వినీ, రాణి, అనిత, అఖిల, గంగా, కవిత, సరోజ, రవళిలు అందిస్తున్న సేవలను గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, నర్సింగ్ సూపరింటెండెంట్ మంగమ్మల అభినందనలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు ఏమంటున్నారంటే.. తగిన జాగ్రత్తలు తీసుకున్నా.. వృత్తిధర్మాన్ని గౌరవించి భర్త నందకిషోర్, కుటుంబ సభ్యులు సహకరించారు. గాంధీ గైనకాలజీ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాను. కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్య విషయమై ఆందోళన ఉన్నప్పటికీ కరోనా విధుల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకున్నాను. డ్యూటీలో చేరిన నాడు చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను. కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యా. కొన్ని రోజుల్లోనే నెగెటివ్ రావడం, కడుపులో పెరుగుతున్న శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుసుకుని, తిరిగి విధుల్లో చేరాను. –అశ్వినీ సేవలు అందించేందుకే.. ఇప్పుడు నాకు ఏడో నెల. గాంధీఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిపై నర్సింగ్ విధులు నిర్వహిస్తున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కావడంతో కోవిడ్ నోడల్ సెంటరైన గాంధీఆస్పత్రిలో డ్యూ టీ చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించలేదు. సేవలు అందించేందుకే ఈ వృత్తిని ఎంచుకున్నానని అందరినీ ఒప్పించాను. నెలల నిండేంత వరకు డ్యూటీకి హాజరవుతాను. శిశువు ఆరోగ్యంపై ఆందోళన ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. భర్త సాయిబాబా, కుటుంబసభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. – రాణి మా శ్రమను గుర్తిస్తే చాలు.. కడుపులో పెరుగుతున్న శిశువుతో పాటు రెండు ప్రాణాలకు తెగించి అందిస్తున్న సేవలను గుర్తించి ప్రోత్సహిస్తే సహచరులు కూడా రెట్టించిన ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు. కరోనాను జయించి బాధితులు డిశ్చార్జి అవుతున్న క్షణాలు మరిచిపోలేనివి. నేను విధులు నిర్వహించే వార్డులో గర్భిణీ బాధితులు ఉన్నారు. నేను కూడా ప్రెగ్నెన్సీతో మీతోపాటే వార్డులో ఉన్నాను అంటూ ధైర్యం చెప్పడంతో వారంతా త్వరితగతిన కోలుకోవడం ఓ గొప్ప అనుభవం. పీపీఈ కిట్ వేసుకుని విధులు నిర్వహించాలంటే ఓర్పు, సహనంతోపాటు మానసికబలం ఎంతో అవసరం. – అనిత చదవండి: హైదరాబాద్లోని పిల్లల్లో ఇవి తక్కువగా ఉన్నాయి -
ప్రజల తరఫున మీ సేవలకు సెల్యూట్
సాక్షి, అమరావతి: కోవిడ్ విపత్తు వేళ డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్విరామంగా అందిస్తున్నసేవలకు ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధన్యవాదాలు తెలియచేశారు. ‘స్పందన’ సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం వివిధ జిల్లాలకు చెందిన వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. తొలుత కర్నూలు జనరల్ ఆస్పత్రి నుంచి వైద్య నిపుణుడు డాక్టర్ రవి కళాధర్, విశాఖ నుంచి స్టాఫ్ నర్స్ విజయలక్ష్మి, నెల్లూరు జీజీహెచ్ ఎంఎన్వో సురేష్బాబుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇలా.. ఓ తల్లి మాత్రమే చేయగలదు: సీఎం జగన్ నిజానికి మేం మీకు స్ఫూర్తినివ్వాల్సి ఉన్నా.. మీ మాటలు మాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు అసమానం. ప్రాణాంతకమని తెలిసినా ఎక్కడా వెనక్కు తగ్గకుండా మీరు ఆస్పత్రుల్లో రోగులకు చేస్తున్న సేవలు.. ఒక తల్లి తన బిడ్డకు మాత్రమే చేయగలదు. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. మా వైపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనసులో పెట్టుకోవద్దు... ఒకవేళ మావైపు నుంచి కానీ, అధికారుల నుంచి కానీ ఏమైనా పొరపాట్లు జరిగితే మనసులో పెట్టుకోవద్దు. మీకు ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధం. మీ సేవలు అమోఘం. వైద్య సిబ్బంది సేవలకు ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేనిది. కిట్లు వేసుకున్నా, మాస్క్లు ధరించినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అయినా కూడా వెనుకాడకుండా ఎంతో సేవలందిస్తున్నారు. అందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున మీకు సెల్యూట్ చేస్తున్నా. ప్రభుత్వాస్పత్రుల్లో సమస్త సదుపాయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆస్పత్రులలో ఇప్పుడు అన్ని సదుపాయాలున్నాయని, మందులు, ఔషధాలు మొదలు అన్ని వసతులున్నాయని డాక్టర్ రవి కళాధర్, స్టాఫ్ నర్స్ విజయలక్ష్మి, ఎంఎన్వో సురేష్బాబు ముఖ్యమంత్రికి తెలిపారు. కోవిడ్ సమయంలో ఎక్కడా లోటు లేకుండా రోగులకు సేవలందిస్తున్నామని, అది తమ బాధ్యతని చెప్పారు. రోగుల ప్రాణాలు కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు అందుతున్నాయని తెలిపారు. మీ మాటలు మాకెంతో స్థైరాన్నిచ్చాయి: డాక్టర్ రవి కళాధర్ ప్రభుత్వాస్పత్రుల్లో ఒకప్పుడు పారాసిటమల్ లాంటి చిన్న చిన్న మాత్రలు, కాటన్, సిరంజి లాంటివి కూడా బయట కొనుక్కోమని చెప్పేవాళ్లం. దీంతో పేషెంట్లు గొడవ పడేవారు. ఒక్కోసారి దాడి చేసేవారు. ఉద్యోగం అంటే విరక్తి కలిగేది. అలాంటిది ఇప్పుడు కలలో కూడా ఊహించని విధంగా కరోనా చికిత్సలకు ఖరీదైన ఇంజక్షన్లు, యాంటి బయోటిక్స్, అత్యంత ఖరీదైన పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. పేదలు, గతిలేనివారే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తారనే భావన ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ కన్నా మెరుగ్గా తీర్దిదిద్దారు. వీవీఐపీలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు కూడా జీజీహెచ్కు వస్తున్నారు. కోవిడ్ లాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వ ఆస్పత్రిలో మీరు (సీఎం) సమస్త సదుపాయాలు కల్పించారు. ఏ మందులకూ కొరత లేదు. ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దిన ఘనత మీదే. మీ మాటలు మాకెంతో స్థైరాన్ని ఇచ్చాయి. తొలి నుంచి కరోనా విషయంలో వాస్తవాలను నిర్మొహమాటంగా చెప్పారు. ఇప్పుడు అందరూ అవే చెబుతున్నారు. -
వైరల్: కరోనా బాధితులతో డాన్స్ చేయించిన నర్సులు
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో రోజురోజు కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో కరోనా సోకి చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు డాక్టర్లు, నర్సులు మనోధైర్యాన్ని నింపుతున్నారు. అయితే అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నర్సులు కోవిడ్ బాధితుల్లో హుషారు నింపారు. ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపే పాటలు వేసి వారితో కలసి నృత్యాలు చేశారు. బాధితులు కూడా నర్సులతో మమేకం అయి స్టెప్పులు వేశారు. నిత్యం మంచంపైనే ఆందోళనకరంగా గడుపుతున్న తమకు నర్సులు ధైర్యం కలిగించారని బాధితులు సంతోషం వ్యక్తంచేశారు. కోవిడ్ విధులు నిర్వర్తిస్తున్న భార్గవి, రాణి, కృష్ణవేణి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మానసిక ఆందోళనను తగ్గించి ధైర్యంగా సంతోషంగా ఉంచేందుకు ఇలా చేశామని నర్సులు చెబుతున్నారు. అయితే కరోనా పేషెంట్లతో నర్సులు డాన్స్ చేయించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నర్సులను శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. బాధితులను ఉల్లాసంగా ఉంచితే.. ప్రతి ఒక్కరు కరోనాను జయిస్తారని అంటున్నారు. చదవండి: పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్కు డీసీజీఐ ఆమోదం -
కామారెడ్డి ఆస్పత్రి లో కోవిడ్ పేషెంట్ల తో కలిసి నర్సుల డాన్స్
-
విస్తారా బంపరాఫర్: వారికి ఉచితంగా విమానయానం
ముంబై: కోవిడ్ విస్తరిస్తున్న వేళ వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి.. కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విమానాయన సంస్థ విస్తారా వైద్య సిబ్బందికి బంపరాఫర్ ప్రకటించింది. వైద్యులు, నర్సులు తమ విమానాల్లో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. విస్తారా ఎయిర్లైన్స్ ఆదివారం ఈ ఆఫర్ను ప్రకటించింది. పౌర విమానయాన శాఖకు ఈ విషయాన్ని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రభుత్వ సంస్థలకు చెందిన డాక్టర్లు, నర్సులు ఉచితంగా తమ విమానంలో ప్రయాణించొచ్చు అని విస్తారా ప్రకటించింది. ఈ మేరకు విస్తారా ఎయిర్లైన్స్ పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పఢీకి లేఖ రాసింది. ప్రభుత్వ సంస్థలు, హాస్పిటల్స్కు తక్షణ సాయం అందించేందుకు రెడీగా ఉన్నామని విస్తారా తెలిపింది. ఎయిర్ లాజిస్టిక్స్ సర్వీసులు కూడా పొందొచ్చని పేర్కొంది. ఇక ఉచిత ప్రయాణం ఆఫర్లో విస్తారా ఒక కండీషన్ పెట్టింది. సీట్ల లభ్యత ప్రాతిపదికన ముందుగా వచ్చే మెడికల్ ప్రొఫెషనల్స్కు ముందు సీట్ల కేటాయింపు ఉంటుందని ఎయిర్లైన్స్ పేర్కొంది. ఇక ఈ ఆఫర్ పొందాలనుకునే వైద్య సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను చూపించాలని తెలిపింది. చదవండి: యూఎస్కు నాన్స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను -
సంగీతంతో ఒత్తిడికి చెక్
కరోనా సెకండ్ వేవ్లో పెద్ద సంఖ్యలో వైద్యులు కరోనా బారిన పడుతున్నారు. ప్రజలకు చికిత్స అందించాల్సిన వైద్యులే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంచనాల ప్రకారం ఇప్పటివరకు భారత్లో 747 మంది వైద్యులు కోవిడ్-19తో మృతి చెందారు. కళ్ల ముందే ప్రజలు పిట్టల్లా రాలిపోతూ ఉండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతూ, కుటుంబాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి రావడంతో వైద్యులు ఒత్తిడి నుంచి దూరమవడానికి సంగీతాన్నే మార్గంగా ఎంచుకున్నారు. సంగీతంతో కరోనా రోగుల్లోనే కాకుండా, వైద్యుల్లో కూడా ఒత్తిడి మాయమవుతుందని డాక్టర్ అనినా పటేల్ చెబుతున్నారు. వైద్యుల డ్యాన్స్ వీడియోలు ట్రోల్ అవుతున్నా కరోనా ఒత్తిడిని జయించడానికి సంగీతమే మార్గమని వారంటున్నారు. చదవండి: దేశంలో కొత్తగా 3,49,691 కరోనా కేసులు -
'కోవిడ్ టైమ్లో తిండీ నిద్రా పట్టించుకోలేదు'
ఒకరు శుక్రా... మరొకరు అరుణకుమారి. ఇద్దరూ నర్సులుగా జీవితాన్ని మొదలుపెట్టారు. వృత్తినే దైవంగా భావించారు. కుటుంబ సమస్యలేవీ వృత్తిలోకి రానివ్వలేదు. వృత్తిలో ఉండే ఒత్తిడి ఏదీ కుటుంబాన్ని చుట్టుముట్టనివ్వలేదు. నమ్ముకున్న పనికి సంపూర్ణ న్యాయం చేయాలనే దిశగా అడుగులు వేశారు. దాని ఫలితంగానే ఈ ఏడాది వైద్య, ఆరోగ్య సేవా రంగంలో జాతీయ స్థాయిలో 56 మందికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల జాబితా ప్రకటించగా వారిలో తెలంగాణా నుంచి ఈ ఇద్దరూ ఉన్నారు. ఈ సందర్భంగా వీరిని సాక్షి పలకరించింది. ► నైటింగేల్ అవార్డు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? శుక్రా: ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. దేవుడు గొప్ప వరం ఇచ్చిండు. వర్ణించడానికి కూడా మాటల్లేవు. 28 ఏళ్లు కష్టం చేసిన. కానీ, ఇప్పుడు ఈ అవార్డు ముందట ఆ కష్టమేమీ కనిపించడం లేదు. మా ఇంట్ల, చుట్టుపక్కల, ఊర్లలో కూడా చాలా సంతోషపడుతున్నరు. సన్మానం చేస్తాం అంటున్నరు. వాళ్ల అభిమానమే నాకు పెద్ద అవార్డు. అరుణ: సేవలో దేవుని గుర్తింపు ఉంటుందని ఎప్పుడూ నమ్ముతాను. అది ఈ రోజు నిజమైనందుకు సంతోషంగా ఉంది. 22 ఏళ్లుగా ఏఎన్ఎమ్గా సేవలు అందిస్తున్నా. ఈ అవార్డు ఉందని తెలుసు. కానీ, అంతమందిలో నన్ను వరిస్తుందనుకోలేదు. ► ఈ రంగంలోకి రావాలని ఎలా అనుకున్నారు? శుక్రా: చిన్నప్పుడు తిండికి కూడా లేక బాధపడిన రోజులు ఉన్నాయి. మా ఊరి బడి 5వ తరగతి వరకే. ఆ తర్వాత మా నాన్న నన్ను బాలసదన్ లో వేశాడు. అక్కడే టెంత్ వరకు చదువుకున్నా. తర్వాత నర్స్ ట్రెయినింగ్ చేశాను. మా తాత వాళ్లది రామారం. అక్కడి వాళ్లకు సేవ చేయాలని ఉండేది. ఆ తండాల వాళ్లు అబ్దుల్లా మనవరాలు వచ్చిందని, డాక్టరమ్మ వచ్చిందని అనేవారు. నేను సిస్టర్నే కానీ, వాళ్లంతా నాకు డాక్టరమ్మ అని బిరుదు ఇచ్చారు. ఆ పిలుపు నాకెంతో అమూల్యమైనది. అరుణ: మా నాన్న జాన్, అమ్మ శోభారాణి నా కష్టానికి వెన్నుదన్నుగా నిలిచారు. ఎప్పుడైనా సెలవు పెట్టినా నాన్న వెంటనే ‘ఏదైనా అత్యవసరం ఉంటేనే లీవు పెట్టు తల్లీ. అక్కడ ఎవరికి ఏం అవసరం ఉంటుందో ఏమో..’ అని చెప్పేవారు. మా నాన్న ఉండుంటే ఆయనకే ఈ అవార్డును కానుకగా ఇచ్చేదాన్ని. 1998లో హైదరాబాద్ గుడిమల్కాపూర్లోని యుహెచ్పిలో జాయినయ్యాను. 2008 నుంచి విజయనగర్ కాలనీలోని యుపిహెచ్లో విధులు నిర్వర్తిస్తున్నా. చిన్నప్పటి నుంచి నా చుట్టు ఉన్నవాళ్లకు నాకు చేతనయినంత సాయం చేయాలనుకునేదాన్ని. మా మేనమామలు నర్సింగ్ అయితే నీ ఆలోచనకు సూటవుతుందని చెప్పారు. దాంతో టెన్త్ తర్వాత ఎఎన్ఎమ్గా శిక్షణ తీసుకున్నాను. ► కోవిడ్–19 సమయంలో ఎదుర్కొన్న కష్టాలు.. శుక్రా: ఏం భయపడలేదు. ఉద్యోగమే దేవుడు. నాకేమైనా అయితే ఆ దేవుడే చూసుకుంటాడు అనుకున్నాను. ఊరూరూ తిరిగి కరోనా గురించి, పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్పిన. ఇంట్లో వాళ్లు కూడా నన్ను దూరం పెట్టలేదు. నాకు కరోనా పాజిటివ్ వచ్చినా తట్టుకున్నా. కొన్ని రోజులు ఇంట్లో ఉండి తర్వాత డ్యూటీకి వెళ్లిపోయిన. అరుణ: కోవిడ్ టైమ్లో తిండీ నిద్రా పట్టించుకున్నది లేదు. అర్ధరాత్రుళ్లు కూడా బయల్దేరేవాళ్లం. కరోనా పేషంట్స్ అంటే వాళ్ల ఇంట్లోవాళ్లు కూడా భయపడేవాళ్లు. కానీ, వాళ్లను పట్టుకొని అంబులెన్స్ ఎక్కించి, హోమ్ క్వారంటైన్లో ఉంచి, రోజూ వెళ్లి వారి హెల్త్ చెక్ చేసి వస్తే ‘మమ్మల్ని చూసి మా ఇంట్లో వాళ్లే పక్కకు పోతున్నారు. ఇలాంటి సమయంలో మీరు మాకు చేసిన సేవకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం..’ అని కన్నీళ్లు పెట్టుకునేవారు. అలా అందరి దీవెనలు నాకు, నా పిల్లలకు వస్తాయనుకుంటాను. కరోనా పేషంట్ల మధ్య ఉండటం వల్ల నాకూ కరోనా వచ్చింది. డాక్టర్ల సలహాతో 15 రోజుల హోమ్ క్వారంటైన్లో ఉన్నాను. ఆ తర్వాత రోజే డ్యూటీలో జాయిన్ అయ్యాను. మొదట్లో హాస్పిటల్ నుంచి ఇంటికి వెళితే నన్ను చూసి భయపడేవారు వాళ్లకూ కరోనా వస్తుందేమో అని. మేం ఉండే అపార్ట్మెంట్లో చాలా మంది 50, 60 వయసు పైబడిన వారే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టారు. దేవుని మీద భారం వేసి ముందుకెళ్లేవాళ్లం. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాం. మాతో పాటు ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్లు కూడా తీసుకున్నారు. ఎవరూ భయపడలేదు. వ్యాక్సిన్ తర్వాత కూడా అందరం ఆన్డ్యూటీలోనే ఉన్నాం. చేసే పని ఏదైనా అంకితభావంగా చేసుకుంటూ పోతే విజయం తప్పక వరిస్తుందన్నది నా నమ్మకం. ► ఇప్పటి వరకు వచ్చిన అవార్డులు.. శుక్రా: తండాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడంలో అవార్డు వచ్చింది. స్మితా సబర్వాల్, ఆమ్రపాలి చేతుల మీదుగా అందుకున్నాను. డిఎన్హెచ్ లో ఆరు అవార్డులు వచ్చాయి. వ్యాధుల గురించి అవగాహన కలిగించే పాటలు రాస్తాను. సీడీ ఆవిష్కరణ కూడా చేశాం. గిరిజన డ్యాన్సుల్లో పాల్గొన్నాను. అందుకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పటిదాకా పదిహేనుకు పైగా అవార్డులు వచ్చాయి. కానీ, ఇన్నేళ్లయినా ప్రమోషన్లు లేవు. ఎప్పటికైనా ముఖ్యమంత్రిని కలవాలన్నది నా ఆశ. అరుణ: ఇప్పటివరకు బెస్ట్ ఏఎన్ఎమ్గా ఆరు అవార్డులు తీసుకున్నాను. కోవిడ్ డ్యూటీ చేసినందుకు కేటీఆర్ సార్ నుంచి ప్రశంసలు అందుకున్నాను. ఇప్పుడీ నైటింగేల్ అవార్డు. ఉద్యోగం ఎప్పుడూ నాకు బెస్ట్ ఇస్తూనే ఉంది. ► కుటుంబ జీవనంలో కష్టాలు విధి నిర్వహణకు అడ్డు పడిన సందర్భాలేమైనా ఉన్నాయా? శుక్రా: కుటుంబం గడవడానికి బాగా కష్టపడ్డా. టెన్త్ అయిపోగానే పెళ్లి చేశారు. మా ఆయనకు ఉద్యోగం లేదు. కొద్దిరోజులు కూలికి కూడా పోయిన. అప్పుడు ఆయన కొన్ని రోజులు డెయిలీ వేజ్ చేసేవారు. పిల్లలను చూసుకోవడానికి ఎవరూ లేకున్నా వెంట తీసుకొని ఉద్యోగానికి పోయాను కానీ, విధి నిర్వహణకు అడ్డుపడనీయలేదు. అందుకే, ఇప్పుడు అవార్డు తీసుకొని ఊళ్లకు వచ్చిన రోజున ‘నిన్ను రథం మీద తీసుకొస్తం’ అంటున్నరు నా పిల్లలు. అరుణ: ట్రెయినింగ్ అవుతూనే పెళ్లయ్యింది. మా వారు ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. ఇద్దరు అమ్మాయిలు. గుండెపోటు వల్ల 2006లో మా ఆయన చనిపోయారు. గుండె చిక్కబట్టుకొని పిల్లల్ని చదివించి, పెళ్లిళ్లు చేశాను. పెద్దమ్మాయి బీకామ్ కంప్యూటర్స్, చిన్నమ్మాయి బీఎస్సీ నర్సింగ్ అయింది. ఎంత కష్టమొచ్చినా ఉద్యోగం ఉద్యోగమే. మా అమ్మానాన్న, తమ్ముళ్లు, మేనమామలు.. నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల నిలదొక్కుకున్నాను. హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని యుపిహెచ్లో నర్సింగ్ విధులను నిర్వర్తిస్తున్నారు అరుణ. వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ సబ్ సెంటర్లో ఏఎన్ఎంగా విధులను నిర్వర్తిస్తున్నారు శుక్రా. – నిర్మలారెడ్డి -
రెండేళ్లలో 10,000 మంది నర్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో 10 వేల మంది నర్సులను నియమించేందుకు కసరత్తు మొదలైంది. ప్రాథమిక ఆరోగ్యం పరిపుష్టం చేయడంలో భాగంగా సర్కారు ఈ ప్రక్రియను చేపట్టింది. కుగ్రామంలోని ప్రజలకు కూడా ప్రాథమిక వైద్యం అందించాలని, దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఆరోగ్య సిబ్బందిని నియమించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవస్థను రూపొందించాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు)ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలన్నింటినీ వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్గా ఉన్నతీకరిస్తున్నారు. మొత్తం 10,030 హెల్త్ కినిక్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 8,615 క్లినిక్స్కు కొత్తగా భవన నిర్మాణాలు చేపడుతుండగా, మిగతా వాటికి బిల్డింగ్లు ఉన్నాయి. ► మొత్తం 10,030 హెల్త్ క్లినిక్స్లో బీఎస్సీ నర్సింగ్ చదివిన అభ్యర్థులను నియమిస్తున్నారు. ► ఆయుష్మాన్ భారత్లో భాగంగా కొత్తగా చేపడుతున్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్కు జాతీయ హెల్త్ మిషన్ నిధులిస్తోంది. ► ప్రతి కేంద్రంలోనూ ఒక బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థి ఉండాలి. ఇప్పటికే 4,060 మంది నర్సుల నియామకానికి కేంద్రం అనుమతించింది. మిగతా 6 వేల నియామకాలకు త్వరలోనే అనుమతివ్వనుంది. ► ఎంపికైన నర్సులకు ఆరు మాసాలు ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ) నిపుణులు శిక్షణ ఇస్తారు. ► శిక్షణ సమయంలో నర్సులకు స్టైఫండ్తో పాటు అకామిడేషన్, భోజన వసతి కల్పిస్తారు. ► కొత్త నిర్మాణాల కోసం రూ.1,745 కోట్లు వ్యయం చేస్తున్నారు. భారతదేశంలో ఎక్కువ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్లోనే. ప్రతి హెల్త్కినిక్కూ పీహెచ్సీతో అనుసంధానం చేస్తారు. హెల్త్ క్లినిక్లలో 12 రకాల సేవలు ► గర్భిణులకు, చిన్నారులకు ప్రత్యేక సేవలు ► నవజాత శిశువులు టీకాలు ► చిన్నారులు, యుక్త వయసు వారికి వైద్య సేవలు ► కుటుంబ నియంత్రణకు సంబంధించి ప్రత్యేక సేవలు ► సాంక్రమిక వ్యాధులకు గురికాకుండా పటిష్ట చర్యలు ► సాంక్రమిక వ్యాధుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ► మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి రాకుండా చర్యలు తీసుకోవడం ► కన్ను, చెవి సమస్యలను ముందే పరిష్కరించేలా చర్యలు ► సాధారణ ఆరోగ్య సంబంధిత సేవలు ► వృద్ధుల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు ► అత్యవసర సేవల్లో భాగంగా వైద్యం ► చిన్న చిన్న మానసిక సమస్యలకు ప్రాథమిక దశలోనే స్క్రీనింగ్ ముమ్మరంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం ప్రస్తుతం 8,604 భవన నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. పంచాయతీరాజ్ విభాగం ఈ పనులను చేపట్టింది. 5,010 భవనాలు ఎర్త్ వర్క్ దశలో ఉన్నాయి. మరో 1,519 బేస్మెంట్ లెవెల్కు వచ్చాయి. వీలైనంత త్వరలో అన్నింటినీ పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. యథావిధిగా నర్సుల నియామకం చేపడతాం. – అనిల్ కుమార్ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ -
కరోనాపై యుద్ధంలో సమిధలు
వాషింగ్టన్: కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు కీలకంగా పనిచేస్తున్నారు. వారంతా తమ ప్రాణాలను పణంగా పెడుతూ కరోనా బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో ఉండగా కరోనా వైరస్ సోకి అర్ధాంతరంగా మరణిస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటిదాకా 1,500 మంది నర్సులు కరోనా బారినపడి ప్రాణాలు వదిలారని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్(ఐసీఎన్) తాజాగా వెల్లడించింది. ఇవి కేవలం 44 దేశాలకు సంబంధించిన గణాంకాలే. 1914 నుంచి 1918 దాకా నాలుగేళ్లపాటు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలోనూ దాదాపు 1,500 మంది నర్సులు మరణించారని అంచనా. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయిన నర్సుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని సీఏసీఎన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోవార్డ్ కాటన్ చెప్పారు. అన్ని దేశాల్లో నర్సుల మరణాలను పూర్తి స్థాయిలో నమోదు చేయకపోవడం బాధాకరమని అన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం కంటే ఇప్పుడు కరోనా రక్కసి ఎక్కువ మంది నర్సుల ప్రాణాలను బలిగొన్నట్లు స్పష్టమవుతోంది. చాలా దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్లు వార్తలొస్తున్నాయి. నర్సుల మరణాలు ఎన్నో రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2020 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద నర్సు అండ్ మిడ్వైఫ్గా జరుపుకుంటున్నారు. అలాగే ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతి కూడా ఈ సంవత్సరమే. ఒకవేళ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇప్పుడు జీవించి ఉంటే.. కరోనాపై పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్న నర్సుల పరిస్థితి చూసి తీవ్రంగా చలించిపోయేవారని హోవార్డ్ కాటన్ వ్యాఖ్యానించారు. బ్రిటన్లో లాక్డౌన్ లండన్: కరోనా వైరస్ పంజా విసురుతుండడంతో బ్రిటన్ వణికిపోతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటేసింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి మరోసారి పూర్తిస్థాయి లాక్డౌన్ విధించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. గురువారం నుంచి జనమంతా ఇళ్లకే పరిమితం కావాలని, అనవసరంగా బయటకు రావొద్దని యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్టే ఎట్ హోం(లాక్డౌన్) నిబంధనలు జారీ చేశారు. డిసెంబర్ 2వ తేదీ వరకు ఇవి అమల్లో ఉంటాయి. అంటే దాదాపు నెల రోజులపాటు లాక్డౌన్ అమలు చేయనున్నారు. ఏప్రిల్లో బయటపడిన కరోనా కేసుల కంటే ఇప్పుడు మరిన్ని కేసులు నమోదవుతున్నాయని బోరిస్ జాన్సన్ చెప్పారు. మరణాల సంఖ్య సైతం అదేస్థాయిలో పెరుగుతోందని అన్నారు. మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే ప్రస్తుతం మన ముందున్న ఏకైక మార్గం సంపూర్ణ లాక్డౌన్ మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. -
నర్సులే బాస్లు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య ఉప కేంద్రాలకు నర్సులనే బాస్లుగా నియమించాలని సర్కా ర్ నిర్ణయించింది. పల్లెవాసులకు వైద్యసేవలను మరింత చేరువ చేసేందుకు ఆరోగ్య ఉప కేంద్రాల బలోపేతంపై దృష్టిపెట్టింది. గురువారం వైద్య, ఆరోగ్య శాఖపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలోనూ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 4,905 ఆరోగ్య ఉపకేంద్రాలున్నాయి. వీటిలో ఏఎన్ఎంలే ప్రస్తుతం బాస్లుగా ఉన్నారు. ఆయా ఉపకేంద్రాల్లో టీకాలు ఇవ్వడం, గర్భిణులు, పిల్లలకు మందులి వ్వడం వంటివి నిర్వహిస్తున్నారు. వీటిలో ఇక నుంచి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్హెచ్పీ) అనే హోదాను ఏర్పాటు చేస్తారు. దానికి నర్సులే బాస్లుగా ఉంటారు. టీకాలు, మందులు ఇవ్వడం వరకే పరిమితం కాకుండా షుగర్ టెస్టులు, బీపీ చెక్ చేయడం తదితర ఆరోగ్య సేవలు అందిస్తారు. ఎంఎల్హెచ్పీలుగా నియమితులవ్వడానికి బీఎస్సీ నర్సింగ్ అర్హతగా నిర్ణయించారు. సబ్ సెంటర్లనే హెల్త్ వెల్నెస్ సెంటర్లుగా మార్చడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కిందిస్థాయిలో ఇవి పనిచేస్తాయి. రోగులను ఉప కేంద్రాల నుంచి వీటికి రిఫర్ చేస్తారు. ఔట్సోర్సింగ్లకూ అవకాశం ప్రభుత్వ వైద్యంలో ఇప్పటికే రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమితులైన నర్సులను ఉప కేంద్రాల్లో నియమిస్తారు. ఉప కేంద్రాల్లో పనిచేసే నర్సు లకు 6 నెలలు బ్రిడ్జి కోర్సులో శిక్షణనిస్తారు. శిక్షణ పూర్తయ్యా క నెలకు రూ.25 వేల చొప్పున వేతనం ఇస్తారు. పనితీరు ఆధారం గా నెలకు రూ.15 వేల వరకు పారితోషికం ఇస్తారు. ఎంపికైన వారిలో శాశ్వ త ఉద్యోగులుంటే ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా వారికి వేతనం ఉంటుంది. పారితోషికాన్ని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఇస్తా రు. ఎంపికైన ఎంఎల్హెచ్పీలు మూడేళ్ల పాటు ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేయాలి. ఆ మేరకు హామీపత్రం ఇవ్వాలి. వీరు ఉప కేంద్రం ఉన్నచోటే నివాసం ఉండాలి. -
ప్రజలందరికీ రక్షకులు నర్సులు
న్యూఢిల్లీ: ఎదుటివారని రక్షించేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతోన్న రక్షకులు అంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నర్సులను అభివర్ణించారు. సోమవారం రాష్ట్రపతి భవన్లో నర్సింగ్ కమ్యూనిటీ సభ్యులతో కలిసి కోవింద్ రక్షాబంధన్ను జరుపుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కి నర్సులు రాఖీలు కట్టి, కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కోవడంలో తమ అనుభవాలను రాష్ట్రపతితో పంచుకున్నారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్ని ఎదుర్కోవడంలో ముందు వరుసలో నిలిచి పోరాడుతోన్న నర్సుల సేవలను, వారి నిబద్ధతను, కొనియాడిన రామ్నాథ్ కోవింద్ వారిని సత్కరించారు. సహజంగా రక్షాబంధన్ రోజు, తమ సోదరుల నుంచి అక్కాచెల్లెళ్ళు రక్షణను కోరకుంటారు. అయితే నర్సులు మాత్రం ఎంతో నిబద్ధతతో, అంకిత భావంతో సోదరులకు, ప్రజలందరికీ రక్షణగా నిలుస్తారు అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నర్సులపై ప్రశంసల వర్షం కురిపించారు. కోవిడ్ మహమ్మారితో పోరాడుతోన్న వారికి సేవలందిస్తూ కరోనా బారిన పడినప్పటికీ తిరిగి కోలుకుని, నూతన శక్తితో విధులను నిర్వర్తించిన సైనిక విభాగంలోని నర్సులను ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రశంసించారు. నర్సులందరికీ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. -
హైదరాబాద్లో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: ఓ వైపు కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తుంటే.. మరోవైపు పలు ప్రైవేట్ ఆస్పత్రులు దారుణానికి పాల్పడుతున్నాయి. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ డ్యూటీకి రావాలంటూ నర్సులను వేధిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. మోహదీపట్నంలోని నానాల్నగర్లోని ఆలివ్ ఆస్పత్రి యాజమాన్యం తమిళనాడుకు చెందిన నర్సులను నిర్భంధించింది. జ్వరం వచ్చినప్పటికీ ట్యాబ్లెట్ వేసుకుని డ్యూటీకి రావాలంటూ ఉచిత సలహా ఇచ్చింది. దీంతో దిక్కుతోచని నర్సులు ఈ విషయాన్ని తెలంగాణ నర్సింగ్ సమితికి దృష్టికి తీసుకు వెళ్లారు. తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. -
ఔట్ సోర్సింగ్ నర్సులకు రూ.25 వేల వేతనం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడ్డ రోగులకు చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ నర్సుల వేతనాలను రూ.25 వేలకు పెంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అదేవిధంగా పనిచేసిన రోజున రూ.500 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని భావిస్తోంది. వేతనాల పెంపను కోరుతూ గాంధీ ఆస్పత్రిలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళన సరికాదని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు రమేశ్రెడ్డి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తూనే వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈక్రమంలో స్పందించిన ప్రభుత్వం వేతన పెంపుతో పాటు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కోవిడ్–19 ఆస్పత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు కూడా పనిచేసిన రోజున రూ.300 ప్రోత్సాహకం ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం వెలువడే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ బాధితులకు ఇబ్బంది కలగకూడదని సమ్మె విరమిస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. వెంటనే విధుల్లో చేరనున్నట్లు తెలిపింది. -
ఇండిగో : వారికి ప్రత్యేక తగ్గింపు
సాక్షి, ముంబై: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో వైద్య సిబ్బందికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో ముందు నిలిచి విశేష సేవలందిస్తున్న వైద్యులు, నర్సులకు విమాన ఛార్జీలపై 25 శాతం తగ్గింపు ఇస్తామని ఇండిగో గురువారం తెలిపింది. టఫ్ కుకీ పేరుతో నిర్వహిస్తున్న ప్రచారంలో ఈ తగ్గింపును అందిస్తున్నట్టు వెల్లడించింది. ఇండిగో వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసేటప్పుడు ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ ఆఫర్ 2020 ఏడాది చివరి వరకు వర్తింపజేస్తామని ప్రకటించింది. ఇందుకు చెక్-ఇన్ సమయంలో వారి గుర్తింపునకు సంబంధించిన ఆసుపత్రి ఐడిలను అందించాల్సి ఉంటుందని ఇండిగో ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. జూలై 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020 టికెట్ల కొనుగోలుకు, ప్రయాణానికి ఈ తగ్గింపు చెల్లుతుందని తెలిపింది. అంతేకాదు వీరి ప్రత్యేకతను ప్రయాణంలో ప్రతి దశలో గుర్తించేలా చేస్తుందని వెల్లడించింది. ఇండిగో చెక్-ఇన్ వద్ద కుకీ టిన్, బోర్డింగ్ గేట్ వద్ద స్వాగత ప్రకటన, పీపీఈ కిట్ పై ప్రత్యేక టఫ్ కుకీ స్టిక్కర్ తోపాటు, విమానంలో వారికి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతామని వెల్లడించింది. -
300 మందికి పైగా నర్సుల రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కేసులతో కోల్కతా, హౌరాలు పోరాడుతుంటే ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేసే 300 మందికి పైగా నర్సులు తమ ఉద్యోగాలను వీడి మణిపూర్, త్రిపుర, ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారి స్వస్థలాలకు తరలివెళ్లారు. నర్సులు అనూహ్యంగా విధులకు దూరమవడంతో ఆయా ఆస్పత్రుల్లో రోగుల సేవలకు ఆటంకం ఎదురైంది. సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ సిన్హాకు తూర్పు భారత ఆస్పత్రుల సంఘం (ఏహెచ్ఈఐ) లేఖ రాసింది. కాగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం గత వారం 185 మంది నర్సులు మణిపూర్కు వెళ్లారు. ఇక శనివారం 169 మంది నర్సులు స్వస్థలాలకు వెళ్లారు. వీరిలో 92 మంది మణిపూర్కు చెందిన వారు కాగా, 32 మంది ఒడిషా..43 మంది త్రిపుకు చెందిన వారని కోల్కతా నగరానికి చెందిన ప్రైవేట్ ఆస్పత్రుల వర్గాలు తెలిపాయి. కాగా, నర్సులు ఎందుకు హఠాత్తుగా విధులకు రాజీనామా చేయడానికి విస్పష్ట కారణం తెలియరాకున్నా మణిపూర్కు తిరిగివచ్చిన వారికి ఆకర్షణీయ స్టైఫండ్ను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ చేసిందని తెలిసిందని ఏహెచ్ఈఐ చీఫ్ ప్రదీప్ లాల్ మెహతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ ప్రచారం అవాస్తమని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సోషల్ మీడియాలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని చెప్పారు. ఏ ఒక్కరినీ తిరిగి రావాలని తాము కోరలేదని..కోల్కతా, చెన్నై, ఢిల్లీలో వారు సేవలందించడం పట్ల తాము సగర్వంగా భావిస్తున్నామని చెప్పారు. డాక్టర్లు, నర్సులు వారు పనిచేసే ఆస్పత్రుల్లో అసౌకర్యంగా భావిస్తే అది వారు పనిచేసే సంస్థల నిర్వాహకులే అందుకు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. వారు అక్కడే పనిచేయాలని తాము వారిని ఒత్తిడి చేయలేమని చెప్పుకొచ్చారు. భద్రతకు సంబంధించిన ఆందోళన, తల్లితండ్రుల ఒత్తిడితోనే తాను ఉద్యోగాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందని మణిపూర్ తిరిగి వచ్చిన ఓ నర్సు వ్యాఖ్యానించారు. చదవండి : వాటి వల్ల కరోనా చావదు: డబ్ల్యూహెచ్వో -
దాతృత్వాన్ని పెంపొందించుకోవాలి: జవహర్రెడ్డి
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో పోరాడుతున్న నర్సులు కోసం 10 వేల సర్జికల్, 2500 ఎన్-95 మాస్కుల్ని టీఎన్ఏఐ ఏపీ ప్రతినిధులు అందించారు. శుక్రవారం ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఎన్ఏఐ) ఏపీ బ్రాంచ్ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ జవహర్రెడ్డిని కలిసి మాస్క్లను అందజేశారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. టీఎన్ఎఐ ప్రతినిధుల సామాజిక బాధ్యతను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంలో అందరి భాగస్వామ్యం కావాలని.. దాతృత్వాన్ని పెంపొందించుకోవాలని జవహర్రెడ్డి కోరారు. -
ఆస్పత్రుల్లో నర్సుల తైతక్కలేమిటీ?
-
ఆస్పత్రుల్లో నర్సుల తైతక్కలేమిటీ?
లండన్ : రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసులతో భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలకు కాస్త కాలక్షేపంతోపాటు కాస్త ఆనందాన్ని ఇవ్వాలనుకున్నారేమో పలు ఆస్పత్రులకు చెందిన నర్సులు. వారు తమ చేతుల్లో ఉన్న వైద్య పరికరాలను ఎక్కడివక్కడ వదిలేసి గెంతుకుంటూ వరండాల్లోకి వచ్చి డ్యాన్సులు చేశారు. కొన్ని ఆస్పత్రులకు చెందిన నర్సులు ముఖానికి మాస్క్లు, చేతులకు గ్లౌజులు తొడుక్కొని డ్యాన్స్ చేయగా, మరో ఆస్పత్రి నర్సులు కేవలం మాస్క్లతోనే డ్యాన్స్ చేశారు. ఇతర ఆస్పత్రులకు చెందిన నర్సులు మాస్క్లు, గ్లౌజులు ఏవీ లేకుండా డ్యాన్స్ చేశారు. కరోనా మహమ్మారి కుమ్మేస్తున్న తరుణంలో పాటించాల్సిన సామాజిక దూరాన్ని కూడా నర్సులు పాటించకుండా డ్యాన్స్లు చేయడం పట్ల ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది. ఏ క్షణం ఎవరి ప్రాణం పోతుందో తెలియని క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన నర్సులు కూడా డ్యాన్స్లో పాల్గొనడాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. ‘మీకిదేం పోయేకాలం!’ అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. నర్సుల్లో తమ విధుల పట్ల కొత్త ఉత్సాహాన్ని, కొత్త స్ఫూర్తిని నింపాలనే సదుద్దేశంలో ‘ఎన్హెచ్ఎస్ ట్రస్ట్’ లండన్, బకింగమ్షైర్, లీడ్స్, వోల్వర్హంటన్, మిడ్లాండ్స్ ఆస్పత్రుల్లోని నర్సులతో డ్యాన్స్లు చేయించి ఆ వీడియోలను ‘టిక్టాక్’లో పోస్ట్ చేసింది. ఎన్హెచ్ఎస్ ట్రస్ట్ ఆశయం మంచిదే అయినా, సరైన సందర్భం కాకపోవడంతో సోషల్ మీడియాతోపాటు ప్రధాన మీడియా ద్వారా ప్రజలు తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘స్కానింగ్లు, ఆపరేషన్లు ఆపేసి వచ్చి ఇలా తైతక్కలాడుతున్నారా?’ అంటూ క్యాన్సర్ రోగుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. చదవండి: ‘వుహాన్’ డైరీలో సంచలన విషయాలు -
హమ్మయ్య.. సమ్మె విరమించారు
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి అవుట్ సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది సమ్మె విరమించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్తో జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో విధులకు హాజరైనట్టు అవుట్ సోర్సింగ్ స్టాఫ్నర్సుల యూనియన్ ప్రతినిధులు తెలిపారు. దశలవారీగా హామీలను నెరువేరుస్తామని మంత్రి హామీయిచ్చారని వెల్లడించారు. పదమూడేళ్లుగా గాంధీ ఆస్పత్రిలో 212 మంది స్టాఫ్నర్సులు అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని కోవిడ్ నోడల్ కేంద్రంగా ప్రకటించడంతో వారంతా ప్రాణాలకు తెగించి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో రెగ్యులరైజ్ చేయాలని లేకుంటే ప్రభుత్వం తరపున కాంట్రాక్టు పద్ధతిలోనైనా తమను తీసుకోవాలని కోరుతూ ఈనెల 15 నుంచి సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధుల బృందం నర్సింహ, మేఘమాల తదితరులు గురువారం మంత్రి ఈటల రాజేందర్ను కలిశారు. తమ డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారని భేటీ అనంతరం వారు ప్రకటించారు. ఈనెల 1న తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ 6 ద్వారా 1,640 నర్సింగ్ సిబ్బందిని అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని, వారికి నెలకు రూ.25 వేలు వేతనం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కరోనా రేగుల మధ్య విధులకు నిర్వహిస్తున్న తమకు కేవలం రూ.750 మాత్రమే ప్రోత్సాహం వస్తోందని, ఒక నెల జీతం ఇన్సెంటివ్గా ప్రకటించాలని మంత్రిని కోరగా సానుకూలత వ్యక్తం చేశారని వెల్లడించారు. నర్సులు సమ్మె విరమించడంతో వైద్యులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: కరోనా.. మరో రెండేళ్లు ఇదే కథ -
వాంటెడ్.. నైటింగేల్స్!
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైద్యరంగంలోని సదుపాయాలు, అనుకూలతలు, ప్రతికూలతలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ఈ ఆపత్కాలంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తోన్న వైద్య సిబ్బందికి గుర్తింపూ వస్తోంది. ఇది ఒక్క మన దేశంలోనే కాదు.. భూమి మీద మనిషి మనుగడ ఉన్న ప్రతి దేశం వైద్య రంగానికి సెల్యూట్ చేస్తోంది. ఏ దేశంలో ఏం జరు గుతుంది.. ఎక్కడి వైద్య సిబ్బంది ఎలా పని చేస్తున్నారు.. ఆయా దేశాల్లో వైద్యులు తగినంత మంది ఉన్నారా.. వారికి సహాయకంగా ఉండే నర్సులు (మిడ్వైఫరీ) చాలినంత మంది ఉన్నారా? వైద్య పరికరాలున్నాయా..? విస్తృత పరిశోధనలకు అవకాశముందా? తగినన్ని ఆర్థిక, వైద్య వనరులున్న దేశాలేమిటీ... ఇలా చెప్పుకుంటూ పోతే వైద్యానికి సంబంధించిన ప్రతి చిన్న అంశమూ ఇప్పుడు చర్చనీయాంశమే. ఆ కోవలోకే వస్తుంది ‘ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ నర్సింగ్–2020’నివేదిక. ప్రపంచంలో నర్సుల కొరత తీవ్రంగా ఉందని, రానున్న పదేళ్లలో ఇది చాలా తీవ్రతరమవుతుందని, భవిష్యత్తులో కరోనా లాంటి మహమ్మారులను ఎదుర్కోవాలంటే ‘నైటింగేల్స్’ కొరత ఉండొద్దని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ (ఐసీఎన్), నర్సింగ్ నౌలు సంయుక్తంగా రూపొందించిన నివేదిక. ప్రతి యేటా ప్రతి దేశంలో 8 శాతం మంది నర్సులు పెరగాల్సిన ఆవశ్యకతను కూడా వివరిస్తోన్న ఈ రిపోర్ట్లోని ముఖ్యాంశాలు: ప్రపంచంలోని మొత్తం వైద్య సిబ్బందిలో సంఖ్యాపరంగా చూస్తే సగానికి పైగా నర్సులే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే అంటు వ్యాధులు, మహమ్మారులను పారదోలడంలో వీరిదే కీలకపాత్ర. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి పనిచేస్తున్న నర్సులు 2.8 కోట్ల మంది. 2013–18 మధ్య కాలంలో ఈ వృత్తిలోకి వచ్చింది కేవలం 4.7 మిలియన్లే. ప్రస్తుత ప్రపంచ జనాభాను బట్టి మొత్తం 59 లక్షల మంది నర్సుల కొరత ఉంది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆగ్నేయాసియా, తూర్పు మధ్యధరా దేశాల్లో నర్సుల కొరత తీవ్రంగా ఉంది. మొత్తం ప్రపంచంలో పనిచేస్తున్న నర్సుల్లో 80 శాతం మంది కొన్ని దేశాల్లోనే ఉన్నారు. ఆయా దేశాల్లోని జనాభాను కలిపితే ప్రపంచ జనాభాలో సగం కన్నా కొద్దిగా ఎక్కువుంటుంది. అంటే మిగిలిన ప్రపంచంలోని సగం కన్నా జనాభా ఉన్న అన్ని దేశాల్లో కలిపి ఉన్న నర్సులు 20 శాతం మందే. ప్రతి 8 మంది నర్సుల్లో ఒకరు తాము జన్మించి శిక్షణ పొందిన దేశాల్లో కాకుండా వేరే దేశాల్లో పనిచేస్తున్నారు. మరో విషయం ఏంటంటే.. ప్రతి ఆరుగురిలో ఒక నర్సు రానున్న పదేళ్లలో రిటైర్మెంట్ వయసు దాటబోతున్నారు. అంటే రానున్న పదేళ్లలో 17 శాతం మంది నర్సులు పదవీవిరమణ పొందబోతున్నారు. వైద్యరంగానికి తక్కువగా ఖర్చు పెడుతున్న దేశాలు తమ దేశంలో ఉన్న నర్సుల సంఖ్యలో ప్రతియేటా 8 శాతం పెంచుకోవాలి. ఆ మేరకు వారికి శిక్షణ ఇచ్చి వైద్య రంగంలో ఇముడ్చుకోవాలి. ఇందుకోసం ప్రతి మనిషి తలసరి ఆదాయంలో 10 యూఎస్ డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే మన దేశ లెక్కల ప్రకారం దాదాపు 750 రూపాయల పైమాటే. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న నర్సుల్లో 90 శాతం మంది మహిళలే ఉన్నారు. కానీ, కీలకమైన పోస్టుల్లో మాత్రం తక్కువ మంది ఉన్నారు. ఈ పోస్టుల్లో ఎక్కువమంది పురుషులుండటం మంచిది ప్రపంచంలోని దేశాల వారీ పరిస్థితులను, ఆయా దేశాల్లో నర్సింగ్ సౌకర్యాలు, తీసుకోవాల్సిన చర్యల గురించిన పూర్తి నివేదిక ఈ ఏడాది మేలో విడుదల కానుంది. -
కరోనా వైరస్: ఆరోగ్య ప్రదాతలు
కనిపించే దేవుళ్లు వైద్యులు అంటారు. అది ముమ్మాటికీ నిజమని ప్రస్తుత పరిస్థితిలో అంగీకరించకతప్పదు. కరోనా మహమ్మారిని జయించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన లాక్డౌన్ పిలుపుతో ప్రజలు చాలావరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజలకు నిరంతర సేవలు అందిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. సాక్షి, చిత్తూరు: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ వైద్య సేవలకు ఎటువంటి అంతరాయమూ లేకుండా వైద్యాధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని 45 లక్షలకు పైగా ఉన్న జనాభా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఓ వైపు కోవిడ్ పరీక్షలు చేస్తూనే మరోవైపు సాధారణ చెకప్లు, అత్యవసర సేవలు, కాన్పులు, జ్వరం, జలుబు, దగ్గు, శరీర నొప్పులను పరీక్షిస్తూ మందులు ఇస్తున్నారు. తిరుపతి, చిత్తూరులో కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసి, అవసరమైన ప్రత్యేక సౌకర్యాలు కలి్పంచి, అనుమానితులకు, పాజిటివ్ కేసులకు వైద్యం అందిస్తున్నారు. నిరంతర సేవలు జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో నిరంతర వైద్య సేవలు అందుతున్నాయి. జిల్లాలో 602మంది వైద్యులు, 700 మంది నర్సులు, 1,200 మంది ఎఎన్ఎంలు, 227 మందికి పారా మెడికల్ సిబ్బంది, 390 మంది శానిటేషన్, క్లాస్–4 సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు 175 మంది 108 సిబ్బంది 40 అంబులెన్స్ల ద్వారా అత్యవసర సేవల్లో నిమగ్నమయ్యారు. 3వేల మంది ఆశ కార్యకర్తలు, 80 మంది వైద్యమిత్రలు, 400 సబ్సెంటర్ల సూపర్వైజర్లు రోగులకు సేవలను అందిస్తున్నారు. జిల్లా ఆస్పత్రుల్లో.. జిల్లా ఆస్పత్రులైన చిత్తూరు, మదనపల్లెలోని క్యాజువాలిటీలో జ్వరం, జలుబు, దగ్గుతో పాటు అత్యవసర సేవలు అందిస్తున్నారు. అవసరమైతే రోగిని వార్డులో అడ్మిట్ చేసి సేవలు అందిస్తున్నారు. వీటితో పాటు జిల్లాలో రోజుకు 42మంది తల్లు్లకు పురుడు పోస్తున్నారు. ఇక పీహెచ్సీ, సబ్సెంటర్లలో రోగులు జ్వరం, జలుబు, బీపీ, షుగర్ వంటి రోగాలకు పరీక్షలు చేసుకుంటూ, మందులు తీసుకుంటున్నారు. టెలీ మెడిసిన్ జిల్లాలోని 101 పీహెచ్సీ, 9 సీఎం ఆరోగ్య కేంద్రాల్లో బీపీ, షుగర్, గైనిక్ తదితర సమస్యలకు టెలీ మెడిసిన్ ద్వారా వైద్యం చేస్తున్నారు. తిరుపతి రుయాలోని టెలిహబ్లోని వైద్యులు ఆన్లైన్లో సలహాలు సూచనలు ఇస్తున్నారు. వీడియా కాల్స్ తీసుకుని, పేషెంట్లతో నేరుగా మాట్లాడి, వారి సమ స్యలు తెలుసుకుని ఏ మందులు వాడాలో చెబుతున్నారు. జిల్లాలో రోజూ 400 మంది రోగులు పీహెచ్సీ, ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు పొందుతున్నారు. అంతరాయాలు లేవు జిల్లాలో కోవిడ్ నివారణ చర్యలు చేస్తున్నప్పటిరీ పీహెచ్సీ, ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలకు ఎటువంటి అంతరాయాలూ లేవు. 108 ద్వారా అత్యవసర కేసులను ఆస్పత్రులకు తరలించి, చికిత్స చేస్తున్నాం. సేవలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకున్నాం. – పెంచలయ్య, డీఎంహెచ్ఓ -
‘టీ వర్క్స్’ టెక్నాలజీతో ఎయిరోసోల్ బాక్సులు
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులకు రక్షణ కవచంలా పనిచేసే ఎయిరోసోల్ బాక్సులు, మాస్క్ల తయారీకి అవసరమైన సాంకేతికతను రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనుబంధ సంస్థ ‘టీవర్క్స్’అందించింది. నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)తో పాటు బటర్ఫ్లై ఎడ్యుఫీల్డ్ అనే సంస్థ కూడా ఎయిరోసోల్ బాక్సుల తయారీలో పాలుపంచుకుంది. శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడే వారికి నోరు, శ్వాసనాళం ద్వారా ఎండో ట్రాకియల్ ట్యూబ్ను అమర్చేందుకు పారదర్శకంగా ఉండే ఈ ఎయిరోసోల్ బాక్సులు ఉపయోగపడతాయి. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్సలో భాగంగా ట్యూబ్ను అమర్చే క్రమంలో వైద్యులు, సహాయ సిబ్బందికి ఈ బాక్సులు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఎయిరోసోల్ బాక్సుల అవసరాన్ని గుర్తించిన నిమ్స్ విద్యార్థుల కోసం ‘డూ ఇట్ యువర్ సెల్ఫ్ సైన్స్ కిట్లు’(డీఐయూ కిట్స్) తయారు చేసే బటర్ఫ్లై ఎడ్యుఫీల్డ్ అనే సంస్థకు బాధ్యత అప్పగించింది. ఈ కిట్ల నమూనాపై ఆన్లైన్లో శోధించిన సదరు సంస్థకు తైవాన్కు చెందిన ఓ వైద్యుడు తయారు చేసిన ఎయిరోసోల్ బాక్స్ నమూనా దొరికింది. వీటిని స్థానికంగా ఉత్పత్తి చేయడంలో సాంకేతిక అవరోధాలు ఎదురవడంతో ‘టీ వర్క్స్’రంగంలోకి దిగి అవసరమైన సాంకేతికతను సమకూర్చింది. స్థానికంగా లభించే ముడివనరులు, సాంకేతికతతో ఎయిరోసోల్ కిట్లను తయారు చేసిన బటర్ఫ్లై ఎడ్యుఫీల్డ్ సంస్థ మరిన్ని నమూనాలు రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించింది. వాడిన కిట్లను పడేయడం (డిస్పోజల్), ఒకసారి ఉపయోగించిన బాక్సులను మళ్లీ వాడటం (రీ యూజబుల్) డిజైన్లు తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కో ఎయిరోసోల్ బాక్సు ధర రూ.2వేలు నుంచి రూ.5వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నిమ్స్కు పది కిట్లు సరఫరా చేసిన బటర్ఫ్లై ఎడ్యుఫీల్డ్ అవసరానికి అనుగుణంగా బాక్సుల సరఫరా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కాగా టీ వర్క్స్ పనితీరుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపిస్తూ ‘అవసరాలే ఆవిష్కరణలకు మాతృక’అని వ్యాఖ్యానించారు. -
కరోనా సరే.. చైనాలో మరో పోరు
జుట్టు ఆడవారికి అందాన్నిస్తుంది. వారిని ఆకర్షణీయంగా మారుస్తుంది. జుట్టుని తీయడమంటే ఒకరకంగా మహిళల్ని అవమానించడమే. కానీ ముంచుకొచ్చింది మామూలు ముప్పు కాదు. కరడుగట్టిన కరోనా. అందులోనూ పెద్ద జుట్టు ఉంటే వైరస్ ఎక్కడ వ్యాపిస్తుందోనని చైనాలో అధికారులు కరోనా వ్యాధిగ్రస్తులకి సేవచేసే మహిళా నర్సులకి జుట్టు కట్ చేస్తున్నారు. అంతేకాదు వారు నిరంతరం సేవలు అందించడం కోసం పీరియడ్స్ రాకుండా పిల్స్ ఇస్తున్నారు. ఇదంతా మహిళలపై చూపిస్తున్న వివక్షేనంటూ అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేళ చైనా ఉమెన్ ఫెడరేషన్ పోరుబాట పట్టింది. కరోనా వ్యాధిగ్రస్తులకు సేవ చేయడానికి ధరించే ఐసోలేషన్ సూట్ ధరించడమే ఇబ్బంది అనుకుంటే.. రేయింబవళ్లు పని చేయిస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్నవారి అవసరాలన్నీ అంచనా వేసిన చైనా ప్రభుత్వం అన్నీ అందించింది కానీ మహి ళలకి శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేయలేకపోయింది. దీంతో నెలసరి వచ్చినప్పుడు మహిళా సిబ్బంది ఎన్నో పాట్లుపడ్డారు. దీనికి విరుగుడుగా నెలసరి వాయిదా వేయడానికి 200 బాటిల్స్ పిల్స్ అధికారులు సరఫరా చేశారు. సహజసిద్ధంగా వచ్చే పీరియడ్స్ని ఆపేస్తే హార్మోన్లపై ప్రభావం చూపిస్తుందంటూ మహిళా నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాలో స్వదేశీయంగా వాడే ట్విట్టర్ తరహా సామాజిక మాధ్యమమైన వైబోలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు వైరల్గా మారాయి. కరోనాపై పోరాటానికి సమాంతరంగా ఇప్పుడు మరో పోరాటం జరుగుతోంది. అవును మరి అక్కడ నర్సుల్ని కమాండ్ చేస్తున్న వారంతా మగవారే. వాళ్లకి ఆడవాళ్ల కష్టాలెలా అర్థమవుతాయి?. -
మన ‘నైటింగేల్స్’కు కష్టాలు
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ వైద్యం చేస్తే... నర్సులు సేవలు చేస్తారు. అటువంటి నర్సు లకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు తక్కు వ వేతనం ఇస్తూ వారి జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. నర్సులకు కనీసం రూ.20 వేల వేతనమివ్వాలని 2016లో కేంద్రం మార్గదర్శ కాలు విడుదల చేసింది. అలాగే 200 పడకల ఆసుపత్రుల్లోని నర్సులకు, ప్రభుత్వ ఆసు పత్రుల మాదిరిగానే జీతాలివ్వాలని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసింది. ఆ ప్రకారం కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రమే కనీస వేతనాలు అమలవుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభు త్వాలు అమలుకు నోటిఫికే షన్లు ఇచ్చాయి. తమిళనాడులో రూ.17 వేల కనీస వేతనం అమలు చేస్తున్నారు. కానీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఇప్పటివరకూ అటువంటి ప్రయత్నాలేవీ చేయడం లేదన్న విమర్శలున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో 8 గంటలకు బదులు 10–12 గంటలు పనిచేయి స్తున్నారు. వేతనాలు రూ.15 వేలు దాటడం లేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కాల్ ఆన్ డ్యూటీ’: కార్పొరేట్ ఆస్పత్రులు ‘కాల్ ఆన్ డ్యూటీ’పేరుతో కొత్త రకపు పద్ధతులను ప్రవేశపెట్టాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, కెనడా తదితర దేశాల్లో ఉన్న కాల్ ఆన్ డ్యూటీ పద్ధతి ఇటీవల రాష్ట్రంలో విస్తరిస్తోంది. ఆ పద్ధతి ద్వారా రోజువారీ, షిప్టుల వారీగా వేతన చెల్లింపుల ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకుంటున్నాయి. దీంతో ఇప్పటికే ఉన్న సిబ్బంది అభద్రతకు గురవుతున్నారు. అత్యవసర సేవల విభాగం ఐసీయూలో కాల్ ఆన్ డ్యూటీలో నర్సులను నియమిస్తున్నారు. ఆయా అత్యవసర విభాగాలకు కేసులు వచ్చిన సమయంలో మాత్రమే షిఫ్టుల వారీగా, రోజు వారీగా చెల్లింపు ప్రాతిపదికన అప్పటికప్పుడు ఫోన్ చేసి పిలిపించుకుంటున్నారు. అలాంటి వారికి రోజు కూలి కొంత ఎక్కువగా ఇస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత మాత్రం లేదు. అయితే ఎక్కువ పనిగంటలు చేయాల్సి ఉంటుంది. సరాసరిగా రోజుకు ఐసీయూలో విధులు నిర్వహించేందుకు రూ.1,000, ఇన్వార్డులో విధులకు రూ.750, నైట్షిప్ట్ అయితే రూ 1,200 ఇస్తున్నట్టు సమాచారం. 2020 నర్సుల సంవత్సరం.. వచ్చే ఏడాదిని నర్సుల సంవత్సరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. రోగులకు ఆరోగ్య సేవలను అందించడంలో నర్సులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపింది. అందువల్ల నర్సింగ్, మిడ్వైఫరీ వర్క్ఫోర్స్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించగలమని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితులున్నాయి. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రతీ వెయ్యి మందికి ఒక డాక్టరు, ప్రతీ 400 మందికి ఒక నర్సు ఉండాలి. కానీ ఇప్పుడు ప్రతి 1,200 మందికి ఒక డాక్టరు, ప్రతీ 600 మందికి ఒక నర్సు చొప్పున ఉన్నారు. ప్రపంచంలో నర్సులను తీర్చిదిద్దుతున్న టాప్ ఐదు దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయినా ఇక్కడ నర్సులకు తీవ్ర కొరత ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19.80 లక్షల మంది నర్సులుండగా ఇంకా 20 లక్షల మంది నర్సులు అవసరం. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపు 88 వేల మంది నర్సులున్నట్లు అంచనా. ఇంకా 30 వేల మంది అవసరముంది. ఇదిలావుండగా రాష్ట్రంలో సర్కారు దవాఖాన్లలో సుమారు 6 వేల నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెరిగిన అవసరాలకు అనుగుణంగా మరో 8 వేల పోస్టులు అవసరమవుతాయి. అయినప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు భర్తీపై దృష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి. కనీస వేతనాలు లేవు.. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే నర్సులకు దారుణంగా వేతనాలు ఇస్తున్నారు. రూ.15 వేలకు మించడంలేదు. కనీసంగా రూ.20 వేలు వేతనం ఇవ్వాలన్న కేంద్రం సిఫార్సులు అమలు కావడం లేదు. దీనిపై రాష్ట్రంలో వైద్య అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో అనేక మంది నర్సింగ్ కోర్సు చదివినవారు నిరుద్యోగులుగా మారుతున్నారు. – రుడావత్ లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భర్తీ లేకపోవడం వల్లే.. చాలామంది నర్సింగ్ కోర్సు చదివి బయటకు వస్తుండటం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. జిల్లాల్లో రూ.10 వేలు, నగరాల్లో రూ.12 వేల నుంచి రూ.15 వేల మధ్య మాత్రమే వేతనాలు ఇస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయడంలేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో టైమింగ్స్ కూడా అదనంగా ఉంటున్నాయి. దీంతో తీవ్రమైన పని భారం పడుతోంది. – నిర్మలారాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ, నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ -
టిక్టాక్ వీడియో వైరల్ : ఉద్యోగానికి ముప్పు
సాక్షి, భువనేశ్వర్ : సోషల్ మీడియాలో వేలం వెర్రిగా మారిన టిక్ టాక్ వీడియోలకు సంబంధించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా ఒడిశాలోని ఒక ఆసుపత్రిలోని నర్సుల టిక్టాక్ వీడియో ఒకటి వైరల్ అయింది. మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో నవజాత శిశువుల వార్డులో పనిచేసే కొంతమంది నర్సులు ఈ వీడియోను తీశారు. నర్సింగ్ డ్రెస్లో బాలీవుడ్ పాటలకు పదం కదుపుతూ ఫన్నీ డైలాగ్ల పెదాలు కలుపుతూ ముచ్చట తీర్చుకున్నారు. కానీ అదే వారికి ఉద్యోగాలకు ముప్పు తేనుంది. ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా ముఖ్య వైద్య అధికారి (సిడిఎంఓ) ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే సదరు నర్సులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించనున్నామని ఆసుపత్రి ఇన్చార్జ్ తపన్ కుమార్ వెల్లడించారు. -
సెక్యూరిటీ గార్డే బలి పశువు
సాక్షి, ఖమ్మం: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లు, నర్సుల నిర్లక్ష్యానికి ఒక సామాన్య సెక్యూరిటీ గార్డు బలయ్యాడు. ఎలాంటి విచారణ చేపట్టకుండానే అర్ధంతరంగా అతడిని విధుల నుంచి తొలగించడంతో ఖమ్మంలోని పెద్దాస్పత్రి మరోసారి వివాదానికి కేంద్ర బిందువైంది. ఆదివారం మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సమయానికి డాక్టర్లు, నర్సులు ఎవ్వరూ లేకపోవడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు బాలింతకు సెలైన్ బాటిల్ ఎక్కించిన ఘటన సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ నిర్లక్ష్యంపై ‘సాక్షి’ ప్రధాన, జిల్లా సంచికల్లో కథనాలు ప్రచురితమైన విషయం విదితమే. ఇంకా పలు పత్రికల్లో వార్తలు రావడం, చానళ్లలో ప్రసారం కావడంతో పెద్దాస్పత్రిలో ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, సెలైన్ ఎక్కించిన సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించడంపై సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు, పేషెంట్ కేర్ సిబ్బంది సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా అలసత్వం ప్రదర్శించిన డాక్టర్లు, నర్సులపై చర్య తీసుకోకుండా సెక్యూరిటీ గార్డును బలిపశువును చేయడమేంటని? ఖండించారు. ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ నాయకులు సంఘీభావం తెలిపారు. సెక్యూరిటీ గార్డును విధుల్లోకి తీసుకొని బాధ్యులైన వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులు పదిలం.. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో కాన్పుకు వచ్చే గర్భిణులకు ప్రసవం తర్వాత వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి..డిశ్చార్జ్ అయ్యే వరకు..డాక్టర్లు, నర్సులు పర్యవేక్షిస్తూ..వైద్యసేవలు అందించాలి. 24 గంటలూ షిఫ్టుల వారీగా వారికి డ్యూటీలు వేస్తారు. కానీ విధుల పట్ల అలసత్వం ప్రదర్శించడం, వారి స్వంత క్లీనిక్లు చూసుకోవడంపై దృష్టి పెడుతుండటంతో బాలింతలు, చిన్నారులకు సరైన వైద్యం అందట్లేదనేది ఆరోపణ. సమయానికి ఎవ్వరూ అందుబాటులో ఉండక..కొన్నిసార్లు అత్యవసర పరిస్థితుల్లో అక్కడి స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు బాలింతలకు సహాయం చేస్తుంటారు. ఇలాంటి ఘటనే..తాజాగా సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి ఎసరు పెట్టింది. సదరు గార్డు సెలైన్ పెట్టిన సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సులను వదిలేసి తాత్కాలిక ఉద్యోగిపై చర్యలు తీసుకోవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న వారిని రక్షించేందుకే సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించారని, ఎలాంటి విచారణ చేపట్టకుండా..తీసేయడం అనుమానాలకు బలం చేకూర్చినట్లైంది. డబ్బులు వసూలు చేస్తున్నారా? డెలివరీ వీడియో తీశారా? – ప్రత్యేకాధికారి విచారణ పెద్దాస్పత్రిలో చోటు చేసుకున్న వరుస ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా వైద్య విధాన పరిషత్ ఉన్నతాధికారును ఆదేశించింది. అందులో భాగంగా వైద్య విధాన పరిషత్ రాష్ట్ర స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ ఏ. రాజశేఖర్ బాబు సోమవారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో విచారణ చేపట్టారు. డాక్టర్లు, నర్సులను వేర్వేరుగా పిలిచి వివరాలు తెలుసుకున్నారు. సెక్యూరిటీ గార్డు సెలైన్ పెట్టిన సమయంలో ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు? అందుబాటులో లేనిదెవరు? తదితర విషయాలపై విచారించారు. గతంలో జరిగిన ఘటనలపై ఆరా తీశారు. ప్రసవించిన సమయంలో మగ, ఆడ పిల్లలు పుడితే ఒక్కోరేటు పెట్టి పేషంట్ల వద్ద నుంచి డబ్బులు గుంజుతున్న విషయంపై కూడా అడిగారు. డాక్టర్లకు స్వంతంగా ఎవరెవరికి క్లీనిక్లు ఉన్నాయో తెలుసుకున్నారు. గత నెల ప్రసవ సమయంలో వీడియోలు తీసిన ఘటనపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆస్పత్రి ఆర్ఎంఓ కృపా ఉషశ్రీ, డాక్టర్ మంగళ పాల్గొన్నారు. బాధ్యులెవరైనా చర్యలు తీసుకుంటాం.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలింతకు సెక్యూరిటీ గార్డు సెలైన్ ఎక్కించిన ఘటనకు సంబంధించి..పూర్వాపరాలు విశ్లేషించి, ఇంకా చోటు చేసుకున్న వరుస ఘటనలకు కారణమైన బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తోంది. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు. డాక్టర్లు, సిబ్బంది ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హాస్పిటల్ వదిలి వెళ్లకూడదు. ప్రసవమప్పుడు బంధువుల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తే ఇంటికి పంపిస్తాం. రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి. అందుకోసం స్వతహాగా ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాలి. ఖాళీ పోస్టులను భర్తీ చేస్తాం. సీటీ స్కాన్, డిజిటల్ ఎక్స్రేను అతి త్వరలో అందుబాటులోకి తెస్తాం. – రాజశేఖర్ బాబు, వైద్యవిధాన పరిషత్ రాష్ట్ర ప్రత్యేకాధికారి -
వైద్యులు లేక డెలివరీ చేసిన నర్సులు శిశువు మృతి
-
కాన్పు చేసిన నర్సులు
కల్వకుర్తి టౌన్: వైద్యులు లేకుండా నర్సులే ఓ మహిళకు ప్రసవం చేయడంతో వారి ప్రయత్నం వికటించి శిశువు మృతి చెందింది. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. కల్వకుర్తి ఎస్ఐ రవి కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఫిరోజ్నగర్కు చెందిన మంగమ్మ కాన్పు కోసం సోమవారం ఉదయం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబీకులతో కలసి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు సాయంత్రం సాధారణ కాన్పు కోసం సిద్ధం చేయాలని నర్సులకు సూచించి వెళ్లిపోయారు. మంగమ్మకు నొప్పులు తీవ్రమవుతున్నా వైద్యులు రాకపోవటంతో నర్సులే కాన్పు చేస్తుండగా.. బిడ్డకు పేగు చుట్టుకుని ఉండటంతో ఆందోళన చెందిన నర్సులు వైద్యుడు శివరాంకు ఫోన్ లో సమాచారం ఇవ్వగా ఆయన వచ్చేటప్పటికే మగ శిశువు చనిపోయాడు. నర్సులు కాన్పులు చేయొచ్చా అని శివరాంను అడిగితే.. ‘సాధారణ కాన్పులు చేయొచ్చు, కానీ క్లిష్ట పరిస్థితి ఎదురైతే వైద్యులకు సమాచారం ఇస్తారు’అని పేర్కొన్నారు. ఈ విషయం తెలియగానే కల్వకుర్తి సీఐ సురేందర్రెడ్డి, ఎస్సై రవి హుటాహుటిన చేరుకుని బాధితులతో మాట్లాడారు. -
వైఎస్ జగన్ ఎదుట నర్సుల ఆవేదన
-
కాన్పు చేసిన నర్సులు.. శిశువు మృతి
సాక్షి, నాగర్కర్నూల్ : వైద్యుల నిర్లక్ష్యంతో మగశిశువు మృతి చెందిన సంఘటన జిల్లా ప్రాంతీయ అస్పత్రిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ మండలంలోని నర్సాయిపల్లి గ్రామానికి చెందిన శివమ్మ అనే గర్భిణికి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సోమవారం తెల్లవారుజామున 5:30 గం.ల సమయంలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి సాధారణ కాన్పు జరుగుతుందని భరోసా కల్పించారు. శివమ్మకు సాయంత్రం నొప్పులు అధికమవడంతో ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడం వల్ల నర్సులు ఆమెకు కాన్పు చేశారు. ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. నర్సులు కాన్పు సరిగ్గా చేయక పోవడంతో పుట్టిన శిశివు కాన్పు అయిన వెంటనే మరణించినట్లు బంధువులు తెలిపారు. దీంతో బాధితులు ఆస్పత్రి ఆవరణలో వైద్యులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
బదిలీలను నిలుపుదల చేయించాలి
జీజీహెచ్ సూపరింటెండెంట్ను కోరిన నర్సులు కాకినాడ వైద్యం : ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తమ బదిలీలను నిలుపుదల చేయించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వాసుపత్రి హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావును సోమవారం కలుసుకుని విపతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్ నర్సుల సంఘం జిల్లా అధ్యక్షురాలు అనూరాధ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలోని జేడీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కౌన్సెలింగ్లో జీజీహెచ్కు చెందిన 76 మంది హెడ్, స్టాఫ్ నర్సులకు బదిలీలు జరిగాయన్నారు. భార్యాభర్తల ఉద్యోగం, అనారోగ్యం వంటి అంశాల్లో బదిలీల నిబంధనలకు ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపులను సైతం అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. సూపర్ స్పెషాలిటీస్ సేవలు అందించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న వారికి బదిలీల్లో ప్రభుత్వం కొన్నిరకాల మినహాయింపులు ఇచ్చిందని వాటిని సైతం పరిగణనలోకి తీసుకోకపోవడం విచారణకరమన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పలువురి నర్సులకు మినహాయింపు ఇవ్వలేదని వాపోయారు. స్టాఫ్,హెడ్ నర్సుల కోసం గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్కి విజ్ఞప్తి చేశారు. కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న తమకు బదిలీలో మినహాయింపు ఇవ్వాలని కోరినా కౌన్సెలింగ్ అధికారులు పట్టించుకోలేదని ఓ స్టాఫ్ నర్సు కన్నీటి పర్యంతమైంది. ఈ విషయమై డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) దృష్టికి తీసుకెళతానని సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గవర్నమెంట్ నర్సుల యూనియన్ సభ్యులు ఆనీ, నర్సింగ్ సూపరింటెండెంట్లు జెసు ప్రియ, అక్కమ్మ, పలువురు ఏపీఎన్జీవో నేతలు పాల్గొన్నారు. -
టీవీ ఛానెల్పై నర్సుల ఫిర్యాదు
హైదరాబాద్: టీవీ కార్యక్రమాలపై ఈ మధ్య కాలంలో ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్లో ప్రసారమైన కార్యక్రమంలో తమను తీవ్రంగా అవమానించారంటూ నర్సులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ టీవీ ఛానెల్లో ఈ నెల 4వ తేదీన ప్రసారమైన పటాస్షోలో నర్సులను కించపరిచేలా అసభ్యంగా మాట్లాడారని తెలంగాణ నర్స్ అసోయేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో జబర్దస్థ్ కార్యక్రమంలో తమను కించపరిచారంటూ న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విశయం తెలిసిందే -
మీ సమస్యలు పరిష్కరిస్తాం
ఔట్సోర్సింగ్ నర్సులతో లక్ష్మారెడ్డి హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి లోని ఔట్సోర్సింగ్ నర్సుల సమస్యలు పరి ష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య, ఆ రోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఓ స్వచ్ఛం ద సంస్థ డయాలసిస్ సెంటర్ను ప్రారం భించేందుకు ఆదివారం గాంధీ ఆస్పత్రికి వచ్చిన మంత్రికి నర్సింగ్ అసోసియేషన్ నా యకులు వినతిపత్రం అందించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరగా మంత్రి సాను కూలంగా స్పందించారు. నర్సింగ్ సిబ్బంది ఆందోళన భగ్నం రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఔట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది శనివారం ఉదయం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కొంతమంది నర్సులు ఆస్పత్రి ప్రధాన భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం ఉత్తర మండలం డీసీపీ సుమతి, టాస్క్ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో మహిళా పోలీసులు నర్సింగ్ సిబ్బంది ఆందోళనను భగ్నం చేశా రు. అనంతరం వారిని అరెస్టు చేసి కొంత మందిని బొల్లారం, మరికొంత మందిని చిలకలగూడ ఠాణాలకు తరలించారు. మం త్రి హామీతో ఆందోళన విరమించి సోమవారం నుంచి విధులకు హజరవుతున్నట్లు నర్సిం గ్ అసోషియేషన్ నాయకులు తెలిపారు. -
గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్తత
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం నుంచి కాంట్రాక్ట్ నర్సులు ఆందోళన చేస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఆస్పత్రి భవనం పైకి ఎక్కి నిరసన తెలుపుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని వారికి సర్దిచెప్తున్నారు. -
'నర్సుల సంక్షేమానికి ప్రత్యేక డైరెక్టరేట్'
హైదరాబాద్: వైద్య, ఆరోగ్య రంగంలో డాక్టర్లతో పాటు నర్సుల పాత్ర కీలకమని, వారి సంక్షేమం కోసం అతి త్వరలోనే ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వైద్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఎన్ఏఐ) తెలంగాణ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఫస్ట్ బైనియల్ కాన్ఫరెన్స్ ను ఎర్రగడ్డ సెయింట్ థెరిస్సా ప్రాంగణంలోని జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. అలాగే ‘నర్సెస్: ఏ ఫోర్స్ ఫర్ ఛేంజ్: ఇంఫ్రూవింగ్ హెల్త్ సిస్టమ్స్ రెజీలియన్స్’ అనే థీమ్ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నర్సుల సంఖ్య ఉండాల్సిన సంఖ్య కంటే తక్కువగా ఉన్నప్పటికీ సమర్ధవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా 20 శాతం అవుట్ పేషెంట్ రోగులు పెరిగారని చెప్పారు. కాళోజీ హెల్త్ వర్సిటీలో నర్సింగ్ విద్య కోసం ప్రత్యేకంగా రిజిస్ర్టార్ పోస్టును ఏర్పాటు చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు. ఈ మేరకు త్వరలోనే ఆ పోస్టును కూడా ప్రవేశపెట్టి నియామకం జరపనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తపిస్తున్నారని తెలిపారు. దేశంలోనే తెలంగాణను గొప్ప రాష్ట్రంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. -
ప్రభుత్వ నర్సుల సమ్మె విరమణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లోని నర్సులు రెండు రోజులుగా చేస్తున్న సమ్మెను శనివారం విరమించారు. తొలుత శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు అఖిల భారత ప్రభుత్వ నర్సుల సమాఖ్య ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లకు సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమిస్తున్నట్లు శనివారం రాత్రి ఏఐజీఎన్ఎఫ్ ప్రతినిధులు తెలిపారు. -
తండ్రి ప్రాణం తీసిన కూతురు!
-
తండ్రి ప్రాణం తీసిన కూతురు!
ఆస్తి కోసం ఆస్పత్రిలో కిరాతకం సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆస్తి కోసం ఓ కూతురు కన్నతండ్రి ప్రాణాలనే తీసింది. ఈ ఉదంతం చెన్నైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది సెప్టెంబర్ 5న జరిగిన ఈ దారుణం సీసీటీవీ పుటేజీలతో తాజాగా బయటపడింది. చెన్నైకి చెందిన డాక్టర్ రాజగోపాల్(82) అనారోగ్యానికి గురికావడంతో అతని కుమారుడు జయప్రకాష్ కీల్పాక్లో తాను నడుపుతున్న ఆదిత్యా ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. ఓ రోజు రాత్రి రాజగోపాల్ కుమార్తె డాక్టర్ జయసుధ, భర్త మనోహరన్, ఆమె కొడుకు డాక్టర్ హరిప్రసాద్తో కలసి ఆస్పత్రికి వచ్చింది. తండ్రితో రహస్యంగా మాట్లాడాల్సి ఉందంటూ నర్సులను బయటకు పంపారు. వెంట తెచ్చుకున్న ఆస్తిపత్రాలపై సంతకం చేయాలని తండ్రిని కోరగా ఆయన నిరాకరించాడు. అయినా, బలవంతంగా అతని వేలిముద్రలు వేయించుకున్నారు. తర్వాత శ్వాస తీసుకునేందుకు సాయపడే ఆక్సిజన్ మాస్క్ను తొలగించారు. సెలైన్ పైప్నూ కత్తిరించడంతో ఆయనకు తీవ్రంగా రక్తంపోయింది. ఇంతలో నర్సులు లోపలికి రావడంతో ముగ్గురూ పారిపోయారు. ఈ హత్యాయత్నం తర్వాత ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి గత ఏడాది నవంబర్ 2న మరణించారు. ఆస్పత్రి సీసీటీవీ పుటేజీలను ఇటీవల పరిశీలించిన కొడుకు జయప్రకాష్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు జయసుధ, ఆమె భర్త, ఆమె కొడుకుపై పోలీసులు కేసు పెట్టారు. నిందితులు పరారీలో ఉన్నారు. -
కాంట్రాక్టు నర్సుల ఆకలి కేకలు!
సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్టు నర్సుల కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. నెలా, రెండు నెలలు కాదు.. ఏకంగా ఆరు నెలల నుంచి జీతాల కోసం అర్రులు చాస్తున్నారు. సర్కారు కనికరించకపోవడంతో పూట గడవడానికి అప్పులు చేసుకుని విధి నిర్వహణ చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగమే అయినా నెల నెలా జీతం వస్తుందన్న ఆశతో ఈ కొలువుల్లో చేరారు. అప్పట్నుంచి ప్రభుత్వం వీరితో సేవలు వినియోగించుకోవడమే తప్ప జీతాల ఊసెత్తడం లేదు. ఫలితంగా పిల్లా పాపలతో కొందరు, తల్లిదండ్రులతో మరికొందరు ఊరు గాని ఊరొచ్చి మహానగరంలో నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వానికి పట్టదు! నెలనెలా వచ్చే జీతం నాలుగు రోజులు లేటయితేనే అల్లాడిపోతుంటారు. అలాంటిది ఐదారు నెలలు రాకపోతే ఎలా బతుకుతారు? ఈ ఆలోచనే ప్రభుత్వానికి రావడం లేదు. గత మార్చిలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిలో సుమారు వెయ్యి నర్సు ఖాళీలను భర్తీ చేసింది. ఒక్కొక్కరికి నెలకు రూ.15 వేల జీతంగా నిర్ణయించింది. ఇలా విశాఖలో 205 నర్సులు నియమితులయ్యారు. వీరిలో కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్)లో 160, విక్టోరియా గవర్నమెంట్ ఆస్పత్రి (ఘోషా), 25, ప్రభుత్వ మానసిక వైద్యశాల (మెంటల్ ఆస్పత్రి)లో 20 మంది వరకు విధులు నిర్వíß స్తున్నారు. తొలి నెల జీతం రాకపోవడంతో వచ్చే నెలలో వస్తుందని సరిపెట్టుకున్నారు. ఆ మరుసటి నెలలోనూ అలాగే సర్దుబాటు చేసుకున్నారు. ఇలా నెలలు గడుస్తున్నా జీతాలు రావడం లేదు. తమ పై అధికారులను అడుగుతున్నా వారి వద్దా సమాధానం లేదు. ఇప్పటిదాకా విశాఖలో కాంట్రాక్టు నర్సులకు రూ.2 కోట్ల వరకు జీతాల బకాయి రావలసి ఉంది. ఎన్ని అవస్థలో... విశాఖలాంటి మహానగరంలో అరకొర జీతాలతో బతుకులీడ్చడమంటే మాటలు కాదు. నర్సులు గా చేరిన వారిలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారిలో కొందరు అవివాహితులు, మరికొందరు వివాహితలు.. పెళ్లి కాని అమ్మాయిలకు రక్షణగా తల్లిదండ్రులో లేక ఆత్మీయ బంధువులో వెంట వచ్చి నగరంలో అద్దె ఇళ్లలో ఉంటున్నారు. పెళ్లయిన వారయితే భర్త, పిల్లలతో తరలి వచ్చి కాపురం ఉంటున్నారు. ఐదారు నెలలుగా వీరికి జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. పుట్టిన చోట వడ్డీకి అప్పులు చేసి నెట్టుకొస్తున్నారు. అసలే పిల్లల చదువులకు పెట్టుబడులు పెట్టే సమయం కావడంతో వీరి అవస్థలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే అసలు, వడ్డీలు తడిసి మోపెడయి కూర్చున్నాయి. అసలే కాంట్రాక్టు ఉద్యోగాలు.. జీతాల కోసం గట్టిగా గొంతెత్తితే ఎక్కడ ఉద్యోగాలు ఊడిపోతాయోనన్న భయం వీరిని వెంటాడుతోంది. ‘వీరి పరిస్థితి చూసి చాలా బాధగా ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వహిస్తున్న వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలపై ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాం. జీతాలు చెల్లింపుపై డీఎంఈకి మరోసారి లేఖ రాస్తాం.’ అని ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం అధ్యక్షురాలు బి.భాగ్యలక్ష్మి ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపుతున్నారు. ఇలావుండగా సంబంధిత సూపరింటెండెంట్లు మార్చి, ఏప్రిల్ నెలల జీతాలైనా ఇచ్చేందుకు అనుమతించాలని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ను కోరారు. అనంతరం వాటిని ట్రెజరీకి పంపారు. కొన్నాళ్లుగా అవి రకరకాల కొర్రీలతో మోక్షానికి నోచ లేదు. ప్రస్తుతానికి మార్చి, ఏప్రిల్ జీతాలు చెల్లిస్తే.. త్వరలో మొదటి, రెండో క్వార్టర్ల వేతనాలు చెల్లింపులకు మార్గం సుగమమవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద తమ జీతాల కోసం ఈ కాంట్రాక్టు నర్సులు రోజులు లెక్కపెడుతున్నారు. -
కాంట్రాక్టు నర్సుల ఆకలి కేకలు!
సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్టు నర్సుల కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. నెలా, రెండు నెలలు కాదు.. ఏకంగా ఆరు నెలల నుంచి జీతాల కోసం అర్రులు చాస్తున్నారు. సర్కారు కనికరించకపోవడంతో పూట గడవడానికి అప్పులు చేసుకుని విధి నిర్వహణ చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగమే అయినా నెల నెలా జీతం వస్తుందన్న ఆశతో ఈ కొలువుల్లో చేరారు. అప్పట్నుంచి ప్రభుత్వం వీరితో సేవలు వినియోగించుకోవడమే తప్ప జీతాల ఊసెత్తడం లేదు. ఫలితంగా పిల్లా పాపలతో కొందరు, తల్లిదండ్రులతో మరికొందరు ఊరు గాని ఊరొచ్చి మహానగరంలో నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వానికి పట్టదు! నెలనెలా వచ్చే జీతం నాలుగు రోజులు లేటయితేనే అల్లాడిపోతుంటారు. అలాంటిది ఐదారు నెలలు రాకపోతే ఎలా బతుకుతారు? ఈ ఆలోచనే ప్రభుత్వానికి రావడం లేదు. గత మార్చిలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు పద్ధతిలో సుమారు వెయ్యి నర్సు ఖాళీలను భర్తీ చేసింది. ఒక్కొక్కరికి నెలకు రూ.15 వేల జీతంగా నిర్ణయించింది. ఇలా విశాఖలో 205 నర్సులు నియమితులయ్యారు. వీరిలో కింగ్ జార్జి ఆస్పత్రి (కేజీహెచ్)లో 160, విక్టోరియా గవర్నమెంట్ ఆస్పత్రి (ఘోషా), 25, ప్రభుత్వ మానసిక వైద్యశాల (మెంటల్ ఆస్పత్రి)లో 20 మంది వరకు విధులు నిర్వíß స్తున్నారు. తొలి నెల జీతం రాకపోవడంతో వచ్చే నెలలో వస్తుందని సరిపెట్టుకున్నారు. ఆ మరుసటి నెలలోనూ అలాగే సర్దుబాటు చేసుకున్నారు. ఇలా నెలలు గడుస్తున్నా జీతాలు రావడం లేదు. తమ పై అధికారులను అడుగుతున్నా వారి వద్దా సమాధానం లేదు. ఇప్పటిదాకా విశాఖలో కాంట్రాక్టు నర్సులకు రూ.2 కోట్ల వరకు జీతాల బకాయి రావలసి ఉంది. ఎన్ని అవస్థలో... విశాఖలాంటి మహానగరంలో అరకొర జీతాలతో బతుకులీడ్చడమంటే మాటలు కాదు. నర్సులు గా చేరిన వారిలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వారిలో కొందరు అవివాహితులు, మరికొందరు వివాహితలు.. పెళ్లి కాని అమ్మాయిలకు రక్షణగా తల్లిదండ్రులో లేక ఆత్మీయ బంధువులో వెంట వచ్చి నగరంలో అద్దె ఇళ్లలో ఉంటున్నారు. పెళ్లయిన వారయితే భర్త, పిల్లలతో తరలి వచ్చి కాపురం ఉంటున్నారు. ఐదారు నెలలుగా వీరికి జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. పుట్టిన చోట వడ్డీకి అప్పులు చేసి నెట్టుకొస్తున్నారు. అసలే పిల్లల చదువులకు పెట్టుబడులు పెట్టే సమయం కావడంతో వీరి అవస్థలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే అసలు, వడ్డీలు తడిసి మోపెడయి కూర్చున్నాయి. అసలే కాంట్రాక్టు ఉద్యోగాలు.. జీతాల కోసం గట్టిగా గొంతెత్తితే ఎక్కడ ఉద్యోగాలు ఊడిపోతాయోనన్న భయం వీరిని వెంటాడుతోంది. ‘వీరి పరిస్థితి చూసి చాలా బాధగా ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చి విధులు నిర్వహిస్తున్న వారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థలపై ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లాం. జీతాలు చెల్లింపుపై డీఎంఈకి మరోసారి లేఖ రాస్తాం.’ అని ఏపీ ప్రభుత్వ నర్సుల సంఘం అధ్యక్షురాలు బి.భాగ్యలక్ష్మి ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపుతున్నారు. ఇలావుండగా సంబంధిత సూపరింటెండెంట్లు మార్చి, ఏప్రిల్ నెలల జీతాలైనా ఇచ్చేందుకు అనుమతించాలని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ను కోరారు. అనంతరం వాటిని ట్రెజరీకి పంపారు. కొన్నాళ్లుగా అవి రకరకాల కొర్రీలతో మోక్షానికి నోచ లేదు. ప్రస్తుతానికి మార్చి, ఏప్రిల్ జీతాలు చెల్లిస్తే.. త్వరలో మొదటి, రెండో క్వార్టర్ల వేతనాలు చెల్లింపులకు మార్గం సుగమమవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మొత్తమ్మీద తమ జీతాల కోసం ఈ కాంట్రాక్టు నర్సులు రోజులు లెక్కపెడుతున్నారు. -
అబ్బే అసభ్యత లేదు.. కేవలం జోకులే!!
ముంబై: పాపులర్ టీవీ కార్యక్రమం 'ద కపిల్ శర్మ షో'లో నర్సును చూపించిన తీరుపై దుమారం రేగుతుండటంతో దీనిపై ఈ షో వ్యాఖ్యాత, హాస్య నటుడు కపిల్ శర్మ స్పందించాడు. తమ షోను ఆందోళనకారులు తప్పుగా అర్థం చేసుకున్నారని, తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చాడు. షోలో భాగంగా నర్సు గురించి జోకులు వేసినంతమాత్రాన.. అది నర్సులందరికీ వర్తిస్తుందని భావించడం సరికాదన్నాడు. నర్సులను అసభ్యంగా షో చూపిస్తున్నారన్న వివాదం నేపథ్యంలో నర్సు పాత్రను షో కొనసాగిస్తారా? అన్న ప్రశ్నకు తప్పకుండా కొనసాగిస్తామని బదులిచ్చాడు. ఆ క్యారెక్టర్తో షోలో తాము కామెడీ మాత్రమే చేస్తున్నామని, అందులో అసభ్యత లేదని, ఎవరినీ నొప్పించే ఉద్దేశం తమకు లేదని చెప్పుకొచ్చాడు. 'ద కపిల్ శర్మ షో'లో 'హాట్' నర్సుగా రోచెల్లా రావును, స్థూలకాయమున్న నర్సుగా కికు శార్దాను చూపిస్తూ వెకిలీ హాస్యాన్ని ప్రదర్శిస్తున్నారని అమృత్సర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, నర్సులు ఇటీవల రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా నర్సులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎంతో ఉన్నతమైన మానవతా సేవలను అందించే నర్సు వృత్తిని కించపరుస్తూ.. తన వీక్లీషోలో నర్సును అవమానకరంగా చూపిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ షోలో అతిథిగా పాల్గొంటున్నందుకు క్రికెటర్-ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధును కూడా వారు తప్పుబట్టారు. -
టీవీషోలో నర్సులను అవమానించిన యాంకర్!!
దేశంలోనే నంబర్ వన్ స్టాండప్ కమెడియన్, నటుడు కపిల్ శర్మ. ఆయన యాంకర్ కమ్ స్టాండప్ కమెడీయన్గా వచ్చే పాపులర్ టీవీ కార్యక్రమం 'ద కపిల్ శర్మ షో'. హిందీ టీవీ రేటింగ్లో టాప్ పొజిషన్లో ఉన్న ఈ షోలో తాజాగా నర్సును చూపిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నర్సులను దారుణంగా అవమానించేలా ఈ షోలో చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమృత్సర్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, నర్సులు రోడ్డెక్కారు. ఆందోళనకు దిగిన నర్సులు మంగళవారం కపిల్ శర్మ దిష్టిబొమ్మను తగలబెట్టారు. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతో ఉన్నతమైన మానవతా సేవలను అందించే నర్సు వృత్తిని కించపరుస్తూ.. తన వీక్లీషోలో నర్సును అవమానకరంగా చూపిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ షోలో అతిథిగా పాల్గొంటున్నందుకు క్రికెటర్-ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధును కూడా వారు తప్పుబట్టారు. నర్సులంటే అంత చులకనా? నర్సులకు వ్యక్తిత్వం ఉండదని, వారిని సులువుగా లోబర్చుకోవచ్చుననే తప్పుడు పద్ధతిలో కపిల్ తన షోలో మమల్ని చూపించారని, అతనిపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకొని కేసు నమోదుచేయాలని నర్సులు డిమాండ్ చేస్తున్నారు. నర్సుల ఆందోళన మంగళవారం రెండోరోజుకు చేరింది. గతంలోనూ నర్సులను కించపరిచేలా కపిల్ శర్మ చూపించారని, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని పంజాబ్ నర్సింగ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అమృత్సర్కు చెందిన కపిల్ శర్మకు వ్యతిరేకంగా ఇప్పటికే ఈ వ్యవహారంలో ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. 'ద కపిల్ శర్మ షో'లో నర్సు పాత్రలో కనిపిస్తున్న రొచెల్లె రావు వేసుకున్న నర్సు యూనిఫామ్ను కూడా అసభ్యంగా చూపిస్తున్నారని, ఈ షోలో తమను అసభ్యంగా చిత్రీకరిస్తున్నారని నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
2020 నాటికి 44.50 లక్షల నర్సులు!
బీజింగ్: రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా రోగుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. వీరికి మెరుగైన సేవలు అందించడంపై చైనా దృష్టి సారించింది. దీనిలో భాగంగా 2020 సంవత్సరానికిగానూ 44.50లక్షల నర్సులు ఉండాలనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేశామని చైనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే వెయ్యిమందికి గానూ 3.14(దాదాపు ముగ్గురు) నర్సులు ఉంటారని అంతర్జాతీయ నర్సెస్ డే(మే 12)ను పురస్కరించుకొని చైనా జాతీయ ఆరోగ్య కుటుంబ నియంత్రణ డిప్యుటీ కమిషనర్ క్సియావీ తెలిపారు. ప్రస్తుతం వెయ్యిమందికి కేవలం 2.36(దాదాపు రెండు) మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. చైనాలో 2015 చివరికల్లా నర్సులుగా నమోదు చేసుకున్న వారి సంఖ్య 32.40లక్షలుగా ఉంది. 2010-15వరకు నర్సులుగా నమోదైన వారి సంఖ్య 58 శాతం పెరిగింది. -
నర్సుల కర్కశత్వం
♦ కాన్పు సమయంలో గర్భిణిని తిట్టిన వైనం ♦ వైద్యం అందక శిశువు మృతి..బంధువుల ఆందోళన మహబూబ్నగర్ క్రైం: ఆస్పత్రుల్లో నర్సులంటే మానవీయతకు చిహ్నం. అందుకే వారిని ఆప్యాయంగా, గౌరవంగా సిస్టర్ అని సంబోధిస్తారు. అలాంటి సిస్టర్లు తామూ మహిళలమే అన్న విషయం మరిచి పోయి మరో మహిళతో కర్కశంగా ప్రవర్తించారు. నిండుగర్భిణిని దుర్భాషలాడి, ఆమెను మానసిక వేదనకు గురిచేశారు. సకాలంలో వైద్యం అందక ఆది వారం శిశువు మృతి చెందాడు. బాధితుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ మండలం తిమ్మాసనిపల్లికి చెందిన స్వప్న శనివారం సాయంత్రం ప్రసవం కోసం జిల్లాసుపత్రికి వచ్చింది. ఆమెను ఆస్పత్రిలో ఎవరూ పట్టించుకోలేదు. స్వప్నకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో పురిటినొప్పులు రావడంతో ప్రసూతి గదిలోకి వెళ్లింది. ‘నొప్పులు వస్తున్నాయి.. ప్రసవం చేయండి’ అని సిస్టర్లకు విన్నవించినా స్పందించకుండా గదిలో ఉన్న టీవీ చూస్తూ కూర్చున్నారు. నొప్పులు ఎక్కువ కావడంతో స్వప్న అక్కడే ఉన్న బెంచ్పై పడుకుంది. డెలివరీ అవుతున్న సమయంలో దర్భాషలాడడం మొదలుపెట్టారు. చేయి కూడా చేసుకున్నారు. వారు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో.. పుట్టిన మగ శిశువు మృతి చెందింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబసభ్యులు ప్రసూతి గది ఎదుట ఆందోళన చేశారు. సిస్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకుంటామని ఆర్ఎంవో రాంబాబు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. బాధ్యులపై చర్యలు ఆస్పత్రిలో సిస్టర్ల చర్యలు బాధాకరం. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఇక్కడి ఆస్పత్రిలో ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే మా దృష్టికి తీసుకురావాలి. ఇకముందు ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదు. - రాంబాబు, ఆర్ఎంఓ, మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రి -
అమ్మ వదిలేసింది.. నర్సులు అమ్మేశారు!
కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన ఇందూరు: ఆడపిల్ల భారమనుకుందో ఏమో కానీ ఓ తల్లి పుట్టినబిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లింది... పాపను రక్షించాల్సిన నర్సులు ఆ బిడ్డను అమ్మేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు... సుమారు నెలన్నర క్రితం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి మహిళ ప్రసవం కోసం వచ్చింది. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వారం రోజులు ఆస్పత్రిలోనే ఉన్న ఆ తల్లి, కుటుంబ సభ్యులు ఎందుకో ఆ బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిపోయారు. గమనించిన నర్సులు కుటుంబసభ్యుల వివరాలు రిజస్టర్లో ఉన్నప్పటికీ.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే పాపను అమ్మాలని నిర్ణరుుంచారు. జిల్లాలోని లింగంపేట్ మండలం భావానీపేట్కు చెందిన ఓ దంపతులు పిల్లలు లేక.. దత్తత తీసుకునేందుకు చూస్తున్నారని తెలుసుకొని వారిని సంప్రదించారు. రూ.10 వేలకు బేరం కుదుర్చుకుని పాపను అమ్మేశారు. అయితే.. పాపను తీసుకెళ్లిన దంపతుల గ్రామానికి చెందిన స్థానికులు అనుమానం వచ్చి ఐసీడీఎస్ అధికారులకు సమాచారమందించగా, వారు వచ్చి ప్రశ్నించడంతో అసలు విషయం బయట పడింది. దీంతో పాపను శనివారం జిల్లా కేంద్రంలోని శిశుగృహకు తరలించారు. పాపను అమ్మేసిన నర్సులు, అక్రమంగా దత్తత తీసుకున్న దంపతులతో పాటు ఆస్పత్రి యూజమాన్యం పైనా కేసు నమోదు చేస్తామని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. -
'ఎండలో దీక్ష చేస్తే నల్లబడతారు'
‘మండుటెండలో నిరాహార దీక్ష చేస్తే నల్లబడతారు. అది మీ పెళ్లికి ఇబ్బందికరంగా మారుతుంది’ అంటూ ఆందోళన చేస్తున్న నర్సులను ఉద్దేశించి గోవా సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవా అంబులెన్స్ నర్సులు పలు డిమాండ్లతో నిరశన చేపట్టారు. మంగళవారం సీఎంను కలిశారు. ‘అప్పడు సీఎం.. అమ్మాయిలు ఎండలో కూర్చుంటే నల్లబడతారని, మంచి పెళ్లికొడుకును వెతుక్కోలేకపోతారని అన్నారు’ అని అనూష సావంత్ అనే నర్సు చెప్పారు.. దీంతో పర్సేకర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే తానలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదని పర్సేకర్ చెప్పారు. ఆందోళన చేస్తున్న ఆ నర్సు తనకు ముందే పరిచయమని, ఎండలో కూర్చోవడం వల్ల ఆమె విభిన్నంగా కనబడడంతో.. ఆ విషయమే చెప్పానన్నారు. -
'గ్లామర్ పోద్ది...ఎండలో ధర్నా వద్దు'
పనాజీ: గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ సమ్మె చేస్తున్న నర్సులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎండలో సమ్మె చేయొద్దు...నల్లగా అయిపోతారు.. ఆ తర్వాత పెళ్లికొడుకు దొరకడం కష్టం...ఇవీ తమ డిమాండ్ల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చిన నర్సులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు. దాంతో నర్సులనుద్దేశించి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి ఇబ్బందుల్లో పడ్డారు. కాగా సీఎం వ్యాఖ్యలపై నర్సుల అసోసియేషన్, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. నిజంగా తమ మీద అంత ప్రేమ ఉంటే తమ డిమాండ్లను పరిష్కరించేవారనీ.. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు ఆహ్వానించదగినవి కాదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 33 అంబులెన్స్లను నడపడానికి అనుమతి తీసుకున్న ఓ ప్రయివేట్ సంస్థ, కేవలం పదమూడు సర్వీసులను మాత్రమే నడుపుతోందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రిని కలిసినా ఫలితం లేదని.. దాంతో తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి పాల్గొనే ప్రతీ సమావేశంలోనూ ఆందోళన నిర్వహించేందుకు తాము నిర్ణయించినట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు హృదయనాధ్ శిరోద్కర్ తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ అధికారుల అవినీతిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. కాగా నర్సులపై సీఎం చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ఖండించాయి. గోవాలోని 108 అంబులెన్స్ నిర్వహణకు సంబంధించిన నర్సులు, కొంతమంది కార్మికులు ఈ సేవలను ప్రయివేటు సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ గత కొన్నిరోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. -
'సిరంజ్' నిర్వాకంపై విచారణకు ఆదేశం
హైదరాబాద్ : నీలోఫర్ ఆస్పత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. అయిదుగురు చిన్నారులకు..నర్సులు ఒకే సిరంజ్తో ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరంజ్ మార్చేందుకు నిర్లక్ష్యమో లేక బద్దకమో తెలియదు కానీ. ...అయిదేళ్ల లోపు చిన్నారులకు ఇంజెక్షన్ ఇచ్చేందుకు విధుల్లో ఉన్న నర్సులు ఒకే సిరంజ్ వాడారు. దాంతో చిన్నారులకు వైద్యం వికటించి... చేతులకు వాపులు రావటంతో వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై స్పందించిన సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం చిన్నారులకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పిన వైద్యులు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కాగా సుమారు 35మంది చిన్నారులకు ఒకే సిరంజ్ ద్వారా ఇంజెక్షన్లు చేసినట్లు సమాచారం. -
వైద్యులు, నర్సులు, పారామెడికల్ పోస్టుల భర్తీ
హానరరీ యూనిట్ల ఏర్పాటు... భద్రత, ఔట్సోర్సింగ్లకు పెద్దపీట 15 రోజుల్లో హెల్త్కార్డులు జారీ మంత్రి కామినేని విశాఖపట్నం, మెడికల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులకు త్వరలోనే పదోన్నతులు కల్పిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు వెల్లడిం చారు. ఖాళీగా ఉన్న వైద్యులు, పారామెడికల్, నర్సుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరి శుభ్రత, భద్రతపై బుధవారం ఆంధ్రవైద్య కళాశాలలో ప్రాంతీ య సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమిళనాడు పారిశు ద్ధ్య విధానాలను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. ఆస్పత్రి సూపరింటెండెంట్లు కాంట్రాక్టు సంస్థల పని తీరుపై నిత్యం పర్యవేక్షణ చూపాలన్నా రు. నూతన పారిశుద్ధ్య విధానంలోని నిబంధనలను సరిగా పాటించని సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వ వైద్యులు ఉదయం 9 గంట ల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ విధుల్లో ఉండాల్సిందేనన్నారు. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న పెద్దాసుపత్రుల్లో ఇకపై డెప్యూటేషన్లు, ఒక వైద్య విభాగానికి చెందిన వైద్యులు వేరే వైద్య విభాగంలో పనిచేసే మిస్మ్యాచ్ విధానానికి స్వస్తిపలకనున్నట్లు చెప్పారు. వైద్య రంగంలో అనేక సంస్కరణలను తీసుకురానున్నామని, పేషెంట్ కేర్ మినహా మందులు, రోగనిర్థారణ వైద్య పరీక్షలు, రోగులకు ఇచ్చే ఆహారం వంటి అనేక విభాగాల్లో ఔట్సోర్సింగ్ విధానాన్ని అమలు చేసే యోచనలో ఉందన్నారు. విమ్స్ ఆస్పత్రిలో త్వరలో ఏడు వైద్య విభాగాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు హెల్త్కార్డులు అందించేందుకు ప్రభుత్వం సుముఖంగాఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అక్టోబర్ 15 నుంచి నూ తన పారిశుద్ధ్యం, భద్రత పాలసీని అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం చెప్పారు. అక్టోబర్ నెలాఖరునాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు జరుగుతున్న పారిశు ద్ధ్య, భద్రత కార్యక్రమాలపై ఆస్పత్రి పాలకులు సమ గ్ర ప్రణాళికను రూపొందించి సమర్పించాలన్నారు. -
సోగసు చూడతరమా.. !
జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో శనివారం అమ్ముకుట్టీలు సందడి చేశారు. కేరళ ఫెస్టివల్ ఓనం పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు కేరళకు చెందిన నర్సులు. సంప్రదాయ పాటలతో, ఉయ్యాలాటలతో నగరానికి మలయాళమారుతం తీసుకొచ్చారు. దీపం చుట్టూ నాట్యం చేస్తూ లయబద్ధంగా సాగిన ‘తిరువదిర’ ఘట్టం అందర్నీ ఆకట్టుకుంది. అందమైన రంగవల్లులతో పండుగను కలర్ఫుల్గా చేసుకున్నారు. కేరళియన్ ఫుడ్తో ఓనం ఫెస్టివల్ను టేస్ట్ఫుల్గా చేసుకున్నారు. కేర్లో క్వీన్ బంజారాహిల్స్లోని కేర్ ఓపీ సెంటర్లో జాతీయ పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమాలు శనివారం జోష్ఫుల్గా సాగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన మిస్ న్యూట్రిషనిస్ట్ పోటీలు అందర్నీ అలరించాయి. న్యూట్రిషన్ కళాశాలల విద్యార్థులు 15 మంది ఈ పోటీలకు హాజరై అదరగొట్టారు. హిమాయత్నగర్ మదీన డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో ఎమ్మెస్సీ విద్యార్థిని మార్యా రుబీనా మిస్ న్యూట్రిషనిస్టుగా ఎంపికైంది. మిసెస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ విజేత రుచికశర్మ రుబీనాకు కిరీటం తొడిగారు. - బంజారాహిల్స్ -
అమ్మో! మళ్లీ వెళ్లం!
కొచ్చి/హైదరాబాద్: ఇరాక్లో గత నెల రోజులుగా తీవ్ర భయాందోళనల మధ్య, క్షణమొక యుగంగా మత్యుభయంతో గడిపిన 183 మంది భారతీయులు శనివారం క్షేమంగా తిరిగి వచ్చారు. మరో 200 మంది ప్రత్యేక విమానంలో వస్తున్నారు. కొచ్చి వచ్చిన వారిలో 46 మంది భారతీయ నర్సులతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని వివిధ ప్రాంతాలకు చెందిన 78 మంది నిర్మాణ కార్మికులు ఉన్నారు. భారత ప్రభుత్వం, ఇరాక్లోని భారతీయ దౌత్యాధికారులు చేసిన కృషి ఫలించి సున్ని మిలిటెంట్ల చెర నుంచి విడుదలై ఎయిర్ ఇండియాకు చెందిన ప్రత్యేక విమానంలో వారు కొచ్చి చేరుకున్నారు. అదే విమానంలో కిర్కుక్లో చిక్కుకుపోయిన ఇతర భారతీయులు, ముగ్గురు భారత ప్రభుత్వ అధికారులు కూడా ఇండియా వచ్చారు. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికారు. తమ రాష్ట్రానికి చెందిన నర్సులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కృషి చేసిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఇరాక్లోని భారతీయ ఎంబసీ అధికారులకు చాందీ కృతజ్ఞతలు తెలిపారు. నర్సులంతా క్షేమంగా చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. చెమర్చిన కళ్లతో తమవారిని హత్తుకుని భావోద్వేగభరితులయ్యారు. ఏడాది వయసున్న కూతురిని వదిలేసి ఇరాక్ వెళ్లిన మరీనా అనే నర్సు రెండేళ్ల కూతురుని చూసుకుని కన్నీటిపర్యంతమైంది. దాదాపు నెల రోజుల క్రితం ఇరాక్లో ప్రారంభమైన సున్నీల తిరుగుబాటు కారణంగా తిక్రిత్లోని ఒక ఆసుపత్రిలో చిక్కుకుపోయిన నర్సులను మిలిటెంట్లు మొదట మొసుల్కు తీసుకెళ్లి, అనంతరం నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం క్షేమంగా విడిచిపెట్టిన విషయం తెలిసిందే. అమ్మో! మళ్లీ వెళ్లం! ఇరాక్కు మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని ఆ దేశం నుంచి తిరిగొచ్చిన నర్సులు స్పష్టం చేశారు. మరోసారి తమ ప్రాణాలను పణంగా పెట్టబోమన్నారు. బాంబు పేలుళ్ల శబ్దాలు తమ చెవులలో ఇంకా గింగురుమంటూనే ఉన్నాయన్నారు. కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలతో వణికిపోతూ నిద్రలేని రాత్రులు గడిపామని కవలలైన సోనా, వీణలు వివరించారు. స్వదేశానికి తిరిగిరావడం పునర్జన్మలా ఉందన్నారు. తిక్రుత్ నుంచి బస్సుల్లో బయల్దేరిన తరువాత పలుమార్లు మిలిటెంట్లు గమ్యాన్ని మార్చారని, వారివద్ద ఉన్న ఆయుధాలు చూసి ప్రాణాలపై ఆశలు వదులుకున్నామన్నారు. ‘మీరంతా మా చెల్లెళ్లలాంటి వారు. మీకెలాంటి హాని చేయం అని మిలిటెంట్లు మాతో చెప్పారు. అయినా వారి మాటలను మేం నమ్మలేదు’ అని కొట్టాయంకు చెందిన నర్సు సాండ్రా సెబాస్టియన్ తెలిపారు. అయితే, మిలిటెంట్లు తమతో మర్యాదగానే ప్రవర్తించారని చెప్పారు. తాము తిక్రిత్లోని ప్రభుత్వాసుపత్రిలో పనిచేశామని, గత నాలుగు నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదన్నారు. ‘వారిని టెర్రటిస్టులనలేమని, వారంతా స్థానిక ప్రభుత్వంలో భాగమే’నని మరో నర్సు సుని మోల్ చాకొ చెప్పారు. క్షేమంగా తిరిగొచ్చినందుకు సంతోషంగానే ఉన్నా భవిష్యత్తును తలచుకుంటే భయంగా ఉందని పలువురు నర్సులు వాపోయారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని ఇరాక్ వెళ్లామని, ఇప్పుడు వాటిని తీర్చడమెలాగా అనే బెంగ పట్టుకుందన్నారు. కాగా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన భారతీయ పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టీ ఇరాక్ నుంచి తిరిగొచ్చిన నర్సులందరికీ ఉద్యోగం కల్పిస్తానని కేరళ వార్తపత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చారు. ఆయనకు యూఏఈ, ఇండియా, నేపాల్, భూటాన్ల్లో ఆసుపత్రులున్నాయి. ఇదిలా ఉండగా, మరో 200 మంది భారతీయులు ఈ రాత్రికి ఇరాక్ ఎయిర్వేస్కు చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సైయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. మరో 48 గంటలలో 400 మంది భారతీయులు కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ చేరుకుంటారని చెప్పారు. సోమవారం నాటికి దాదాపు 1200 మంది భారతీయులు ప్రభుత్వ ఖర్చులపై భారత్ చేరుకుంటున్నట్లు ఆయన వివరించారు. -
స్వదేశానికి చేరిన ఇరాక్ బాధితులు
-
మనస్సిలాయో అంటున్న మలయాళీలు
మధురం..నగరం మలయాళీల పేరు చెప్పగానే నర్సులు, కాన్వెంట్ టీచర్లు గుర్తొస్తారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు హైదరాబాద్లోని చాలా చోట్ల మలయాళీలు వేర్వేరు వృత్తుల్లో తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. నగరంలో మలయాళీల జనాభా ఏడు లక్షల వరకు ఉంది. హైదరాబాద్కు మలయాళీల వలస 1950 కంటే ముందే మొదలైంది. భాగ్యనగరి మలయాళీల మనసు దోచుకోవడంతో ఇక్కడ వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. లక్షల మంది ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవడం నగరంపై మమకారమే కారణం. ఇదే విషయంపై కొందరు మలయాళీలను కదిలించగా ‘హైదరాబాదీల మనసు మధురం.. మనస్సిలాయో(అర్థమయిందా?)’ అంటూ ముసిముసినవ్వులు చిందించారు.... బ్రిటిష్ హయాంలో ఉన్న ఆస్పత్రుల్లో నర్సులుగా, కాన్వెంట్ స్కూళ్లలో టీచర్లుగా మలయాళీలు పనిచేసేవారు. ఇప్పటికీ మిషనరీ పాఠశాలల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయులుగా మలయాళీలే ఎక్కువగా కనిపిస్తారు. ఇక నర్సులుగా సేవలందిస్తున్న కేరళ యువతుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరంలో పదికి పైగా నర్సింగ్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో తొంబై శాతం మంది మలయాళీ అమ్మాయిలే ఉంటారు. ఇంటర్ పూర్తి కాగానే హైదరాబాద్ వచ్చి, నర్సులుగా శిక్షణ పొంది కార్పొరేట్ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేయడం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో హోటల్ వ్యాపారంలోనూ మలయాళీలు తమ ప్రత్యేకత చాటుకుంటున్నారు. కేరళ వంటకాలు ఇక్కడి మలయాళీలనే కాకుండా, మిగిలిన హైదరాబాదీలనూ ఆకట్టుకుంటున్నాయి. కేరళ బియ్యంతో భాగ్యనగరి బంధం ఒకప్పుడు హైదరాబాదీలు కేరళ బియ్యానికి దాసులుగా ఉండేవారు. చూడటానికి కాస్త లావుగా ఉన్నా, కేరళ బియ్యం రుచి మరెక్కడా దొరకదనే వారు. పూర్వం కేరళ నుంచి వచ్చినప్పుడల్లా పది కిలోల బియ్యం తెచ్చుకునేవాళ్లట. ఇప్పుడా అవసరం లేదు. ఇక్కడే బోలెడన్ని రకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ కేరళ హోటళ్లలో ఫేమస్ వంటకమంటే దోశ, దాంతో పాటే కేరళీయులు ప్రత్యేకంగా తయారుచేసే కొబ్బరి చట్నీ. సాధారణంగా కేరళ వంటలంటే కొబ్బరినూనెతో చేసిన వంటకాలనే అనుకుంటారు. ఇక్కడ స్థిరపడ్డవారు క్రమంగా మామూలు నూనెకు అలవాటు పడ్డారు. ఎప్పుడైనా కేరళ నుంచి బంధువులు వస్తే తప్ప వారి ఇళ్లలో కొబ్బరినూనె వంటల ఘుమఘుమలు బయటకు రావు. మలయాళీల ఉగాది విషు మలయాళీల కొత్త సంవత్సరం ‘విషు’. మనం ఉగాది పండుగ జరుపుకుంటున్నట్లే, మలయాళీలు విషు వేడుకలను జరుపుకుంటారు. హైదరాబాద్లోనూ ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. రాత్రిపూట దేవాలయాలకు వెళ్లి, అక్కడే పడుకుని, తెల్లవారు జామున మూడుగంటలకు లేచి, కళ్లు మూసుకుని దేవుని ఎదుటకు వచ్చి నిలబడతారు. కొత్త ఏడాది మొదటి దర్శనం దేవుని రూపమే కావాలనేది ‘విషు’ పండుగలో ప్రత్యేకత. అలా దేవుడిని చూసే వేడుకను ‘విషుకని’ అంటారు. హైదరాబాద్లోని చాలా దేవాలయాలు మలయాళీల కోసం ప్రత్యేకంగా ‘విషుకని’ పూజలు నిర్వహిస్తాయి. ‘దిల్సుఖ్నగర్లోని అయ్యప్ప దేవాలయంలో విషుకని పూజలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. పెద్దసంఖ్యలో మలయాళీలు ఆ ఆలయానికి వస్తారు. కొత్త దుస్తులు, ఆభరణాలు ధరించి, పండ్లు, పూలు దేవుడికి సమర్పించి, వేకువ జామున మూడింటికల్లా శ్రీకృష్ణుడిని దర్శించుకోవడంతో విషు వేడుకలు మొదలవుతాయి. ఇక్కడి వారితో పాటు పండుగకు వచ్చిన వారి స్నేహితులు కూడా గుడికి వస్తారు. వీటితో పాటు దసరా, దీపావళి పండుగలను కూడా అందరితో కలసి సరదాగా సెలిబ్రేట్ చేసుకుంటారు. మంచి వాతావరణం... ‘ఇప్పడంటే అంతా మారిపోయింది గానీ, నలభయ్యేళ్ల కిందట హైదరాబాద్ నగరం స్వర్గంతో సమానం. పచ్చగా ఉండే మా కేరళలో కూడా ఇక్కడ ఉన్నంత చల్లని వాతావరణం ఉండేది కాదు. ఇక్కడ వేసవిలో సైతం ఉక్కబోత ఉండేది కాదు. మలయాళీల మనసు గెలుచుకోవడంలో హైదరాబాద్ ఎప్పుడూ ముందుంటుంది. కేరళ వెలుపల మలయాళీలు పెద్దసంఖ్యలో ఉన్న నగరం హైదరాబాద్ మాత్రమే. నర్సులు, టీచర్లనే కాదు, చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా యాభయ్యేళ్ల కిందటే చాలామంది ఇక్కడకు వలస వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. బతుకమ్మను సరిపోలే ఓనం... మలయాళీల ప్రధానమైన పండుగ ఓనం. ఆగస్టులో వచ్చే ఈ పండుగను పదిరోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఓనం పండుగను తెలంగాణ పండుగ బతుకమ్మతో పోలుస్తారు. ఇంటి ముందు రంగురంగుల పూలను అలంకరించి, వాటిపై దీపాలు పెట్టి, వాటి చుట్టూ మహిళలు పాటలు పాడుతూ తిరుగుతారు. దీన్నే తిరువదిర అంటారు. ‘ఈ పండుగకు కేరళలో నాలుగు రోజులు ప్రభుత్వ సెలవు దినాలు ఉంటాయి. హైదరాబాద్లోనూ మేం ఓనం పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా అసోసియేషన్స కూడా ఏర్పాటయ్యాయి. వాటి ఆధ్వర్యంలో పదిరోజుల ఓనం వేడుకలు జరుగుతాయి. ఆ సమయంలో మా కేరళ మహిళలంతా గోధుమ రంగు చీరల్లో కనిపిస్తారు. ఓనం సందర్భంగా చేసే ‘అడప్రదమన్’ పాయసం చాలా రుచిగా ఉంటుంది. మా వాళ్లతో పాటు చాలామంది హైదరాబాదీలు ఓనం పండుగను బాగా ఎంజాయ్ చేస్తారు’ అని వివరించారు మెహదీపట్నానికి చెందిన భార్గవి. -
ప్రాణమిచ్చే బతుకు దీపాలు
దేవుడు ప్రాణం పోస్తాడు... డాక్టర్లు ప్రాణం నిలుపుతారు మరి... నర్సులు?... ప్రాణాల మీద ఆశ కల్పిస్తారు బతకగలమనే భరోసా కల్పిస్తారు... ఇక ఈ జీవితం ఇంతే అనుకున్న రోగికి... నీకు ఇంకా జీవితం ఉంది... ఆ జీవితాన్ని ఆనందంగా జీవించాలి... అంటూ జీవించడానికి కావాల్సిన ధైర్యాన్ని నూరిపోస్తారు. అడుగడుగునా సేవలందిస్తూ స్వస్థత చేకూరుస్తారు. కొడిగడుతున్న ప్రాణాలకు రెండు చేతులనూ అడ్డుగా పెట్టి ఆసరాగా నిలుస్తారు. ఇలాంటి సేవలకు గుర్తింపుగా... జ్ఞానలక్ష్మి, సౌమ్య, డైజీ థామస్ అనే నర్సులు... రాష్ట్రపతి చేతుల మీదుగా ఇటీవల ‘ఫ్లోరెన్స్ నైటింగేల్’ అవార్డులు అందుకున్నారు... వారి అనుభవాలు, అభిప్రాయాల సుమహారం! నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణంలో జీవదాన్ ఆసుపత్రి. రకరకాల పేషెంట్లలో గుండెపోటు వచ్చిన పేషెంట్లు ఇద్దరు ఉన్నారు. డ్యూటీ డాక్టర్లు రౌండ్స్ పూర్తి చేసుకుని నర్సులకు చెప్పి వెళ్లిపోయారు. వాళ్లలా వెళ్లిన కొంతసేపటికే ఒక పేషెంటుకి గుండెపోటు వచ్చింది. డ్యూటీలో ఉన్న సౌమ్య సిస్టర్కి ఏం చేయాలో పాలుపోలేదు. పేషెంటు ప్రాణాపాయంలో ఉన్నాడు. దేవుడిచ్చిన ప్రాణానికి ఆపద వాటిల్లింది. ప్రాణాన్ని కాపాడి వృత్తి ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఆ నిమిషం ఆమెకి తెలిసింది అదొక్కటే... అంతే! కరెంట్ స్ట్రోక్స్ ఇచ్చేశారు. పేషెంటు తెరిపిన పడ్డాడు. డాక్టరు ఇవ్వాల్సిన ఆ ట్రీట్మెంట్ను తానే నిర్వహించే చొరవ ఆ క్షణంలో తీసుకోక తప్పలేదు. ఇంతలో మరో పేషెంటుకు కూడా అదే పరిస్థితి... అతడి గుండెమీద కొట్టి, కొట్టి... ఆగిపోబోతున్న గుండెను కొట్టుకునేలా చేశారు. ఈ రోజు ఏమిటిలా అనుకుంటూండగా సాయంత్రానికి మరో ఉపద్రవం. ప్రసూతి విభాగంలో ఒక బిడ్డ పుట్టగానే ఏడవలేదు, అపస్మారక స్థితిలో ఉంది. అందరిలో కంగారు... ఇంతలో సౌమ్య సిస్టర్ వెంటనే నోటితో బిడ్డకు గాలి అందించి కాపాడారు. ఇరవై మూడేళ్ల వృత్తి జీవితంలో సౌమ్య సిస్టర్కి ఇలాంటి అనుభవాలెన్నో. ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ... ‘‘మా వృత్తిలో ఇవి చాలా మామూలే, కానీ ఈ మూడూ ఒకేరోజు జరగడం మాత్రం చాలా విచిత్రం. ఆ రోజు నాకు నా వృత్తిధర్మాన్ని పూర్తిగా నిర్వర్తించాననే తృప్తి కలిగింది. ప్రాణాన్ని ఇవ్వగలిగింది దేవుడొక్కడే. ఆ ప్రాణానికి ఆపద వాటిల్లినప్పుడు కాపాడే ప్రయత్నమే మాది. ఆ ప్రయత్నాన్ని అంకితభావంతో చేయాలి. ఇన్నేళ్లుగా అదే చేస్తూ వచ్చాను’’ అన్నారు సిస్టర్ సౌమ్య. సిస్టర్ సౌమ్యది కేరళ రాష్ట్రంలోని మారుమూల గ్రామం. 1980లో విజయవాడలోని ఫ్రాన్సిస్కన్ క్లారిస్ట్ కాంగ్రెగేషన్ కాన్వెంట్లో చేరారు. అక్కడ పదేళ్లపాటు శిక్షణ పొందిన తర్వాత జీవదాన్ సంస్థ నిర్వహిస్తున్న ఆసుపత్రిలో నర్సుగా చేరారు. ‘‘పేషెంట్లు తమ ప్రాణాలను మా చేతుల్లో పెడతారు. సాంత్వన పరుస్తూ మాట్లాడి, ప్రాణాలను కాపాడి ఆరోగ్యంగా ఇంటికి సాగనంపాలి. మా దృష్టి వ్యక్తి ప్రాణం కాపాడడం మీదనే ఉండాలి. ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్లు జరగక పేషెంటు ప్రాణం పోవచ్చు. కానీ మా మనసులో పేషెంటుని కాపాడాలనే తపన చావకూడదు’’ అంటారామె. ఆమెతోపాటుగా అదే రోజు రాష్ట్రపతి నుంచి అవార్డును అందుకున్న మరో సిస్టర్ జ్ఞానలక్ష్మి. ఆమె ప్రస్తుతం హైదరాబాద్లో యశోదా నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్. ‘‘మాది ఖమ్మం జిల్లా కొత్తగూడెం. మా నాన్న జార్జ్ సింగరేణి కాలరీస్లో ఆడిటర్. మా కాలేజ్ ప్రిన్సిపల్ కైలాసపతిగారు మా నాన్నగారికి సలహా ఇవ్వడంతో నేను ఇంటర్ తర్వాత బి.ఎస్.సి నర్సింగ్కి హైదరాబాద్కు వచ్చాను. కోర్సు పూర్తయిన తర్వాత 1970వ సంవత్సరం ఫిబ్రవరిలో వరంగల్ ఎంజిఎం హాస్పిటల్లో స్టాఫ్నర్సుగా చేరాను. ఈ రంగంలోకి వచ్చి నలభై ఐదేళ్లు కావస్తోంది. ఇన్నేళ్లలో క్లినికల్ ఏరియా, ఆపరేషన్ థియేటర్, టీచింగ్... ఈ మూడు రంగాల్లోనూ పనిచేశాను. నర్సింగ్ రంగంలో ఎన్ని విభాగాలలో ఉద్యోగం చేసినప్పటికీ ఆత్మసంతృప్తి మాత్రం పేషెంటుకు నేరుగా సేవచేయగలిగిన క్లినికల్ ఏరియాలోనే’’నంటారామె. ‘‘వరంగల్లో ఓ పదహారేళ్ల అమ్మాయి మా హాస్పిటల్లో చేరింది. ఆమెకు అన్నీ బెడ్ మీదనే. అలాంటి అమ్మాయిని నెల రోజుల్లో నడిపించాను. డాక్టర్లు మందులు ఇస్తారు, డాక్టరు బాధ్యత పూర్తయిన చోట మా బాధ్యత మొదలవుతుంది. ఆ అమ్మాయి మంచానికి అతుక్కుపోతే ఇక జీవితం ఏమిటి అని మనసు కలచి వేసేది. దాంతో నా ఉద్యోగ విధులకే పరిమితం కాకుండా ప్రత్యేక శ్రద్ధతో ఆమెకి ఫిజియోథెరపీ చేయించడం, రోజూ పరామర్శించి ‘నీకు తగ్గిపోతుంది, నడుస్తావు, నువ్వు పెళ్లి చేసుకుని బిడ్డనెత్తుకోవడాన్ని కూడా మేము చూస్తాం’ అని చెప్తుండేదాన్ని. డిశ్చార్జ్ అయి వెళ్లేటప్పుడు ఆ అమ్మాయి, వారి తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించిన ఆనందాన్ని మర్చిపోలేను. ఒక జీవితాన్ని నిలపగలిగాను అనే సంతోషాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు’’ అంటారు జ్ఞానలక్ష్మి. వీరిద్దరూ ఇలా అంటుంటే ఇదే అవార్డును వీరితోపాటు అందుకున్న డైజీ థామస్ మాత్రం... ‘దేవుడి సేవలో మా బాధ్యతను నిర్వర్తిస్తున్నాం’ అంటారు. ‘‘ఈ వృత్తిలో ఉండాల్సింది సేవచేయాలనే అకుంఠిత దీక్ష మాత్రమే. అది మనసులో కలగాలి. మనస్ఫూర్తిగా సేవ చేయాలనే తపన ఉండాలి. అంతకు మించిన స్ఫూర్తి మరోటి ఉండదు’’ అంటారు. ఈమె సికింద్రాబాద్లోని రైల్వే ఆసుపత్రిలో చీఫ్ మాట్రన్. ఈ వృత్తిలోని వారికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. వారి సేవలకు ఈ అవార్డులు కరదీపికలు కాలేవు. కానీ గుర్తు చేసుకోవడానికి ఒక వేదిక మాత్రం కాగలుగుతాయి. - వాకా మంజులారెడ్డి, ఇన్పుట్స్: ప్రభాకర్, న్యూస్లైన్, ఎల్లారెడ్డి