Oscars 2023
-
ఎంగేజ్మెంట్ 2004లో.. పెళ్లి 2023లో
Actress Michelle Yeoh Marriage: ప్రస్తుతం ప్రేమకి అర్థం మార్చేశారు. నచ్చినంత కాలం కలిసి తిరగడం, అంతా అయిపోయాక పనికిమాలిన కారణం చెప్పి విడిపోవడం ఇప్పటి యువతలో చాలామందికి కామన్ అయిపోయింది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా, లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న ఈగోకు పోయి గొడవ పడుతున్నారు. కొన్నాళ్లకే విడిపోతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఓ నటి ఏకంగా ఎంగేజ్మెంట్ జరిగిన 19 ఏళ్లకు అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ విషయం ఆలోవర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయింది. (ఇదీ చదవండి: అరుదైన వ్యాధి బారిన ప్రముఖ నటి.. అలాంటి పరిస్థితిలో!) ప్రముఖ నటి మిచెల్లా యో చాలా గుర్తింపు తెచ్చుకుంది. 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' అనే సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఈ ఏడాది ఆస్కార్ కూడా గెలుచుకుంది. 60 ఏళ్ల ఈ బ్యూటీ.. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో తన లాంగ్ టైమ్ పార్ట్నర్, ఫెర్రారీ మాజీ సీఈఓ జేన్ టాడ్ని గురువారం పెళ్లి చేసుకుంది. స్విట్జర్లాండ్లోని జెనీవా దీనికి వేదికైంది. అయితే ఇది ఆషామాషీ పెళ్లి అయితే కాదు. దీనికి చాలా స్పెషాలిటీ ఉంది. 2004 జూలై 26న మిచెల్లాకు జేన్ ప్రపోజ్ చేశాడు. ఆమె దీనికి అంగీకారం తెలిపింది. అది జరిగి 6992 రోజులకు అంటే దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఇన్నేళ్ల పాటు రిలేషన్లో ఉన్నప్పటికీ ఎందుకో పెళ్లి ఆలోచన రాలేదు. ఫైనల్గా ఇప్పుడు సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. వీళ్ల పెళ్లి విషయాన్ని ఫార్ములా వన్ డ్రైవర్ ఫెలిఫ్ మస్సా బయటపెట్టాడు. తన ఇన్ స్టాలో ఈ జంటతో దిగిన ఫొటోలని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. వీళ్ల ప్రేమ-రిలేషన్-పెళ్లి గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. View this post on Instagram A post shared by Felipe Massa (@massafelipe) (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!) -
RRR: ఆస్కార్ సభ్యుల జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయంటే
ప్రపంచ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక ఈ ఏడాదిలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 23 విభాగాల్లోని విజేతలను ప్రకటించి వారికి అవార్డులను కూడా అందజేశారు. 95వ ఆస్కార్ వేడుకలలో భాగంగా టాలీవుడ్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నామినేట్ అయిన.. ‘నాటు నాటు’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచింది. ఈ సాంగ్ను ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. వీరిద్దరూ కలిసి ఆస్కార్ స్టేజ్ పై అవార్డులు అందుకున్నారు. ఈ పాటకు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ అదిరిపోయే డ్యాన్స్తో మెప్పించారు. దర్శక ధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమా స్థాయిని ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ గెలిచే వరకూ తీసుకొని వెళ్లాడు. ఒక్క ‘నాటు’ దెబ్బతో ఆస్కార్ గెలవడమే కాదు ఏకంగా జ్యూరీ మెంబర్స్ అయ్యే అంత గొప్ప స్థానం టాలీవుడ్కు దక్కింది. (ఇదీ చదవండి: 'తీవ్రమైన ఇన్ఫెక్షన్'తో ఆసుపత్రి పాలైన ప్రముఖ సింగర్) తాజాగా ఆస్కార్ ప్యానెల్ నుంచి టాలీవుడ్కు మరో శుభవార్త అందింది. రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, కరణ్ జోహార్లతో పాటు ఎంఎం కీరవాణి, చంద్రబోస్, సాబు సిరిల్, మణిరత్నం, సెంథిల్ కుమార్, చైతన్య తమహనే, షౌనెక్ సేన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్లకు ఆస్కార్ ప్యానెల్లో చోటు దక్కింది. రాబోయే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాల్లో వీరందరికీ ఓటు హక్కు ఉంటుంది. అకాడమీ సభ్యులు మాత్రమే ఆస్కార్ విజేతలకు ఓటు వేయగలరు. వచ్చే ఏడాది ఆస్కార్ వేడుకలు మార్చి 10న జరగనున్నాయి. కాబట్టి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్తో పాటు కీరవాణి కూడా ఓటు వేయనున్నారు. దీనిలో భాగంగా 2023లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో చేరడానికి 398 మంది వ్యక్తుల జాబితాలో దాదాపు డజను మంది భారతీయ కళాకారులు ఉన్నారు, ఇందులో "RRR" చిత్రం యొక్క దిగ్గజ నటుల కాంబో, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, MM కీరవాణి,చంద్రబోస్ ఉన్నారు. అస్కార్ బరిలో నిలిచే చిత్రాలకు తెలుగు పరిశ్రమ నుంచి ఈ నలుగురికి మాత్రమే ఓటు హక్కు కలిగి ఉంటుంది. వీరి సభ్యత్వం లైఫ్ టైమ్ ఉంటుంది. కానీ దర్శకధీరుడు రాజమౌళి ఈ జాబితాలో చోటు దక్కలేదు. (ఇదీ చదవండి: SPY Review: నిఖిల్ 'స్పై' మూవీ ట్విట్టర్ రివ్యూ!) ఈ జాబితాలోని సభ్యుల గురించి అకాడమీ CEO బిల్ క్రామెర్, అకాడమీ ప్రెసిడెంట్ జానెట్ యాంగ్ ఇలా అన్నారు. 'ఈ కళాకారులు, నిపుణులను మా (ఆస్కార్) సభ్యత్వంలోకి స్వాగతిస్తున్నందుకు అకాడమీ గర్విస్తోంది. వారు సినిమా విభాగాల్లో అసాధారణమైన ప్రతిభతో ప్రపంచాన్ని మెప్పించారు. వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర అభిమానులపై కీలకమైన ప్రభావాన్ని చూపారు' అని పేర్కొన్నారు. ప్రస్తుతం అకాడమీలో 10,000 మందికి పైగా సభ్యులుగా ఉన్నారు. అకాడమీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ ఏడాది 40 శాతం మంది మహిళలకు చోటు కల్పించారు. ప్రతి ఏడాది విడుదలయై అస్కార్ ప్యానెల్ జాబితాలో ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ నుంచే ఉండేవారు. కానీ 2023లో మాత్రం ఇతర దేశాలకు చెందిన కళాకారులు ఎక్కువగా ఉండటం విశేషం. We’re proud to announce our newly invited members to the Academy! Meet the Class of 2023: https://t.co/xElbKejirD pic.twitter.com/9IqEmbU6GD — The Academy (@TheAcademy) June 28, 2023 -
రామ్ చరణ్కు ప్రభుదేవా బిగ్ సర్ప్రైజ్.. అదేంటంటే!
ఆస్కార్ వేడుకలు ముగించుకున్న రామ్ చరణ్ ఇటీవలే అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్ ఇంటికి కూడా చేరుకున్నారు. ఆయన తదుపరి చిత్రంలో శంకర్ దర్శకత్వంలో పనిచేయనున్నారు. తాత్కాలికంగా ఈ సినిమాకు ఆర్సీ15 అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా షూటింగ్లో పాల్గొనేందుకు వచ్చిన చెర్రీకి ఘనస్వాగతం లభించింది. ప్రభుదేవా ఆధ్వర్యంలోని ఆర్సీ15 చిత్రబృందం నాటు నాటు స్టెప్పులతో వెల్కమ్ చెప్పింది. అ తర్వాత రామ్ చరణ్ను పూలమాలతో సత్కరించింది. (ఇది చదవండి: ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిన ప్రముఖ నటి కూతురు, ఫోటో వైరల్) దీనికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరలవుతోంది. రామ్ చరమ్ తన ఇన్స్టాలో రాస్తూ.' ఇంతటి ఘన స్వాగతం పలికినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పలేను. నాకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన గ్రాండ్ మాస్టర్ ప్రభుదేవా సార్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్సీ15 షూటింగ్కి తిరిగి వచ్చినందుకు చాలా గొప్పగా ఉంది.' అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన చెర్రీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా స్పందించింది. స్వీటెస్ట్ వెల్కమ్ అంటూ కామెంట్ చేసింది. కాగా.. ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే. కాగా.. మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న RC15 పొలిటికల్ యాక్షన్ డ్రామాగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, ఎస్జె సూర్య, జయరామ్, అంజలి, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
ఆర్ఆర్ఆర్ టీంకు ఎంట్రీ ఉచితం కాదట.. రాజమౌళి ఎంత చెల్లించారంటే!
లాస్ ఎంజిల్స్లో జరిగిన 95 ఆస్కార్ వేడుకల్లో టాలీవుడ్ కీర్తిని రెపరెపలాడించిన ఘనత దర్శకధీరుడు రాజమౌళిదే. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. అయితే ఈ వేడుకల్లో రాజమౌళితో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు. కానీ ఈవెంట్లో పాల్గొనేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి ఉచితంగా ఎంట్రీ ఇవ్వలేదని సమాచారం. కేవలం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్తో పాటు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉచితంగా ప్రవేశం కల్పించినట్లు తెలుస్తోంది. రాజమౌళితో సహా మిగిలిన చిత్రబృంద సభ్యులు కూడా ఈవెంట్లో పాల్గొనేందుకు టికెట్ కొనుగోలు చేయాల్సిందే. ఈ వేడుకల్లో రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అలాగే ఈ సినిమా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉపాసన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కూడా పాల్గొన్నారు. అయితే ప్రతిష్ఠాత్మకమైన ఈవెంట్లో పాల్గొనేందుకు చిత్రబృందానికి అన్ని టికెట్లను రాజమౌళి కొనుగోలు చేశారు. తాజా నివేదికల ప్రకారం రాజమౌళి ఒక టిక్కెట్ కోసం సుమారు $25 వేల డాలర్లను వెచ్చించారు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.20.6 లక్షలు. అయితే ఈవెంట్లో ఎస్ఎస్ రాజమౌళితో సహా చిత్రబృందాన్ని వెనుక వరుసలో కూర్చోబెట్టినందుకు అకాడమీ విమర్శలపాలైంది. అకాడమీ నిర్వాహకుల తీరు పట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డ్ గెలిచిన తర్వాత చిత్రబృందం మార్చి 17న హైదరాబాద్కు రాగా ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం లభించింది. కాగా.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్, పోలీసు అధికారి పాత్రలో రామ్ చరణ్ పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్ కూడా కీలక పాత్రలు పోషించారు. -
మావటీల జీవితాల్లో వెలుగు తెచ్చారు
‘నాకు అడివింటే చాలా భయం’ అంటుంది బెల్లి. ఆస్కార్ వచ్చిన ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ లో మావటి బొమ్మన్ భార్య ఆమె. భర్తతో కలిసి రఘు అనే పిల్ల ఏనుగును ఆమె సాకుతుంది. దాంతోపాటు ‘అమ్ము’ అనే ఇంకో పిల్ల ఏనుగు బాగోగులను బెల్లి చూస్తుంది. బొమ్మన్ ప్రభుత్వ ఉద్యోగి. బెల్లి కాదు. అయినా సరే భర్త డ్యూటీలో ఆమె భాగం పంచుకుంది. భర్తతో పాటే పసి ఏనుగులను చూసుకుంది. ‘నా భర్తను పులి చంపింది. అప్పటి నుంచి అడివంటే భయం. బొమ్మన్ను చేసుకున్నాక కొంచెం భయం పోయింది. పిల్ల ఏనుగుల బాగోగుల్లో పడ్డాక, వాటి వెంట తిరుగుతుంటే అడివంటే భయం పోయింది’ అంటుంది బెల్లి. నీలగిరి (ఊటీ) అడవుల్లో ఉండే ఎలిఫెంట్ క్యాంపుల్లో ఏనుగుల సంరక్షణ మావటీలు చూస్తారు. వీళ్లంతా దాదాపు ఆ ప్రాంత గిరిజనులే. ఏనుగులను చూసుకోవడం మగవారి పనే. అయితే బొమ్మన్ చూసేది పిల్ల ఏనుగులను కనుక వాటి అమాయకత్వానికి ముగ్ధురాలై అమ్ము కూడా వాటితో అనుబంధం పెంచుకుంటుంది. ఆమెకు రఘు, అమ్ము ఎంత మాలిమి అంటే డాక్యుమెంటరీలో అమ్మును పిలిచి ‘ఏయ్... నా ఒడిలో కాదు. పక్కన పడుకో. లేకుంటే దెబ్బలు పడతాయి’ అనంటే ఆ ఏనుగు ఆమె పక్కన మెల్లగా ఒత్తిగిలి పడుకోవడం ముచ్చట గొలుపుతుంది. అమ్ముకు బెల్లి రెండు జడలు వేసి నవ్వుకుంటూ ఉన్నప్పుడు ఈ డాక్యుమెంటరీ ముగుస్తుంది. అయితే బొమ్మన్ వల్ల, అమ్ము వల్ల, ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించిన కార్తికి వల్ల దేశంలో ఇప్పుడు ఏనుగుల సంరక్షణ గురించి చర్చలు జరుగుతున్నాయి. తమిళనాడు సి.ఎం స్టాలిన్ వెంటనే స్పందించి బొమ్మన్, బెల్లిలను పిలిచి చెరొక లక్ష డబ్బు ఇచ్చి సన్మానం చేశారు. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న 91 మంది మావటీలకు కూడా మనిషికో లక్ష ఇవ్వనున్నారు. వీరి నివాసాల కోసం 9 కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఏనుగుల క్యాంపుల కోసం 13 కోట్లు మంజూరయ్యాయి. ప్రేమ, ఆదరణల వల్ల ఎప్పుడూ మంచే జరుగుతుంది. బొమ్మన్, బెల్లిలతో అది మరోసారి రుజువయ్యింది. -
నాటునాటుకు ఆస్కార్.. లాబీయింగ్తోనే అవార్డులు: నటుడు
తమిళ సినిమా: టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఘన విజయాన్ని సాధించడంతోపాటు ప్రపంచ ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును సాధించి భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టింది. ఆ చిత్రంలోని నాటునాటు పాట ఈ అవార్డును గెలుచుకున్నట్లు తెలిసింది. దీంతో భారతీయ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా గర్వపడుతోంది. అయితే ఈ అవార్డు విషయంలో కొన్ని విమర్శలు ఎదురవుతున్నాయి. ఎవరి అభిప్రాయాలు వారివి కాబట్టి అది సహజమే. కాగా తమిళ దర్శకుడు, నటుడు అమీర్ ఆస్కార్ అవార్డుల విషయంలో తనదైన శైలిలో స్పందించారు. ఇంకా చెప్పాలంటే ఆస్కార్ అవార్డునే విమర్శించారు. ఈయన శుక్రవారం సాయంత్రం ఒక సినిమా వేడుకలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన అమీర్ ఒక భారతీయ సినిమా ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం సంతోషం అన్నారు. అయితే ఆస్కార్ అవార్డు అనేది ఆ దేశంలో అందించే జాతీయ అవార్డు అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ఉత్తమ నటుడు అయిన శివాజీ గణేషన్కు చివరి వరకు ఎందుకు జాతీయ అవార్డు రాలేదన్నారు. దేవర్ మగన్ చిత్రంలోని ఆయన నటనకు గాను ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారని, అయితే దానిపై స్పందించిన శివాజీ గణేషన్ ఈ అవార్డు వచ్చింది కాదని, ఆ జ్యూరీ సభ్యులను మనవారు పట్టుబట్టి ఇప్పించిన అవార్డు అని పేర్కొన్నారన్నారు. పక్షపాతంలేని ఉత్తమ నటుల అవార్డుల ప్రదానం 30 ఏళ్ల క్రితమే ముగిసిందన్నారు. ఇప్పుడు అందిస్తున్న అవార్డులన్నీ లాబీయింగే కారణం అనే విమర్శలు ఉన్నాయన్నారు. 2007లో శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన శివాజీ చిత్రంలోని నటనకు గాను ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడు అవార్డు ప్రదానం చేసిందన్నారు. అలాగని రజనీకాంత్ ఉత్తమ నటుడు అని చెప్పగలమా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక ఎంటర్ టెయినర్ మాత్రమేనని పేర్కొన్నారు. నిజానికి రజనీకాంత్ ఉత్తమ నటన గురించి చెప్పాలంటే ముల్లుమ్ మలరుమ్, ఆరిలిరుందు అరుబదు వరై వంటి చిత్రాలని చెప్పాలన్నారు. ఆ చిత్రాలకు ఎందుకు అవార్డును ఇవ్వలేదని ప్రశ్నించారు. -
ఆస్కార్ గెలిచిన ఇండియన్ డాక్యుమెంటరీ షార్ట్ఫిల్మ్.. స్క్రిప్ట్రైటర్ ఈ అమ్మాయే!
‘గరిమ పుర ఎవరు?’ అనే ప్రశ్నకు చాలామంది జవాబు చెప్పలేకపోవచ్చు. ఆస్కార్ గెలుచుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ గురించి తెలియని వారు తక్కువ మంది ఉండవచ్చు. 27 సంవత్సరాల గరిమ ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్కు స్క్రిప్ట్రైటర్... పంజాబ్లోని పటియాలాలో పుట్టిన గరిమ హైస్కూల్ చదువు పూర్తికాగానే కళాశాల విద్య కోసం మహారాష్ట్రలోని పుణెకు వచ్చింది. అక్కడే తనకు ప్రపంచ సినిమాలు, లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలపై ఆసక్తి ఏర్పడింది. ‘సింబియాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా’లో పట్టా పుచ్చుకున్న తరువాత డాక్యుమెంటరీలపై మరింత ఆసక్తి పెరిగింది. డాక్యుమెంటరీలు తీయాలనుకొని ముంబైలో అడుగుపెట్టిన గరిమ ఒక మీడియా సంస్థలో చేరింది. ‘వృత్తి జీవితం బాగానే ఉందిగానీ తాను వచ్చింది ఇందు కోసం కాదు కదా!’ అని ఆలోచించింది. ఎనిమిది నెలల తరువాత ఉద్యోగాన్ని వదులుకొని స్క్రిప్ట్ రైటర్గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాలు ఫలించి వెబ్సిరీస్కు రాయడం మొదలుపెట్టింది. నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘లిటిల్ థింగ్స్’ తో రైటర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గరిమ. పట్టణ ప్రజల జీవనశైలిపై తీసిన ఈ సిరీస్ కోసం తొలిసారిగా ఇతర రచయితలతో కలిసి పనిచేసింది. ఒంటరిగా కూర్చుని, నిశ్శబ్ద వాతావరణంలో రాసే అలవాటు ఉన్న గరిమ ఇతర రచయితలతో కలిసి చర్చలు చేస్తూ రాయాల్సి వచ్చింది. ‘ఇతరులతో కూర్చొని చర్చిస్తూ రాయడం వల్ల మనల్ని మనం ఎంతో మెరుగు పరుచుకోవచ్చు. ఇలా కూడా ఆలోచించవచ్చా అనిపిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే కలానికి కొత్త మెరుపు వస్తుంది’ అంటుంది గరిమ. 2019లో వైల్ట్లైఫ్ డైరెక్టర్ గుంజన్ మీనన్ గరిమను డైరెక్టర్ కార్తికీ గోంజాల్వెజ్కు పరిచయం చేసింది. కార్తికీ దగ్గర ఒక మంచి కథ ఉంది. ఆమె మంచి రైటర్ కోసం వెదుకుతోంది. కట్ చేస్తే... 2020లో గరిమను వెదుక్కుంటూ కార్తికీ వచ్చింది. ఇక అప్పటి నుంచి స్క్రిప్ట్ రైటింగ్ పనుల్లోకి దిగింది గరిమ. అయితే ఇదేమీ కాల్పనిక స్క్రిప్ట్ కాదు. నాలుగు గోడల మధ్య ఏకాంతంగా రాసుకునే స్క్రిప్ట్ కాదు. అడవి దారి పట్టాలి. అనాథ ఏనుగుల కళ్లలోకి చూసి మౌనంగా మాట్లాడాలి. వాటిని సొంత పిల్లల్లా ఆదరించిన దంపతుల మనసు పొరల్లోకి వెళ్లాలి. తెలుసుకున్నదానికి సృజన జోడించాలి. ‘30 ఏళ్లు కూడా దాటని ఈ అమ్మాయి ఇంత పనిచేయగలదా?’ అనే సందేహం ఎప్పుడూ కార్తికీ గోంజాల్వెజ్కు రాలేదు. తనపై కార్తికీ పెట్టిన నమ్మకాన్ని గరిమ వృథా చేసుకోలేదు. స్క్రిప్ట్కు జవసత్వాలు ఇచ్చింది. ‘కాలం మారింది. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల పుణ్యమా అని యువతరం చిత్రపరిశ్రమలోకి వెల్లువలా వస్తోంది. ఇప్పుడు ఒకరి సృజనాత్మక శ్రమను దోచుకోవడం అనేది కష్టం. కష్టపడే వారికి విజయం త్వరగా చేరువయ్యే కాలం ఇది’ అంటోంది గరిమ. అలనాటి పుస్తకాల నుంచి తాజాగా విడుదలైన పుస్తకాల వరకు ఎన్నో పుస్తకాలు చదువుతుంటుంది గరిమ. 1973లో వచ్చిన ఎరిక జోంగ్ ‘ఫియర్ ఆఫ్ ప్లైయింగ్’ పుస్తకం అన్నా, అందులో జోంగ్ రాసిన వాక్యం...‘ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది. అయితే అరుదైన ప్రతిభ అనేది మనం ఎంత సాధన చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాం అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది’ అనే వాక్యం అన్నా ఆమెకు చాలా ఇష్టం. చదవండి: హ్యాపీ పేరెంటింగ్: వసపిట్ట పాఠాలు -
ఆస్కార్ స్టేజీపై మనకు అవమానం.. మరీ ఇంత దారుణమా?
బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా నాటు నాటుకు, బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలింగా ద ఎలిఫెంట్ విస్పరర్స్కు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది? అని ప్రేక్షకాభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఇలాంటి సమయంలో అకాడమీ చేసిన చర్యతో సినీప్రియుల ఆనందం చప్పున చల్లారిపోయింది. ఆస్కార్ అందుకున్న ద ఎలిఫెంట్ విస్పరర్స్ నిర్మాతను అకాడమీ దారుణంగా అవమానించిందంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఆ వివరాలు చూద్దాం.. సాధారణంగా ఆస్కార్ అందుకున్న తర్వాత 45 సెకన్లు మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అంతకు మించి ఎక్కువ సమయం తీసుకుంటే వెంటనే ఆ స్పీచ్ను కట్ చేస్తారు. ద ఎలిఫెంట్ విస్పరర్స్కు అవార్డు ప్రకటించిన అనంతరం డైరెక్టర్ కార్తీకి తనకిచ్చిన గడువులోనే స్పీచ్ ముగించింది. అయితే నిర్మాత గునీత్ మోంగా మాట్లాడటం మొదలుపెట్టకముందే సంగీతం ప్లే చేశారు. దీంతో తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండానే వెనుతిరిగింది. పోనీ అందరి విషయంలోనూ అకాడమీ ఇలానే ప్రవర్తించిందా? అంటే లేదు. వీరి తర్వాత బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ అవార్డులు తీసుకున్న చార్లెస్ మాక్సీ, మాథ్యూ ఫ్రాడ్లు ఇద్దరూ 45 సెకన్ల కన్నా ఎక్కువసేపు ప్రసంగించినా అభ్యంతరం తెలపలేదు. దీనిపై అమెరికన్ మీడియా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు నెటిజన్లు సైతం అకాడమీ భారత్ను అవమానించిందంటూ ట్విటర్లో మండిపడుతున్నారు. దీనిపై నిర్మాత గునీత్ స్పందిస్తూ.. 'ఆస్కార్ వేదికపై నన్ను ప్రసంగించనివ్వలేదు. ఇది నన్ను ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. ఎందుకంటే భారత్ నిర్మించిన ఓ షార్ట్ ఫిలింకు ఆస్కార్ రావడం ఇదే తొలిసారి అని సగర్వంగా చాటిచెప్పాలనుకున్నా. కానీ నన్నసలు మాట్లాడనివ్వలేదు. ఇంత దూరం వచ్చి నాకు మాట్లాడే ఛాన్స్ రాలేదని బాధేసింది. దీనిపై జనాలు కూడా ఎంతో విచారం వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప క్షణాలను నాకు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నట్లు అనిపించింది. ఇండియాకు వచ్చాక నా ఆలోచనలు, సంతోషాన్ని పంచుకుంటున్నాను. నాకు లభిస్తున్న ప్రేమను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది' అని చెప్పుకొచ్చింది.(చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) The Elephant Whisperers triumphs at the #AcademyAwards - Kartiki Gonsalves and Guneet Monga win the Oscar for Best Documentary Short Subject - the first ever for an Indian Production at the #Oscars.#Oscars95 | @guneetm pic.twitter.com/BYiciGniF7 — santhoshd (@santhoshd) March 13, 2023 -
అర్హత లేని సినిమాలు ఆస్కార్కు పంపుతున్నారు: రెహమాన్
ఇన్నాళ్లకు తెలుగు చిత్రపరిశ్రమకు అందని ద్రాక్షలా ఉన్న ఆస్కార్ను అమాంతం పట్టుకొచ్చేశాడు కీరవాణి. రాజమౌళి దర్శకత్వం వహించిన రౌద్రం.. రణం.. రుధిరం.. (ఆర్ఆర్ఆర్) సినిమాలోని నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ పాటగా అకాడమీ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమాను కూడా నామినేషన్కు పంపిస్తారనుకుంటే గుజరాతీ చిత్రం చెల్లో షోను ఆస్కార్ నామినేషన్స్కు పంపించారు. కానీ అది ఫైనల్ నామినేషన్స్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయింది. దీనిపై చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్కార్ను సాధించే సత్తా ఉన్న ఆర్ఆర్ఆర్ను పంపించి ఉండాల్సిందని పలువురూ అభిప్రాయపడ్డారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు, రెండుసార్లు ఆస్కార్ అందుకున్న ఏఆర్ రెహమాన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన యూట్యూబ్ ఛానల్లో మ్యూజిక్ లెజెండ్ ఎల్ సుబ్రహ్మణ్యంతో మాటామంతీ నిర్వహించాడు రెహమాన్. వీరిద్దరూ సంగీతం గురించి, మారుతున్న టెక్నాలజీ గురించి చర్చించారు. ఇంతలో రెహమాన్ మాట్లాడుతూ.. 'కొన్నిసార్లు మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి నిరాశతో వెనక్కు వస్తున్నాయి. అర్హత లేని సినిమాలను ఆస్కార్కు పంపుతున్నారనిపిస్తుంది. కానీ జస్ట్ చూస్తూ ఉండటం తప్ప మనం ఏం చేయలేం' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అర్హత ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమాను ఆస్కార్కు పంపించకపోవడం గురించే ఆయన ఇన్డైరెక్ట్గా ఈ వ్యాఖ్యలు చేశాడంటున్నారు నెటిజన్లు. (చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) -
ఇదెంతో స్పెషల్ గిఫ్ట్.. మా అన్నయ్య ఏడ్చేశాడు: రాజమౌళి
ఆస్కార్ విజయంతో ఆర్ఆర్ఆర్ పేరు ప్రపంచస్థాయిలో మార్మోగిపోతోంది. నాటు నాటు పాటకు సంగీతం అందించిన ఎమ్ఎమ్ కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ను వేనోళ్ల కొనియాడుతున్నారు. తాజాగా వీరికి ఆస్కార్కు మించిన బహుమతి లభించింది. ఆస్కార్ కన్నా గొప్ప బహుమతి ఏముంటుంది అంటారా? కీరవాణి ఎంతగానో ఆరాధించే వ్యక్తి నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నాడు. అమెరికన్ సింగర్ రిచర్డ్ కార్పెంటర్ ఆర్ఆర్ఆర్ టీమ్ను, ప్రత్యేకంగా కీరవాణి, చంద్రబోస్లను అభినందిస్తూ ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో రిచర్డ్తో పాటు అతడి కుటుంబం అంతా కలిసి శుభాకాంక్షలను పాట రూపంలో వెల్లడించారు. ఈ వీడియోపై రాజమౌళి స్పందిస్తూ.. 'సర్, ఆస్కార్ క్యాంపెయిన్లో మా అన్నయ్య ఎంతో కామ్గా ఉన్నాడు. ఆస్కార్కు ముందు, తర్వాత.. ఎప్పుడూ తన ఎమోషన్స్ బయటపెట్టలేదు. కానీ ఎప్పుడైతే ఈ వీడియో చూశాడో ఆ క్షణం తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. తనకు తెలియకుండానే చెంపలపై కన్నీళ్లు జాలువారాయి. మీ గిఫ్ట్ మా కుటుంబం అంతా గుర్తుంచుకుంటుంది. థాంక్యూ సో మచ్ అని' కామెంట్ చేశాడు. కీరవాణి ట్విటర్లో ఈ వీడియో షేర్ చేస్తూ.. 'నేను ఊహించని గిఫ్ట్ ఇది. సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి. ఈ ప్రపంచంలో నాకు దక్కిన అత్యంత విలువైన గిఫ్ట్' అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. View this post on Instagram A post shared by Richard Carpenter (@richardcarpenterofficial) https://t.co/va5tOLD1DH This is something I didn’t expect at all ..tears rolling out of joy ❤️❤️❤️ Most wonderful gift from the Universe 🙏 — mmkeeravaani (@mmkeeravaani) March 15, 2023 -
ఆస్కార్ వేడుకల్లో దీపికా పదుకొణె.. దారుణంగా అవమానించారు భయ్యా!
అమెరికా లాస్ ఎంజిల్స్లో జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ను విశ్వవేదికపై పరిచయం చేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ వేడుకల్లో ఎంతో హుందాగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంది. కానీ అక్కడి మీడియా తీరు మాత్రం ఆమె అభిమానులకు కోపం తెప్పించేలా చేసింది. బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అక్కడున్న వారిలో దీపికను ఎవరూ చూసిన ఇట్టే గుర్తు పట్టేస్తారు. కానీ కొన్ని మీడియా సంస్థలు దీపికాను గుర్తించడంలో దారుణంగా విఫలమయ్యాయి. దీపికా పేరుకు బదులు మరో నటి కెమిలా ఏవ్స్ పేరును రాశారు. దీపికా పేరు స్థానంలో మరొకరి పేరు రావడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపికా హాలీవుడ్లోనూ సినిమాలు చేస్తూ.. ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరు. అంతే కాకుండా ఇన్స్టాలో 72 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న దీపికాను గుర్తు పట్టకపోవడం దారుణమని అంటున్నారు. ఆ మీడియా సంస్థలపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఏడాది జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో భారతీయ చిత్రాలకు రెండు అవార్డులు దక్కాయి. టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ గెలిచాయి. um, getty images this is deepika padukone. you appear to have confused her with camila alves. deepika's actually quite famous in her own right - 72 million insta followers and an award-winning career.#Oscar #Oscar2023 pic.twitter.com/0kQPjOce51 — Tarang / तरंग (@tarang_chawla) March 13, 2023 -
ఆస్కార్ వేదికపై దీపికా పదుకొణె.. ఇప్పుడు దాని గురించే చర్చంతా..!
అమెరికా లాస్ ఎంజిల్స్లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె సందడి చేసింది. ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రస్తావించింది. ప్రపంచ వేదికపై ఎంతో హుందాగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంది. దీపికను నటి కంగనా రనౌత్ సైతం మెచ్చుకుంది. విశ్వవేదికపై మనదేశ గొప్పదనాన్ని చాటారని ప్రశంసించింది. అయితే ఈ వేడుకల్లో దీపికా డ్రెస్తో పాటు ఆమె మెడపై ఉన్న టాటూపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ ఫోటోల్లో కనిపించిన టాటూపై అభిమానులు ఆరా తీస్తున్నారు. ఆస్కార్ వేదికపై దీపిక ధరించిన నలుపు రంగు గౌను అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా డ్రెస్తో పాటు ఆమె మెడపై ఉన్న టాటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపిక మెడపై 82°E అని ఉన్న టాటూ కనిపించింది. ఇంతకీ ఆ టాటూకు అర్థం ఏంటా అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే టాటూకు 82 డిగ్రీస్ ఈస్ట్ అని అర్థం వస్తుంది. ఇది దీపికా పదుకొణె తన స్కిన్ కేర్ బ్రాండ్ పేరు. ఈ పేరుతో గత కొన్ని నెలలుగా చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. దీపిక తన సొంత బ్రాండ్ పేరును టాటూగా వేయించుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్ కమిట్మెంట్ అంటే దీపికదే అని కామెంట్స్ చేస్తున్నారు. లాస్ ఎంజిల్స్లో జరిగిన ఆస్కార్ వేడుకలో దీపిక తన స్పీచ్తో అదరగొట్టింది. ఈ వేదికపై నుంచే ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటును అందరికీ పరిచయం చేసింది. కాగా.. దీపికా ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఫైటర్ చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్తో తొలిసారి దీపికా కనిపించనుంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'ప్రాజెక్ట్ కె'లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) -
‘నాటు నాటు’ ప్రభంజనం.. ఆస్కార్ ఫీట్తో గూగుల్ సెర్చ్లో జూమ్
సాక్షి,ముంబై: 95వ అకాడమీ అవార్డ్స్లో సత్తాచాటిన సెన్సేషనల్ సాంగ్ నాటు నాటు హవా ఒక రేంజ్లో కొనసాగుతోంది. ఆస్కార్ గెల్చుకున్న ఇండియన్ తొలి సాంగ్గా రికార్డును కొట్టేసిన తర్వాత గూగుల్లో నెటిజన్లు తెగ వెతికేశారట. టాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని ఈ సూపర్-హిట్ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ గెల్చుకున్న తరువాత దీనిపై నెటిజన్ల ఆసక్తి 10 రెట్లకు పైగా పెరిగింది. ఫలితంగా నాటు నాటు సూపర్ ట్రెండింగ్లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై సెర్చెస్ 1,105 శాతం పెరిగాయని ఒక నివేదిక బుధవారం వెల్లడించింది. జపనీస్ ఆన్లైన్ క్యాసినో గైడ్ 6తకరకుజీ, గూగుల్ సెర్చ్ ట్రెండ్ డేటాను విశ్లేషించింది. ఇందులో తెలుగు చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే నాటునాటు కోసం ఆన్లైన్లో భారీ క్రేజ్ వచ్చిందనీ, సగటు కంటే 10 రెట్లు శోధనలు పెరిగాయని వెల్లడించింది. టాలీవుడ్ హీరోలు, జూ.ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ పెర్ఫామెన్స్ హైలైట్గా నిలిచింది. నాటు నాటు ఒక హై-టెంపో రిథమ్, డ్యాన్స్ , స్టెప్పులు గ్లోబల్గా విపరీతంగా ఆకట్టుకున్నాయి. పాపులర్ సింగర్స్ లేడీ గాగా , రిహన్న వంటి సంగీత దిగ్గజాల మనసు కూడా దోచుకుందీ పాట. అంతేనా ఈ సాంగ్ టిక్టాక్లో ప్రముఖ సంచలనంగా మారింది, గత సంవత్సరం మార్చిలో విడుదలైనప్పటి నుండి 52.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సంవత్సరం ఆస్కార్ వేడుకలో ఆర్ఆర్ఆర్మూవీకిసముచిత గౌరవం లభించిందనీ, అవార్డుతో చరిత్ర సృష్టించిదంటూ 6టకరకుజీ ప్రతినిధి ప్రశంసించారు. కాగా 95వ అకాడమీ ఆస్కార్ వేడుకలో, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఎలక్ట్రిఫైయింగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఉర్రూత లూగిపోయారు. లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో నాటు నాటు ప్రదర్శనకు అపురూపమైన స్టాండింగ్ ఒవేషన్తో పెద్ద ఎత్తున ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. -
ఆర్ఆర్ఆర్కు 'ఆస్కార్' పార్టీ ఇచ్చిన రాజమౌళి
95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం (భారతీయ కాలమానం ప్రకారం సోమవారం) ముగిసిన విషయం తెలిసిందే. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆస్కార్ వేడుకను ఎక్కువమంది వీక్షించారు. 2021లో తక్కువగా దాదాపు 10 మిలియన్ (కోటి మంది) వ్యూయర్షిప్, 2022లో 16.6 మిలియన్ల వ్యూయర్షిప్ నమోదు కాగా ఈ ఏడాది వేడుకను 18.7 (కోటీ 87 లక్షలు) మిలియన్ల మంది వీక్షించారు. గత ఏడాదితో పోల్చితే 12 శాతం ఎక్కువ వ్యూయర్షిప్ నమోదైంది. అయితే ఆస్కార్ వ్యూయర్షిప్ విషయంలో ఇదేం పెద్ద విషయం కాదు. ఎందుకంటే 1998లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని 57 (5 కోట్ల 70 లక్షలు) మిలియన్ల మంది వీక్షించారు. ఈసారి సోషల్ మీడియాలో కూడా ఆస్కార్ వేడుక టాప్ ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ వేడుకకు 27.4 (27 కోట్ల 4 లక్షలు) మిలియన్ల ఇంట్రాక్షన్స్ సోషల్ మీడియాలో నమోదయ్యాయని హాలీవుడ్ గణాంకాలు చెబుతున్నాయి. ఇటు టెలివిజన్ వ్యూయర్షిప్ రేటింగ్స్ కూడా స్వల్పంగా పెరిగింది. కాగా ఆస్కార్ ఆవార్డు వేడుక అనంతరం కమిటీ గ్రాండ్గా ‘ఆఫ్టర్’ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో ఎన్టీఆర్, రామ్చరణ్, ఉపాసన, దీపికా తదితరులు పాల్గొన్నారు. రాజమౌళి ఇంట్లో పార్టీ ‘‘మేం కచ్చితంగా ఆస్కార్ గెలుస్తామని ముందు నుంచి యూనిట్ అంతా నమ్మకంగా ఉన్నాం. ఆస్కార్ అందుకోవడమా? లేదా ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ను ప్రదర్శించడమా.. ఈ రెండింటిలో ఏ క్షణాలు అపూరమైనవి అని నన్ను అడిగితే... ఎంచుకోవడం నాకు చాలా కష్టం. ‘నాటు నాటు’ పాటను వేదికపై ప్రదర్శిస్తున్నంతసేపు వీక్షకులు క్లాప్ కొడుతూ, సాంగ్ పూర్తయ్యాక స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం అనేది నన్ను ప్రపంచంలోనే అత్యున్నత శిఖరంపై నిలబెట్టినట్లయింది. అలాగే ఆస్కార్ అవార్డు ఆయన్ను (కీరవాణిని ఉద్దేశిస్తూ..) కూడా ఆ శిఖరాగ్రాన నిలబెట్టింది’’ అని పేర్కొన్న రాజమౌళి ఫుల్ జోష్లో ఉన్నారు. ఆ ఆనందంలో లాస్ ఏంజిల్స్లోని తన ఇంట్లో ‘ఆర్ఆర్ ఆర్’ టీమ్కు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీని రాజమౌళి భార్య రమ, ఆయన తనయుడు కార్తికేయ హోస్ట్ చేశారు. ఈ పార్టీలో కీరవాణి పియానో ప్లే చేయగా, అక్కడ ఉన్నవారు పాట పాడారు. ఈ సెలబ్రేషన్స్ను రామ్ చరణ్ వీడియో తీశారు. ఈ ఫోటోలను ఉపాసన షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోల్లో తారక్ కనిపించకపోవడంతో అసలు తను పార్టీకి హాజరయ్యాడా? లేదా? అని ఆలోచిస్తున్నారు అభిమానులు. భారతీయుల మనసు గెలిచిన లేడీ గగా ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చిందని ప్రకటించగానే.. రాజమౌళి ఆనందంతో చప్పట్లు కొట్టి, తన భార్య రమను హత్తుకున్నారు. ఎన్టీఆర్, రామ్చరణ్లు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ సినిమాకి సంబంధించినవారిగా ఆ విధంగా ఆనందపడటం సహజం. అయితే అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్, యాక్ట్రస్ లేడీ గగా చప్పట్లు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేయడం విశేషం. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో పోటీలో ఉన్న ‘నాటు..’తో పాటు ‘టాప్గన్: మ్యావరిక్’ చిత్రం కోసం పాడిన ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటకు లేడీ గగా నామినేషన్ దక్కించుకున్నారు. తన పాటకు కాకుండా ‘నాటు..’కు వచ్చినప్పటికీ చప్పట్లతో అభినందించడం ఆమె సంస్కారానికి నిదర్శనం అని నెటిజన్లు అభినందిస్తున్నారు. సోషల్ మీడియా అండ్ న్యూస్ మీడియా ట్రెండ్స్ను విశ్లేషించే అమెరికాకి చెందిన నెట్బేస్ క్విడ్ కొన్ని గణాంకాలను వెల్లడించింది. ఆ లెక్కల ప్రకారం (వేడుక జరిగిన సమయంలో..) టాప్ మెన్షన్డ్ యాక్టర్స్ జాబితా తొలి స్థానంలో ఎన్టీఆర్ నిలిచారు. ఆ తర్వాతి స్థానాలు వరుసగా రామ్చరణ్, కి హుయ్ క్వాన్ (ఉత్తమ సహాయనటుడు), బ్రెండెన్ ఫ్రాసెర్ (ఉత్తమ నటుడు), పెడ్రోపాస్కల్ నిలిచారు. ఇక నటీమణుల విషయానికొస్తే.. మిషెల్ యో (ఉత్తమ నటి) అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో వరుసగా మిచెల్ యో, లేడీ గగా, ఏంజెలా బాసెట్, ఎలిజిబెత్ ఒల్సెన్, జామిలీ కర్టీస్ (ఉత్తమ సహాయ నటి) నిలిచారు. సినిమాల పరంగా తొలి రెండు స్థానాల్లో భారతీయ చిత్రాలు ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్ –ఫీచర్ ఫిల్మ్), ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్) నిలిచాయి. ఆ తర్వాతి మూడు స్థానాల్లో వరుసగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’, ‘అర్జెంటీనా 1985’ చిత్రాలు నిలిచాయి. -
రామ్ చరణ్ - ఉపాసన.. ఎక్కడికెళ్లినా ఆ విషయాన్ని మర్చిపోరు!
మెగా హీరో రామ్ చరణ్, భార్య ఉపాసన ఎక్కడికెళ్లినా ప్రత్యేకంగా కనిపిస్తారు. తాజాగా అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకలో ఈ జంట సందడి చేసింది. మరికొన్ని నెలల్లోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో జరిగిన ఆస్కార్ కార్యక్రమానికి వెళ్లేముందు ఈ జంట పూజలు చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. రామ్ చరణ్, భార్య ఉపాసన ఎక్కడికి వెళ్లినా ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతే కాకుండా భారతీయ సంప్రదాయ దుస్తులో ఈ జంట వేదికపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'నేను, నా భార్య ఎక్కడికి వెళ్లినా చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇది మా ఆచారంతో పాటు భారతదేశానికి సంప్రదాయం ఉట్టిపడేలా చేస్తుంది. ఈ రోజును కృతజ్ఞతలు తెలుపుతూ ప్రారంభించడం మనందరికీ చాలా ముఖ్యం. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.' అని అన్నారు. కాగా.. రామ్ చరణ్ ధరించిన దుస్తులపై ఉన్న బటన్లు నిజానికి నాణేలు, వీటిని భారత్ చిహ్నంతో డిజైన్ చేశారు. ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అయిన ఉపాసన తెలంగాణ కళాకారులు తయారు చేసిన పట్టు చీరలో కనిపించారు. కాగా.. 95వ ఆస్కార్ వేడుకల్లో RRRలోని నాటు నాటు సాంగ్కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. ఈ అవార్డును ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ అందుకున్నారు. కాగా.. రామ్ చరణ్ తన తదుపరి చిత్రం శంకర్ దర్శకత్వంలో ఆర్సి 15లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ జోడిగా నటిస్తోంది. -
ఆస్కార్ గెలిచిన రోజే ఏనుగులు మిస్సింగ్.. షాక్లో చిత్రబృందం
లాస్ ఎంజిల్స్లో జరిగిన ఆస్కార్ అవార్డు గెలిచిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. పూర్తిగా ఇండియాలో నిర్మించిన డాక్యుమెంటరీకి తొలి ఆస్కార్ దక్కడం విశేషం. వీరికి ఈ అవార్డు రావడానికి కారణం రఘు, అమ్ము అనే అనాథ ఏనుగు పిల్లలు. ఆ ఏనుగు పిల్లను చేరదీసిన ఆదివాసి దంపతులు బొమ్మన్, బెల్లి. కరెంటు తీగలు తగిలి తల్లి ఏనుగులు మరణించడంతో బొమ్మన్, బెల్లిలు రఘుని, అమ్ముని సాకుతారు. మనుషులకు అడవి జంతువులకు మధ్య ఉండే అనుబంధాన్ని ఈ డాక్యుమెంటరీలో ఎంతో అద్భుతంగా చూపించారు. అయితే అవార్డ్ ప్రదానోత్సవం రోజునే విచిత్ర సంఘటన జరిగింది. ఒకవైపు అవార్డ్ వచ్చిందన్న ఆనందంలో ఉంటే.. మరోవైపు ఆ డాక్యుమెంటరీలో నటించిన ఏనుగులు అదృశ్యమయ్యాయనే వార్త ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డాక్యుమెంటరీలో రఘు, అమ్ము అనే రెండు ఏనుగులు అదృశ్యమైనట్లు బొమ్మన్ వెల్లడించారు. కొంతమంది తాగుబోతులు ఏనుగులను తరమడంతో ఆదివారం రెండు ఏనుగులు కృష్ణగిరి అరణ్యంలోకి వెళ్లిపోయాయని ఆయన చెప్పారు. ఆ ఏనుగుల కోసం బొమ్మన్ ప్రస్తుతం వెతుకడం ప్రారంభించారు. బొమ్మన్ మాట్లాడుతూ..'మద్యం మత్తులో ఉన్న కొంత మంది వ్యక్తులను తరమడంతో ఏనుగులు అడవిలోకి వెళ్లిపోయాయి. ప్రస్తుతం నేను కృష్ణగిరి ఫారెస్ట్లో వెతుకుతున్నా. అవి రెండూ కలిసే ఉన్నాయా.. విడిపోయాయా అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వాటి ఆచూకీ కనిపెట్టడానికి ప్రయత్నిస్తా. ఒకవేళ అవి నాకు కనిపించకపోతే ఫారెస్ట్ రేంజర్కు ఫిర్యాదు చేసి నేను నా సొంతూరికి వెళ్తా.' అని అన్నారు. -
ఎట్టకేలకు స్పందించిన అల్లు అర్జున్.. ట్వీట్ వైరల్
ఇండియన్ మూవీ ఆస్కార్ సాధించడం అనేది ఓ కల. ఆ కలను ఆర్ఆర్ఆర్ మూవీతో రాజమౌళి నెరవేర్చాడు. విశ్వవేదిక అకాడమీ అవార్డ్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకుంది. ఒక ఇండియన్ సినిమా ఆస్కార్ బరిలో నామినేషన్ లో ఉండటమే కాకుండా...అవార్డ్ సైతం గెలుచుకుంది. ఈ విషయాన్ని హాలీవుడ్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. ఇక రాజమౌళి టీమ్ చరిత్ర సృష్టించటమే కాదు..దేశానికి ప్రతిష్టాత్మకమైన అవార్డ్ సాధించి పెట్టిందని టీటౌన్ సంబరాలతో మోత మోగిపోయింది. టాలీవుడ్ అగ్రహీరోలతో పాటు..యంగ్ హీరోలందరూ సోమవారమే ట్వీటర్ వేదికగా ఆర్ఆర్ఆర్ టీమ్ కు విషెస్ తెలిపారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్క రోజు ఆలస్యంగా ఆర్ఆర్ఆర్ టీమ్ కు విషెస్ చెప్పారు. ఇండియన్ సినిమాకు ఇది హార్ట్ టచింగ్ మూమెంట్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అలాగే రామ్ చరణ్ ను లవ్లీ బ్రదర్ అంటూ... ఎన్టీఆర్ తెలుగు ప్రజల గర్వకారణం అని పేర్కొన్నారు. వాళ్ళిద్దరూ తమ స్టెప్పులతో ప్రపంచమంతా డ్యాన్స్ చేసేలా చేశారని పోస్టులో రాసుకొచ్చాడు. అలాగే ఈ మేజిక్ క్రియేట్ చేసిన రాజమౌళి కి అల్లు అర్జున్ అభినందనలు తెలియజేశారు. Big moment for INDIA 🇮🇳. Elated to see a Telugu song shaking at the Oscars . Biggest Congratulations to @mmkeeravaani garu , @boselyricist garu , @premrakchoreo master , brothers @Rahulsipligunj , @kaalabhairava7 , my beloved global stars , my lovely brother @AlwaysRamCharan — Allu Arjun (@alluarjun) March 14, 2023 ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఒక తెలుగు సినిమాకు ఆస్కార్ వస్తే.. ఇంత ఆలస్యంగా ట్వీట్ చేస్తారా? అని కొంతమంది నెటిజన్స్ బన్నీపై ఫైర్ అవుతుంటే.. షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల బన్నీ లేట్గా స్పందించి ఉంటారని ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతేకాదు బన్నిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రాంచరణ్ను గ్లోబల్ స్టార్ అంటూ.. అలాగే ఎన్టీఆర్ను తెలుగు ప్రైడ్ అంటూ ప్రశంసించడంపై ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. -
ఆస్కార్ వేడుక.. నంబర్వన్గా నిలిచిన జూనియర్ ఎన్టీఆర్
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన 95వ ఆస్కార్ అవార్డుల వేడుక ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్. మరో డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ అవార్డులు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఈ వేడును దాదాపు 18.7 మిలియన్ల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈవెంట్ను లైవ్ ఇచ్చిన ఏబీసీ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే గతేడాదితో ఆస్కార్తో పోలిస్తే దాదాపు 12 శాతం ఆడియన్స్ పెరిగినట్లు సమాచారం. గతేడాది 16.6 మిలియన్ల మంది ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షించారు. అయితే గతంలో జరిగిన కొన్ని వేడుకలతో పోలిస్తే ఇది తక్కువేనని అంటున్నారు. ఇటీవల ఆస్కార్ వేడుకలు వీక్షించే వారి సంఖ్య తగ్గిపోతుండటంతో విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో గతంలో నేషనల్ ఫుట్ బాల్ లీగ్ తర్వాత అత్యధిక మంది చూసే కార్యక్రమంగా ఆస్కార్ నిలిచింది. ఎన్టీఆర్ నంబర్ వన్ ఆస్కార్ అవార్డుల వేడుక సందర్భంగా సోషల్ మీడియాతో పాటు ఇతర మీడియాల్లో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్ మేల్ మెన్షన్స్)లో విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ నంబర్ వన్ స్థానంలో నిలిచారని సోషల్మీడియాను విశ్లేషించే నెట్బేస్ క్విడ్ తెలిపింది. ఆయన తర్వాత మెగా హీరో రామ్చరణ్ ఉన్నారని వెల్లడించింది. ఆ తర్వాత ఉత్తమ సహనటుడిగా అవార్డు దక్కించుకున్న ‘ఎవ్రీథింగ్’ నటుడు కె హుయ్ ఖ్యాన్, ఉత్తమ నటుడు బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్), అమెరికన్ యాక్టర్ పెడ్రో పాస్కల్లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. టాప్లో ఆర్ఆర్ఆర్ అలాగే అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగానూ ‘ఆర్ఆర్ఆర్’ నిలిచిందని తెలిపింది. ఆ తర్వాత ది ఎలిఫెంట్ విస్పరర్స్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అర్జెంటీనియా 1985 చిత్రాలు ఉన్నాయి. ఇక హీరోయిన్ల విషయానికొస్తే, మిషెల్ యో, లేడీ గాగా, ఏంజిలా బస్సెట్, ఎలిజిబెత్ ఓల్సెన్, జైమి లీ కర్టిస్లు వరుసగా ఐదుస్థానాల్లో నిలిచారు. -
అత్యధిక ఆస్కార్స్ గెలుచుకున్న చిత్రమిదే.. పదేళ్ల కష్టానికి ప్రతిఫలం
మిషెల్ యో, స్టెఫానీ, కే హుయ్ క్వాన్, జెన్నీ స్లాట్, జామి లీ కర్టిస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్’. డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ గత ఏడాదిæ బాక్సాఫీస్ వద్ద సూపర్ బంపర్హిట్ కొట్టింది. 25 మిలియన్ డాలర్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం అంతకు నాలుగు రెట్లు అంటే వంద మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసింది. ఇక ఏడు ఆస్కార్ అవార్డులను సాధించిన ఈ చిత్రకథ విషయానికి వస్తే... చైనా నుంచి అమెరికాకు వలస వచ్చిన ఎవిలిన్ క్వాడ్ కుటుంబం అక్కడ లాండ్రీషాపు పెట్టుకుని జీవనం సాగిస్తుంటుంది. వీరు ఒక ప్రపంచంలో జీవిస్తున్నట్లే మరో ప్రపంచంలో వీరిలాంటి వారే ఉంటారు. వీరు ఒకరికొకరు తారసపడినప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి అన్నదే కథ. ఈ మల్టీవర్స్ కాన్సెప్ట్ ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ చిత్రదర్శకులు డేనియల్ క్వాన్, స్కీనెర్ట్ 2010లోనే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రకథను స్టార్ట్ చేశారు. కానీ షూటింగ్కి వెళ్లడానికి పదేళ్లు పట్టింది. రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం 2022 లో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. -
60 ఏళ్ల వయసులో ఉత్తమ నటిగా ఆస్కార్.. సరికొత్త చరిత్రకు శ్రీకారం
'కలలు కనండి. నిజం అవుతాయనడానికి నేను ఈ అవార్డును ఓ ప్రూఫ్గా చూపిస్తున్నాను. మహిళలకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మీ ప్రైమ్ టైమ్ను మీరు దాటిపోయారు అంటే నమ్మొద్దు. ఈ అవార్డుని నేను మా అమ్మకు... ప్రపంచంలో ఉన్న అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాను. ఎందుకంటే వారే నిజమైన సూపర్హీరోస్. వీరే లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరూ ఉండి ఉండేవారు కాదు.మా అమ్మగారికి 84 ఏళ్లు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఇప్పుడు మలేసియాలో ఆమె ఈ వేడుకను చూస్తున్నారు. నేను ఈ అవార్డును ఇంటికి తీసుకువస్తున్నాను (కుటుంబ సభ్యులను ఉద్దేశించి). అలాగే నా కెరీర్ హాంకాంగ్లో స్టార్ట్ అయ్యింది. అక్కడ నాకు హెల్ప్గా ఉన్నవారికి ధన్యవాదాలు. అలాగే నెవర్ గివప్. డానియల్ డ్యూయో, ఏ 24 షూటింగ్ స్టూడియో, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్..’ నటీనటుల సహాయం లేకపోతే నేను ఇప్పుడు ఇక్కడ ఈ వేదికపై ఉండేదాన్ని కాదు'. – ఉత్తమ నటి, మిషెల్ యో(కాగా, ఈ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్యో ఆస్కార్ అందుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచారు. అంతేకాదు ఇప్పుడామె వయస్సు 60ఏళ్లు. ) నాకు అవార్డు ఇచ్చిన ఆస్కార్ కమిటీకి, ఇలాంటి ఓ బోల్డ్ ఫిల్మ్లో నటించే అవకాశం కల్పించినవారికి ప్రత్యేక ధన్యవాదాలు. ‘ది వేల్’ సినిమాలో భాగమైన వారిని గుర్తు చేసుకోకుండా ఉండలేను. బెస్ట్ యాక్టర్గా నాకు అవార్డు రావడాన్ని చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. నటుడిగా నేను 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. కొన్ని సందర్భాల్లో నాకు గుర్తింపు వస్తుందా? అని ఆలోచించాను. అలా ఆలోచించినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. కేవలం తిమింగలాలు మాత్రమే లోలోతుల్లో ఈదగలవు. సినిమా ఇండస్ట్రీలో నేనూ అంతే. నాకు హెల్ప్గా ఉన్న నా కుటుంబ సభ్యలకు ధన్యవాదాలు. – ఉత్తమ నటుడు బ్రెండెన్ ఫ్రాజెర్ (చెమర్చిన కళ్లతో...) ఈయన కూడా 54 ఏళ్ల వయసులో ఉత్తమ నటుడిగా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు.) Michelle Yeoh accepts her #Oscar for Best Actress: "For all the little boys and girls who look like me watching tonight, this is a beacon of hope and possibilities. This is proof that dreams do come true." https://t.co/ndiKiHfmID pic.twitter.com/pQN8nHDhCx — Variety (@Variety) March 13, 2023 -
అంబారీ ఎక్కి ఆస్కార్ వచ్చింది.. తొలిసారి భారత డాక్యుమెంటరీకి..
‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ నిడివి 39 నిమిషాలు. రెండు ఏనుగు పిల్లలు, నీలగరి అడవుల్లో ఉండే ‘కట్టు నాయకర్’ అనే తెగకు చెందిన ఆదివాసీ భార్యాభర్తలు ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తారు. ఆ భార్యాభర్తల పేర్లు బొమ్మన్, బెల్లి. ఏనుగు పిల్లల్లో ఒకదాని పేరు రఘు, మరోదాని పేరు అమ్ము. కరెంటు తీగలు తగిలి తల్లి ఏనుగులు మరణించడంతో బొమ్మన్, బెల్లిలు రఘుని, అమ్ముని సాకుతారు. అయితే డాక్యుమెంటరీలో ఎక్కువ భాగం రఘతో బొమ్మన్, బెల్లిలకు ఉండే అనుబంధం చూపుతుంది. అయితే నేపథ్యంలో అందమైన అడవులు, వాగులు, ఆదివాసీల క్రతువులు ఇవన్నీ దర్శకురాలు కార్తికి చూపడంతో డాక్యుమెంటరీకి ఒక సంపూర్ణత్వం వచ్చింది. బొమ్మన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. ఇప్పుడు రఘు, అమ్ములను అటవీ శాఖ వారు ‘ముడుమలై టైగర్ రిజర్వ్’కు మార్చారు. దాంతో రఘుతో ఆ దంపతుల బంధం తెగింది. విఘ్నాలు తొలగిపోయాయి. పూర్తిగా ఇండియాలో నిర్మితమైన డాక్యుమెంటరీకి తొలి ఆస్కార్ అందింది. ఇది స్త్రీల ద్వారా జరిగింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు దర్శకత్వం వహించింది కార్తికి గోంజాల్వేజ్. నిర్మించింది గునీత్ మోంగా. వీరికి ఈ అవార్డు రావడానికి కారణం రఘు అనే అనాథ ఏనుగు పిల్ల. ఆ ఏనుగు పిల్లను సాకిన ఆదివాసి దంపతులు. మనుషులకు అడవి జంతువులకు మధ్య ఉండే అనుబంధం ఈ డాక్యుమెంటరీలో ఎంతో అద్భుతంగా వ్యక్తమైంది. అందుకే అంబారీ ఎక్కి వచ్చినట్టుగా మనకు ఆస్కార్ ఘనంగా దక్కింది. ఏనుగులు– మావటీలు మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నారు. కాని వారి మధ్య ఉన్నది ఒక రకమైన ప్రొఫెషనల్ స్నేహం. కాని కొన్ని సందర్భాలలో అనాథలైన ఏనుగు పిల్లలను కాపాడే పని ఆదివాసీలు తీసుకుంటారు. వారిది పెంచిన మమకారం. ఆ మమకారమే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కథాంశం. దర్శకురాలు కార్తికీది ఊటి. అక్కడే పుట్టి పెరిగింది. ఊటీకి అరగంట ప్రయాణ దూరంలో ‘తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్’ ఉంది. అక్కడ ఏనుగులను సంరక్షిస్తుంటారు. కార్తికి గోంజాల్వేజ్ చిన్నప్పటి నుంచి ఆ క్యాంప్కు వెళ్లి ఏనుగులను చూసేది. ఆ తర్వాత ఆమె పెరిగి పెద్దదయ్యి ఫొటోగ్రాఫర్గా మారినా, కెమెరా ఉమన్గా తనకున్న వైల్డ్లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఇష్టం వల్ల యానిమల్ ప్లానెట్, డిస్కవరీ చానల్స్లో పని చేసినా ఎప్పుడూ తన ప్రాంత ఏనుగుల మీద ఏదైనా ఫిల్మ్ చేయాలని అనిపించలేదు. కాని 2017లో అందుకు బీజం పడింది. అతడు – ఆ ఏనుగు పిల్ల కార్తికి గోంజాల్వేజ్ 2017లో బెంగళూరు నుంచి కారులో ఊటీకి వెళుతోంది. ఊటీ చేరుకుంటూ ఉండగా ఒక మనిషి చిన్న ఏనుగు పిల్లను నడిపించుకుంటూ వెళుతూ ఆమె కంట పడ్డాడు. కార్తికి వెంటనే కారు ఆపి ఈ మనిషి ఈ ఏనుగు పిల్లను ఎక్కడకు తీసుకువెళుతున్నాడు అని వెంబడించింది. వారిద్దరూ దగ్గరిలోని ఏటికి వెళ్లారు. ఆ మనిషి ఆ ఏనుగు పిల్లకు చంటిపిల్లలకు మల్లే స్నానం చేయించాడు. దానితో ఎన్నో కబుర్లు చెప్పాడు. ‘అరె.. ఈ బంధం భలే ఉందే’ అనిపించింది కార్తికికి. అతణ్ణి పలకరించింది. పేరు బొమ్మన్. ఆ ఏనుగు పిల్ల పేరు రఘు. ఆ ఏనుగు పిల్ల ఇటీవలే అనాథ అయ్యింది. పంటలను కాపాడుకోవడానికి పెట్టిన కరెంటు తీగల బారిన పడి రఘు తల్లి మరణించింది. అనాథ అయిన రఘు తల్లి వియోగంతో కృశించి చావుకు దగ్గరగా ఉండగా బొమ్మన్కు కనిపించాడు. దానిని ఇంటికి తీసుకెళ్లాడు. బొమ్మన్ భార్య బెల్లి రఘుకు తల్లిలా మారింది. ఆ ముగ్గురు ఒక కుటుంబం అయ్యారు. ఇలాంటి అనుబంధాలు చూపితే మనిషి, జంతువు కలిసి మెలిసి మనుగడ సాగించాల్సిన అవసరాన్ని చూపినట్టు అవుతుందని కార్తికి అనుకుంది. వెంటనే డాక్యుమెంటరీ నిర్మించడానికి నెట్ఫ్లిక్స్ను సంప్రదించింది. నెట్ఫ్లిక్స్ తన కో ప్రొడ్యూసర్గా నిర్మాత మోంగాను సంప్రదించింది. అలా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ నిర్మాణం మొదలైంది. ఢిల్లీకి చెందిన గునీత్ దాదాపు పదేళ్లుగా అంతర్జాతీయ దృష్టి పడే సినిమాల నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. ఆమె నిర్మాణ భాగస్వామి అయిన ‘కవి’ (2010) బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్లో ఆస్కార్ నామినేషన్ పొందగా, ‘పిరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ (2018) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్గా ఆస్కార్ అవార్డ్ పొందింది. అయితే ‘పిరియడ్’కు పని చేసిన సాంకేతిక నిపుణులు భారతీయులు కారు. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ను తీయాలనుకుంటున్న కార్తికితో పని చేయడం వల్ల ఈసారి పూర్తి భారతీయ నిర్మాణంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని గునీత్ భావించింది. అలా వీరిద్దరు కలిసి పూర్తి చేసిన ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 8, 2022న విడుదలైంది. ఇది డాక్యుమెంటరీ వేవ్ ‘ఇప్పుడు ఇండియాలో నడుస్తున్నది డాక్యుమెంటరీ వేవ్. ఫీచర్ ఫిల్మ్స్లో కన్నా డాక్యుమెంటరీలో భారతీయ దర్శక నిర్మాతలు వినూత్నమైన కథాంశాలను చెబుతున్నారు’ అంటుంది గునీత్. కార్తికి మాట్లాడుతూ– ‘ఏనుగులు ఎంత తెలివైనవో ఎంత భావోద్వేగంతో బంధంతో ఉంటాయో నా డాక్యుమెంటరీలో చూపించాను. ఇక మీదటైనా అవి వేరు మనం వేరు అనుకోకపోతే చాలు’ అంది. ‘నేను తీసే ఫిల్మ్స్ ఇకపై కూడా ఇలాంటి కథాంశాలతో ఉంటాయి’ అన్నారు. చదవండి: ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ -
Natu Natu: 17 రోజుల కష్టం.. రూ.15 కోట్ల బడ్జెట్.. ఆస్కార్ ఊరికే రాలేదు..
‘నాటు నాటు’ పాటను ఉక్రెయిన్లో చిత్రీకరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భవన ప్రాంగణంలో ఈ పాటను షూట్ చేశారు. పక్కనే పార్లమెంట్ భవనం కూడా ఉంది. అయితే ఇలాంటి ప్రదేశంలో ఓ సినిమా షూటింగ్ అంటే చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జెలెన్స్కీ ఒకప్పుడు టెలివిజన్ యాక్టర్ అట. సో.. ఆర్ట్ గురించి ఆయనకు అవగాహన ఉండటంతో పాటను చిత్రీకరించేందుకు అనుమతి ఇచ్చారు. ‘నాటు నాటు..’ పాటను 17 రోజుల పాటు షూట్ చేశారు. సెట్స్లో ప్రతి రోజూ 150మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. 200మంది సాంకేతిక నిపుణులు ఈ పాట కోసం లొకేషన్లో హాజరయ్యారు. ఇక ఈ పాటలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ‘హుక్ స్టెప్’ గురించి. దాదాపు 80 రకాల స్టెప్స్ను కంపోజ్ చేశాక ఈ పాట కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అండ్ టీమ్ ఆ స్టెప్ను ఫైనలైజ్ చేశారు. ఈ స్టెప్ కూడా ఊరికే పూర్తి కాలేదు. డ్యాన్స్లో మంచి ప్రావీణ్యం ఉన్న ఎన్టీఆర్, రామ్చరణ్లు 18 టేక్స్ తీసుకున్నారు. ఎన్టీఆర్, చరణ్ల మధ్య సింక్ రావడానికి ఎక్కువ సమయం పట్టిందట. ఇలా వీరందరి కష్టం ఇప్పడు ఆస్కార్ అవార్డు రూపంలో ఫలించింది. అలాగే ఈ పాట కోసం దాదాపు రూ. 15 కోట్లు అయింది. నిజానికి ఈ పాటను ముందుగా ఇండియాలోనే షూట్ చేయాలనుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట లొకేషన్ను అనుకున్నారు. కానీ ఆ సమయానికి వర్షాకాలం కావడంతో ఇతర దేశాల్లో తీయాలనుకున్నారు రాజమౌళి. సెట్ అయితే సహజంగా ఉండదని భావించారు. ఆ సమయంలోనే జెలెన్స్కీ భవనం లొకేషన్ రాజమౌళి కంట పడింది. అక్కడే పాటను చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ అనుమతులు దొరకవని అనుకున్నారు. అయితే ఉక్రెయిన్ టీమ్ వల్ల అది సాధ్యమైంది. అలాగే పాట సమయంలో ఎన్టీఆర్, రామ్చరణ్లతో పాటు సైడ్ డ్యాన్సర్స్కు కూడా రెండు, మూడు కాస్ట్యూమ్స్ను రెడీగా ఉంచారు. ఎందుకంటే సాంగ్ను దుమ్ములో తీశారు. కాస్ట్యూమ్స్ పాడైతే షూటింగ్ లేట్ అవుతుందని. ఈ సినిమాకు రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేశారు. భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న వైవిధ్యమైన దేశం. ‘ఆర్ఆర్ఆర్’లో మీరు చూసింది అదే. ప్రపంచానికి చెప్పాల్సిన కథలు ఇండియాలో చాలా ఉన్నాయి. చాలా తీవ్రమైన, బలమైన, భావోద్వేగ, నాటకీయ యాక్షన్ తో కూడిన సినిమాలు ఇండియా నుంచి వస్తాయి. ఇప్పుడు భారతీయులకు పూర్తి నమ్మకం కలిగింది. – ఎన్టీఆర్ మనం గెలిచాం. మన ఇండియా సినిమా గెలిచింది. యావత్ దేశమే గెలిచింది. ఆస్కార్ను ఇంటికి తెచ్చేస్తున్నాం. మా జీవితాల్లోనే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ‘ఆర్ఆర్ఆర్’ ఎంతో ప్రత్యేకమైనది. ఆస్కార్ అవార్డు సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేనింకా కలలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. రాజమౌళి, కీరవాణిగార్లు భారత చలనచిత్రపరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు. ఈ అద్భుత కళాఖండంలో నన్ను భాగం చేసినందుకు కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు..’ అనేది ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగానికి రూపమిచ్చిన చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్రక్షిత్లకు థ్యాంక్స్. నా బ్రదర్ ఎన్టీఆర్, కో స్టార్ ఆలియాభట్కు «థ్యాంక్స్. తారక్.. కుదిరితే నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డులు సృష్టించాలనుంది. ఈ అవార్డు భారతీయ నటీనటులు, సాంకేతిక నిపుణులందరి సొంతం. నా భార్య (ఉపాసన)కు ఆరో నెల. మా బేబీయే మాకీ అదృష్టాన్ని తెచ్చిందనుకుంటున్నాను. – రామ్చరణ్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..? -
ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ..
‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా...’ పాటలో దమ్ముంటే లోకం పాడుతుంది.. ఆడుతుంది.. ఆ పాట విశ్వ విజేత అవుతుంది. ‘నాటు నాటు...’ అందుకో ఉదాహరణ. క్లాస్, మాస్ తేడా లేకుండా నాటు బీటు అందరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. తెలుగు పరిశ్రమ తొలి ఆస్కార్ ఆనందాన్ని చవి చూసేలా చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు ఎన్టీఆర్, రామ్చరణ్, దర్శకుడు రాజమౌళి, డాల్బీ థియేటర్లో ఇతరుల కరతాళ ధ్వనుల మధ్య చిత్రసంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్ని అందుకున్నారు. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ 95వ ఆస్కార్ అవార్డు విశేషాలు తెలుసుకుందాం... అంతర్జాతీయ వేదికపై తెలుగోడి ‘నాటు నాటు’ మారుమోగిపోయింది. ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులు అదిరిపోయాయి. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. దాదాపు 80 పాటలను పరిశీలించి 15 పాటలను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు కోసం షార్ట్లిస్ట్ చేసింది ఆస్కార్ కమిటీ. ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషన్స్తో ‘నాటు నాటు..’ విదేశీయులకు కూడా మరింత చేరువైంది. ఈ క్రమంలోనే జనవరి 24న వెల్లడైన ఆస్కార్ నామినేషన్స్లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు..’కు చోటు దక్కింది. ‘ నాటు నాటు’ పాటతో పాటు ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ చిత్రంలోని ‘అప్లాజ్’, ‘బ్లాక్పాంథర్: వకాండ ఫరెవర్’లోని ‘లిఫ్ట్ మీ అప్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రంలోని ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’, ‘టాప్గన్: మ్యావరిక్’లోని ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలు బరిలో నిలిచాయి. అయితే వీటన్నింటినీ దాటుకుని తెలుగు ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డును తెచ్చింది. ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త చరిత్రకు పునాది వేసింది. ఇలా దేశానికి ఆస్కార్ తెచ్చిన తొలి చిత్రంగా, తొలి తెలుగు చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది (గతంలో కొందరు భారతీయులు, ఇండో–అమెరికన్స్ ఆస్కార్ అవార్డులు సాధించినప్పటికీ అవి భారతీయ చిత్రాలు కావు). ఒక ఏషియన్ చిత్రం (ఆర్ఆర్ఆర్) నుంచి ఓ పాటకు (నాటు నాటు) అవార్డు రావడం ఇదే తొలిసారి. అలాగే నాన్–ఇంగ్లిష్ పాటల్లో ఆస్కార్ అవార్డు సాధించిన నాలుగో పాటగా ‘నాటు నాటు’ నిలిచింది. ఇక ఆస్కార్ అవార్డు సాధించిన తొలి తెలుగు వ్యక్తులుగా కీరవాణి, చంద్రబోస్ రికార్డు సృష్టించారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించిన రెండో భారతీయుడుగా కీరవాణి, రెండో గీత రచయితగా చంద్రబోస్ నిలిచారు. 2009లో జరిగిన 81వ ఆస్కార్ అవార్డ్స్లో ఇంగ్లిష్ చిత్రం ‘స్లమ్డాగ్ మిలియనీర్’కి గాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఏఆర్ రెహమాన్, రచయిత గుల్జార్ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్లో ప్రకటించిన మొత్తం 23 విభాగాల జాబితాల్లోకి వస్తే... ఉత్తమ చిత్రం: ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్ ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ నటుడు: బ్రెండెన్ ఫ్రాసెర్ (ది వేల్) ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ ఒరిజినల్సాంగ్: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’(మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్) ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్ క్వాన్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సహాయ నటి: జామి లీ కర్టిస్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ క్యాస్ట్యూమ్ డిజైన్: రూథ్ కార్టర్(బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్) ఉత్తమ స్క్రీన్ ప్లే: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సినిమాట్రోగ్రఫీ: జేమ్స్ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్) ఉత్తమ ఎడిటర్: పాల్ రోజర్స్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్ (జర్మనీ) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నవాల్నీ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్ 2) బెస్ట్ సౌండ్: టాప్గన్: మ్యావరిక్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిల్: ది వేల్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: పినాషియో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ఏన్ ఐరిస్ గుడ్ బై యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్ అండ్ ది హార్స్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: షెరా పాల్లే (ఉమెన్ టాకింగ్) బెస్ట్ ఒరిజినల్ స్కోర్: బ్రెటెల్మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) హోస్ట్ జిమ్మిపై నెటిజన్ల ఆగ్రహం ఆస్కార్ వేడుక ప్రారంభంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తావన వచ్చినప్పుడు హోస్ట్ జిమ్మి ‘ఆర్ఆర్ఆర్’ బాలీవుడ్ మూవీ అన్నట్లుగా చెప్పారు. దీంతో నెటిజన్లు జిమ్మి కిమ్మెల్ను తప్పుపడుతూ కామెంట్ల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా అని గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆస్కార్లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డుకు హోస్ట్ అయిన జిమ్మీ బాలీవుడ్ మూవీ అనడం సరికాదని çపలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శించారు. డు యూ నో నాటు? ‘నాటు నాటు’ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్కక్కర్లేదు. కానీ ఆస్కార్ వేదికపై ‘డు యూ నో నాటు?.. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు’.. అంటూ దేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్కి ఓ ప్రెజెంటర్గా వెళ్లిన దీపికా పదుకోన్ ‘నాటు నాటు’ పాటను పరిచయం చేశారు. వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ‘నాటు నాటు’ పాటను పాడగా, వెస్ట్రన్ డ్యాన్సర్స్ కాలు కదిపారు. ఈ వేడుకలో వీక్షకుల్లో ‘నాటు నాటు..’ పాట ఎంత జోష్ నింపిందంటే.. పాట పూర్తయ్యాక అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..? -
ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ జరిగిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేడుకల్లో భారత్కు రెండు కేటగరీల్లో అవార్డులు దక్కాయి. ఈ ఏడాది జరిగిన 95 ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్లో భారత్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నాటునాటు సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ వచ్చింది. అలాగే అందరి దష్టిని ఆకర్షించిన మరో చిత్రం ఒకటుంది. ఆర్ఆర్ఆర్తో పాటు బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్ను కైవసం చేసుకుంది 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు సాధించిన యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. ఈ షార్ట్ ఫిలింలో ప్రధాన పాత్రలో కనిపించిన బెల్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆమె మాత్రం ఆస్కార్ రావడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా.. దిక్కులేని ఏనుగులను ఆదరించి.. వాటిని చూసుకునే ఓ దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కించారు ది ఎలిఫెంట్ విస్పరర్స్. ఆస్కార్ అంటే ఏంటో తెలియదు ఆస్కార్ రావడం పట్ల బెల్లీ మాట్లాడుతూ.. 'ఏనుగులు అంటే మాకు పిల్లలతో సమానం. తల్లిని కోల్పోయిన పిల్లలకు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తాం. అలాంటి చాలా గున్న ఏనుగులను చేరదీశాం. వాటిని మా సొంత పిల్లల్లా చూసుకుంటాం. ఇది మా రక్తంలోనే ఉంది. మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవారు. కానీ నాకు ఆస్కార్ అంటే ఏంటో తెలియదు. అయినా అభినందనలు రావడం చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు. కాగా ఈ చిత్రంలో నటించిన బెల్లీ భర్త మాత్రం.. తీవ్ర సమస్యతో బాధపడుతున్న ఓ ఏనుగును తీసుకొచ్చేందుకు వెళ్లాడని చెప్పింది. అసలు కథేంటంటే.. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ 2023లో బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డ్ దక్కించుకుంది. -
RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు: దిల్ రాజు
నేహా, వేదాంత్ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా నటించిన చిత్రం 'లిల్లీ'. ఈ చిత్రంలో రాజ్వీర్ ముఖ్య పాత్ర పోసిస్తున్నారు. ఈ సినిమాతో శివమ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించారు. గోపురం స్టూడియోస్ పతాకంపై కె.బాబురెడ్డి, జి.సతీష్ కుమార్లు నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను హైదరాబాద్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'RRR సినిమాకు ఆస్కార్ ఆవార్డ్తో ప్రపంచం వ్యాప్తంగా తెలుగు సినిమాకు మంచి పేరు తీసుకొచ్చిన చిత్రబృందానికి నా ధన్యవాదములు. నా చిన్నతనంలో శివ కృష్ణ సినిమాలు ఆడపడుచు, అనాదిగా ఆడది లాంటి సినిమాలు విపరీతంగా నచ్చేవి. ఇలాంటి చిన్న పిల్లలు సినిమాలు తియ్యాలని ప్రోత్సహిస్తున్న శివ కృష్ణకు ధన్యవాదాలు. చిన్న సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. లిటిల్ సోల్జర్స్, అంజలి సినిమాలు చాలా ఇష్టం. మంచి కంటెంట్తో సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నారు. చిత్ర నిర్మాతలు కె.బాబురెడ్డి, జి.సతీష్ కుమార్ మాట్లాడుతూ.. 'మేము తీస్తున్న తొలి చిత్రం "లిల్లీ". ఈ సినిమాతో పాటు తమిళంలో రంగోలి సినిమా చేస్తున్నాం. దర్శకుడు శివమ్ చిన్న పిల్లలపై సినిమా చేద్దాం అన్నారు. కథ నచ్చడంతో తనను దర్శకుడుగా పరిచయం చేస్తూ తీశాం. ఈ సినిమాలో సీనియర్ నటులు శివకృష్ణ చాలా మంచి సపోర్ట్ చేశారు. ఇందులో నటించిన వారందరూ చిన్న పిల్లలు చక్కగా నటించారు. మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.' అని అన్నారు. నటుడు శివకృష్ణ మాట్లాడుతూ..'RRR ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన రాజమౌళి టీమ్కు అభినందనలు. ఎన్నో సినిమాలు చేస్తూ ఎంతో మందికి అవకాశాలిస్తున్న దిల్ రాజుకు థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో నా మనువడు వేదాంత్ వర్మ కూడా ఎంతో చక్కగా నటించారు. తనతో పాటు నేహ, దివ్య లు చాలా బాగా నటించారు. ఈ ముగ్గురు ‘లిల్లీ' చిత్రంతో నటులుగా పరిచయం అయినందుకు సంతోషంగా ఉంది. పాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ లిల్లీ చిత్రం బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. చిత్ర దర్శకుడు శివమ్ మాట్లాడుతూ..'మన తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన రాజమౌళి టీంకు ధన్యవాదములు. నేను ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అయ్యింది. దిల్ రాజు తన సినిమాల ద్వారా ఎంతోమంది రైటర్స్, దర్శకులకు, కార్మికులకు ఉపాధినిచ్చారు. మా లిల్లీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా కచ్చితంగా కంట తడి పెట్టకుండా బయటికి పోరు. ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.' అని అన్నారు. -
ఆస్కార్ అవార్డ్ చిత్రాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆతృతగా ఎదురుచూసిన ఆస్కార్ పండుగ కొన్ని గంటల క్రితమే ముగిసింది. లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్లో వైభవంగా జరిగింది. సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డ్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమాలు పోటీలో నిలిచాయి. అయితే అంతిమంగా ఒక్కరినే అవార్డ్ వరిస్తుంది. అలా ఈ ఏడాది జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పలు చిన్న సినిమాలు సైతం సత్తా చాటాయి. అయితే అవార్డ్ దక్కించుకున్న చిత్రాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఆ సినిమాల్లో ఎలాంటి సందేశం ఉందో తెలుసుకోవాలనుకునే చాలా మందే ఉంటార. అలాంటి వారికోసం విజేతలుగా నిలిచిన చిత్రాలు ఏ ఓటీటీలో అలరిస్తున్నాయో తెలుసుకోవాలనుందా? అయితే ఇది మీకోసమే. ఏకంగా ఏడు అవార్డులు గెలుచుకున్న సినిమా అయితే ఈ ఏడాది ఆస్కార్లో ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకొన్న చిత్రం 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్'. ఈ సినిమా ఏడు అవార్డులతో రికార్డు సృష్టించింది. ఈ మూవీ సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే భారత్ నుంచి ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్కు ఆస్కార్ దక్కింది. అలాగే ఇండియా నుంచి షార్ట్ షిల్మ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న ‘ఎలిఫెంట్ విస్పరర్స్’ నెట్ఫ్లిక్స్ వేదికగా సిని ప్రేక్షకులను అలరిస్తోంది. ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఆస్కార్ అవార్డులు పొందిన కొన్ని చిత్రాలు ఆర్ఆర్ఆర్ - జీ5, డిస్నీ + హాట్ స్టార్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ - సోనీలీవ్ ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ - నెట్ఫ్లిక్స్ బ్లాక్పాంథర్-వకండా ఫరెవర్ - డిస్నీ+ హాట్స్టార్ అవతార్ 2 - అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, వుడ్, డిస్నీ+హాట్స్టార్ టాప్ గన్: మావెరిక్ - అమెజాన్ ప్రైమ్ వీడియో ( తెలుగు ఆడియో కూడా ఉంది) ది ఎలిఫెంట్ విస్పరర్స్ - నెట్ఫ్లిక్స్ పినాషియో - నెట్ఫ్లిక్స్ కాగా.. ఉమెన్ టాకింగ్, నవానీ, ది వేల్ లాంటి చిత్రాలు ప్రస్తుతం భారత్లో స్ట్రీమింగ్కు అందుబాటులో లేవు. -
RRRలో మీరు చూసింది అదే: జూనియర్ ఎన్టీఆర్
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కడంపై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భారతదేశ సంస్కృతిపై మాట్లాడుతూ ఎమోషనలయ్యారు. భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న దేశమని కొనియాడారు. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సాంగ్కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..'భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న వైవిధ్యమైన దేశం. ఆర్ఆర్ఆర్లో మీరు చూసింది అదే. ప్రపంచానికి చెప్పాల్సిన కథలు ఇండియాలో చాలా ఉన్నాయి. చాలా తీవ్రమైన, బలమైన, భావోద్వేగ, నాటకీయ యాక్షన్తో కూడిన సినిమాలు ఇండియా నుంచి వస్తాయి. ఇప్పుడు ఇండియన్స్కు పూర్తి నమ్మకం కలిగింది.' అని అన్నారు. -
ఆస్కార్ వేడుకల్లో మలాలా.. ఎందుకో తెలుసా?
అమెరికాలోని లాస్ ఎంజిల్స్లోని డాల్బీ థియేటర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది. అత్యంత భారీ ఖర్చుతో ఈ వేడుకను ఆస్కార్ అకాడమీ నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈవెంట్లో అందరినీ దృష్టిని ఆకర్షించించింది మాత్రం పాకిస్తాన్కు చెందిన మలాలా యూజఫ్జాయ్. తన భర్త అస్సర్ మాలిక్తో కలిసి వేదికపై మెరిసింది. ఇంతకీ ఈ వేడుకకు ఆమె ఎందుకొచ్చింది? అనే ప్రశ్న సినీ ప్రేక్షకుల్లో తలెత్తింది. మలాలాకు ఇప్పటికే నోబెల్ బహుమతి వచ్చిన సంగతి తెలిసిందే. మహిళల విద్యకోసం కృషి చేస్తున్న మలాలా విశ్వవేదికపై కనిపించడం చర్చనీయాంశంగా మారింది. మహిళా విద్యా కార్యకర్త అయిన ఆమె ఆస్కార్స్లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి ఎంపికైన 'స్ట్రేంజర్ ఎట్ ది గేట్' అనే షార్ట్ ఫిల్మ్కు ఆమె ఎగ్జిక్యూటివ్ నిర్మాత కావడమే కారణం. అందుకే వారికి మద్దతుగా ఆస్కార్ వేడుకలకు హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది టాలీవుడ్ మూవీకి ఆస్కార్ రావడంతో సినీ ప్రేక్షకులు సంబురాలు చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కింది. -
ఆస్కార్ వేదికపై ఎలుగుబంటి.. అసలు విషయమిదే..!
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డ్ వేడుక ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు వీక్షించారు. ఈ వేడుకలో సినీరంగంలో అత్యుత్తమ ప్రతిభ చాటిన ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన సినిమాలకు అవార్డులు ప్రకటిస్తారు. ఈ వేడుక కోసం ఆస్కార్ అకాడమీ నిర్వాహకులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈవెంట్లో అందరి దృష్టిని ఆకర్షించింది ఏంటో తెలుసా? వేదికపై అందరినీ అలరిస్తూ సందడి చేసిన ఓ ఎలుగుబంటి. ఇంతకీ ఆ వేదికపై ఎలుగుబంటి ఎందుకొచ్చిందా అని సందేహం మీకు వచ్చి ఉండొచ్చు. పదండి ఆ ఎలుగుబంటి కథేంటో తెలుసుకుందాం. ఆస్కార్ వేదికపై అందరి దృష్టిని ఆకర్షించిన ఆ ఎలుగుబంటి ఓ సినిమాలోని పాత్ర. ఎలిజబెత్ బ్యాంక్స్ కామెడీ థ్రిల్లర్ మూవీలో ఎలుగుబంటి అలరించింది. ఈ ఏడాది ఆస్కార్ వేడుకపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. ఈవెంట్లో పాల్గొన్న సినీ దిగ్గజాలను పలకరిస్తూ సందడి చేసింది. దీంతో నెటిజన్స్ దీనిపై ఆరా తీస్తున్నారు. ఆస్కార్ వేదికపై మెరిసిన ఆ ఎలుగుబంటి గురించి ఆసక్తి కనబరుస్తున్నారు. -
రామ్ చరణ్ ట్వీట్.. మరో 'నాటు నాటు' పక్కా..!
ప్రపంచ వేదికపై ఆర్ఆర్ఆర్ పేరు మార్మోగిపోతోంది. తెలుగువారి పేరును ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ రావడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా భారత సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తుందని లేఖలో పేర్కొన్నారు. ఈ సినిమాలో అవకాశమిచ్చిన రాజమౌళికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్రబృందాన్ని ప్రశంసిస్తూ ఓ లెటర్ను తన ట్వీట్లో పంచుకున్నారు. అయితే అందులో రామ్ చరణ్ రాసిన ఓ లైన్ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఎందుకంటే అందులో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన కో- స్టార్, బ్రదర్ తారక్ నీకు ధన్యవాదాలు.. నీతో మరోసారి డ్యాన్స్ చేసి మళ్లీ రికార్డులు సృష్టించాలనుకుంటున్నా' అంటూ నోట్లో రాశారు. దీంతో ఆర్ఆర్ఆర్-2లో మరో నాటు నాటు పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. మరోసారి ఎన్టీఆర్- చెర్రీ స్క్రీన్పై డ్యాన్స్తో అదరగొట్టడం కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్-2 ఉంటుందని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ అభిమానులు మరోసారి చరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్ రిపీట్ కాబోతోందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ బాబుతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్- 2 పట్టాలెక్కుతుందేమో వేచి చూడాల్సిందే. We have won!! We have won as Indian Cinema!! We won as a country!! The Oscar Award is coming home!@ssrajamouli @mmkeeravaani @tarak9999 @boselyricist @DOPSenthilKumar @Rahulsipligunj @kaalabhairava7 #PremRakshith @ssk1122 pic.twitter.com/x8ZYtpOTDN — Ram Charan (@AlwaysRamCharan) March 13, 2023 -
ఆ సినిమాకు ఏకంగా ఏడు ఆస్కార్లు.. తొలి ఆసియా మహిళగా రికార్డు
95వ అకాడమీ అవార్డు వేడుకల్లో ఓ హాలీవుడ్ చిత్రం సత్తా చాటింది. 'ఎవ్రిథింగ్ ఎవ్రివేర్ ఆల్ ఎట్ వన్స్'(Everything Everywhere All At Once)అనే హాలీవుడ్ చిత్రం ఏకంగా ఏడు ఆస్కార్లను కైవసం చేసుకుంది. 11 విభాగాల్లో నామినేట్ అయిన ఈ సినిమా ఏకంగా ఏడు అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో ఈ చిత్రానికి అవార్డులు వరించాయి. కాగా, ఈ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న మిషెల్యో ఆస్కార్ అందుకున్న తొలి ఆసియా మహిళగా నిలిచారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా ఏడు ఆస్కార్లను సొంతం చేసుకొని సత్తా చాటింది. -
ఆస్కార్ గెలవగానే తారక్, రామ్చరణ్ ఏం చేశారంటే?
ఎంతగానో ఎదురుచూస్తున్న భారతీయుల కలను నిజం చేస్తూ ఆస్కార్ అవార్డు గెలిచింది ఆర్ఆర్ఆర్ సినిమా. ప్రపంచం మెచ్చిన హాలీవుడ్ పాటలను వెనక్కు నెడుతూ నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకుంది. నాటునాటకు ఆస్కార్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకులు ఎగిరి గంతేశారు. మరి ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డ ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ రియాక్షన్ ఇంకెలా ఉంటుందో ఆలోచించారా? నాటునాటుకు అవార్డు ప్రకటించగానే జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ సంతోషంతో ఒకరినొకరు హత్తుకున్నారు. ఈ విజయానికి పునాది వేసిన రాజమౌళి వైపు ఆనందంగా చూస్తూ కళ్లతోనే అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ విజయాన్ని గురించి రామ్చరణ్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ.. 'మనం గెలిచాం. మన ఇండియన్ సినిమా గెలిచింది. యావత్ దేశమే గెలిచింది. ఆస్కార్ను ఇంటికి తెచ్చేస్తున్నాం' అని రాసుకొచ్చాడు. 'భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆర్ఆర్ఆర్ ఎంతో ప్రత్యేకమైనది. ఆస్కార్ సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నేనింకా కలలోనే ఉన్నట్లనిపిస్తోంది. రాజమౌళి, కీరవాణి గారు భారత చలనచిత్రపరిశ్రమలో ఉన్న అరుదైన రత్నాలు. ఈ అద్భుత కళాఖండంలో నన్ను భాగం చేసినందుకు ధన్యవాదాలు. నాటు నాటు అనేది ఒక భావోద్వేగం. ఆ ఎమోషన్కు ఒక రూపమిచ్చిన చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, ప్రేమ్ రక్షిత్లకు ధన్యవాదాలు. నా బ్రదర్ తారక్ థాంక్యూ.. కుదిరితే నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డులు సృష్టించాలనుంది. ప్రియమైన కోస్టార్ ఆలియా భట్కు కూడా కృతజ్ఞతలు. ఈ అవార్డు భారతీయ నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులకు సొంతం. మమ్మల్ని ఆదరించిన అభిమానులకు ప్రేమాభివందనాలు' అని ఓ లేఖలో రాసుకొచ్చాడు చరణ్. We have won!! We have won as Indian Cinema!! We won as a country!! The Oscar Award is coming home!@ssrajamouli @mmkeeravaani @tarak9999 @boselyricist @DOPSenthilKumar @Rahulsipligunj @kaalabhairava7 #PremRakshith @ssk1122 pic.twitter.com/x8ZYtpOTDN — Ram Charan (@AlwaysRamCharan) March 13, 2023 And we did it… #Oscars95 #NaatuNaatu #RRRMovie Congratulations @mmkeeravaani Sir ji, Jakkanna @ssrajamouli , @boselyricist garu, the entire team and the nation 🇮🇳 pic.twitter.com/LCGRUN4iSs — Jr NTR (@tarak9999) March 13, 2023 -
'నాటు నాటు' రచయిత చంద్రబోస్ గ్రామంలో సంబరాలు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ భారత చిత్రపరిశ్రమ స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. నాటు నాటు పాటకు ఆస్కార్ వరించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పాటకు తన కలంతో ప్రాణం పోసిన గీతరచయిత చంద్రబోస్ స్వగ్రామం చల్లగరిగెలో సంబరాలు అంబరాన్నంటాయి. చంద్రబోస్ రాసిన నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచిందనగానే గ్రామస్తులు బాణసంచాలు కాల్చి మిఠాయిలు పంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ రాసిన పాట ప్రపంచస్థాయి గుర్తింపు పొందడం తెలుగు జాతికే గర్వకారణమని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. -
బస్తీ కుర్రోడి నుంచి ఆస్కార్ వరకు.. రాహుల్ కెరీర్ సాగిందిలా
ధూల్ పేట్లో పుట్టిన కుర్రాడు.. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. చిన్నప్పటి నుంచే సంగీతంపై ఉన్న ఇష్టంతో గిన్నెలపై గరిటెలతో వాయిస్తూ సాంగ్స్ పాడేవాడు. అతని టాలెంట్ను గుర్తించిన తండ్రి కుమారుడికి సంగీతం నేర్పించాలని ఓ గజల్ మాస్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కొన్నాళ్ల పాటు శిక్షణ తీసుకున్న ఆ కుర్రాడు చిన్న చిన్న సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్గా మారాడు. అలా ఓ వైపు సంగీతంలో ప్రాక్టీస్ చేస్తూనే మరోవైపు తండ్రికి సహాయంగా బార్బర్ షాప్లో పనిచేశాడు. తన సింగింగ్ టాలెంట్తో శ్రోతలను మైమరిపించేవాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా మొదలైన అతని ప్రయాణం ఈరోజు ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేదాకా ఎదిగాడు.. అతడే రాహుల్ సిప్లిగంజ్. ధూల్ పేట్ టూ లాస్ ఎంజిల్స్ వరకు సాగిన అతడి ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. గల్లీ బాయ్ పేరుకు తగ్గట్లుగానే వివాదాలు అతనితో ముడిపడి ఉన్నాయి. ఆనాటి నుంచి ఇప్పుటిదాకా సాగిన రాహుల్ విజయ ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్. రాహుల్ సిప్లిగంజ్ బార్బర్ షాప్ నుంచి తన ప్రయాణం మొదలుపెట్టి నేడు ప్రపంచంలో అత్యున్నత వేదిక ఆస్కార్ వరకు చేరుకున్నాడు. 1989 ఆగష్టు 22న హైదరాబాద్ పాతబస్తీలో జన్మించిన రాహుల్కు చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి ఉండేదట. స్కూల్ నుంచి తిరిగి రాగానే గిన్నెలపై కర్రలతో వాయిస్తూ ఫోక్సాంగ్స్ పాడేవాడట. ఇది గమనించిన రాహుల్ తండ్రి, ఆయనకి తెలిసిన గజల్ సింగర్ పండిట్ విఠల్ రావు దగ్గర సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే తండ్రికి బార్బర్ షాప్ లో సాయం చేసేవాడు. సుమారు 7 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకొని గజల్స్పై పట్టు సాధించాడు. ఆ సమయంలోనే కోరస్ పాడే అవకాశాలు తలుపుతట్టాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్లో ‘కాలేజీ బుల్లోడా’ అనే సాంగ్ పాడే అవకాశం వచ్చింది. ఆ పాటకి మంచి ప్రోత్సాహం రావడంతో.. అప్పటి వరకు తను పాడిన పాటలన్ని ఒక సీడీ చేసుకొని, దాని తీసుకోని వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి వినిపించాడట.రాహుల్ ప్రతిభను చూసిన కీరవాణి అతనికి దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’ అనే టైటిల్ సాంగ్ ను పాడే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ‘ఈగ’లో ఈగ ఈగ ఈగ, రచ్చ’లో సింగరేణి ఉంది... బొగ్గే పండింది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా,‘ఇస్మార్ట్ శంకర్’లో బోనాలు ఇలా పలు సినిమాల్లో సింగర్గా రాహుల్ అవకాశాలు దక్కించుకున్నాడు. ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే మరోవైపు సొంతంగా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించాడు. మంగమ్మ,పూర్ బాయ్, మాకి కిరికిర', 'గల్లీ కా గణేష్', 'దావత్'.. ఇలా హైదరాబాదీ సంస్కృతి, సంప్రదాయాలకు తన జోష్ మిక్స్ చేసి రాహుల్ పాటలు కంపోజ్ చేశాడు. ఇదిలా ఉంటే 2019లో తెలుగు బిగ్బాస్ సీజన్-3లో పాల్గొనడంతో రాహుల్ దశ తిరిగిందని చెప్పొచ్చు. పునర్నవితో లవ్ట్రాక్, తన పాటలు, ఎనర్జీ, శ్రీముఖితో గొడవలు ఇలా ఒకటేమిటి అన్ని షేడ్స్ చూపించి యూత్లో మాంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఆ సీజన్ విన్నర్గా బయటకు వచ్చి తన జర్నీని మరింత ముందుకు తీసుకుళ్లాడు. గల్లీబాయ్ పేరుకు తగ్గట్లేగానే రాహుల్ పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచాడు. బిగ్బాస్ టైటిల్ గెలిచిన కొన్ని వారాలకే ఓ పబ్లో జరిగిన గొడవలో రాహుల్పై బీరు సీసీలతో దాడి చేసిన సంఘటన అప్పట్లో హాట్ టాపిక్గా నిలిచింది. ఎమ్మెల్యే బంధువులపై రాహుల్, అతని స్నేహితులకు మధ్య జరిగిన గొడవలో బీరుసీసాలతో గొడవ, ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకునే వరకు వెళ్లింది. కట్చేస్తే.. కొన్నాళ్ల క్రితమే హైదరాబాద్లో బంజారాహిల్స్ రాడిసన్ పబ్లో డ్రగ్స్ వాడారనే సమాచారంతో అర్థరాత్రి పోలీసులు జరిపిన రైడ్లో రాహుల్ సిప్లిగంజ్ పట్టుబడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సుమారు 150మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకోగా పలువురు సెలబ్రిటీలతో పాటు రాహుల్ కూడా విచారణను ఎదుర్కున్నాడు. ఇలా వివాదాలతో సావాసం చేసిన రాహుల్ తనను విమర్శించినవాళ్లతోనే చప్పట్లు కొట్టించుకునేలా చేశాడు. విశ్వవేదికపై తెలుగోడి సత్తా సగర్వంగా నిరూపించాడు. ఆర్ఆర్ఆర్లోని రాహుల్ పాడిన నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో ఆ బస్తీ పోరడి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. -
నా భార్యకు ఆరో నెల.. పుట్టబోయే బిడ్డ: రామ్చరణ్
టాలీవుడ్ బెస్ట్ కపుల్లో రామ్చరణ్- ఉపాసన ఒకరు. 2012లో పెళ్లిపీటలెక్కిన వీరిద్దరూ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ మధుర క్షణాలను ఆస్వాదించకుండా తమ సమయాన్నంతా ఆర్ఆర్ఆర్కే అంకితం చేశారిద్దరూ.. ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్కు నామినేట్ అయినప్పటి నుంచి అమెరికాలో వరుస ప్రమోషన్లు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు చరణ్. తనకు సపోర్ట్గా ఉంటూ భర్తతో పాటే అమెరికాలో ఉంది ఉపాసన. ఇటీవలే వీరిద్దరూ ప్రీఆస్కార్ వేడుకలకు హాజరవగా తాజాగా 95వ ఆస్కార్ సంబరాల్లో పాల్గొన్నారు. రామ్చరణ్ బ్లాక్ సూట్లో రెడీ అవగా ఉపాసన సాంప్రదాయాలకు విలువనిస్తూ చీరలో కనిపించింది. ఆస్కార్ సెలబ్రేషన్స్ ప్రారంభమవడానికి ముందు అంతర్జాతీయ మీడియాతో మాట్లాడింది ఉపాసన. 'రామ్కు నేనెప్పుడూ సపోర్ట్ చేస్తాను. ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీలో భాగంగా నేనిక్కడకు వచ్చాను. నాకు కొంత ఆందోళనగా ఉంది. కానీ ఈరోజు ఇక్కడ ఉండటం ఎంతో సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. ఇంతలో చరణ్ మాట్లాడుతూ... 'తనిప్పుడు ఆరు నెలల గర్భవతి. పుట్టబోయే బిడ్డకు ఎక్కడలేనంత ప్రేమ లభిస్తోంది. కడుపులో ఉండగానే తను మాకెంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతోంది' అన్నాడు. -
Oscar Winners 2023: ఆస్కార్ విజేతలు వీరే!
చలన చిత్ర పరిశ్రమలో అంత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డుల ప్రదానోత్సవం ఈ సారి మరింత కోలాహలంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజిలస్లో జరిగిన ఈ కార్యక్రమంలో 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు. 95వ ఆస్కార్ వేడుకల్లో భారతీయ చిత్రాలు సత్తా చాటాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు(ఆర్ఆర్ఆర్)’ పాటకు అస్కార్ లభించింది. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ సినిమా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ను ఆస్కార్ వరించింది. ఉత్తమ నటుడిగా ది వేల్ చిత్రానికిగాను బ్రెండన్ ప్రాసెర్, ఉత్తమ నటిగా మిషేల్ యో(ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్) నిలిచింది. అస్కార్ విజేతలు వీరే ఉత్తమ చిత్రం : ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ఉత్తమ నటుడు: బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్) ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ : నాటు నాటు( ఆర్ఆర్ఆర్) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: ది ఎలిఫెంట్ విష్పరర్స్ ఉత్తమ సహాయ నటి: జేమిలీ కర్టీస్(ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సహాయనటుడు: కే హ్యూ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్(వాకర్ బెర్టెల్మాన్) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్- నవానీ బెస్ట్ షార్ట్ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్బై బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: ది వేల్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: ఉమెన్ టాకింగ్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్బై బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ బెస్ట్ సౌండ్: . టాప్ గన్ మావెరిక్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్ ది వే ఆఫ్ వాటర్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ది బాయ్ ది మోల్ ది ఫాక్స్ ఆండ్ ది హార్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ -
నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ యవనికపై తెలుగు సినిమా సత్తాచాటిందని కొనియాడారు. 'ప్రతిష్టాత్మక ఆస్కార్ గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణం. నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది. తెలుగులోని మట్టివాసనలను చంద్రబోస్ వెలుగులోకి తెచ్చారు. ఆర్ఆర్ఆర్ టీమ్కు అభినందనలు.' అని కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. 95వ ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు కొల్లగొట్టింది. ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా చరిత్రపుటలకెక్కింది. దీంతో దేశంలోని ప్రముఖులు, సెలబ్రిటీలు ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దేశం గర్వించదగ్గ సినిమా ఇది అని కొనియాడుతున్నారు. చదవండి: ‘నాటు నాటు’కు ఆస్కార్… ఆనందంతో ఎగిరి గంతేసిన రాజమౌళి -
Oscars 2023: ఆర్ఆర్ఆర్ టీమ్కు సీఎం జగన్ అభినందనలు
తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ‘ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడం సంతోషం. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించింది. గ్లోబల్ ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేసిన పాట ఇది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండాను రెపరెపలాడే విధంగా చేసింది. ఇటీవలే శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న భారత సినిమాకు ఈ అవార్డు మరింత ప్రోత్సహకాన్ని ఇచ్చింది’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, భారత్ నుంచి మూడు విభాగాల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్కు నామినేషన్స్ దక్కాయి. వీటీలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాట, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగం నుంచి ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకున్నాయి. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరీలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’కు నిరాశ ఎదురైంది. The #Telugu flag is flying higher! I’m filled with pride on a Telugu song, that so beautifully celebrates our folk heritage, being given its due recognition internationally today. @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and @mmkeeravaani have truly redefined excellence! 1/2 https://t.co/jp75mpiZHv — YS Jagan Mohan Reddy (@ysjagan) March 13, 2023 -
‘నాటు నాటు’కు ఆస్కార్… ఆనందంతో ఎగిరి గంతేసిన రాజమౌళి
తెలుగు సినిమా చరిత్ర సృష్టించిన రోజిది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుంది. నాటునాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు ప్రకటించగానే డాల్బీ థియేటర్ దద్దరిల్లిపోయింది. రాజమౌళి, ఆయన భార్య రమ సంతోషంతో భావేద్వేగానికి గురయ్యారు. కార్తికేయ దంపతులతో కలిసి గంతులేశారు. రామ్చరణ్, ఎన్టీఆర్ ఆలింగనం చేసుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు, లైవ్లో చూస్తున్న భారతీయులు సైతం ఆనందంతో పులకరించిపోయారు. తెలుగు సినిమా పాట ఆస్కార్కు నామినేట్ కావడం, అవార్డు దక్కించుకోవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగువాళ్లతో పాటు భారత సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. -
ఆర్ఆర్ఆర్ను బాలీవుడ్ సినిమా అన్న ఆస్కార్ హోస్ట్, నెటిజన్లు ఫైర్!
ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణాలివి.. నాటు నాటు ప్రజల మనసులు దోచుకుంటూ ఆస్కార్ను అందిపుచ్చుకుంది. దీంతో భారత ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఆస్కార్ వేదికపై ఓ పొరపాటు జరిగింది. తెలుగువాడైన జక్కన్న చెక్కిన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ను బాలీవుడ్ చిత్రంగా అభివర్ణించాడు హోస్ట్ జిమ్మీ కిమ్మెల్. ఇది అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. ఇది అచ్చమైన స్వచ్చమైన తెలుగు చిత్రమని, బాలీవుడ్ మూవీ కాదంటూ రాజమౌళే ఎన్నోసార్లు నొక్కి చెప్పాడు. అలాంటిది ఇప్పుడు అంత పెద్ద అవార్డుల ఫంక్షన్లో ఆర్ఆర్ఆర్ను బాలీవుడ్ అనేశారేంటి! అని నెటిజన్లు మండిపడుతున్నారు. 'ఇండియా అనగానే బాలీవుడ్ ఒక్కటే కాదు ఎన్నో భాషల ఇండస్ట్రీలు ఉన్నాయి. బాలీవుడ్ అంటే హిందీ పరిశ్రమ. ఇండియాలో చాలామంది హిందీ మాట్లాడతారు.. అలా అని అన్ని సినిమాలను బాలీవుడ్ అనలేం కదా.. ఆర్ఆర్ఆర్ తెలుగు భాషా చిత్రం. ఇది దక్షిణాదిలోని ఓ ఇండస్ట్రీ..', 'ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ను హోస్ట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా' అని కామెంట్లు చేస్తున్నారు. Dear #Oscars95 Team, #RRR is not a #Bollywood movie. Please note. 🙈 — Shiva’Marvel’Nandy (@shivanandysky) March 13, 2023 @jimmykimmel Correction - RRR is a Indian film / Telugu / Tollywood made film and not a Bollywood film. #Oscar2023 #RRRMoive #rrr — Ordinary Human (@we_are_humanns) March 13, 2023 Ooh... #Oscars just love controversies and conflicts. Referring to #RRR as a Bollywood film even after hearing that the creators are promoting it as an Indian film for months. — उज्जल | UJJAL (@beujjal) March 13, 2023 India has different film industries for different languages...bollywood means hindi language film industry...since hindi is the most spoken language in india bollywood is more popular..rrr is a telugu language film from south part of india — gulabi gutthu (@united_TFI_fan) March 13, 2023 RRR is South Indian cinema, a Telagu film, Tollywood. Not Bollywood, as some Oscars ppl might be saying! — Preeti Chhibber (@runwithskizzers) March 12, 2023 -
Oscars 2023 : ప్రపంచస్థాయికి తెలుగు సినిమా.. RRRటీమ్కు అరుదైన గౌరవం
-
Oscars 2023: కోరిక తీరింది.. పాటతో మనసులో మాట చెప్పిన ఎంఎం కీరవాణి!
లాస్ ఏంజెల్స్: ప్రపంచ వేదికపై ఓ తెలుగు సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ను కైవసం చేసుకుని మన సత్తా చాటింది. భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో అవార్డ్ను సొంతం చేసుకుని చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రానికి గుర్తింపును తెచ్చిపెట్టింది. లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఆస్కార్ అవార్డ్ను ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. అనంతరం ఆయన పాట రూపంలో తన ఆనందాన్ని వ్యక్త పరిచారు. అందులో.. ‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కైవసం చేసుకోవాలని’ అన్నారు. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని, థ్యాంక్యూ కార్తికేయ అని కీరవాణి పేర్కొన్నారు. చివరిలో రచయిత చంద్రబోస్ నమస్తే అంటూ తెలుగులో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా కంటున్న కలలను నిజం చేస్తూ రెండు ఆస్కార్లను మన చిత్రాలు దక్కించుకున్నాయి. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ను సొంతం చేసుకోగా.. మరో భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ను దక్కించుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #NaatuNaatu wins the #Oscar for best Original Song 😭#SSRajamouli & team has done it🫡🇮🇳 Indian Cinema on the Rise 🔥 !! #RRRMovie | #AcademyAwards | pic.twitter.com/VG7zXFhnJe — Abhi (@abhi_is_online) March 13, 2023 -
కోట్ల హృదయాలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి.. చిరంజీవి ట్వీట్..
సాక్షి, హైదరాబాద్: విశ్వవేదికపై సత్తా చాటి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట ఆస్కార్ కైవసం చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆస్కార్ అందుకోవడం భారత్ కల అని, అది ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే సాకారమైందని దర్శకధీరుడు రాజమౌళిని చిరు కొనియాడారు. కోట్ల మంది భారతీయుల హృదయాలు ఇప్పుడు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయన్నారు. ఆర్ఆర్ఆర్ బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. #NaatuNaatu ON TOP OF THE WORLD !!! 👏👏👏👏👏 And THE OSCAR for the Best Original Song Goes To : Take a Bow .. @mmkeeravaani garu & @boselyricist @kaalabhairava7 @Rahulsipligunj #PremRakshith @tarak9999 @AlwaysRamCharan And the One & Only @ssrajamouli 😍😍😍#Oscars95 — Chiranjeevi Konidela (@KChiruTweets) March 13, 2023 కీరవాణి, చంద్రబోస్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్రక్షిత్, ఎన్టీఆర్, రామ్చరణ్, రాజమౌళిల పేర్లను ప్రస్తావిస్తూ అందరికీ చిరు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకించి రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. -
Oscar 2023: నాటునాటుకు ఆస్కార్.. ప్రముఖుల స్పందనలివే..!
తెలుగు పాటను విశ్వవ్యాప్తం చేసిన రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణిని భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి అభినందనల వెల్లువతాకింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాను పతాకశీర్షికలకు ఎక్కించిన ఘనులు అని ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖుల స్పందనలివే..! ప్రధాని నరేంద్ర మోదీ తెలుగువారికి అవార్డు రావడం గర్వకారణం, ప్రతిష్టాత్మక అవార్డు తీసుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్కు, ది ఎలిఫెంట్ విస్పరర్స్ టీమ్కు అభినందనలు. ఇది దేశం గర్వించే రోజు. కేటీఆర్ నాటునాటు పాటకు ఆస్కార్ రావడం దేశానికి గర్వకారణం. రాజమౌళి దేశాన్ని గర్వపడేలా చేశారు. చరిత్ర సృష్టించిన ఆర్ఆర్ఆర్ టీమ్కు అభినందనలు. జోగి రమేశ్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ రావడం పట్ల ఏపీ మంత్రి జోగి రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం గర్వకారణమన్నారు. ► ఆర్ఆర్ఆర్ టీమ్కు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ► ఆర్ఆర్ఆర్ టీమ్కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందనలు తెలిపారు. ► ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ► ఆర్ఆర్ఆర్ టీమ్కు దర్శకుడు రామ్గోపాల్ వర్మ అభినందనలు తెలిపారు. ► ఆస్కార్ గెలిచిన ఆర్ఆర్ఆర్ టీమ్పై మహేశ్బాబు ప్రశంసలు కురిపించారు. ► ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సాధించడం.. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగ్గ విషయం అని బాలకృష్ణ ప్రశంసించారు. ► భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ను పవన్ కల్యాణ్ అభినందించారు. మంచు విష్ణు ఆస్కార్ గెలుచుకున్న సంగీత దర్శకుడు కీరవాణికి సినీ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అభినందనలు తెలిపారు. భారతీయ సినిమాకు ఈ విభాగంలో అవార్డు రావడం చరిత్రాత్మకం అని ట్వీట్ చేశారు. Amazing! I extend my warmest congratulations to Sri. Keeravani Garu on his historic achievement as the first Indian Music Composer to win an Oscar award for an Indian movie. Congratulations! 💐@mmkeeravaani @ssrajamouli #Oscars #AcademyAwards #NaatuNaatu #Oscars95 pic.twitter.com/2gDZCk86Lf — Vishnu Manchu (@iVishnuManchu) March 13, 2023 చిరంజీవి తెలుగు సినిమా ఖ్యాతిని ఆర్ఆర్ఆర్ విశ్వప్యాప్తం చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ సినిమా అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమాలో తన కుమారుడు రామ్చరణ్ భాగమైనందుకు గర్వంగా ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ దేశానికి గర్వకారణమన్నారు. #NaatuNaatu ON TOP OF THE WORLD !!! 👏👏👏👏👏 And THE OSCAR for the Best Original Song Goes To : Take a Bow .. @mmkeeravaani garu & @boselyricist @kaalabhairava7 @Rahulsipligunj #PremRakshith @tarak9999 @AlwaysRamCharan And the One & Only @ssrajamouli 😍😍😍#Oscars95 — Chiranjeevi Konidela (@KChiruTweets) March 13, 2023 రవితేజ ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది, ఈ సినిమా ఆడియన్స్ మదిలో చాలా ఏళ్ల పాటు నిలిచిపోతుందని రవితేజ్ ట్వీట్ చేశారు. ఆస్కార్తో ప్రపంచ శిఖరాగ్రాన నిలిచిందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రామ్చరణ్, ఎన్టీఆర్ ఎలక్ట్రిఫయింగ్ డ్యాన్స్ మూవ్స్ లేకపోతే.. నాటు నాటు పాటకు ఆస్కార్ సాధ్యమయ్యేది కాదని రవితేజ అన్నారు. History is created!#NaatuNaatu has truly left a lasting impact on audiences and will be remembered for years to come & this prestigious OscaRRR is a cherry on top❤️ Congratulations @mmkeeravaani garu, @boselyricist garu, Prem , @kaalabhairava7 @Rahulsipligunj🤗#RRRatOSCARS — Ravi Teja (@RaviTeja_offl) March 13, 2023 #oscar for #NatuNatu Historic moment for Indian cinema!! you make us proud!! Congratulations to @MMKeeravaani @SSRajamouli @BoseLyricist @Tarak9999 @AlwaysRamCharan @KaalaBhairava7 @RahulSipligunj #PremRakshith @DVVMovies @RRRMovie and team!!💐💐💐👏🏼👏🏼👏🏼👏🏼👏🏼 — Nagarjuna Akkineni (@iamnagarjuna) March 13, 2023 Sir @mmkeeravaani YOU OSCARRED IT! 😘😘😘😍😍😍 CONGRATS to the KILLER TEAM of RRR 🙏🙏🙏🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) March 13, 2023 Team #RRR u made the whole of india proud …. Congrats @mmkeeravaani sir and dear @boselyricist sir … this is hugeeeee 👏👏👏👏👏👏 @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan pic.twitter.com/HPcl4O49BJ — G.V.Prakash Kumar (@gvprakash) March 13, 2023 As it is often said, cinema speaks a universal language. Congratulations to the teams of #RRR and #TheElephantWhisperers for their #Oscar wins. It’s a proud 🇮🇳 moment 🎈 — Ajay Devgn (@ajaydevgn) March 13, 2023 Congratulations to entire India🇮🇳a movie about suppression, torture, killing, colonisation of Indians based on racial grounds gets appreciated on a world platform, number of Indians died just during one Bengal famine were way more than Jews died during holocaust. Thank team RRR🙏 https://t.co/J0L2RFuicH — Kangana Ranaut (@KanganaTeam) March 13, 2023 🔥👏❤️#RRR is a True example of Team work lead by a Great Visionary. @ssrajamouli 🙏 Congratulations & keep inspiring.@mmkeeravaani @boselyricist @premrakchoreo @tarak9999 @AlwaysRamCharan @ssk1122 @RRRMovie Love..#RAPO https://t.co/HXycu5tWIt — RAm POthineni (@ramsayz) March 13, 2023 I join a Billion Indians in celebrating the Honour for #NaatuNaatu and #RRR 🎉 Kudos to @mmkeeravaani Garu and @boselyricist Garu on making History ❤️👏 The man of the moment, brilliant storyteller who has made India proud @ssrajamouli Garu 🎉 Both my brothers, the superstars… https://t.co/TxKRZ8Dq1q pic.twitter.com/2IRfgPltYo — KTR (@KTRBRS) March 13, 2023 And there you go... NAATU NAATU!! Crossing all boundaries!! Congratulations to @mmkeeravaani garu, @boselyricist and the entire team of #RRR on their phenomenal win at the Oscars!! A jubilant moment for Indian cinema 👏👏👏 — Mahesh Babu (@urstrulyMahesh) March 13, 2023 View this post on Instagram A post shared by Actor Brahmaji (@brahms25) -
ఆస్కార్ వేదికపై గర్జించిన తారక్, రామ్చరణ్
యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్ పండగ మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో 95వ ఆస్కార్ ప్రదానోత్సవాలు జరుగుతున్నాయి. అవార్డుల ప్రకటనకు ముందు నాటునాటు పాటతో స్టేజీ దద్దరిల్లిపోయింది. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లైవ్లో సాంగ్ పాడుతుంటే డ్యాన్సర్లు తమ స్టెప్పులతో జనాలకు ఊపు తెప్పించారు. మన తెలుగు పాటకు స్టాండింగ్ ఒవేషన్ దక్కడం మరో విశేషం. అనంతరం హాలీవుడ్ పాటలను వెనక్కు నెడుతూ ఆస్కార్ అవార్డును ముద్దాడింది ఆర్ఆర్ఆర్ టీమ్. ఇకపోతే ఆస్కార్ సెలబ్రేషన్స్ కోసం రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ సూటులో రెడీ అయ్యారు. తారక్ కోటుపై గర్జించే పులి బొమ్మ ఉంది. రాజమౌళి ట్రెడిషనల్ కుర్తాలో కనిపించారు. తారక్, చెర్రీ, ఉపాసన సహా ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా కలసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అకాడమీ హాల్లోకి వెళ్లేముందు చరణ్, తారక్ హగ్ చేసుకున్న ఫోటో చూసి అభిమానులు చూపు తిప్పుకోలేకపోతున్నారు. 'మీరిద్దరూ గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారన్నా', 'ఆస్కార్ సాధించి భారత్ సత్తా చాటారు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
Oscars 2023: ప్చ్.. ఆస్కార్ మిస్ చేసుకున్న భారతీయ చిత్రం ఇదే!
లాస్ ఏంజెల్స్: ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన భారత డాక్యుమెంటరీ చిత్రానికి నిరాశ ఎదురైంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరిలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ (All That Breathes) అస్కార్ను దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో అమెరికాకి చెందిన ‘నావాల్నీ’ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింను అవార్డ్ వరించింది. ఆల్ దట్ బ్రీత్స్ని షానక్ సేన్ దర్శకత్వం వహించారు. ఈ కేటగిరిలో ఇతర నామినీల విషయానికొస్తే.. ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్ చిత్రాలు ఉన్నాయి. ‘ఆల్ దట్ బ్రీత్’స్ ఈ విభాగంలో నామినేట్ చేసిన రెండవ భారతీయ చిత్రం. గత సంవత్సరం రింటు థామస్, సుష్మిత్ ఘోష్ రాసిన రైటింగ్ విత్ ఫైర్, ఆస్కార్స్లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్గా ఎంపికైంది. ఆల్ దట్ బ్రీత్స్.. ఢిల్లీలో బర్డ్ క్లినిక్ నడుపుతున్న సౌద్, నదీమ్ అనే ఇద్దరు సోదరుల కథ ఇది. ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ సర్క్యూట్లో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్తో పాటు అనేక అవార్డులను గెలుచుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. -
నాటు నాటుకు ఆస్కార్, చరిత్ర సృష్టించిన RRR
ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రమే కాదు, యావత్ భారతదేశం ఎదురుచూసింది. అందరి ఎదురుచూపులకు తెరదించుతూ ఆస్కార్ అవార్డు పట్టేసింది నాటు నాటు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో హాలీవుడ్ సాంగ్స్ను వెనక్కు నెట్టి తెలుగు పాట విజేతగా అవతరించింది. భారతీయ పాటకు అందులోనా ఓ తెలుగు సాంగ్కు ఆస్కార్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ గుడ్న్యూస్ విని అభిమానులు, సెలబ్రిటీలు, సినీప్రేక్షకులు సంతోషంతో ఎగిరి గంతేస్తున్నారు. కాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో లిఫ్ట్ మీ అప్(బ్లాక్ పాంథర్), అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), హోల్డ్ మై హాండ్(టాప్ గన్ మార్వెరిక్), టీజ్ ఇస్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఇట్ వన్స్) పాటలు పోటీపడిన విషయం తెలిసిందే! నాటు నాటు పాట విషయానికి వస్తే టాలీవుడ్లో ఇద్దరు యంగ్ స్టార్లు. పైగా టాప్ డ్యాన్సర్ లిస్ట్లో ఉన్నవాళ్లు. ఆ ఇద్దరూ కలిసి గంతులేసే పాట ఎలా ఉండాలి?. ఆడియెన్స్ పూనకాలతో ఊగిపోవాలి.. థియేటర్లు దద్దరిల్లిపోవాలి. అందుకే ఆ మూడ్కు తగ్గట్లు కీరవాణి ట్యూన్ సెట్ చేశారు. అందుకు తగ్గట్లు పాటను రాయమని రాజమౌళి.. రచయిత చంద్రబోస్ను పురమాయించారు. సుమారు ఏడాదిన్నర పాటు శ్రమించి చంద్రబోస్ లిరిక్స్ రాయడం.. యువ సింగర్లు సిప్లీగంజ్-కాలభైరవలు తమ గాత్రంతో పాటను ఎక్కడికో తీసుకెళ్లడం.. భాషాహద్దులు చెరిపేస్తూ ఆ పాట సూపర్ హిట్ కావడం చకచకా జరిగిపోయాయి. ఇకపోతే నాటు నాటు పాట షూటింగ్ ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అధికారిక భవనం మరియిన్స్కీ ప్యాలెస్ ముందు జరిగింది. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Oscar 2023: వావ్.. భారత్కు ‘ఆస్కార్’.. ఏ చిత్రమో తెలుసా?
లాస్ ఏంజెల్స్: లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో వేదికగా జరుగుతున్న 95వ ఆస్కార్ వేడుకలో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరిలో ’ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకుంది. కార్తికి గోన్సాల్వెస్ ’ది ఎలిఫెండ్ విస్పరర్స్’కు దర్శకత్వం వహించింది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ ఈ ఆస్కార్ను దక్కించుకుంది. ఈ అవార్డ్ను కార్తికి గోన్సాల్వెస్ అందుకున్నారు. ఇక ఈ షార్ట్ ఫిలిం విషయానికొస్తే.. తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ రూందించిన డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’. -
Oscars 2023: మొదలైన ఆస్కార్ సందడి.. ఈ చిత్రానికే తొలి అవార్డ్!
లాస్ ఏంజెల్స్: ఆస్కార్ 2023 వేడుక అమెరికా లాస్ ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. సంబరంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులతో పాటు ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డ్లకు ప్రధానోత్సవం జరుగుతోంది. ఇక భారత్ నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ‘నాటునాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా ఆస్కార్ (అకాడమీ అవార్డ్స్) భావిస్తారు. అందుకే తారలు తమ జీవితంలో ఒక్క సారైన ఈ అవార్డ్ను ముద్దాడాలని కోరుతుంటారు. 2023 గాను మొదటి ఆస్కార్ ఉత్తమ యానిమేటెడ్ సినిమా కేటగిరి దక్కించుకుంది. ఉత్తమ యానిమేటెడ్ సినిమాగా గిల్లెర్మో డెల్ టోరో నిర్మించిన 'పినోచియో' చిత్రం నిలిచింది. ఈ ఏడాది మొదటి ఆస్కార్ను కైవసం చేసుకున్న రికార్డు సొంతం చేసుకుంది. ఇందులో మరో విషయం ఏంటంటే.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ను గెలుచుకుని గిల్లెర్మో డెల్ టోరో ఆస్కార్ చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు. చదవండి: Natu Natu Song: ‘నాటు నాటు’కు ఆస్కార్ వస్తుందా? రాదా? కోట్లలో బెట్టింగ్ -
Oscars 2023: అట్టహాసంగా ఆస్కార్ సెలబ్రేషన్స్
ఇంగ్లీష్ గడ్డపై ఇండియన్ సినిమా సత్తా చాటింది. చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్.. తెలుగు పాట ‘నాటు నాటు’ను వరించింది. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చింది. ఆదివారం (మార్చి 12) రాత్రి 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు) లాజ్ ఏంజిల్స్ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేశారు. ► ఉత్తమ చిత్రంగా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ఆస్కార్ గెలుచుకుంది. ఉత్తమ నటిగా ‘మిషెల్ యో’ (ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్) నిలిచింది. ఈ అవార్డు వేడుకలలో ఈ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి ఏకంగా ఏడు ఆస్కార్స్ రావడం గమనార్హం. ►ఉత్తమ నటుడిగా బ్రెండన్ ప్రాసెర్(ది వేల్)ఆస్కార్ అందుకున్నాడు. ఉత్తమ నటుడి విభాగంలో బ్రెండన్తో ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్), కొలిన్ ఫార్రెల్ (ది బన్షీష్ ఆఫ్ ఇని షెరిన్), బిల్ నిగీ (లివింగ్),పాల్ మెస్కల్ (ఆఫ్టర్సన్) పోటీ పడ్డారు. అయితే , ‘ది వేల్’ చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్రెండెన్ ఫ్రాసెర్ను ఆస్కార్ వరించింది. ► 95వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ దర్శకుడిగా డానియల్ క్వాన్.. డేనియల్ షినెర్ట్ అస్కార్ అందుకున్నారు. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి గాను ఈ దర్శక ద్వయం అవార్డు గెలుచుకున్నారు. ఈ కేటగిరిలో టాడ్ ఫీల్డ్ – టార్, మార్టిన్ మెక్డొనాగ్ – ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, రూబెన్ ఓస్ట్లండ్ – ట్రయాంగిల్ ఆఫ్ సాడ్నెస్, స్టీవెన్ స్పీల్బర్గ్ – ది ఫాబెల్మాన్స్ నామినేట్ అయ్యారు. ►బెస్ట్ సౌండ్ విభాగంలో హాలీవుడ్ మూవీ ‘టాప్ గన్ ’ ఆస్కార్ గెలుచుకుంది. ఈ అవార్డ్ కోసం ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, అవతార్: ది వే ఆఫ్ వాటర్, ది బాట్మాన్, ఎల్విస్ పోటీపడ్డాయి. ► ఇంగ్లీష్ గడ్డపై తెలుగు పాట సత్తా చాటింది. 95వ ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా నాటు నాటు నిలిచింది. కీరవాణి స్వరపరచిన ఈపాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవపాడిన సంగతి తెలిసిందే. ప్రేమ్రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి ఈ అవార్డును అందుకుంటూ వేదికపై పాట పాడారు. 'Naatu Naatu' from 'RRR' wins the Oscar for Best Original Song! #Oscars #Oscars95 pic.twitter.com/tLDCh6zwmn — The Academy (@TheAcademy) March 13, 2023 ► బెస్ట్ అడాప్టెడ్ స్ట్రీన్ప్లే విభాగంలో హాలీవుడ్ చిత్రం‘ ఉమెన్ టాకింగ్’కు అస్కార్ లభించింది. షేరా పాల్లే ఈ అవార్డును అందుకున్నారు. ►ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రాన్ని ఆస్కార్ వరించింది. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే విభాగంలో ఈ చిత్రానికి అవార్డు లభించింది. డేనియల్ క్వాన్, డేనియల్ షేనెర్ట్లు ఈ అవార్డులు అందుకున్నారు. ► జెమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ను ఆస్కార్ వరించింది. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ చిత్రం ఆస్కార్ గెలుచుకుంది. ఈ విభాగంలో ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్, ది బ్యాట్మ్యాన్, బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్, టాప్ గన్ మావెరిక్ చిత్రాలు పోటీ పడ్డాయి. 'Avatar: The Way of Water' wins Best Visual Effects #Oscars #Oscars95 pic.twitter.com/U7xJ0D20tO — The Academy (@TheAcademy) March 13, 2023 ► బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ చిత్రం ఆస్కార్ అందుకుంది. ఈ విభాగంలో బాబిలోన్, ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మరియు ది ఫాబెల్మాన్స్ పోటీ పడగా..’ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ గెలిచింది. వాకర్ బెర్టెన్ మాన్ ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’కు సంగీతం అందించారు. ► బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ చిత్రం ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంది. క్రిస్టియన్ ఎం గొల్డెబెక్ ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరించగా, ఎర్నిస్టైన్ హిప్పర్ సెట్ డిజైనర్గా ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈ అవార్డ్ కోసం అవతార్ 2, Babylon, Elvis, The Fabelmans చిత్రాలు పోటీ పడ్డాయి. ► బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్ కు ఆస్కార్ లభించింది. ఈ అవార్డ్ కోసం ది ఫ్లయింగ్ సెయిలర్, ఐస్ మర్చంట్స్, మై ఇయర్ ఆఫ్ డిక్స్, యాన్ ఓస్ట్రిచ్ టోల్డ్ మి ది వరల్డ్ ఈజ్ ఫేక్, ఐ థింక్ ఐ బిలీవ్ ఇట్ షార్ట్ ఫిల్మ్ నామినేట్ అయ్యాయి. The Oscar for Best Documentary Short Film goes to 'The Elephant Whisperers' #Oscars #Oscars95 pic.twitter.com/jLG0aqAg3j — The Academy (@TheAcademy) March 13, 2023 నయా చరిత్ర ►బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ షార్ట్ ఫిల్మ్ సినిమా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ను ఆస్కార్ వరించింది. ఇండియా నుంచి గెలుపొందిన మొట్ట మొదటి బెస్ట్ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ చరిత్ర సృష్టించింది. తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ ఈ షార్ట్ ఫిల్మ్ను తెరకెక్కించారు. ► ఆస్కార్ వేదికపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు సాంగ్ పాడారు. బ్లాక్ ట్రెడిషనల్ వేర్లో.. లాల్చీ, పంచకట్టులో కనిపించారు సింగర్స్. ► ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ చిత్రం ఆస్కార్ దక్కించుకుంది. ఈ అవార్డ్ కోసం “బాబిలోన్”, “బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్”, “ఎల్విస్”, “ఎవరీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్”, “మిసెస్ హారిస్ గోస్ టు ప్యారిస్” చిత్రాలు పోటీపడ్డాయి. ► బెస్ట్ సినిమాటోగ్రఫీ - ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ ► బెస్ట్ షార్ట్ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్బై ► బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్- నావల్నీ ► బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ - జేమీ లీ కర్టిస్(ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్) ► బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- కి హుయ్ క్వాన్(ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) ► బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్- గిల్లెర్మో డెల్ టోరోస్ పినాకియో ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్నఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు హాజరయ్యారు. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఎన్టీఆర్ ఎడమ భుజంపై టైగర్ బొమ్మ ఉన్న డ్రెస్ ధరించగా, చరణ్ ఎడమ ఛాతీపై ప్రత్యేక డిజైన్ కలిగిన డ్రెస్ వేసుకున్నాడు.ఈ వేడుకలకు చరణ్ తన సతీమణి ఉపాసనతో కలిసి వచ్చాడు. దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణీ, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్తో పాటు మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. -
ఆస్కార్ అకాడమీ సంచలన నిర్ణయం.. 60 ఏళ్ల సంప్రదాయానికి గుడ్బై
మరికొన్ని గంటల్లో ప్రపంచ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేడుక జరగబోతోంది. అయితే ఈ వేడుకపై టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. దర్శకధీరుడు తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ పేరు విశ్వవేదికపై మార్మోగనుంది. అయితే ఆస్కార్ వేదికపై నడవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. ఎందుకంటే రెడ్ కార్పెట్పై నడవడాన్ని అరుదైన అవకాశంగా భావిస్తారు. కానీ ఈ ఏడాది ఆ రెడ్ కార్పెట్ వేదికపై కనిపించకపోవడం ఆశ్చర్యం కలిస్తోంది. 60 ఏళ్ల సంప్రదాయానికి చెక్ అయితే ఈసారి ఆస్కార్ వేడుకల్లో రెడ్ కార్పెట్ కనిపించడం లేదు. తొలిసారి రెడ్ కార్పెట్ కలర్ను మార్చేస్తున్నారు నిర్వాహకులు. ఈ ఏడాది షాంపైన్ కలర్లో స్వాగతం పలకనున్నారు. దాదాపు 60 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ఈసారి బ్రేక్ చేయడం విశేషం. దీనికి కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. రంగు మార్చడం వెనుక ఉద్దేశంపై ఓ సీరియస్ జోక్ వేసింది అకాడమీ. ఓసారి అదేంటో తెలుసుకుందాం. విల్స్మిత్ చెంపదెబ్బే కారణం అయితే గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆస్కార్ అవార్డు వేడుకల్లో అత్యంత వివాదాస్పద ఘటన విల్స్మిత్ చెంపదెబ్బ. గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా వ్యాఖ్యాత క్రిస్రాక్ వ్యవహారశైలికి మండిపడ్డ విల్స్మిత్ వేదికపైనే ఆయనపై చేయి చేసుకున్నారు. ఆ సమయంలో వేదికపై ఉన్నవారితో పాటు, కోట్లాది మంది అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ ఘటనను గుర్తు చేస్తూ కలర్ మార్చడంపై అకాడమీ వ్యంగ్యంగా స్పందించింది. అయితే ఈ ఏడాది ఆస్కార్ వేడుకకు హోస్ట్గా అమెరికన్ కామెడియన్ జిమ్మీ కిమ్మెల్ వ్యవహరిస్తున్నాడు. రెడ్ కార్పెట్ కలర్ మార్పుపై మాట్లాడుతూ. 'గత ఏడాది హాస్యనటుడు క్రిస్ రాక్ను విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టడంతో ఆస్కార్ అకాడమీ ఒక్కసారిగా ఎరుపెక్కింది. అందుకనే ఈ సంవత్సరం 60 ఏళ్ల సంప్రదాయాన్ని రెడ్ నుంచి షాంపైన్కు మారుస్తున్నాం. దీనివల్ల ఇక అలాంటి చెంపదెబ్బలు ఉండవని భావిస్తున్నాం.' అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. అప్పుడు అసలేం జరిగిందంటే.. కాగా గతేడాది విల్ స్మిత్ భార్య హెల్త్ గురించి హాస్యనటుడు క్రిస్ రాక్ జోక్ చేస్తూ మాట్లాడడం వివాదానికి దారితీసింది. దీంతో విల్స్మిత్ స్మిత్ కోపం వచ్చి క్రిస్ రాక్పై చెంపదెబ్బ వేశారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న అకాడమీ.. విల్ స్మిత్పై పదేళ్లు బ్యాన్ కూడా విధించింది. అందువల్లే ఈ ఏడాది ఎలాంటి సంఘటనలు జరగకుండా అకాడమీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. (ఇది చదవండి: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..) నేనేమీ ఏడవడం లేదు: క్రిస్ రాక్ ఆ సంఘటన ఇప్పటికీ తనని బాధిస్తోందని ఇటీవల క్రిస్ రాక్ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ..'ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏడాది కిందట నేను చెంపదెబ్బ తిన్నా. అందరి ముందు విల్ స్మిత్ నన్ను కొట్టాడు. ఆ సంఘటన మిమ్మల్ని బాధించిందా’ అని కొంతమంది నన్ను అడిగారు. ఇప్పటికీ నేను బాధపడుతున్నా. అయితే అందుకు నేనేమీ ఏడవడం లేదు.' క్రిస్ రాక్ చెప్పుకొచ్చాడు. -
‘నాటు నాటు’కు ఆస్కార్ వస్తుందా? రాదా? కోట్లలో బెట్టింగ్
యావత్ సినీ ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుక మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఆదివారం (మార్చి 12) రాత్రి 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు) లాజ్ ఏంజిల్స్ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంగా బెట్టింగ్ రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ఆస్కార్ అందుకునే హీరో ఎవరు? ఏ సినిమాకి ఆస్కార్ వస్తుంది? తదితర అంశాలపై జోరుగా బెట్టింగ్ సాగిస్తున్నారు. (చదవండి: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..) ఇక ఇండియా నుంచి ఆస్కార్ బరిలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’పై కోట్ల రూపాయల్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ముంబై నగరాల్లో తిష్టవేసిన బుకీలు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్కు నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వస్తుందా? లేదా? అంటూ బెట్టింగ్ వేస్తున్నారు. బెట్టింగ్ వ్యవహారమంతా ఆన్లైన్లోనే నడిపిస్తున్నారు. 1:4 నిష్పత్తితో నడుస్తున్న ఈ బెట్టింగ్లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది. (చదవండి: ఆస్కార్కు అడుగు దూరంలో నాటు నాటు.. ఆ పాటనే అడ్డు..!) సామాన్యులతో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు నిర్మాతలు..టెక్నీషియన్స్ కూడా బెట్టింగ్స్ వేస్తున్నట్లు సమాచారం. తొలిసారి ఒక తెలుగు సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో టాలీవుడ్ ప్రేక్షకులంతా ఈ వేడుక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా..ఆర్ఆర్ఆర్.. నాటు నాటు పాట గురించే చర్చిస్తున్నారు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో మరో నాలుగు పాటలతో పోటీ పడుతున్న నాటు నాటుకి ఆస్కార్ వస్తుందా రాదా తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. -
వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..
యావత్ ప్రపంచ దృష్టంతా ఇప్పుడు ఆస్కార్ వేడుకపైనే ఉంది. ఈ రోజు (మార్చి 12) రాత్రి 8 గంటలకు లాస్ ఏంజిల్స్లో 95వ ఆస్కార్ ప్రధానోత్సవం జరగనుంది. భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు ఆస్కార్ అవార్డుల వేడుక ప్రారంభం కానుంది. 23 విభాగాల్లో విజేతలను ప్రకటించి అవార్డులను అందజేస్తారు. ఈ ఏడాది మన దేశం నుంచి మూడు విభాగాల్లో (బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్) నామినేషన్స్ దక్కాయి. ఈ మూడు విభాగాల్లోనూ అవార్డులు రావాలని భారతీయ సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. వీటిలో ముఖ్యంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు సినీ ప్రియులంతా ఆస్కార్ వేడక కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చదవండి: Oscar Ceremony Facts: గెలిచినవాళ్లకే కాదు అందరికీ డమ్మీ ఆస్కార్ ఇస్తారు! ఇదిలా ఉంటే.. ఈ సారి ఆస్కార్ వేడుకల్లో కొన్ని కీలక మార్పులు చేశారు. ఈసారి అతిథులకు స్వాగతం పలికేది రెడ్ కార్పెట్ కాదు. షాంపైన్. పేరుకు మాత్రమే రెడ్ కార్పెట్.. కానీ రంగు మాత్రం అది కాదు. ‘షాంపైన్’ కలర్ గా మార్చేశారు. తొలిసారి ఈ రెడ్ కార్పెట్ కలర్ ను మారుస్తున్నారు. 50 000 స్క్వేర్ ఫీట్ ఉండే ఈ కార్పెట్ ధర 24 వేల 700 డాలర్స్ అట. ఇది మొత్తం ఇన్ స్టాల్ చేయడానికి 600 గంటలు సమయం పట్టింది అని సమాచారం. చదవండి: Oscar Awards Facts: ఆస్కార్ ప్రతిమలో వీటిని గుర్తించారా? అది దేనికి చిహ్నమంటే? ఈసారి ఈ అవార్డుల వేడుక కోసం 56.6 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా 463 కోట్ల 92 లక్షల 47 వేల 300 రూపాయలు. ఇందులో.. కార్పెట్ వద్ద ఓ నటి వేసుకునే డ్రెస్ ఖరీదే 10 మిలియన్ డాలర్స్ ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆస్కార్ ఈవెంట్లో ఏదైనా యాడ్ ఇవ్వాలి అనుకుంటే 30 సెకన్లకు గాను 2 మిలియన్స్ డాలర్స్ చెల్లించాల్సి ఉంటుందట. మొత్తాని ఆస్కార్ చదవండి: Natu Natu Song: ఆస్కార్ బరి.. ఆ పాటతోనే గట్టి పోటీ మరీ..! ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులేయనుంది ఎవరో తెలుసా? -
ఆస్కార్కు అడుగు దూరంలో నాటు నాటు.. ఆ పాటనే అడ్డు..!
సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండగ ఆస్కార్ వేడుక. ఆర్ఆర్ఆర్ సాంగ్ నాటు నాటు ఆస్కార్ బరిలో నిలవడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఐదు సినిమాలు పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ బరిలో ఫైనల్కు చేరిన పాటలు మొత్తం ఐదు ఉన్నాయి. వాటిలో ‘నాటు నాటు’తో పాటు 'టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్' (అప్లాజ్), 'హోల్డ్ మై హ్యాండ్' (టాప్గన్.. మావెరిక్), 'లిఫ్ట్ మీ అప్'(బ్లాక్ పాంథర్), 'దిస్ ఈజ్ ఎ లైఫ్' (ఎవ్రీథింగ్ ఎవీవ్రేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు పోటీలో నిలిచాయి. వీటిల్లో మార్వెల్ సూపర్ హీరో చిత్రం ‘బ్లాక్పాంథర్: వకాండా ఫరెవర్’లో రిహానా పాడిన 'లిఫ్ట్ మీ అప్' పాట, టామ్ క్రూజ్ హీరోగా వచ్చిన ‘టాప్ గన్ మావెరిక్’ చిత్రంలో ‘లేడీ గాగా’ రాసి, ఆలపించిన 'హోల్డ్ మై హ్యాండ్' పాట.. ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’లో కూడా మన ‘నాటు నాటు’ పాటకు గట్టి పోటీ ఇచ్చాయి. కానీ చివరికీ మన పాటనే విజయం వరించింది. చదవండి: ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులేయనుంది ఎవరో తెలుసా? అయితే అస్కార్ బరిలోనూ నిలిచిన ఆ సాంగ్ నాటు నాటు సాంగ్కు రిహానా పాడిన 'లిఫ్ట్ మీ అప్' పాట గట్టి పోటీనివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అదే కాకుండా 'టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్' (అప్లాజ్), ‘టాప్ గన్ మావెరిక్’ చిత్రంలో ‘లేడీ గాగా’ రాసి, ఆలపించిన 'హోల్డ్ మై హ్యాండ్' పాట ఆ తర్వాత వరుసలో ఉన్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించింది. అమెరికాలో థియేటర్లలోనూ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 14 పాటలతో పోటీపడిన ‘నాటు నాటు’ సాంగ్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న విడుదలై గ్లోబల్ బ్లాక్బస్టర్గా నిలిచింది. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్గా నిలిచాయి. ప్రత్యేకించి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నృత్యాలు సమకూర్చిన ‘నాటు నాటు’ పాటలో రామ్చరణ్, ఎన్టీఆర్ అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 81 పాటలు బరిలో నిలవగా ఫైనల్గా 15 పాటలు మాత్రమే షార్ట్లిస్ట్లో చేరాయి. అందులో ‘నాటు నాటు’ పాటకి చోటు దక్కింది. భారత చలన చిత్ర చరిత్రలో షార్ట్లిస్ట్లో నిలిచిన తొలి పాట ఇదే. చదవండి: Oscar Awards 2023: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే.. Oscar Ceremony Facts: గెలిచినవాళ్లకే కాదు అందరికీ డమ్మీ ఆస్కార్ ఇస్తారు! -
థియేటర్ నుంచి ఆస్కార్కు.. ఈ పాప్కార్న్ గయ్ మామూలోడు కాదు..
సోషల్ మీడియా దేన్నయినా సాధ్యం చేస్తోంది. చిన్న చిన్న పనులు చేసుకునేవారు కూడా తమ నైపుణ్యాలతో ఓవర్నైట్లో స్టార్లు అయిపోతున్నారు. ఊహించని రీతిలో గొప్ప అవకాశాలు అందుకుంటున్నారు. ఇదీ చదవండి: Oscar Awards: ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి! కానీ.. సరిగ్గా ఇలాగే సినిమా థియేటర్లో పాప్కార్న్ అమ్ముకునే జాసన్ గ్రోస్బోల్ అనే యువకుడు ఆస్కార్ వేడుకలో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు జరుగుతున్న ఆస్కార్ వేడుకలో అతిథులకు పాప్కార్న్ సర్వ్ చేస్తున్నాడు. టెక్సాస్లోని కార్పస్ క్రిస్టీలోని సెంచరీ 16 థియేటర్లో పనిచేస్తున్న గ్రోస్బోల్ పాప్కార్న్ సర్వ్ చేయడంలో వైవిధ్యాన్ని ప్రదర్శించి టిక్టాక్లో ఫేమస్ అయ్యాడు. ఆస్కార్ వేడుకలో హోస్ట్గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్కు తన స్నేహితుడొకరు గ్రోస్బోల్ గురించి చెప్పడంలో రెండు నెలల క్రితం తన చానల్లో లైవ్ నిర్వహించినప్పుడు అతన్ని లైవ్లోకి తీసుకున్నారు. అతని పాప్కార్న్ సర్వింగ్ నైపుణ్యాలకు అబ్బురపడిన కిమ్మెల్ అతన్ని డాల్బీ థియేటర్లో జరుగనున్న ఆస్కార్ వేడుకలో పాప్కార్న్ అందించేందుకు ఆహ్వానించారు. -
ఆస్కార్.. ఇప్పటి వరకు గెలిచిన ఇండియన్స్ వీరే
ప్రస్తుతం అందరినోటా వినిపిస్తున్న మాటా ఒక్కటే. అదేమిటంటే తొలిసారి తెలుగోడి సత్తా ప్రపంచానికి చాటే సమయమిది. అమెరికాలోని లాస్ఎంజిల్స్లో డాల్బీ థియేటర్లో జరుగనున్న 95 ఆస్కార్ వేడుకలపై అందరి దృష్టి పడింది. ఈ సారి మన టాలీవుడ్ దర్శకధీరుడు తెరకెక్కించిన వన్ అండ్ ఓన్లీ సెన్సేషనల్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రపంచవేదికపై మెరవనుంది. అందుకే ఈ ఏడాది ఆస్కార్ తెలుగు వారికి కూడా వెరీ వెరీ స్పెషల్. కానీ ఇప్పటి వరకు ఎంతమంది భారతీయులను ఈ అవార్డ్ వరించింది. ప్రపంచ ఆస్కార్ సందడి వేళ ఇప్పటి దాకా ఆస్కార్ నెగ్గిన వారెవరో ఓ లుక్కేద్దాం. తొలి ఆస్కార్ విన్నర్ భాను అథైయా భాను అథైయా తొలి భారత ఆస్కార్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. 1983లో విడుదలైన గాంధీ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా ఆమెకు అరుదైన ఘనత దక్కింది. 55వ ఆస్కార్ వేడుకల్లో ఆమె అవార్డు అందుకున్నారు. మహాత్మా గాంధీ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా తెరకెక్కించారు. సత్యజిత్ రే భారతీయ సినీ ఇండస్ట్రీకి పేరు తీసుకొచ్చిన సత్యజిత్ రే ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన ఆస్కార్స్ 1992లో సత్యజిత్రేకు హానరరి అవార్డును ప్రకటించింది. అయితే సత్యజిత్రే అనారోగ్యం కారణాలతో వేడుకలకు పాల్గొనలేదు. దీంతో అకాడమీ స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఆస్కార్ అందజేసింది. రెండు అవార్డులు గెలిచిన ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు సాధించారు. స్లమ్డాగ్ మిలియనీర్ సినిమాకూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఈ అవార్డులు దక్కించుకున్నారు. రెండు ఆస్కార్ అవార్డులు గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. రసూల్ పూకుట్టి స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి ఆస్కార్ సొంతం చేసుకున్నారు. గుల్జర్ దర్శకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన గుల్జర్ 81వ ఆస్కార్ వేడుకల్లో అవార్డు గెలుచుకన్నాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు ఉత్తమ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆయన్ను ఆస్కార్ వరించింది. గునీత్ మోన్గా ఢిల్లీకి చెందిక ప్రముఖ నిర్మాత గునీత్ మోన్గాఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగ్గా పీరియడ్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్కు గునీత్ ఆస్కార్ గెలుచుకుంది. తాజాగా అమెరికాలో లాస్ఎంజిల్స్ జరగనున్న 95వ ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి ఆల్ దట్ బ్రెత్స్( బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం), ది ఎలిఫెంట్ విస్ఫరర్స్(బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం), నాటు నాటు(బెస్ట్ ఒరిజినల్ సాంగ్) విభాగాలలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అందరి చూపులు ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్పైనే ఉన్నాయి. కచ్చితంగా ఆస్కార్ వరిస్తుందని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ వేడుకల కోసం ఆర్ఆర్ఆర్ బృందం అమెరికా చేరుకుంది. -
ఆస్కార్ బరిలో ఆ ఐదుగురు స్పెషల్.. ఎందుకంటే?
ఆస్కార్ ఆ పేరు వింటేనే అదో గొప్ప. అవార్డ్ రాకపోయినా సరే.. కనీసం నామినేట్ అయినా ఆ ఫీలింగే వేరు. ప్రపంచ వేదికపై మన పేరు వినిపించాలని ఎవరికీ మాత్రం కోరిక ఉండదు. ఈ ఏడాది జరగునున్న 95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఆసక్తికర విషయాలెన్నో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కేటగిరీలో ఐదుగురు పోటీ పడుతున్నారు. కాగా.. ఉత్తమ నటుడు విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ఐదుగురు గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఎందుకంటే ఈ ఐదుగురు తొలిసారి ఆస్కార్ బరిలో నిలవడం విశేషం. దీంతో ఎవరినీ అవార్డ్ వరించినా అది తొలిసారి దక్కించుకున్న ఘనత వారికి సొంతమవుతుంది.. ఉత్తమ నటుడి రేసులో తొలిసారి పోటీలో నిలిచిన ఐదుగురు వీరే ఆస్టిన్ రాబర్ట్ బట్లర్ అమెరికన్ సింగర్ ఎల్వీస్ ప్రెస్లీ జీవిత కథలో అద్భుతంగా నటించారు ఆస్టిన్ రాబర్ట్ బట్లర్. ఆయన నటనే 95వ ఆస్కార్ రేసులో నిలిచేలా చేసింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్నారు. బట్లర్ యుక్త వయస్సులోనే టెలివిజన్ ధారావాహికలు ‘ది క్యారీ డైరీస్’, ది షన్నారా క్రానికల్స్’ లో నటనకు పేరు సంపాదించారు. ఏలియన్స్ ఇన్ ది అట్టిక్(2009) చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్లో మోస్ట్ ప్రామిసింగ్ పెర్ఫార్మర్ అవార్డును కైవసం చేసుకున్నారు. కోలిన్ జేమ్స్ ఫారెల్ ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ చిత్రంలో పాడ్రాయిక్ పాత్రతో నామినేషన్ దక్కించుకున్నారు కోలిన్ జేమ్స్ ఫారెల్(46). ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు. ఫారెల్ ది వార్ జోర్ సినిమాతో కెరీర్ మొదలెట్టిన కోలిన్ జేమ్స్ ‘టైగర్ ల్యాండ్, మైనారిటీ రిపోర్ట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ కామెడీ చిత్రం ఇన్ బ్రూగెస్లో ఆయన పాత్రకి ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. బ్రెండన్ జేమ్స్ ఫ్రేజర్ కామెడీ సినిమాలతో గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు బ్రెండన్ జేమ్స్ ఫ్రేజర్. ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచారాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి యుక్త వయస్సులో ఉన్న తన కూతురితో బంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నించే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది వేల్’. ఈ చిత్రంలో ఉపాధ్యాయుడి పాత్రను పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన ‘డాగ్ ఫైట్’, ‘ఎన్సినో మ్యాన్, స్కూల్ టైస్, జార్జ్ ఆఫ్ ది జంగిల్’ లాంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ‘ది వేల్’ చిత్రంలోని నటనకు ఫ్రేజర్ ఉత్తమ నటుడిగా 12 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. చిన్న వయస్సులో పాల్ మెస్కల్ ఆస్కార్ ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందిన అతి చిన్న వయస్సు కలిగిన నటుడు పాల్ మెస్కల్(27). ‘ఆఫ్టర్ సన్’ ఈ చిత్రంలో 11 ఏళ్ల అమ్మాయికి తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నార్మల్ పీపుల్ అనే మినీ సిరీస్తో మెస్కల్ గుర్తింపు పొందారు. బ్రిటీష్ అకాడమీ టెలివిజన్ అవార్డ్స్లో కూడా ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కించుకున్నారు. అత్యధిక వయసులో బిల్ నైజీ అత్యధిక వయసులోనూ ‘లివింగ్’ అనే చిత్ర నటుడు బిల్ నైజీ 73 ఏళ్ల వయసులో బరిలో నిలిచాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. ప్రాణాంతకమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి పాత్రలో నటించి మెప్పించారు. ‘గిడియాన్స్ డాటర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. లవ్ యాక్చువల్లీ అనే చిత్రానికి బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. -
ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి!
ప్రఖ్యాత ఆస్కార్ అవార్డులకు నామినీలుగా చోటు దక్కించుకున్న నటీనటులు, దర్శకులు, ఇతర కళాకారులకు అకాడమీ అద్భుతమైన బహుమతులు ఇస్తుంది. అయితే ఈ సారి మాత్రం భూమిని బహుమతిగా అందించబోతోంది. ఎక్కడా అనుకుంటున్నారా..? ఆస్కార్ నామినీలు ఈ ఏడాది తమ గిఫ్ట్ బ్యాగ్లలో ఆస్ట్రేలియాలో ఒక చదరపు మీటర్ భూమిని అందుకోబోతున్నారు. అయితే ఆ భూమిని నామినీలు ఆధీనంలోకి తీసుకోలేరు. కానీ ఆ భూమి ఆస్కార్ నామినీల పేరుతో ఉంటుంది. అంటే వారి గుర్తుగా అన్నమాట. ఇదీ చదవండి: ట్విటర్ తరహాలో మెటా.. జుకర్బర్గ్పై ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు! సాధారణంగా ఆస్కార్ నామినీలకు బహుమతులు ఇచ్చేందుకు అకాడమీతో సంబంధం లేకుండా అనేక వ్యాపార సంస్థలు పోటీ పడుతుంటాయి. అందులో ‘పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఒకటి. నామినీలకు ఇచ్చే గిఫ్ట్ హాంపర్లో చోటు దక్కించుకోవడానికి 4 వేల డాలర్లు (రూ.3,27,862) చెల్లించింది. నామీనీల గిఫ్ట్ బ్యాగ్లో పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా సంస్థ తమ ‘ఆస్సీ మేట్ కన్జర్వేషన్ ప్యాక్స్’ను చేర్చింది. దీని ద్వారా క్వీన్స్ల్యాండ్లోని వెస్ట్రన్ డౌన్స్ ప్రాంతంలో ఉన్న ‘ఎన్విరోషియన్ ఎస్టేట్’లో ఒక చదరపు మీటర్ స్థలం ఆస్కార్ నామినీల పేరుపై ఉంటుంది. దీనికి సంబంధించిన లైసెన్స్ సర్టిఫికెట్ను గ్రహీతలకు అందిస్తారు. ‘ఎన్విరోషియన్ ఎస్టేట్’లో కొంత భాగాన్ని పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా సంస్థ ఆస్కార్ నామినీలకు బహుమతిగా ప్రకటించింది. కాగా ఈ భూమి మొత్తం 1,21,774 చదరపు మీటర్లు ఉంటుందని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పేర్కొంది. దీన్ని విక్రయిస్తే వచ్చే లాభం 2.5 మిలియన్ డాలర్లు వరకు ఉండవచ్చని అంచనా వేసింది. అయితే బొగ్గు సీమ్ గ్యాస్ ఫీల్డ్ నడిబొడ్డున ఉన్న ఈ భూమిపై పర్యావరణ సంస్థల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. ఇదీ చదవండి: Jayanti Chauhan: రూ.7 వేల కోట్ల కంపెనీని వద్దన్న వారసురాలు.. ఇప్పుడిప్పుడే.. -
నిజంగా నిజం.. డమ్మీ ఆస్కార్ ఇస్తారు!
హాలీవుడ్లో ఆస్కార్ ఫీవర్ మొదలైంది. 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం సర్వం సిద్ధమైంది. లాస్ ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్ ది మోస్ట్ గ్లామరస్ డే కోసం సుందరంగా ముస్తాబైంది. పుత్తడిబొమ్మ ఎవరెవరి సొంతమవుతుందోనని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా ఈ అవార్డుల వేడుక గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం.. చదవండి: Oscar Awards Facts: ఆస్కార్ ప్రతిమలో వీటిని గుర్తించారా? అది దేనికి చిహ్నమంటే? అవార్డు అందుకోవడానికి వేదిక పైకి వచ్చే విజేతల్లో తడబాటు ఉండటం ఖాయం. అందుకే నామినేషన్ దక్కించుకునేవాళ్లతో అకాడమీ నిర్వాహకులు ముందే రిహార్సల్స్ చేయిస్తారు. అండ ద విన్నర్ ఈజ్.. అంటూ అనౌన్స్ చేసి, వేదిక పైకి పిలిచి ముందుగానే తయారు చేయించిన డమ్మీ ఆస్కార్ అవార్డు అందజేస్తారు. ఇలా చేయడం వల్ల వేడుక రోజు విజేతలుగా నిలిచే వాళ్లలో కొంచెం కంగారు తగ్గుతుందని నిర్వాహుల ఫీలింగ్. ఈసారి కూడా ఈ రిహార్సల్స్ జరిగాయి. శనివారం ఉదయం డాల్బీ థియేటర్లో నామినేషన్ దక్కించుకున్నవాళ్లు డమ్మీ ఆస్కార్ అందుకుని రిహార్సల్ పూర్తి చేశారు. రేపు ఉదయం అసలైన విజేతలకు నిజమైన ఆస్కార్ ప్రతిమను బహుకరిస్తారు. చదవండి: ఆస్కార్ వచ్చే ఆస్కారం ఎవరికి ఎక్కువ? Oscar Awards 2023: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే.. -
ఆస్కార్.. ఈ పేరు, బొమ్మ వెనుక ఉన్న కహానీ తెలుసా?
యావత్ సినీప్రపంచానికి ఆస్కార్ అంటే అమృతకలశం వంటిది. దాన్ని ఒక్కసారి తాకినా చాలనుకునే సెలబ్రిటీలు చాలామంది. అలాంటిది ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంటే జన్మ ధన్యమైపోయినట్లే ఫీలవుతారు. అందరినీ ఇంతలా ఆకర్షిస్తున్న ఆస్కార్ అవార్డుకు ఆ పేరెలా వచ్చింది? ఆ బొమ్మ తయారు చేసింది ఎవరో ఓసారి తెలుసుకుందాం. ప్రతి పేరు వెనక ఓ కథ ఉంటుంది. అలాగే ఆస్కార్ పేరు వెనుక కూడా ఓ కహానీ ఉంది. గతంలో అకాడమీ అవార్డ్ అని మాత్రమే పిలిచేవారు. అయితే ఆస్కార్ ప్రతిమను చూసి అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్ అది తన మామయ్య ఆస్కార్లా ఉందని పేర్కొన్నారట. అప్పటి నుంచి ఆ ప్రతిమను ఆస్కార్ అని అక్కడి ఉద్యోగులు పిలవడం ప్రారంభించారు. ఆ పేరు షార్ట్ అండ్ స్వీట్గా ఉండటంతో చివరికి ఆ పేరే స్థిరపడిపోయింది. 1929లో ఆస్కార్ అవార్డుల ప్రదానం మొదలవగా ఆస్కార్ అనే పేరు స్థిరపడింది మాత్రం 1939లో! చదవండి: Oscar Ceremony Facts: గెలిచినవాళ్లకే కాదు అందరికీ డమ్మీ ఆస్కార్ ఇస్తారు! ఆస్కార్ బొమ్మ విషయానికి వస్తే.. 1927లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అవార్డ్స్ అండ్ సెన్సెస్ అనే సంస్థ ప్రారంభించి సినిమారంగంలోని ప్రతిభావంతులకు అవార్డులు ఇవ్వాలనుకుందో కమిటీ. ఆ అవార్డు ప్రతిమ డిజైన్ను కళాదర్శకుడు సిడ్రిక్ గిబ్బన్స్ రూపొందించారు. నటీనటులు, రచయితలు, దర్శక, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.. ఇలా చిత్రనిర్మాణంలో పాలు పంచుకునే ప్రధాన ఐదు శాఖలను దృష్టిలో పెట్టుకుని ఐదు స్పోక్స్ ఉన్న ఒక ఫిలిం రీల్పై ఓ వీరుడు కత్తి పట్టుకుని నిలబడినట్లుగా ప్రతిమ డిజైన్ చేశారు. అది అందరికీ నచ్చడంతే ఆ ఆస్కార్ బొమ్మే ఇప్పటికీ కొనసాగుతోంది. చదవండి: ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులేయనుంది ఎవరో తెలుసా? Oscar Awards 2023: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే.. -
ఆస్కార్ వేదికపై నాటునాటు డ్యాన్స్.. దుమ్ము లేచిపోవాలంతే!
ఆస్కార్ వేడుకల కోసం ప్రపంచమంతా కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తోంది. భారత కాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం ఈ వేడుక ప్రారంభం కానుంది. కాగా నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కోసం పోటీపడుతున్న విషయం తెలిసిందే! ఇందుకోసం అమెరికాలో పాగా వేసిన ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహించింది. అలుపెరగకుండా ప్రచారాల్లో పాల్గొని ఎలాగైనా ఆస్కార్ కొట్టాలన్న కసితో ఉంది. మరోవైపు ఆస్కార్ స్టేజీపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు పాట పాడనున్న విషయం తెలిసిందే! మరి ఈ పాటకు లైవ్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ స్టెప్పులేస్తారా? అంటే అది కుదరదని తేలిపోయింది. ప్రాక్టీస్ చేసేంత టైమ్ దొరకలేనందున లైవ్ డ్యాన్స్ లేనట్లేనని ఆల్రెడీ తారక్ క్లారిటీ ఇచ్చాడు. అలా అని నాటు నాటు పాటకు డ్యాన్స్ పర్ఫామెన్స్ లేదనుకుంటే పొరపాటే! నటి లారెన్ గొట్లెబ్ నాటు నాటు పాటకు స్టెప్పులేయనున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. 'స్పెషల్ న్యూస్.. ఆస్కార్ వేదికపై నాటునాటుకు డ్యాన్స్ చేయబోతున్నాను. ప్రపంచంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన వేదికపై పర్ఫామ్ చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది' అని ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. దీంతో పలువురు ఆమెకు శుభాకాంక్షలలు తెలుపుతున్నారు. కాగా లారెన్ నటి మాత్రమే కాదు, మోడల్, కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ కూడా! అమెరికాకు చెందిన ఆమె ఏబీసీడీ: ఎనీ బడీ కెన్ డ్యాన్స్తో నటిగా ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాల్లో నటించింది. బిగ్బాస్ ఏడో సీజన్లోనూ గెస్ట్గా కనిపించిన ఆమె జలక్ దిఖ్లాజా సీజన్ 6 రన్నరప్గా నిలిచింది. View this post on Instagram A post shared by Lauren Gottlieb (@laurengottlieb) -
Oscars 2023: ఆస్కారం ఎవరికి ఎక్కువ!.. లైవ్ ఎన్ని గంటలకు?
ఆస్కార్ సంబరానికి సమయం ఆసన్నమైంది. ఈ నెల12న (భారతీయ కాలమానం ప్రకారం 13వ తేదీ) లాస్ ఏంజిల్స్లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. 23 విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. ఆస్కార్ రేస్లో ఉన్న చిత్రాల్లో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రం అత్యధికంగా 11 నామినేషన్స్ను దక్కించుకుంది. ఆ తర్వాత ‘ది బన్షీష్ ఆఫ్ ఇనిషెరిన్’, ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ చిత్రాలు తొమ్మిది నామినేషన్స్తో పోటీలో ఉన్నాయి. కాగా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి వంటి విభాగాలతోపాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్కు నామినేట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’పాట గురించి కూడా హాలీవుడ్లో జోరుగా చర్చ జరుగుతోంది. అవార్డు దక్కే ఆస్కారం ఎక్కువగా ఎవరికి ఉంది? అంటూ హాలీవుడ్ చేస్తున్న విశ్లేషణలోకి వెళదాం. ఉత్తమ చిత్రం బెస్ట్ మూవీ విభాగంలో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘ది బన్షీష్ ఆఫ్ ఇనిషెరిన్’, ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’, ‘టాప్గన్: మ్యావరిక్’, ‘ఎల్విస్’, ‘ది ఫేబుల్మ్యాన్స్’, ‘టార్’, ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్నెస్’, ‘ఉమెన్ టాకింగ్’ ఇలా మొత్తం పది చిత్రాలు బరిలో ఉన్నాయి. కాగా ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రానికే అవార్డు దక్కే ఆస్కారం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. 28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్, 29వ యాన్యువల్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డ్స్, 38వ ఫిల్మ్ ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్స్ ప్రదానోత్సవాల్లో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ ఉత్తమ చిత్రం విభాగంలో విజేతగా నిలిచింది. అలాగే ఇతర విభాగాల్లో 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, 76వ బాఫ్తా అవార్డ్స్లో ఈ చిత్రం అవార్డులను సాధించి, ఆస్కార్ కమిటీ దృష్టిని ఆకర్షించింది. చైనా నుంచి అమెరికాకు వలస వచ్చి, లాండ్రీ షాపు పెట్టుకున్న ఓ కుటుంబం అనుకోని ప్రమాదాల నుంచి ఎలా బయటపడింది? అన్నదే ఈ చిత్రకథ. డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్డ్ దర్శకత్వంలో ఆంథోనీ రుస్సో, జో రుస్సో, మైక్లరోకా, జోనాథన్ వాంగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిచెల్ యోహ్, స్టెఫానీ హ్సు, కే హుయ్ క్వాన్ ముఖ్య తారలు. ఉత్తమ దర్శకుడు ఉత్తమ దర్శకుడి విభాగంలో మార్టిన్ మెక్డొనాగ్ (ది బన్షీష్ ఆఫ్ ఇనిషెరిన్) డానియల్ క్వాన్, డానియెల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్), స్టీవెన్ స్పీల్బర్గ్ (ది ఫేబుల్మ్యాన్స్), రూబెన్ ఆస్టాండ్ (ట్రయాంగిల్ ఆఫ్ సాడ్నెస్) టడ్ ఫీల్డ్ (టార్) పోటీ పడుతున్నారు. కాగా డానియల్ క్వాన్, డానియేల్ స్కీనెర్ట్లు ఉత్తమ దర్శకులుగా అవార్డు తీసుకెళ్తారని టాక్. 28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్లో క్వాన్, స్కీనెర్ట్ అవార్డు సాధించారు. ఉత్తమ నటుడు ఉత్తమ నటుడి విభాగంలోని అవార్డు కోసం ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్), కొలిన్ ఫార్రెల్ (ది బన్షీష్ ఆఫ్ ఇని షెరిన్), బ్రెండన్ ఫ్రాసెర్ (ది వేల్), బిల్ నిగీ (లివింగ్),పాల్ మెస్కల్ (ఆఫ్టర్సన్) పోటీ పడుతున్నారు. అయితే ఎక్కువ పోటీ మాత్రం ‘ఎల్విస్’ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచిన ఆస్టిన్ బట్లర్, ‘ది వేల్’ చిత్రంతో ప్రేక్షకులను కట్టిపడేసిన బ్రెండెన్ ఫ్రాసెర్ల మధ్య కనిపిస్తోంది. ఇక ఇటీవల జరిగిన క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్గా బ్రెండన్ ఫ్రాసెర్ అవార్డును కొల్లగొట్టగా, 80వ గోల్డెన్ గ్లోబ్, 76వ బాఫ్తా అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా ఆస్టిన్ బట్లర్ నిలిచారు. దీన్ని బట్టి ఆస్టిన్ బట్లర్కే ఉత్తమ నటుడి అవార్డు దక్కే అవకాశం కనిపిస్తోంది. అమెరికన్ రాక్ అండ్ రోల్ మ్యూజిక్ సింగర్, యాక్టర్ ఎల్విస్ ప్రెస్లీ జీవితం ఆధారంగా రూ΄÷ందిన ‘ఎల్విస్’లో టైటిల్ రోల్లో తన నటనతో వావ్ అనిపించారు ఆస్టిన్ బట్లర్. ఈ చిత్రానికి బాజ్ లుహార్మాన్ దర్శకుడు. ఉత్తమ నటి ఉత్తమ నటి విభాగంలో అవార్డు కోసం పోటీలో ఉన్న ‘అన్నా దె అర్మాస్’ (బ్లాండ్), ‘ఆండ్రియా రైజ్బరో’ (టు లెస్లీ), ‘మిషెల్ యో’ (ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్), ‘మిషెల్ విలియమ్స్’ (ది ఫేబుల్మ్యాన్స్) లను దాటుకుని ‘కేట్ బ్లాంచెట్’ (టార్) విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, బాఫ్తా అవార్డ్స్ ప్రదానోత్సవాల్లో ఉత్తమ నటిగా ‘కేట్ బ్లాంచెట్’ అవార్డులు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోగల ప్రతిభ ఉన్న ఓ మహిళా సంగీత విద్యాంసురాలు జీవితంలో ఎదుగుతున్న సమయంలో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఎలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కోవలసి వచ్చింది? వాటిని ఆమె ఎలా అధిగమించారు? అన్నదే ‘టార్’ సినిమా కథాంశం. మహిళా విద్వాంసురాలిగా కేట్ బ్లాంచెట్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు టాడ్ ఫీల్డ్ దర్శకుడు. ఆస్కార్లో భారత్ ఈ ఏడాది దేశం నుంచి మూడు విభాగాల్లో (బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్) నామినేషన్స్ దక్కాయి. ఈ మూడు విభాగాల్లోనూ అవార్డులు రావాలని భారతీయ సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇక బరిలో ఉన్న ఈ మూడు విభాగాల విశేషాల్లోకి వస్తే... నాటు నాటు..కే అవార్డు? ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఐదుపాటలు బరిలో ఉన్నాయి. వీటిలో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’పాటకు అవార్డు వస్తుందని హాలీవుడ్ మీడియా జోస్యం చెబుతోంది. ఇప్పటికే 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో, 28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్లో ‘బెస్ట్ సాంగ్’గా ‘నాటు నాటు..’ నిలిచింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తదితర అవార్డ్స్లోనూ అవార్డులు గెల్చుకుంది. కీరవాణి స్వరపరచిన ఈపాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవపాడిన సంగతి తెలిసిందే. ప్రేమ్రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ‘నాటు నాటు’తోపాటు ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’లోని ‘అప్లాజ్’, ‘బ్లాక్΄పాంథర్: వకాండ ఫరెవర్’లోని ‘లిఫ్ట్ మీ అప్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’లోని ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’, ‘టాప్గన్: మ్యావరిక్’ చిత్రం నుంచి ‘హోల్డ్ మై హ్యాండ్’పాటలు నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఒకవేళ ‘నాటు నాటు..’పాటకు అవార్డ్ వస్తే భారతీయులకు పండగే పండగ. గాయపడ్డ పక్షుల కోసం... బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో శౌనక్ సేన్ దర్శకత్వం వహించిన ఇండియన్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ నామినేషన్ దక్కించుకుంది. గాయపడిన పక్షుల సంరక్షణ కోసం ఢిల్లీకి చెందిన సోదరులు నదీమ్ షెహజాద్, మహమ్మద్ సౌద్ తమ జీవితాలను ఏ విధంగా త్యాగం చేశారు? అన్నదే ఈ డాక్యుమెంటరీ ప్రధాన కథాంశం. గత ఏడాది 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘ఆల్ దట్ బ్రీత్స్’ గోల్డెన్ ఐ అవార్డును సాధించింది. ఇక ఇదే విభాగంలో అమెరికన్ ‘ఫైర్ ఆఫ్ లవ్’, రష్యా ‘నవల్నీ’, ‘ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్పింట్లర్స్’, ‘ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్ షెడ్’ పోటీలో ఉన్నాయి. తప్పిపోయిన ఏనుగు తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ రూ΄÷ందించిన డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’తోపాటు ‘హాలౌట్’, ‘హౌ డు యు మెసర్ ఎ ఇయర్’, ‘ది మార్తా మిచెల్ ఎఫెక్ట్’, ‘స్ట్రేంజర్ ఎట్ ది గేట్’ పోటీలో ఉన్నాయి. లైవ్లో నాటు.. నాటు ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు..’పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్పాడనున్నారు. ఈపాటకు తాను కూడా లైవ్లో పెర్ఫార్మ్ చేయనున్నట్లు ఆమెరికన్ యాక్ట్రస్, డ్యాన్సర్ లారెన్ గాట్లీబ్ వెల్లడించారు. కాగా హిందీలో ‘ఏబీసీడీ’, ‘ఏబీసీడీ 2’ వంటి చిత్రాల్లో నటించారామె. ప్రీ ఆస్కార్పార్టీ అమె రికాలో ప్రీ ఆస్కార్పార్టీ అదిరిపోయే లెవల్లో జరిగింది. ఈపార్టీలో ఎన్టీఆర్, రామ్చరణ్లతోపాటు ప్రియాంకా చో్ర΄ా, ప్రీతి జింతా తదితర ప్రముఖులుపాల్గొన్నారు. లైవ్ ఎన్ని గంటలకు అంటే... సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి భారతీయులు ఆస్కార్ అవార్డు వేడుకను వీక్షించవచ్చు. అవార్డు వేడుక లాస్ ఏంజిల్స్లో ఆదివారం రాత్రి 8 గంటలకు ఆరంభమయ్యే రెండు గంటల ముందు రెడ్ కార్పెట్ సందడి షురూ అవుతుంది. వేడుక దాదాపు 11 గంటలకు ముగిసే అవకాశం ఉంది. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి వేడుకను వీక్షించవచ్చు. డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఏబీసీ నెట్వర్క్ (ఏబీసీ టీవీ, ఏబీసీ.కామ్, ఏబీసీ యాప్, యూట్యూబ్) హులు లైవ్ టీవీ, డైరెక్ట్ టీవీ, ఫ్యూబో టీవీ, ఏటీ అండ్ టీ టీవీలో ఆస్కార్ అవార్డుల వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. అయితే కొన్నింటికి సబ్స్క్రిప్షన్ అవసరమవుతుంది.