physics
-
కొన్ని అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత
సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ–మెయిన్ రెండో దఫా పరీక్షలు మంగళవారం మొదలయ్యాయి. రెండు షిఫ్ట్లలో పరీక్ష నిర్వహించగా.. మొదటి షిఫ్ట్ ప్రశ్నపత్రం ఓ మాదిరి క్లిష్టతతో ఉందని విద్యార్థులు, సబ్జెక్ట్ నిపుణులు చెప్పారు. గత పరీక్షల మాదిరిగానే.. రెండు షిఫ్ట్లలోనూ మ్యాథమెటిక్స్ క్లిష్టత స్థాయి ఓ మాదిరిగా ఉన్నప్పటికీ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. కెమిస్ట్రీలో ప్రశ్నలు సులభంగానే ఉన్నాయి. ఫిజిక్స్ మాత్రం క్లిష్టంగా ఉంది. ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహించిన పరీక్షలతో పోల్చితే మంగళవారం మొదటి షిఫ్ట్ కష్టంగా ఉందని అంటున్నారు. కొన్ని అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతున్నారు. ఫిజిక్స్లో ఆప్టిక్స్ నుంచి 3 ప్రశ్నలు, ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు.మ్యాథమెటిక్స్లో వెక్టార్స్..3డి, కానిక్స్ నుంచి మూడు ప్రశ్నల చొప్పున మాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, సిరీస్, డీఈఎఫ్ ఇంటిగ్రేషన్ల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు. కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ ప్రశ్నలు క్లిష్టంగా ఉండడమే కాకుండా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే ప్రశ్నలు అడగడంతో బోర్డు పుస్తకాలకే పరిమితమైన విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పిరియాడిక్ టేబుల్, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీల నుంచి 3 ప్రశ్నల చొప్పున, అటామిక్ స్ట్రక్చర్, ఫినాల్ – ఈథర్–ఆల్కహాల్, కెమికల్ బాండింగ్ల నుంచి రెండు ప్రశ్నల చొప్పున అడిగారు. రెండో షిఫ్ట్లో కూడా మ్యాథమెటిక్స్ ఓ మాదిరిగా ఉన్నప్పటికీ.. సుదీర్ఘమైన ప్రశ్నలు, కాలిక్యులేషన్స్ అవసరమైన ప్రశ్నలు అడిగారు. కెమిస్ట్రీ సులభంగా, ఫిజిక్స్లో సులభం, ఓ మాదిరి క్లిష్టత గల ప్రశ్నలు ఉన్నాయి. రెండు షిఫ్టుల్లోనూ కొన్ని టాపిక్స్ నుంచే.. మొత్తంగా చూస్తే.. రెండు షిఫ్ట్లలోనూ కొన్ని టాపిక్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఈ క్రమంలో మ్యాథమెటిక్స్లో ఏరియాస్, మాట్రిసెస్ అండ్ డిటర్మినేషన్స్, కానిక్స్, వెక్టార్ అండ్ 3డి జామెట్రీ, కానిక్స్, ఇంటెగ్రల్ కాలక్యులస్కు ఎక్కువ వెయిటేజీ కనిపించింది. కెమిస్ట్రీలో కోఆర్డినేట్ కాంపౌండ్, అటామిక్ స్ట్రక్చర్, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. ఫిజిక్స్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ, థర్మో డైనమిక్స్, ఆప్టిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అదే విధంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లలో కొన్ని ప్రశ్నలు కాసింత తికమక పెట్టేలా అడ్వాన్స్డ్ పరీక్ష స్థాయిలో ఉన్నాయని జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ నిపుణులు ఎం.ఎన్. రావు తెలిపారు. ఫిజిక్స్లో ఫార్ములా బేస్డ్గా డైరెక్ట్ కొశ్చన్స్ లేకపోవడం విద్యార్థులను కొంత ఇబ్బందికి గురి చేసిందని చెప్పారు. కాగా జాతీయ స్థాయిలో బీటెక్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈ పరీక్షలు బుధవారంతో ముగియనున్నాయి. -
ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈజీ
సాక్షి, ఎడ్యుకేషన్ : జేఈఈ–మెయిన్ తొలి దఫా షెడ్యూల్ శుక్రవారం ముగిసింది. మూడోరోజు పేపర్ల సరళిని పరిశీలిస్తే.. మొదటి షిఫ్ట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ క్లిష్టంగా ఉండడమే కాకుండా ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. ఫిజిక్స్లో ఫార్ములా ఆధారిత ప్రశ్నలు అడిగినప్పటికీ.. మొత్తం సులువుగా ఉండడంతో విద్యార్థులు కాసింత ఉపశమనం చెందారు. కెమిస్ట్రీ కూడా సులభంగానే ఉంది. మ్యాథమెటిక్స్లో 3డి, వెక్టార్స్, ఏరియాస్, సీక్వెన్స్, సిరీస్, కానిక్స్, ఇంటిగ్రల్ కాలిక్యులస్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంశాలకు ప్రాధాన్యం లభించింది.ఎందులోంచి ఎన్ని ప్రశ్నలు..తొలి సెషన్లో ఫిజిక్స్లో మోడ్రన్ ఫిజిక్స్ నుంచి 3 ప్రశ్నలు, రే, వేవ్ ఆప్టిక్స్ నుంచి 2 ప్రశ్నలు.. హీట్ అండ్ థర్మో డైనమిక్స్ నుంచి 2 ప్రశ్నలు, ఎలక్ట్రిసిటీ నుంచి 2 ప్రశ్నలు అడిగారు. మిగతా టాపిక్స్ నుంచి ఒక్కో ప్రశ్న అడిగారు. మ్యాథమెటిక్స్లో వెక్టార్స్, 3డి, సిరీస్, ఏరియా, మాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, సెట్స్ రిలేషన్, కానిక్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, డెఫినిట్ ఇన్డెఫినిట్ ఇంటిగ్రేషన్ల నుంచి 2 ప్రశ్నలు చొప్పున అడిగారు. కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్; పిరియాడిక్ క్లాసిఫికేషన్; డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్, ఆల్డిహైడ్స్ – ఫినాల్–కార్బాక్సిలిక్ యాసిడ్; కోఆరి్డనేట్ కాంపౌండ్ల నుంచి 2 ప్రశ్నలు చొప్పున, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 3 ప్రశ్నలు అడిగారు.ఉదయంతో పోల్చితే రెండో షిఫ్ట్ క్లిష్టంగా..ఉదయం షిఫ్ట్తో పోల్చితే రెండో షిఫ్ట్ క్లిష్టంగా ఉంది. మ్యాథమెటిక్స్ ఓ మోస్తరు క్లిష్టతతో సుదీర్ఘ ప్రశ్నలతో ఉండగా, ఫిజిక్స్ కూడా క్లిష్టంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. కెమిస్ట్రీ ఓ మాదిరి క్లిష్టతతో ఉంది. కెమిస్ట్రీలో అత్యధిక ప్రశ్నలు ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ బాండింగ్, కోఆరి్డనేట్ కాంపౌండ్స్, బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, పి–బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి అడిగారు. మ్యాథమెటిక్స్లో ఉదయం మాదిరిగానే టాపిక్స్ ఉన్నాయి. మొత్తం మీద 22 నుంచి 24వ తేదీ వరకు ఆరు షిఫ్ట్లలో నిర్వహించిన పరీక్షల్లో ఆరో షిఫ్ట్ ప్రశ్నపత్రం కష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. మొత్తం ఆరు షిఫ్ట్లలో మూడు సబ్జెక్ట్లలోనూ సిలబస్ పరిధిలో లేనివి మూడు ప్రశ్నల చొప్పున అడిగారు.వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న పరీక్షలు, అదే విధంగా 30వ తేదీన నిర్వహించనున్న పేపర్–2ఎ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్); పేపర్–2బి (బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్) పరీక్షల అడ్మిట్ కార్డులను ఎన్టీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.ఎన్సీఈఆర్టీ పుస్తకాలను అధ్యయనం చేయాలిఈ నెల 28, 29 తేదీల్లో పరీక్షలకు హాజరవనున్న విద్యార్థులు.. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోని బేసిక్ కాన్సెప్ట్సŠ, ఫార్ములాలను అధ్యయనం చేయాలి. అలాగే గత ప్రశ్న పత్రాలు ముఖ్యంగా గత నాలుగేళ్ల ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. ఇప్పటివరకు వచ్చిన ప్రశ్నలు చూస్తే..యావరేజ్ స్టూడెంట్స్ 40, 45 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే విధంగా ఉన్నాయి. దీంతో ఎన్ఐటీ లేదా ట్రిపుల్ ఐటీల్లో సీటు పొందే అవకాశం ఉంది. 100 నుంచి 105 మార్కులు పొందితే అడ్వాన్స్డ్కు అర్హత సాధించే అవకాశం ఉంది. గత ఏడాది జనరల్ కటాఫ్ 93 శాతంగా ఉంది. అంటే క్లిష్టమైన, సులభమైన పేపర్ల మధ్య 40 నుంచి 60 మార్కుల వ్యత్యాసం ఉంటుందని గుర్తించాలి. – ఎంఎన్ రావు (జేఈఈ–మెయిన్, అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ) -
రెండు సెషన్లూ క్లిష్టంగానే..!
సాక్షి ఎడ్యుకేషన్: జేఈఈ మెయిన్ రెండోరోజు గురువారం రెండు సెషన్ల పరీక్షలూ మొదటి రోజుతో పోల్చితే క్లిష్టంగా ఉన్నా యని సబ్జెక్ట్ నిపుణులు తెలిపారు. మొదటిరోజు మాదిరిగానే రెండోరోజు కూడా మ్యాథమెటిక్స్ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో అభ్యర్థులకు సమయం సరిపోలేదు. తొలి సెషన్లో విద్యార్థులు 55 నుంచి 60 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగారు. ఫిజిక్స్లో కొన్ని సులభంగా, మరికొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. కెమిస్ట్రీలో ప్రశ్నలన్నీ ఓ మోస్తరు క్లిష్టతతో అడిగారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్లో ద్వితీయ సంవత్సరం సిలబస్కు ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు.కొన్ని టాపిక్స్కు ఎక్కువ ప్రాధాన్యతరెండు సెషన్లలోనూ.. మూడు సబ్జెక్ట్ల ప్రశ్నలను పరిశీలిస్తే కొన్ని టాపిక్స్కు ఎక్కువ ప్రాధాన్యత కనిపించింది. మ్యాథమెటిక్స్లో సిరీస్ (2 ప్రశ్నలు), ఇంటిగ్రెల్ కాలిక్యులస్ (4 ప్రశ్నలు), 3–డి వెక్టార్ అల్జీబ్రా (3 ప్రశ్నలు), కానిక్స్ (3 ప్రశ్నలు)కు ప్రాధాన్యత ఇచ్చారు. సిరీస్, కానిక్స్, పెర్ముటేషన్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. అయితే ఈ సబ్జెక్ట్లో దాదాపు ఏడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టింది. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ (9 ప్రశ్నలు), పిరియాడిక్ టేబుల్ (2 ప్రశ్నలు), అటామిక్ స్ట్రక్చర్ (2 ప్రశ్నలు), కెమికల్ బాండింగ్ (2 ప్రశ్నలు)కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ఫిజిక్స్లో హీట్ అండ్ థర్మో డైనమిక్స్ (2 ప్రశ్నలు), ఎలక్ట్రిసిటీ (3 ప్రశ్నలు), ఏసీ సర్క్యూట్ (2 ప్రశ్నలు)కు వెయిటేజీ లభించింది. 50% ప్రశ్నలు ఫార్ములా, కాన్సెప్ట్స్ ఆధారంగానే..ఫిజిక్స్, కెమిస్ట్రీలలో దాదాపు 50 శాతం ప్రశ్నలు డైరెక్ట్ ఫార్ములా, కాన్సెప్ట్ ఆధారంగా సమాధానం ఇవ్వాల్సినవే ఉన్నాయి. దీంతో సబ్జెక్ట్ను పూర్తిగా చదివిన వారికే సమాధానం ఇచ్చే నేర్పు ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండోరోజు కూడా 2021, 2022 జేఈఈ మెయిన్ పేపర్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు అడగడం గమనార్హం. అదే విధంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే అన్ని ప్రశ్నలు ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు ఎంఎన్ రావు తెలిపారు. పరీక్షకు సాధారణ స్థాయిలో ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులకు 120 మార్కులు, పూర్తి స్థాయి పట్టు సాధించిన వారికి 270కు పైగా మార్కులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.బెంగళూరు సెంటర్లో రీ షెడ్యూల్ఈ నెల 22వ తేదీన బెంగళూరులోని ఒక పరీక్షా కేంద్రంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా మొదటి సెషన్ పరీక్ష నిలిచిపోయింది. దీంతో ఆ సెంటర్లోని 114 మంది విద్యార్థులకు ఈ నెల 28 లేదా 29న పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. -
మ్యాథ్స్లో కొంత క్లిష్టత ఫిజిక్స్ సులభం
సాక్షి, ఎడ్యుకేషన్: జేఈఈ–మెయిన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రతిష్టాత్మక ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్లలో బీటెక్ చేసేందుకు, అదే విధంగా ఐఐటీల్లో బీటెక్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్డ్కు అర్హత పరీక్షగా ఎన్టీఏ ఏటా రెండుసార్లు దీనిని నిర్వహిస్తోంది. మొదటి దఫా పరీక్షకు జాతీయ స్థాయిలో 13.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో దాదాపు 2 లక్షల మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉంటారని అంచనా. 23, 24, 28, 29, 30 తేదీల్లో కూడా రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. 300 మార్కులకు పరీక్ష మూడు సబ్జెక్ట్లలో 300 మార్కులకు పరీక్ష నిర్వహించారు. మ్యాథమెటిక్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25 ప్రశ్నలు చొప్పున మొత్తం 75 ప్రశ్నలతో ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున పరీక్ష నిర్వహించారు. కాగా ప్రశ్నల క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉందని, ఎన్సీఈఆర్టీ పుస్తకాలు, గత ప్రశ్న పత్రాలు సాధన చేసిన వారికి కొంత మేలు కలిగించేదిగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. రెండు సెషన్లలోనూ మ్యాథమెటిక్స్ విభాగం ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నప్పటికీ.. ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండడంతో కొందరు విద్యార్థులకు జవాబులిచ్చేందుకు సమయం సరిపోలేదు. ఫిజిక్స్ విభాగం ప్రశ్నలు సులభంగా, కెమిస్ట్రీలో కొన్ని సులభంగా, కొన్ని ఓ మోస్తరు క్లిష్టతతో ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 50 శాతం ప్రశ్నలు చాలా సులభంగా ఉండడం విద్యార్థులకు ఉపశమనం కలిగించింది. ఈ రెండు విభాగాల ప్రశ్నలకు అభ్యర్థులు 45 నిమిషాల చొప్పున సమయంలో జవాబులు ఇవ్వగలిగారు. అయితే మిగతా గంటన్నర సమయంలో మ్యాథమెటిక్స్లో 15 నుంచి 20 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు. ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉండడమే ఇందుకు కారణంగా సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే కెమిస్ట్రీ ప్రశ్నలు.తొలిరోజు రెండు సెషన్లలోనూ ప్రశ్నలు జేఈఈ–మెయిన్ గత ప్రశ్నపత్రాల నుంచే ఎక్కువగా అడిగారు. ముఖ్యంగా 2021, 2022 ప్రశ్నలకు సరిపోలే విధంగా చాలా ప్రశ్నలు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. ఇక కెమిస్ట్రీలో అధిక శాతం ప్రశ్నలు ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే.. డైరెక్ట్ కొశ్చన్స్గా అడగడంతో ప్రాక్టీస్ చేసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 35 శాతం, ఇన్–ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 30 శాతం ప్రశ్నలున్నాయి. కెమికల్ బాండింగ్, బయో మాలిక్యూల్స్, మోల్ కాన్సెప్ట్, కాటలిస్ట్సŠ, వేవ్ లెంగ్త్, ఎస్ఎంఆర్, పొటెన్షియల్ మీటర్, కెమికల్ ఈక్వేషన్ ఎనర్జీ, రేడియో యాక్టివ్ డికే, ఆర్గానిక్ కెమిస్ట్రీ (3 ప్రశ్నలు), కో ఆర్డినేట్ కాంపౌండ్, ఆక్సిడేషన్ స్టేట్ల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఫిజిక్స్, మ్యాథ్స్లో ఇలా.. ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్, ప్రొజెక్టైల్ మోషన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్, డయోడ్స్, ఈఎం వేవ్స్, మోడ్రన్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, సెమీ కండక్టర్స్, హీట్ ట్రాన్స్ఫర్, ఏసీ సర్క్యూట్, డైమెన్షనల్ ఫార్ములా, ఫోర్స్, మూమెంట్ ఆఫ్ ఇనెర్షియా ఆఫ్ స్పియర్ నుంచి ప్రశ్నలు అడిగారు. మ్యాథ్స్లో స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, సింపుల్ ప్రాబ్లమ్, వెక్టార్, 3డి జామెట్రీ, షార్టెస్ట్ డిస్టెన్స్ ప్రాబ్లమ్, మాట్రిసెస్, డిటర్మినెంట్స్, బయనామియల్ థీమర్, ట్రిగ్నోమెట్రీ, క్వాడ్రాట్రిక్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్, సిరీస్, పారాబోలా, ఏరియా ఆఫ్ సర్కిల్, పెర్ముటేషన్, హైపర్ బోలా, డిఫరెన్షియల్ ఈక్వేషన్, సర్కిల్ ఇంటర్సెక్టింగ్ ప్రాబ్లమ్స్ అడిగారు. అడ్వాన్స్డ్కు కటాఫ్ అంచనా ఇలా.. జేఈఈ అడ్వాన్స్డ్కు కటాఫ్ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే.. జనరల్ కేటగిరీలో 91–92 మార్కులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 79–80, ఓబీసీ కేటగిరీలో 77–78, ఎస్సీ కేటగిరీలో 56–58, ఎస్టీ కేటగిరీలో 42–44 మార్కులు కటాఫ్గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
కెమిస్ట్రీ పాఠాన్ని ఇలా కూడా బోధిస్తారా? ఆ టీచర్ వేరే లెవల్!
ఉపాధ్యాయుల బోధనా పద్ధతులన్నీ.. విద్యార్థులకు విపులంగా అర్థం కావాడమే ప్రధాన అంశం. అందుకోసం ఒక్కొక్క టీచర్ ఒకో పంథాలో తమ క్లాస్ని చెబుతుంటారు. కొందరు టీచర్లు చెప్పే బోధనా పద్ధతి విద్యార్థులకు బోరింగ్ ఫీలింగ్ కలగుకుండా ఆ సబ్జెక్ట్పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. అచ్చం అలానే ఓ ఫిజిక్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు రసాయన శాస్త్రంలోని ఓ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం కావాలని ఎంతలా కష్టపడ్డాడో చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే.ఎలా చెప్పారంటే..ప్రముఖ ఎడ్ టెక్కి చెందిన ఒక ఫిజిక్స్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు కెమిస్ట్రీలోని చిరాలటీ కాన్సెప్ట్ని బోధిస్తున్నారు. చిరాలటీలో అణువులు ఒక చిరాల్ కేంద్రాన్ని కలిగి ఉంటాయి. అద్దంలో అతిగా ఇంపోజ్ కావు. కాకపోతే రసాయన చర్యలో ఎడమ, కుడిగా కుడి ఎడమ గానూ అద్దంలో కనిపించే చిత్రంలాగా కనిపిస్తుంది. అదే దీని ప్రత్యేకత. ఇది విద్యార్థులకు అర్థమయ్యేలా తన శరీర భంగిమలతో క్లియర్గా వివరించారు. చెప్పాలంటే తన బోధనలో యోగాని కూడా మిళితం చేసి చెబుతున్నట్లుగా వివరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ ఉపాధ్యాయుడికి తన వృత్తిపై ఉన్న అభిరుచి, నిబద్ధతలను ప్రశంసిచగా, మరికొందరు ఇంతలా కష్టపడటం ఎందుకు త్రీడీ వస్తువులతో లేదా ఏదైనా ప్లాస్టిక్ వస్తువులను ఉదాహరణగా తీసుకుని చెబితే సరి అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.Absolute cinema 🎥 pic.twitter.com/KkhZwOr9dD— Priyanka 🪷 (@Oyepriyankasun) December 14, 2024 (చదవండి: 20 ఏళ్లకే డాక్టర్, 22 ఏళ్లకు ఐఏఎస్ ఆఫీసర్..ఇవాళ ఏకంగా..!) -
భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి
2024 సంవత్సరానికిగానూ భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది. జాన్ జోసెఫ్ హాప్ఫీల్డ్, జెఫ్రీ ఎవరెస్ట్ హింటనల్కు ఈ పురస్కారం దక్కింది. కృత్రిమ న్యూరల్ నెట్వర్క్లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలు చేసినందుకుగానూ వీరిద్దరికి ఈ ఏడాది నోబెల్ ప్రకటిస్తున్నట్లు స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది.కాగా గతేడాది భైతిక శాస్తంలో ఈ పురస్కారం ముగ్గురిని వరించింది. 1901 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 117సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు. ఇక సోమవారం మెడిసిన్ విభాగంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్కున్లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. వీటిని ఆల్ఫ్రెడ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 10న విజేతలకు బహుమతులు అందజేస్తారు. -
ఒక్క డీల్తో దూసుకెళ్లిన ఫిజిక్స్వాలా
న్యూఢిల్లీ: ఎడ్టెక్ యూనికార్న్ ఫిజిక్స్వాలా తాజాగా రూ.1,753 కోట్ల నిధులను సమీకరించింది. సిరీస్–బి రౌండ్లో హార్న్బిల్ క్యాపిటల్, లైట్స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, జీఎస్వీ, వెస్ట్బ్రిడ్జ్ ఈ మొత్తాన్ని అందించాయి. ఈ డీల్తో కంపెనీ విలువ ఏడాదిలో రెండున్నర రెట్లు దూసుకెళ్లి రూ.23,380 కోట్లకు చేరింది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి ఇక అన్నీ మంచి రోజులేనా?పెద్ద సంస్థల వాల్యుయేషన్లో గణనీయమైన తగ్గుదల కారణంగా భారతీయ ఎడ్టెక్ రంగంలో పెద్ద ఎత్తున నిధుల కొరత చాలా కాలంగా ఉంది. ‘ఎడ్టెక్ రంగానికి సవాలుగా ఉన్న ప్రస్తుత సమయంలో తాజా ఫండింగ్ రౌండ్ ఆశావాదానికి దారితీసింది. కంపెనీ అభివృద్ధి, దేశం అంతటా విద్యను ప్రజాస్వామ్యం చేయాలనే లక్ష్యంపై ఇప్పటికే ఉన్న, కొత్త పెట్టుబడిదారుల అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనం’ అని ఫిజిక్స్వాలా తెలిపింది. -
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్ వాలా పిలుపు
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్ధుల్లారా.. మీరెక్కడున్నా దేశానికి తిరిగి వచ్చేయండి. దేశ సేవ చేయండి. దేశ అభివృద్దిలో పాలు పంచుకోండి అంటూ ప్రముఖ ఎడ్యుటెక్ ఫిజిక్స్ వాల వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే పిలుపునిచ్చారు.యూఎస్లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు దేశ సేవ చేయాలని అలఖ్ పాండే కోరారు. తిరిగి రాలేని వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అలఖ్ పాండే ఇటీవల హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ క్యాంపస్లలో భారతీయ విద్యార్ధులతో దిగిన ఫోటోల్ని, అనుభవాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవును, మన దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఏ దేశం పరిపూర్ణంగా లేదు. కానీ యువత దేశాన్ని మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah) -
రూ.5 వేల జీతానికి నానా అగచాట్లు.. ఇప్పుడు ఏకంగా...
సాధారణంగా ప్రైవేటు టీచర్లంటే చిన్నచూపు ఉంటుంది. తక్కువ జీతం ఉంటుందని, పెద్దగా సంపాదన ఉండదని భావిస్తారు. కానీ టీచింగ్తోనే ఎడ్టెక్ సంస్థలు పెట్టి రూ.కోట్లు సంపాదిస్తున్న వారూ ఉన్నారు. వారిలో దేశంలోనే రిచెస్ట్ టీచర్గా నిలిచిన ఓ వ్యక్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సంపన్న ఉపాధ్యాయుడిగా నిలిచారు ఫిజిక్స్వాలా ( PhysicsWallah ) వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్ పాండే ( Alakh Pandey ). అయితే దేశంలో రిచెస్ట్ టీచర్ బైజూస్ రవీంద్రన్ అని చాలామంది వాదించవచ్చు. కానీ ఇప్పుడు ఆ టైటిల్ ఆయనది కాదు. ఫోర్బ్స్ ప్రకారం బైజూస్ పతనం తర్వాత, దాని నికర విలువ కూడా రూ. 830 కోట్లకు పడిపోయింది. అంటే రూ. 2000 కోట్ల కంటే ఎక్కువ నెట్వర్త్ ఉన్న అలఖ్ పాండేనే దేశంలోనే అత్యంత ధనిక ఉపాధ్యాయుడు. ప్రముఖ ఉపాధ్యాయుడు, ఎంటర్ప్రిన్యూర్గా పేరొందిన అలఖ్ పాండే సాధారణంగా లైమ్లైట్కు దూరంగా ఉంటారు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖలో ఈ స్టార్టప్ నమోదై ఆయన వార్షిక వేతనం వెల్లడి కావడంతో వార్తల్లోకి వచ్చారు. భారతీయ టెక్, స్టార్టప్ సంస్థల సమాచారం అందించే ‘Inc42’ నివేదిక ప్రకారం.. అలఖ్ పాండే వేతనం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ. 9.6 కోట్లు. దీంట్లో ఆయన రూ.5 కోట్లను తగ్గించుకున్నారు. అయినప్పటికీ 2023 ఆర్థిక సంవత్సరంలో అలఖ్ పాండే వేతనం రూ. 4.57 కోట్లు. ఇంత ఆదాయం ఉన్న అలఖ్ పాండే మొదటి సంపాదన ఎంతో తెలుసా.. కేవలం రూ.5 వేలు. అది కూడా చాలా మంది పిల్లలకు ట్యూషన్లు చెప్పడం ద్వారా వచ్చేది. యాక్టర్ కావాలనుకున్నాడు దేశంలో 101వ యునికార్న్ కంపెనీ ఫిజిక్స్వాలాను స్థాపించిన అలఖ్ పాండే ఒక టీచర్గానే చాలా మందికి తెలుసు. అయితే యాక్టర్ కావాలన్నది తన కల అని ఎంత మందికి తెలుసు? అలహాబాద్లో జన్మించిన అలఖ్ పాండే యాక్టర్ అవ్వాలనే కోరికతో నుక్కడ్ నాటకాల్లో పాల్గొనేవాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో 8వ తరగతి నుంచే ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. అలఖ్ పాండే, ఆయన సోదరి చదువుల కోసం వారి తల్లిదండ్రులు తమ ఇంటిని అమ్మేశారు. అలఖ్ పాండే చాలా చురుకైన విద్యార్థి. 10వ తరగతిలో 91 శాతం, 12వ తరగతిలో 93.5 శాతం మార్కులు వచ్చాయి. కోటి మందికిపైగా సబ్స్క్రైబర్లు ఐఐటీలో చేరాలనుకున్న అలఖ్ పాండే కాన్పూర్లోని హార్కోర్ట్ బట్లర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. అయితే, కోర్సు మూడవ సంవత్సరం తర్వాత కాలేజీ మానేశాడు. 2017లో యూపీలో ఒక చిన్న గది నుంచి యూట్యూబ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అలాఖ్ పాండే వీడియోలు చాలా విజయవంతమయ్యాయి. ఎంతగా అంటే ఓ ఎడ్-టెక్ కంపెనీని ప్రారంభించేంతలా. ఇందులో ఇప్పుడు 500 మందికి పైగా టీచర్లు, 100 మంది టెక్నికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. యూట్యూబ్లో ఫిజిక్స్వాలా చానల్కు కోటి మందికిపైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. -
ఎలక్ట్రాన్ల ప్రపంచానికి కొత్త ‘కాంతి పుంజం’
ఫిజిక్స్లో ముగ్గురికి నోబెల్ భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పియరీ అగోస్తినీ, జర్మనీలోని మాక్స్ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ ఆప్టిక్స్, లుడ్వింగ్ మాక్సిమిలియన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్కు చెందిన ఫెరెంక్ క్రౌజ్, స్వీడన్లోని లుండ్ యూనివర్సిటీకి చెందిన అన్నె ఎల్ హుయిలర్ను ఈ బహుమతి వరించింది. 24 ఫ్రేమ్స్ గురించి మీరు వినే ఉంటారు. సెకనుకు ఇరవై నాలుగు ఫ్రేమ్ల చొప్పున రీలు తిరిగితే తెరపై బొమ్మ, ఆట, పాట, మాట అన్నీ సవ్యంగా కనిపిస్తాయి! సినిమాకైతే ఇలా ఓకే కానీ పరమాణువుల్లోని ఎల్రక్టాన్లను చూడాలనుకోండి లేదా వాటి కదలికలను అర్థం చేసుకోవాలనుకోండి. అస్సలు సాధ్యం కాదు! ఈ అసాధ్యాన్నీ సుసాధ్యం చేయడంలో కీలకపాత్ర పోషించారు కాబట్టే పియరీ అగోస్తినీ, ఫెరెంక్ క్రౌజ్, అనే ఎల్ హుయిలర్ చేసిన ప్రయోగాలకు ఈ ఏటి భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. ఇంతకీ ఏమిటీ ప్రయోగాలు? వాటి ప్రయోజనాలేమిటి? అట్టోసెకను ఫిజిక్స్ ఒక సెకను కాలంలో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో మీకు తెలుసా? మూడు లక్షల కిలోమీటర్లకు పిసరంత తక్కువ. మరి అట్టోసెకను కాలంలో? సెకను.. అర సెకను.. పావు సెకను తెలుసు కానీ ఈ అట్టోసెకను ఏమిటి? 3,711 కోట్ల సంవత్సరాల కాలంలో ఒక సెకను ఎంతో సెకనులో అట్టోసెకను అంతన్నమాట! ఇంకోలా చెప్పాలంటే.. టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 18. గందరగోళం లేకుండా ఉండాలని అనుకుంటే.. సూక్ష్మాతి సూక్ష్మమైన కాలావధి అని అనుకుందాం. ఇంత తక్కువ సమయంలోనూ కాంతి 0.3 మైక్రోమీటర్లు లేదా ఒక వైరస్ పొడవు అంత దూరం ప్రయాణించగలదు. ఈ సంవత్సరం భౌతికశాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఇంత సూక్ష్మస్థాయిలో కాంతి పుంజాలను విడుదల చేయగల టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించారు. ముందుగా చెప్పుకున్నట్లు ఎల్రక్టాన్ల కదలికలు, కాంతికి, పదార్థానికి మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఈ అట్టోసెకను ఫిజిక్స్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. వీరి ప్రయోగాల పుణ్యమా అని అణువులు, పరమాణువుల లోపలి కణాలను మరింత క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. కాంతి పుంజాల విశ్లేషణ 2001లో అమెరికాకు చెందిన పియరీ అగోస్తినీ ఈ అట్టోసెకను కాంతి పుంజాలను ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా సుమారు 250 అట్టోసెకన్ల కాలం ఉండే కాంతి పుంజాలను విశ్లేషించడంలోనూ విజయం సాధించారు. ఈ కాలంలోనే జర్మనీకి చెందిన ఫెరెంక్ క్రౌజ్ కూడా ఈ అట్టోసెకను కాంతి పుంజాలపై పరిశోధనలు చేస్తూండేవారు. కాకపోతే ఈయన 650 అట్టోసెకన్ల కాలపు కాంతి పుంజాన్ని వేరు చేయడంలో విజయవంతం కావడం గమనార్హం. ఒకప్పుడు అసాధ్యం అని అనుకున్న ప్రాసెస్లను కూడా గమనించడం ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల వల్ల ఇప్పుడు వీలైంది. ‘‘ఎలక్ట్రాన్ల ప్రపంచానికి ఈ ప్రయోగాలు తలుపులు తెరిచాయి. అట్టోసెకన్ ఫిజిక్స్ ద్వారా ఎల్రక్టాన్లలో జరుగుతున్న కార్యకలాపాలను గమనించడం వీలైంది. ఇకపై ఈ విషయాలను వాడుకోవడం ఎలా? అన్నది మొదలవుతుంది’’ అని నోబెల్ అవార్డు భౌతిక శాస్త్ర కమిటీ అధ్యక్షులు ఎవా ఓల్సన్ వ్యాఖ్యానించడం విశేషం. వ్యాధుల నిర్ధారణలోనూ ఉపయోగకరం ఈ అట్టోసెకను ఫిజిక్స్ను ఎల్రక్టానిక్స్లో సమర్థంగా ఉపయోగించుకునేందుకు అవకాశముంది. ఎల్రక్టాన్లు ఏ రకమైన పదార్థంతో ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోగలిగితే.. అతితక్కువ విద్యుత్తును ఉపయోగించుకుని మరింత సమర్థంగా పనిచేయగల ఎల్రక్టానిక్ పరికరాలను తయారు చేయడం వీలవుతుంది. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే మనం విద్యుత్తు అంటామన్నది తెలిసిందే. వేర్వేరు మూలకాలను గుర్తించేందుకు అట్టోసెకను కాంతి పుంజాలు ఉపయోగపడతాయి కాబట్టి.. భవిష్యత్తులో వ్యాధుల నిర్ధారణకు కూడా వీటిని వాడుకోవడం వీలవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ 1987లో శ్రీకారం అట్టోసెకను కాలపు కాంతి పుంజాలతో ఫొటోలు తీస్తే అణువులు, పరమాణువుల్లో జరిగే కార్యకలాపాలేమిటన్నది స్పష్టంగా తెలుస్తాయి. ఈ అట్టోసెకను కాంతి పుంజాల తయారీకి 1987లో స్వీడన్కు చెందిన ఎల్ హుయిలర్ శ్రీకారం చుట్టారని చెప్పాలి. అప్పట్లో ఈ శాస్త్రవేత్త జడ వాయువు గుండా పరారుణ కాంతిని ప్రసారం చేసినప్పుడు వేర్వేరు ఛాయలున్న రంగులు బయటకొస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో ఛాయ పరారుణ కాంతి జడ వాయువులోని పరామాణువులతో జరిపిన పరస్పర చర్యల ఫలితం. కొన్ని ఎల్రక్టాన్లు ఈ లేజర్ కిరణాల ద్వారా అదనపు శక్తి పొంది దాన్ని విడుదల చేస్తూంటాయి అన్నమాట. ఈ అంశంపై ఎల్ హుయిలర్ తన ప్రయోగాలు కొనసాగించగా ఆ తరువాతి కాలంలో అనేక కీలకమైన ఫలితాలు లభించాయి. సెకను కంటే తక్కువ సమయాన్ని ఇలా సూచిస్తారు సెకనులో వెయ్యో వంతు... ఒక మిల్లీ సెకను మిల్లీ సెకనులో వెయ్యో వంతు.. ఒక మైక్రో సెకను ఒక మైక్రో సెకనులో వెయ్యో వంతు... ఒక నానో సెకను ఒక నానో సెకనులో వెయ్యో వంతు.. ఒక పికో సెకను ఒక పికో సెకనులో వెయ్యో వంతు.. ఒక ఫెమ్టో సెకను (లాసిక్ కంటి శస్త్రచికిత్సల్లో ఈ స్థాయి లేజర్ కిరణాలను వాడతారు) ఒక ఫెమ్టో సెకనులో వెయ్యో వంతు.. ఒక అట్టో సెకను -
Nobel Prize 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
స్టాక్హోమ్: ఆయా రంగాల్లోని ప్రజ్ఞావంతులకు నోబెల్ పురస్కారాలను అందించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే క్రమంలో 2023 సంవత్సరానికిగాను భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ నోబెల్ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, ఎల్'హ్యులియర్లకు 'ఒక పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్'పై చేసిన విస్తృత పరిశోధనలకుగాను వీరిని నోబెల్ బహుమతి వరించింది. BREAKING NEWS The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 #NobelPrize in Physics to Pierre Agostini, Ferenc Krausz and Anne L’Huillier “for experimental methods that generate attosecond pulses of light for the study of electron dynamics in matter.” pic.twitter.com/6sPjl1FFzv — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 విభిన్న రంగాల్లోని ప్రతిభావంతులకు నోబెల్ అవార్డులను ప్రకటించే ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా మొదట వైద్య రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించింది కమిటీ. ఈరోజు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తలు పేర్లను ప్రకటించారు. కాగా ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటించడం విశేషం. వీరు ఒక పదార్ధంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్లను అధ్యయనం చేసేందుకు అట్టోసెకెండ్ పల్సెస్ డెవలప్మెంట్పై చేసిన ప్రయోగాలకుగాను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 2023 physics laureate Pierre Agostini succeeded in producing and investigating a series of consecutive light pulses, in which each pulse lasted just 250 attoseconds. At the same time, his 2023 co-laureate Ferenc Krausz was working with another type of experiment, one that made it… pic.twitter.com/pEFAM0ErNP — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 వీరిలో ఎల్'హ్యులియర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఐదవ మహిళగా ఘనత సాధించారు. 1903లో మేరీ క్యురీ, 1963లో మరియా గొప్పెర్ట్-మేయర్, 2018లో డొన్నా స్ట్రిక్లాండ్, 2020లో ఘెజ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలను సాధించగా 2023 సంవత్సరానికి గాను హ్యులియర్ ఈ పురస్కారాన్ని సాధించి చరిత్రలో చోటు సంపాదించారు. Electrons’ movements in atoms and molecules are so rapid that they are measured in attoseconds. An attosecond is to one second as one second is to the age of the universe.#NobelPrize pic.twitter.com/5Bg9iSX5eM — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 This year’s #NobelPrize laureate in physics Anne L’Huillier discovered that many different overtones of light arose when she transmitted infrared laser light through a noble gas. Each overtone is a light wave with a given number of cycles for each cycle in the laser light. They… pic.twitter.com/bJWD4kiE5Z — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించే క్రమంలో ఇప్పటికే వైద్య, భౌతిక రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించిన కమిటీ బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి రంగాల్లో బహుమతుల విజేతలను ప్రకటించనుంది. చివరిగా ఈ నెల 9న అర్థశాస్త్రంలో విజేతను ప్రకటించనుంది జ్యురీ. నోబెల్ విజేతలకు డిసెంబర్ 10న బహుమతులను ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి ఆ బహుమతిని మరింత పెంచుతూ 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. ఇది కూడా చదవండి: పాక్లో జోరుగా కిడ్నీల దోపిడీ.. 328 సర్జరీలు..? -
నోబెల్ 2022: ఫిజిక్స్లో ముగ్గురికి ప్రైజ్
స్టాక్హోమ్: భౌతిక శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్ బహుమతిని ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కమిటీ ఈ ప్రకటన చేసింది. భౌతిక శాస్త్ర మేధావులు అలెయిన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్. క్లౌజర్, ఆంటోన్ జెయిలింగర్లకు సంయుక్తంగా ఈసారి ప్రైజ్ దక్కింది. చిక్కుబడ్డ ఫోటాన్లు, బెల్ అసమానతలను ఉల్లంఘించడం, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్కు మార్గదర్శకత్వం వహించడం లాంటి పరిశోధలకుగానూ ఈ ముగ్గురికి ఈసారి నోబెల్ పురస్కారం దక్కింది. వీళ్ల ప్రయోగాత్మక సాధనాల అభివృద్ధి ‘క్వాంటం టెక్నాలజీ’ కొత్త శకానికి పునాది వేసిందని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటన సమయంలో పేర్కొంది. ఫ్రాన్స్కు చెందిన భౌతిక శాస్త్రవేత్త అలెయిన్ ఆస్పెక్ట్ కాగా.. జాన్ ఎఫ్. క్లౌజర్ అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఇక ఆంటోన్ జెయిలింగర్ ఆస్ట్రియాకు చెందిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త. BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 #NobelPrize in Physics to Alain Aspect, John F. Clauser and Anton Zeilinger. pic.twitter.com/RI4CJv6JhZ — The Nobel Prize (@NobelPrize) October 4, 2022 చిక్కుకుపోయిన క్వాంటం స్థితులను ఉపయోగించి సంచలనాత్మక ప్రయోగాలను నిర్వహించారు ఈ ముగ్గురు. ఇక్కడ రెండు కణాలు విడిపోయినప్పుడు కూడా ఒకే యూనిట్గా ప్రవర్తిస్తాయి. ఈ ముగ్గురి సాధన ఫలితాలు.. క్వాంటం సమాచారం ఆధారంగా కొత్త సాంకేతికతకు మార్గం క్లియర్ చేశాయి అని నోబెల్ కమిటీ ప్రకటించింది. ► కిందటి ఏడాది కూడా ఫిజిక్స్లో ముగ్గురికే సంయుక్తంగా అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ► 1901 నుంచి ఇప్పటిదాకా భౌతిక శాస్త్రంలో 115 బహుమతులను ఇచ్చారు. ఇందులో నలుగురు గ్రహీతలు మాత్రమే మహిళలు. మేడమ్ క్యూరీ(1903), మారియా జియోప్పెర్ట్ మయర్(1963), డొన్నా స్ట్రిక్ల్యాండ్(2018), ఆండ్రియా గెజ్(2020) ఈ లిస్ట్లో ఉన్నారు. ► ఇక ఫిజిక్స్లో చిన్నవయసులో నోబెల్ ఘనత అందుకుంది లారెన్స్ బ్రాగ్. కేవలం పాతికేళ్ల వయసుకే ఇతను 1915లో ఫిజిక్స్ నోబెల్ అందుకున్నాడు. -
ఫామ్లోనే లేడు.. పాఠ్య పుస్తకాల్లోకి మాత్రం ఎక్కాడు
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ప్రస్తుత తరంలో టాప్ క్రికెటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అయితే కొంతకాలంగా బాబర్ ఆజం నిరాశజనక ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇటీవలే ముగిసిన ఆసియా కప్లో కెప్టెన్ హోదాలో జట్టును ఫైనల్ చేర్చినప్పటికి.. బ్యాటింగ్లో ఘోర ప్రదర్శన చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయని బాబర్ ఆజం.. ఆరు మ్యాచ్లు కలిపి 68 పరుగులు మాత్రమే చేశాడు. ఆరు ఇన్నింగ్స్ల్లో వరుసగా 10,9 14, 0,30, 5 పరుగులు ఉన్నాయి. ఇందులో ఒక గోల్డెన్ డక్ ఉండడం విశేషం. అయితే ఆట ఎలా ఉన్నా బాబర్ ఆజం షాట్స్ మంచి టెక్నిక్తో కూడుకొని ఉంటాయి. ముఖ్యంగా బాబర్ ఆజం కవర్ డ్రైవ్ షాట్ చూడముచ్చటగా ఉంటుంది. అందుకే అతని కవర్డ్రైవ్ షాట్ క్రికెట్కు మాత్రమే పరిమితం కాలేదు. తాజాగా తన దేశంలోని పాఠ్య పుస్తకాల్లో బాబర్ ఆజం పేరు దర్శనమిచ్చింది. అవునండీ.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. బాబర్ ఆజం కవర్ డ్రైవ్ గురించి 9వ తరగతి ఫిజిక్స్ సిలబస్లో ఒక ప్రశ్న తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ''బాబర్ ఆజం తన బ్యాట్ ద్వారా బంతికి 150 జౌల్స్తో కైనటిక్ ఎనర్జీ అందించడం ద్వారా కవర్ డ్రైవ్ను కొట్టాడు. (ఎ) బంతి ద్రవ్యరాశి 120 గ్రా అయితే బంతి ఏ వేగంతో బౌండరీకి వెళుతుంది? (బి) 450గ్రా ద్రవ్యరాశి కలిగిన ఫుట్బాల్ను ఈ వేగంతో తరలించడానికి ఫుట్బాల్ క్రీడాకారుడు ఎంత కైనటిక్ ఎనర్జీ అందించాలి?" అంటూ ఒక ప్రశ్న వచ్చింది. దీనిపై అభిమానులు మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. ''ఫామ్లోనే లేడు.. అయినా పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కాడు.. దీనికి అతను అర్హుడేనా'' అంటూ కామెంట్ చేశారు. Babar Azam's cover drive related question in 9th grade physics syllabus (federal board) (via Reddit) pic.twitter.com/I2Tc9HldsG — Shiraz Hassan (@ShirazHassan) September 13, 2022 చదవండి: స్మృతి మందాన మెరుపులు.. ఇంగ్లండ్పై ఘన విజయం -
సాహో... ప్రొఫెసర్ శాంతమ్మ!
‘‘కుదిరితే పరిగెత్తు..లేకపోతే నడువు..అదీ చేతకాకపోతే పాకుతూ పో..అంతేకాని ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు’’..అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలను ఆమె అక్షరాలా అమలు చేస్తున్నారు. 93 ఏళ్ల వయసులోనూ మొక్కవోని దీక్షతో రోజూ రానూపోనూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు చెబుతున్నారు. కాలం ఎంతో విలువైనదని..దానిని ఎప్పుడూ, ఎవరూ వృథా చేయకూడదని చెబుతున్న ఆమె పేరు ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ. పంచే కొద్దీ జ్ఞానం పెరుగుతుందని నమ్మే శాంతమ్మ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించగా విజయనగరం జిల్లా సెంచూరియన్ యూనివర్శిటీలో రెండు ఊత కర్రల సాయంతో నడుస్తూ... విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు బోధిస్తూ కనిపించారామె. వయసు మీదపడిందనే సంకోచం ఏమాత్రం ఆమెలో కనిపించలేదు. ఈ వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో అధ్యాపకురాలిగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శాంతమ్మ తన జీవన ప్రయాణం గురించి ‘సాక్షిప్రతినిధి’కి చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘మా స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం..1929 మార్చి 8న జన్మించాను. నా తండ్రి సీతారామయ్య, న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు. నేను ఐదు నెలల పసికందుగా ఉన్నప్పుడే ఆయన మా నుంచి దూరమయ్యారు. మా అమ్మ వనజాక్షమ్మ మాత్రం 104 ఏళ్లు జీవించారు. రాజమండ్రి, మదనపల్లి ప్రాంతాల్లో నా పాఠశాల విద్యాభ్యాసం గడిచింది. విశాఖపట్నం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాను. అప్పుడే మహారాజా విక్రమ్ దేవ్ వర్మ నుండి భౌతికశాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకున్నాను. ఫిజిక్స్ అంటే అంత ఇష్టం. అందులోనే బీఎస్సీ ఆనర్స్ చేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుండి మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీలో పీహెచ్డీకి సమానమైన డీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత 1956లో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ సైన్స్లో ఫిజిక్స్ లెక్చరర్గా చేరాను. లెక్చరర్ నుండి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్ వరకూ అనేక బాధ్యతలు నిర్వర్తించాను. ఇవన్నీ చేసే సరికి తెలియకుండానే 60 ఏళ్ల వచ్చేశాయి. 1989లో తప్పనిసరై పదవీ విరమణ చేశాను. విద్యార్థులకు ఇంకా పాఠాలు చెప్పాలనిపించింది. మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరాను. అక్కడే ఆరేళ్లు గడిచిపోయింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్ఛార్జ్గా కూడా పనిచేశాను. పాఠాలు భోదిస్తూ... వృత్తిలో భాగంగా చాలా దేశాలు వెళ్లొచ్చాను. యూఎస్, బ్రిటన్, కెనడా, స్పెయిన్తో సహా అనేక దేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాను. అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణ 2016లో వెటరన్ సైంటిస్ట్స్ క్లాస్లో అనేక అవార్డులతో పాటు బంగారు పతకాన్ని సాధించిపెట్టింది. 12 మంది విద్యార్థులు నా పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తి చేశారు. నా భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మూడేళ్లు ఆయన మంచంపైనే ఉన్నారు. అంతకు ముందు వరకూ రోజూ నన్ను ఎక్కడికైనా ఆయనే తీసుకువెళ్లేవారు. ఆయన తెలుగు ప్రొఫెసర్ కావడంతో నాకు ఉపనిషత్తుల గురించి బోధించేవారు. ఆయన వల్లనేమో పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై కూడా ఆసక్తి ఏర్పడింది. భగవద్గీత శ్లోకాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి ‘భగవద్గీత ది డివైన్ డైరెక్టివ్‘ అనే పుస్తకాన్ని రచించే వరకూ వెళ్లింది. వయసుతో వచ్చే సమస్యలు నన్నేమీ చేయలేకపోయాయి. రెండు మోచిప్పలకూ శస్త్ర చికిత్స జరిగి ఇరవై ఏళ్లయ్యింది. అయినా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాను. చనిపోయేవరకూ చదువు చెప్పాలనేది నా సంకల్పం. నేను క్లాస్ తీసుకుంటే విద్యార్థులెవరూ మిస్ అవ్వరు. అలాగే క్లాస్కి ఆలస్యంగా వెళ్లడం నా డిక్షనరీలో లేదు. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక క్లాసులకు వస్తుంటాను. ఎందుకంటే యూనివర్శిటీలోని విద్యార్థులే నా పిల్లలు. పొద్దున్న 4 గంటలకే నిద్ర లేస్తాను. విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం చేరుకుంటాను. ఇక్కడి సెంచూరియన్ యూనివర్శిటీలో రోజుకు కనీసం ఆరు క్లాసులు తీసుకుంటాను. చిత్రమేమిటంటే ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వీసీ, ఇప్పుడు సెంచూరియన్ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు నా దగ్గరే చదువుకున్నారు. ప్రపంచంలోనే పెద్ద వయసు ప్రొఫెసర్ను నేనేనట. గిన్నిస్బుక్ వాళ్లకు నా పేరును సూచిస్తానని నా శిష్యుడు రాజు ఈ మధ్యనే అన్నారు. మాది ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న కుటుంబం... డబ్బు, ఆస్తిపాస్తులపై మమకారం లేదు. మా వారు ఇంటిని కూడా వివేకానంద మెడికల్ ట్రస్ట్కు విరాళంగా ఇచ్చేద్దామంటే సరే అన్నారు. ఇప్పుడు అద్దె ఇంటిలో ఉంటున్నాను. మావారికి ఆరోగ్యం బాగోలేనప్పడు ఒక అబ్బాయి నాకు తోడుగా ఉండేవాడు. అతనిని చదివించి, పెళ్లి చేశాను. అతనికి ముగ్గురు పిల్లలు.. అతనితోపాటు అతని భార్య, పిల్లలు కలిపి ఇంట్లో మొత్తం ఆరుగురం. అందరం అదే అద్దె ఇంటిలో జీవిస్తున్నాం’’. – బోణం గణేష్, సాక్షి, అమరావతి. ఫొటోలు: డి.సత్యనారాయణమూర్తి, విజయనగరం. -
భౌతిక శాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి విజేతలు వీరే..!
వాషింగ్టన్: మెడిసిన్ విభాగంలో 2021 గాను డాక్టర్ డేవిడ్ జూలియస్, డా. అరర్డెం పటాపౌషియన్లకు ఉమ్మడిగా నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది గాను భౌతిక శాస్త్ర విభాగంలో చేసిన కృషికిగాను సైకురో మనాబే, క్లాస్ హస్సెల్మాన్, జార్జియో పారిసిలకు సంయుక్తంగా నోబెల్ బహుమతి వరించింది. చదవండి: నోబెల్ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో సైకూరే మనాబే సీనియర్ వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. వాతావరణంలో పెరిగిన కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు భూఉపరితలంపై ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఎలా దారితీస్తాయనే విషయంపై చేసిన పరిశోధనకుగాను నోబెల్ బహుమతి వరించింది. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెటరాలజీ యూనివర్సీటిలో ప్రొఫెసర్ క్లాస్ హస్సెల్మాన్ పనిచేస్తున్నారు. వెదర్ అండ్ క్లైమెట్కు సంబంధించిన మోడల్ను రూపొందించినందుకుగాను నోబెల్ బహుమతి లభించింది. రోమ్లోని సపియెంజా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జియోర్జియో పారిసికి, అస్తవ్యస్తమైన సంక్లిష్ట పదార్థాలలో దాచిన నమూనాలను కనుగొన్నందుకు నోబెల్ బహుమతి వరించింది. సంక్లిష్ట వ్యవస్థల సిద్ధాంతానికి అతని ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవి. BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2021 #NobelPrize in Physics to Syukuro Manabe, Klaus Hasselmann and Giorgio Parisi “for groundbreaking contributions to our understanding of complex physical systems.” pic.twitter.com/At6ZeLmwa5 — The Nobel Prize (@NobelPrize) October 5, 2021 చదవండి: వైద్యరంగంలో ఇద్దరికి పురస్కారం -
మార్పులు లేవు! తెలంగాణ విద్యామండలి కీలక నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్లో చేరాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాల్సిన అవసరం లేదన్న అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) మార్గదర్శకాలను 2021–22 విద్యా సంవత్సరంలో అమలు చేయబోమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడికి గురిచేసే ఎలాంటి మార్పులను, సంస్కరణలను అమలు చేయబోమని చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఏఐసీటీఈ దాదాపు 15 రకాల సబ్జెక్టులను పేర్కొందని, రాష్ట్రంలో ఇంటర్మీడియట్లో ఐదారు రకాల బ్రాంచీలే (గ్రూపులు) ఉన్నాయని, వాటిల్లో ఏఐసీటీఈ పేర్కొన్న సబ్జెక్టులు పెద్దగా లేవని పేర్కొన్నారు. మంగళవారం తనను కలసిన మీడియాతో పాపిరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర ఇంటర్మీడియట్లో ఇంజనీరింగ్ కోసం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో కూడిన ఎంపీసీ బ్రాంచీ ఉందని, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల కోసం బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కూడిన బైపీసీ బ్రాంచీ ఉందని వివరించారు. ఏఐసీటీఈ ఇటీవల జారీ చేసిన కాలేజీల అనుమతుల మార్గదర్శకాల్లో.. 2021–22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు బీఈ/ బీటెక్లో చేరాలంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ బయాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ బయోటెక్నాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ ఆర్కిటెక్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్/ ఎంటర్ప్రెన్యూర్షిప్ సబ్జెక్టుల్లో ఏవేనీ మూడు సబ్జెక్టులను చదివి ఉంటే చాలని పేర్కొందని వెల్లడించారు. వారు నాలుగేళ్ల ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులేనని తెలిపిందని, మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టులే ప్రధానంగా ఉన్నాయని, మిగతా సబ్జెక్టులేవీ లేవని వివరించారు. సబ్జెక్టు అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/ యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయ మే ఫైనల్ అని ఏఐసీటీఈ పేర్కొన్న నేపథ్యంలో తాము ఈసారి వాటిని అమలు చేయబోమని వివరించారు. ఎంసెట్ ర్యాం కుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉందని, ఈ పరిస్థితుల్లో మార్పులు చేస్తే విద్యార్థుల్లో గందరగోళం నెలకొంటుందని వివరించారు. పైగా ఇప్పటికే ఎంసెట్ పరీక్ష తేదీలను ప్రకటించామని పేర్కొన్నారు. ఈసారి ఎంసెట్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 100 శాతం సిలబస్, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్నే ప్రామాణికంగా తీసుకొని ఎంసెట్ను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఏఐసీటీఈ మార్గదర్శకాలను అమలు చేయాల నుకుంటే నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. 20 నుంచి ఎంసెట్ దరఖాస్తులు ఎంసెట్–2021 నోటిఫికేషన్ను ఈనెల 18న జారీచేసేందుకు సెట్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. మే నెల 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఆలస్య రుసుముతో జూన్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 20 నుంచి మే 18 వరకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మే 19 నుంచి 27 వరకు దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునే అవకాశం కల్పించనుంది. ఇక జూలై 5 నుంచి ఎంసెట్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించనుంది. జూలై 5, 6 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు, జూలై 7, 8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్ను నిర్వహించనుంది. ప్రతిరోజూ రెండు విడతల్లో ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో విడత పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని 23 టెస్ట్ జోన్ల పరిధిలోని 58 పట్టణాల్లో పరీక్షలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. -
మ్యాథ్స్, ఫిజిక్స్ లేకున్నా.. ఇంజనీరింగ్
సాక్షి, హైదరాబాద్: బీఈ/బీటెక్ ప్రవేశాలకు విద్యార్థులకు ఉండాల్సిన అర్హతల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఇంటర్మీడియట్లో కచ్చితంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను చదివి ఉండాలన్న నిబంధనను తొలగించింది. వాటిని ఆప్షనల్గానే పేర్కొంది. నిర్దేశిత అర్హతల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే చాలని వెల్లడించింది. వాటితో పాటు ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఉండాలని, ఆ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని పేర్కొంది. అయితే ఈ అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది. గతేడాది ఆ సబ్జెక్టులు తప్పనిసరి.. 2020–21 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్బుక్ (రివైజ్డ్) 2020–21లో బీఈ/ బీటెక్/ బీఆర్క్/ బీప్లానింగ్ వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉండాల్సిన అర్హతలను వెల్లడించింది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టులను విద్యార్థులు తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలని స్పష్టం చేసింది. వాటితో పాటు మరొక సబ్జెక్టు ఉండాలని పేర్కొంది. అందులో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ అగ్రికల్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్ వంటి సబ్జెక్టులో ఏదో ఒకటి ఉంటే చాలని పేర్కొంది. అంటే బీఈ/బీటెక్/బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/ బ్యాచిలర్ ప్లానింగ్ కోర్సుల్లో చేరాలంటే ఆయా విద్యార్థులు ఇంటర్మీడియట్లో (12వ తరగతి) మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలని పేర్కొంది. అయితే తాజాగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల విషయంలో తప్పనిసరి అన్న నిబంధనను తొలగించింది. 2021–22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు బీఈ/ బీటెక్లో చేరాలంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ బయాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ బయోటెక్నాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ ఆర్కిటెక్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్/ ఎంటర్ప్రెన్యూర్షిప్ సబ్జెక్టుల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులుగా పేర్కొంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మన దగ్గర ఎంపీసీ విద్యార్థులే ఇంజనీరింగ్లో చేరుతారు. ఏఐసీటీఈ పేర్కొన్న పలు కాంబినేషన్ల సబ్జెక్టులు మన దగ్గర ఇంటర్మీడియట్లో లేవు. పైగా ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కూడా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - పాపిరెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి అన్ని కోణాల్లో పరిశీలిస్తాం నిర్దేశిత సబ్జెక్టుల్లో ఏవైనా మూడు చదివి ఉంటే చాలని పేర్కొన్న ఏఐసీటీఈ నిబంధనను పరిశీలిస్తాం. ఈసారి సాధ్యం అవుతుందా లేదా అన్న దానిపై సబ్జెక్టు నిపుణులతో, యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ విభాగం నిపుణులతో చర్చిస్తాం. అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. అయితే అర్హతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు/ సంబంధిత బోర్డు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని చెప్పినందున ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలితో చర్చిస్తాం. మండలి సూచనల మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - ప్రొఫెసర్ గోవర్ధన్, ఎంసెట్ కన్వీనర్ -
నోబెల్ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు
ఎలా కనిపెడతారు వీళ్లు?! ఇంటిపని చేస్తూనే రేడియో ధార్మికతల్ని పిల్లల్ని ఆడిస్తూనే పరమాణు స్వభావాల్ని వండి పెడుతూనే కాంతి ఉష్ణ కిరణాల్ని నిద్ర చాలకనే మార్మిక కృష్ణ బిలాల్ని! ఎక్కడిది వీళ్లకింత శక్తి? సూక్ష్మదృష్టి? భౌతిక శాస్త్రమే ఆవహిస్తోందా? పాలపుంతల నుంచి ప్రవహిస్తోందా? శాస్త్రం జీవితాన్ని సులభతరం చేస్తుంది. ఎలా చేస్తుందో అర్థం చేసుకోవడం మాత్రం కష్టమైన విషయం! సెల్ఫోన్ను చెవి దగ్గర పెట్టుకుని ‘హలో’ అని వేల మైళ్ల దూరంలో ఉన్నవారితో మాట్లాడినంత సులభం కాదు, ఎలా మాట అంతదూరం వెళ్లి, మళ్లీ వస్తుందో అర్థం చేసుకోవడం. అందుకే నిరంతరం శాస్త్రాన్ని అర్థం చేసుకుని, అర్థం చేయించే పనిలో ఉండే శాస్త్రవేత్తలకు.. ముఖ్యంగా ఏ ప్రయోగ అనుకూలతలూ ఉండని మహిళా శాస్త్రవేత్తలకు చేతులు జోడించి నమస్కరించాలి. ఇటు గృహ బంధనాలు, అటు శాస్త్ర శోధనలు! గ్రేట్. అణు ధార్మికత (రేడియో యాక్టివిటీ) పై చేసిన పరిశోధనలకు పొలెండ్ శాస్త్రవేత్త మేరీ క్యూరీకి నోబెల్ బహుమతి రావడం వెనుక కూడా జీవితకాల పరిశోధనలు, ప్రయోగాలు ఉన్నాయి. మరియా గోపర్ట్ మేయర్ (1906–1972) భౌతికశాస్త్రంలో తొలి నోబెల్ గెలుచుకున్న మహిళ ‘మేడమ్’ క్యూరీ. ఆ ‘రేడియో ధార్మికత’ అనే పేరు ఆమె పెట్టిందే! అంతకుముందు కూడా రేడియో ధార్మికత ఉండేది. ఫలానా అని దానికొక గుర్తింపును క్యూరీ ఇచ్చారు. అణుధార్మికత ప్రయోగాల ల్యాబ్కు ఆమె తన జీవితాన్నే పణంగా పెట్టారు. ఆ దుష్ప్రభాలతోనే చివరికి ఆమె చనిపోయారని అంటారు! మానవ దేహంలో కణుతులకు జరిగే రేడియం చికిత్స పరిణామాలను వైద్యులు అంచనా వేయగలగడాన్ని సాధ్యం చేయించింది క్యూరీ పరిశోధనా ఫలితాలే. ∙∙ మేరీ క్యూరీ తర్వాత భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన మహిళ మరియా గోపర్ట్ మేయర్. జర్మనీ శాస్త్రవేత్త. ఆటమిక్ న్యూక్లియస్లోని ‘న్యూక్లియర్ షెల్ మోడల్’ను ప్రతిపాదించినందుకు ఆమెకు నోబెల్ లభించింది. ఆటమిక్ న్యూక్లియస్ అంటే పరమాణు కేంద్రకం. అందులోనే ప్రొటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఆ కేంద్రకం శక్తి స్థాయుల నిర్మాణం ఫలానా విధంగా ఉంటుందని మరియా కనిపెట్టారు. సరే, ఎవరికి ప్రయోజనం? అది పూర్తిగా శాస్త్రపరమైన అంశం. అణు స్వభావాలను తెలుసుకోడానికి పనికొచ్చే మేథమెటిక్స్. వైద్యరంగాన్నే తీసుకుంటే.. వ్యాధుల నిర్థారణ, వ్యాధి దశల గుర్తింపు, చికిత్స.. వీటికి అవసరమైన అధ్యయనానికి కూడా పరిశోధకులకు ‘న్యూక్లియర్ షెల్ మోడల్’ ఒక దారి దీపం. ∙∙ భౌతికశాస్త్రంలో నోబెల్ పొందిన మూడో మహిళా శాస్త్రవేత్త డోనా స్ట్రిక్లాండ్. ఆప్టికల్ ఫిజిసిస్ట్. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్పై పరిశోధనలు చేస్తుంటారు. కెనడా ఆమెది. ‘పల్స్డ్ లేజర్స్’ గురించి కొత్త విషయాలు కనిపెట్టినందుకు రెండేళ్ల క్రితం డోనాను నోబెల్ వరించింది. సి.పి.ఎ. (చర్ప్డ్ పల్స్ ఆంప్లిఫికేషన్) ను ఆచరణాత్మకంగా ప్రయోగించి అత్యధిక తీవ్రతను కలిగిన, అతి చిన్న కాంతి ఉష్ణ కిరణాలను ఆమె సృష్టించారు. కంటికి చేసే లేజర్ చికిత్సలలో ఇది చక్కగా ఉపకరిస్తోంది. ∙∙ ఆండ్రియా గెజ్ ఈ ఏడాది నోబెల్ పొందిన మహిళా ఖగోళ శాస్త్రవేత్త. ఫిజిక్స్లో నాల్గవ మహిళా నోబెల్ విజేత. పాలపుంత మధ్యలో ధూళితో నిండి ఉన్న ‘ధనుర్భాగాన్ని’ (సాజిటేరియస్ –ఎ ) గెజ్ ఆధ్వర్యంలోని బృందం నిశితంగా పరిశీలించి, అక్కడి కాంతిమంతమైన నక్షత్రాల గమ్యాన్ని గుర్తించింది. గెజ్ అంచనా ప్రకారం ఆ ప్రదేశంలో బ్రహ్మరాక్షసి వంటి మార్మిక బిలం ఒకటి ఆ చుట్టుపక్కల నక్షత్రాల కక్ష్యలకు దారి చూపుతోంది! కొన్ని నక్షత్రాలను ఆధాటున మింగేస్తోంది. ఈ విశ్వవైపరీత్యాన్ని గెజ్ శక్తిమంతమైన టెలిస్కోప్తో కనిపెట్టారు. గెజ్ పరిశోధన మున్ముందు మనిషి ఈ విశ్వాన్ని మరింత సూక్ష్మంగా శోధించేందుకు, విశ్వ రహస్యాలను ఛేదించేందుకు తోడ్పడుతుంది. పంచుకోవడంలో సంతోషం ఉంటుంది. అయితే అవార్డుల విషయంలో అదేమంత సంతోషాన్నివ్వదు. చిన్న అవార్డు అయినా విడిగా ఒక్కరికే వస్తే ఉండే ప్రత్యేక గుర్తింపు కలివిడిగా వస్తే ఉండదు. భౌతికశాస్త్రంలో నోబెల్ పొందిన ఈ నలుగురు మహిళా శాస్త్రవేత్తలూ మరో ఇద్దరితో అవార్డును పంచుకోవలసి వచ్చినవారే. ఇది కొంచెం నిరుత్సాహం కలిగించే విషయమే అయినా, మానవ జీవితాలకు కలిగే ప్రయోజనాల ఆవిష్కరణల్లో భాగస్వామ్యం కలిగి ఉండటం కూడా శాస్త్రవేత్తగా జన్మ ధన్యం అవడమే. నోబెల్ గెలుపును మించిన సార్థక్యమది. నూట ఇరవై ఏళ్లలో నలుగురు నోబెల్ ప్రైజ్లు 1901లో ప్రారంభం అయ్యాక ఇప్పటì వరకు భౌతికశాస్త్రంలో 114 సార్లు నోబెల్ని ప్రకటించారు. 215 మంది విజేతలు అయ్యారు. వీరిలో నలుగురంటే నలుగురే మహిళలు. ఒక నోబెల్ ప్రైజ్ను ముగ్గురికి మించి పంచరు. ఆ ముగ్గురి మధ్య కూడా కనీసం రెండు వేర్వేరు ఆవిష్కణలకు ప్రైజ్ను పంచడం ఉంటుంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో ఇద్దరు పురుషులతో కలిసి బ్లాక్హోల్స్పై చేసిన పరిశోధనలకు ఆండ్రియా గెజ్ నోబెల్ను గెలుపొందారు. 1901లో విల్హెల్మ్ రాంట్జెన్ ఎక్స్–రే కనిపెట్టినందుకు భౌతికశాస్త్రంలో తొలి నోబెల్ గెలుచుకున్న రెండేళ్లకే 1903లో మేరీ క్యూరీ రేడియో ధార్మికతకు నోబెల్ సాధించారు. తర్వాత అరవైఏళ్లకు గానీ ఒక మహిళ భౌతిక శాస్త్రంలో నోబెల్ను దక్కించుకోలేకపోయారు. 1963లో మరియా గోపర్ట్ మేయర్ న్యూక్లియర్ స్ట్రక్చర్కు నోబెల్ పొందారు. 2018లో డోనా స్ట్రిక్లాండ్ లేజర్ పల్సెస్కు నోబెల్ సాధించారు. అయితే ఈ నలుగురు మహిళల్లో విడిగా ఏ ఒక్కరికీ నోబెల్ రాలేదు. నలుగురూ మరో ఇద్దరు పురుషులతో నోబెల్ను పంచుకున్నవారే. మొత్తం మీద భౌతికశాస్త్రంలో ఏక విజేతగా 47 మంది నోబెల్ను గెలుపొందగా.. ఒకరితో కలిసి 32 మంది, ఇద్దరితో కలిసి 34 మంది నోబెల్ను పంచుకున్నారు. యుద్ధపరిస్థితుల కారణంగా 1916, 1931, 1934, 1940, 1941, 1942లలో ఆరుసార్లు నోబెల్ను ఇవ్వలేదు. -
ఫిజిక్స్ కఠినంగా.. మ్యాథ్స్ మధ్యస్తంగా..
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 15 కేంద్రాల్లో దాదాపు 15 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో భౌతిక శాస్త్రం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, సుదీర్ఘ సమాధానాలు కలిగిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయని విద్యార్థులతో పాటు సబ్జెక్టు నిపుణులు ఉమాశంకర్, ఎంఎన్ రావు వెల్లడించారు. ఇక మ్యాథమెటిక్స్లో ఎక్కువ ప్రశ్నలు మధ్యస్తంగా ఉండగా, కొన్ని ప్రశ్నలు మాత్రం కఠినంగా ఉన్నాయని, కెమిస్ట్రీలో మాత్రం సులభమైన ప్రశ్నలు వచ్చినట్లు తెలిపారు. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షలో ఒకే జవాబు కలిగిన ప్రశ్నలు 6, ఒకటి కంటే ఎక్కువ జవాబులు కలిగిన ప్రశ్నలు 6 వచ్చాయని, పూర్ణ సంఖ్య జవాబుగా కలిగిన ప్రశ్నలు మరో 4 ఉన్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షలోనూ ప్రశ్నల సరళి అలాగే ఉందన్నారు. పేపర్–1తో పోల్చితే పేపర్–2లో ఫిజిక్స్ ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నట్లు వివరించారు. గతేడాది కంటే ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ చాలా కఠినంగా ఉందని పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో కటాఫ్ మార్కులు 35 శాతం, ఓబీసీలో 28–30 శాతం, ఎస్సీ, ఎస్టీల్లో 12–15 శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రెండు పేపర్లలో కలిపి 396 మార్కులకు గాను తెలుగు విద్యార్థులకు 360 మార్కులకు పైగా రావచ్చని నిపుణులు చెబుతున్నారు. 5వ తేదీన ఫలితాలు.. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను వచ్చే నెల 5న ఐఐటీ ఢిల్లీ విడుదల చేయనుంది. ఆ తర్వాతి రోజు నుంచే (6వ తేదీ) ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్టీఐ) ప్రవేశాల కోసం జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) ఉమ్మడి కౌన్సెలింగ్ను నిర్వహించనుంది. ఇందుకోసం షెడ్యూల్ను కూడా జారీ చేసింది. 6వ తేదీ నుంచి మొదటి విడత ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించి 16వ తేదీన సీట్లను కేటాయించనుంది. అనంతరం మరో ఐదు దశల కౌన్సెలింగ్ నిర్వహించి, నవంబర్ 7వ తేదీతో సీట్ల కేటాయింపును పూర్తి చేయనుంది. నవంబర్ 9వ తేదీ నాటికి కరోనా పరిస్థితి అదుపులోకి రాకపోతే విద్యార్థులు ఆన్లైన్లోనే రిపోర్టింగ్ చేసేలా చర్యలు చేపట్టింది. మరోవైపు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్లో ప్రవేశాల కోసం వచ్చే నెల 8వ తేదీన ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టును (ఏఏటీ) నిర్వహించి, 11వ తేదీన వాటి ఫలితాలను ప్రకటించనుంది. -
ఇలాంటి అద్భుతాలు కొందరికే సాధ్యం
-
ఇలాంటి అద్భుతాలు కొందరికే సాధ్యం
కొన్ని అద్భుతాలు కొందరికే సాధ్యమవుతాయని ఈ వీడియో చూస్తే కచ్చితంగా చెప్పేస్తారు. ఎందుకంటే సాధారణంగా గ్లాసులో నీళ్లు నింపి దానితో ఏదైనా ప్రయోగం చేయాలని చూసేలోపే నీళ్లన్ని నేలపాలవ్వడం ఖాయం. కానీ ఒక వ్యక్తి మాత్రం రెండు గ్లాసుల్లో నీరు నింపి దానికి తాడు కట్టి ఇష్టం వచ్చినట్లుగా తిప్పినా ఒక్క చుక్క నీరు కూడా కింద పడకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను ప్రముఖ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ 'ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమిజోన్' తమ ట్విటర్లో షేర్ చేసింది. ' ఈ వీడియో భౌతిక శాస్త్రం గొప్పతనాన్ని చూపిస్తోంది.' అంటూ క్యాప్షన్ జత చేశాడు. (వైరల్ వీడియో: ఆ పక్షి పేరేంటో చెప్పండి!) ఇక వీడియో విషయానికి వస్తే మొదట రెండు గ్లాసుల్లో నీళ్లు పోసి వాటికి సమాంతరంగా రెండు తాళ్లను కట్టి పెండ్యులమ్(లోలకం) ఆకారంలో తిప్పడం ప్రారంభించాడు. తరువాత ఒక్కసారిగా స్పీడ్ పెంచి తల వెనుక భాగం నుంచి సర్కిల్ ఆకారంలో తిప్పడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఒక్క చుక్క నీరు కూడా కింద పడకపోవడం విశేషం. ఆ తరువాత గ్లాసులోని నీళ్లను గటగట తాగేసి షో సమాప్తం అన్నట్లుగా సూచించాడు. అయితే ఆ వ్యక్తి చేసింది మ్యాజిక్ కాదని, భౌతికశాస్త్రంలోని న్యూటన్ ఫస్ట్ లా( లా ఆఫ్ ఇనర్షియా) జడత్వం, సెంట్రీపిటల్ ఫోర్స్ను ఆధారంగా చేసుకొని ఇలా చేశాడంటూ ఫిజిక్స్ అండ్ ఆస్ట్రానమి పేర్కొంది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.7 మిలియన్ మంది వీక్షించారు. ఈ వీడియో ఎక్కడ తీశారనేదానిపై స్పష్టత లేదు కాని.. వీడియోలోని వ్యక్తి మాత్రం చెన్నైలోని కన్నాజీనగర్కు చెందిన వాడని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. -
భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్
స్టాక్హోమ్ : భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలను 2019 సంవత్సరానికి గానూ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం వరించింది. జేమ్స్ పీబుల్స్, మైఖేల్ మేయర్, డిడియర్ క్యులోజ్లకు భౌతిక శాస్త్రంలో ఈ పురస్కారాన్ని ఉమ్మడిగా అందజేయనున్నట్టు నోబెల్ అసెంబ్లీ మంగళవారం ప్రకటించింది. వారిలో పీబుల్స్ కెనడియన్ అమెరికన్ కాగా, మైఖేల్, క్యులోజ్లు స్విట్జర్లాండ్కు చెందినవారు. విశ్వసృష్టిలో సైద్ధాంతిక అవిష్కరణలకు గానూ వారు నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. మొత్తం ప్రైజ్మనీ అయిన 9.18 లక్షల అమెరికన్ డాలర్లలో సగం పీబుల్స్కు వెళ్లగా, మిగతా సగాన్ని మైఖేల్, క్యులోజ్ పంచుకోనున్నారు. డిసెంబర్ 10వ తేదీన స్టాక్హోమ్లో జరిగే కార్యక్రమంలో వారు నోబెల్ పురస్కారం అందుకోనున్నారు. కాగా, సోమవారం వైద్య రంగానికి సంబంధించి నోబెల్ విజేతలను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇడ్లీ– ఉప్మా – డోక్లా... మూడేళ్లుంటాయి!
రేడియేషన్ సమీపానికి వెళ్లాలంటే అందరికీ భయం. కానీ రేడియేషన్తో ఇప్పటి వరకు ఉన్న లాభాలే కాకుండా, కనీవినీ ఎరుగని రీతిలో మరొక అత్యంత కీలకమైన ప్రయోజనాన్నీ కనుగొన్నారు ముంబై యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ వైశాలి బంబోలి. ముంబై యూనివర్సిటీ క్యాంపస్లోని బయో నానో ఫిజిక్స్ లాబ్లో గత ఐదేళ్లుగా పరిశోధనలు జరిపి ఆమె ఈ విషయాన్ని కనుగొన్నారు! ఉదయం వండిన వంటకాలు రాత్రి తినాలంటే ముఖం చిట్లించుకుంటాం. అయితే వాటిని రేడియేషన్ ద్వారా ఏకంగా వెయ్యి రోజులు.. అంటే సుమారు మూడు సంవత్సరాల పాటు తాజాగా ఉంచవచ్చని ప్రొఫెసర్ వైశాలి కనుగొన్నారు! ఇది భవిష్యత్తులో మానవాళికి ఉపయుక్తమైన పరిణామాలకు నాంది అవుతుందని ఆమె భావిస్తున్నారు. ‘‘ముఖ్యంగా నేటి సమాజంలో ఆహారం కొరతను తగ్గించడంతోపాటు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆహారాన్ని దీర్ఘకాలం తాజాగా ఉంచి, అన్నార్తులకు అందించేందుకు వీలవుతుంది. అదే విధంగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలున్న సరిహద్దులో ఉండే సైనికులకు కూడా తాజాగా ఆహారాన్ని అందించవచ్చు. మరో సంతోషకరమైన సంగతి.. అమెరికాతోపాటు దేశ విదేశాలలో ఉండే మనవారికి మన ఊరిలో మన ఇంట్లో తినే వంటలను తిన్పించేందుకు అవకాశం కలుగుతుంది’’ అన్నారు ప్రొఫెసర్ వైశాలి. ఏమిటా ప్రయోగం?! ‘రెడీ టు ఈట్’ ప్రాజెక్టులో భాగంగా.. వండిన పదార్థాలపై వైశాలి బృందం ఈ ప్రయోగం చేశారు. ఇడ్లీ, ఉప్మాతోపాటు తెల్లని డోక్లా (గుజరాతీ వంటకం) ను మూడేళ్లపాటు తాజాగా ఉంచవచ్చని తెలుసుకున్నారు. ప్రయోగ ఫలితాన్ని నిర్థారించుకున్న తర్వాతే ఈ విషయాన్ని ఇటీవల వెల్లడించారు. ‘‘ప్రత్యేకంగా రూపొందించిన మల్టీ లేయర్డ్ కవర్లలో (సంచులలో) ఆహార పదార్థాలను ఉంచి ప్యాక్ చేసి రేడియేషన్ ఇచ్చాం. ఇందుకోసం ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ టెక్నాలజీ వినియోగించాం. ముఖ్యంగా ఎంత రేడియేషన్ ఇవ్వాలనేది కనుగొన్నాం. మేము అనేక తినుబండారాలపై చేసిన పరిశోధనలలో.. ముఖ్యంగా ఇడ్లీ, ఉప్మా, తెల్లని డోక్లాలపై చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఇప్పుడు మూడేళ్ల అనంతరం కూడా వాటి రుచితోపాటు వాటి నాణ్యత, వాటిలోని ప్రొటీన్స్, ఫ్యాట్స్, కార్బొహైడ్రేట్స్, మైక్రో సెన్సరీ వాల్యూస్ అన్నీ మూడేళ్ల కింద ఉన్నట్టే ఉన్నాయి’’ అని ప్రొఫెసర్ ౖవైశాలి చెప్పారు. అయిదేళ్ల నాటి ఆలోచన ‘‘రేడియేషన్ సాధారణంగా వండిన వంటకాలపై కాకుండా కూరగాయలు, పండ్ల నిల్వ విధానానికి ఉపయోగిస్తారు. అయితే మనం వండిన వంటలపై వినియోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన అయిదేళ్ల కిందట వచ్చింది. అయితే గామా రేడియేషన్కు కొన్ని సమస్యలున్న సంగతి అందరికీ తెలిసిందే. కాని ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ ద్వారా ప్రయత్నిస్తే ఫలితం దక్కవచ్చని భావించాను. బోర్డ్ ఆఫ్ రేడియేషన్, ఐసోటోప్ టెక్నాలజీ (బిఆర్ఐటి) సంస్థలోని రేడియేషన్ యంత్రాన్ని నా పరిశోధన కోసం వినియోగించుకునేందుకు అనుమతి కోరాను. అనంతరం ముంబై యూనివర్సిటీలోని కలీనా క్యాంపస్లో బయో నానో ఫిజిక్స్ లాబ్ ఏర్పాటు చేసుకున్నాం. ముందుగా రేడియేషన్ డోస్ ఎంత ఇవ్వాలనే దానిపై పరిశోధన చేశాం. అనంతరం వంటకాలను ఎలాంటి ప్యాకేజీలలో ఉంచి రేడియేషన్ ఇస్తే బాగుంటుందని ప్రయోగాలు చేశాం. మొదట పరిశీలనలో భాగంగా ముప్పై రోజుల అనంతరం రేడియేషన్ ద్వారా ప్రత్యేక ప్యాకెట్లో ఉంచిన ఇడ్లీ, ఉప్మా, డోక్లాను అన్ని రకాలుగా పరీక్షలు చేశాం. ప్యాకింగ్ చేసిన రోజు ఎలా ఉన్నాయో నెల తర్వాత కూడా ఆ వంటకాలు అలానే తాజాగా ఉండడం గమనించాం. అనంతరం వెయ్యి రోజుల పరీక్షలు నిర్వహించాం. అప్పటికి కూడా ఆ వంటకాలలో ఎలాంటి మార్పులేదు’’ అని వివరించారు వైశాలి. త్వరలో యంత్రాల అభివృద్ధి టేబుల్ టాప్ ఎలక్ట్రానిక్ రేడియేషన్ యంత్రం సహాయంతో రాబోయే రోజుల్లో ఇతర వంటకాలను కూడా తాజాగా ఉంచే పరిశోధనల్ని వైశాలి బృందం చేయబోతోంది. ‘‘అయితే ఇందుకోసం కావలసిన రేడియేషన్ యంత్రాలు కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్నాయి. చైనాలో టేబుల్టాప్ ఎలక్ట్రానిక్ బీమ్ రేడియేషన్ యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వాటి ధరలు భారీగా ఉన్నాయి. దీంతో మేమే అత్యంత తక్కువ ధరలో ఆ యంత్రాలను అభివృద్ధి చేస్తున్నాం’’ అని ప్రొఫెసర్ వైశాలి తెలిపారు. – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
దక్షిణనియ్యి! వద్దొద్దు! నాకెందుకు నీ దక్షిణ!?
ఎక్కడైనా సరే కన్నతల్లిని చూస్తే తన బిడ్డ కళ్లలోకి అలా చూసి క్షణం ఆగి గట్టిగా హత్తుకుని పెద్ద ముద్దు పెట్టుకుంటుంది. ఈ ఇద్దరిలోనూ కన్పించే తేడా ఏమిటి? తేడా ఏమిటో కన్పించనితనమే!కన్నతల్లి తన బిడ్డ కళ్లలోకి చూస్తూ ఎంత ఎదురుచూసేలా చేశావురా? బొజ్జలో ఉండి ఎన్ని తన్నులు తన్నావురా? ఎన్ని తినరాని(మట్టి సుద్ద మరీపులుపు..) వాటిని ఇష్టంగా తినిపించావురా? ఒకసారి నేను కూడా దక్కని పరిస్థితిని కల్పించి ఎంత గాభరా పుట్టించావురా? అనుకుంటూ ఆ పసివాడి కళ్లలోకి ఈ భావాన్నంతటినీ వ్యక్తీకరిస్తూ ఆ ఆనందాతిశయాన్ని భౌతికంగా వ్యక్తీకరిస్తూ ‘గాట్టి పెద్ద ముద్దు’ని పెడుతుంది.అదే మరి పక్కనున్న మరొక ఆమె అయితే.. బోసినవ్వు ఎంత బాగుంది? గిరజాలెంత చక్కగా ఉన్నాయి? బుగ్గలెంత బూరెల్లా కనిపిస్తున్నాయి..! అంటూ ముద్దెట్టుకుంటుంది. ఇద్దరూ చేస్తున్నదీ చేసిందీ ఒకే పని అయినా ఎంత వ్యత్యాసముంది?ఇదే తీరుగా ఏదో బాబాని దర్శించేయడం కాకుండా ‘బాబా! నన్నెంత తలకిందులైన పరిస్థితి నుండి ఊహాతీతంగా బయటపడేశావ్? పూర్తిగా ఎండిన చెట్టులా ఉన్న నన్ను చిగిర్చి పుష్పించేలా చేశావు?’ అనుకుంటూ చూసేవారికి బాబా మరింత ఆనంద అనుగ్రహదర్శనాన్నిస్తాడు. ఏదో పదిమందితో వెళ్లాం కదా! అని చూస్తే కనిపిస్తాడు తప్ప దర్శనాన్ని ఇవ్వడు. ఇది అనుభవం ద్వారా మాత్రమే తెలిసే విషయం.ఇక్కడ ఈ మాటలెందుకనుకోవచ్చు! బాబాని దర్శించడానికి వెళ్లే ముందు బాబా గురించిన ఎంతో సమాచారాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుంటున్నట్టుగా తెలుసుకుని గాని దర్శించుకున్నట్లయితే ఆ చూసే చూపులో లోతుదనమే వేరు. అలా కాక కేవలం దర్శించి నమస్కరించేస్తే పై ఉదాహరణలో కన్నతల్లి కాని ఆమె పొందినది ఆనందమే అయినా అది కన్నతల్లి ఆనందంలాంటిదెలా కాదో.. కాలేదో.. అలాగే ఉంటుంది. 15 రూపాయలివ్వు! సాయి దర్శనం కోసం గోవా నుంచి ఇద్దరు పెద్ద వయసువాళ్లొచ్చారు. సాయి దర్శనాన్ని చూస్తూనే చెప్పలేని ఆనందంతో పాదాభివందనాన్ని వినమ్రులై చేశారు. ఇద్దరూ కలిసే వచ్చారు. ఇద్దరూ కలిసే పాదాభివందనాన్ని చేశారు. అయితే సాయి మాత్రం మొదటివాణ్ని చూస్తూ ‘నాకో 15 రూపాయల దక్షిణనివ్వు!’ అని అడిగాడు. సాయి దర్శనం లభించడమే అదృష్టకరమైన అంశమనుకుంటూ ఉంటే ఆయనే దక్షిణ అడిగి మరీ తీసుకోవడం అనేది మరింత అదృష్టకరమైన అంశమనుకుంటూ వెంటనే 15 రూపాయలనీ ఇచ్చేశాడు మొదటి వ్యక్తి.‘అయ్యో! ఆయన అడక్కుండానే దక్షిణనిచ్చి ఉంటే ఎంత బాగుండేది?’ అనుకుంటూ రెండవ వ్యక్తి 35రూపాయల దక్షిణని సాయికివ్వబోతే వద్దు అంటూ చేతి సంజ్ఞని చేస్తూ సాయి తిరస్కరించాడు.ఇతని దగ్గర అడిగి తీసుకోవడమేమిటి? అతను తనంత తానుగా ఇంతకంటే ఎక్కువనియ్యబోతే తిరస్కరించడమేమిటి? అని అక్కడున్న భక్తులందరికీ, వచ్చిన గోవాభక్తులిద్దరికీ సంశయం కలిగింది. బాబాని అడగాలంటే భయం, సంకోచం కాబట్టి ఎవ్వరూ అడగలేకపోయారు. గానీ ‘శ్యామా’మాత్రం బాగా చనువున్నవాడు కాబట్టి సాయికి నమస్కరించి ‘ఈ సంశయాన్ని ఆయన ముందు పెట్టి అనుమానాన్ని తీర్చవూ?’ అని అడిగాడు సాయిని.బాబా శ్యామా ముఖంలోనికి చూస్తూ.. ‘శ్యామా! నాకు కుటుంబం ఉందా?’ అని అడిగాడు. ‘లేదు లేదు’ అన్నాడు శ్యామా.‘భార్య, పుత్రులు, దత్తులు ఉన్నారా?’‘లేరు లేరు..!!’‘తీర్చుకోవలసిన బాధ్యతలూ చేసిన అప్పులూ ఏమైనా ఉన్నాయా?’‘లేనే లేవు..!’‘మరి నాకు డబ్బెందుకు?’ అన్నాడు సాయి.వెంటనే శ్యామా ‘బాబా! మరి నువ్వేకదా దక్షిణ అడిగావు! ఒకరి వద్ద తీసుకున్నావు. మరొకరియ్యబోతుంటే వద్దన్నావు! అదీ కాక నీకు సొమ్ము అవసరమే లేకపోతే మరి కొందరి దగ్గర కూడా దక్షిణ అడిగి తీసుకు రమ్మంటుంటావు. తెచ్చాక తీసుకుంటావు కదా!’ అని చుట్టూ ఉన్న అందరి భక్తుల అనుమానాలన్నింటినీ కలిపి అడుగుతున్నా అన్నట్లు ధైర్యంగా అడిగాడు. సాయి చిరునవ్వు నవ్వుతూ ‘శ్యామా! చేసిన అప్పు, శత్రుత్వం, చంపితీరాలనే పగా అనేవి జన్మలెన్ని ఎత్తినా తీర్చుకోనంత కాలం అవి వెంట వస్తూనే ఉంటాయి. నీకు ఏ రుణమూ లేదు. అందుకే నాకింత సన్నిహితుడివిగా ఉంటున్నావు. ఒక్కమాటలో చెప్పాలంటే... రుణవిముక్తి కోసమే నా దగ్గరి కొస్తారు. రుణ విముక్తిని చేసుకుంటారు. ఇక నాకు అతుక్కుని అలా వస్తూ పోతూనే ఉంటారు’ అన్నాడు బాబా.శ్యామాతో పాటు భక్తులంతా అర్థమైనట్టూ బాబా చెప్పినమాటలు కానట్టూ ఉండగానే బాబా చెప్పడం మొదలెట్టాడు వివరంగా.‘ఇదుగో! ఈ భక్తుడున్నాడే! ఒకప్పుడితనికి ఉద్యోగం లేదు. తీవ్రమైన సంకట పరిస్థితుల్లో ఉన్నాడు. నిరుపేద. ఒకరోజున మొక్కుకున్నాడు. ఉద్యోగం వస్తే మొదటి జీతం ఇస్తానని. మొక్కుకున్నట్లే ఉద్యోగం వచ్చింది. మొక్కుబడి విషయాన్ని మరచిపోయాడు. 15.. 30.. 50... అలా పెరిగిన జీతం ఈ రోజున 700 అయ్యింది. అదుగో ఆ వచ్చిన ఈ వ్యక్తి నాకు రుణగ్రస్తుడు కాదూ! అందుకే అతను ఇస్తానని ఆనాడు ఒప్పుకున్న ఆ 15 రూపాయలని మాత్రమే అడిగి తీసుకున్నాను. ఇప్పుడు 700 కావచ్చు. అది నా కొద్దు. అది అతని మొదటి జీతం కాదు గదా! కాబట్టి ఇతన్ని అడిగి తీసుకున్న 15 రూపాయలు నాకు చెల్లించవలసిన బాకీపడిన పైకం మాత్రమే’ అన్నాడు. అంతా ఆశ్చర్యచకితులయిపోయారు.30,000 రూపాయల చౌర్యం‘శ్యామా! నేనొకప్పుడు సముద్రపు ఒడ్డున తిరుగుతున్నాను. అలా నడుస్తూ ఉంటే ఓ సుందరమైన భవనం కనిపించింది. అదొక సద్బ్రాహ్మణునిది అని ఆ భవనానికున్న నామఫలకం చెప్తోంది. మంచి జాతి కదా అని గ్రహించి ఆ భవనానికున్న వరండాలో కూర్చున్నాను. ఆ యజమాని నన్నేమీ అనలేదు సరికదా నన్ను లోనికి పిలిచి చక్కని భోజనాన్ని పెట్టి మంచి వసతిగా ఉన్న శుభ్రమైన పడకగదిలో పడుకోబెట్టాడు కూడా! నేనెంత గాఢంగా నిద్రపోయానో నాకే తెలియదు. అయితే తెల్లవారిన తర్వాత చూసుకుంటే నా జేబులో ఉన్న 30 వేల రూపాయల కరెన్సీ కాగితాలు చౌర్యానికి గురయ్యాయని అర్థమయింది. ఆయన సద్బ్రాహ్మణుడే కాక సకాలంలో ఆదుకున్నవాడు. ఆయన్ని అనుమానించడం మహాపాపం. ఆయన ఈ విషయాన్ని విని చాలాసేపు నన్ను ఓదార్చాడు. పొగిలి పొగిలి ఏడుస్తూనే ఉన్నాను. ఒకరోజు రెండ్రోజులు కాదు. అదే బ్రాహ్మణుని ఇంటి వరండాలో 15 రోజుల పాటు రోజూ చేసేపని ఏడవడమే. ఆ మరుసటి రోజున కూడా ఇలాగే తలుచుకు తలుచుకు ఏడుస్తూ ఉంటే ఎక్కడి నుండో ఓ ఫకీరొచ్చాడు. ఉర్దూలో రెండురెండు పాదాలు మాత్రమే ఉండే ద్విపదల్లాంటివి పాడుతూ నా దగ్గరికే వచ్చాడు.‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. జరిగిందంతా చెప్పాను. ‘ఇంతేగా! నీకో ఫకీరు పేరు చెబుతాను. ఆయన ఉండే చోటు కూడా చెప్తాను. ఆయనకి మొక్కుకో! ‘నీ డబ్బు మొత్తం నీకు తిరిగొచ్చి నీకు చేరే వరకూ ప్రతిరోజూ నువ్వుతింటున్న వరి అన్నాన్ని తిననే తిననని ఆ ఫకీరుకి పూర్తి శరణాగతుడివి అయి ఆయన నామాన్నే జపించుకుంటూ ఉండు’ అని.మరేమీ తోచలేదు. ఆ ఫకీరు చెప్పినట్లే పూర్తి నిష్ఠతో నామాన్ని జపిస్తూ ఉండిపోయాను. సరిగ్గా కొన్నిరోజులు జపించానో లేదో ఆ దొంగిలింపబడ్డ సొమ్ము నా వద్దకొచ్చింది. ఆనందంతో ఆ బ్రాహ్మణుని ఇంటిని విడుస్తూ ఆయనకి ధన్యవాదాలు చెప్పి సముద్రం దగ్గర కొచ్చాను. స్టీమర్ (నౌక) వచ్చింది. దాన్నిండా జనం. ఎవరో ఒక సిపాయి నాకు అడ్డుపడి లోనికి తీసుకుపోయి నాకు చోటునిచ్చి మరీ కూర్చోమన్నాడు. నౌక సముద్రం ఆ ఒడ్డుకి చేరింది. అక్కడి నుంచి రైలెక్కాను. ఇదిగో ద్వారకామాయి’ కొచ్చానన్నాడు బాబా.శ్యామాతో పాటు భక్తులందరికీ ఈ 2వ కథ అగమ్యగోచరంగా ఉండేసరికి ఆశ్చర్యంగా వింతగా చూడసాగారు బాబా వైపు. వెంటనే శ్యామాని చూస్తూ బాబా ‘శ్యామా! ఈ అతిథుల్ని నీ ఇంటికి తీసుకెళ్లు. మంచి భోజనాన్ని పెట్టి విశ్రాంతినిప్పించు’ అన్నాడు.శ్యామా ఆ ఇద్దరినీ తనింటికి తీసుకెళ్లాడు. చక్కగా భోజనాన్ని పెట్టాడు. వాళ్లు తినడం ముగించాక! బాబా చెప్పిన కథ మీకేమైనా అర్థమయిందా? బాబా ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. ఉన్నాడు. ఆయనేమిటి? సముద్రపు ఒడ్డేమిటి? బ్రాహ్మణగృహంలో ఉండటమేమిటి? ఆయన దగ్గర 30 వేల రూపాయలుండటం, అవి ఓ దొంగ చేతికి చిక్కడం, ఆయన దుఃఖిస్తూ ఉండిపోవడం, తిరిగి సొమ్ము ఆయనకి రావడం... ద్వారకామాయికి రావడం... ఇదంతా అగమ్యగోచరంగా ఉంది నాకు. మీ ఇద్దరూ వచ్చాక బాబా ఈ కథని చెప్పాడంటే ఈ కథకి తుదీ మొదలూ మీకే తెలిసుండాలి’ అన్నాడు. దాంతో ఆ ఇద్దరి కంఠాలు గద్గదమైపోతూ ఉంటే మొదటి ఆయన చెప్పాడు. ఆ కథ నాదే. చిచిఘాట్ నా జన్మస్థానం. నిరుపేదనైన నేను సముద్రపు ఒడ్డున తిరుగుతూ ఉద్యోగం కోసం ప్రయత్నించసాగాను. దత్తాత్రేయుణ్ని కొలుస్తూ ఉద్యోగం రాగానే మొదటి జీతాన్ని సమర్పించుకుంటానన్నాను. చిత్రమేమంటే నా మొదటి జీతం 15. నేటి జీతం 700. అన్నాను గానీ మొదటి జీతాన్ని మొక్కుగా చెల్లించుకోవాలనే మాటను మరచాను. సరిగ్గా బాబా నేటి జీతాన్ని 700 అని చెప్తూ నాటి జీతమే (15 మాత్రమే) కావాలని నేను చెప్పకుండా ఈయకుండా ఉంటే ‘అడిగి మరీ తీసుకున్నాడు’. ఆయన ఓ దైవం. సర్వజ్ఞుడు.దోషాన్ని మనకి మనమే గుర్తించేలా చేసి క్షమించే దైవం అని ముగించాడు.కాబట్టి కంచికామకోటి పరమాచార్యులవారు ఓ మాటని చెప్తూ ఉండేవారు. ఎవరైనా దైవానికి మొక్కుకుని ఉంటే ప్రతిరోజూ డైరీలోనూ మొదటివాక్యంగా ఈ మొక్కు వివరాలను రాసుకుంటూ ఉండాలని. అది ఎంత గొప్పమాట. సత్యనారాయణస్వామి వ్రతంలో మొక్కుని మరిచిపోవడం, షావుకారుకి భార్య గుర్తు చేసినా వాయిదా వేయడం, చివరికి తప్పుని అంగీకరించి ఒడ్డునపడటం.. అనే ఆ కథ ఎంతటి కనువిప్పునిస్తుంది మనకి! గమనించుకోవాలి! అనుకోకుండా వచ్చిన క్రమక్రమ ఆపదలలో మొక్కేసుకోవడం ఇన్ని సంఖ్యలో ఉన్న మొక్కుల్లో దేన్నో మర్చిపోవడం లేదా మొక్కుకున్న వివరం గుర్తులేకపోవడం వంటివి జరుగుతూ ఉండటం సర్వసాధారణం. సాయి దయార్ద్రహృదయుడు కాబట్టి మనం చేసిన దోషాన్ని గుర్తుచేసి మరీ మనచేత తీర్పించుకుంటాడన్న మాట. అలాగని ఆయనే గుర్తు చేస్తాడు కదా! అహంకార నిర్లక్ష్యభావాన్ని చూపిస్తే మనకి ఫలితం బాగా అర్థమయ్యేలా చేస్తాడు కూడా! కాబట్టి సకాలంలో మొక్కుని సరిగా తీర్చుకోవాలి తప్పదు! రెండవది నా కథే! రెండవ ఆయన కన్నీళ్లు తన్నుకుంటూ వస్తూంటే తన కథని చెప్పసాగాడు. ‘నేనొక వర్తకుడ్ని. వ్యాపారపు పనుల కారణంగా కుదరదనుకుని ఒక బ్రాహ్మణజాతి వంటవాడ్ని ఏర్పాటు చేసుకున్నాను. 35 ఏండ్ల నుండే మా ఇంట్లో తలలో నాలుకగా అయిపోయాడాయన.ఎవరో ఒక నీచుని సహవాసం వచ్చింది. దాంతో నేను పడుకునే గదిలో డబ్బు దాచుకునే బీరువా ఏ గోడలో బిగింపబడి ఉంటుందో తెలిసిన అతను ఓ నాటి రాత్రి ఆ గోడకి అమర్చబడిన బీరువాకి అటు ఇటూ ఉండే ఇటుకల్ని తొలగించి బీరువాకి రంధ్రాన్ని చేసి 30,000 రూపాయల సొమ్ముని కాజేశాడు. వ్యాపారపు పెట్టుబడి సొమ్మంతా దొంగతనానికి గురైందని తెలిసి ఇవ్వవలసినవారికి ఎలా ఇయ్యాలో.. సరుకుని ఎలా కొనుగోలు చేయాలో?... ఏం దిక్కుతోచక బావురుమంటూ ఏడుస్తూ 15 రోజుల పాటు కంటికీ మింటికీ ధారగా ఏడుస్తూనే గడిపాను రాత్రింబవళ్లని.15 రోజుల పాటూ మరో పనిలేదు. ఏడుపే ఏడుపే. 15 రోజులు నిండాక ఓ ఫకీరు నా దగ్గర కొచ్చాడు. ఏడుస్తున్న నన్ను దగ్గరికి తీసుకుంటూ కారణాన్ని అడిగాడు. చెప్పాను. వెంటనే తరుణోపాయాన్ని (కష్టాన్ని దాటగల ఉపాయాన్ని) చెప్పాడు. ‘కీపర్గాంవ్ అనే తాలూకాలో షిరిడీ అనే కుగ్రామం ఉంది. అక్కడ ‘సాయి’ అనే ఓ జాలియా (నియమ బద్ధమైన జీవితాన్ని గడిపే జ్ఞాని అయిన ఫకీరు) ఉన్నాడు. ఆయనకి మొక్కుకో! ‘నీ సొమ్ము నీకు వచ్చేలా చేయవలసిందనీ సొమ్మొచ్చే వరకూ వరి అన్నాన్ని (నిత్య ఆహారం) ముట్టనే ముట్టననీ సొమ్ము లభించాక దర్శనానికొస్తాననీ, ఈలోగా నామజపాన్ని చేస్తూనే ఉంటాను’ అని మొక్కుకో అన్నాడు. ఆ ఫకీరు చెప్పిన మాటల్నే మంత్రంగా భావించి అలాగే చేయసాగాను. ఆశ్చర్యకరంగా ఆ బ్రాహ్మణజాతి వంటవాడు వచ్చి 30 వేల రూపాయలనీ ఇచ్చేసి.. మతిభ్రమించి ఏం చేశానో ఆ సమయంలో తెలియలేదు. తిరిగి ఈ సొమ్మునిచ్చే వరకూ మనశ్శాంతి లేక ఇలా వచ్చాను అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎన్నిమార్లు వెదికినా నాకు ఈ కోపర్గాంవ్ జిల్లాలోని షిరిడీ కుగ్రామంలోని సాయి వద్దకి వెళ్లవలసిందనీ ఆహార నిషేధాన్ని పాటించవలసిందనీ నామజపాన్ని కానిస్తూండవలసిందనీ చెప్పిన ఆనాటి ఫకీరు కనపడనే లేదు. అలాంటి వ్యక్తి ఎవరికీ కనపడలేదని కూడా అందరూ చెప్పారు.ఈ రోజున ఇక్కడికి వచ్చాను. ఆ ఫకీరు చెప్పిన సాయి ఈయనయే. నా చరిత్ర మొత్తం అలా కళ్లకి కట్టినట్టు చెప్పడం.. 30 వేలు మాత్రమే అని చెప్పగలగడం. నా 15 రోజుల శోకం.. ఇదంతా అక్షరాక్షర సత్యం అని ఆనందాశ్రువుల్ని రాల్చాడు.సొమ్ము 30 వేలూ నాకు లభించాక కూడా నేను మరింత వ్యాపారాభివృద్ధికి ‘కొలాబా’ అనే ప్రదేశానికి వెళ్లాను. సాయి నాకు స్వప్నంలో కనిపించాడు. అంతే! బుర్ర పాడయిపోయింది. ఇంత సొమ్ములభింపజేసిన సాయి దర్శనం కంటే వ్యాపారం ముఖ్యమా? అనుకుంటూ సముద్రపు నౌక దగ్గరికి రాగానే అడ్డుకున్నాడు సరంగు(కెప్టెన్). ఒక సిపాయి–తనకి నేను బాగా తెలుసునని చెప్తూ లోనికి ఎక్కనిచ్చాడు. ఇలా రాగలిగాను బుద్ధివంకరని పోగొట్టుకుని. ఆయనకి నేను 35 రూపాయలని ఇయ్యబూనడమా? ఎంత అవివేకిని? అంటూ బిగ్గరగా ఏడ్చాడు. గమనించుకోవాలి! మనం మొక్కుని ఎప్పుడు తీర్చుకోకుండా ఉంటామో అప్పుడు మన అపరాధాన్ని తెలియజేసే కరుణార్ద్రహృదయుడాయన. అహంకరిస్తే అథఃపాతాళానికి తొక్కే సాహసపరాక్రమవంతుడూ ఆయనే. – సశేషం -
భారత సంతతి వ్యక్తికి ఐన్స్టీన్ ప్రైజ్
చికాగో: భౌతికశాస్త్రంలో అత్యున్నత సేవలందించిన వారికి ప్రోత్సాహకంగా అమెరికన్ ఫిజికల్ సొసైటీ (ఏపీఎస్) అందజేస్తున్న ప్రతిష్టాత్మక ‘ఐన్స్టీన్ ప్రైజ్’కు ఈ ఏడాది భారత సంతతి వ్యక్తి ప్రొఫెసర్ అభయ్ అష్టేకర్ ఎంపికయ్యారు. అక్టోబర్ 23న జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో అభయ్ ఐన్స్టీన్ ప్రైజ్–2018తోపాటు పదివేల డాలర్లను నగదు ప్రోత్సాహకాన్ని అందుకుంటారు. అభయ్ ప్రస్తుతం ఫిజిక్స్ ప్రొఫెసర్గా సేవలందిస్తుండడంతోపాటు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషన్ అండ్ ది కాస్మోస్కి డైరెక్టర్గానూ వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా అభయ్ మాట్లాడుతూ... ‘ఈ అవార్డు గెలుచుకోవడం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఏపీఎస్ అందించే పురస్కారాల్లో ఇదే అత్యంత గౌరవమైంది. భారత్లో విద్యనభ్యసిస్తున్నప్పటి నుంచి నాకు భౌతికశాస్త్రంపై ఎంతో ఆసక్తి ఉండేది. మొదట్లో నాకు కేవలం ఒక మరాఠీ మాత్రమే తెలిసేది. పదకొండో తరగతి వరకు మరాఠీ మీడియంలో చదువుకున్నాను. హిందీ, ఇంగ్లిష్ భాషలపై పట్టుసాధించిన తర్వాత సంస్కృతిపై భాష ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని తెలుసుకున్నాను. కాలేజీ రోజుల్లో నేర్చుకున్న భౌతికశాస్త్రం ప్రకృతిని అర్థం చేసుకోడానికి ఎంతగానో ఉపయోగపడింద’న్నారు. 1974లో యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి పీహెచ్డీని పూర్తిచేసిన అభయ్... లూప్ క్వాంటమ్ గ్రావిటీ ప్రోగ్రామ్పై అనేక పరిశోధనలు చేశారు. -
‘ఆప్టికల్ లేజర్’కు నోబెల్
స్టాక్హోం: ఆప్టికల్ లేజర్లపై కీలక పరిశోధనలు చేసి కంటి శస్త్రచికిత్సల్లో అధునాతన పరికరాలను ఉపయోగించేందుకు దోహదపడిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ భౌతికశాస్త్ర బహుమతి దక్కింది. అమెరికా శాస్త్రజ్ఞుడు ఆర్థర్ ఆష్కిన్ (96), ఫ్రాన్స్కు చెందిన జెరార్డ్ మోరో (74), కెనడా శాస్త్రజ్ఞురాలు డొనా స్ట్రిక్లాండ్ (59)లను ఈ ఏడాది నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ప్రకటించింది. భౌతిక శాస్త్ర నోబెల్ను తొలిసారిగా 1901లో ప్రవేశపెట్టగా అప్పటి నుంచి ఈ బహుమతి అందుకున్న మూడో మహిళ, 55 ఏళ్లలో తొలి మహిళ డొనా స్ట్రిక్లాండ్ కావడం విశేషం. అలాగే నోబెల్ బహుమతి పొందిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆర్థర్ ఆష్కిన్ నిలవడం మరో విశేషం. 2007లో అమెరికా ఆర్థికవేత్త లియోనిడ్ హర్విచ్ తనకు 90 ఏళ్ల వయ సులో నోబెల్ పొందగా, ఆర్థర్ ఆష్కిన్ 96 ఏళ్ల వయసులో నోబెల్ గెలుచుకుని రికార్డు నమో దు చేశారు. నోబెల్ బహుమతి మొత్తం విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, ఇందులో సగాన్ని ఆర్థర్ ఆష్కిన్కు, మిగిలిన సగాన్ని మళ్లీ రెండు సమ భాగాలుగా చేసి జెరార్డ్ మోరో, డొనా స్ట్రిక్లాండ్లకు ఇవ్వనున్నారు. ఆప్టికల్ ట్వీజర్ల తయారీకి తగిన గుర్తింపు సూక్ష్మ క్రిములు, అణువులు, పరమాణువులు, ఇతర జీవించి ఉన్న కణాలను లేజర్ బీమ్లను ఉపయోగించి పట్టుకునే ఆప్టికల్ ట్వీజర్ల (పట్టుకారు వంటివి)ను తయారుచేసినందుకు ఆర్థర్ ఆష్కిన్కు ఈ గౌరవం దక్కింది. ఈ ట్వీజర్ల సాయంతో కాంతి ధార్మిక పీడనాన్ని ఉపయోగించి భౌతిక పదార్థాలను ఆయన కదల్చగలిగారని అకాడమీ తెలిపింది. ఆష్కిన్ 1952 నుంచి 1991 మధ్య కాలంలో అమెరికాలోని ఏటీ అండ్ టీ బెల్ ల్యాబొరేటరీస్లో పనిచేస్తున్న కాలంలోనే 1987లో సూక్ష్మజీవులకు హాని చేయకుండానే వాటిని పట్టుకునే ట్వీజర్లను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకుగాను ఆయనకు నోబెల్ ఇస్తున్నట్లు అకాడమీ తెలిపింది. 1991లో పదవీ విరమణ పొందిన ఆష్కిన్, అప్పటి నుంచి తన ఇంట్లోని ప్రయోగశాలలోనే జీవితం గడుపుతున్నారు. మరోవైపు అత్యంత చిన్న ఆప్టికల్ పల్స్లను ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేసినందుకు జెరార్డ్ మోరో, డొనా స్ట్రిక్లాండ్లకు నోబెల్ లభించింది. మోరోకు ఫ్రాన్స్లోని ఎకోల్ పాలిటెక్నిక్తోపాటు అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయంతో అనుబంధం ఉండ గా, డొనా స్ట్రిక్ల్యాండ్ ఆయన విద్యార్థినే. ప్రస్తు తం ఆమె కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. వీరు ఉత్పత్తి చేసిన ఆప్టికల్ పల్స్ అత్యంత చిన్నవి, సమర్థవంతమైనవని జ్యూరీ పేర్కొంది. మహిళలు చాలా అరుదు: డొనా స్ట్రిక్లాండ్ నోబెల్ బహుమతిని ప్రకటించిన అనంతరం డొనా అకాడమీతో ఫోన్లో మాట్లాడారు. స్త్రీలకు పెద్దగా దక్కని అవార్డును తాను అందుకోవటం తనను పులకరింపజేస్తోందని ఆమె అన్నారు. ‘మహిళా భౌతిక శాస్త్రవేత్తలు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి వారు చాలా ప్రత్యేకం. అలాంటి వారిలో నేనొకరిని అయినందుకు గర్వంగా ఉంది’ అంటూ స్ట్రిక్లాండ్ ఆనందం వ్యక్తం చేశారు. స్ట్రిక్లాండ్ కన్నా ముందు 1903లో మేడం క్యూరీకి, 1963లో మరియా గోప్పెర్ట్ మాయెర్కు మాత్రమే భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి దక్కింది. అంటే భౌతిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న మూడో మహిళ. మహిళా శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులు తక్కువగా వస్తుండటంపై అకాడమీ గతంలోనే విచారం వ్యక్తం చేసింది. తామేమీ పురుషుల పట్ల పక్షపాతంతో వ్యవహరించడం లేదనీ, క్షేత్రస్థాయిలో ప్రయోగశాలల తలుపులు మహిళలకు చాలా చోట్ల మూసుకుపోయాయని గతంలో వ్యాఖ్యానించింది. -
నోబెల్ : 55 ఏళ్లలో ఫిజిక్స్లో తొలిసారి మహిళకి...
స్టాక్హోమ్ : 55 ఏళ్లలో తొలిసారి.. భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో నోబెల్ పురస్కారాన్ని ఓ మహిళా కూడా అందుకున్నారు. నేడు భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ పురస్కారాన్ని లేజర్ ఫిజిక్స్లో సంచలనాత్మకమైన ఆవిష్కరణలు చేసినందుకు గాను, ఆర్థూర్ ఆష్కిన్కు, మరో ఇద్దరు శాస్త్రవేత్తలు జెరార్డ్ మౌరో, డోన్నా స్క్రిక్లాండ్లకు సమిష్టిగా అందజేస్తున్నట్టు ‘ది రాయల్ స్వీడిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ నేడు ప్రకటించింది. 55 ఏళ్లలో తొలిసారి ఈ పురస్కారాన్ని అందుకున్న మహిళ స్క్రిక్లాండ్. మహిళా భౌతిక శాస్త్రవేత్తలందరూ ఎంతో సంబరం చేసుకోవాల్సినవసరం వచ్చిందని, వారిలో నేను ఒకదాన్ని అని స్టాక్హోమ్లో నోబెల్ పురస్కారం ప్రకటన తర్వాత న్యూస్ కాన్ఫరెన్స్లో స్క్రిక్లాండ్ ఆనందం వ్యక్తం చేశారు. ఫిజిక్స్లో నోబెల్ అవార్డు అందుకున్న మహిళల్లో స్క్రిక్లాండ్ మూడో మహిళ. అంతకముందు 1903లో మేరి క్యూరికి, 1963లో మారియ గోపెర్ట్ మేయర్కు ఈ పురస్కారం దక్కింది. స్క్రిక్లాండ్ షేర్ చేసుకున్న శాస్త్రవేత్తలో ఆష్కిన్ది అమెరికా కాగా, మౌరు ఫ్రెంచ్కు చెందిన వారు. ఇక స్క్రిక్లాండ్ కెనడియన్ మహిళ. వీరు మొత్తం తొమ్మిది మిలియన్ల స్వీడిష్ క్రోనర్ అంటే రూ.7,34,33,374ను పొందనున్నారు. -
మానవ మనుగడకు భౌతిక శాస్త్ర పరిశోధనలే కీలకం
విజయనగరం అర్బన్ : విశ్వమానవ మనుగడకు భౌతిక శాస్త్ర పరిశోధనలే కీలకమని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ సంస్థ (భువనేశ్వర్) డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ పండా అన్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు సంయుక్త సహకారంలో స్థానిక మహరాజా అటానమస్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సు ప్రారంభోత్సవ సభలో గురువారం ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ గురుత్వాకర్షణ తరంగాల నుంచి అంతరాల పరమాణు కణాల వరకు ప్రతి అంశం మానవ జీవనానికి ముడిపడినవేని చెప్పారు. భౌతిక శాస్త్ర అంశాలపై పరిశోధనలు విస్తృత స్థాయిలో జరగాలని సూచించారు. విద్యార్ధి దశ నుంచి పరిశోధనా దృక్పథాన్ని కల్పించే బోధనాంశాల శైలి రావాలని అభిప్రాయపడ్డారు. అనంతరం సదస్సు తొలిరోజు కార్యక్రమాలను ప్రారంభించారు. తొలిరోజు వక్తలుగా ప్రొఫెసర్లు అజిత్ మోహన్ శ్రీవత్స, డాక్టర్ సంజీవకుమార్ అగర్వాలా, డాక్టర్ నిష్నికాంత్ కాందాయ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ఎ.కల్యాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాన్సాస్ ట్రస్ట్ సభ్యులు పూసపాటి అదితిగజపతిరాజు, కరస్పాండెంట్ డాక్టర్ డి.ఆర్.కె.రాజు, ఫిజిక్స్ విభాగ అధిపతి డాక్టర్ డి.బి.ఆర్.కె.మూర్తి, కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు, పరిశోధన విద్యార్థులు, పీజీ, డిగ్రీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
విద్యార్థులపై ఒత్తిడి తగదు
భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని మించినది ‘ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు’. శాస్త్ర పరిశోధన రంగంలో విశిష్ట గుర్తింపు కలిగిన ఈ అవార్డును రష్యన్ నోబెల్గా పరిగణిస్తారు. దీని కింద ఇచ్చే నగదు బహుమతి నోబెల్ బహుమతికి రెట్టింపు ఉంటుంది. ఈ అవార్డు సాధించిన భారతీయుడు, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ అశోక్సేన్. ఆయన ప్రతిపాదించిన తీగ సిద్ధాంతానికి(స్ట్రింగ్ థియరీకి) ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు దక్కింది. సేన్ను ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ స్వయంగా ‘రాయల్ సొసైటీ ఫెలోషిప్’కు నామినేట్ చేశారు. సేన్కు పలు జాతీయ, అంతర్జాతీయ ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. దేశ విదేశాల్లో పరిశోధనలు చేసిన ఆయన కాన్పూర్ ఐఐటీలో ఎంఎస్సీ (ఫిజిక్స్) చేశారు. అమెరికాలోని ‘స్టోనీ బ్రూక్’ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)తో పాటు పలు దేశాల్లో పనిచేసిన తర్వాత స్వదేశానికి వచ్చి టాటా ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో పనిచేశారు. ప్రస్తుతం అలహాబాద్లోని హరీష్–చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పరిశోధనలు సాగిస్తున్నారు. మల్లు విశ్వనాథరెడ్డి – సాక్షి, అమరావతి బ్యూరో : ఓ విద్యార్థి విజ్ఞానానికి, చదివే మాధ్యమానికి (మీడియం) సంబంధం లేదని ప్రముఖ భౌతిక శాస్త్ర వేత్త, ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు గ్రహీత ప్రొఫె సర్ అశోక్సేన్ పేర్కొన్నారు. కాలేజీలో చేరే వరకూ తాను బెంగాలీ మాధ్యమంలో చదువుకున్నానని చెప్పారు. ప్రాథమిక విద్యకు చాలా ప్రాధాన్యం ఉందని, అందుకు తగినట్లుగా బడ్జెట్ కేటాయింపులు పెరగాలన్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో సీటు సాధించాలనే లక్ష్యంతో పిల్లలపై తీవ్ర ఒత్తిడి పెంచడం తగదని తల్లిదండ్రులకు సూచించారు. ఎక్కువ జీతం లభించే ఉద్యోగం వైపు కాకుండా ఆసక్తి ఉన్న వైపు ప్రయాణిస్తేనే విజయం వరిస్తుందని తెలిపారు. ‘చుక్కపల్లి పిచ్చయ్య 6వ స్మారక ఉపన్యాసం’కోసం విజయవాడ వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ.. సాక్షి: ప్రతిష్టాత్మక ఫండమెంటల్ ఫిజిక్స్ అవార్డు అందుకున్నందుకు అభినందనలు. అవార్డులో భాగంగా వచ్చిన నగదు తీసుకోవడానికి ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చిందా? సేన్: లేదు. అవార్డు కింద 3 మిలియన్ డాలర్ల నగదు బహుమతి వచ్చింది. ట్రస్టు ఏర్పాటు చేశా. విద్యారంగంలో ఈ ట్రస్టు పనిచేస్తోంది. సాక్షి: మీ బాల్యం గురించి చెప్పండి. మీరు భౌతికశాస్త్రం వైపు రావడానికి స్ఫూర్తి ఎవరు? సేన్: మా నాన్న ఫిజిక్స్ టీచర్. అందువల్ల ఫిజిక్స్ మీద ఆసక్తి కలిగింది. నేను +2 పూర్తి చేసిన సమయంలో బెంగాల్లో ఫిజిక్స్ మోస్ట్ పాపులర్ సబ్జెక్ట్. బోర్డు పరీక్షల్లో నేను టాప్ 10లో లేను. టాప్ టెన్లో ఐదుగురు ఫిజిక్స్ తీసుకున్నారు. అప్పట్లో ఫిజిక్స్కు బాగా క్రేజ్ ఉండేది. సాక్షి: పరిశోధన రంగం పట్ల ఆకర్షితులు కావడానికి కారకులెవరు? సేన్: ఒకరని చెప్పలేను. నేను డిగ్రీ చదివిన కోల్కతా ప్రెసిడెన్సీ కాలేజీలో అమల్ రాయ్చౌధురి, కాన్పూర్ ఐఐటీలో చాలా మంది ప్రొఫెసర్లు, టీచర్లు చాలా మంది నా జీవితంలో ఉన్నారు. సాక్షి: తెలుగు రాష్ట్రాల్లో ఐఐటీ పట్ల విపరీతమైన ఆకర్షణ ఉంది. తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది తమ పిల్లలు ఐఐటీల్లో చదవాలని ఉబలాటపడుతున్నారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని కొన్ని కార్పొరేట్ కాలేజీలు పెద్ద వ్యాపారం చేస్తూ రూ. కోట్లు సం పాదించుకుంటున్నాయి. పాఠశాల స్థాయిలోనే ఐఐ టీ ఫౌండేషన్ కోర్సులు నిర్వహిస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీనిపై మీ సలహా ఏమిటి? సేన్: పిల్లలు ఎలా ఎదగాలి? ఏం కావాలి? అనే విషయాలను వారికే విడిచిపెట్టాలి. పాఠశాలల్లో ఉన్న పిల్లలకు తమ ఆసక్తి ఏమిటనే విషయం పూర్తిగా తెలియకపోవచ్చు. పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి తగదు. ఐఐటీలో సీటు రాకపోతే జీవితం లేదనే భావన మంచిది కాదు. పాఠశాల స్థాయి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్సులంటే పిచ్చి అనుకోవాలి. సాక్షి: టెన్త్ తర్వాత ఎక్కువ మంది ఎంపీసీ, బైపీసీ గ్రూపుల వైపు వెళ్తున్నారు. ఏటా లక్షలాదిగా ఇంజనీర్లు తయారవుతున్నారు. కోర్ సైన్స్ వైపు రావట్లే దు. పరిశోధన రంగం మీద దీని ప్రభావం ఉండదా? సేన్: అందరూ ఇంజనీర్లు కావాలనే ఆలోచన మంచిది కాదు. కోర్ సైన్స్లోనూ మంచి భవిష్యత్ ఉంది. సైన్స్ పట్ల ఆసక్తి ఉంటే తప్పనిసరిగా అటు వైపు రావాలని నేను విద్యార్థులకు సూచిస్తా. ఆసక్తి ఉన్న వైపు ప్రయాణిస్తేనే విజయం వరిస్తుంది. సాక్షి: మీరు పలు దేశాల్లో పరిశోధన రంగంలో పని చేశారు. విదేశాలకు, ఇక్కడకు ఉన్న తేదా ఏమిటి? సేన్: థియరిటికల్ రీసెర్చ్లో పెద్దగా ఉండదు. నేను అందులోనే పరిశోధనలు చేస్తున్నా. సైద్ధాంతిక పరిశోధనకు ల్యాబ్ కూడా అక్కర్లేదు. విదేశీ వర్సిటీల్లో పరిశోధన కార్యకలాపాలు బాగా ఎక్కువ. ప్రయోగాత్మక పరిశోధనకు మంచి అవకాశాలున్నాయి. మనకు బ్యూరోక్రసీ పెద్ద అడ్డంకి. ప్రభుత్వాలు నిధులు ఇస్తున్నాయి కానీ వ్యయం చేయడంలోనే సమస్యలున్నా యి. శాస్త్ర పరిశోధన రంగంలో ఉన్న వారికే వ్యయం చేసే అధికారం ఇవ్వాలి. లోయస్ట్ బిడ్డర్ విధానం పనికిరాదు. బ్యూరోక్రసీ దాన్నే అనుసరిస్తోంది. సాక్షి: విద్యలో నాణ్యత పెరగడానికి మీరిచ్చే సలహా? సేన్: ప్రాథమిక విద్య చాలా ముఖ్యం. కాలేజీల్లో, వర్సిటీల్లో మాత్రం టీచర్ల మీద మరీ ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదు. కొంత గైడెన్స్ ఉంటే సరి పోతుంది. ప్రాథమిక స్థాయిలో అలా కాదు. టీచర్ గైడెన్స్ మీద పిల్లల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. వర్సిటీ ప్రొఫెసర్లకు ఇస్తున్న స్థాయిలో ప్రైమరీ టీచ ర్లకు జీతాలు ఇవ్వాలి. తద్వారా మంచి ప్రతిభ ఉన్న వారిని ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. -
ఫిజిక్స్తో మెదడులో కొత్త చైతన్యం!
వినేందుకు కొంత విచిత్రంగా అనిపిస్తుంది. ఫిజిక్స్ నేర్చుకుంటే... మెదడులో కొన్ని ప్రాంతాలు మరింత చైతన్యవంతమవుతాయి అంటున్నారు ఫ్లారిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. మెదడు పనిచేసే తీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాడే ఫంక్షనల్ మాగ్నెటిక్ రిసొనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్ఎమ్మారై) వాడి తాము ఈ అంచనాకు వచ్చామని ఎరిక్ బ్రూవీ అనే శాస్త్రవేత్త తెలిపారు. దాదాపు 50 మంది స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్న ఈ ప్రయోగంలో అత్యాధునిక పద్ధతులను ఉపయోగిస్తూ తాము ఒక భౌతికశాస్త్ర కోర్సు మొదలుపెట్టామని, ఎఫ్ఎమ్మారై ద్వారా వారి మెదడును పరిశీలించినప్పుడు కొన్ని కొత్త ప్రాంతాలు చైతన్యవంతం కావడాన్ని గుర్తించామని వివరించారు. కోర్సు ప్రారంభానికి ముందు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సమస్య పూరణం వంటి అంశాలకు సంబంధించిన మెదడు ప్రాంతాలు చురుకుగా మారితే.. కోర్సు పూర్తయిన తరువాత ఫ్రంటల్ పోల్స్ ప్రాంతంతోపాటు పోస్టీరియర్ సింగులేట్ కార్టెక్స్ అనే భాగం కూడా చైతన్యవంతమైంది. మొదటి భాగం నేర్చుకోవడానికి సంబంధించిందైతే.. రెండోది ఎపిసోడిక్ మెమరీ అంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలను క్రమపద్ధతిలో నెమరేసుకోవడం, సెల్ఫ్ రెఫరెన్షియల్ థాట్ అంశాలకు సంబంధించినవని బ్రూవీ తెలిపారు. -
‘విశ్వ’ విజేత
కాలేజీ రోజుల్లో అతడూ అందరిలాంటి కుర్రాడే... రోజంతా... స్నేహితులతో షికార్లు.. పార్టీలతో సరదాగా గడిపిన వాడే! తెలివైన వాడనే ఒకే ఒక్క కారణం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేసే అవకాశమిచ్చింది. అయితేనేం.. ఒకసారి గురి కుదిరిన తరువాత మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు.. మనకు కనిపించని విశాల విశ్వం అంచులని తాకింది ఆయన దృష్టి.. విశ్వం ఆవిర్భావం మొదలుకొని... అన్నింటినీ తనలో కలుపుకోగల కృష్ణబిలాల వరకూ.. భౌతికశాస్త్రాన్ని ఔపోసన పట్టేశాడు. సిద్ధాంతాల చట్రంలోకి తెచ్చేశాడు. ఒళ్లు చచ్చుబడిపోయినా.. ఒకదశలో కళ్లు మినహా మరే ఇతర అవయవం పనిచేయకపోయినా... తన మేధోశక్తితో విశ్వం ఆనుపానులను సామాన్యుడి దరికి చేర్చాడు. ఈ తరం ఐన్స్టీన్గా మిగిలిపోయాడు. ‘స్టీఫెన్ హాకింగ్’పేరుతో కాలంలోకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.. సాక్షి, హైదరాబాద్: మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడేది భౌతిక శాస్త్రం. నాలుగు వందల ఏళ్ల క్రితం సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వ ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం భౌతికశాస్త్ర పురోభివృద్ధికి తొలి మేలిమలుపు అయితే.. 20వ శతాబ్దం తొలినాళ్లలో ఐన్స్టీన్ సామాన్య సాపేక్ష సిద్ధాంతం రెండవదన్నది అందరూ అంగీకరించే విషయం. సామాన్య సాపేక్ష సిద్ధాంతం విశాల విశ్వం పనితీరుపై ఒక అవగాహన కల్పిస్తుంది. అణుస్థాయిలో భౌతిక ప్రపంచం తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు పనికొచ్చే క్వాంటమ్ మెకానిక్స్పై కూడా ఐన్స్టీన్ ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తోంది అంటే.. అటు విశాల విశ్వాన్ని విడమరచి చెప్పే సాపేక్ష సిద్ధాంతాన్ని.. ఇటు సూక్ష్మ ప్రపంచం ధర్మాలను వివరించే క్వాంటమ్ మెకానిక్స్ను కలిపింది స్టీఫెన్ హాకింగ్ కాబట్టి! భౌతిక శాస్త్రంలో ఇది మూడో మేలి మలుపని ప్రపంచం ఇప్పటికే గుర్తించడం హాకింగ్ గొప్పదనానికి నిదర్శనం. ఐన్స్టీన్, హాకింగ్.. వీరిద్దరిలో ఎవరు గొప్ప అన్న వాదన చాలాకాలంగా జరుగుతోంది. శాస్త్రవేత్తల కమ్యూనిటీ ఈ విషయంలో రెండుగా విడిపోయి ఉండవచ్చు కూడా. ఇద్దరినీ పోల్చి చూడటం సరికాదన్న అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. అయితే కొన్ని విషయాల్లో ఐన్స్టీన్ కంటే హాకింగ్ గొప్పవాడు అనక తప్పదు. అందుకు కారణాలు ఏమిటంటే.. పట్టుమని 21 ఏళ్లు కూడా నిండకుండానే.. ‘ఇంకొన్నేళ్లలో నీకు మరణం తప్పదు’ అని ఎవరైనా అంటే.. కుప్పకూలిపోతారు.. నిరాశ నిస్పృహలతో జీవితాన్ని కొనసాగిస్తారు. స్టీఫెన్ హాకింగ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వైకల్యం ముంచుకొస్తున్న తరుణంలోనే తన మేధకు మరింత పదును పెట్టి ఖగోళశాస్త్రంలో తనదైన ముద్ర వేశాడు. అందుకే ఆయన ఒకచోట ‘‘21 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి జీవితంపై నా అంచనాలన్నీ సున్నా అయిపోయాయి. ఆ తరువాత నాకు దక్కిందంతా బోనస్’’అని అంటాడు. గొంతుకనిచ్చిన టెక్నాలజీ 1985.. హాకింగ్ జెనీవాలో పర్యటిస్తున్నారు. న్యుమోనియా బారిన పడటంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అప్పటికే అమియోమోట్రోపిక్ లాటరల్ స్లె్కరోసిస్ (ఏఎల్ఎస్) వ్యాధితో బాధపడుతున్న హాకింగ్ శరీరం ఈ కొత్త దాడికి తట్టుకోలేకపోయింది. పరిస్థితి విషమించిన దశలో ఆయన ఊపిరి పీల్చుకునేందుకు గాను గొంతుకు రంధ్రం చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన మాట్లాడే అవకాశాన్నీ కోల్పోయారు. కొంతకాలంపాటు కనుబొమల కదలికలతో, స్పెల్లింగ్ కార్డుల సాయంతో అక్షరాలను సూచిస్తూ పదాలను నిర్మించి తన భావాలను వెల్లడించే వారు. ఈ పరిస్థితుల్లో హాకింగ్తో పనిచేస్తున్న మార్టిన్ కింగ్ అనే శాస్త్రవేత్త కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న వర్డ్స్ ప్లస్ అనే సంస్థను సంప్రదించారు. ఈ సంస్థ అధిపతి వూల్టోజ్ అత్తగారూ ఏఎల్ఎస్తో బాధపడుతుండేవారు. ఆమె మాట్లాడేందుకు, రాసేందుకు వీలుగా వూల్టోజ్ ఈక్వలైజర్ పేరుతో ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు. హాకింగ్కు ఇదేమైనా ఉపయోగపడుతుందేమో అని మార్టిన్ కింగ్ వూల్టోజ్ను విచారించారు. వూల్టోజ్ ఆ ఈక్వలైజర్ను హాకింగ్కు ఉచితంగా ఇచ్చేశారు. ఆపిల్ –2 కంప్యూటర్పై ఈక్వలైజర్ సాఫ్ట్వేర్కు స్పీచ్ సింథసైజర్ అనే పరికరం తోడైంది. హాకింగ్కు సపర్యలు చేసిన ఒక నర్సు భర్త డేవిడ్ మేసన్ దీన్ని తయారు చేశాడు. చిన్నసైజులో ఉండే ఈ స్పీచ్ సింథసైజర్ హాకింగ్ చక్రాల కుర్చీ చేతిమీద అమరిపోయింది. వీటి సాయంతో హాకింగ్ నిమిషానికి 15 పదాల చొప్పున మాట్లాడటం ప్రారంభించారు. అయితే, తన బొటనవేలిని మాత్రం కదిలించేందుకు ఉపయోగపడ్డ ఒక నాడి క్రమేపీ దెబ్బతినడంతో 2008 నాటికి ఆయన మౌస్ను క్లిక్ చేసే సామర్థ్యాన్ని కూడా కోల్పోయారు. ఈ దశలో హాకింగ్ విద్యార్థి ఒకరు చీక్ స్విచ్ పేరుతో ఇంకో చిన్న పరికరాన్ని అభివృద్ధి చేశారు. హాకింగ్ కళ్లజోడుకు అతుక్కునేలా రూపొందించిన ఈ పరికరం పరారుణ కాంతితో పనిచేసేది. దవడ కండరాలను బిగించడం ద్వారా ఇది మౌస్ మాదిరిగా పనిచేసేది. ఈ పరికరం సాయంతో హాకింగ్ ఈ మెయిళ్లు రాయడం మొదలుకొని ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం, పుస్తకాలు రాయడం, స్పీచ్ సింథసైజర్ సాయంతో మాట్లాడగలగడం వంటి అనేక పనులు చేయగలిగారు. 2011 నాటికి పరిస్థితి మరింత క్షీణించింది. నిమిషానికి ఒకట్రెండు మాటలు మాత్రమే మాట్లాడగలిగిన స్థితికి చేరుకున్నారు. ఈ దశలో ఇంటెల్ వ్యవస్థాపకుడు గార్డన్ మూర్ సాయం అందించేందుకు ముందుకొచ్చారు. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జస్టిన్ రాట్నర్ కొంతమంది నిపుణుల సాయంతో హాకింగ్ ఆలోచనలనే మాటల రూపంలోకి మార్చగలిగారు. భూమిపై... ‘మనం భూమిని ఖాళీ చేయాల్సిన సమయం ఎంతో దూరంలో లేదు. మరో వందేళ్లలోనే మనం నివాసయోగ్యంగా ఉండే మరో గ్రహాన్ని వెతుక్కోవాలి. మితిమీరిన జనాభా, వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు, భూమికి అత్యంత సమీపంగా వస్తున్న గ్రహశకలాలతో ఇక భూమిపై జీవించడం దుర్లభంగా మారుతుంది’ –మరో భూమి అన్వేషణ కోసం బీబీసీ డాక్యుమెంటరీపై.. మరణంపై... మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం, నరకం అన్నవి అసలే లేవు. చావు అంటే భయం ఉన్నవారి కోసం అలాంటి కట్టు కథలు అల్లారు. మన మెదడు ఒక కంప్యూటర్ లాంటిది. కంప్యూటర్లో విడిభాగాలు పాడైతే అదెలా పనిచేయదో మెదడు కూడా అంతే.. పనిచేయడం ఆగిపోతుంది. నాకు చావంటే భయం లేదు. అలాగని వెంటనే మరణించాలని లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సింది చాలా ఉంది. జీవించి ఉన్న సమయంలోనే మనలోని శక్తి సామర్థ్యాల్ని సమర్థంగా వినియోగించుకోవాలి. –2011లో గార్డియన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హాకింగ్ 5 అద్భుత రచనలు మై బ్రీఫ్ హిస్టరీ ఇది హాకింగ్ ఆత్మకథ లాంటిది. లండన్లో హాయిగా సాగిన తన బాల్యం.. బెట్స్ కడుతూ తన మిత్రులతో సరదాగా గడిచిన యవ్వనం.. మేధావిగా, ప్రఖ్యాత సైద్ధాంతిక శాస్త్రవేత్తగా తన పరిణామం.. ఈ వివరాలన్నింటినీ ‘మై బ్రీఫ్ హిస్టరీ’లో ఆసక్తికరంగా హాకింగ్ వివరిస్తారు. పాఠకులకు తెలియని ఒక కొత్త హాకింగ్ను, సరదాపరుడు, చతురుడైన హాకింగ్ను ఈ పుస్తకంలో ఆయన పరిచయం చేస్తారు. ఇందులోని అరుదైన ఫొటోగ్రాఫ్లు పాఠకులకు అదనపు ఆసక్తిని కలిగిస్తాయి. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ భౌతిక, ఖగోళ సిద్ధాంతాలు సామాన్యులకు అర్థమయ్యే లా హాకింగ్ ఈ పుస్తకాన్ని 1988లో రాశారు. ఇందులో విశ్వం ఆవిర్భావం, విస్తరణ, అంతరిక్షం, కాలంతో పాటు గురుత్వాకర్షణ, కృష్ణబిలాలను సరళమైన రీతిలో హాకింగ్ వివరించారు. 2001 నాటికి 35 భాషల్లో తర్జుమా అయింది. ది గ్రాండ్ డిజైన్ ఈ పుస్తకాన్ని లియోనార్డ్ మ్లోడినౌ అనే మరో భౌతికశాస్త్రవేత్తతో కలసి హాకింగ్ 2010లో రచించారు. బిగ్బ్యాంగ్(విశ్వ ఆవిర్భావం) భౌతికశాస్త్ర నియమాల ఆధారంగానే జరిగిందనీ, ఇందులో దేవుడి పాత్రేమీ లేదని ఈ పుస్తకంలో హాకింగ్ స్పష్టం చేశారు. విశ్వం పుట్టుకను తెలుసుకునేందుకు దేవుడ్ని అన్వేషించాల్సిన అవసరం లేదన్నారు. ‘దేవుడు లేడని ఎవ్వరూ నిరూపించలేరు. కానీ సైన్స్ దేవుడి అవసరం లేకుండా చేస్తుంది’ అని అన్నారు. యూనివర్స్ ఇన్ ఏ నట్షెల్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ పుస్తకానికి సీక్వెల్గా హాకింగ్ దీన్ని 2001లో రాశారు. ఇందులో తన పరిశోధనలతో పాటు క్వాంటమ్ మెకానిక్స్, ఆధునిక భౌతికశాస్త్ర సిద్ధాంతాలు, ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్తలైన ఐన్స్టీన్, రిచర్డ్ ఫైన్మెన్ల సిద్ధాంతాలను ఇందులో హాకింగ్ వివరించారు. ఈ పుస్తకం 2002లో అవెన్టిస్ ప్రైజ్కు ఎంపికైంది. జార్జ్స్ సీక్రెట్ కీ టు యూనివర్స్ కుమార్తె లూసీతో కలసి హాకింగ్ 2007లో చిన్నారుల కోసం రాసిన పుస్తకమిది. ఇందులో కాస్మోస్ అనే శక్తిమంతమైన కంప్యూటర్ సాయంతో చిన్నారులు సుసన్, రింగో, ఎరిక్, జార్జ్లతో పాటు డా.రీపర్ సాహసాలు చేస్తారు. కథల రూపంలో విశ్వంలోని సంక్లిష్ట అంశాలను సులభంగా అర్థమయ్యేలా హాకింగ్ ఇందులో వివరించారు. భారత్తో అనుబంధం తొలిసారి 2001లో భారత్కు వచ్చిన హాకింగ్ 16 రోజులపాటు దేశంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో జరిగిన ఓ సెమినార్లో ప్రసంగించారు. అలాగే ‘స్ట్రింగ్స్ 2001’పేరుతో జరిగిన మరో కార్యక్రమంలో నిర్వాహకులు హాకింగ్ను ‘సరోజిని దామోదర్ ఫెలోషిప్’తో సత్కరించారు. హాకింగ్ చక్రాల కుర్చీని అమర్చేలా మహీంద్రా అండ్ మహీంద్రా రూపొందించిన ప్రత్యేకమైన కారులో ఆయన ముంబైలో విహరించారు. ఢిల్లీలోని జంతర్మంతర్, కుతుబ్మీనార్లను సందర్శించిన హాకింగ్ ఈ పర్యటనలో భాగంగా అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ను కలుసుకుని దాదాపు 45 నిమిషాల సేపు ముచ్చటించారు. హాకింగ్ను కబళించిన వ్యాధి స్టీఫెన్ హాకింగ్కు 21 ఏళ్ల వయసులోనే అమియోట్రోపిక్ లాటరల్ స్లె్కరోసిస్ (ఏఎల్ఎస్) అనే ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు బయటపడింది. హాకింగ్ మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం బతకరని అప్పట్లో వైద్యులు చెప్పినా ఆయన మరో 50 ఏళ్లపైనే జీవించడం విశేషం. అసలు ఇంతకీ ఏంటీ ఏఎల్ఎస్ వ్యాధి.. దీనినే లౌ గెహ్రిగ్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం చూపే అరుదైన రోగం. భారత్లో ఏడాదికి దాదాపు లక్ష మంది ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు అంచనా. ఇది కండరాలను బలహీనపరిచి ఏ చిన్న పని కూడా చేయనీదు. చికిత్సతో స్వల్ప ప్రయోజనం ఉండొచ్చు కానీ పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. రోజులు గడిచేకొద్దీ వ్యాధి మరింత ముదురుతుంది. క్రమక్రమంగా కండరాలు సత్తువ కోల్పోయి నిలబడటం, మాట్లాడటం, తినడం, కదలడం చేయలేరు. కనీసం సరిగ్గా ఊపిరి కూడా తీసుకోలేరు. నరాల నుంచి మెదడుకు సంకేతాలు చేరవు. కండరాలు చచ్చుబడిపోతాయి. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన మూడు నుంచి ఐదేళ్లలోపు శ్వాసకోశ సంబంధ సమస్యలతో రోగులు చనిపోతారు. ఆస్తులు 129.75 కోట్లు - చనిపోయేనాటికి స్టీఫెన్ హాకింగ్ సంపద రూ.129.75 కోట్లు(2 కోట్ల డాలర్లు)గా ఉంది. - సిమ్సన్స్, ఫ్యుచరమా, స్టార్ట్రెక్: నెక్సట్ జనరేషన్, ద బిగ్బ్యాంగ్ థియరీ వంటి టెలివిజన్ సీరియళ్లలో హాకింగ్ పేరుతో పాత్రలను రూపొందించారు. అడుగడుగునా పోరాటమే వీల్ చైర్ నుంచే విశ్వ రహస్యాలను శోధించి... ఆత్మస్థైర్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జీవితమే ఒక పోరాటం. అరుదైన వ్యాధితో పోరాడటమే కాదు, కుటుంబ జీవితంలోనూ ఆయన ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. గొప్ప శాస్త్రవేత్తగా ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన హాకింగ్ విద్యార్థి జీవితం సాదాసీదాగా గడిచిపోయింది. చదువులో పెద్దగా ప్రతిభ కనబర్చకపోయినప్పటీకీ.. చిన్నారి హాకింగ్ తెలివితేటల్ని చూసి టీచర్లు మంత్రముగ్ధులయ్యేవారు. తొమ్మిదేళ్ల వయసులోనే హాకింగ్కు ఐన్స్టీన్ అనే నిక్నేమ్ కూడా ఉండేది. తొలుత హాకింగ్ను డాక్టర్ చేయాలని ఆయన తండ్రి ఆశపడ్డారు. ఇందుకోసం బయాలజీ తీసుకోవాలని ఒత్తిడి కూడా చేశారు. అయితే హాకింగ్కు గణితంపై అమితమైన ఆసక్తి ఉండటంతో అందులోనే డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో గణితంలో డిగ్రీకి ప్రథమ ప్రాధాన్యం లేకపోవడంతో ఆయన భౌతికశాస్త్రాన్ని ఎంచుకున్నారు. అప్పటి నుంచి భౌతిక, ఖగోళ శాస్త్రాల లోతుపాతుల్ని తెలుసుకోవడం మొదలుపెట్టారు. ప్రేమ.. పెళ్లి 1963లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హాకింగ్కు జేన్ విల్డే అనే అమ్మాయితో తొలిసారి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇంతలోనే తనను అరుదైన వ్యాధి కబళిస్తోందన్న విషయం హాకింగ్కు తెలిసింది. ఈ విషయాన్ని విల్డేకు ఆయన తెలిపారు. ఆమె అంగీకరించడంతో వీరిద్దరూ 1965లో వివాహం చేసుకున్నారు. హాకింగ్ దంపతులకు రాబర్ట్, తిమోతి అనే ఇద్దరు కుమారులు, లూసీ అనే కుమార్తె ఉన్నారు. వివాహం అనంతరం సపర్యలు చేయడానికి వచ్చిన నర్సు ఎలైన్ మాసన్తో హాకింగ్ సన్నిహితంగా ఉండటంతో వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఆయనకు దూరమయ్యారు. హాకింగ్ తమకు దూరమవ్వడానికి ఎలైనే కారణమని అప్పట్లో ఆయన పిల్లలు ఆరోపించారు. అయితే వీటన్నింటిని పట్టించుకోని హాకింగ్ 1995లో ఎలైన్ను వివాహమాడారు. పెళ్లి తర్వాత ఎలైన్ హాకింగ్ను హింసిస్తోందనీ.. చెయ్యి చేసుకుంటోందని తోటి నర్సులు పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనమైంది. తొలుత ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హాకింగ్ ఆ ఆరోపణల్ని ఖండించడంతో కేసును క్లోజ్ చేశారు. ఎలైన్తో హాకింగ్ వివాహబంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. 2006లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత హాకింగ్ తన పిల్లలకు దగ్గరయ్యారు. కుమార్తె లూసీతో కలసి సైన్స్కు సంబంధించి ఐదు పుస్తకాలు రాశారు. హాకింగ్ పరిశోధనలు క్లుప్తంగా.. 1970 ఈ విశ్వం మొత్తం సింగుల్యారిటీ ద్వారా ఏర్పడింది. మనకు కనిపిస్తున్న గ్రహాలు, నక్షత్రాలు అన్నిరకాల ఇతర పదార్థాలు కంటికి కనిపించనంత చిన్న గుళిక స్థాయికి కుంచించుకుపోయాయనుకోండి.. అప్పుడు విశ్వం సాంద్రత, బరువు అనంతమవుతాయి. అంతరిక్షం, కాలం అన్నీ అందులోనే ఇమిడిఉంటాయి. ఈ భావనను సింగ్యులారిటీ అంటారు 1972-74 కృష్ణబిలాల యంత్రాంగం: విశ్వంలో అక్కడక్కడా అదృశ్యంగా ఉండే కృష్ణబిలాల నుంచి కూడా రేడియోధార్మికత వెలువడుతూ ఉంటుందని ప్రతిపాదన. 1981 ఇన్ఫర్మేషన్ పారడాక్స్: కృష్ణబిలంలోకి వెళ్లే పదార్థం, సమాచారం ఏదైనా సరే.. అది ఆవిరి అవడంతో ఎవరికీ అందకుండా పోతుంది. 1983 అనంత విశ్వం: అంతరిక్షం–కాలాలకు సంబంధించి ఈ విశ్వానికి సరిహద్దులు లేవు 1988 కాలం: కాలమనేది దూసుకుపోతున్న మూడు బాణాల వంటిదని హాకింగ్ అంచనా వేశారు. థెర్మోడైనమిక్స్ ఒక బాణమైతే... ఖగోళ, మానసిక సంబంధమైనవి మిగిలిన రెండు. 2006 ఈ విశ్వం వేర్వేరు స్థితుల నుంచి ఉనికిలోకి వచ్చింది. -
అరుదైన మేధావి!
మన కాలపు మహా మేధావి... ఐన్స్టీన్కు మాత్రమే సాటిరాగల విజ్ఞానఖని స్టీఫెన్ హాకింగ్ కన్నుమూశారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఆద్యుడైన గెలీలియో పుట్టిన జనవరి 8న ఒక అమ్మ కడుపున జన్మించి, మరో విఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ జన్మ దినం రోజైన మార్చి 14న కన్నుమూసిన హాకింగ్ భౌతిక శాస్త్రాన్నీ... ప్రత్యేకించి విశ్వనిర్మాణ శాస్త్రాన్నీ ఒడిసిపట్టినవాడు. అందులోని ఎత్తుల్నీ, లోతుల్నీ మధించి లోకులకు తేటతెల్లమైన రీతిలో విప్పి చెప్పినవాడు. ఈ భూగోళం మనుగడపైనా, ఇక్కడి మానవాళి భవిష్యత్తుపైనా ఎంతగానో బెంగపెట్టుకున్నవాడు. వీళ్లందరికీ ఒక సురక్షితమైన గ్రహాన్ని చూపించి కాపాడాలని తపన పడినవాడు. ‘ఇది ఊహ కాదు... కల్పన కాదు, నూటికి నూరుపాళ్లూ వాస్తవం. సమయం మించిపోతోంది సుమా’ అంటూ పిలుపునిచ్చినవాడు. ఎవరెలాపోతే మనకేం అనుకునే లోకంలో మానవాళి భద్రత గురించి ఇలా ఆలోచించడం వింతగానే అనిపిస్తుంది. విశ్వాంత రాళంలో మనిషిని పోలిన జీవులుండొచ్చునని పదేళ్ల క్రితం జోస్యం చెప్పి వారివల్ల ప్రమాదం ముంచుకు రావొచ్చునని హెచ్చరించినప్పుడు అందరూ ఆయన్ను వెర్రి వాడిగా లెక్కేశారు. గ్రహాంతరజీవులు(ఏలియన్స్) మనకన్నా బాగా తెలివైనవాళ్లు అయివుండొచ్చునని, ప్రయోగాల పేరిట వాళ్లని నిద్ర లేపితే ఈ భూమి మనకు కాకుండా పోవచ్చునని కూడా హాకింగ్ హెచ్చరించారు. నిత్యం అంకెలతో సావాసం చేస్తూ జీవించినంతకాలమూ వాటితో ఆడుకున్న హాకింగ్... గణితంలో ఆసక్తి ఉండే వారంతా ‘పై డే’ (22/7= 3.14)గా పిలుచుకునే రోజైన మార్చి 14నే యాదృచ్ఛి కంగా కన్నుమూశాడు. విశ్వరహస్య పేటికను ఛేదించి అందులోని ప్రతి అంశాన్నీ పామర జనానికి కూడా విప్పి చెప్పిన హాకింగ్ను నూనూగు మీసాల నూత్న యవ్వనంలోనే ప్రకృతి చిన్న చూపు చూసింది. కండరాల కదలికల్ని స్తంభింపజేసే మాయదారి అమియోట్రోఫిక్ లాటరల్ స్కెలరోసిస్(ఏఎల్ఎస్) అనే వ్యాధి ఆవహించి అరుదైన ఆ మేధావిని చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. అయితే అది శరీరాన్ని చేతనారహితం చేసిందే మోగానీ మెదడును తాకలేకపోయింది. ఆలోచనలకు ఆటంకాలు సృష్టించలేకపోయింది. వాటిని వ్యక్తీకరించే కంఠాన్ని నొక్కిపెట్టి ఉంచిందేమోగానీ ఆయన సంక ల్పాన్ని నిరోధించలేకపోయింది. చక్రాల కుర్చీకే అతుక్కుపోక తప్పని స్థితి ఏర్పడ్డా, ఆలోచనలు మెరుపు వేగంతో విశ్వాంతరాళాన్ని నిరంతరరాయంగా అన్వేషిస్తూనే వచ్చాయి. అందులోని వింతలనూ, విశేషాలనూ మధించాయి. ఆయన ఆత్మ స్థైర్యం ముందు ఆ మాయదారి వ్యాధి ఓడిపోయింది. అనుక్షణమూ దాన్ని ధిక్క రిస్తూ అపురూపమైన, అనూహ్యమైన సిద్ధాంతాలను ప్రతిపాదించి శాస్త్ర విజ్ఞాన ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఏఎల్ఎస్ వ్యాధి సోకింది గనుక ఇక రెండే ళ్లకు మించి బతకడని చెప్పిన వైద్యుల్ని పరిహసించడమే కాదు... అంతక్రితం ఎవరి చూపూ పడని అనేకానేక అంశాలపై దృష్టి సారించి అరుదైన ప్రతిపాదనలు చేశారు. అసంఖ్యాకంగా గ్రంథాలు వెలువరించారు. ఆయన రాసిన ‘ఏబ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ ప్రపంచవ్యాప్తంగా నలభై భాషల్లోకి అనువాదమైంది. 237 వారాలపాటు నిరంతరాయంగా లండన్ ‘సండే టైమ్స్’ బెస్ట్ సెల్లర్ గ్రంథాల్లో అగ్రభాగాన ఉంది. ప్రపంచ దేశాల్లో ఆ గ్రంథం చదివిన అనేకులు అనంతరకాలంలో శాస్త్రవేత్తలుగా రూపుదిద్దుకున్నారు. చిన్నప్పుడు తరగతి గదిలో టీచర్ పాఠం చెబుతుంటే బుద్ధిగా కూర్చుని వినే లక్షణం హాకింగ్కు లేదు. ఆ పాఠంలో టీచర్ కూడా గమనించని సంగతుల్ని ఇట్టే పట్టేయడం, వాటిల్లోని గుణదోషాలను చర్చించడం ఆయనకు హాబీ. కాగితం, కలంతో పనిలేకుండా కేవలం కళ్లతో చూసి చటుక్కునచెప్పే హాకింగ్ టీచర్లకు ఒక వింత. గెలీలియో త్రిశత జయంతి రోజునే పుట్టిన హాకింగ్కు ఆ శాస్త్రవేత్తంటే వల్ల మాలిన అభిమానం. ‘అందరూ కళ్లతో వస్తువుల్ని చూస్తారు. అందుకోసమే వాటిని వినియోగిస్తారు. కానీ ఆ వస్తువుల లోలోతుల్ని ఆరా తీసేలా కళ్లను సమ ర్ధవంతంగా వినియోగించింది గెలీలియోనే’ అని ఒక సందర్భంలో హాకింగ్ అంటాడు. చిత్రమేమంటే ఈ మాటలే ఆయనకు కూడా వర్తిస్తాయి. కృష్ణ బిలాల గురించి, వాటి పనితీరు గురించి అంచనా వేయడానికి హాకింగ్ ఒక విధానాన్ని రూపొందిం చారు. విజ్ఞాన శాస్త్రంలో అది ‘హాకింగ్ రేడియేషన్’గా గుర్తిం పుపొందింది. భౌతిక శాస్త్రంలోని ఏ రెండు విభాగాలకూ పొసగదని ఒక చమత్కారం ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని, క్వాంటమ్ మెకానిక్స్నూ మేళ వించి అందులోని సూక్ష్మాంశాల ప్రాతిపదికగా కృష్ణబిలాలు క్రమేపీ ద్రవ్యరాశిని కోల్పోతూ నక్షత్రాల్లాగే అవి అంతరించి పోతాయని హాకింగ్ రుజువుచేశాడు. అంతేనా... ‘మీ జీవితం ఒక కృష్ణబిలం అను కుంటున్నారా... అను కోండి. కానీ అది కూడా అంతరించిపోయి కొత్తరూపు దాల్చకతప్పదని తెలుసుకోండి’ అంటూ నిరా శావాదులకు ఆత్మవిశ్వాసం నూరి పోశాడు. ‘కిందనున్న పాదాలకేసి కాదు... నక్షత్రాలవైపు చూపు సారించండ’ని ఉద్బోధించాడు. హాకింగ్కొచ్చిన వ్యాధి ఎలాంటిదో, దానివల్ల ఆయన పడుతున్న యాత నేమిటో, అందుకు అలవాటుపడి ఆ పరిమితుల్లోనే ఎలా జీవనం సాగిస్తున్నాడో తెలియజెప్పే ‘ద థియరీ ఆఫ్ ఎవ్విర్థింగ్’ అనే చిత్రం నాలుగేళ్లక్రితం వచ్చింది. ‘మనమేం అధికులం కాదు. కోతుల్లో కాస్త అభివృద్ధిచెందిన జాతివాళ్లం’ అంటూ హెచ్చరించి మన చేష్టలతో పర్యవరణకొస్తున్న ప్రమాదాన్నీ, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తెచ్చే పరిణామాల్నీ చర్చించిన అరుదైన శాస్త్రవేత్త ఆయన. అయిదారు నెలలక్రితం ఒక చర్చ సందర్భంగా ‘ప్రజలకు రోబోలకన్నా పెట్టుబడిదారీ విధానంతోనే, అది తెచ్చే అసమానతలతోనే ముప్పు ఎక్కువ’ని హాకింగ్ చెప్పడాన్నిబట్టి ఆయన ఆలోచనాధారను అర్ధం చేసుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రంపైన మాత్రమే కాదు... సమాజగమనంపై కూడా ఆయన చూపెంత నిశితమో ఈ వ్యాఖ్య పట్టి చూపుతుంది. స్టీఫెన్ హాకింగ్వంటి అరుదైన మేధావిని, అపు రూపమైన శాస్త్రవేత్తను కోల్పోవడం మానవాళి చేసుకున్న దురదృష్టం. -
2017 నోబెల్ గ్రహీతలు వీరే...
స్టాక్హోం: ఫిజిక్స్లో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది (2017) ముగ్గురు అమెరికన్లను వరించింది. లిగో-విర్గో డిటెక్టర్ కొలాబరేషన్కు చెందిన రైనర్ వీస్, బారీ సీ బారిష్, థోర్న్లకు గురుత్వాకర్షణ తరంగాలను కనుగొన్నందుకు ఈ పురస్కారం దక్కింది. ప్రపంచాన్ని కుదిపివేసే ఆవిష్కరణకు ఈ ఏడాది నోబెల్ లభించిందని స్టాక్హోమ్లో జరిగిన సమావేశంలో నోబెల్ కమిటీ ప్రతినిధి పేర్కొన్నారు. 1901 నుంచి ఫిజిక్స్లో అవార్డును ఇప్పటివరకూ 111 సార్లు నోబెల్ కమిటీ ప్రదానం చేసింది. గత ఏడాది టోపోలజీలో చేసిన అసమాన కృషికి గాను ముగ్గురు పరిశోధకులు నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ను సొంతం చేసుకున్నారు. ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ విజేతలు అల్బర్ట్ ఐన్స్టీన్, మేరి క్యూరీ, నీల్స్ బోర్ వంటి దిగ్గజాల సరసన చేరతారు. ఇక 2010లో నోబెల్ ఫిజిక్స్ ప్రైజ్ను యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ శాస్త్రవేత్తలు అండ్రీ జీమ్, నొవొసెలొవ్లు పొందారు. గ్రఫీన్తో వీరు అద్భుత ప్రయోగాలు చేసినందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. -
‘ ఫిజిక్స్’కు కేంద్రం దన్ను
డీఎస్టీ నుంచి రూ.1.08 కోట్లు మంజూరు అధునాతన పరిశోధనలకు ఊతం ఎస్కేయూ (అనంతపురం): శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఫిజిక్స్ విభాగానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ దన్నుగా నిలిచింది. ఈ విభాగంలో జరిగే పరిశోధనలకు రూ.1.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగే పరిశోధనలకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫండింగ్ ఏజెన్సీగా ఉన్న డీఎస్టీ (డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ద్వారా ఈ నిధులు అందనున్నాయి. మెటీరియల్ సైన్సెస్కు సంబంధించిన పరిశోధనలు, ఆవిష్కరణలకు అయ్యే ఖర్చును ఈ నిధుల ద్వారా వినియోగించుకోవచ్చు. ఫిజిక్స్లో నాణ్యమైన పరిశోధనలు ఎస్కేయూ ఫిజిక్స్ విభాగంలో నాణ్యమైన పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)కు సంబంధించి ప్రాంతీయ వాతావరణ అధ్యయన కేంద్రాన్ని ఫిజిక్స్ విభాగంలో నిర్వహిస్తున్నారు. ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తలు ఇక్కడ రీసెర్చ్ స్కాలర్లుగానూ ఉన్నారు. నిరంతర వాతావరణ, శీతోష్ణస్థితి పరిస్ధితులను ఎప్పటికప్పుడు ఇస్రోకు సమాచారం అందజేస్తుంటారు. ఇక్కడి పరిశోధన శాలల్లో నిరంతరమూ ఏదో ఒక పరిశోధన జరుగుతూ ఉంటుంది. ఐదేళ్లకు మరింత పెరగనున్న సాయం నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయం గుర్తింపునకు గీటురాయిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రామాణికమైన ఆవిష్కరణలపై దృష్టిసారించారు. డీఎస్టీ నుంచి ఫిస్ట్ (ఫండ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) అనే పథకం ద్వారా రూ.1.08 కోట్లు ఈ విద్యా సంవత్సరం నుంచి అందించనున్నారు. ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివే విద్యార్థుల ల్యాబ్ సౌకర్యాలకు రూ. 20 లక్షలు, పుస్తకాలకు రూ.5లక్షలు, కంప్యూటర్ ల్యాబ్ నిర్వహణకు రూ.13 లక్షలు, మెటీరియల్ సైన్సెస్కు సంబంధించిన పరికరాలకు రూ.50 లక్షలు ఖర్చు చేయనున్నారు. గతంలో జరిగిన పరిశోధనల ప్రామాణికంగానే ఈ నిధులు మంజూరు చేసినట్లు డీఎస్టీ తన అనుమతి పత్రంలో పేర్కొంది. పరిశోధనలకు ఊతం అధునాతనమైన ప్రయోగ పరికరాలతో నాణ్యమైన పరిశోధనలకు ఆస్కారం ఏర్పడనుంది. ఇవి పరిశోధన విద్యార్థులకు ఎంతో దోహదపడనున్నాయి. తొలి దశలో ఎలక్ట్రానిక్ పరికరాలకు నిధులు మంజూరు చేశారు. తాజాగా మెటీరియల్ సైన్సెస్కు సంబంధించిన పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశారు. – ప్రొఫెసర్ టి. సుబ్బారావు, ఫిజిక్స్ విభాగం బీఓఎస్ ఛైర్మెన్, పాలిమర్ సైన్సెస్ విభాగాధిపతి, బీఎం బిర్లా సైన్స్ సెంటర్ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ ఉన్నతాధికారుల సహకారం మరువలేం ఫిజిక్స్ విభాగం పురోగతికి వీసీ, రిజిస్ట్రార్ల సహకారం మరువలేం. డీఎస్టీ –ఫిస్ట్ ద్వారా నిధులు రావడం గర్వకారణం. అధునాతన ల్యాబ్ల ఏర్పాటుకు ఆస్కారం కానుంది. ప్రామాణికమైన పరిశోధనలు చేయడానికి విద్యార్థులకు సహకారం అందిస్తున్నాం. – డాక్టర్ ఎం.వి.లక్ష్మయ్య, అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్కేయూ -
లెక్కల చిక్కులు!
♦ జేఈఈ మెయిన్ పరీక్షలో 15 వరకు క్లిష్ట ప్రశ్నలు ♦ కెమిస్ట్రీ కాస్త కఠినం.. సులభంగా ఫిజిక్స్ ♦ తగ్గనున్న కటాఫ్ మార్కులు! ♦ ఈనెల 18 నుంచి 22 వరకు వెబ్సైట్లో ‘కీ’ సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షలో విద్యార్థులకు లెక్కల తిప్పలు తప్పలేదు. ఎప్పుడూ ఫిజిక్స్లో టఫ్ ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి ఫిజిక్స్ ఈజీగా ఇవ్వగా, మ్యాథమెటిక్స్ ఇబ్బంది పెట్టినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. మ్యాథమెటిక్స్లో మొత్తం 30 ప్రశ్నల్లో 8 ప్రశ్నలు అధిక సమయం తీసుకునేవే రావడంతో ఎక్కువ మంది విద్యార్థులు రాయలేకపోయారు. మరో 7 ప్రశ్నలు ఆలోచిస్తే తప్ప రాయలేని విధంగా ఇచ్చినట్లు సబ్జెక్టు నిపుణులు ఎంఎన్ రావు పేర్కొన్నారు. మిగిలిన 15 ప్రశ్నలు మాత్రమే కాస్త సులభంగా ఉండేవి వచ్చినట్లు వెల్లడించారు. గడిచిన రెండుమూడేళ్లలో జేఈఈ మెయిన్ మ్యాథమెటిక్స్ ప్రశ్నల్లో సులభ ప్రశ్నలు 20కి పైగా ఇచ్చేవారు. దీంతో సాధారణ విద్యార్థులు కూడా బాగా రాయగలిగే వారు. కానీ ఈసారి ప్రతిభావంతులు కూడా సమయం సరిపోక ఒకటీ రెండు ప్రశ్నలు రాయలేని పరిస్థితి. కెమిస్ట్రీలో కూడా.. మరోవైపు కెమిస్ట్రీలో కూడా కాస్త ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. మొత్తం 30 ప్రశ్నల్లో 6 ప్రశ్నలు టఫ్గా ఉన్నాయని, మిగతా ప్రశ్నలు సులభంగానే ఉన్నాయని పేర్కొంటున్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఫిజిక్స్ సులభంగా వచ్చిందని సబ్జెక్టు నిపుణులు రామకృష్ణ తెలిపారు. అయితే మ్యాథమెటిక్స్లో ఎక్కువ సమయం తీసుకున్న విద్యార్థులు.. చివరల్లో సమయం సరిపోక ఫిజిక్స్లో అన్నింటికి సమాధానాలు గుర్తించలేకపోయారని చెప్పారు. దీంతో ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. గతేడాది జేఈఈ అడ్వాన్స్డ్కు జనరల్ కేటగిరీలో 100 మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా అర్హత సాధించగా, ఈసారి ఇంకా తగ్గే అవకాశం ఉందని, లేదంటే 100 మార్కుల వరకు ఉండవచ్చని చెబుతున్నారు. 95 శాతం విద్యార్థుల హాజరు.. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాసేందుకు 69,467 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 95 శాతం మంది హాజరైనట్లు తెలిసింది. పరీక్ష హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంలో 96 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు సమాచారం. వరంగల్, హన్మకొండలో 17 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా మొదటి పేపర్కు 97.5 శాతం, రెండో పేపర్కు 94 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మరోవైపు వెబ్సైట్లో ప్రాథమిక కీని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆదివారమే అందుబాటులో ఉంచుతుందని విద్యార్థులు భావించారు. కాని ఈనెల 18 నుంచి 22 వరకు ‘కీ’ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని సీబీఎస్ఈ వెల్లడించింది. అలాగే ఆయా తేదీల్లోనే విద్యార్థుల ఓఎంఆర్ పత్రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. 8, 9 తేదీల్లో ఆన్లైన్లో జేఈఈ మెయిన్ ఇక ఈనెల 8, 9 తేదీల్లో ఆన్లైన్లో జేఈఈ మెయిన్ పరీక్షను సీబీఎస్ఈ నిర్వహించనుంది. 27న ఫలితాలను వెల్ల డించనుంది. జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించిన 2.20 లక్షల మంది జాబితాను కూడా అదే రోజు ప్రకటించనుంది. ఈనెల 28 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కు ఐఐటీ మద్రాసు ఆన్లైన్లో దరఖాస్తుల ను స్వీకరించనుంది. ఐఐటీల్లో ప్రవేశాల కు మే 21వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్ష నిర్వహించనుంది. -
బీకాంలో ఫిజిక్సు పెట్టించేస్తా..
పార్టీ మీటింగ్లో బిజీగా ఉన్నాడు చంద్రబాబు. లోకేష్ వచ్చి గుసగుసగా చంద్రబాబు చెవిలో చెప్పాడు. ‘నాన్నగారూ.. మీరు చెప్పినట్టే అంతా రెడీ చేశాను. పక్క రూంలో ఇద్దరు ఎమ్మెల్యేలు వెయిటింగ్..’‘వస్తున్నా, పద..’ అన్నాడు చంద్రబాబు.చంద్రబాబు ఏం చెప్పాడు? ఎమ్మెల్యేలు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇది తెలియాలంటే ఓ రోజు వెనక్కి వెళ్లాలి.ముందురోజు సాయింత్రం.. మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి కూర్చున్నాడు లోకేష్ బాబు. అతడి గెడ్డం పుచ్చుకుని బతిమాలుతున్నాడు చంద్రబాబు. ‘చూడు నాన్నా.. నువ్వలా మూతి బిగించుకు కూర్చుంటే ఎలా చెప్పు.. ఫేసు మరీ దరిద్రంగా ఉంటుంది.. సమయం చూసుకుని నిన్ను మినిస్టర్ని చేస్తానుగా.. కాస్త ఓపిక పట్టు ..‘గంయ్ మన్నాడు లోకేష్. ‘ఏంటి ఇంకా ఓపిక పట్టేది .. ఏడాది నించి అడుగుతూనే ఉన్నా.. అదుగో, ఇదిగో అంటూ నానబెడుతున్నారు. అవతల పుణ్యకాలం మించిపోతోంది. అటుచూస్తే, కేటిఆర్ మంత్రయిపోయి, బుగ్గ కారులో ఝామ్మని తిరిగేస్తూ, కాబోయే సీఎమ్గా పేరు తెచ్చేసుకుంటున్నాడు. నేనిక్కడ పార్టీ మీటింగుల్లో తిరుగుతూ ఇలా అఘోరిస్తున్నాను. మీరు చూస్తే మంత్రివర్గ విస్తరణకి రెడీ అయిపోతున్నారు. నా ఊసే ఎత్తరాయే..’ వెక్కుతూ అన్నాడు లోకేష్.చంద్రబాబు పితృ హృదయం పగిలి ముక్కలైంది. ఏరుకుని అతికించుకుంటూ లాలనగా చెప్పాడు. ‘నీకన్నా నాకెవరు ఉన్నారు లోకేష్ బాబూ.. కొంచెం ఓపిక పట్టు , అంతే..! నిన్ను కేటిఆర్ బాబు లెవెల్కి తీసుకుపోతా.. అంతకన్నా ప్రత్యేక హోదా కల్పిస్తా..!’ ప్రత్యేక హోదా మాట వినగానే పుచ్చిపోయిన పల్లీ నమిలిన వాడిలా మొహం పెట్టాడు లోకేష్. ‘ఆ ఒక్క మాట అనకండి నాన్నా.. మీకు పుణ్యం ఉంటుంది..’ చేతులు జోడించాడు.‘చిలిపి..’ కిసుక్కున నవ్వాడు చంద్రబాబు.‘అయినా మీకు నా సత్తా ఇంకా అర్థం కావడం లేదు నాన్నగారూ.. నన్నింకా ఎన్నేళ్లు ఓపిక పట్టమంటారు చెప్పండి..’‘ సరే.. ఒక పని చేస్తా.. నువ్వొక ఇద్దరు ఎమ్మెల్యేలని పట్టుకు రా.. అచ్చంగా నీ మనుషుల్నే తీసుకు రా.. ఆ ఇద్దర్నీ మంత్రులుగా తీసేసుకుంటాను.. వాళ్లెవరైనా నాకు ఓకే.. ’ రాజీ మార్గం సూచించాడు చంద్రబాబు. ‘చావుకి పెడితే లంఖనాలకి దిగొచ్చింది’ అని మనసులో అనుకుంటూ, ‘ రేపు సాయింత్రం కల్లా రెడీ చేస్తాను నాన్నగారూ’ అన్నాడు లోకేష్.‘ముందు వాళ్లిద్దరితో విడివిడిగా మాట్లాడతా.. కేవలం ఫార్మాలిటి..అంతే ..’ చెప్పాడు చంద్రబాబు.తలూపి వెళ్లిపోయాడు లోకేష్. మీటింగ్లోంచి లేచి వెళ్లి తన రూంలో కూర్చున్నాడు చంద్రబాబు.లోకేష్ ఒక ఎమ్మెల్యేని లోపలికి పంపాడు.ఆ ఎమ్మెల్యే వస్తూనే బాబు కాళ్ల మీద పడిపోయే ప్రయత్నం చేశాడు. చంద్రబాబు పరేంగితజ్ఞుడు. చటుక్కున కాళ్లు వెనక్కి లాక్కున్నాడు. వచ్చిన ఎమ్మెల్యే మరింత పరేంగితజ్ఞుడు. రుద్ద కంఠంతో చెప్పాడు.‘ సార్.. సార్.. మీరు పొరబాటు పడుతున్నారు. నేను మీ కాళ్లు పట్టుకుని మిమ్మల్ని కుర్చీలోంచి లాగేస్తాననుకుంటున్నారేమో.. నా ఉద్దేశం అది కాదు సార్.. తనివితీరా మీ కాళ్లకు దండం పెట్టుకుందామని.. అంతే..అంతే..’చంద్రబాబు మొహం గంటు పెట్టుకుని ఆ ఎమ్మెల్యేని కూర్చోమన్నట్టు గంభీరంగా సైగ చేశాడు. ఎమ్మెల్యే కిక్కురుమనకుండా కూర్చున్నాడు. ‘సరే .. పాయింటుకి వచ్చేద్దాం.. నీకు మినిస్టర్ పోస్టు ఇవ్వాలని మా లోకేషు రికమెండ్ చేశాడు’ అన్నాడు చంద్రబాబు. ఎమ్మెల్యే మెలికలు తిరిగిపోతూ ‘చిత్తం .. చిత్తం’ అన్నాడు. చంద్రబాబు చిరాగ్గా చూసి చెప్పాడు. ‘ముందా మెలికల్ని స్ట్రెయిట్ చేసి తిన్నగా కూర్చుని నేను అడిగిందానికి స్టెయ్రిట్ గా సమాధానం చెప్పు’.ఎమ్మెల్యే బిక్క మొహం పెట్టి ‘అలాగే సార్’ అన్నాడు.చంద్రబాబు గొంతు సవరించుకుని అన్నాడు.. ‘ఇప్పుడు మన కేబినెట్ ఎలాంటి కేబినెట్ అనుకున్నావు? మన మంత్రులందరూ మేలిమి ముత్యాలు.. కోహినూర్ వజ్రాలు అనుకో.. నిన్ను తీసుకుంటే నువ్వు వాళ్లతో సరి సమానంగానయినా ఉండాలి.. లేదా ఓ మెట్టు ఎక్కువైనా ఉండాలి.. ఇప్పుడు చెప్పు’ఎమ్మెల్యే వినయంగా చేతులు కట్టుకుని ‘మన మంత్రులకి నేను ఏమాత్రం తీసిపోను గానండి .. మీరేం అనుకోకపోతే ఒక్క మాటండి..’‘చెప్పవోయ్ పర్వాలేదు ..’ భరోసా ఇచ్చాడు చంద్రబాబు. ‘మన మంత్రుల్ని విమర్శించడం కాదు గాని పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు వాళ్లెవరూ సరిగ్గా స్పందించడం లేదని నాకనిపిస్తోందండి ..’చంద్రబాబు గెడ్డం గోక్కుంటూ ‘ఏంటా కష్ట కాలం? చెప్పు’ అన్నాడు.ఎమ్మెల్యే అటూ ఇటూ చూసి గొంతు తగ్గించి చెప్పాడు – ‘మన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారు ఈమధ్య ఒక ఇంటర్వూ్యలో మాట్లాడుతూ బీకాంలో ఫిజిక్సు ఉంటుందని పొరపాటున అనేశారు సార్..’‘అవును.. ఆయన పాపం పొరపాటున నోరు జారితే దాని మీద యాగీ చేసి మన పార్టీ ఇమేజీని కాస్తా డ్యామేజి చేశారు’ విచారంగా అన్నాడు చంద్రబాబు.‘ఆయన పాపం ఏదో అన్నాడే అనుకోండి.. మన మంత్రులు దాన్ని ఏదో రకంగా కవర్ చేయొచ్చుగా’ అన్నాడు ఎమ్మెల్యే. ‘ఆయన అలా అడ్డంగా దొరికిపోయాక ఎవరు మాత్రం ఏం చేయగలరు చెప్పు’ అన్నాడు చంద్రబాబు.ఎమ్మెల్యే కిసుక్కున నవ్వాడు. ‘సార్.. నేనే గనక మీ కేబినెట్లో విద్యాశాఖగా మంత్రిగా ఉండి ఉంటే పార్టీకి జరిగిన డ్యామేజిని ఇట్టే పూడ్చేసి ఉండేవాణ్ణి’ అన్నాడు.‘అదెలా?’ ఆసక్తిగా అడిగాడు చంద్రబాబు.ఎమ్మెల్యే విజృంభించాడు. ‘సింపుల్ సార్.. జలీల్ ఖాన్ గారు అన్న మాటే నిజం చేస్తా .. ఇమ్మీడియట్గా బీకాంలో ఫిజిక్సు పెట్టించేస్తా.. ఆమాటకొస్తే నర్సరీ నుంచి పీజీ దాకా అన్ని క్లాసుల్లో ఫిజిక్సుని సబ్జెక్టుగా పెట్టించేస్తా.. ఆఖరికి మ్యూజిక్ కాలేజీల్లో, వేద పాఠశాలలో కూడా ఫిజిక్సు కంపల్సరీగా చెప్పేటట్టు సిలబస్ తయారు చేయిస్తా.. మన తెలుగుదేశం ప్రభుత్వం ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక శాస్త్రానికి ఎంత ఇంపార్టెన్సు ఇస్తుందో ప్రపంచానికి చాటి చెబుతా.. ఆ రకంగా ఆ డ్యామేజిని రిపేరు చేసి మన ప్రిస్టేజీని నిలబెడతా ..’ ఆయాసపడుతూ గుక్క తిప్పుకోకుండా చెప్పాడు ఎమ్మెల్యే. చంద్రబాబు కళ్ళు ఆనందంతో చెమర్చాయి. కళ్ళు తుడుచుకుని అన్నాడు.‘బ్రదర్ .. ఇక నువ్వెళ్ళు.. బయట ఇంకో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన్ని లోపలికి పంపించు..’రెండో ఎమ్మెల్యే లోపలికి గంతులేసుకుంటూ వచ్చాడు. ‘సార్.. మీరేం అడుగుతారో నాకు తెలిసిపోయిందోచ్.. మావాడు కొశ్చెను పేపరు లీక్ చేశాడోచ్..’వెంటనే చంద్రబాబు అందుకున్నాడు. ‘మన ప్రభుత్వంలో ఇది మామూలేనోచ్.. నీ జవాబేదో నువ్వు ఏడువ్వోచ్..’రెండో ఎమ్మెల్యే కూర్చుని స్తిమితపడి అన్నాడు. ‘సార్.. మేలైన జాతి రత్నాల్లాంటి మేధావులతో కిటకిటలాడిపోతున్న మన మంత్రివర్గంలో నాకెందుకు చోటివ్వాలీ అన్నదే కదూ మీ ప్రశ్న? నేను చెప్పేది వింటే మీరు డంగై పోయి ఇప్పటికిప్పుడే ప్రమాణ స్వీకారం చెయ్యమంటారు.. నేను రెడీ అనుకోండి..’‘వెధవ సొద ఆపి పాయింటుకి రా మహాప్రభో..’ విసుగ్గా అన్నాడు చంద్రబాబు.రెండో ఎమ్మెల్యే గొంతు సద్దుకుని ప్రారంభించాడు – ‘సార్.. మన పెద్దాయన, స్పీకర్ కోడెల శివప్రసాదు గారు ఆడవాళ్ల మీద ఏదో ఉపన్యాసం ఇస్తే దాని మీద గొడవైంది కదా సార్..’‘అవునయ్యా.. పెద్దాయన మంచి ఉద్దేశంతోనే ఏదో చెబితే దాన్ని రకరకాలుగా వక్రీకరించారని విన్నాను’ అన్నాడు చంద్రబాబు. ‘పేపర్లలో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా రచ్చ రచ్చ అయింది సార్.. అయినా మనకేం పర్వాలేదు సార్.. ఆ సోషల్ మీడియాని ఎంతమంది చూస్తారు లెండి..’‘‘కరెక్టు.. అందుకే నేను దాన్ని‘కంఠ శోషల్ మీడియా’ అంటాను’’ కసిగా అన్నాడు చంద్రబాబు.‘ఏదైనా మన మంత్రులు సరిగ్గా పట్టించుకోలేదు గాని .. అదే నేనే గనక మంత్రినై ఉంటే ఆ పరిస్థితిని మనకి అనుకూలంగా మార్చేసి .. మన ప్రతిష్ట రెండింతలు పెరిగేలా చేస్తాను సార్..’చంద్రబాబుకి ఇంట్రస్టు కలిగింది. ముందుకి వంగి ‘నువ్వు అతడి కంటె ఘనుడిలా ఉన్నావే.. ఏం చేస్తావో చెప్పు..’ అన్నాడు. బాబు ఆసక్తి చూసి రెండో ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. ‘ఆడవాళ్లు వాహనాల్లాంటివాళ్ళనీ, షెడ్డు్డల్లోనే ఉంచితే యాక్సిడెంట్లు అవవని కోడెల గారు అన్నారని కదా ఆ గొడవంతా.. మీరు నన్ను మంత్రిని చేస్తే నేనూ ఆ విషయమే మరోలా చెబుతా .. మనం మన వాహనాల్ని పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టే మహిళల్ని కూడా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం .. వాహనాలకి యాక్సిడెంట్ ఇన్సూరెన్సు ఉన్నట్టే మహిళలకి కూడా యాక్సిడెంట్ .. అంటే మాన భంగం అనుకోండి .. అలాంటిదేదయినా జరిగితే పరిహారం చెల్లిస్తాం.. వాహనాల బీమాకి ప్రీమియం కట్టాలి గాని ఈ పథకంలో మహిళలు దమ్మిడీ ప్రీమియం కట్టక్కర్లేదు. ప్రభుత్వమే కడుతుంది. ఆడపిల్ల పుట్టినప్పటినుంచే బీమా అమలవుతుంది. ఎటొచ్చీ, వయసు బట్టి పరిహారం రేటు మారుతూ ఉంటుంది. ఆ విధంగా కోడెల గారి మాటని మహిళలకు బంగారు బాటగా మార్చేద్దాం.. ఇంకా చాలా డిటైల్సు వర్కవుట్ చెయ్యాలి సార్.. ప్రమాణ స్వీకారం కాగానే ఆ పనిలోనే ఉంటా..’చంద్రబాబు కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు.ఎమ్మెల్యే కంటిన్యూ చేశాడు. ‘సార్.. ఈ పథకానికి మంచి పేరు కూడా పెట్టాను సార్..’చంద్రబాబు తేరుకుని ‘ఏమిటది’ అని అడిగాడు.‘భామ–బీమా పథకం’ తడుముకోకుండా చెప్పాడు ఎమ్మెల్యే ’చంద్రబాబు గుండె ఆనందంతో ఉరకలు వేసింది. తన సంతోషాన్ని మొహం మీద కనబడనివ్వకుండా దాచుకుంటూ, ‘ఇక నువ్వెళ్ళు .. మా లోకేష్ మాట్లాడతాడు’ అన్నాడు. ఎమ్మెల్యేలు వెళ్లగానే లోకేష్ లోపలికి వచ్చాడు. లోకేషుని చూస్తూనే అన్నాడు చంద్రబాబు. ‘వీళ్లలో ఇంత టాలెంటు ఉందని నేనెప్పుడూ అనుకోలేదు.. నువ్వెలా పసిగట్టావో కాని లోకేష్ గుంభనగా నవ్వి ‘నాన్నగారూ .. మీకు అసలు విషయం చెప్పమంటారా?’ అన్నాడు.‘ఏమిటా అసలు విషయం?’ అనుమానంగా అడిగాడు చంద్రబాబు.‘వీళ్ళకి ఈ ఆన్సర్లు చెప్పింది నేనే’ కూల్ గా చెప్పాడు లోకేష్. షాక్ తిన్నట్టు చూశాడు చంద్రబాబు. లోకేష్ తాపీగా చెప్పాడు. ‘అవును నాన్నగారూ.. మీరేం అడుగుతారో నాకు తెలుసు .. ఆన్సర్లు రాసిచ్చి రాత్రంతా వీళ్ళకి ట్రయినింగ్ ఇచ్చా.. కావాలంటే ఇదిగో ఆన్సర్ పేపర్లు.. చూడండి..’ కాగితాలు బయటికి తీశాడు. చంద్రబాబు ఆ ఆన్సర్ షీట్లని, లోకేష్ని మార్చి మార్చి చూశాడు. ఆ క్షణంలో చంద్రబాబు కళ్ళకి లోకేష్ కురుక్షేత్రంలో కర్తవ్య బోధ చేస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడిలా కనిపించాడు.చంద్రబాబు లోకేష్ భుజాలు పట్టుకు ఊపుతూ ఉద్వేగానికి లోనయ్యాడు. ‘నాన్నా, లోకేష్ బాబూ.. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా గాలించాన్రా .. నీలో ఇంత టాలెంట్ ఉందని గ్రహించక వేరే మంత్రుల కోసం వెతికి పెద్ద పొరపాటే చేశాను. ఇప్పటికైనా నా పొరపాటు దిద్దుకోకపోతే చరిత్రకి తీరని ద్రోహం చేసినవాడిని అవుతాను. వెంటనే నిన్నే మంత్రిగా చేసి నీ సత్తా దశదిశలా చాటుతాను’ పూడుకు పోయిన కంఠంతో చెప్పాడు చంద్రబాబు. – మంగు రాజగోపాల్ mangurajagopal@gmail.com -
బీకాంలో ఫిజిక్స్.. ఎంకామ్లో ఎంఫిల్
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! ‘ఏపీ బడ్జెట్ ఎలా ఉందండీ మాస్టారూ’ అడిగాడు గోపాత్రుడు.పేపర్ చదువుతోన్న గిరీశం ఏవో లెక్కలు వేసుకుంటున్నాడు. ‘జీడీపీయో ఏదో 11.6 శాతం ఉందంట కదండీ’ మళ్లీ తానే అడిగాడు గోపాత్రుడు. ‘అవునోయ్, దేశానికే అంత లేదు. దేశం జీడీపీ 7.1 శాతమే’. ‘అదేనండీ మా సెందరబాబంటే ఏటనుకుంటున్నారు? పేకాటాడించేత్తారాయన’ అన్నాడు గోపాత్రుడు. ‘నీ అసాధ్యం సంతకెళ్లా, నువ్వు కూడా బడ్జెట్ ఫాలో అవుతున్నావేంట్రా’ అని ఆశ్చర్యంగా అడిగాడు గిరీశం. ‘అవునండీ బాబూ. మా సెందరబాబు సిఎం అయ్యాక అన్నీ ఫాలో అవుతున్నా’ అన్నాడు గోపాత్రుడు నవ్వుతూ. ‘ఒరేయ్ మరి మీ చంద్రబాబు సిఎం అయ్యాక వ్యవసాయం ఎలా ఉందిరా’ అని అడిగారు గిరీశం. ‘అంటే... అంతకుముందు కంటే తగ్గిందిలెండి’ అన్నాడు. ‘సరేలేరా అది వదిలేయ్, ఇండస్ట్రీలూ గట్రా బాగా వచ్చాయా?’ ‘అబ్బే... అయింకా రాలేదండి. కానీ వత్తాయండి. వచ్చాక బోలెడు డెవలప్మెంటూ గట్రా ఉంటాదండి’ అన్నాడు గోపాత్రుడు. ‘డిస్కంలు కూడా నష్టాల్లో ఉన్నాయట?’ అడిగాడు గిరీశం. ‘అవునండీ. ఎదవది. ఏకంగా 62 శాతం లాసండీ బాబూ’. ‘రుణమాఫీకి బడ్జెట్లో బాగా డబ్బిచ్చారా?’ అడిగాడు గిరీశం. ‘అంటే డబ్బులకి కొంచెం ఇబ్బంది కదండీ... 80వేల చిల్లర కోట్లకు గాను మూడువేల కోట్లు ఇచ్చారండి’ అన్నాడు గోపాత్రుడు. ‘పోనీ నిరుద్యోగులకు ఉద్యోగాలు బాగా వచ్చాయా?’‘ఉద్యోగాలెక్కడివండీ బాబూ. నేవు. కొత్త పరిశ్రమలు వస్తే ఉద్యోగాలొస్తాయండి’ అన్నాడు గోపాత్రుడు. ‘మరి భృతి?’ అని అడిగారు ‘అదీ నేదండీ బాబూ!’ అని అన్నాడు గోపాత్రుడు. ‘రాష్ట్రం ఆదాయం బాగా పెరిగిందేంట్రా?’ అడిగాడు గిరీశం. ‘నేదండీ బాబూ. డబ్బులకి కటకటలాడే కదా పాపం మా సెందరబాబు అప్పులు చేసుకుంటున్నారు’ అన్నాడు గోపాత్రుడు. ‘మరి ఏదీ బాగా లేనపుడు జీడీపీ 11 శాతం కంటే ఎక్కువ ఎలా వచ్చిందంటావ్?’ అని గిరీశం నవ్వుతూ అడిగాడు. గోపాత్రుడు బుర్రగోక్కున్నాడు. ఏం తట్టలేదు. ‘ఏమోనండీ బాబూ! అయన్నీ నాకెట్లా తెలుస్తాయి. మీరే చెప్పండి’ అని ఆత్రంగా అడిగాడు. గిరీశం నవ్వేసి ‘ఏం లేదురా, ఈ లెక్కలన్నీ మన జలీల్ ఖాన్ చెప్పి ఉంటారు. మ్యాథ్స్లో కూడా ఆయన జీనియస్ కదా. ఆయన లెక్కలు నీకూ నాకే కాదు ఎవ్వరికీ అర్థం కావు. ఆఖరికి మీ చెందరబాబుకి కూడా అర్థం కావు. జలీల్ఖాన్ ఏమో బీకాంలో ఫిజిక్స్ బ్యాచ్.. మీ చెందరబాబు నాయుడేమో ఎంకామ్లో ఎమ్మే, ఎంఫిల్ గట్రా ఇంకేమేం చదివేశాడో. ఇద్దరూ కలిసి యనమల రామకృష్ణుడికి ఏం లెక్కలు చెప్పేసి ఉంటారో. అందుకే జీడీపీ అలా పెరిగిపోయి ఉంటుంది’ అన్నాడు గిరీశం. గోపాత్రుడికి లీలగా అర్థం అవుతోంది. గిరీశం మాస్టారు తనని ఆట పట్టిస్తున్నారని అనుమానం వచ్చింది. - నానాయాజీ 'బీకాంలో ఫిజిక్స్'పై చంద్రబాబు ఆరా..! అసెంబ్లీ లాబీల్లో ‘జలీల్ఖాన్ ఫిజిక్స్’ -
ఫిజికల్ ఫిట్నెస్కు..
ఫిజిక్స్పై భయాన్ని పోగొట్టేందుకు పరీక్షలు ప్రత్యేక సైన్స్స ఫోరం ఏర్పాటు భౌతికశాస్త్రం అంటే చాలామంది విద్యార్థులకు భయమే. ఇది ఉండకూడదనే ఉద్దేశంతో ఉపాధ్యాయులే ఏపీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరమ్ (ఏపీపీఎస్టీఎఫ్) ఏర్పాటు చేశారు. ఈ ఫోరం ద్వారా పదో తరగతి విద్యార్థుల్లో ఫిజిక్స్పై భయాన్ని పోగొట్టి.. ఆసక్తిని పెంచేందుకు ఈనెల 19న ప్రత్యేక పోటీ పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్న పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ఇన్ఛార్జి డీఈఓ అబ్రహం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. – రాయవరం 19న పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు.. జిల్లాలోని జెడ్పీ, మున్సిపల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థుల కోసం ఈ పరీక్షను ఈ నెల 19న నిర్వహించనున్నారు. ప్రతి పాఠశాల నుంచి తెలుగు, ఇంగ్లిష్ మీడియం నుంచి ఇద్దరు చొప్పున ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒకే మీడియం ఉంటే నలుగురు విద్యార్థులు పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు డివిజన్ కేంద్రాల్లో పరీక్షను నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన 10వ తరగతి పాఠ్య పుస్తకంలోని అధ్యాయాల నుంచి, సీసీఈ విధానంపై ఈ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షా విధానం.. 60 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఈ పరీక్ష 60 మార్కులకు ఉంటుంది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రామచంద్రపురం, పిఠాపురం డివిజన్ కేంద్రాల్లో ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి జిల్లాస్థాయిలో బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. డివిజన్ కేంద్రాల్లో కూడా ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేస్తారు. గతేడాది పదో తరగతి పరీక్షల్లో 10 గ్రేడ్ సాధనలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానం పొందింది. ఈ ఏడాది కూడా ఇదే రీతిలో ఫలితాల సాధనకు ఈ పరీక్ష ఉపయుక్తంగా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. సద్వినియోగం చేసుకోవాలి ఈ నెల 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిజికల్ సైన్స్ ఫోరమ్ ద్వారా ఈ పోటీలు ఏర్పాటు చేశాం. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి పాఠశాల విద్యార్థులు ఈ పరీక్షను సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఇన్ఛార్జి డీఈఓ అబ్రహం ఈ పరీక్ష నిర్వహించే తీరును తెలుసుకుని ప్రోత్సహించడం సంతోషం. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలకు 81795 18749కు సంప్రదించాలి. – సత్యవోలు శ్రీనివాస్, కాకినాడ -
భౌతిక శాస్త్ర చిక్కుముడులు విప్పేద్దాం!
♦ భూగర్భంలో భారీ ప్రయోగశాల ♦ రెండు కిలోమీటర్ల పొడవైన సొరంగం ♦ 5 కోట్ల కిలోల ఇనుప పలకలతో డిటెక్టర్ ♦ తమిళనాడులోని థేనీ జిల్లాలో ఏర్పాటుకు భారత ప్రభుత్వం సిద్ధం ♦ విద్యార్థులకు అపార అవకాశాలు ♦ సైన్స్ కాంగ్రెస్లో వెల్లడించిన శాస్త్రవేత్తలు తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్మించనున్న భారీ సైన్స్ ప్రాజెక్ట్ ‘ఇండియా న్యూట్రినో అబ్జర్వేటరీ’ అనేక విధాలుగా ప్రత్యేకమైందని, ప్రపంచంలో ఇప్పటివరకూ ఎవరూ చేపట్టని విధంగా ఇక్కడ ప్రయోగాలు జరగనున్నాయని శాస్త్రవేత్తలు ముక్తకంఠంతో తెలిపారు. సకాలంలో దీన్ని ప్రారంభించగలిగితే శాస్త్ర రంగంలో ఎంతో పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ చివరి రోజున ఇండియా న్యూట్రినో అబ్జర్వేటరీ (ఐఎన్వో)పై ప్రత్యేక సదస్సు జరిగింది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ శాస్త్రవేత్త అమోల్ దీఘే, ఐఐటీ బాంబే, మద్రాస్లకు చెందిన అధ్యాపకులు ఎస్.ఉమాశంకర్, ప్రఫుల్ల కుమార్ బెహరా, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ డి.ఇందుమతి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో న్యూట్రినో అబ్జర్వేటరీ ఏర్పాటులోని సంక్లిష్టత, వాటిని అధిగమించేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి వక్తలు వివరించారు. సుదూర విశ్వం నుంచి నిరంతరం దూసుకొచ్చే ఒక రకమైన అదృశ్య కణాలను న్యూట్రినోలు అంటారని, దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే భౌతికశాస్త్రంలో ఇప్పటివరకూ ఉన్న కొన్ని చిక్కుముడులు విడిపోతాయన్నది తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ దిశగా కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి కూడా. అయితే వీటన్నింటికంటే భారత అబ్జర్వేటరీ చాలా భిన్నమైంది. 5 కోట్ల కిలోల ఇనుముతో ప్రయోగాలు.. భారత న్యూట్రినో అబ్జర్వేటరీలో ప్రధాన భాగం ఐకాల్ డిటెక్టర్. ఇతర కణాల నుంచి న్యూట్రినోలను పరోక్ష పద్ధతిలో గుర్తించేందుకు దీన్ని వాడతారు. ఈ డిటెక్టర్ దాదాపు నాలుగు అంతస్తుల ఎత్తు సైజులో ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కటి నాలుగు టన్నుల బరువుండే 30 వేల ఇనుప పలకలను పొరలు పొరలుగా అమర్చడం ద్వారా ఈ డిటెక్టర్ను నిర్మిస్తారు. మొత్తమ్మీద ఈ డిటెక్టర్ దాదాపు 5 కోట్ల కిలోల బరువు ఉంటుంది. ఇనుప పలకల మధ్య ప్రత్యేకంగా తయారు చేసిన గాజు ఫలకాలు...వాటి మధ్య దాదాపు రెండు లక్షల ఘనపు లీటర్ల వాయువులతో ఈ భారీ ప్రయోగశాల ఉంటుందని ప్రొఫెసర్ అమోల్ దీఘే వివరించారు. తమిళనాడులోని థేనీ జిల్లాలోని పొటిపురం గ్రామం వద్ద ఉన్న భారీ కొండ అడుగు భాగంలో ఈ అబ్జర్వేటరీ ఏర్పాటవుతుందని, ఈ కొండ పైభాగంలో ఉన్న భారీ ఏకశిల భూ వాతావరణంలో ఉన్న కొన్ని ఇతర న్యూట్రినోలు ప్రయోగశాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుందని ప్రొఫెసర్ డి.ఇందుమతి వివరించారు. కొండ శిఖరం నుంచి 1.5 కిలోమీటర్ల లోతులో ఈ అబ్జర్వేటరీ ఏర్పాటవుతోందని, రెండు కిలోమీటర్ల పొడవైన సొరంగం ద్వారా ఈ ప్రయోగశాలలోకి ప్రవేశించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. విద్యార్థులకు అవకాశాలు... న్యూట్రినో అబ్జర్వేటరీ ద్వారా భౌతికశాస్త్రంలో విద్యార్థులకు ఎన్నో అవకాశాలు లభించనున్నాయి. తొమ్మిదేళ్లుగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఏటా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోంది కూడా. ప్రయోగశాల నిర్మాణానికి సంబంధించి వందకుపైగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో కలసి పనిచేస్తున్నామని, డిటెక్టర్లో ఉపయోగించే ఇనుప, గాజు ఫలకాలను ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తున్నామని టీఐఎఫ్ఆర్ శాస్త్రవేత్త డాక్టర్ బి.సత్యనారాయణ తెలిపారు. జపాన్తోపాటు కొన్ని ఇతరదేశాల్లో ఉన్న అబ్జర్వేటరీల కంటే భిన్నమైన, ప్రపంచంలో ఇప్పటివరకూ ఎవరూ ప్రయత్నించని పద్ధతుల్లో తాము న్యూట్రినోల గుర్తింపునకు ప్రయోగాలు చేస్తున్నామని ప్రొఫెసర్ ప్రఫుల్ల కుమార్ బెహరా వివరించారు. -
శభాష్..నరేంద్ర
–జాతీయ ఇన్స్పైర్ అవార్డు పోటీల్లో సంతజూటురు విద్యార్థికి ప్రతిభ – ఆటో మ్యాటిక్ హెల్మ్ట్పై ప్రదర్శన – కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు – మొదటిసారి జిల్లాకు జాతీయ ఇన్స్పైర్ అవార్డు కర్నూలు సిటీ:అది సాధారణ ప్రభుత్వ పాఠశాల..అయితేనేం..అక్కడున్న ఉపాధ్యాయుల్లో సత్తా ఉంది..సృజనా ఉంది..అందుకే ఈ పాఠశాల విద్యార్థి జాతీయ స్థాయిలో మెరిశాడు. జాతీయ సైన్స్ ఇన్స్పైర్ అవార్డును ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. బండిఆత్మకూరు మండలం సంతజూటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి కోలె నరేంద్ర ప్రతిభ ఇది. ఆటోమ్యాటిక్ హెల్మెట్ను తయారు చేసి ఈ విద్యార్థి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 60 ప్రదర్శలు.. ఈ నెల 9వ తేది నుంచి ఆదివారం వరకు న్యూఢిల్లీలోని నేషనల్ ఫిజికల్ ల్యాబ్రేటరిలో పలువురిని ఆలోచింపజేశాయి. జాతీయ ఇన్స్పైర్ సైన్స్ ప్రదర్శనకు ఏపీ నుంచి 20.. జిల్లా నుంచి 4 ప్రాజెక్టులు ఎంపిక అయ్యాయి. ఇందులో విద్యార్థి కోలె నరేంద్ర ప్రాజెక్టు కూడా ఒకటి.. ఆలోచన ఇలా.. రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. చివరికి కోర్టులు స్పందించి బైక్ ఉన్న ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాల్సిదేనని ఆదేశాలు కూడా ఇచ్చింది. పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించినా ప్రమదాలు తగ్గలేదు. అయితే ఓ టీచర్కు తన కళ్ల ముందే జరిగిన ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. టీచర్కు వచ్చిన ఆలోచనతో బండిఆత్మ కూరుకు చెందిన హైస్కూల్ విద్యార్థి కోలె నరేంద్ర ఆటోమెటిక్ హెల్మెట్ తయారీకి దారి తీసింది. ఆ ఆలోచనే నేడు వారికి జాతీయ స్థాయి ఇన్స్పైర్ అవార్డు తెచ్చి పెట్టింది. స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్గా పని చేస్తున్న జియన్.రవి శంకరరావు పర్యవేక్షణలో ఆ విద్యార్థి ఆటోమెటిక్ హెల్మెట్ తయారీ చేశారు. ఇలా పని చేస్తుంది...! హెల్మెట్లో రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మీటర్ను ఏర్పాటు చేయాలి. బైక్ హ్యాండిల్ దగ్గర ఒక చిన్న బాక్స్ అమర్చి అందులో రేడియో ప్రీక్వెన్సీ రీసివర్ను ఏర్పాటు చేయాలి. ఇలా ఏర్పాటు చేశాక...బైక్ స్టార్ట్ కావాలంటే హెల్మెట్ తప్పని సరిగా ధరించాలి. «ఆది ధరించిన తరువాత అందులో ఏర్పాటు చేసిన ట్రాన్స్మీటర్ బటన్పై ప్రెస్ అయి అక్కడి నుంచి విడుదల అయ్యే తరంగాల వల్ల రీసివర్కు చేరగానే బైక్ స్టార్ట్ అవుతుంది. హెల్మెట్ ధరించికుంటే బైక్ స్టార్ట్ కాదు. ఈ పరికరం ప్రతి స్కూటర్కు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకుంటారు. దీని వల్ల కొంత మేరకైనా ప్రమాదలు తగుతాయని నరేంద్ర చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు గురించి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్ ప్రత్యేకంగా విద్యార్థితో అడిగి తెలుసుకున్నట్లు గైడ్ టీచర్ తెలిపారు. జిల్లాకు మొదటిసారి జాతీయ ఇన్స్పైర్ అవార్డు...! గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులలో శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడం కోసం 2012లో ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రతి ఏటా జాతీయ స్థాయి సైన్స్ ప్రదర్శనలలో పాల్టొంటున్నా కూడా ఈ ఏడాది అవార్డు రావడం జిల్లాకు మొదటి సారి కావడం గమనర్హం. గత నెల 16,17 తేదీల్లో జరిగిన జిల్లా స్థాయి, 29 నుంచి ఈ నెల1వ తేదీ వరకు కడప జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఈ ప్రదర్శన ప్రశంసలు అందుకుంది. ఈ నెల 9నుంచి 11వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ అవార్డుకు ఎంపిక అయ్యింది. శాస్త్రవేత్త కావాలని ఉంది కోలె నరేంద్ర, 10వ తరగతి విద్యార్థి, సంతజూటురు జెడ్పీ హైస్కూల్ చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే నన్ను ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ వైపు నడిపింది. గైడ్ టీచర్గా ఉన్న రవిశంకరరావు ప్రోత్సాహం మరువలేనిది. వాస్తవంగా మేము తయారీ చేసిన ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయి అవార్డు వస్తుందని అనుకోలేదు. అయితే ఈ ప్రాజెక్టుతో కొందరిలోనైనా ఆలోచింప చేయాలనుకున్నాం. జిల్లా సైన్స్ అధికారి రామ్మెహన్ ఎంతో సహకారం ‡అందించారు. -
మానవాళి మనుగడ వెయ్యేళ్లే!
శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జోస్యం లండన్: జీవనానికి అనువైన మరో గ్రహాన్ని అన్వేషించకుంటే.. భూమిపై మానవజీవనం మరో వెయ్యేళ్లకు మించి ఉండదని ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. ‘భౌతికశాస్త్రంలో పరిశోధనలకు ఈ ఏడాది అత్యంత యోగ్యమైన సంవత్సరం. పరిశోధనా కోణంలో విశ్వముఖచిత్రం50ఏళ్లలో చాలా మారింది. ఇందులో నా పాత్రా ఉన్నందుకు ఆనందంగా ఉంది. ప్రకృతి సూత్రాలను అర్ధంచేసుకోగలిగితే విశ్వ రహస్యాలను ఛేదించడంలో విజయం సాధిస్తాం’ అని శాస్త్రపరిశోధనల చర్చావేదిక అరుున ‘ఆక్స్ఫర్డ్ యూనియన్’లో సోమవారం వ్యాఖ్యానించినట్లు ‘ది ఇండిపెండెంట్’ వెల్లడించింది. -
ముగ్గురు బ్రిటిషర్లకు ఫిజిక్స్ నోబెల్
-
ముగ్గురు బ్రిటిషర్లకు ఫిజిక్స్ నోబెల్
స్టాక్హోమ్: పదార్థానికి ఉండే అసాధారణ స్థితిగతులపై పరిశోధన చేసిన ముగ్గురు బ్రిటిష్ శాస్త్రవేత్తలు డేవిడ్ థౌలెస్, డంకన్ హాల్డేన్, మైఖేల్ కోస్టార్లిట్జ్లకు సంయుక్తంగా ఈ ఏడాది భౌతిక శాస్త్రం(ఫిజిక్స్)లో నోబెల్ దక్కింది. గణిత శాస్త్ర ప్రత్యేక విభాగమైన టోపాలజీలో పరిశోధన చేసి, మన చుట్టూ ఉండే పదార్థం మనకు తెలియని అసాధారణ స్థితిగతులను కలిగి ఉంటుందన్న రహస్యాన్ని వీరు ఛేదించారని నోబెల్ జ్యూరీ రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొంది. ‘భవి ష్యత్తులో అతి చిన్న, వేగవంతమైన క్వాం టమ్ కంప్యూటర్ల తయారీకి, అత్యుత్తమ ఎలక్ట్రానిక్ ఆవిష్కరణలకు, సూపర్ కండక్టర్ల అభివృద్ధికి వీరి పరిశోధన మార్గం సుగమం చేసింది. ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసే (ఓవర్ హీటింగ్) సమస్య లేకుండా విద్యుత్ను, సమాచారాన్ని ప్రసారం చేసేందుకు వీలవుతుంది’ అని తెలిపింది. ఈ ముగ్గురు ప్రస్తు తం అమెరికాలో పనిచేస్తున్నారు. థౌలెస్ వర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో, హాల్డెన్, కోస్టార్లిట్జ్ బ్రౌన్ వర్సిటీలో ప్రొఫెసర్లు. అవార్డు కింద రూ.6.18 కోట్లు (8 మిలియన్ల స్వీడన్ క్రోనార్లు) బహుమతిగా అందజేయనుండగా... డేవిడ్ థౌలెస్కు 50 శాతం, హాల్డేన్, కోస్టర్లిట్జ్లు 25 శాతం చొప్పున అందుకోనున్నారు. పదార్థ అసాధారణ స్థితిపై పరిశోధనకు బహుమతి ఏమిటీ టోపాలజీ.. గణిత శాస్త్రంలో టోపాలజీ ఓ ప్రత్యేకవిభాగం. అంతరిక్షం, పదార్థాల భౌతిక ధర్మాలు, బహిర్గత ఒత్తిడికి గురై ఆకారంలో మార్పులు జరిగినా పూర్వ స్థితికి చేరుకునే లక్షణం వంటి అంశాలపై అధ్యయనమే టోపాలజీ. అయితే ఈ ఒత్తిడికి గురి చేసే శక్తి వినియోగం వంచడం, మెలితిప్పడం వంటి రెండు అంశాలకే పరిమితం. ఈ తరహా ఒత్తిడికి గురి చేసిప్పుడు, (లేదా శక్తిని ప్రయోగించినప్పు డు) ఆ పదార్థం స్థితిగతుల్లో వచ్చే అసాధారణ మార్పులను వారు సిద్ధాంతపరంగా నిరూపించారు. ఉదాహరణకు రబ్బరు గ్లాసును వంచడం, మెలితిప్పడం, డోనట్ ఆకృతిలోకి(గుండ్రంగా ఉండి మధ్యలో రంధ్రం ఉండేలా) మార్చడం వంటివి. టోపాలజీ దృష్టిలో తొలుత ఉన్న రబ్బరు గ్లాసు ఆకృతికి, మార్చిన ఆకృతికి మధ్య భేదం ఉండదు. అందులోని పదార్థ అసాధారణ స్థితిగతులు, మార్పుల దశలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. సూపర్ కండక్టర్ల అభివృద్ధికి తోడు ఇలా మనం సాధారణంగా వినియోగించే పదార్థ టోపాలాజికల్ స్థితులలో మార్పులు చేయడం ద్వారా.. అవి అతిగా వేడెక్కే (ఓవర్ హీటింగ్) సమస్య లేకుండా తక్కువ దూరాలలో శక్తి (విద్యుత్)ని, సమాచారాన్ని రవాణా చేయడానికి వీలు కలుగుతుంది. అంటే అత్యంత సమర్థవంతమైన సూపర్ కండక్టర్లను, సూపర్ ఫ్లూయిడ్లను రూపొందించొచ్చు. అయితే ఇలా టోపాలాజికల్ మార్పులు రంధ్రాలు చేయడం, చింపడం, అతికించడం వంటి వాటికి వర్తించదు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధనలు మెటీరియల్స్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ముఖ్యంగా సూపర్ స్మాల్ క్వాంటమ్ స్కేల్ రూపకల్పనకు తోడ్పడనున్నాయి. ఈ అంశంపై థౌలెస్, హాల్డేన్, కోస్టార్లిట్జ్లు 1970, 80 దశకాల్లోనే పరిశోధన చేశారు. -
విమానం కన్నా వేగంగా రైలులో...
లాస్ వెగాస్: విమానంకన్నా వేగంగా రైల్లో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎలాంటి ట్రాఫిక్ సమస్యా లేకుండా గమ్య స్థానాలకు చేరుకోవాలనుకుంటున్నారా? వినూత్న ఆవిష్కారంతో హైపర్ లూప్ మార్గం.. ఇప్పుడు మీకు అందుబాటులోకి రానుంది. గంటకు పదకొండు వందల కిలోమీటర్ల వేగంతో.. విస్మయపరిచే ప్రయాణ అనుభవాన్ని మీకు అందిచనుంది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిల్స్ కు కేవలం 35 నిమిషాల్లో చేరేందుకు హైపర్ లూప్ మార్గం అందుబాటులోకి వస్తోంది. 1100 కిలోమీటర్ల విమానానికి మించిన వేగంతో ప్రయాణీకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది. హైపర్ లూప్ సంస్థ దీనికి సంబంధించి తాజాగా ప్రయోగాలు జరిపింది. ప్రముఖ హైబ్రిడ్ కార్ల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్స్ తన హైపర్ లూప్ ఆలోచనను విజయవంతంగా ఆచరణలో పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల లాస్ వెగాస్ ఎడారి ప్రాంతంలో హైపర్ లూప్ టెక్నాలజీస్ కి సంబంధించిన హైపర్ లూప్ వన్ మొదటిసారి తమ కొత్త రవాణా సిస్టమ్ పై పూర్తి స్థాయి పరీక్షలు నిర్వహించింది. హైపర్ లూప్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీస్... లారెన్స్ లివేర్మోర్ నేషనల్ లాబొరేటరీ నుంచి ఇండక్ ట్రాక్ పేరిట తన నూతన ఆవిష్కారానికి సాంకేతిక లైసెన్సును కూడ పొందింది. అనుకున్నట్లుగా అన్నీ జరిగితే హైపర్ లూప్ స్వంత ఆవిష్కారం త్వరలో మనముందు సాక్షాత్కరించి, అత్యంత వేగవంతమైన మార్గాన్ని సుగమం చేయనుంది. -
కీచక టీచర్ వీపు విమానం మోత మోగింది..
పెడన(కృష్ణా): బాధ్యత మరిచి బరితెగించిన ఓ ఉపాధ్యాయుడిని గ్రామస్తులు, విద్యార్థులు కలసి చితకబాదారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెడన మండలం నందమూరు గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాలీవీ.. పెడన భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో ఫిజిక్స్ బోధించే హనుమంతరావు వర్క్ఎడ్జస్ట్మెంట్పై నెల రోజులుగా నందమూరు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో పనిచేస్తునానడు. పాఠశాలలో కొంతమంది బాలికలపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేస్తూ... అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఈ వ్యవహారం శృతిమించడంతో శనివారం 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థులు విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు వివరించారు. కోపోద్రిక్తులైన బాలికల తలిదండ్రులు గ్రామస్తులతో కలిసి హనుమంతరావును హైస్కూల్ నుంచి బయటకు ఈడ్చుకుంటూ తీసుకొచ్చి దేహశుద్ధి చేశారు. పోలీసులు హనుమంతరావును అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతంపై డీవైఈవో ఎం.గిరికుమారి విచారణ నిర్వహించారు. -
గన్ ఎలా పనిచేస్తుందంటే..
భౌతికశాస్త్రంలోని చాలా ప్రాథమిక అంశాలతో తుపాకీని తయారు చేశారు. ప్రధానంగా న్యూటన్ మూడో సూత్రం దీనికి వర్తిస్తుంది. ఏ చర్యకైనా సమానమైన, వ్యతిరేకమైన ప్రతిచర్య ఉంటుందనే సూత్రాన్ని అనుసరించి తుపాకీ పనిచేస్తుంది. ఇందులో మ్యాగజైన్ అనే భాగంలో బుల్లెట్లు (గుండ్లు) వచ్చి కూర్చుంటాయి. బ్యారెల్లోకి బుల్లెట్ వచ్చి చేరేలా చేసేందుకు బ్యారెల్ లోపల ఉండే భాగం ముందుకు వెనక్కు కదిలేలా రూపొందించారు. దీన్ని స్లైడ్ అంటారు. ఇలా కదిలించడాన్ని కాక్ చేయడం అంటారు. ఇలా కాక్ చేసినప్పుడల్లా బ్యారెల్లోకి కొత్త బుల్లెట్ వస్తుంది. బుల్లెట్లు ఒకదాని తర్వాత మరొకటిగా వరుసగా ఉండే భాగాన్ని మ్యాగజైన్ అంటారు. మ్యాగజైన్లో కింద ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఇది కలిగించే ఒత్తిడి వల్ల బుల్లెట్ బ్యారల్ వెనుకభాగంలోకి వెళ్తుంది. సరిగ్గా ఆ ప్రాంతంలోనే బుల్లెట్ వెనుక బలంగా కొట్టేలా ఒక సుత్తి ఉంటుంది. దీన్నే హ్యామర్ అంటారు. ట్రిగర్ నొక్కగానే హ్యామర్... బుల్లెట్ వెనక భాగంలో ఉండే మందుగుండును దెబ్బకొట్టి మండిస్తుంది. ఈ ప్రక్రియను కంబషన్ అంటారు. దీని వల్ల విపరీతమైన పీడనం (ప్రెషర్) ఏర్పడి, దాని ప్రభావంతో బుల్లెట్ శరవేగంగా ముందుకు దూసుకెళ్తుంది. మందుగుండు ఉండే భాగం (క్యాటరిడ్జ్) అక్కడే బయటకు పడిపోతుంది. బుల్లెట్ సూటిగా దూసుకుపోయేలా చేసేందుకు బ్యారెల్లోని గ్రూవ్స్ గిర్రున తిప్పుతాయి. దాంతో గాలి ఒత్తిడికి బుల్లెట్ ప్రభావితం కాకుండా సూటిగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మనం లక్ష్యాన్ని గురిచూసేందుకు తుపాకిపైన హ్యామర్కు ముందు ఒక చిన్న కన్నం, ఆ కన్నంలోంచి లక్ష్యానికి సూటిగా ఉందా లేదా అని చూసేందుకు బ్యారెల్ మీద మరో ఎత్తు భాగం ఉంటాయి. ఈ కన్నాన్ని రేర్సైట్ అని, బ్యారల్పై ఎత్తుగా ఉండే భాగాన్ని ఫ్రంట్ సైట్ అని అంటారు. వీటిలోంచి చూసి గురిపెట్టి ట్రిగర్ నొక్కినప్పుడల్లా బుల్లెట్ బయటకు దూసుకెళ్తుంది. ఇదీ సంక్షిప్తంగా గన్ పనిచేసే ప్రక్రియ. -
'క్వాంటమ్' పరిశోధకులకు మహా పురస్కారం
అట్లాంటా: క్వాంటమ్ మెకానిక్స్ లో పరిశోధనలను మరింత ముందుకు తీసుకుపోయేలా.. న్యూట్రినోలకూ ద్రవ్యరాశి ఉంటుందని రుజువుచేసిన భౌతికశాస్త్రవేత్తలు ఇద్దరికి ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. జపాన్ కు చెందిన టకాకి కజితా, కెనడాకు చెందిన మెక్ డోనాల్డ్ లను సంయుక్తంగా అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ మంగళవారం ప్రకటించింది. మూలకణంలో ఎలక్ట్రాన్లను పోలి ఉండే న్యూట్రినోల పనితీరుపై ఈ ఇరువురు పరిశోధనలు చేశారు. టకాకి.. యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందినవారుకాగా, మెక్ డోనాల్డ్ కెనడాలోని సడ్బ్యూరీ న్యూట్రినో అబ్జర్వేటరీ ఇన్ స్టిట్యూట్ కు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. -
చుక్కలు చూపిన ఫిజిక్స్!
* రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్ * నిమిషం నిబంధనతో ఇబ్బందులు * పరీక్ష రాయలేకపోయిన పలువురు విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఎంసెట్-2015 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఇంజనీరింగ్ విభాగం పరీక్షలో భౌతికశాస్త్రం (ఫిజిక్స్) ప్రశ్నలు విద్యార్థులను తికమకపెట్టాయి. ప్రశ్నలు కఠినంగా ఉండడంతో చాలా వాటికి సమాధానాలు రాయలేకపోయినట్లు ఎక్కువ మంది విద్యార్థులు పేర్కొన్నారు. గణితం, రసాయనశాస్త్రం ప్రశ్నలు సులభంగానే వచ్చాయన్నారు. మరోవైపు ఇంజనీరింగ్ కోడ్ ‘ఏ’ ఫిజిక్స్లో 84వ ప్రశ్నకు 2, 4 ఆప్షన్లు రెండూ సరైనవేనని సబె ్జక్టు నిపుణులు చెబుతున్నారు. అలాగే కోడ్ ‘ఏ’లో 114, 120వ ప్రశ్నలకు సరైన సమాధానాలను ఆప్షన్లలో ఇవ్వలేదని వెల్లడించారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలో జంతుశాస్త్రం, రసాయన, భౌతికశాస్త్రాల్లో ప్రశ్నలు బాగానే వచ్చినా.. వృక్షశాస్త్రంలో ఇచ్చిన ప్రశ్నలు చుక్కలు చూపించి నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. మెడిసిన్ బీకోడ్ ప్రశ్నపత్రంలో జువాలజీ విభాగంలో 54వ ప్రశ్నకు పూర్తి వ్యతిరేకార్థంతో తెలుగు అనువాదం ఇచ్చారని చెప్పారు. మరోవైపు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించని కారణంగా పలు చోట్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. మెదక్ వంటి జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల్లో నిర్ణీత సమయాని కంటే ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు ఆవేదనతోనే వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. మొత్తంగా ఇంజనీరింగ్లో ఎంసెట్కు 1,39,682 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,28,174 మంది పరీక్ష రాశారు. అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 92,365 మంది దరఖాస్తు చేసుకోగా 84,678 మంది రాశారు. ఎలాంటి ఫిర్యాదులు లేవు.. రాష్ట్రవ్యాప్తంగా 423 కేంద్రాల్లో గురువారం ఎంసెట్ పరీక్ష జరుగగా.. ఇంజనీరింగ్ విభాగంలో 91.76 శాతం మంది రాశారని, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ పరీక్షకు 91.68 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణరావు పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలు బాగానే ఉన్నాయని, తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఆయన చెప్పారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు. ఈ నెల 16న ఎంసెట్ ప్రాథమిక కీలను విడుదల చేసి.. 23వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. ఇప్పటికే అందిన ఇంటర్ మార్కుల వివరాల ఆధారంగా 25 శాతం వెయిటేజీని కలిపి ఈ నెల 28న ఎంసెట్ తుది ర్యాంకులు ప్రకటిస్తామని రమణరావు వెల్లడించారు. జేఎన్టీయూహెచ్ భేష్: జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఎంసెట్ నిర్వహణ విధానాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి లక్ష్మారెడ్డి ప్రశంసించారు. జేఎన్టీయూహెచ్లో ఉదయం 6 గంటలకు కడియం శ్రీహరి ఇంజనీరింగ్ ప్రశ్నపత్రాల కోడ్ ‘క్యూ’ను విడుదల చేశారు. ఉదయం 9.30కు మంత్రి లక్ష్మారెడ్డి మెడికల్ ప్రశ్నపత్రాల కోడ్ ‘ఎస్’ను విడుదల చేశారు. రాష్ట్రంలో సాంకేతిక విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా చెప్పారు. నిమిషం ని‘బంధనం’ ఎంసెట్లో ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించవద్దనే నిబంధన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొని పరీక్షా కేంద్రానికి వెళ్లేసరికి ఆలస్యం కావడంతో మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్కు చెందిన సుధాకర్ను పరీక్షకు అనుమతించలేదు. దీంతో కంటతడి పెడుతూ వెనుదిరిగాడు. ఇదే జిల్లా సిద్ధిపేటలో ముగ్గురు పరీక్ష రాయలేకపోయారు. నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకున్న ముగ్గురు విద్యార్థులు రాయకుండానే వెనుదిరిగారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని ఎస్ఏపీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి మెదక్ జిల్లా సదాశివపేటకు చెందిన వికలాంగ విద్యార్థి ప్రదీప్ నిమిషం ఆలస్యంగా రావడంతో అతడిని అధికారులు అనుమతించలేదు. దీంతో ప్రదీప్ ఏడుస్తూ వెళ్లిపోయాడు. ఆలస్యంగా వచ్చిన కారణంగా వికారాబాద్లో ఏడుగురు, నిజామాబాద్ జిల్లాలో ఐదుగురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయూరు. సెంటర్ ఓ చోట.. పరీక్ష మరోచోట పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి సమయం లేకపోవడంతో పలుచోట్ల అధికారులు ఇతర కేంద్రాల్లో పరీక్ష రాయడానికి అనుమతించారు. హైదరాబాద్లోని రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఇలా నలుగురు విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ నలుగురిలో ఇద్దరు తార్నాకలోని ఓ కేంద్రంలో, మరొకరు రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ కేంద్రంలో, మరో విద్యార్థి మేడ్చల్లోని ఓ పరీక్ష కేంద్రంలో ఎంసెట్ రాయాల్సి ఉంది. కానీ ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు సమయం లేకపోవడంతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారుల అనుమతితో పాలిటెక్నిక్ కాలేజీలో పరీక్ష రాశారు. ఇక వరంగల్ జిల్లాకు చెందిన చిదిరాల భరత్ అనే విద్యార్థి కరీంనగర్ కేంద్రంలో ఎంసెట్ రాయాల్సి ఉంది. కానీ వెళ్లేందుకు సమయం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా.. వారు ఆర్డీవో సహాయంతో వరంగల్ కిట్స్ కళాశాలలో పరీక్ష రాయించారు. -
‘కింగ్ ఆఫ్ ది కెమికల్స్’ అని దేనిని అంటారు?
విద్యుత్: విశిష్ట నిరోధం: ప్రమాణ పొడవు, ప్రమాణ అడ్డుకోత వైశాల్యం ఉన్న తీగ విద్యుత్ నిరోధాన్ని దాని విశిష్ట నిరోధం అంటారు. s = విశిష్ట నిరోధం కానీ ప్రమాణాలు: గిఝ (ఓమ్ మీటర్) ఆయా పదార్థాల స్వభావాలను బట్టి విశిష్ట నిరోధం వేర్వేరుగా ఉంటుంది. విద్యుచ్ఛాలక బలం: ఒక విద్యుత్ వలయంలో ఆవేశాలను ఒక బిందువు నుంచి మరొక బిందువుకు కదిలించడానికి వాటిపైన ఉపయోగించే శక్తిని ‘విద్యుచ్ఛాలక బలం’ అంటారు. ప్రమాణం: వోల్ట్. విద్యుచ్ఛాలక బలాన్ని అందించే పదార్థాలను ‘విద్యుచ్ఛాలక పీఠాలు’ అంటారు. ఉదా: విద్యుత్ జనరేటర్, సైకిల్ డైనమో, విద్యుత్ ఘటం. గమనిక: భూమికి విద్యుచ్ఛాలక బలం శూన్యం. కాబట్టి భూమి లోపల ఉన్న ఆవేశాలను తనంతట తానుగా పైకి పంపించలేదు. కాబట్టి భూమికి తీగలను కలిపి విద్యుత్ను పొందలేకపోతున్నాం. అతివాహకత్వం: గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న లోహాలను చల్లబర్చినప్పుడు ఏదో ఒక ఉష్ణోగ్రత వద్ద వాటి విద్యుత్ నిరోధం శూన్యంగా మారి ఆ పదార్థాల ద్వారా అనంతమైన విద్యుత్ ప్రవహిస్తుంది. దీన్ని అతివాహకత్వం అంటారు. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పాదరసాన్ని - 2690 ఇ వద్ద చల్లబర్చినప్పుడు అతివాహకత్వ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ధర్మాన్ని క్రీ.శ. 1911లో కామర్లింగ్ ఓమ్స్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం వల్ల అతనికి 1913లో నోబెల్ బహుమతి లభించింది. విద్యుత్ సాధనాలు 1. విద్యుద్దర్శిని (ఎలక్ట్రోస్కోప్): ఒక విద్యుత్ వలయంలో ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహ ఉనికిని తెలుసుకొనేందుకు విద్యుద్దర్శినిని ఉపయోగిస్తారు. 2. స్వర్ణపత్ర విద్యుద్దర్శిని: ఈ సాధనాన్ని బెన్నెట్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఈ విద్యుత్ పరికరం ఉపయోగించి ఒక వస్తువు ఉపరితలంపై గల ఆవేశ స్వభావాన్ని అంటే ధనావేశం/రుణావేశం అనే దాన్ని కనుక్కోవచ్చు. 3. నిరోధాల పెట్టె: ఒక విద్యుత్ వలయంలో ఉన్న విద్యుత్ నిరోధాలను 1 గి, 2 గిలు..పెంచడానికి దీన్ని ఉపయోగిస్తారు. 4. అధిక నిరోధాల పెట్టె: ఈ విద్యుత్ సాధనాన్ని ఉపయోగించి విద్యుత్ వలయంలో ఉన్న నిరోధాలను ఒకేసారి 1000గిల చొప్పున పెంచవచ్చు. 5. ఓమ్మీటర్: ఒక తీగ విద్యుత్ నిరోధాలను సరాసరి కొలవడానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. 6. కదిలే తీగ చుట్ట: ఈ విద్యుత్ సాధనాన్ని ఉపయోగించి ఒక తీగలో ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహాన్ని 10-9అ కొలవడమే కాకుండా విద్యుత్ ప్రవాహ దిశను కూడా తెలుసుకోవచ్చు. 7. టాన్గెంట్ గాల్వనో మీటర్: త్రికోణమితి లోని ఖ్చ్ఞీ సూత్రం ఆధారంగా పనిచేసే ఈ విద్యుత్ సాధనాన్ని ఉపయోగించి విద్యుత్ వలయంలో ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహాన్ని 10-6అ వరకు ఖచ్చితంగా కొలవవచ్చు. 8. అమ్మీటర్: ఒక విద్యుత్ వలయంలో ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహాలను మిల్లి ఆంపియర్ల నుంచి ్ర10ృ3అ నుంచి 1అ, 2అలలో కొలవవచ్చు. ఆదర్శమైన అమ్మీటర్ విద్యుత్ నిరోధం శూన్యం. 9. వోల్ట్ మీటర్: ఒక విద్యుత్ వలయంలో ఏవైనా రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ తేడాను మిల్లీ వోల్ట్ల నుంచి 1, 2 వోల్ట్..లలో కొలవవచ్చు. ఆదర్శమైన వోల్ట్మీటర్ విద్యుత్ నిరోధం అనంతం. 10. పొటెన్షియో మీటర్: ఒక ఘటం నుంచి వెలువడే విద్యుత్ చాలక బలాన్ని దాని అంతర్గత నిరోధాన్ని కొలవడానికి పొటె న్షియో మీటర్ను ఉపయోగిస్తారు. 11. రియోస్టార్ట: ఒక విద్యుత్ వలయంలో నిరోధాలను స్వల్ప పరిమాణంలో పెంచుతూ లేదా తగ్గిస్తూ విద్యుత్ ప్రవాహాన్ని ఒక స్థిరమైన విలువ వద్ద స్థిరీకరించడం కోసం ఈ సాధనాన్ని వాడతారు. 12. కెపాసిటర్/కండెన్సర్: తక్కువ ఓల్టెజ్ వద్ద ఎక్కువ ఆవేశాలను, విద్యుత్ శక్తిని తనలో నిల్వ చేసుకొనే సాధనాన్ని కెపాసిటర్ అంటారు. కెపాసిటర్ కెపాసిటీని ‘ఫారడే’ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. కెపాసిటర్ ద్వారా అఇ కరెంటు మాత్రమే ప్రవహిస్తుంది. ఈఇ ప్రవహించదు. కెపాసిటర్ను ట్యూబ్లైట్, ఫ్యాన్, టీవీ, కంప్యూటర్ల్లో ఉపయోగిస్తారు. 13. పరివర్తకం (ట్రాన్సఫార్మర్): తక్కువ ఓల్టేజ్ నుంచి ఎక్కువ ఓల్టేజ్కి లేదా ఎక్కువ ఓల్టేజ్ నుంచి తక్కువ ఓల్టేజ్కు విద్యుత్ను సరఫరా చేయటం కోసం ట్రాన్సఫార్మర్లను ఉపయోగిస్తారు. ఇవి అన్యోన్య ప్రేరణ, పరస్పర ప్రేరణ అనే సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. ఈ సూత్రాన్ని ‘లెంజ్’ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. దీని ఆధారంగా మొదటి ట్రాన్సఫార్మర్ను ‘మైకేల్ ఫారడే’ అనే శాస్త్రవేత్త నిర్మించాడు. దీన్ని మృదు ఇనుముతో తయారు చేసి ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ద్రవస్థితిలో ఉన్న ‘హీలియం’ వాయువును నింపుతారు. ట్రాన్సఫార్మర్లను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 1. స్టెప్ అప్ ట్రాన్సఫార్మర్: దీన్ని ఉపయోగించి తక్కువ ఓల్టేజ్ నుంచి ఎక్కువ ఓల్టేజ్ విద్యుత్ను సరఫరా చేయవచ్చు. 2. స్టెప్ డౌన్ ట్రాన్సఫార్మర్: ఎక్కువ ఓల్టేజ్ నుంచి తక్కువ ఓల్టేజ్కు విద్యుత్ను సరఫరా చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఉపయోగాలు: బెడ్ల్యాంప్స్, టీవీ, కంప్యూటర్ల యూపీఎస్లు, స్టెబిలైజర్స, ట్రాన్సఫార్మర్లలో వాడతారు. ఘటం: ఘటాన్ని ‘వోల్టా’ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ప్రతిఘటంలో రసాయన శక్తి విద్యుత్శక్తిగా మారుతుంది. ‘వోల్టా’ కనుగొన్న ఘటంలో ‘రాగి’ కడ్డీని ధన ధ్రువంగా, జింక్ కడ్డీని రుణ ధ్రువంగా వాడతారు. ఈ రెండు ఎలక్ట్రానన్లను ఒకదానికి మరొకటి కొంత దూరంలో ఉండేట్లు ఒక గాజు జాడీలో అమర్చి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని విద్యుత్ విశ్లేషక పదార్థంగా ఉపయోగిస్తారు. ఈ సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం విద్యుత్ విశ్లేషణం చెందడానికి కావాల్సిన నియమాలను ‘మైకేల్ ఫారడే’ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ఈ విధంగా సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంలో రసాయన శక్తి విద్యుత్శక్తిగా మారుతుంది. నిర్జన/అనార్ధ్ర ఘటం: నిజ జీవితంలో మన అవసరాలకు ఎక్కువగా వాడే ఘటం. నిర్జల ఘటంలో ఎటువంటి ద్రవ పదార్థాలు లేకపోవడం వల్ల దాన్ని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకొని వెళ్లవచ్చు. దీన్ని అనేక పరికరాల్లో ఉపయోగిస్తారు. ఉదా: కెమెరా, టార్చలైట్, గోడ గడియారాలు, ఆటబొమ్మలు మొదలైనవాటిలో ఈ ఘటాలను ఉపయోగిస్తారు. పైన పేర్కొన్న ఐదు రకాలైన ఘటాల్లో రసాయన శక్తి విద్యుత్శక్తిగా మారిన తర్వాత తిరిగి వాటిని చార్జ చేయడం వీలు కాదు. చార్జబుల్ బ్యాటరీ: దీన్ని గ్లాంటే ప్లాస్టన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈ ఘటంలో విద్యుత్శక్తి రసాయన శక్తిగా మారుతుంది. రసాయన శక్తి తిరిగి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఉపయోగాలు: మొబైల్ ఫోన్లు, హ్యాండీక్యామ్, కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకల్లో వాడతారు. స్టోరేజ్ బ్యాటరీ: దీన్ని థామస్ అల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈ ఘటాల్లో లెడ్ను ధనధ్రువంగా, లెడ్పెరాక్సైడ్ను రుణ ధ్రువంగా వాడతారు. ఈ ఘటాల్లో సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని విద్యుత్ విశ్లేషక పదార్థంగా వాడతారు. ఇటువంటి ఘటాలను వాహనాల్లో ఉపయోగిస్తారు. మానవుడికి ఎక్కువగా ఉపయోగపడుతున్న సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ‘కింగ్ ఆఫ్ ది కెమికల్స్’ అంటారు. బల్బులు: విద్యుత్ బల్బును థామస్ అల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. గాజుతో తయారు చేసిన విద్యుత్ బల్బుల్లో టంగ్స్టన్ ఫిలమెంట్గా అమర్చి, దానిలో తక్కువ పీడనం ఉన్న ఆర్గాన్ అనే జడవాయువును లేదా నైట్రోజన్ అనే మందకొండి వాయువును నింపుతారు. ఈ ఫిలమెంట్ ద్వారా విద్యుత్ నిరోధం తక్కువగా, ద్రవీభవన స్థానం (24000 ఇ) ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫిలమెంట్ ద్వారా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు అది ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడెక్కినప్పటికీ కాలిపోకుండా ఉంటుంది. ఈ బల్బుల్లో విద్యుత్ నష్టం ఎక్కువగా ఉంటుంది. 2. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ (సీఎఫ్ఎల్ బల్బ్): దీన్ని ఎడ్వర్డ హామర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. దీనిలో తక్కువ మోతాదులో పాదరసాన్ని ఉపయోగిస్తారు. ఈ సీఎఫ్ఎల్ బల్బుల్లో ఎటువంటి ఫిల మెంట్లు లేకపోవడం వల్ల సరఫరా చేసిన విద్యుత్ అంతా కాంతిశక్తిగా మారుతుంది. కాబట్టి విద్యుత్ పొదుపు ఎక్కువగా ఉంటుంది. ట్యూబ్లైట్: గాజుతో తయారు చేసిన ఒక గొట్టం రెండు చివర్ల వద్ద ఆనోడు, కేథోడు అనే ఎలక్ట్రాన్లు అమర్చి వాటి మధ్యలో తక్కువ పీడనం వద్ద కావాల్సిన వాయువును నింపుతారు. ఈ గాజు గొట్టంలో సిలికెట్ లేదా టంగ్స్టన్ అనే రసాయనిక పదార్థాలతో పూత పూస్తారు. ట్యూబ్లైట్లో ఎటువంటి ఫిలమెంట్ లేకపోవడం వల్ల దానిలో విద్యుత్ పొదుపు ఎక్కువగా ఉంటుంది. చాపం దీపాలు (ఆర్కో ల్యాంప్స్): వీటిని సర్ హంపెరీ డెవీస్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఉపయోగాలు: సినిమా ప్రొజెక్టర్లలో చాపం దీపాన్ని ఉపయోగిస్తారు. దీని నుంచి వెలువడే దట్టమైన కాంతి అనేది సినిమా రీల్పైన పతనమైనప్పుడు దానిపైన ఉన్న పిక్చర్ తెరపైన ఏర్పడుతుంది. నౌకాశ్రయంలోని లైట్ హోస్లపైన కూడా వీటిని ఉపయోగిస్తారు. దీనిలో అమర్చే బల్బ్ల్లో నియాన్ అనే వాయువును నింపుతారు. ఈ బల్బుల నుంచి ‘ముదురు నారింజరంగు కాంతి’ వెలువడుతుంది. వేపర్ ల్యాంప్స్ (Vapour Lamps): వీటిని పీటర్ కూపర్ హెవిట్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఇటువంటి బల్బ్ల్లో ‘సోడియం ఆవిరి’ని లేత పసుపు రంగు కాంతి కోసం, ‘పాదరస ఆవిరి’ని తెలుపు రంగు కాంతి కొరకు ఉపయోగిస్తారు. ఫ్లోరోసెంట్ ల్యాంప్ లేదా ఎమర్జెన్సీ ల్యాంప్: వీటిలో తక్కవ మోతాదులో పాదరసాన్ని ఉపయోగిస్తారు. అలంకరణ దీపాలను, వీధి దీపాలను శ్రేణిలో కలుపుతారు. ఫ్యూజ్ (తీగ): దీన్ని లెడ్, టిన్ల మిశ్రమంతో తయారుచేస్తారు. ఈ మిశ్రమం పదార్థాన్ని టైప్ మెటల్ అని కూడా అంటారు. ఈ పదార్థం విద్యుత్ నిరోధం ఎక్కువగా, ద్రవీభవన స్థానం తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని విద్యుత్ వలయంలో శ్రేణిలో కలిపి అధిక విద్యుత్ ప్రవాహం బారి నుంచి విద్యుత్ వలయాలను కాపాడవచ్చు. హీటర్: విద్యుత్ హీటర్లో నిక్రోమ్ తీగను ఫిలమెంట్గా వాడతారు. ఎందుకంటే దీని విద్యుత్ నిరోధం, ద్రవీభవన స్థానాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఫిలమెంట్ ద్వారా ప్రవహిస్తున్న విద్యుత్ అంతా ఉష్ణశక్తిగా మారుతుంది. అయినప్పటికీ ఈ ఫిలమెంట్ ద్రవీభవన స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల కాలిపోకుండా ఉంటుంది. విద్యుత్ ఫలితం (ఎలక్ట్రిక్ ఎఫెక్ట్): రెండు వేర్వేరు లోహపు తీగలను తీసుకుని వాటి చివరలను రెండు సందులుగా అమర్చి నట్లయితే ఏర్పడిన వలయాన్ని ‘ఉష్ణయు గ్మం’ అని అంటారు. ఈ ఉష్ణయుగ్మంలో ఉన్న ఒక సంధిని మంచు ముక్కల్లో అమర్చాలి. అప్పుడు దాని ఉష్ణోగ్రత 00సెంటీగ్రేడ్కు తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని చల్లని సంధి అంటారు. రెండో సంధిని ఒక పాత్రలో ఉన్న ద్రవంలో అమర్చి వేడి చేసినప్పుడు దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందువల్ల రెండో సంధిని వేడి సంధి అంటారు. ఈ వేడి సంధి వద్ద ఇచ్చిన ఉష్ణశక్తి అనేది ఉష్ణయుగ్మంలో విద్యుచ్ఛక్తిగా మారుతుంది. అందువల్ల ఈ వలయంలో జనించిన విద్యుత్ను ఉష్ణ విద్యుత్ అంటారు. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త సీబెక్ కావడం వల్ల దీన్ని సీబెక్ ఫలితం అంటారు. సీబెక్ ఫలితంలో జనించిన ఉష్ణ విద్యుత్ అనేది రెండు అంశాలపైన ఆధారపడి ఉంటుంది. 1. ఉష్ణ యుగ్మాన్ని తయారు చేయడం కోసం ఉపయోగించిన ‘పదార్థాల స్వభావం’పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి గరిష్టమైన ఉష్ణ విద్యుత్ను పొందడం కోసం ఉష్ణయుగ్మాన్ని ఆంటి మొని, బిస్మత్ అనే పదార్థాలను ఉపయో గించి నిర్మించాలి. 2. చల్లని సంధి, వేడి సంధి మధ్య ఉష్ణోగ్రతలోని తేడాపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు కనుగొన్న ఘటాల్లో ముఖ్యమైనవి ఘటం పేరు +A అనోడ్ – C కేధోడ్ విద్యుత్ విశ్లేషక ఫలకం ధన ఫలక రుణ ఫలక 1. వోల్టా రాగి కడ్డీ జింక్ కడ్డీ సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం 2. లెక్లాంచి కార్బన్ కడ్డీ జింక్ కడ్డీ అమ్మోనియం క్లోరైడ్ 3. డేనియల్ రాగి పాత్ర జింక్ పాత్ర కాపర్ సల్ఫేట్,జింక్ సల్ఫేట్ 4. బ్రైకోమెట్ 2 కార్బన్ కడ్డీలు జింక్ ఫలక సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం 5. నిర్జల/అనార్ధ్ర కార్బన్ కడ్డీ జింక్ ఫలక అమ్మోనియం క్లోరైడ్ పేస్ట్ రూపంలో సి.హెచ్. మోహన్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్. -
జేఈఈ అడ్వాన్సడ్ - 2015
జేఈఈ అడ్వాన్స్డ్.. లక్షా యాభై వేల మంది ప్రతిభావంతులు మాత్రమే హాజరయ్యే పరీక్ష. ఇందుకోసం విద్యార్థులు జేఈఈ-మెయిన్లోని పేపర్-1 పరీక్ష రాయాలి. జేఈఈ-మెయిన్ ద్వారా 1,50,000 మంది విద్యార్థులకు అడ్వాన్స్డ్కు అర్హత కల్పిస్తారు. వీరిలో 20,000 మంది విద్యార్థులకు ర్యాంక్ కేటాయిస్తారు. అడ్వాన్స్డ్ ర్యాంక్తోపాటు ఇంటర్లో టాప్ 20 పర్సంటైల్ లేదా 75 శాతం మార్కులు ఉంటేనే ఐఐటీలు, ఐఎస్ఎంలో ప్రవేశం లభిస్తుంది. ఆబ్జెక్టివ్గా రెండు పేపర్లు జేఈఈ అడ్వాన్స్డ్లో రెండు ఆబ్జెక్టివ్ పేపర్లు.. పేపర్-1, పేపర్-2 ఉంటాయి. ప్రతి పేపర్కు 180 మార్కుల చొప్పున మొత్తం కేటాయించిన మార్కులు 360. వీటిలో నాలుగు రకాల ప్రశ్నలిస్తారు. ప్రతి పేపర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి పేపర్కు సమయం మూడు గంటలు. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కులిస్తారు. అంతేకాకుండా హాజరు విషయంలో కూడా పరిమితి విధించారు. ఈ క్రమంలో జేఈఈ-అడ్వాన్స్డ్కు వరుసగా రెండు సార్లు (సంవత్సరాలు) మాత్రమే రాసే అవకాశం ఉంది. మ్యాథమెటిక్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలు: లిమిట్స్ అండ్ కంటిన్యుటీ, డిఫరెన్షిబిలిటీ, 3డీ లైన్స్-ప్లేన్స్ (అనుబంధ ప్రశ్నలు), క్వాడ్రాటిక్ ఈక్వేషన్స, మ్యాట్రిక్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, ఏరియా బౌండెడ్ బై కర్వ్స్, మాక్సిమ-మినిమ, జామెట్రికల్ అప్లికేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, అప్లికేషన్స్ ఆఫ్ వెక్టర్ అల్జీబ్రా, డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్.పిపరేషన్ కోసం 4-5 పుస్తకాలను రిఫర్ చేయడం కంటే ఏదో ఒక ప్రామాణిక పుస్తకాన్ని సంపూర్ణంగా చదవడమే ఉత్తమం. బీఆర్క్ కోసం ఏఏటీ బీఆర్క్ (ఆర్కిటెక్చర్)లో చేరాలనుకునే విద్యార్థులు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కు హాజరు కావాలి. జేఈఈ-అడ్వాన్స్డ్లో ర్యాంక్ సాధించిన విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ఇందుకోసం 2015, జూన్ 18-19 మధ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పరీక్షను 2015, జూన్ 21న నిర్వహిస్తారు. ఫిజిక్స్ ఫిజిక్స్లో కొన్ని అంశాలు ఉమ్మడిగా ఉంటాయి. వాటిని ఒకే సారి చదవడం ప్రయోజనకరం. ఉదాహరణకు గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నో స్టాటిస్టిక్స్; కరెంట్ ఎలక్ట్రిసిటీ, హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్ డైనమిక్స్; సౌండ్ వేవ్స్, వేవ్ ఆప్టిక్స్, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్, సింపుల్ హార్మోనిక్ మోషన్; లీనియర్ డైనమిక్స్, రొటేషనల్ డైనమిక్స్; థర్మోడైనమిక్స్, కెమిస్ట్రీలోని థర్మోడైనమిక్స్ భాగం. థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్. ఆప్టిక్స్లో.. ముందుగా వేవ్ టాపిక్స్ను పూర్తి చేయడం మంచిది. తర్వాత జామెట్రికల్ ఆప్టిక్స్ను ప్రిపేర్ కావాలి. వేవ్స్లో ట్రాన్స్వర్స్ వేవ్స్, సౌండ్ వేవ్స్కు వెయిటేజీ సమంగా ఉంటుంది. సింపుల్ హార్మోనిక్ మోషన్, ఫిజికల్ ఆప్టిక్స్, ఆసిలేషన్స్, ఏసీ సర్క్యూట్స్లలోని మ్యాథమెటికల్ పార్ట్ ప్రిపేర్ కావడం ఉపయుక్తం. గ్రావిటేషన్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మాగ్నటిజంలలో కూడా టాపిక్స్ కామన్. ప్రిన్సిపల్స్, అప్లికేషన్స్లో కొద్దిపాటి తేడా ఉంటుంది. కూలుంబ్స్ లా.. న్యూటన్స్ గ్రావిటేషన్ లాగా మారుతుంది. గాస్ లాను గ్రావిటేషన్ ఫీల్డ్ ఎవల్యూషన్లోనూ ఉపయోగించవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, మాగ్నటిజం అంశాలను ఒక్కటిగా చదువుకోవచ్చు. కెమిస్ట్రీ గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి అధిక ప్రాధాన్యతనిచ్చారు. కాబట్టి మెటలర్జీ, కాంప్లెక్స్ కంపౌండ్స్, అనలిటికల్ కెమిస్ట్రీ, పి-బ్లాక్ ఎలిమెంట్స్, డి-బ్లాక్ ఎలిమెంట్స్పై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో అడిగే ప్రశ్నలు ఆయా అంశాల్లోని ప్రాథమిక భావనలను పరీక్షించే విధంగా ఉంటాయి. ఉదాహరణకు ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్స్, రియాక్షన్ మెకానిజం, రీజెంట్స్, స్టెబిలిటీ ఆఫ్ ఇంటర్మీడియెట్స్. ఈ అంశానికి సంబంధించి ఇచ్చిన సిలబస్ వరకే పరిమితం కావడం మంచిది. ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్, ఈక్విలెంట్ కాన్సెప్ట్స్, సాల్యుబులిటీ ప్రొడక్ట్, కామన్ ఆయాన్ ఎఫెక్ట్, ఎలక్ట్డ్ ్రపొటెన్షియల్ వంటి అంశాలపై దృష్టి సారించాలి. ఇందులో మెరుగైన మార్కులు సాధించాలంటే ప్రాథమిక భావనలపై పట్టు, ఇచ్చిన సమస్య ప్రకారం సూత్రాన్ని అన్వయించుకునే సామర్థ్యం వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. షెడ్యూల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 2, 2015. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: మే 7, 2015. అడ్మిట్ కార్డు డౌన్లోడింగ్: మే 9-12, 2015. పరీక్ష తేదీ: మే 24, 2015. వెబ్సైట్: http://jeeadv.iitd.ac.in -
మెరిసేందుకు మేలిమి వ్యూహాలు
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులకు రాబోయే ఆర్నెల్లు చాలా ముఖ్యమైనవి. నచ్చిన ఇంజనీరింగ్ కళాశాలలో, ఇష్టమైన బ్రాంచ్లో చేరాలనుకునే లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందే. పటిష్ట ప్రణాళిక ప్రకారం చదవాల్సిందే. ఎంసెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుంది కాబట్టి పోటీ పరీక్షలకు సమాంతరంగా పబ్లిక్ పరీక్షలకు సిద్ధం కావాలి. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఎంపీసీ+ఎంసెట్ ప్రిపరేషన్ ప్రణాళికఅక్టోబర్ 10 నుంచి జనవరి 10 వరకు ఇంటర్ సబ్జెక్టుల్లోని కాన్సెప్టులు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ ప్రశ్నల ప్రిపరేషన్కు అధిక సమయం కేటాయించాలి. జనవరి 11 నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు అందుబాటులో ఉన్న సమయాన్ని ప్రాక్టికల్స్ చేయడానికి, రికార్డులు రాయడానికి, భాషల సబ్జెక్టుల ప్రిపరేషన్కు, ఇంటర్లో అధిక మార్కుల సాధనకు కేటాయించాలి. ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలతో పాటు ఇంటర్ ప్రి ఫైనల్ పరీక్షలు రాయాలి. ఆపై ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాక ఏప్రిల్లో ఎంసెట్ ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్తో పాటు రోజువారీ పరీక్షలు, వారాంతపు పరీక్షలు, గ్రాండ్ టెస్ట్లు రాయాలి. మ్యాథమెటిక్స్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ మ్యాథమెటిక్స్లో 2-ఎకు 75 మార్కులు, 2-బికు 75 మార్కులు కేటాయించారు. అదే విధంగా ఎంసెట్లో 160 మార్కులకు 80 మార్కులు మ్యాథమెటిక్స్కు ఉంటాయి. అందువల్ల ఈ సబ్జెక్టులో అధిక మార్కులు సాధించడం ద్వారా ఎంసెట్లో ఉత్తమ ర్యాంకును కైవసం చేసుకోవచ్చు. ఎంసెట్లో విజయానికి కచ్చితత్వంతో పాటు వేగం అవసరం. అందువల్ల ప్రతి చాప్టర్ను ఇంటర్ పబ్లిక్ పరీక్షల కోణంలో అధ్యయనం చేసిన తర్వాత,ఎంసెట్ కోసం సంక్షిప్త సమాచారం, సూత్రాలపై దృష్టి కేంద్రీకరించాలి. సమస్యలను సాధించాలి. ముఖ్య అంశాలు (ఇంటర్ పరీక్షలకు): ద్విపద సిద్ధాంతం- 16 మార్కులు సంకీర్ణ సంఖ్యలు, ఈ్ఛ కౌజీఠిట్ఛ*ట ఖీజిౌ్ఛట్ఛఝ 17 మార్కులు సాంఖ్యక శాస్త్రం- 9 మార్కులు సంభావ్యత- 15 మార్కులు వృత్తాలు- 22 మార్కులు నిశ్చిత, అనిశ్చిత సమాకలనాలు - 33 మార్కులు అవకలన సమీకరణాలు- 13 మార్కులు ముఖ్య అంశాలు (ఎంసెట్కు): ఇంటెగ్రల్ కాలిక్యులస్, 3డీ జామెట్రీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, వెక్టార్ అల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, మ్యాట్రిసెస్-డిటెర్మినెంట్స్, సర్కిల్స్ చాప్టర్ల ప్రిపరేషన్కు అధిక సమయం కేటాయించాలి. ఎంసెట్ 2014,2013 ప్రకారం వివిధ చాప్టర్ల వెయిటేజీ: చాప్టర్ ప్రశ్నలు బీజ గణితం 26 కలనగణితం 19 రేఖాగణితం 17 త్రికోణమితి 9 సదిశా బీజగణితం 6 3డీ-జ్యామితి 3 ఫిజిక్స్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ ప్రశ్నపత్రం 60 మార్కులకు ఉంటుంది. పబ్లిక్ పరీక్షల కోణంలో చూస్తే ఎలక్ట్రో స్టాటిక్స్, వేవ్ మోషన్, ఆప్టిక్స్ చాలా కష్టమైనవిగా భావిస్తారు. ఇవి చాలా ముఖ్యమైనవి. ప్రతి చాప్టర్లోనూ విశ్లేషణాత్మక ప్రశ్నలు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తెలుగు అకాడమీ పుస్తకంలోని అంశాలను క్షుణ్నంగా చదివి, ప్రతి చాప్టర్ వెనుక ఉన్న ప్రశ్నలన్నింటినీ సాధించాలి. వేవ్ మోషన్, సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిజం చాప్టర్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఎంసెట్: ఎంసెట్ కోణంలో చూస్తే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఫిజిక్స్ను క్లిష్టమైందిగా భావిస్తారు. అయితే కాన్సెప్టులపై పట్టు సాధించడం ద్వారా ఎక్కువ మార్కులు సొంతం చేసుకోవచ్చు. సూత్రాలను అర్థం చేసుకొని, వాటికి సంబంధించిన సమస్యలను ఎక్కువగా సాధన చేయాలి. మూలసూత్రాలను పట్టిక రూపంలో రాసుకొని, వీలైనన్ని సార్లు పునశ్చరణ చేయాలి. మొదటి సంవత్సరం సిలబస్లోని శక్తి, ద్రవ్యవేగ, కోణీయ వేగ నిత్యత్వ సూత్రాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. ఉష్ణగతిక శాస్త్రంలో ఇంటర్నల్ ఎనర్జీ సూత్రం, సరళహరాత్మక చలనంలోని డోలనం, డోలనావర్తన కాలం వాటి అనువర్తనాలను అధ్యయనం చేయాలి.సీనియర్ ఇంటర్ సిలబస్లోని కిర్కాఫ్ నియమాలు, ఫ్లెమింగ్ కుడి, ఎడమ చేయి సూత్రాలు, ఎంసీజీ, ప్రవాహ విద్యుత్ శాస్త్రంలోని ప్రాథమిక సూత్రాలను నేర్చుకోవాలి.ఎలక్ట్రో మ్యాగ్నటిజం, ఫిజికల్ ఆప్టిక్స్, వేవ్ మోషన్, సౌండ్, హీట్, కొలిజన్, మ్యాగ్నటిజం అంశాలపై దృష్టిసారించాలి. వీటి నుంచి దాదాపు 25 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కెమిస్ట్రీ ఫిజిక్స్ తరహాలోనే కెమిస్ట్రీకి ఇంటర్లో 60 మార్కులు, ఎంసెట్లో 40 మార్కులు ఉంటాయి. కెమిస్ట్రీ తెలుగు అకాడమీ పుస్తకంలోని అంశాలను క్షుణ్నంగా చదివితే ఇంటర్, ఎంసెట్ రెండింటిలోనూ అధిక మార్కులు సాధించేందుకు దోహదపడుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని సమీకరణాలను వీలైనంతలో ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి.ఇంటర్మీడియెట్ కోణంలో చూస్తే సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్ కష్టమని భావిస్తారు. ఈ అంశాలు చాలా ముఖ్యమైనవి. ఒక పద్ధతి ప్రకారం విశ్లేషణాత్మకంగా చదవడం ద్వారా ఈ అంశాలపై పట్టు సాధించవచ్చు. ఒక్క ఫిజికల్ కెమిస్ట్రీలోని సమస్యా సాధనలు మినహా మిగిలిన కెమిస్ట్రీ చాప్టర్లలో ఇంటర్ ప్రిపరేషన్, ఎంసెట్ ప్రిపరేషన్కు పెద్దగా తేడా ఉండదు.ఎంసెట్లో మెరుగైన ర్యాంకు సాధించడంలో కెమిస్ట్రీ కీలకపాత్ర పోషిస్తుంది. ఎందుకంటే తక్కువ సమయంలో పూర్తిస్థాయిలో సమాధానాలు గుర్తించేందుకు అవకాశమున్న సబ్జెక్టు ఇది. 70% నుంచి 80% ప్రశ్నలకు సమాధానాలను తేలిగ్గా గుర్తించవచ్చు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి.ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని రసాయనిక సమ్మేళనాల ధర్మాలు, తయారీ పద్ధతులు నేర్చుకోవాలి. ఆల్కహాల్స్, ఫినాల్స్, అమైన్స్లోని నేమ్డ్ రియాక్ష న్స్; ఆర్డర్ ఆఫ్ యాసిడ్, బేసిక్ స్ట్రెంథ్ అంశాలను బాగా గుర్తుంచుకోవాలి.సూత్రాలన్నింటినీ నేర్చుకుని, వాటిపై ఆధారపడిన సమస్యల్ని సాధన చేయాలి.ఎంసెట్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 12-16 ప్రశ్నలు వస్తాయి. మిగిలిన విభాగాలతో పోల్చితే ఇది కొంత క్లిష్టమైన విభాగం. ఇందులోని మూలకాల ధర్మాలను ఒకదాంతో మరోదాన్ని పోల్చుకుంటూ అధ్యయనం చేయాలి. అన్ని గ్రూప్స్లో మూలకాల ధర్మాలు చాలా వరకూ ఒకేలా ఉంటాయి. వాటి భిన్న ధర్మాలపై పట్టు సాధించాలి. పట్టిక రూపంలో రాసుకొని, పునశ్చరణ చేయడం వల్ల ఎక్కువ కాలం గుర్తుంటాయి. 2014 ఎంసెట్లో ప్రశ్నలు: ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 10, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 11, ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి 16, సమ్మిళిత భావనలు (Mixed Concepts) నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి. మొదటి సంవత్సరం: అంశం ప్రశ్నలు అటామిక్ స్ట్రక్చర్ 2 పీరియాడిక్ టేబుల్ 1 కెమికల్ బాండింగ్ 2 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 1 స్టాకియోమెట్రీ 1 థర్మోడైనమిక్స్ 1 కెమికల్ ఈక్విలిబ్రియం, యాసిడ్స అండ్ బేసెస్ 2 హైడ్రోజన్ అండ్ కాంపౌండ్స్ 1 ఆల్కలి, ఆల్కలిన్ ఎర్త్ మెటల్స్ 2 గ్రూప్ 13 ఎలిమెంట్స్ 1 గ్రూప్ 14 ఎలిమెంట్స్ 1 ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ 1 ఆర్గానిక్ బేసిక్స్, హైడ్రోకార్బన్స్ 4 ద్వితీయ సంవత్సరం అంశం ప్రశ్నలు సొల్యూషన్స్ 2 సాలిడ్ స్టేట్ 1 ఎలక్ట్రో కెమిస్ట్రీ 2 కెమికల్ కెనైటిక్స్ 1 మెటలర్జీ 1 గ్రూప్ 15 ఎలిమెంట్స్ 1 గ్రూప్ 16 ఎలిమెంట్స్ 1 గ్రూప్ 17 ఎలిమెంట్స్ 1 డి-బ్లాక్ ఎలిమెంట్స్ 1 నోబెల్ గ్యాసెస్ 1 పాలిమర్స్ 1 రోజువారీ జీవితంలో కెమిస్ట్రీ 1 ఆర్గానిక్ కాంపౌండ్స్ 4 సర్ఫేస్ కెమిస్ట్రీ 1 వృక్షశాస్త్రం ఎంసెట్ లేదా ఇతర పోటీ పరీక్షల ద్వారా వివిధ కోర్సుల్లో ప్రవేశించే ప్రక్రియలో ఇంటర్మీడియెట్ మార్కులకు ప్రాధాన్యం పెరిగింది. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి, నచ్చిన కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఐపీఈలో 90 శాతానికి (540/600) తక్కువ కాకుండా మార్కులు సాధించారు. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇంటర్, ఎంసెట్ పరీక్షలకు సబ్జెక్టులు ఒకటే అయినప్పటికీ ప్రిపరేషన్ మాత్రం భిన్నంగా ఉండాలి. వెయిటేజీని అనుసరించి ప్రిపరేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు ప్రధానంగా వెయిటేజీని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ ప్రారంభించాలి. ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు వివిధ పాఠ్యాంశాల్లో చేర్చిన కొత్త విషయాలపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేనందున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెయిటేజీ: యూనిట్ మార్కుల వెయిటేజీ 1. వృక్ష శరీరధర్మ శాస్త్రం 28 2. సూక్ష్మజీవ శాస్త్రం 6 3. జన్యుశాస్త్రం 6 4. అణుజీవ శాస్త్రం 8 5. జీవసాంకేతిక శాస్త్రం 16 6. మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు 12 మొత్తం మార్కులు 76 మొత్తం దీర్ఘ సమాధాన ప్రశ్నలు 15. ఇవి సాధారణంగా 1, 5, 6 యూనిట్ల నుంచి వచ్చేందుకు అవకాశముంది. గమనించాల్సిన అంశాలు: వీలైనంత వరకు పాఠ్యపుస్తకాల్లోని వాక్యాలను/ నిర్వచనాలను యథాతథంగా రాయాలి.పాఠ్యపుస్తకాల్లో లేని ఉదాహరణలు రాయకూడదు.చక్కని చిత్రపటాలు గీచి, భాగాలు రాయాలి. శరీరధర్మ శాస్త్రంలోని క్రెబ్స్, కెల్విన్ వలయాలు పూర్తిగా ఉండాలి. ప్రతి చర్యను విశదీకరించాలి.మొదటి యూనిట్కు మొత్తం మార్కుల్లో దాదాపు సగం వెయిటేజీ ఇచ్చిన కారణంగా.. ఈ యూనిట్పై అధికంగా దృష్టి సారించాలి.సమాధానాలను రాసే క్రమంలో కూడా నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ప్రతి సమాధానానికి సబ్-హెడ్డింగ్, అవసరమైన చోట ఫ్లో చార్ట్ వేయడంవంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే వీటికోసం ప్రత్యేకంగా కొన్ని మార్కులు కేటాయిస్తారు.అవసరమైన చోట పటాలను చక్కగా వేయడంతోపాటు మంచి వివరణ కూడా ఇవ్వాలి. ఎంసెట్ ప్రణాళిక: పాఠ్యాంశాలను చదవడం ప్రారంభించాలి. సిలబస్ మొత్తం జనవరి చివరి నాటికి పూర్తయ్యేలా చూడాలి. డిసెంబర్, జనవరి నెలల్లో ప్రాక్టికల్స్ కారణంగా రెగ్యులర్ విద్యార్థులకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ప్రిపరేషన్లో జాప్యం జరుగుతుంది. అందువల్ల పటిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ కొనసాగించాలి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి పబ్లిక్ పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధంకావాలి. 2014లో ఎంసెట్ పరీక్ష తేలిగ్గానే ఉన్నప్పటికీ మొత్తంమీద తెలుగు మాధ్యమం అభ్యర్థులకు కొంత నిరాశ ఎదురైంది. చిత్రపటాలకు సంబంధించి అనవసర స్థాయిలో ప్రశ్నలు వచ్చాయి. ప్రస్తుతం ప్రిపరేషన్ కొనసాగిస్తున్న అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఈసారి శాస్త్రవేత్తల చిత్రపటాలపై ప్రశ్నలు రావని ఆశిద్దాం! 2014 ఎంసెట్ వెయిటేజీ: ప్రథమ సంవత్సరం యూనిట్ ప్రశ్నలు యూనిట్-1 4 యూనిట్-2 4 యూనిట్-3 3 యూనిట్-4 1 యూనిట్-5 4 యూనిట్-6 2 యూనిట్-7 1 ద్వితీయ సంవత్సరం యూనిట్ ప్రశ్నలు యూనిట్-1 8 యూనిట్-2 2 యూనిట్-3 2 యూనిట్-4 3 యూనిట్-5 3 యూనిట్-6 3 మొదటి, రెండో సంవత్సరం పాఠ్యాంశాల్లో సారూప్యం ఉన్నవాటిని కలిపి చదవాలి. ఎంసెట్కు కనీసం 20 రోజులు ముందుగా సిలబస్ పూర్తిచేయాలి. దీనివల్ల పునశ్చరణకు తగిన సమయం అందుబాటులో ఉంటుంది. -బి. రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. జంతుశాస్త్రం విద్యార్థులు పూర్తిస్థాయిలో పరీక్షల సన్నద్ధతకు దాదాపు వంద రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు, ఎంసెట్కు మధ్య దాదాపు 40-45 రోజుల వ్యవధి ఉంటుంది. పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధత: ఇంటర్ ద్వితీయ సంవత్సరం జంతుశాస్త్రం సిలబస్లో ఎనిమిది అధ్యాయాలున్నాయి. వీటిలో మొదటి అయిదు మానవ అంతర్నిర్మాణం, శరీరధర్మ శాస్త్రానికి సంబంధించినవి. మిగిలినవి జన్యుశాస్త్రం, పరిణామం, అనువర్తిత జీవశాస్త్రానికి చెందినవి. జంతుశాస్త్రానికి 60 మార్కులు కేటాయించారు. వీటిలో అతి స్వల్ప, స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 76 మార్కుల పేపర్లో 60 మార్కులకు సమాధానాలు రాయాలి. యూనిట్ల వారీగా వెయిటేజీ: యూనిట్ మార్కులు యూనిట్ 1 10 యూనిట్ 2 10 యూనిట్ 3 8 యూనిట్ 4 8 యూనిట్ 5 12 యూనిట్ 6 12 యూనిట్ 7 8 యూనిట్ 8 8 మానవ నిర్మాణానికి సంబంధించిన యూనిట్ల నుంచి 48 మార్కులకు ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన మూడు యూనిట్లకు సంబంధించి 28 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి. గమనించాల్సిన అంశాలు: ఇప్పటి వరకు పూర్తయిన ప్రిపరేషన్ను విశ్లేషించుకోవాలి. ఎంత వరకు సిలబస్ పూర్తయింది? మిగిలిన సిలబస్కు ఎంత సమయం కేటాయించాలి? ఏ అంశాలు క్లిష్టంగా ఉన్నాయి? తదితర అంశాలపై స్పష్టత ఏర్పరుచుకోవాలి. మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థ, మానవ హృదయ నిర్మాణం-పనిచేసే విధానం, మానవుని విసర్జక వ్యవస్థ, మూత్రం తయారీ విధానం, కండర సంకోచ విధానం, మానవుని మెదడు-నిర్మాణం, విధులు తదితర అంశాల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వస్తాయి. {పతి అధ్యాయం చివర ఇచ్చిన ప్రశ్నలను ప్రణాళికాబద్ధంగా సాధన చేయాలి. పటాలను ప్రాక్టీస్ చేయాలి. ఎంసెట్కు ఎలా సిద్ధమవాలి? ఎంసెట్ మెడికల్ పరీక్షలో మొత్తం 160 ప్రశ్నలకు గాను జంతుశాస్త్రం నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర సిలబస్కు దాదాపు సమాన ప్రాధాన్యమిస్తారు. 2014 ఎంసెట్ వెయిటేజీ: యూనిట్ ప్రశ్నలు యూనిట్-1 2 యూనిట్-2 2 యూనిట్-3 3 యూనిట్-4 2 యూనిట్-5 2 యూనిట్-6 6 యూనిట్-7 3 యూనిట్-8 2 తెలుగు అకాడమీ నుంచి నేరుగా: ఎంసెట్-2014 జంతుశాస్త్రం ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు చాలా వరకు సరళంగా ఉన్నాయి.తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకం నుంచి ప్రశ్నలు నేరుగా వచ్చాయి.ప్రతి పాఠ్యాంశంలోని అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. ప్రతి చాప్టర్ను ఇంటర్ పరిధిలో చదువుతున్నప్పటికీ ఎంసెట్కు ఉపయోగపడేలా ముఖ్య అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి.ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్కు తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకొని రెండింటికీ సమాంతరంగా ప్రిపరేషన్ కొనసాగించాలి.సమయ పాలన, కచ్చితత్వం ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు చాలా ముఖ్యమన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. గుర్తుంచుకోండి: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంతో పోల్చితే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఎక్కువగా కష్టపడాలి. ఎందుకంటే ద్వితీయ సంవత్సరంతోపాటు మొదటి సంవత్సరం సిలబస్ను సమాంతరంగా చదవడమేకాకుండా.. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది.ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ సమాధానాలు గుర్తుంచుకోవడానికి షార్ట్ కట్ మెథడ్స్ను నేర్చుకోవాలి.హ్యూమన్ అనాటమీ-ఫిజియాలజీ యూనిట్లలోని పటాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అధిక శాతం సమాధానాలు వీటితోనే ముడిపడి ఉంటాయి.ప్రతి యూనిట్ చివర ఇచ్చిన అతి స్వల్ప సమాధాన ప్రశ్నలకు సమాధానాలను కచ్చితంగా నేర్చుకోవాలి. మెరుగైన మార్కుల సాధనకు ఇవి బాగా ఉపయోగపడతాయి. స్వల్ప సమాధాన ప్రశ్నలకు పాయింట్ల వారీగా జవాబులు రాయాలి. దీర్ఘ సమాధాన ప్రశ్నల్లో పటాలతో కూడిన ప్రశ్నలను ఎంపిక చేసుకోవడం వల్ల ఎక్కువ మార్కులు సాధించొచ్చు. -
భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఈ ముగ్గురు జపాన్కు చెందినవారు. అకసకి, అమనో, నకుమురాలకు సంయుక్తంగా నోబెల్ పురస్కారం ప్రకటించారు. ఎల్ఈడీ ల్యాంప్ను కనుగొన్నందుకుగాను వీరిని అత్యున్నత అవార్డుకు ఎంపిక చేశారు. -
నోబెల్ బహుమతి రేసులో భారతీయ శాస్త్రవేత్త!
ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కార బహుమతి రేసులో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రామమూర్తి రమేశ్ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రకటించే నోబెల్ బహుమతికి ఎంపిక చేసిన 27 మంది ఆర్ధికవేత్తలు, శాస్త్రవేత్తల జాబితాలో రామమూర్తి రమేశ్ ఒకరు. ఫిజిక్స్ రంగంలో ఈ సంవత్సరపు నోబెల్ బహుమతి అక్టోబర్ 7 తేదిన ప్రకటించనున్నారు. రామమూర్తి బర్కలీ లోని యూనివర్సిటి ఆఫ్ కాలిఫోర్నియా లో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నారు. ఫెర్రో ఎలెక్రికల్ డివైసెస్ అండ్ మల్టీ ఫెర్రోయిక్ మెటిరియల్ అంశంపై డాక్టర్ రామమూర్తి రమేశ్ సేవలందిస్తున్నారు. -
ఫిజిక్స్.... ప్రతి అంశమూ ప్రధానమే
ఈ విభాగంలో 6-10 తరగతుల సామాన్య శాస్త్రం నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జీవ శాస్త్రం, వృక్ష శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం.. ఇలా నాలుగు భాగాల నుంచి ప్రశ్నలు అడగొచ్చు. పైన సూచించిన అంశాల నుంచి నిత్య జీవిత వినియోగానికి అన్వయించే ఆధారంగా ప్రశ్నలు అడగొచ్చు. 1. ఇంట్లో ఉపయోగించే సాధారణ ఉప్పు రసాయన నామం? 1) సోడియం కార్బోనేట్ 2) సోడియం బైకార్బోనేట్ 3) సోడియం క్లోరైడ్ 4) సోడియం హైడ్రాక్సైడ్ సమాధానం: 3 2. ఇళ్లలోని విద్యుత్ పరికరాలను ఏ సంధానంలో కలుపుతారు? 1) శ్రేణి సంధానం 2) సమాంతరం సంధానం 3) లూప్ 4) విడివిడిగా సమాధానం: 1 3. రోడ్డుపై ఎండమావి కనిపించటంలో దాగి ఉన్న దృగ్విషయం? 1) వక్రీభవనం 2) పరావర్తనం 3) సంపూర్ణాంతర పరావర్తనం 4) సందిగ్ధ కోణం సమాధానం: 3 4. చింతపండు రసం, మిథైల్ ఆరెంజ్ సూచికలో ఏర్పడే రంగు? 1) పసుపు 2) పింక్ 3) ఎరుపు 4) రంగు మారదు సమాధానం: 3 5. గాలిలో ధ్వని తరంగాలు ----- తరంగాలు? 1) అనుధైర్ఘ్య 2) తిర్యక్ 3) స్థిర 4) తిరోగామి సమాధానం: 1 ఏ మేరకు చదవాలంటే.. సిలబస్లోని అంశాలను మొత్తంగా కాకుండా వాటి ప్రాధాన్యత మేరకు ప్రిపరేషన్ సాగించడం ప్రయోజనకరం. తద్వారా ఈ విభాగంలో మెరుగైన స్కోర్ సాధించవచ్చు. ఈ క్రమంలో అంశాల వారీగా దృష్టి సారించాల్సిన ముఖ్యాంశాలు.. ధ్వని: ధ్వని ఉత్పాదన, ధ్వని ప్రసరణ, అనుదైర్ఘ్య తరంగాలు, తిర్యక్ తరంగాలు, గాలిలో ధ్వని వేగం, సోనార్, ధ్వని లక్షణాలు (పిచ్, తరచు దనం, కీచు దనం), ధ్వని పరావర్తనం. కాంతి: కాంతి స్వభావాన్ని వివరించే సిద్ధాంతాలు (న్యూటన్ సిద్ధాంతం, హైగెన్ సిద్ధాంతం), కాంతి పరావర్తనం, పరావర్తన నియమాలు, దర్పణాల్లో పరావర్తనం, దర్పణంలో ప్రతిబింబం ఏర్పడే విధానం (సమతల గోళాకార దర్పణాలు), వక్రీభవనం, కటకాలు, కటకాలలో ప్రతిబింబం ఏర్పడే విధానం, దృష్ట్టి దోషాలు- వాటి సవరణ, కాంతి విక్షేపణం, కాంతి పరిక్షేపణం, లేజర్- ప్రత్యేక లక్షణాలు, లేజర్ ఉత్పత్తిలోని దశలు, లేజర్ ఉపయోగాలు. విద్యుత్: విద్యుత్ వలయం, ఓమ్ నియమం, నిరోధ నియమాలు, నిరోధాల శ్రేణి, సమాంతర సంధానాలు, సాధారణ విద్యుత్ వలయాలు, విద్యుత్ సామర్థ్యం, ఇళ్లలో విద్యుత్ను కొలవడం. విద్యుదయస్కాంతత్వం, ఫారడే నియమాలు, విద్యుత్ మోటారు, జనరేటర్. అయస్కాంతత్వం: అయస్కాంతాల్లోని రకాలు, అయస్కాంత బలరేఖలు, అయస్కాంత క్షేత్రం, డయా, పారా, ఫెర్రో అయస్కాంతత్వం. రేడియో ధార్మికత: రేడియో ధార్మిక వికిరణం, ఆల్ఫా, బీటా, గామా వికిరణాల లక్షణాలు, కృత్రిమ రేడియో ధార్మికత, కృత్రిమ రేడియో ధార్మిక మూలకాలు ఉపయోగాలు. ఎలక్ట్రానిక్స్: విద్యుత్ అర్ధ వాహకాలు, స్వభావజ, అస్వభావజ అర్థ వాహకాలు, ఞృ జంక్షన్, జంక్షన్ డయోడ్ ధర్మాలు, ఉపయోగాలు, ట్రాన్సిస్టర్ - ధర్మాలు- ఉపయోగాలు కంప్యూటర్: కంప్యూటర్ చరిత్ర, ఇన్పుట్, అవుట్పుట్, ఉన్నత స్థాయి భాషలు, కంప్యూటర్ పనితీరు - ఉపయోగాలు. పరమాణు నిర్మాణం: రూదర్ ఫర్డ నమూనా, బోర్ నమూనా, ఆధునిక క్వాంటమ్ సిద్ధాంతం ఆధారంగా పరమాణు నిర్మాణం, ఆర్బిట్, ఆర్బిటాల్, క్వాంటమ్ సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసం. మూలకాల వర్గీకరణ: త్రిక సిద్ధాంతం, అష్టక సిద్ధాంతం, మెండలీఫ్ వర్గీకరణ, ఆధునిక ఆవర్తన పట్టిక, పీరియడ్, గ్రూపులలో పరమాణు ధర్మాల ఆవర్తనం. రసాయన బంధం: అయానిక బంధం, సమయోజనీయ బంధం, వివిధ అణువుల ఆకృతులు, సంకరీకరణం. ఆమ్లాలు - క్షారాలు: ఆమ్లాలు, క్షారాల పరీక్షలు, లోహాలు, అలోహాలతో చర్యలు, తటస్థీకరణం, ్కఏ విలువలు ద్రావణాలు: ద్రావణాల్లో రకాలు, గాఢత, మొలారిటీ. కర్బన రసాయన శాస్త్రం: కార్బన్ ప్రత్యేక ధర్మాలు, హైడ్రోకార్బన్ల వర్గీకరణ - ధర్మాలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, నూనెలు, సబ్బు. కొన్ని మూలకాల ఖనిజాలు - ఉపయోగాలు ముఖ్యమైన మూలకాలు, వాటి ఖనిజాలు, లోహ సంగ్రహణ లోని ముఖ్యమైన దశలు - విశ్లేషణ సన్నద్ధమిలా ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలంటే ముందుగా 6-10 తరగతుల సామాన్యశాస్త్ర పుస్తకాలు (పాతవి, కొత్తవి) సేకరించాలి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నా పత్రాల్లోని బిట్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. ముందుగానే బిట్బ్యాంక్స్ పై ఆధారపడకుండా పాఠ్యపుస్తకాలను చదవి సొంతంగా నోట్స్ రాసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ తికమకగా ఉండే అంశాలను కొన్ని విలక్షణ పట్టికల ద్వారా గుర్తుంచుకోవాలి. భౌతిక, రసాయన శాస్త్రంలో ముఖ్యమైన టాపిక్స్ -
మోడల్ స్కూళ్లు
కర్నూలు(విద్య): కేంద్రీయ విద్యాలయాల తరహాలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన మోడల్ స్కూళ్లలో(ఆదర్శ పాఠశాలలు) నిర్లక్ష్యం గూడుకట్టుకుంది. ఈ పాఠశాలలు మంజూరై నాలుగేళ్లయినా.. పనుల ప్రారంభానికే రెండేళ్లు పట్టింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో భవనాలు పూర్తి కాకపోవడంతో హాస్టల్ వసతి ఎండమావిగా మారింది. జిల్లాలోని 51 మండలాల్లో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కోదానికి రూ.3.02కోట్లను మంజూరు చేసింది. వీటిని ఆయా మండల కేంద్రాల్లో నిర్మించేందుకు నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు. ఒక్కో పాఠశాలను నాలుగు నుంచి ఐదు ఎకరాల స్థలంలో అన్ని రకాల వసతులు, సౌకర్యాలతో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. డే స్కాలర్, రెసిడెన్సియల్ విధానంలో పాఠశాలలను నిర్మించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రతి పాఠశాలకు ఒక ప్రిన్సిపాల్, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టులకు ఇద్దరేసి పీజీటీలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులకు ఒక్కో పీజీటీలను నియమించారు. మొదటి యేడాది పాఠశాలలు ప్రారంభమైన ఆరు నెలలకు సబ్జెక్టుకు ఒకరు చొప్పున టీజీటీలను నియమించారు. వీరితో పాటు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఫిజికల్ డెరైక్టర్, యోగా టీచర్, ఆర్ట్ టీచర్, ఎస్యూపీడబ్ల్యు టీచర్, కంప్యూటర్ టీచర్, లైబ్రేరియన్, క్లర్ కమ్, అకౌంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ పోస్టులను కేటాయించారు. వీటిని అప్పటి ఎమ్మెల్యేల పేరు చెప్పుకుని కొందరు అమ్ముకున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఒక్కో పోస్టుకు రూ.50వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. జిల్లాకు మంజూరైన 51 పాఠశాలలకు స్థలసేకరణ సమస్యగా మారడంతో 36 పాఠశాలలకు మాత్రమే అధికారులు స్థలాన్ని చూపించగలిగారు. దీంతో వీటికి మొదటి విడతగా రూ.108.72కోట్లు మంజూరయ్యాయి. 2013లో 36 భవనాలు పూర్తి కావడంతో పాఠశాలలను హడావుడిగా ప్రారంభించారు. మొదటి సంవత్సరం 6 నుంచి 9వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు నిర్వహించారు. ప్రతి తరగతికి 80 మంది చొప్పున అడ్మిషన్లను లాటరీ పద్ధతిలో నిర్వహించారు. ఈ యేడాది భవనాల నిర్మాణం పూర్తి కాకపోవడం, హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో హాస్టళ్లను ప్రారంభించలేకపోయారు. ఫలితంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం. -
శాస్త్రాల్లో అనుసంధానించబడిన ఒక ట్రాన్సిస్టర్ ..
EAMCET, PHYSICS FLUID MECHANICS & SEMICONDUCTORS 1. When an air bubble moves up from the bottom to top of a deep lake, then 1) Its acceleration is constant 2) Its acceleration decreases continuously 3) Its velocity decreases and becomes constant 4) Its velocity increases and becomes constant 2. A ball rises to the surface at a constant velocity in a liquid, whose density is four times greater than the material of the ball. The ratio of force of friction acting on the ball to its weight is 1) 3 : 1 2) 1 : 3 3) 1 : 4 4) 4 : 1 3. If the velocity head of a stream of water is 10 m, then speed of flow is 1) 16 cm/s 2) 14 m/s 3) 14 cm/s 4) 1 m/s 4. Figure shows a spinning ball (clockwise) in uniform streamline flow of air. The ball experiences 1) No resultant force 2) An uplift 3) Downward force 4) Force in the direction of streamlines 5. The pressures on the top and bottom surfaces of an aeroplane wings are 0.9 × 105 Pa and 105 Pa. The surface area of each wing is 50 m2. The dynamic lift on the plane is 1) 106 N 2) 5 × 104 N 3) 5 × 105 N 4) 105 N 6. Water is flowing through horizontal pipe of variable cross-section. The velocity of flow is 1 m/s at a point when the area of cross-section is 1 cm2 and pressure is 2000 Pa. At a point when the area of cross-section is 5 cm2, the pressure will be 1) 2480 Pa 2) 480 Pa 3) 240 Pa 4) 280 Pa 7. Water is taken in a cylindrical vessel of radius 20 cm which is rotating along its axis at the rate of 2 Hz. The liquid rises at the sides. The difference in the height of the liquid at the centre of the vessel and its sides is (p2 = g) 1) 0.82 m 2) 0.032 m 3) 0.08 m 4) 0.32 m 8. The level of water in a tank is 5 m high. A hole of area 1 cm2 is made in the bottom of the tank. The initial rate of leakage of water from the hole is (g = 10 ms–2) 1) 10–1 m3 s–1 2) 10–2 m3 s–1 3) 10–3 m3 s–1 4) 10–3 m3 s–1 9. In a horizontal pipe line of uniform cross-section, pressure difference between two points is 0.1 Pa. The change in the kinetic energy per Kg of water flowing in the pipe is 1) 10–5 J kg–1 2) 10–4 J kg–1 3) 10–3 J kg–1 4) 10–2 J kg–1 10. Match the following a) Poise d) Kg m–1 s–1 b) Poiseullei e) dy. s/cm2 c) Stoke f) erg sec/g 1) a – e, b – f, c – d 2) a – e, b – d, c – f 3) a – f, b – e, c – d 4) a – d, b – e, c – f 11. An air bubble of radius 0.5 mm rises in a liquid of coefficient of viscosity 0.1 SI units and density 900 kg m–3. The terminal velocity of the bubble is (g = 10 ms–2) 1) 5 mm/s 2) 5 cm/s 3) 5 m/s 4) 0.01 m/s 12. A lead sphere of mass m falls through a viscous liquid with terminal velocity V0. Another lead sphere of mass 8 m falls through same liquid with a terminal velocity of 1) V0 2) 4 V0 3) 8 V0 4) 64 V0 13. The difference in velocities between two layer of water 20 m apart in a flowing river is 4 ms–1. The shear stress between the layers is (h = 10–3 SI units) 1) 10–4 Pa 2) 5 × 10–5 Pa 3) 2 ×10–4 Pa 4) 4 × 10–4 Pa 14. If the radius of the capillary tube is increased by 0.5%, the percentage increase in the rate of flow of liquid through it is 1) 1% 2) 4% 3) 0.5% 4) 2% 15. The coefficients of viscosity of two liquids are in the ratio 2 : 3 and their densities are in the ratio 4 : 5. If these liquids are filled to same height indifferent vessels and are drained through identical capillary tubes then the volume of liquids collected per unit times will be 1) 8 : 15 2) 6 : 5 3) 15 : 8 4) 3 : 2 16. A soft plastic bag of weight w0 is filled with air at STP. Now weight of the bag in air is w. Then 1) w > w0 2) w < w0 3) w = w0 4) w ³ w0 17. For compressible fluids, equation of continuity is 1) r1v1 = r2v2 2) r1A1 = r2A2 3) r1A1v1 = r2A2v2 4) A1v1 = A2v2 18. A pipe GB is fitted with two pipes C and D as shown. The pipes GB, BC and BD have areas of cross-sections A, A/2, A/3 respectively. At G, velocity of water is 10 m/s and at C, velocity is 6 m/s. If A = 24 m2 then velocity of water at D is (assume that flow is ideal) 1) 21 m/s 2) 3.3 m/s 3) 30 m/s 4) 16 m/s 19. Water from a tap emerges vertically downward with an initial speed of 1 m/s. The cross-sectional area of the tap is 10–4 m2. Assume that pressure is constant through out the stream of water and that the flow is steady. The cross-sectional area of the stream 0.15 m below the tap is 1) 5 × 10–4 m2 2) 1 × 10–5 m2 3) 5.83 × 10–5 m2 4) 2 × 10–5 m2 20. A diver is 10 m below the surface of water. The approximate pressure experience by the water is 1) 105 Pa 2) 2 × 105 Pa 3) 3 × 105 Pa 4) 4 × 105 Pa 21. In a p-type semiconductor the acceptor level is situated 60 meV above the valence band. The maximum wavelength of light required to produce a hole will be 1) 0.207 × 10–5 m 2) 2.07 × 10–5 m 3) 20.7 × 10–5 m 4) 2075 × 10–5 m 22. A p – n junction diode can with stand currents upto 10 mA under forward bias, the diode has a potential difference of 0.5 V across it which is assumed to be independent of current. The maximum voltage of the battery used to forward bias the diode when a resistance of 200 W is connected in series with it is 1) 3.5 V 2) 2.5 V 3) 6.5 V 4) 4.5 V 23. A transistor connected in common emitter configuration has input resistance Rin = 2 K W and load resistance of 5 K W. If b = 60 and an input signal 12 mV is applied, the resistance gain, voltage gain and power gain respectively are 1) 2.5, 150, 9000 2) 4.5, 150, 9000 3) 2.5, 200, 9000 4) 2.5, 150, 9500 24. At breakdown region of a Zener diode which of the following does not change much 1) Current 2) Voltage 3) Dynamic impedance 4) Capacitance 25. A pulsating voltage is a mixture of an a.c. component and a d.c. component. The circuit used to separate a.c. and d.c. components is called 1) An oscillatory 2) An amplifier 3) A filter 4) A rectifier 26. While using a transistor as an amplifier 1) The collector junction is forward biased and emitter junction is reverse biased 2) The collector junction is reverse biased and emitter junction is forward biased 3) Both the junctions are forward biased 4) Both the junctions are reverse biased 27. A : In intrinsic semiconductor, conductivity is mainly due to the breakage of covalent bond. B : In extrinsic semiconductor, the conductivity is mainly due to the addition of impurities. 1) Both A and B are true 2) Both A and B are false 3) A is true but B is false 4) A is false but B is true 28. List - I List - II a) Emitter b) Base c) Collector d) Transfer of resistance e) Transistor f) Moderately doped g) Lightly doped h) Heavily doped The correct match is 1) a – f, b – e, c – h, d – g 2) a – g, b – f, c – e, d – h 3) a – h, b – g, c – f, d – e 4) a – e, b – h, c – g, d – f 29. [A] : The potential difference across an unbiased p - n junction cannot be measured by connecting voltmeter across its terminals. [R] : There are no free charge carriers in the depletion zone, voltmeter requires current to indicate potential difference. 1) Both A and R are true and R is the correct explanation of A 2) Both A and R are true but R is not the correct explanation of A 3) A is true but R is false 4) A is false but R is true 30. In n - p - n transistor, in CE configuration a) The emitter is heavily doped than the collector b) Emitter and collector can be interchanged c) The base region is very thin but is heavily doped d) The conventional current flows from base to emitter 1) a and b are correct 2) a and c are correct 3) a and d are correct 4) b and d are correct 31. Choose the only incorrect statement from the following 1) In conductors, the valence and conduction bands may overlap 2) Substances with an energy gap of the order of 10 eV are insulators 3) The resistivity of a semiconductor increases with increase in temperature 4) The conductivity of a semiconductor increases with increase in temperature 32. The output from a full wave rectifier is 1) an ac voltage 2) a dc voltage 3) zero 4) a pulsating unidirectional voltage 33. For useful amplifying action, which of the following features should a transistor have ? 1) The emitter should be heavily doped, the collector less heavily doped and the base lightly doped 2) The area of the base-collector junction must be larger than that of the emitter-base junction 3) The thickness of the base layer should be very small 4) All the above features KEY 1) 4 2) 1 3) 2 4) 2 5) 3 6) 1 7) 4 8) 3 9) 2 10) 2 11) 1 12) 2 13) 3 14) 4 15) 2 16) 3 17) 3 18) 1 19) 3 20) 2 21) 2 22) 2 23) 1 24) 2 25) 3 26) 2 27) 1 28) 3 29) 1 30) 3 31) 3 32) 4 33) 4 -
చంద్రుడిపై ఉరుము శబ్దం వినగలమా?
సీహెచ్ మోహన్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్. ఫిజిక్స్ - ధ్వని ధ్వని ఒక శక్తి స్వరూపం. ఇది కంపిస్తున్న కణాల్లో జనించి, తరంగాల రూపంలో అన్ని దిశల్లో ప్రయాణిస్తుంది. ఈ ధ్వని తరంగాలు చెవిలోని కర్ణభేరిని కనీసం 1/10 వ సెకన్ కాలంపాటు తాకినట్లయితే మనకు వినికిడి జ్ఞానం కలుగుతుంది. కంపించడానికి అనువుగా ఉన్న కణాలతో కూడిన పదార్థాల్లోనే ధ్వని జనిస్తుంది, ఒక బిందువు నుంచి మరో బిందువుకు ప్రయాణిస్తుంది. ఉదా: అల్యూమినియం, ఇనుము, రాగి, ఉక్కు, ఇత్తడి, కంచు.కంపించడానికి వీలులేని కణాలున్న పదార్థాల్లో ధ్వని జనించదు, ప్రయాణించలేదు. ఉదా: శుద్ధమైన ప్లాస్టిక్, రబ్బర్, వరిపొట్టు, రంపపు పొట్టు, దుస్తులు, కాటన్, థర్మాకోల్. ఇలాంటి పదార్థాలను ’ౌఠఛీ ్కటౌౌజ’ భవనాల నిర్మాణంలో ఉపయోగిస్తారు. యానకం: కణాలను కలిగి ఉన్న ఏ పదార్థాన్నైనా ‘యానకం’ అంటారు. ఇది ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటుంది. శూన్యం: ఎలాంటి యానకం లేని ప్రదేశాన్ని ‘శూన్యం’ అంటారు. భూ వాతా వరణానికి వెలుపల ఉన్న ప్రదేశాన్ని ‘విశ్వాంతరాళం’ అంటారు. ఇక్కడ ఎలాంటి యానకం ఉండదు. ద్వని తరంగాలు ఒక బిందువు నుంచి మరో బిందువుకు ప్రయాణించడానికి యానకం అవసరం. కాబట్టి ఎలాంటి యానకం లేని ప్రదేశంలో ధ్వని వేగం శూన్యం. దీన్ని రాబర్ట బాయిల్ (రసాయన శాస్త్ర పితామహుడు) ప్రయోగాత్మకంగా నిరూపించాడు. చంద్రునిపై ఎలాంటి వాతావరణం లేనందువల్ల అక్కడ ధ్వని వేగం శూన్యం. చంద్రునిపై తుపాకీ పేల్చినా, అణు బాంబును విస్ఫోటనం చెందించినా వెలువడే ధ్వనులను వినలేము. చంద్రునిపై వాతావరణం లేనప్పటికీ మేఘాలు ఉన్నాయని భావిస్తే.. అవి పరస్పరం ఢీకొన్నప్పుడు మెరుపును (కాంతి) మాత్రమే చూడగలం. కానీ ఉరుము ధ్వని వినలేం. చంద్రుడి శాస్త్రీయనామం. అందువల్ల చంద్రుడి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘Selenology" అంటారు 1969 జూలై 20న అపోలో-11 అనే అంతరిక్షనౌక సాయంతో అమెరికా వ్యోమగాములు నీల్ ఆర్మస్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్రిన్ చంద్రుడిపై కాలుమోపారు. చంద్రుడిపై ఈ వ్యోమగాములు దిగిన ప్రాంతానికి ‘శాంతి సముద్రం’ అని పేరు పెట్టారు. శ్రవ్య అవధి: ఆరోగ్యవంతుడైన మానవుడు 20ఏ్డ20,000ఏ్డ అవధిలోని ధ్వని తరంగాలను మాత్రమే వినగలుగుతాడు. ఈ అవధిని ‘శ్రవ్య అవధి’ అని, ఈ తరంగాలను ‘శ్రవ్య తరంగాలు’ అని అంటారు. పరశ్రావ్యాలు: శ్రవ్య అవధిలో 20ఏ్డ కంటే ముందున్న తరంగాలను ‘పరశ్రావ్యాలు’ అంటారు. వీటిని పాము, తిమింగలాలు వినగలుగుతాయి. పరశ్రావ్యాలను ఉత్పత్తి చేయడానికి అధిక శక్తి ఉన్న వస్తువులు అవసరం. పరశ్రావ్యాలు కొన్ని సందర్భాల్లోనే ఉత్పత్తి అవుతాయి. వాటిలో ముఖ్యమైనవి. 1. భూమి కంపించినప్పుడు 2. అణుబాంబు విస్ఫోటనం చెందినప్పుడు 3. అధిక తీవ్రతతో ఉరిమినప్పుడు 4. భారీ వాహనం అధిక బరువును మోసుకు వెళుతున్నప్పుడు అతిధ్వనులు: శ్రవ్య అవధిలో 20ఏ్డ తర్వాత ఉన్న తరంగాలను ‘అతిధ్వనులు’అం టారు. వీటిని 50,000ఏ్డ వరకు కుక్క; 1,00,000ఏ్డ వరకు గబ్బిలం, తాబేలు, డాల్ఫిన్లు వినగలుగుతాయి. గబ్బిలం అతి ధ్వనులను ఉత్పత్తి చేయడం ద్వారా రాత్రుల్లో సంచరిస్తుంది. ప్రయోగశాలల్లో అతిధ్వనులను ‘ఫిజో’ విద్యుత్ ఫలితం పద్ధతిలో ఉత్పత్తి చేస్తారు. అతిధ్వనుల ఉపయోగాలు - పాలు, నీటిలోని హానికర బ్యాక్టీరియాను నిర్మూలించడానికి ఉపయోగిస్తారు. - సముద్రాల లోతు తెలుసుకోవడానికి ఉపయోగించే ‘ైూఅఖ‘ (ౌఠఛీ ూ్చఠిజీజ్చ్టజీౌ ్చఛీ ఖ్చజజీజ) పరికరంలో ఉపయోగిస్తారు. ‘సోనార్’ను ‘ూజీౌ్ఠ‘ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. - తీగలను అతికించే పద్ధతిని ‘ౌఛ్ఛీటజీజ‘ అంటారు. ఈ విధానంలో అతిధ్వనులను ఉపయోగిస్తారు. ౌఛ్ఛీటజీజ పదార్థంలో లెడ్ (సీసం), టిన్ మూలకాలుంటాయి. - శరీర అంతర్భాగాలను స్కానింగ్ చేయడానికి అతిధ్వనులు ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని ‘ఆల్ట్రా సోనోగ్రఫీ’ అంటారు. - దోమలను పారద్రోలడం - చేపలను ఆకర్షించడం - విరిగిన దంతాలను సులభంగా తొలగించడం, కీళ్ల నొప్పులను నివారించడానికి - లోహ పలకలు, పైపులు, బాయిలర్లలోని రంధ్రాల స్థానాన్ని గుర్తించడానికి అతి ధ్వనులను ఉపయోగిస్తారు. వద్ద ఉన్న నీటి ఉపరితలం ఎలాంటి కదలికలు లేకుండా నిశ్చలస్థితిలో ఉంటుంది. ఈ నీటిలోకి అతిధ్వనులను పంపించినప్పుడు 100నిఇ వద్ద మరుగుతున్న స్థితిని పొందుతుంది. తరంగం: తరంగం అంటే శక్తిని ఒక బిందువు నుంచి మరో బిందువుకు మోసుకు వెళ్లేది అని అర్థం. కంపన పరిమితి: కంపిస్తున్న కణం తన మధ్యబిందువు నుంచి పొందిన గరిష్ఠ స్థాన భ్రంశాన్ని ‘కంపన పరిమితి’ అంటారు. దీన్ని మిల్లీమీటర్లు/ సెంటీమీటర్లు/ మీటర్లలో తెలియజేస్తారు. తరంగ దైర్ఘ్యం: ఒక అనుైదైర్ఘ్య తరంగంలో ఒకే దశలో ఉన్న ఏవైనా రెండు వరుస సంపీడ్యనాలు లేదా విరళీకరణాల మధ్య దూరాన్ని ‘తరంగదైర్ఘ్యం’ అంటారు. ప్రమాణాలు: మిల్లీమీటర్లు, సెంటీమీటర్లు, మీటర్లు. తరంగదైర్ఘ్యాన్ని కొలవడానికి ఉపయోగించే అతిచిన్న ప్రమాణం ఆంగ్ స్ట్రామ్. 1 అని = 1010 ఝ. ఆవర్తనకాలం: కంపిస్తున్న కణం ఒక కంపనాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని ‘ఆవర్తనకాలం’ అంటారు. ప్రమాణాలు: సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు. పౌనఃపున్యం: కంపిస్తున్న కణం ఒక సెకన్ కాలంలో చేసే కంపనాల సంఖ్యను ‘పౌనఃపున్యం’ అంటారు. ప్రమాణాలు: 1. (ప్రస్తుతం ఈ ప్రమాణం వాడుకలో లేదు) 2. - ఇది అంతర్జాతీయ ప్రమాణం. తరంగాల రకాలు: స్వభావం రీత్యా తరంగాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 1. యాంత్రిక తరంగాలు: ఈ తరంగాలు ప్రయాణించడానికి యానకం అవసరం. ఎలాంటి యానకం లేని ప్రదేశంలో ఈ తరంగాలు ప్రయాణించలేవు. ఉదా: ధ్వని తరంగాలు 2. విద్యుత్ అయస్కాంత తరంగాలు: ఈ తరంగాలు ప్రయాణించడానికి యానకం అవసరం లేదు. ఇవి ఏదైనా యానకంలోనూ, శూన్యంలోనూ ప్రయాణించగలుగుతాయి. ఉదా: కాంతి తరంగాలు, పరారుణ కిరణాలు, అతినీలలోహిత కిరణాలు, లేజర్ కిరణాలు, రేడియో తరంగాలు, మైక్రో తరంగాలు, ఎక్స్-కిరణాలు. ఈ తరంగాల వేగం గాలిలో, శూన్యంలో కాంతి వేగానికి (ఇ= 3ణ108 ఝ/ట) సమానంగా ఉంటుంది. {పయాణించే విధానం ఆధారంగా తరంగాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 1. అనుదైర్ఘ్య తరంగాలు: ఈ తరంగాలు ఎల్లప్పుడూ సంపీడ్యనాలు, విరళీకరణాల రూపంలో ప్రయాణిస్తాయి. అనుదైర్ఘ్య తరంగం ప్రయాణించేటప్పుడు కంపిస్తున్న వాయు కిరణాల సాంద్రత గరిష్ఠంగా ఉన్న బిందువును సంపీడ్యం అని, కనిష్ఠంగా ఉన్న బిందువును విరళీకరణం అని అంటారు. ఉదా: గాలిలో ధ్వని తరంగాలు ఎల్లప్పుడూ అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి. 2. తిర్యక్ తరంగాలు: ఈ తరంగాలు ఎల్లప్పుడూ శృంగాలు, ద్రోణుల రూపంలో ప్రయాణిస్తాయి. తిర్యక్ తరంగం ప్రయాణించేటప్పుడు శక్తి గరిష్ఠంగా ఉన్న బిందువును ‘శృంగం’ అని, కనిష్ఠంగా ఉన్న బిందువును ‘ద్రోణి’ అని అంటారు. ఉదా: 1) ఘన, ద్రవ పదార్థాల్లో ధ్వని ఎల్లప్పుడూ తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. 2) కాంతి అన్ని పారదర్శక పదార్థాల (వజ్రం, గాజు, నీరు, గాలి) ద్వారా తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ద్వని తరంగాలు, కాంతి తరంగాలు ఒక యానకం నుంచి మరో యానకంలోకి ప్రయాణించేటప్పుడు వాటి కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యం, వేగం, తీవ్రత మారుతాయి. కానీ పౌనఃపున్యం స్థిరంగా ఉంటుంది. పురోగామి తరంగం: ఒక తరంగం జనించిన బిందువు నుంచి అనంత దూరాన్ని ప్రయాణిస్తే, దాన్ని పురోగామి తరంగం అంటారు. వీటి కంపన పరిమితి అన్ని బిందువుల వద్ద సమానంగా ఉంటుంది. అవరుద్ధ తరంగాలు: ఈ తరంగాల కంపన పరిమితి కాలంతోపాటు క్షీణించి, కొంతదూరం ప్రయాణించిన తర్వాత తగ్గుతుంది. ఉదా: ఒక బిందువు వద్ద జనించిన తరంగాలు ముందుకు ప్రయాణించేటప్పుడు వాటి కంపన పరిమితి క్రమంగా తగ్గిపోయి, కొంత దూరం తర్వాత క్షీణిస్తాయి. స్థిర/ స్థావర తరంగాలు: సమాన కంపన పరిమితి, తరంగ దైర్ఘ్యం, పౌనఃపున్యం కలిగి ఉన్న రెండు అనుదైర్ఘ్య లేదా తిర్యక్ తరంగాలు ఒకదానికి మరొకటి వ్యతిరేక దిశలో ప్రయాణించేటప్పుడు అధ్యారోహణం చెందుతాయి. ఈవిధంగా ఏర్పడిన తరంగాలను స్థిరతరంగాలు అంటారు. స్థిర తరంగాలు శక్తిని ఒక బిందువు నుంచి మరో బిందువుకు మోసుకువెళ్లవు. ఉదా: ఒకవైపు మూసి ఉంచి, మరో వైపు తెరచి ఉన్న గొట్టంలో స్థిర తరంగాలు ఏర్పడతాయి. అనునాదం: సమాన సహజ పౌనఃపున్యాలున్న రెండు వస్తువుల్లో మొదటి వస్తువును కంపింపజేసినప్పుడు దాని ప్రభావం వల్ల రెండో వస్తువు గరిష్ఠ ధ్వని తీవ్రతతో కంపిస్తుంది. ఈ ధర్మాన్ని ‘అనునాదం’ అంటారు. అనునాదం జరగడానికి రెండు వస్తువుల సహజ పౌనఃపున్యాలు సమానంగా ఉండాలి. అనునాదం అనువర్తనాలు వంతెనలను సమీపించినప్పుడు సైనికులు కవాతును ఆపేస్తారు. ఎందుకంటే అనునాదం వల్ల వంతెన కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ బ్రిడ్జి కింద నుంచి నీరు ప్రవహిస్తే దాని పౌనఃపున్యం మారడం వల్ల అనునాదం జరుగదు. అందువల్ల ఆ బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉండదు. ఈల, పిల్లనగ్రోవి, రేడియో అనునాదం ధర్మం ఆధారంగా పనిచేస్తాయి. ఒక వాహనం (కారు, బస్సు మొదలైనవి) నియమిత వేగాన్ని అధిగమించిన తర్వాత దాని ఇంజిన్ నుంచి వెలువడే శబ్ద పౌనఃపున్యం, కంపించే ఆ వాహనం విడిభాగాల పౌనఃపున్యానికి సమానమైనప్పుడు అనునాదం వల్ల ప్రత్యేకమైన ధ్వని వినిపిస్తుంది. దీన్ని ఖ్చ్టజీజ ౌజ ్టజ్ఛి టౌఠఛీ అంటారు. ఒక గాజుపలక పౌనఃపున్యానికి సమానమైన పౌనఃపున్యం ఉన్న ధ్వనిని ఉత్పత్తి చేసినప్పుడు అనునాదం వల్ల ఆ గాజు పలక పగిలిపోతుంది. శృతిదండం ఎల్లప్పుడూ ఒక స్థిరమైన పౌనఃపున్యంతో కంపిస్తుంది. దీన్ని ఇన్వార్స్టీల్ అనే లోహ మిశ్రమంతో తయారు చేస్తారు. ఈ పదార్థం సంకోచ, వ్యాకోచాలు పరిగణనలోకి తీసుకోలేనంత తక్కువగా ఉంటాయి. ప్రతిధ్వని: ధ్వని తరంగాలు ప్రయాణించే మార్గంలో ఎదురుగా ఉన్న అవరోధం తలాలను తాకి, పరావర్తనం చెంది, మనల్ని చేరడాన్ని ‘ప్రతిధ్వని’ అంటారు. ప్రతిధ్వనిని వినడానికి కింది షరతులు పాటించాలి. - మొదటిసారి వినిపించే ధ్వనికి, ప్రతిధ్వనికి మధ్య కనీసం 1/10వ సెకన్, అంతకంటే ఎక్కువ వ్యవధి ఉండాలి. - ధ్వని జనక స్థానం, పరావర్తన తలాల మధ్య కనీస దూరం 16.5 మీటర్లు ఉండాలి. పతిధ్వనికి సమీకరణం v ® ధ్వనివేగం d ® ధ్వని తరంగాలు ప్రయాణించిన మొత్తం దూరం. t=కాలం కానీ v = 330 m/s, t = 1/10 d = 16.5m అనువర్తనాలు - లోతైన బావులు, లోయలు, గనుల లోతును లెక్కించడంలో - సముద్రాల లోతును కనుగొనడానికి ఉపయోగించే ౌ్చట పరికరం పనిచేయడంలో ధ్వని పరావర్తనం ధర్మం ఇమిడి ఉంటుంది. - రెండు ఎత్తై భవనాలు, పర్వతాల మధ్య దూరాన్ని కచ్చితంగా లెక్కించేందుకు ఈ ధర్మాన్ని ఉపయోగిస్తారు. - వైద్యులు ఉపయోగించే స్టెతస్కోప్ ధ్వని పరావర్తనం (బహుళ పరావర్తనం) సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఈ సాధనాన్ని Lenneck శాస్త్రవేత్త కనుగొన్నాడు. - గోల్కొండకోట ప్రధాన ద్వారం వద్ద చేసే ధ్వని బహుళ పరావర్తనం చెంది ఆ కోటపై ఏడుసార్లు వినిపిస్తుంది. -
FRICTION & PHYSICAL OPTICS
FRICTION & PHYSICAL OPTICS 1. In the case of an achromatic prism, there is.. 1) deviation without dispersion 2) dispersion without deviation 3) refraction without deviation 4) dispersion and deviation 2. A red ray is deviated by two prisms at angles 10° and 8° respectively. The two prisms deviate blue ray at angles 12° and 10° respectively. Their dis-persive powers will be in the ratio 1) 11 : 9 2) 9 : 11 3) 3 : 2 4) 1 : 1 3. The angular dispersion produced by a prism 1) Increases if the average refractive index decreases 2) Increases if the average refractive index increases 3) Remains constant for any two colours 4 Is independent of refractive index of material 4. Consider the following state-ments (A) Absorption spectrum is due to the absorption of matter by radiation (B) Line spectrum is due to the electronic transition from higher orbits to lower orbits 1) Both A and B are correct 2) A is correct B is wrong 3) A is wrong B is correct 4) Both A and B are incorrect 5. The ratio of the angles of deviation of a monochromatic light ray when it passes through a small angled prism of refractive index 1.5 in air, with that of immersed in a liquid of refractive index 1.2 is 1) 1 : 2 2) 2 : 1 3) 5 : 4 4) 5 : 2 6. In the case of diffraction of light at straight edge 1) There is absolute darkness in the geometrical shadow 2) There is a faint light whose intensity is uniform 3) There are alternately dark and bright bands of decreasing intensity 4) There is a faint light whose intensity gradually becomes zero 7. [A]: Diffraction phenomenon is much harder to observe in light than in sound. [R]: Wavelength of light is smaller than that of sound in comparison with size of obs-tacles. 1) Both A and R are true and R is the correct explanation of A 2) Both A and R are true but R is not the correct explanation of A 3) A is true but R is false 4) A is false but R is true 8. In the propagation of electro-magnetic waves, the angle bet-ween direction of propagation and plane of polarization is 1) 0° 2) 180° 3) 90° 4) 45° 9. From Brewster's law of polari-zation it follows that angle of polarization depends upon 1) Wavelength of light 2) Orientation of plane of vibration 3) Orientation of plane of polarization 4) Angle of deviation 10. A rays of light in air is incident on a glass plate at polarizing angle. It suffers a deviation of 22° on entering glass. The angle of polarization is 1) 90° 2) 56° 3) 68° 4) 34° 11. If the critical angle for a crystal is 45° w.r. to air, its polarizing angle is 1) tan-1(2) 2) tan-1(1/2) 3) tan-1 4) tan-1 12. If polarizing angle for a crystal is 54° then, in the arrangement of pile of such crystals to produce polarized light by refraction, the planes must be inclined to the axis at an angle of 1) 36° 2) 27° 3) 18° 4) 32.5° 14. Two waves having intensities I and 4I produce interference pattern. The ratio of intensities at two points on the screen where phase difference bet-ween the waves are p/2 and p/3 respectively is 1) 5 : 1 2) 5 : 7 3) 5 : 9 4) 3 : 2 15. In the figure, S1 and S2 are coherent sources. The intensity of both sources is same. If the intensity at the point 'p' is 4 watt/m2, the intensity of each source is 1) 1 watt/m2 2) 2 w/m2 3) 3 w/m2 4) 4 w/m2 16. When 'n' in coherent sources each of intensity I0 are super imposed at a point, the inten-sity at that point is I1. If the 'n' sources are coherent, the resul- tant intensity is I2. Then I2: I1 = 1) 1 : n2 2) 1 : Ön 3) n : 1 4) n : Ön 17. A wave front and a ray of light are 1) Perpendicular to each other 2) Parallel to each other 3) Convergent towards each other 4) Divergent from each other 18. If polychromatic light is used in Young's double slit experi-ment then out of the following the wrong one is 1) Central fringe is white with alternate coloured bands on either sides of it 2) Central fringe is white su-rrounded by bands of variable fringe width 3) No interference pattern is ob-served on the screen 4) Order of the fringe width varies with order of the fringe 19. In Young's double slit experi-ment it one of the slits is covered with opaque black paper then we observe 1) Interference pattern with less intensity at bright fringes is obtained 2) Interference pattern with more darkness at dark fringes is obtained 3) Uniform intensity with a reduction of half of the initial intensity of a source 4) Uniform intensity with a re-duction of 4 times of the initial intensity of bright bands 20. In Young's double slit experi-ment 1) Only interference occurs 2) Only diffraction occurs 3) Both interference and diffra-ction occurs 4) Interference and polarization occurs 21. A wooden box of mass 50 kg is on a horizontal surface ms = 0.5, mk = 0.4. If a horizontal force of 150 N is acting on the box, then frictional force on the box is 1) 150 N 2) 245 N 3) 196 N 4) 49 N 22. A uniform chain of linear den-sity 2 kg/m lies at rest on a horizontal table with 32 cm of it hanging over the edge. If ms = 0.8 then total mass of the chain is 1) 0.72 kg 2) 2.88 kg 3) 0.36 kg 4) 1.44 kg 23. A particle is projected up a 45° incline with velocity 'V'. It returns back to the starting point with speed V1 then (V1 / V) = ? (mk = 0.5) 1) 1 : 3 2) 3 : 1 3) 1 : 3 4) 1 : 1 24. A body which is pushed and released along a horizontal surface moves with a retar-dation of g/4. The coefficient of friction is 1) 0.2 2) 0.1 3) 0.25 4) 0.75 25. A block of mass 2 kg is placed on the inclined plane of height 4 m and length 5 m. To keep it in equilibrium it is pressed with a force 'F' perpendicular to the plane. Minimum value of that force is (m = 0.4, g = 10 ms-2) 1) 14 N 2) 28 N 3) 7 N 4) 21 N 26. A block of mass 'm' rests on a rough horizontal surface as shown. Coefficient of friction between the block and the surface is m. A force F= mg acting at angle q with vertical pulls it. The condition under which the block moves is 1) tan q ³ m 2) cotq ³ m 3) tan(q /2) ³ m 4) cot(q/2) ³ m KEY 1) 1 2) 2 3) 2 4) 3 5) 2 6) 4 7) 1 8) 3 9) 1 10) 2 11) 3 12) 1 13) 2 14) 2 15) 1 16) 3 17) 1 18) 3 19) 4 20) 3 21) 1 22) 4 23) 3 24) 3 25) 2 26) 4 -
సత్యం: ఐన్స్టీన్ = మేధావి
ప్రతి మనిషీ వ్యక్తిగతంగా గౌరవం పొందాలి. ఎవరినీ దేవుళ్లను చేయొద్దు. విచిత్రమేమిటంటే, నా దురదృష్టంకొద్దీ నా తోటివారినుంచి నేను ఎక్కువ ఆదరణనూ, భక్తినీ పొందాను, నా గొప్పతనం అంతగా ఏమీలేకపోయినా... చిన్నతనంలో ఐన్స్టీన్కు వాళ్ల నాన్న ఒక ప్యాకెట్ కంపాస్ ఇచ్చాడట. ఏమీలేకుండానే శూన్యంలో అటూయిటూ తిరుగుతున్న ఆ ముల్లును చూస్తూంటే, ఏమీలేనిదాన్లోనే ఏదోవుందన్న గ్రహింపు కలిగిందట! ఆ కుతూహలమే ఆ పిల్లాడిని ‘ఐన్స్టీన్’ను చేసింది. నిస్సందేహంగా ఇరవయ్యో శతాబ్దపు అత్యున్నత మేధావిగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ను శాస్త్ర ప్రపంచం కీర్తించింది. ప్రతిదాన్నీ ప్రశ్నించే స్వభావం ఆయనది. పాఠశాలల్లో అతి క్రమశిక్షణను సహించేవాడు కాదు. ప్రశ్నలు ఎదుర్కోవడానికి ఇష్టపడని ఉపాధ్యాయులు ఆయనకు నచ్చేవాళ్లు కాదు. మనిషికి మెదడు ఉన్నదే ప్రశ్నించడానికనేవారు. ప్రశ్నిస్తూనే జ్ఞానాన్ని పొందాలిగానీ, గుడ్డిగా కాదనేవారు. విద్య అనేది విద్యార్థుల్ని ఆలోచించేలా చేయాలి, అంతకుముందు ఊహించడానికి కూడా సాధ్యంకాని ఊహల్ని సాధ్యం చేసేట్టుగా ఉండాలి. ఉత్తినే వాస్తవాలు తెలుసుకోవడంకన్నా, ఆలోచించేలా మెదడుకు తర్ఫీదు ఇవ్వాలనే ఆలోచనలు ఆయనవి. ఆధునిక భౌతికశాస్త్రానికి మూలస్తంభాల్లో ఒకటైన సాపేక్ష సిద్ధాంతాన్ని ఆయన ఆవిష్కరించారు. ప్రపంచ సుప్రసిద్ధ సూత్రం ‘ఈ=ఎం.సీస్క్వేర్’ కనుగొన్నారు. 1921లో భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. అయితే, ఆయన కేవలం మేధావిగా, శాస్త్రవేత్తగా మాత్రమే ఉండిపోలేదు. అలా ఉండిపోకపోవడమే ఆయన్ని జనానికి కూడా చేరువ చేసింది. తాత్వికుడిగా, ఆధ్యాత్మిక అన్వేషకుడిగా, అహింస పట్ల ప్రేమ ఉన్నవాడిగా ఆయన ఎన్నో అంశాల్లో తన భావాలను పంచుకున్నారు. ప్రతి మనిషీ వ్యక్తిగతంగా గౌరవం పొందాలి. ఎవరినీ దేవుళ్లను చేయొద్దు. విచిత్రమేమిటంటే, నా దురదృష్టంకొద్దీ నా తోటివారినుంచి నేను ఎక్కువ ఆదరణనూ, భక్తినీ పొందాను, నా గొప్పతనం అంతగా ఏమీలేకపోయినా, అన్నారు ఓ సందర్భంలో. ఆర్థిక విధానాల రీత్యా సామ్యవాదం వైపు మొగ్గినా, వ్యక్తి స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి ఉండే ప్రాధాన్యతను నొక్కిచెప్పేవారు. ఐన్స్టీన్ ఏ దేవుడినీ అంగీకరించలేదు. మానవ బలహీనతలోంచే దేవుడు జన్మించాడని వ్యాఖ్యానించారు. అయితే మతంగా మాత్రం బౌద్ధానికి పెద్దపీట వేశారు. ఏ మతమైనా ఆధునిక శాస్త్రీయావసరాలతో తూగగలిగినది ఉందంటే అది బౌద్ధమే అన్నారు. జర్మనీలో హిట్లర్ అధికారంలోకి వచ్చినప్పుడు అమెరికా పర్యటనలో ఉన్న ఐన్స్టీన్ తిరిగి తన మాతృదేశం వెళ్లలేదు. అమెరికాలోనే స్థిరపడ్డారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మిత్రదేశాల మద్దతుదారుగా శత్రువును ఎదుర్కోవడానికి మరింత శక్తిమంతమైన బాంబుల తయారీ అవసరం గురించి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్కు లేఖ రాశారు. అయితే, 1955లో తన మరణానికి ముందుమాత్రం బ్రిటన్ రచయిత బెర్ట్రండ్ రసెల్తో కలిసి ‘ద రసెల్-ఐన్స్టైన్ మానిఫెస్టో’లో అణ్వాయుధాల ప్రమాదం గురించి హెచ్చరించారు. ‘అహింసతోనూ అనుకున్నది సాధించవచ్చని మీరు నిరూపించారు. మీ దారి ఆదర్శప్రాయమైనదీ, ప్రపంచ శాంతిని నెలకొల్పేదీనూ. మీరంటే నాకు ఆరాధన’ అని గాంధీజీకి లేఖ పంపారు ఐన్స్టీన్, కలయికను అభ్యర్థిస్తూ. అయితే ఇద్దరూ కలిసే సమయం వచ్చేలోపే మహాత్ముడు నేలకొరిగారు. మహాత్ముడి గురించిన ఐన్స్టీన్ వ్యాఖ్య ‘రక్తమాంసాలతో కూడిన ఇలాంటి మనిషి...’ ప్రసిద్ధమైంది. నేనెప్పుడూ ఒంటరి ప్రయాణికుడినే! నేను ఏనాడూ నా దేశానికి చెందలేదు, నా ఇంటికిగానీ, నా స్నేహితులకుగానీ నా నిండుగుండెతో చెందిలేను. అయినప్పటికీ నేను ఏనాడూ ఒంటరితనాన్నిగానీ, దేనికైనా దూరపుతనాన్నిగానీ అనుభవించలేదు, అన్నారు ఐన్స్టీన్. ఆయన మరణించి అర్ధశతాబ్దం దాటిపోయినా ఇప్పటికీ ఐన్స్టీన్నుంచి మనకు కూడా ఏ దూరపుతనమూ లేదు. 14 మార్చి ఐన్స్టీన్ జయంతి -
భౌతికశాస్త్ర కాంతిపుంజం
సందర్భం - నేడు జాతీయ సైన్స దినోత్సవం దేశానికి తొలి ‘భారతరత్న’ అయిన సర్ సి.వి.రామన్ అంతకన్నా కూడా ఎక్కువగా మానవరత్న! నోబెల్ సహా ఇంకా ఎన్నో వైజ్ఞానికరంగ హోదాలకు గౌరవం తెచ్చిపెట్టిన ఈ భౌతిక శాస్త్రవేత్త సవినయ సంపన్నుడు. పదహారేళ్లకు డిగ్రీ, తర్వాత రెండేళ్లకు మాస్టర్స్ డిగ్రీ సాధించిన నిరుపేద విద్యార్థి. ఆయనలోని అణకువ, విధేయత ఆయన వైజ్ఞానిక నిరాడంబరతను దాచేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ ఉత్సాహం, ఆ ఉత్తేజం, ఆ కుతూహలం యువశాస్త్రవేత్తల కలలను కాంతిమంతం చేస్తుండేవి. రామన్ను మద్రాస్ తీర్చిదిద్దింది, కలకత్తా చేరదీసింది. బెంగుళూరు తనను చేరదీయించుకుంది. ఈ మూడు నగరాలూ రామన్ ప్రభావం నుంచి ఏనాటికీ బయటపడలేవు. ఆ మాటకొస్తే దేశం మొత్తం ఆరు దశాబ్దాలపాటు ఆయన సూత్రాలను అనుసరించి, ఆయన సేవలతో శాస్త్ర సాఫల్యం పొందింది. ‘రామన్ ఎఫెక్ట్’ ఆయన ఆవిష్కరణే. ఏటా మనం ఫిబ్రవరి 28న ‘సైన్స్ డే’ జరుపుకోవడం వెనుక రామన్ ఎఫెక్ట్ ఉంది. సరిగ్గా ఈ రోజునే ఆయన కాంతి ప్రభావ సూత్రాన్ని కనుగొన్నారు. సముద్రపు నీటిపై సూర్యకాంతి పడిన ప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా చెల్లాచెదురై, మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని రామన్ సిద్ధాంతీకరించారు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా చెల్లా చెదరవుతాయో తెలిపే పరిశోధన ఫలితమే రామన్ ఎఫెక్ట్ (రామన్ ప్రభావం). మద్రాసులో మాస్టర్స్ డిగ్రీ అయ్యాక తల్లిదండ్రులు, సే్నిహ తులు ఒత్తిడి చేయడంతో రాసిన ఒక పోటీ పరీక్ష... రామన్కు కలకత్తాలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఉద్యోగాన్ని సంపాదించి పెట్టింది. వెళ్లాలా వద్దా? అయిన వారి అందరి ప్రాణాలూ రామన్ ఉద్యోగం మీదే ఉన్నాయి. రామన్ ప్రాణాలు మాత్రం భౌతికశాస్త్రంలో ఉన్నాయి. రెండు ప్రాణాలను కాపాడుకోవాలి. అందుకే ఆయన రెండు పడవల మీద కాళ్లు వేశారు. ఉద్యోగం చేస్తూనే, అక్కడి ‘ఇండియన్ అసోషియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్’లో సభ్యుడిగా చేరారు. అక్కడే ఆయనకు కలకత్తా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆశుతోష్ ముఖర్జీతో పరిచయం అయింది. భౌతికశాస్త్ర పరిశోధనాంశాలలో రామన్ ప్రతిభకు ముగ్ధులైన ముఖర్జీ ఆయన్ని కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా నియమించారు. అదే సమయంలో కల్టివేషన్ ఆఫ్ సైన్స్ కార్యద ర్శిగా పదోన్నతిపై అమెరికాలో, ఐరోపా దేశాలలో రామన్ విస్తృతంగా పర్యటించారు. కలకత్తాలో పదిహేనేళ్లు ఉన్నాక బెంగు ళూరులోని భారత విజ్ఞాన శాస్త్ర సంస్థకు డెరైక్టర్ అయ్యారు. పదవీ విరమణ అనంతరం ‘రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్’ నెలకొల్పి ఎందరో యువ మేధావుల పరిశోధనలకు ఆయన చేయూతను ఇచ్చారు. రామన్కు ఐన్స్టీన్, న్యూటన్, రేలీగ్, బోల్జ్మేన్ అభిమాన శాస్త్రవేత్తలు. కాంతి, ధ్వని, స్ఫటికం, వర్ణదర్శనం ఇష్టమైన అంశాలు. ‘‘ఒక దేశం యొక్క నిజమైన సంపద ఆ దేశ ప్రజల మేధాపరమైన, భౌతికమైన బలంలో ఉంది’’ అని విశ్వసించే రామన్, తన జీవితం మొత్తాన్నీ సైన్సు ప్రయోగాలు చేయడానికీ, చేయించడానికీ అంకితం చేశారు. 1888 నవంబర్ 7న మద్రాసు లో జన్మించిన చంద్రశేఖర వెంకటరామన్ 1970 నవ ంబర్ 21న బెంగుళూరులో మరణించారు. -
ఆయనే వంట నేర్పించారు
స్వీట్ హోమ్ మీ ఇంట్లో బాస్ ఎవరు? అని కొందరు చిలిపిగా అడుగుతారు... నేను కూడా అంతే చిలిపిగా సమాధానం చెబుతాను. ‘పిల్లలు’ అని! నాకు, ఆయనకు మధ్య ఎలాంటి ఇగోలు లేవు. మా లక్ష్యం ఒక్కటే...పిల్లలకు మంచి చదువు చెప్పించాలి అని. పిల్లల హోమ్ వర్క్ విషయంలో నేను సహాయం చేస్తాను. సబ్జెక్ట్లను ఇద్దరం పంచుకుంటాం. నేను బాటనీ చెబుతాను. మ్యాథ్స్, ఫిజిక్స్ ఆయన చెబుతారు. నేను కొన్ని సందర్భాల్లో తల్లిగా కొంచెం కఠినంగా వ్యవహరించినా, ఇంకొన్ని సందర్భాల్లో మాత్రం స్నేహంగా ఉంటాను. భోజనాన్ని వృథా చేయడం నాకు నచ్చదు. దాని విలువ గురించి వాళ్లకు చెబుతుంటాను. ‘భర్త నా చేతిలో ఉండాలి... నేను చెప్పినదానికల్లా తల ఊపాలి’ అనుకునే రకం కాదు నేను. మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు వారి మీద ఎలాంటి ఆంక్షలూ పెట్టకూడదు. మా ఇద్దరిలో ఎవరు రొమాంటిక్ అంటే...ఇద్దరమూ! ఒకరికొకరం ఆశ్చర్యపరిచే బహుమతులు ఇచ్చుకుంటాం. క్యాండిల్లైట్ డిన్నర్లను ఇష్టపడతాం. మా ఆయన బాగా వంట చేస్తాడు. ఆయన నుంచే నేను వంట నేర్చుకున్నాను. - మాధురీ దీక్షిత్ -
ఫిజిక్స్
1. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు? టాలెమీ 2. గురుత్వ త్వరణం విలువ? 9.8 మీ./సె. 3. చంద్రుడు, భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం? 27.3 రోజులు 4. విశ్వగురుత్వ స్థిరాంకం(G) విలువ ? 6.67384 × 10-11 m3 kg-1 s-2 5. ’జ’ విలువలో కలిగే స్వల్ప మార్పులను కనుగొనే పరికరం? గురుత్వమాపకం 6. {స్పింగ్ త్రాసు పనిచేసే సూత్రాన్ని తొలి సారి కనిపెట్టిన శాస్త్రవేత్త? రాబర్ట హుక్ 7. వస్తువు భారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే సూత్రం? హుక్ సూత్రం 8. 400 గ్రాముల ద్రవ్యరాశి ఉన్న రాయి బరువు? 3.9 N 9. మొలాసిస్ నుంచి చక్కెర స్ఫటికాలను వేరుచేసే పరికరం? సెంట్రీఫ్యూజ్ 10. తిరిగే ఆకురాయితో కత్తిని పదును పెట్టేటప్పుడు నిప్పురవ్వలు ఏ దిశలో ప్రయాణిస్తాయి? స్పర్శరేఖ దిశలో 11. 1200 కిలోగ్రాములు ఉన్న కారు 6 మీ./సె. వేగంతో 180 మీ. వ్యాసార్ధం ఉన్న వృత్తాకార రోడ్డులో ప్రయాణిస్తోంది. ఆ కారుపై పనిచేసే అభికేంద్ర బలం విలువ? 240 N 12. చేతి గడియారంలో ఉన్న సంతులన చక్రం చేసే చలనం? డోలాయమాన చలనం 13. 100 సెం.మీ. పొడవున్న సామాన్య లోలకపు ఆవర్తన కాలం? 2 సెకన్లు 14. శారీరక మర్ధనలకు ఉపయోగించే కిర ణాలు? పరారుణ కిరణాలు 15. ఉపగ్రహాల ద్వారా సమాచార ప్రసారాల్లో ఉపయోగించే తరంగాలు? మైక్రో తరంగాలు 16. దృశ్యమాన దూరదర్శినిలతో కనుక్కోలేని విషయాలను ఏ పద్ధతి ద్వారా కను గొంటారు? రేడియో ఖగోళ శాస్త్రం 17. ్ఖ, గ కిరణాల ప్రభావానికి ఎక్కువ కాలం గురైతే వచ్చే వ్యాధి? కేన్సర్ 18. రేడియోధార్మికత వల్ల ఏ కిరణాలు ఉత్పత్తి అవుతాయి? గామా కిరణాలు 19. విద్యుత్ అయస్కాంత వికిరణాలు ఏ లక్షణాలను కలిగి ఉంటాయి? తిర్యక్ తరంగ 20. తరంగదైర్ఘ్యాలు (లేదా) పౌనఃపున్యాల సముదాయాన్ని ఏమంటారు? వర్ణపటం 21. ఒక వస్తువు బాహ్య ఆవర్తన బల ప్రభావంతో కంపిస్తే వాటిని ఏమంటారు? బలాత్కృత కంపనాలు 22. వరుస అస్పందన, ప్రస్పందనల మధ్య దూరం 10 సెం.మీ. ఐతే తరంగదైర్ఘ్యం విలువ? 40 సెం.మీ. 23. తరంగాగ్రాలు ఏదైనా చిన్న అవరోధాలను తాకి, వాటి అంచుల వెంట వంగి ప్రయా ణించడాన్ని ఏమంటారు? వివర్తనం 24. కాంతి తరంగాలు వ్యాపించడానికి ఏది అవసరమని హైగెన్స ఊహించాడు? ఈథర్ 25. ఒకే పౌనఃపున్యం, ఒకే కంపన పరిమితి ఉన్న రెండు కంపనాల వల్ల ఏర్పడే తరంగాల అధ్యారోహనాన్ని ఏమంటారు? వ్యతికరణం 26. కాంతి అభివాహానికి ప్రమాణం? ల్యూమెన్ 27. ఘన కోణానికి ప్రమాణం? స్టెరేడియన్ 28. లేజర్కు సంబంధించిన శాస్త్రీయ జ్ఞానాన్ని ప్రతిపాదించినవారు? డా॥చార్లెస్ హెచ్.టేన్స 29. సోడియం దీపం గరిష్ఠ కాంతి తీవ్రత? 5893 అని 30. ఘనస్థితి లేజర్కు ఉదాహరణ? రూబి లేజర్ 31. లేజర్లను ఏ ప్రత్యేక త్రిమితీయ ఫొటోగ్రఫీలో ఉపయోగిస్తారు? హాలోగ్రఫీ 32. ఒక పదార్థ అయస్కాంతీకరణ అవధిని ఏమంటారు? అయస్కాంత సంతృప్తత 33. అయస్కాంతీకరణ తీవ్రతకు ప్రమాణం? ఆంపియర్/మీటర్ 34. అయస్కాంత ససెప్టిబిలిటీకి ప్రమాణాలు? ప్రమాణాలు లేవు 35. రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదాన్ని ఏ పరికరంతో కొలుస్తారు? వోల్ట్ మీటర్ 36. విద్యుత్ వలయాన్ని జత చేయడానికి, విడదీయడానికి దేన్ని ఉపయోగిస్తారు? టాప్-కీ 37. విద్యుత్ ప్రవాహాన్ని దేనితో కొలుస్తారు? అమ్మీటర్ 38. ఓమ్ నియమాన్ని పాటించే వాహకాలను ఏమంటారు? ఓమీయ వాహకాలు (లేదా) రేఖీయ వాహకాలు 39. విశిష్ట నిరోధానికి ప్రమాణం? ఓమ్-మీటర్ 40. 6గి, 12గి లను సమాంతరంగా సంధా నం చేసినప్పుడు ఫలిత నిరోధం? 4గి 41. విద్యుత్ పనిరేటును ఏమంటారు? విద్యుత్ సామర్థ్యం 42. 1 మెగావాట్ (కగి) ఎన్ని వాట్లకు సమానం? 106 43. 1 ఓగిఏ కు ఎన్ని వాట్ సెకన్లు? 36ణ105 44. విద్యుద్విశ్లేషణ చేయడానికి వీలున్న పాత్రను ఏమంటారు? వోల్టా మీటర్ 45. వెండి వస్తువులపై బంగారపు పూతను ఏ పద్ధతి ద్వారా వేస్తారు? ఎలక్ట్రో ప్లేటింగ్ 46. విద్యుద్విశ్లేషణ పద్ధతిలో అక్షరాలు చెక్కి ఉన్న దిమ్మె నుంచి ఒక ప్రతిని తయారుచేయడాన్ని ఏమంటారు? ఎలక్ట్రో టైపింగ్ 47. RPM పూర్తి రూపం? Rotation per minute 48. విద్యుత్ మోటార్లో దీర్ఘచతురస్రాకార బంధక కవచాన్ని ఏమంటారు? ఆర్మేచర్ 49. {sాన్సఫార్మర్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? అన్యోన్య ప్రేరకత్వం 50. తల్లి గర్భంలోని శిశువులను గుర్తించే విధానంలో ఉపయోగించే ధ్వనులు? అతిధ్వనులు(Ultra sound) 51. ల్యూమెన్ ఎన్ని క్యాండిల్స్కు సమానం? 12.56 52. పీడనానికి అంతర్జాతీయ ప్రమాణం? పాస్కల్ 53. పరమాణు కేంద్రక దూరాలను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? ఫెర్మి 54. 20HZల కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న ధ్వనులు? పరశ్రావ్యాలు 55. హెక్టార్కు ఎన్ని ఎకరాలు? 2.47 56. ఒక పౌండ్కు ఎన్ని కిలోగ్రామ్లు? 0.45 57. పైకోమీటర్ అంటే? 1×10−12 మీటర్లు 58. {స్పింగును సాగదీసినప్పుడు జనించే వికృతి? నిరూపణ వికృతి 59. టెలిఫోన్ గంట ఏర్పరిచే శబ్ద పరిమాణం? 60 డెసిబెల్స్ 60. {పతిధ్వని ఆధారంగా ఎగిరే జీవి? గబ్బిలం 61. గోడ గడియారం చేసే ‘టిక్ టిక్’ అనే శబ్ద పరిమాణం? 30 డెసిబెల్స్ 62. వేర్వేరు నీటి ఆవిరి ఉష్ణోగ్రతలను కొలవ డానికి ఉపయోగించే థర్మామీటర్లు? బెక్మన్ థర్మామీటర్ 63. He-Ne లేజర్లో క్రియాశీల వ్యవస్థ? Ne 64. {పెషర్ కుక్కర్ లోపల ఉష్ణోగ్రత? 120నిఇ 65. ఫారన్హీట్ ఉష్ణమాపకంలోని మొత్తం సమ విభాగాలు? 180 66. మిఠాయి కొట్లు, సెలూన్లలో ఉండే దర్పణాల మధ్య కోణం? 180 డిగ్రీలు 67. మోటార్ వాహనాల్లో డ్రైవర్కు ఎదురుగా అమర్చేవి? కుంభాకార దర్పణాలు 68. మోటారు వాహనాల హెడ్లైట్లలో పరావర్తకాలుగా ఉపయోగించేవి? పుటాకార దర్పణం 69. ఈఎన్టీ స్పెషలిస్ట్లు ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? పుటాకార 70. ఉష్ణాన్ని ఇవ్వని కాంతిజనకం? మిణుగురు పురుగు 71. గాలిలో ధ్వని వేగం? 330 మీ./సె. 72. ఫార్టిన్ భారమితిని ఎలా ఉపయోగిస్తారు? {పమాణ భారమితి 73. విమానాల ఎత్తును కనుక్కోవడానికి ఉపయోగించే పరికరం? ఆల్టీమీటర్ 74. జలయంత్రాలు, బ్రామాప్రెస్సు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? పాస్కల్ కెమిస్ట్రీ 75. లారిక్ ఆమ్లం ఫార్ములా? C12H24O2 76. ఓలియిక్ ఆమ్ల స్వభావం? అసంతృప్తం 77. లినోలినిక్ ఆమ్లం వనరులు? లిన్ గింజలు 78. C18H36O2 సాంకేతికంగా ఉన్న ఫాటీ ఆమ్లం? స్టియరిక్ ఆమ్లం 79. నూనె/ కొవ్వులకు ముఖ్య వనరులు? మొక్కలు, వృక్షాలు, జంతువులు 80. సంతృప్త కొవ్వులకు ఉదాహరణ? డాల్డా, మార్గరీన్ 81. నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయో గించే ఉత్ప్రేరకం? (Ni) నికెల్ 82. క్షార సమక్షంలో నూనె/ కొవ్వును జల విశ్లేషణం చెందించి సబ్బును నేరుగా పొందే ప్రక్రియను ఏమంటారు? సఫోనికేషన్ -
ఫిజిక్స్
ఉష్ణం (Heat) ఘన పదార్థాల వ్యాకోచం ప్రతి ఘన పదార్థంలో ద్రవ్యరాశి అనే మూడు అక్షాల్లో విభజించి ఉంటుంది. ఈ ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు వాటి స్వభావాన్ని బట్టి అణువుల మధ్య దూరంలో మార్పు కలుగుతుంది. కొన్ని ఘన పదార్థాలను వేడిచేసినప్పుడు వాటి అణువుల మధ్య బంధ దూరం పెరగటం వల్ల అలాంటి పదార్థాలు వ్యాకోచిస్తాయి. ఉదా: అ, ఇఠ, ఊ్ఛ మొదలైనవి. కొన్ని ఘన పదార్థాలను వేడిచేసినప్పుడు వాటి అణువుల మధ్య బంధదూరం తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి ఘన పదార్థాలు సంకోచిస్తాయి. ఉదా: ప్లాస్టిక్ పదార్థాలు, రబ్బరు, ఫ్యూజ్తీగ, గాజు, తల వెంట్రుకలు, సిల్క్ వస్త్రాలు మొదలైనవి. కొన్ని పదార్థాలను వేడిచేసినా, చల్లార్చినా దాని అణువుల మధ్య బంధ దూరంలో ఎలాంటి మార్పూ ఉండదు. కాబట్టి ఇలాంటి ఘన పదార్థాల్లో సంకోచ, వ్యాకోచాలు ఉండవు. ఉదా: చెక్క దిమ్మ ఘన పదార్థాలకు మూడు రకాల వ్యాకోచాలు ఉంటాయి. అవి: ధైర్ఘ్య వ్యాకోచం: ఘన పదార్థాలను వేడి చేసినప్పుడు ఏదైనా ఒక అక్షం వెంట వ్యాకోచించినట్లయితే దాన్ని ధైర్ఘ్య వ్యాకోచం అని అంటారు. విస్తీర్ణ వ్యాకోచం: ఒక ఘన పదార్థాన్ని వేడి చేసినప్పుడు ఏవైనా రెండు అక్షాల వెంట వ్యాకోచించినట్లయితే దాన్ని విస్తీర్ణ వ్యాకోచం అంటారు. ఘన పరిమాణ వ్యాకోచం: ఒక ఘన పదార్థాన్ని వేడి చేసినప్పుడు అన్ని అక్షాల వెంట వ్యాకోచించినట్లయితే దాన్ని ఘన పరిమాణ వ్యాకోచం అంటారు. పై మూడు రకాల వ్యాకోచాల మధ్య నిష్పత్తి 1: 2 : 3 గా ఉంటుంది. అంటే ఒక ఘన పదార్థం, దాని ఘన పరిమాణంలో ఎక్కువగా వ్యాకోచిస్తుంది. ఘన పదార్థాల వ్యాకోచానికి ఉదాహరణాలు: రెండు వరుస రైలు పట్టాల మధ్యలో తగినంత ఖాళీ వదలడం వల్ల వాటిని సంకోచ, వ్యాకోచాల బారి నుంచి కాపాడవచ్చు.ఇదే కారణంతో రెండు వరుస విద్యుత్ లేదా టెలిఫోన్ స్తంభాల మధ్య ఉండే తీగలను కొంత వదులుగా బిగిస్తారు. కాంక్రీట్ రోడ్డును నిర్మించేటప్పుడు రాళ్ల మధ్యలో తగినంత ఖాళీ వదలడం వల్ల అవి స్వేచ్ఛగా సంకోచ, వ్యాకోచాలు చెందుతాయి. ఇంటి పైకప్పు నిర్మాణంలో కాంక్రీట్తోపాటు ఇనుమును ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ రెండు పదార్థాల సంకోచ, వ్యాకోచాలు పరస్పరం సమానంగా ఉంటాయి. ఒక అల్యుమినియం పాత్రలో ఇరుక్కున్న ఇనుప పాత్రను వేరు చేయడానికి గది ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకు వేడి చేయాలి. అప్పుడు ఇనుప పాత్ర కంటే అల్యుమినియం పాత్ర ఎక్కువగా వ్యాకోచించడం వల్ల సులభంగా వేరు చేయవచ్చు. ఒకవేళ ఇనుపపాత్రలో అల్యుమినియం పాత్ర ఇరుక్కున్నప్పుడు వాటిని చల్లార్చి వేరు చేయాలి. ఈ సందర్భంలో ఇనుము కంటే అల్యుమినియం ఎక్కువగా సంకోచిస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద.. ఒక లోహపలక మధ్య బిందువు వద్ద కొంత వ్యాసంతో ఒక రంద్రం ఉంది. రంధ్రం మధ్య బిందువు వద్ద వేడి చేసినప్పుడు ఆ లోహపలకతోపాటు రంధ్రం కూడా వ్యాకోచించడం వల్ల దాని వ్యాసం పెరుగుతుంది. నోట్: పై సందర్భంలో ప్లాస్టిక్ పలకను తీసుకున్నట్లయితే అది సంకోచించడంవల్ల రంధ్రం వ్యాసం తగ్గుతుంది. ఒక వేడి గాజుదిమ్మపై చల్లటి ద్రవాన్ని చల్లినప్పుడు ఆ గాజు దిమ్మల పొరలపై అసమాన వ్యాకోచాల వల్ల అది పగిలిపోతుంది. ఒక చల్లటి గాజుదిమ్మపై వేడి ద్రవాన్ని చల్లినప్పుడు ఆ గాజుపొరల మధ్య అసమాన వ్యాకోచాల వల్ల అది పగిలిపోతుంది. ఒక ఇనుప చక్రాన్ని కొలిమిలో అమర్చి వేడిచేసినప్పుడు అది వ్యాకోచించి దాని వ్యాసం పెరుగుతుంది. దీన్ని ఎడ్లబండి కొయ్య చక్రంపై అమర్చి చల్లార్చినప్పుడు సంకోచించి గట్టిగా అదిమి పట్టుకుంటుంది. ఇన్వర్స్టీల్ అనే పదార్థాన్ని వేడిచేసినా లేదా చల్లార్చినా దానిలో సంకోచ, వ్యాకోచాలు పరిగణనలోకి తీసుకోలేనంత తక్కువగా ఉంటాయి. కాబట్టి శృతిదండాలు, మీటర్ స్కేల్, గడియారంలోని లోలకాల తయారీలో ఈ పదార్థాన్ని ఉపయోగిస్తారు. ద్విలోహపలక: దీనిని ఇనుము, ఇత్తడి పలకలను ఉపయోగించి తయారుచేస్తారు. అందువల్ల దీన్ని ‘ద్విలోహ పలక’ అని అంటారు. ఇది తనంతట తానుగా ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటూ పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఉష్ణ తాపక నియంత్రణ యంత్రం అని కూడా అంటారు. కాబట్టి ఆటోమేటిక్ ఇస్త్రీపెట్టెలు, రిఫ్రిజిరేటర్లలో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. ద్రవ పదార్థాల వ్యాకోచం నీటి అసంగత వ్యాకోచం: స్వచ్ఛమైన నీటిని 0ైఇ నుంచి 4ైఇ ల వరకు వేడి చేసినప్పుడు అది వ్యాకోచించడానికి బదులుగా సంకోచిస్తుంది. 4ైఇ ల తర్వాత అన్ని ద్రవ పదార్థాల్లాగే నీరు కూడా వ్యాకోచిస్తుంది. కాబట్టి దీన్ని నీటి అసంగత వ్యాకోచం అని అంటారు. నీటి అసంగత వ్యాకోచం వల్ల 4ైఇ ల వద్ద నీటికి కనిష్ఠ ఘనపరిమాణం, గరిష్ఠ సాంద్రతలు ఉంటాయి. నీటి అసంగత వ్యాకోచం వల్ల మంచు సాంద్రత నీటిసాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. సమాన ఘన పరిమాణాలున్న రెండు పాత్రల్లో 4ైఇ ల వద్ద నిండుగా నీటిని నింపారు. వీటిలో మొదటి పాత్రను 4ైఇ ల నుంచి వేడి చేసేటప్పుడు అది వ్యాకోచించి బయటకు పొర్లిపోతుంది. రెండో పాత్రను 4ైఇ ల నుంచి చల్లార్చినప్పుడు అసంగత వ్యాకోచం వల్ల బయటకు పొర్లిపోతుంది. ఒక పాత్రలో 0ైఇ ల వద్ద కొంతమట్టం వరకు నీటిని నింపి వేడిచేసేటప్పుడు 4ైఇ ల వరకు ఆ నీటి మట్టం తగ్గిపోయి 4ైఇ ల తర్వాత పెరుగుతుంది. నీటి అసంగత వ్యాకోచం అనే ధర్మాన్ని సంకోచించే ఘన పదార్థాలతో పోల్చ వచ్చు. నీటి అసంగత వ్యాకోచాన్ని కొలవడానికి ‘డైలాటోమీటర్’ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. నీటి అసంగత వ్యాకోచాన్ని ప్రయోగశాలలో నిరూపించేందుకు ‘హోప్’ పరికరాన్ని వాడతారు. అనువర్తనాలు: శీతల ప్రదేశాల్లో జల చరాలు జీవించడానికి కారణం నీటి అసంగత వ్యాకోచం. వివరణ: చలి ప్రదేశంలో వాతావరణ ఉష్ణోగ్రత 4ైఇ ల నుంచి 0ైఇ లకు తగ్గిపోయి అది మంచుగా మారి నీటిపై తేలుతుంది. ఈ మంచు అదమ ఉష్ణవాహకం కావడం వల్ల వాతావరణంలోని ఉష్ణోగ్రత ఎంత చల్లబడినప్పటికీ ఆ ప్రభావం మంచు కింద ఉన్న నీటిపై ఉండదు. కాబట్టి ఈ నీరు ద్రవస్థితిలో ఉండటం వల్ల అందులోని జలచరాలు స్వేచ్ఛగా తిరగగలుగుతాయి. మంచు ఏర్పడిన చెరువు అడుగుభాగంలో ఉన్న కనీస ఉష్ణోగ్రత 4ైఇ లు, మంచు కింద ఉన్న కనీస ఉష్ణోగ్రత 0ైఇ లుగా ఉంటుంది. చలికాలంలో వాతావరణంలోని ఉష్ణోగ్రత 4ైఇ ల కంటే తక్కువగా తగ్గినప్పుడు వాహన రేడియేటర్లలోని నీరు అసంగత వ్యాకోచం వల్ల వ్యాకోచిస్తుంది. కాబట్టి వాహన రేడియేటర్లు పగిలిపోతాయి. కానీ ఈ ధర్మాన్ని తగ్గించడానికి నీటిలో ఇథైల్ గ్లైకాల్ అనే ద్రావణాన్ని నింపుతారు. చలి ప్రదేశాల్లో భూగర్భంలో ఉన్న మంచి నీటి పైపుల్లోని నీరు అసంగత వ్యాకోచం వల్ల వ్యాకోచిస్తుంది. కాబట్టి ఆ పైపులు పగిలిపోతాయి. అందువల్ల పైపుల ఆవలివైపున నలుపురంగుతో పూత పూస్తారు. ఈ నలుపురంగు పరిసరాల్లోని ఉష్ణాన్ని గ్రహించి నీటికి అందిస్తుంది. కాబట్టి నీటి ఉష్ణోగ్రత పెరగడం వల్ల దాని అసంగత వ్యాకోచం అనే ధర్మం తగ్గిపోతుంది. నీటి అసంగత వ్యాకోచం అనే ధర్మం ప్రకృతిలో శిలాశైథిల్యం జరగడానికి తోడ్పడుతుంది. నల్లరేగడి మట్టి ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. ఒకవేళ ఆ ప్రదేశంలో వాతావరణంలోని ఉష్ణోగ్రత 4ైఇ ల కంటే తగ్గినప్పుడు నీటి అసంగత వ్యాకోచం వల్ల ఆ నేల ఉపరితలంపై బీటలు ఏర్పడతాయి. వాయువుల వ్యాకోచం ఘన, ద్రవ పదార్థాలతో పోల్చితే వాయువుల వ్యాకోచం అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా అన్ని వాయువులు కూడా సమానంగా వ్యాకోచిస్తాయి. ఉదా: వేసవికాలంలో వాతావరణంలోని ఉష్ణోగ్రత పెరగడం వల్ల వాహన టైర్లలో గాలి వ్యాకోచించి పగిలిపోతాయి. ఒక వస్తువు కోల్పోయే లేదా గ్రహించే ఉష్ణరాశి వస్తువు స్వభావం, వస్తువు ఉపరితల వైశాల్యం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉపరితల వైశాల్యం పెరిగినట్లయితే ఆ వస్తువు గ్రహించే లేదా కోల్పోయే ఉష్ణరాశి ఎక్కువగా ఉంటుంది. ఉదా: ఒక కప్పులో నింపిన వేడిద్రవం ఉపరితల వైశాల్యం తక్కువగా ఉండటం వల్ల అది కోల్పోయే ఉష్ణరాశి కూడా తక్కువగా ఉండి, ఎక్కువ కాలంపాటు వేడిగా ఉంటుంది. కానీ ఈ ద్రవాన్ని సాసర్లో పోసినప్పుడు ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండి ఉష్ణాన్ని త్వరగా కోల్పోయి చల్లారుతుంది. -
ఫిజిక్స్
మొదటి ఉష్ణమాపకాన్ని కనుగొన్నవారు? ఉష్ణం ఉష్ణం ఒక శక్తి స్వరూపం. ఇది ఎల్లప్పుడూ ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువు నుంచి తక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువుకు ప్రయాణిస్తుంది. ప్రమాణాలు: ఎర్గ, జౌల్, క్యాలరీ ఒక వస్తువు ఉష్ణరాశిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని కెలోరిమెట్రీ అంటారు. ఒక వస్తువు లేదా వ్యవస్థ నుంచి వెలువడే ఉష్ణరాశిని కొలిచేందుకు బాంబ్ కెలోరి మీటర్ అనే సాధనాన్ని ఉపయోగిస్తారు. ఉష్ణ ప్రసారం ఉష్ణ ప్రసారం మూడు పద్ధతుల్లో జరుగుతుంది. ఉష్ణవహనం: ఒక పదార్థం లేదా వ్యవస్థలోని అణువుల స్థానాంతర చలనం లేకుండా ఉష్ణప్రసారం జరిగే పద్ధతిని ఉష్ణవహనం అంటారు. ఘన పదార్థాల్లో ఉష్ణ ప్రసారం.. ఉష్ణ వహన పద్ధతిలో జరుగుతుంది. ఉష్ణ సంవహనం: ఒక పదార్థం లేదా వ్యవస్థలోని అణువుల స్థానాంతర చలనం వల్ల ఉష్ణ ప్రసారం జరిగే పద్ధతిని ఉష్ణ సంవహనం అంటారు. అన్ని ద్రవ, వాయు పదార్థాల్లో(పాదరసంలో తప్ప) ఉష్ణ ప్రసారం ఉష్ణ సంవహన పద్ధతిలో జరుగుతుంది. అనువర్తనాలు: వెంటిలేటర్స, పొగ గొట్టాలు మొదలైనవి ఉష్ణ సంవహనం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. భూ పవనాలు, సముద్ర పవనాలు ఉష్ణ సంవహనం వల్ల ఏర్పడుతున్నాయి. ఉష్ణ వికిరణం: యానకంతో నిమిత్తం లేకుండా ఉష్ణం ఒక బిందువు నుంచి మరో బిందువునకు ప్రయాణించే పద్ధతిని ఉష్ణ వికిరణం అని పేర్కొంటారు. ఈ పద్ధతిలో ఉష్ణ ప్రసారం.. యానకంలో, ఎలాంటి యానకంలేని శూన్య ప్రదేశంలో కూడా జరుగుతుంది. ఉదా: సూర్యుడి నుంచి వెలువడిన కాంతి కిరణాలు మొదట శూన్యంలో ప్రయాణించి తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశించి భూమిని చేరతాయి. ఉష్ణ వహనం, ఉష్ణ సంవహనంలో ఉష్ణ ప్రసారం చాలా ఆలస్యంగా జరుగుతుంది. కానీ వికిరణ పద్ధతిలో కాంతి వేగానికి సమాన వేగంతో ఉష్ణ ప్రసారం జరుగుతుంది. అనువర్తనాలు: వేడి ద్రవాన్ని స్టీల్ స్పూన్తో కలియ బెట్టినప్పుడు కొంతసేపటి తర్వాత ఉష్ణ వహన పద్ధతి వల్ల ఆ స్పూన్ వేడెక్కుతుంది. భూమి వేడెక్కడం అనేది ఉష్ణ వికిరణం, ఉష్ణ సంవహనం, ఉష్ణ వహనం అనే మూడు పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఉష్ణోగ్రత ఒక వస్తువు చల్లదనం లేదా వెచ్చదనాన్ని.. అంటే ఆ వస్తువు ఉష్ణతీవ్రతను ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణోగ్రతను కొలవడానికి ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తారు. మొదటి ఉష్ణమాపకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త గెలీలియో. ఉష్ణమాపకంలో అథో స్థిర రీడింగ్ మంచు ఉష్ణోగ్రతను, ఊర్థ్వ స్థిర రీడింగ్ నీటి ఆవిరి ఉష్ణోగ్రతను తెలుపుతాయి. సాధారణంగా ఉష్ణోగ్రత మాపకాన్ని స్థూపాకారంలో నిర్మించడం వల్ల దాని సున్నితత్వం ఎక్కువగా ఉండి రీడింగ్లను కచ్చితంగా నమోదు చేస్తుంది. ఘన పదార్థ ఉష్ణోగ్రత మాపకాలు: ఘన పదార్థాలను వేడిచేసినప్పుడు అవి వ్యాకోచిస్తాయి అనే సూత్రం ఆధారంగా ఈ ఉష్ణోగ్రత మాపకాలు పనిచేస్తాయి. భిన్నమైన ఘన పదార్థాల ఉష్ణ వ్యాకోచాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఉష్ణోగ్రత మాపకాలను ఉపయోగించి వస్తువుల ఉష్ణోగ్రతను కచ్చితంగా కొలవడం వీలు కాదు. వాయు ఉష్ణోగ్రత మాపకాలు: ఘన, ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువుల ఉష్ణ వ్యాకోచం అనేక రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతను ఎక్కువ కచ్చితంగా కొలిచేందుకు వాయు ఉష్ణమాపకాన్ని ఉపయోగిస్తారు. వీటిలో ఏ వాయువునైనా ఉపయోగించవచ్చు. ఎందుకంటే అన్ని వాయువుల ఉష్ణ వ్యాకోచాలు సమానంగా ఉంటాయి. అయస్కాంత ఉష్ణోగ్రత మాపకం: దీన్ని ఉపయోగించి పరమ శూన్య ఉష్ణోగ్రత ్ర273నిఇ (ౌట) ’0’ జు ల వరకు కచ్చితంగా కొలవొచ్చు. దీనిలో ద్రవస్థితిలో ఉన్న ఏ్ఛ వాయువును ఉపయోగిస్తారు. ఉష్ణ విద్యుత్ ఉష్ణోగ్రత మాపకం: సీబెక్ ఫలితం ఆధారంగా పనిచేసే ఈ ఉష్ణోగ్రత మాపకాన్ని ఛ - ఆజీ పదార్థాలను ఉపయోగించి నిర్మిస్తారు. దీన్ని ఉపయోగించి క్రిమి కీటకాల ఉష్ణోగ్రతను 0.025నిఇ వరకు కచ్చితంగా కొలుస్తారు. బెక్మెన్స ఉష్ణోగ్రత మాపకం భిన్నమైన స్వభావాలను కలిగిన నీటి ఆవిరి ఉష్ణోగ్రతలను కొలవడానికి ఈ ఉష్ణోగ్రత మాపకాన్ని ఉపయోగిస్తారు. సిక్స్ గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రత మాపకం: దీనిలో పాదరసం (ఏజ)ను ఎక్కువ మోతాదులో, ఆల్కహాల్ను తక్కువ మోతాదులో నింపుతారు. ఈ ఉష్ణోగ్రత మాపకాన్ని ఉపయోగించి ఒక రోజులోని వాతావరణ గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలను కొలుస్తారు. బాతీస్కోప్: జలాంతర్గామిలో అమర్చే ఈ ఉష్ణోగ్రత మాపకాన్ని ఉపయోగించి సముద్రగర్భంలోని ఉష్ణోగ్రతలను కొలుస్తారు. నిరోధక ఉష్ణోగ్రత మాపకం: లోహాలను వేడి చేసినప్పుడు వాటి విద్యుత్ నిరోధం పెరుగుతుంది అనే సూత్రం ఆధారంగా ఈ ఉష్ణోగ్రత మాపకాలు పనిచేస్తాయి. అయితే వేర్వేరు లోహాల విద్యుత్ నిరోధకాలు వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల ఈ నిరోధక ఉష్ణోగ్రత మాపకాలను ఉపయోగించి ఉష్ణోగ్రతను కచ్చితంగా కొలవడం వీలుకాదు. ఇలాంటి ఉష్ణోగ్రత మాపకాలను ్క్టతో నిర్మిస్తారు. జ్వరమానిని: వైద్య రంగంలో రోగి శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగపడే ఈ ఉష్ణోగ్రత మాపకంలో కొలతలు 35 నుంచి 42నిఇ వరకు లేదా 95 నుంచి 105ఊ వరకు ఉంటాయి. దీన్ని శుభ్రపర్చేందుకు డెటాల్ను ఉపయోగిస్తారు. పైరోమీటర్: పరిశ్రమల్లోని బట్టీలు, కొలిమిల ఉష్ణోగ్రతలను 3000 నుంచి 3500నిఇల వరకు కొలవడానికి పైరోమీటర్ను ఉపయోగిస్తారు. ఆప్టికల్ పైరోమీటర్: సూర్యుడు, నక్షత్రాల్లోని అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఆప్టికల్ పైరోమీటర్ను వాడతారు. పైరోమీటర్, ఆప్టికల్ పైరోమీటర్లు... ఉష్ణవికిరణం అనే సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. కాబట్టి ఉష్ణోగ్రతలను కొలిచేటప్పుడు వేడి వస్తువులకు, ఈ ఉష్ణోగ్రత మాపకాలకు మధ్య ఎలాంటి భౌతికమైన స్పర్శ ఉండాల్సిన అవసరం లేదు. నక్షత్రాల నుంచి వెలువడే కాంతి, రంగు అనేవి ఆ నక్షత్రాల ఉష్ణోగ్రతలను తెలియజేస్తాయి. ద్రవ ఉష్ణోగ్రత మాపకాలు: ద్రవ పదార్థాలను వేడి చేసినప్పుడు వాటి ఘన పరిమాణం మారుతుంది అనే సూత్రం ఆధారంగా ద్రవ ఉష్ణోగ్రత మాపకాలు పనిచేస్తాయి. ఈ ద్రవ ఉష్ణోగ్రత మాపకాల్లో ఏ ద్రవాన్నైనా ఉపయోగించవచ్చు. కానీ ద్రవ ఉష్ణోగ్రత మాపకాల్లో నీటికి బదులుగా పాదరసాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే.. నీటి సంకోచ, వ్యాకోచాలు అసమానంగా ఉంటాయి. పాదరసం సంకోచం, వ్యాకోచాలు పరస్పరం సమానంగా ఉంటాయి. నీటి అణువులు పాత్ర గోడలకు అంటుకుంటాయి. పాదరసం... పాత్ర గోడలకు అంటుకోదు. నీటికి రంగు ఉండదు. కాబట్టి రీడింగులను కచ్చితంగా గుర్తించడానికి వీలుకాదు. స్వభావ రీత్యా పాదరసం వెండిలా మెరుస్తుంది. కాబట్టి దీన్ని క్విక్ సిల్వర్ అని కూడా అంటారు. -
ఫిజిక్స్
విద్యుత్ అర్ధవాహకాలు: సిలికాన్, జర్మేనియంతోపాటు గ్రాఫైట్, ఇండియా రబ్బరు మొదలైన అర్ధవాహక పదార్థాలను గది ఉష్ణోగ్రత కంటే వేడిచేస్తే వాటి విద్యుత్ నిరోధం తగ్గుతుంది. కాబట్టి ఆ పదార్థాల ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది. అర్ధవాహక పదార్థాలను గది ఉష్ణోగ్రత కంటే చల్లార్చితే వాటి విద్యుత్ నిరోధం పెరుగుతుంది. గ్రాఫైట్: ఇది కార్బన్ రూపాంతరాల్లో ఒకటి. ఈ పదార్థాలను బ్లాక్ లెడ్ అంటారు. పెన్సిల్ లెడ్ తయారీలో గ్రాఫైట్ను ఉపయోగిస్తారు. పెన్సిల్ లెడ్లో సీసం శాతం శూన్యం. గది ఉష్ణోగ్రత వద్ద గ్రాఫైట్ మంచి విద్యుత్ వాహకం. కాబట్టి దీన్ని లోహధర్మాలను ప్రదర్శించే అలోహం అంటారు. నిర్మాణం రీత్యా గ్రాఫైట్ వివిధ పొరలుగా ఉంటుంది. దీన్ని భారీ యంత్ర భాగాల మధ్య ఘర్షణను నివారించడానికి కందెనగా ఉపయోగిస్తారు. అణురియాక్టర్లలో గొలుసు చర్యను తగ్గించడానికి గ్రాఫైట్ను మితకారిగా ఉపయోగిస్తారు. గ్రాఫైట్ను నీటిలో కలిపి ద్రావణంగా మార్చినప్పుడు ఏర్పడిన పదార్థాన్ని ‘అక్వాడాగ్’ అని పిలుస్తారు. మాలిన్య పదార్థాల ప్రభావం: ఒక స్వచ్ఛమైన పదార్థంలో ఇతర పదార్థాలను కలిపినప్పుడు వాటి విద్యుత్ నిరోధంలో మార్పు కలుగుతుంది. ఉదాహరణ: స్వచ్ఛమైన నీటి విద్యుత్ నిరోధం ఎక్కువగా ఉంటుంది. దీనిలో కొంత ఉప్పును కలిపినప్పుడు విద్యుత్ నిరోధం తగ్గి మంచి విద్యుద్వాహకంగా మారుతుంది. ఆరోగ్యవంతుడైన మానవుడి శరీర విద్యుత్ నిరోధం... పొడిచర్మంలో 25,000 నుంచి 30,000 ఓమ్లు ఉంటుంది. తడి చర్మంలో కేవలం 10,000 ఓమ్ల విద్యుత్ నిరోధం మాత్రమే ఉంటుంది. విశిష్ట నిరోధం: ప్రమాణ పొడవు, ప్రమాణ అడ్డుకోత వైశాల్యం ఉన్న తీగ విద్యుత్ నిరోధాన్ని దాని విశిష్ట నిరోధం అంటారు. విశిష్ట నిరోధం కానీ, =1, ్చ=1 అయితే ప్రమాణాలు: ఓమ్ మీటర్ వేర్వేరు పదార్థాల స్వభావాలు భిన్నంగా ఉండడం వల్ల వాటి విశిష్ట నిరోధాలు వేర్వేరుగా ఉంటాయి. విద్యుచ్ఛాలక బలం: ఒక విద్యుత్ వలయంలో ఆవేశాలను ఒక బిందువు నుంచి మరో బిందువుకు కదిలించడానికి వాటిపై ఉపయోగించే శక్తిని విద్యుచ్ఛాలక బలం అంటారు. ప్రమాణం: వోల్ట్ విద్యుచ్ఛాలక బలాన్ని అందించే సాధనాలను విద్యుచ్ఛాలక ఘటాలు అంటారు. వీటిలో ముఖ్యమైనవి విద్యుత్ జనరేటర్, సైకిల్ డైనమో. అతివాహకత్వం: గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న లోహాలను చల్లార్చినప్పుడు ఏదో ఒక ఉష్ణోగ్రత వద్ద వాటి విద్యుత్ నిరోధం శూన్యంగా మారి వాటి ద్వారా అనంతమైన విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ ధర్మాన్ని అతివాహకత్వం అంటారు. ఉదాహరణ: గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పాదరసాన్ని -260ౌ సెంటిగ్రేడ్ వరకు చల్లార్చినప్పుడు అది వాహకత్వ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. అతివాహకత్వ ధర్మాన్ని క్రీ.శ. 1911లో కామర్లింగ్ ఓమ్స్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం వల్ల 1913లో అతడికి నోబెల్ బహుమతి లభించింది. గది ఉష్ణోగ్రత వద్ద పింగాణీ మంచి విద్యుత్ బంధక పదార్థం. కానీ దాన్ని అత్యధిక ఉష్ణోగ్రతకు వేడిచేస్తే అతివాహకత్వ ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. 1985లో ఈ ధర్మాన్ని కనుక్కొన్న అలెక్స్ముల్లార్, జార్జ బెడ్రాంజ్లకు 1987లో నోబెల్ బహుమతి లభించింది. విద్యుత్ బల్బులు: విద్యుత్ బల్బును థామస్ అల్వా ఎడిసన్ కనుక్కొన్నాడు. సాధారణంగా విద్యుత్ బల్బును గాజుతో నిర్మిస్తారు. దానిలో టంగ్స్టన్ తీగను ఫిలమెంట్గా అమరుస్తారు. టంగ్స్టన్ విద్యుత్ నిరోధం తక్కువగా, ద్రవీభవన స్థానం ఎక్కువగా ఉంటుంది. సుమారు 2400నిఇగా ఉంటుంది. బల్బులో ఆర్గాన్ అనే జడ వాయువును తక్కువ పీడనం వద్ద నింపుతారు. ఫిలమెంట్ ద్వారా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఫిలమెంట్ వేడెక్కుంది. తనలో నుంచి కాంతిని విడుదల చేస్తుంది. కాబట్టి ఫిల్మెంట్ బల్బుల్లో విద్యుత్ నష్టం ఎక్కువగా ఉంటుంది. కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్: దీన్ని ఎడ్వర్డ హామర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. దీనిలో తక్కువ మోతాదులో పాదరసాన్ని నింపుతారు. కాంపాక్ట్ ఫ్లొరోసెంట్ ల్యాంప్ తక్కువ వోల్టేజ్ నుంచి ఎక్కువ వోల్టే జ్కు అనేక శ్రేణుల్లో పనిచేస్తుంది. ఈ రకమైన ల్యాంప్ల్లో ఫిలమెంట్ లేకపోవడం వల్ల విద్యుత్ నష్టం తక్కువగా ఉంటుంది. ట్యూబ్ లైట్: గాజుతో తయారు చేసిన ట్యూబ్లైట్లో కావాల్సిన వాయువులను తక్కువ పీడనం వద్ద నింపుతారు. ట్యూబ్లైట్ 220 వోల్టుల వద్ద మాత్రమే వెలుగుతుంది. చాపం దీపాలు: చాపం దీపాలను సర్ హంపిడెవిస్ కనుక్కొన్నాడు. ఇతడు కార్బన్తో పనిచేసే చాపం దీపాన్ని ఆవిష్కరించాడు. అనంతరం వివిధ రకాలైన చాపం దీపాలను ఇతర శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అత్యంత తీవ్రత గల కాంతిని ఉత్పత్తి చేసేందుకు చాపం దీపాలను సినిమా ప్రొజెక్టర్లలో ఉపయోగిస్తారు. ప్రకటన దీపాలు: విమానాశ్రయంలో రన్వేకు ఇరువైపులా అమర్చే ప్రకటన దీపాల్లో నియాన్ అనే వాయువును తక్కువ పీడనం వద్ద నింపుతారు. ఈ నియాన్ బల్బుల నుంచి నారింజ రంగు కాంతి విడుదలవుతుంది. ఫ్లోరోసెంట్ ల్యాంప్: దీన్ని క్రీ.శ.1901లో పీటర్ కూపర్ హెవిట్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఆవిరి దీపాలు: ఆవిరి దీపాల్లో పాదరస ఆవిరిని తెలుపురంగు కాంతి కోసం, సోడియం ఆవిరిని లేత పసుపు రంగు కాంతి కోసం ఉపయోగిస్తారు. విద్యుత్ సాధనాలు విద్యుద్దర్శిని: ఒక తీగలో ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహ ఉనికిని తెలుసుకొనేందుకు విద్యుద్దర్శిని అనే సాధనాన్ని ఉపయోగిస్తారు. స్వర్ణ పలక విద్యుద్దర్శిని: ఈ విద్యుత్ సాధనాన్ని బెన్నెట్ అనే శాస్త్రవేత్త కనుక్కొన్నాడు. ఈ సాధనాన్ని ఉపయోగించి వస్తువు ఉపరితలంపై ఉన్న ఆవేశ స్వభావాన్ని తెలుసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ బాక్స్: ఈ సాధనాన్ని ఉపయోగించి టెలిఫోన్ తీగల్లోని విద్యుత్ నిరోధాలను కొలుస్తారు. ప్రస్తుతం దీన్ని ఉపయోగించడం లేదు. నిరోధాల పెట్టె: ఒక విద్యుత్ వలయంలోని విద్యుత్ నిరోధాలను ఒక ఓమ్, రెండు ఓమ్లుగా, మూడు ఓమ్లుగా పెంచడానికి దీన్ని ఉపయోగిస్తారు. అధిక నిరోధాల పెట్టె: ఈ విద్యుత్ సాధనాన్ని ఉపయోగించి ఒకేసారి కిలో ఓమ్ల విద్యుత్ నిరోధాన్ని పెంచవచ్చు. కదిలే తీగ చుట్ట గాల్వనో మీటర్: ఈ విద్యుత్ సాధనాన్ని ఉపయోగించి ఒక విద్యుత్ వలయంలోని విద్యుత్ ప్రవాహాన్ని 10-9 ఆంపియర్ల వరకు కొలవడమే కాకుండా విద్యుత్ ప్రవాహ దిశను తెలుసుకోవచ్చు. టాంజెంట్ గాల్వనో మీటర్: త్రికోణమితిలోని ఖ్చ్ఞీ అనే సూత్రం ఆధారంగా పనిచేసే ఈ విద్యుత్ సాధనాన్ని ఉపయోగించి విద్యుత్ ప్రవాహాన్ని 10-6 ఆంపియర్ల వరకు కచ్చితంగా కొలవచ్చు. అమ్మీటర్: ఈ విద్యుత్ సాధనాన్ని ఉపయోగించి విద్యుత్ వలయంలో ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహాన్ని మిల్లీ ఆంపియర్ల నుంచి 1, 2, 3 ఆంపియర్ల వరకు కొలవచ్చు. ఆదర్శ అమ్మీటర్ నిరోధం శూన్యం. వోల్ట్మీటర్: ఒక విద్యుత్ వలయంలో రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ తేడాను మిల్లీ వోల్ట్ల నుంచి కొన్ని వోల్ట్ల్లో అంటే 1గ, 2గ, 3గ.... వరకు కొలవడానికి ఉపయోగిస్తారు. ఆదర్శ వోల్ట్మీటర్ నిరోధం అనంతం. రియోస్టాట్: విద్యుత్ నిరోధాన్ని పెంచడం, తగ్గించడం, విద్యుత్ ప్రవాహాన్ని ఒక విలువ వద్ద స్థిరీకరించడానికి ఈ విద్యుత్ సాధనాన్ని ఉపయోగిస్తారు. కెపాసిటర్: తక్కువ వోల్టేజీ వద్ద ఎక్కువ ఆవేశాలను, విద్యుత్ శక్తిని తనలో నిలువ చేసుకొనే సాధనాన్ని కెపాసిటర్, కండెన్సర్ అంటారు. కెపాసిటర్ కెపాసిటీని ‘ఫారడే’ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. కెపాసిటర్ను అనేక విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగిస్తారు. ఉదాహరణ: ట్యూబ్లైట్, ఫ్యాన్, టీవీ, కంప్యూటర్ మొదలైనవి. కెపాసిటర్ ద్వారా ఏకాంతర విద్యుత్ మాత్రమే ప్రవహిస్తుంది. ఏకముఖ విద్యుత్ ప్రవహించదు. ట్రాన్సఫార్మర్: ఎక్కువ వోల్టేజ్ నుంచి తక్కువ వోల్టేజ్కు, తక్కువ వోల్టేజ్ నుంచి ఎక్కువ వోల్టేజ్కు విద్యుత్ను సరఫరా చేసేందుకు ట్రాన్సఫార్మర్ను ఉపయోగిస్తారు. ఇది అన్యోన్య ప్రేరణ, పరస్పర ప్రేరణ అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఈ సూత్రాన్ని ‘లెంజ్’ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. మొట్టమొదటి ట్రాన్సఫార్మర్ను ‘మైఖేల్ ఫారడే’ అనే శాస్త్రవేత్త నిర్మించాడు. ట్రాన్సఫార్మర్ల చట్రాన్ని మెత్తటి ఇనుము, మృదు ఇనుముతో నిర్మిస్తారు. ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు దీనిలో ద్రవస్థితిలోని హీలియం వాయువును నింపుతారు. ట్రాన్సఫార్మర్లను రెండు రకాలుగా వర్గీకరించొచ్చు. స్టెప్అప్ ట్రాన్సఫార్మర్: దీన్ని ఉపయోగించి తక్కువ వోల్టేజ్ నుంచి ఎక్కువ వోల్టేజ్కు విద్యుత్ను సరఫరా చేయొచ్చు. స్టెప్డౌన్ ట్రాన్సఫార్మర్: దీని ద్వారా ఎక్కువ వోల్టేజ్ నుంచి తక్కువ వోల్టేజ్కు విద్యుత్ను సరఫరా చేయొచ్చు. ట్రాన్స్ఫార్మర్ల ఉపయోగాలు: బెడ్ల్యాంప్స్, స్టెబిలైజర్స, టెలివిజన్, కం ప్యూటర్, పరిశ్రమలు మొదలైన వాటిలో ట్రాన్సఫార్మర్లను ఉపయోగిస్తారు. ట్రాన్సఫార్మర్ల ద్వారా ఏకాంతర విద్యుత్ ప్రవహిస్తే విద్యుత్ ప్రసార నష్టం తక్కువగా, ఏకముఖ విద్యుత్ ప్రవహిస్తే విద్యు త్ ప్రసార నష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో విద్యుత్ ప్రసా రం నష్టం 30 శాతం నుంచి 45 శాతం వరకు ఉంది. ఘటం: ఘటాన్ని ‘వోల్టా’ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఘటంలో రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. వోల్టా కనుగొన్న ఘటంలో రాగి ఫలకను అనోడ్గా, జింక్ ఫలకను కేథోడ్గా ఉపయోగిస్తారు. ఈ రెండు ధ్రువాల మధ్య సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని విద్యుత్ విశ్లేషక పదార్థంగా ఉపయోగిస్తారు. ఈ రసాయన పదార్థం జింక్ ఫలకతో రసాయనిక చర్యలో పాల్గొనప్పుడు ఏ+, టౌ4ృ అనే అయానులుగా విడిపోతుంది. ఈ అయానులు ఆయా ఎలక్ట్రాన్లను చేరినప్పుడు బాహ్యవలయంలో విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. ఈ ఘటం లో ఉపయోగించిన రసాయనిక పదార్థం వి ద్యుత్ విశ్లేషణం చెందడానికి కావాల్సిన నియమాలను మైఖేల్ ఫారడే ప్రతిపాదించాడు. నిర్జల ఘటంలో ఎలాంటి ద్రవ పదార్థాలు ఉండవు. అందువల్ల ఈ ఘటాన్ని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు. కాబట్టి నిర్జల ఘటాన్ని అనేక పరికరాల్లో ఉపయోగిస్తారు. గోడ గడియారాలు, టార్చలైట్, కెమెరా, చిన్న పిల్లలు ఆడుకొనే ఆటబొమ్మలు, రిమోట్ కార్డులు మొదలైన వాటిలో నిర్జల ఘటాలను ఉపయోగిస్తారు. చార్జబుల్ బ్యాటరీ: దీన్ని గ్లాంటే ప్లాస్టన్ అనే శాస్త్రవేత్త కనుక్కొన్నాడు. ఈ ఘటంలో విద్యుత్ శక్తి రసాయన శక్తిగా, రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఈ ఘటాల నిర్మాణంలో లిథియం, నికెల్, కోబాల్ట్ మొదలైన పదార్థాలను ఉపయోగిస్తారు. ఉపయోగాలు: 1. మొబైల్ ఫోన్లు 2. హ్యాండీ కెమెరాలు 3. కృత్రిమ ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకల్లో చార్జబుల్ బ్యాటరీలను ఉపయోగిస్తారు. స్టోరేజ్ బ్యాటరీ: దీన్ని థామస్ అల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త కనుక్కొన్నాడు. వీటిలో లెడ్ను ధన ధ్రువంగా, లెడ్ పెరాక్సైడ్ను రుణ ధ్రువంగా ఉపయోగిస్తారు. స్టోరేజ్ బ్యాటరీల్లో విద్యుత్ విశ్లేషక పదార్థంగా సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. ఈ ఘటాలను వాహనాల్లో వినియోగిస్తారు. మానవుడికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్న సజల సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని‘కింగ్ ఆఫ్ ది కెమికల్స్’గా వ్యవహరిస్తారు. -
ప్ర‘యోగం’ లేదు!
కర్నూలు(విద్య), న్యూస్లైన్: విద్యార్థులు సైన్స్ పేరు వింటేనే వణికిపోతున్నారు. జిల్లాలోని 600 పైగా ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ పరిజ్ఞానం లేకుండానే ఉన్నత చదువులకు వెళ్తున్నారు. టెక్ట్స్బుక్స్లో ఫలానా అంశంపై విద్యార్థులకు ప్రయోగం ద్వారా వివరించాలని స్పష్టంగా పేర్కొన్నా.. 90 శాతం పాఠశాలల్లో ఆ పరిస్థితి కరువైంది. పాఠశాల నిర్వహణకు విడుదలయ్యే స్కూల్గ్రాంట్ నిధుల నుంచి ప్రయోగశాలకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాల్సి ఉండగా.. చాలా పాఠశాలల్లో వాటి జోలికే వెళ్లడం లేదు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా ప్రయోగశాలల ద్వారా సైన్స్ సబ్జెక్టుపై అవగాహన పెంపొందించాల్సి ఉంది. ప్రధానంగా 8, 9, 10వ తరగతి విద్యార్థులకు వారానికి నాలుగు చొప్పున జీవ, రసాయనశాస్త్రాల్లో ప్రయోగ శిక్షణ తరగతులు నిర్వహించాలి. అయితే కొందరు ఉపాధ్యాయులు మాత్రమే అప్పుడప్పుడు పరికరాలను క్లాస్రూంలోకి తీసుకెళ్లి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఎంఎస్ఏ కింద 150 పాఠశాలల్లో ప్రయోగశాలల ఏర్పాటుకు 150 గదులు నిర్మించగా.. వీటిని తరగతి గదులుగా ఉపయోగించుకుంటూ ప్రయోగ పరికరాలను బీరువాలకు పరిమితం చేశారు. ప్రయోగశాలల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం, నిర్వహణ విషయంలో విద్యాశాఖాధికారులు శ్రద్ధ చూపకపోవడంతో విద్యార్థులకు ప్రాక్టికల్ విద్య అందని పరిస్థిథి నెలకొంది. గతంలో ప్రభుత్వం ఆయిల్ చార్ట్లను పంపేది. ప్రస్తుతం బడ్జెట్ను కేటాయించి చేతులు దులుపుకుంటుండటంతో ఉపాధ్యాయులు స్థానికంగా దొరికే నాణ్యతలేని చార్ట్లతో సరిపెడుతున్నారు. గాలిలో ధ్వని వేగం కనుక్కోవడం, ఎలక్ట్రికల్, మోటార్స్కు సంబంధించిన కొన్నింటిపై మాత్రమే విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. హీట్, మెల్ట్ చేయాలంటే గ్యాస్ తప్పనిసరి. కానీ గ్యాస్ సిస్టమ్ను హైస్కూల్స్లో ఏర్పాటు చేయకపోవడంతో రసాయనాల ద్వారా రంగుల మార్పుతో పాటు ఇతర ప్రయోగాలేవీ విద్యార్థులకు తెలుసుకునే వీలు లేకపోతోంది. మైక్రోస్కోప్లు, స్ప్రింగ్ త్రాసులు వంటివి పని చేయడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైస్కూళ్లలో విద్యార్థులు టెస్టు పుస్తకాలతో కుస్తీ పడటమే తప్పిస్తే ప్రయోగాలతో అవగాహన పెంపొందించుకునే భాగ్యానికి దూరమవుతున్నారు. భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాల్లో మారిన పాఠ్యాంశాల మేరకు కొత్త ప్రయోగ పరికరాలు లేకపోవడంతో పాత పాఠ్యాంశాల్లోని పరికరాలతోనే ప్రయోగ విద్యను ఉపాధ్యాయులు తూతూమంత్రంగా బోధిస్తున్నారు. కర్నూలు నగరంలో తొమ్మిది మున్సిపల్ ఉన్నత పాఠశాలలు ఉండగా ఎక్కడా ప్రయోగాలు చేయిస్తున్న దాఖలాల్లేవు. ఉపాధ్యాయులు అప్పుడప్పుడు పరికరాలను చేతబట్టుకుని చూపడంతో సరిపెడుతున్నారు. బండిమెట్ట పాఠశాలలో గదుల కొరతతో పరికరాలను అటకెక్కించారు. డోన్లోని నాలుగు జెడ్పీ హైస్కూళ్లలో ఎక్కడా ల్యాబ్ సౌకర్యమే లేదు. ఈ కారణంగా ప్రయోగ పరికరాలను బీరువాలకే పరిమితం చేశారు. గోనెగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రయోగశాలకు కేటాయించిన గదిని మధ్యాహ్న భోజన నిర్వహణకు అప్పగించారు. ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు, క్రిష్ణాపురం, ఓబుళంపల్లె పాఠశాలలో ప్రయోగ పరికరం ఊసే కరువైంది. ఆలమూరు, యల్లావత్తుల పాఠశాలల్లో పరికరాలు తుప్పు పట్టడడంతో బీరువాలో భద్రపరిచారు. కోవెలకుంట్లలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో గదులున్నా ప్రయోగ పరికరాలకు టేబుళ్లు లేని కారణంగా నిరుపయోగమయ్యాయి. -
నోబెల్ ఇండియా: సర్ సి.వి.రామన్ విజ్ఞాన కాంతిపుంజం
పురస్కారం: నోబెల్ పురస్కారం అందుకున్న భారతీయులలో రెండవ వారు సర్ చంద్రశేఖర వేంకట రామన్. సి.వి.రామన్ భౌతిక శాస్త్రంలో ‘కాంతి విక్షేపణము - రామన్ ఫలితం’ అనే అంశంపై విస్తృతంగా పరిశోధించారు. ఆ పరిశోధనలకు గాను 1930వ సంవత్సరపు నోబెల్ బహుమతిని అందుకున్నారు. భౌతిక విజ్ఞాన శాస్త్రంలో కాంతి (లైట్), శబ్దం (సౌండ్) విభాగాలలో వేంకట రామన్ ఎన్నో విజయవంతమైన ఆవిష్కరణలు చేశారు. ఆయా రంగాలలో 400కు పైగా పరిశోధన పత్రాలు, ఎనిమిది గ్రంథాలను ప్రచురించారు. రామన్ బాల్యం: చంద్రశేఖర వేంకట రామన్ తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో తిరువనైకోవిల్ గ్రామంలో 1888వ సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన జన్మించారు. రామన్ తండ్రి ఆర్. చంద్రశేఖర అయ్యర్ కళాశాల అధ్యాపకులు. గణిత, భౌతిక శాస్త్రాలు బోధించేవారు. తల్లి పార్వతి అమ్మాళ్ గృహిణి. ఈ దంపతుల రెండవ సంతానమే వేంకట రామన్. ఈయన చిన్నతనంలో చంద్రశేఖర అయ్యర్కు విశాఖపట్నం ఎ.వి.ఎన్. కళాశాలలో భౌతిక శాస్త్రాధ్యాపకునిగా ఉద్యోగం వచ్చింది. దాంతో ఆ కుటుంబం విశాఖపట్నానికి మారింది. వేంకట రామన్... విశాఖలోని సెయింట్ ఎలాషియస్ ఆంగ్లో ఇండియన్ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఆయన 12 సంవత్సరాలకే మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన ప్రతిభాశాలి. ఆ రోజుల్లో ఇలాంటి మేధావులకు ప్రభుత్వ ప్రోత్సాహం బాగా ఉండేది. సర్కారు ఖర్చుతో ఉన్నత విద్యాభ్యాసానికి ఇంగ్లండు పంపేవారు. సి.వి.రామన్కు ఆ అవకాశం వచ్చినప్పటికీ ఆరోగ్యకారణాల వల్ల వైద్యుల ఆమోదం లభించలేదు. ఆ కారణంగా ఆయన ఇంగ్లండ్కు వెళ్లలేకపోయారు. కాలేజీ చదువులకు మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చేరారు. రామన్ 1904లో బంగారు పతకంతో బీఏ పట్టా అందుకున్నారు. 1907లో భౌతిక శాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా సాధించారు. కాంతి విక్షేపణ, వివర్తనలపై రాసిన థీసిస్ 1906లో ప్రచురితమైంది. రామన్ ఉద్యోగ జీవితం: రామన్కు అసిస్టెంట్ అకౌంటెంట్గా కలకత్తాలో పోస్టింగ్ వచ్చింది. సర్కారు ఉద్యోగం చేస్తూనే రామన్ ఐఏసీఎస్ (ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్)లో చేరి భౌతిక శాస్త్రంలో ప్రయోగాలు చేశారు. ఏడాది తిరిగేసరికి (1917లో) కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ప్రొఫెసర్గా చేరారు. రామన్ 1921వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయం తరఫున ఇంగ్లండులోని ఆక్స్ఫర్డ్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన సముద్ర యానం చేశారు. ఆ ప్రయాణంలో ఓడ పైనుండి సముద్రాన్ని వీక్షించిన రామన్ మదిలో ఎన్నో సందేహాలు మొలకెత్తాయి. సముద్ర జలాలు ఆకుపచ్చ - నీలి రంగుతో ఎందుకు కనిపిస్తాయి? అనే సందేహం ప్రధానమైనది. కలకత్తాకు చేరగానే కాంతి వివర్తనం, విక్షేపాలపై ప్రయోగాలు ప్రారంభించారు. ఈ ప్రయోగాల ఫలితంగా రామన్ విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలోనే అత్యంత ప్రభావం కలిగిన ‘రామన్ ఫలితాన్ని’ కనుగొన్నారు. తన బలం... తెలిసిన క్షణం! రామన్కు తన పరిశోధనల విలువ తెలిసేలా, రామన్ ఫలితం గురించి ప్రపంచంలోని భౌతిక శాస్త్రజ్ఞులకు తెలిసేలా చేసిన సంఘటన క్రాంప్టన్కు నోబెల్ బహుమతి రావడమే. 1927లో కాంప్టన్కు నోబెల్ బహుమతి తెచ్చిన ప్రయోగంలో ‘ఎక్స్’ కిరణాలను పారదర్శకమైన యానకం గుండా పంపితే, కొన్ని కిరణాల తరంగ దైర్ఘ్యాలలో మార్పులు కలుగుతాయనీ, దీనినే కాంప్టన్ ఫలితం అంటారని కాంప్టన్ ప్రచురించాడు. వెంటనే రామన్ ఏకవర్ణ కాంతి తరంగాలతో (మెర్క్యూరీ ల్యాంప్ ఉపయోగించి) రామన్ ఫలితాన్ని, తరంగ దైర్ఘ్యంలో తగ్గుదల ఉన్న కాంతి కిరణాలను (వీటినే రామన్ లైన్స్ అంటారు) బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో జరిగిన శాస్త్రవేత్తల సెమినార్లో విజయవంతంగా ప్రయోగం చేసి ప్రదర్శించారు. ఫలితంగా డాక్టర్ చంద్రశేఖర వేంకట రామన్కు 1930వ సంవత్సరపు నోబెల్ బహుమతి ప్రకటించారు. నోబెల్ పురస్కారం లభించిన తర్వాత కూడా రామన్ శబ్ద తరంగాలపై పరిశోధనలను కొనసాగించారు. భారతీయ సంగీత వాద్యాలైన వయొలిన్, మృదంగం మొదలైన వాద్యాలలో శబ్ద తరంగాలు ఏ విధంగా శృతి పేయమైన శబ్దాలను ఉత్పాదిస్తాయో కనుగొని ఆ పరిశోధనలను ప్రచురించారు. భౌతిక, విజ్ఞాన శాస్త్రంలో రామన్ ప్రతిభకు తార్కాణంగా ప్రపంచంలోని ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు లభించాయి. భారత ప్రభుత్వం సి.వి.రామన్ ప్రతిభ, భారతదేశానికి పేరు తెచ్చిన ఆవిష్కరణలకు గుర్తింపుగా ఆయనను 1954లో ‘భారతరత్న’ బిరుదుతో సత్కరించింది. వైవాహిక జీవితం: రామన్ 1906లో అమ్మాళ్ను వివాహమాడారు. వీరికి చంద్రశేఖర్, రాధాకృష్ణన్ అనే ఇద్దరు కుమారులు. సి.వి.రామన్ తన జీవితమంతా భౌతిక శాస్త్ర పరిశోధనలకే అంకితమై, అంతిమ క్షణాల వరకూ భౌతికశాస్త్ర విషయాలతోనే గడిపారు. రామన్ ఎఫెక్ట్ అనువర్తనాలతో వెయ్యికి పైగా పరిశోధన వ్యాసాలు ప్రచురితమయ్యాయి. రామన్ వ్యక్తిత్వం! రామన్కు ‘భారతరత్న’ పురస్కారం లభించినప్పుడు, ఆ పురస్కారం అందుకోవటానికి ఢిల్లీకి రమ్మని స్వయంగా అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ నుంచి ఆహ్వానం వచ్చింది. అందుకు రామన్ రాసిన జవాబే ఆయన వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం. ‘‘మీరు నాపై చూపిన ఆదర సత్కారాలకు కృతజ్ఞుణ్ని. ప్రస్తుతం నేను నా విద్యార్థి ఒకరి పీహెచ్డీ పరిశోధన వ్యాసం పరిశీలనలో తుది దశలో ఉన్నాను. నా విద్యార్థి భవిష్యత్తు దృష్ట్యా ‘థీసిస్’ పని వాయిదా వేయలేను, క్షంతవ్యుడను’. ఈ ఉత్తరం సర్ రామన్కు తన కర్తవ్య ధర్మం పట్ల గల శ్రద్ధను తెలియపరుస్తుంది. 1943లో భారతీయ విజ్ఞాన సంస్థ (ఐఐఛి)లో రిటైర్ అయిన వెంటనే బెంగళూరులో రామన్ పరిశోధనా సంస్థను స్థాపించారు. ఆ సంస్థలోనే 1970, నవంబర్ 21వ తేదీన అంతిమ శ్వాస తీసుకున్నారు. డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యులు రామన్ ఎఫెక్ట్ మెర్క్యూరీ ల్యాంప్ నుండి ఏకవర్ణ కాంతి తరంగాలను ఒక పారదర్శక యానకం గుండా ప్రసరింపజేస్తే, యానక ధర్మాలపై ఆధారపడి ఆ కాంతిలో కొంత భాగం వివర్తనం చెంది, తక్కువ తరంగ ధైర్ఘ్యం గల కాంతిగా బహిర్గతమౌతుంది. సముద్ర జలంపై ఇదే ప్రక్రియతో నీలి రంగు కాంతి బహిర్గతమవుతుంది. దీనినే ‘రామన్ ఫలితం’ (రామన్ ఎఫెక్ట్) అంటారు. రామన్ ఫలితాన్ని ఉపయోగించి, యానక పదార్థం యొక్క నిర్మాణాన్ని విశ్లేషించవచ్చు. ఈ విధంగా ఎన్నో పదార్థాల స్ఫటిక నిర్మాణాలను అవగతం చేసుకోవటానికి రామన్ ఫలితం ఉపయోగపడింది. రామన్ ఫలితాన్ని మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 28, 1928వ తేదీన సి.వి.రామన్, కె.ఎస్.క్రిష్ణన్ల రీసెర్చి ఫలితంగా ప్రచురించారు. రామన్కు లభించిన గౌరవ పురస్కారాలు 1924 - రాయల్ సొసైటీ ఫెలోషిప్ ఊఖ 1929 - బ్రిటిష్ మహారాణి నుండి నైట్హుడ్, సర్ 1930 - నోబెల్ పురస్కారం 1941 - ఫ్రాంక్లిన్ పతకం 1954 - భారతరత్న 1957 - లెనిన్ శాంతి బహుమతి 1917 - ఐఅఇ గౌరవ కార్యదర్శి 1933 - 48 భారతీయ విజ్ఞాన సంస్థ ఐఐఛి బెంగళూరులో ప్రొఫెసర్, 1948లో ఐఐఛిడెరైక్టర్ రామన్ రాసిన గ్రంథాలలో కొన్ని 1. కాంతి వివర్తనము (scattering of light) 2. అకాస్టిక్ (Acoustic) నాద తరంగ శాస్త్రం 3. ఆప్టికా (Optica) దృగ్గోచర కాంతి శాస్త్రం 4. ఖనిజములు, వజ్రముల కాంతి ధర్మాలు 5. స్ఫటికముల భౌతిక విజ్ఞానం 6. పుష్పాల రంగుల - అవగాహన 7. వీణ, వయొలిన్, తబల, మృదంగం మొదలైన సంగీత వాద్యాలలో శబ్ద తరంగాలు. పత్రికలు ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ స్థాపన, సంపాదకత్వం ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్స్ అండ్ జర్నల్ ఆఫ్ ద ఇండియన్ అకాడెమీ ఆఫ్ సెన్సైస్ కరెంట్ సైన్స్ జర్నల్ ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఫలితం ఆవిష్కరణకు గుర్తుగా జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం (నేషనల్ సైన్స్ డే) జరుపుకుంటారు. తన లక్ష్యాన్ని, ధ్యేయాన్ని గుర్తించి వాటి సాధన కోసం శ్రద్ధగా పనిచేసిన ప్రతిభాశాలి సర్ చంద్రశేఖర వేంకట రామన్. -
జెస్ట్.. ఫిజిక్స్ రీసెర్చ్ కు బెస్ట్
జె.వి.చంద్రమోహన్,డైరెక్టర్, ఎరుడైట్ విద్యాసంస్థలు అర్హతలు.. పీహెచ్డీ ఫిజిక్స్: ఎంఎస్సీ ఫిజిక్స్ లేదా సంబంధిత విభాగాల్లో ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్. కొన్ని సంస్థల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు కూడా అర్హులే. బీఈ/బీటెక్/బీసీఏ/బీఎస్సీ విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ-పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పీహెచ్డీ థియొరెటికల్ కంప్యూటర్ సైన్స్: కంప్యూటర్ సైన్స్.. సంబంధిత అంశాల్లో ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత. పీహెచ్డీ న్యూరో సైన్స్: నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ (ఎన్బీఆర్సీ)లో ప్రవేశానికి కంప్యూటర్ సైన్స్లో బీఈ/బీటెక్/ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంటెక్- పీహెచ్డీ ప్రోగ్రామ్: హెచ్ఆర్ఐ, ఐఐఎస్ఈఆర్-పుణే, తిరువనంతపురం, ఐసీటీఎస్-టీఐఎఫ్ఆర్, ఐఐఎస్సీ-బెంగళూరు, ఎన్సీఆర్ఏ-టీఐఎఫ్ఆర్, టీఐఎఫ్ఆర్-టీసీఐఎస్, టీఐఎఫ్ఆర్, ఎస్ఎన్బీఎన్సీబీఎస్ల్లో ఫిజిక్స్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ- పీహెచ్డీ కోర్సుకు బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా ఎన్బీఆర్సీలో న్యూరోసైన్స్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ - పీహెచ్డీ కోర్సుకు బీఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్), బీఈ/బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణులు అర్హులు. ఎంపిక విధానం: జెస్ట్లో సాధించిన స్కోర్ ఆధారంగా సంబంధిత ఇన్స్టిట్యూట్లు అభ్యర్థులను ఆహ్వానిస్తాయి. ఆయా సంస్థలు సొంత ఎంపిక ప్రక్రియ ద్వారా (గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ) ప్రవేశం ఖరారు చేస్తాయి. పరీక్ష విధానమిదీ: ప్రవేశ పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటుంది. పరీక్ష రెండు విభాగాలుగా (మార్కులు 100) ఉంటుంది. మొదటి సెక్షన్లో 25 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 3 మార్కుల చొప్పున మొత్తం 75 మార్కులు. రెండో విభాగంలో 25 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం 25 మార్కులుంటాయి. 40 శాతం ప్రశ్నలను బీఎస్సీ (ఆనర్స్) నుంచి, 60 శాతం ప్రశ్నలను పీజీ (ఫిజిక్స్) సిలబస్ నుంచి ఇస్తారు. స్కాలర్షిప్స్: ఈ 27 పరిశోధన సంస్థల్లో ఎక్కడ చేరినప్పటికీ రీసెర్చ్ ఫెలోషిప్ లభిస్తుంది. దీంతోపాటు ఆయా సంస్థలకు సంబంధించిన ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ఉంటాయి. అవకాశాలు.. అపారం: ఈ సంస్థల్లో ఫిజిక్స్లో పీహెచ్డీ పూర్తి చేసినవారికి ఇస్రో, బార్క్, డీఆర్డీఓ, అణుశక్తి విభాగాలు, ఆర్ అండ్ డీ విభాగాల్లో శాస్త్రవేత్తలుగా అవకాశాలుంటాయి. దీంతోపాటు బోధన రంగం కూడా వీరికి ఆహ్వానం పలుకుతోంది. వివిధ కార్పొరేట్ కళాశాలల్లో.. ముఖ్యంగా ఇంటర్మీడియెట్ ఫిజిక్స్ బోధించేవారు నెలకు రూ.లక్షల్లోనే సంపాదిస్తున్నారు. వీటితోపాటు వివిధ రాష్ట్ర, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరొచ్చు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. దరఖాస్తు రుసుం రూ. 300 (ఎస్సీ/ఎస్టీలకు రూ. 150). రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం. ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 11, 2013 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 10, 2013 జెస్ట్ రాత పరీక్ష: ఫిబ్రవరి 16, 2014 వెబ్సైట్:www.jest.org.in ప్రవేశం కల్పిస్తున్న సంస్థలివే.. ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సెన్సైస్ - నైనిటాల్. వెబ్సైట్: www.aries.res.in. హోమీబాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ - ముంబై. వెబ్సైట్:www.hbni.ac.in. హరీష్-చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- అలహాబాద్. వెబ్సైట్:www.hri.res.in. ఐసీటీఎస్-టీఐఎఫ్ఆర్, బెంగళూరు. వెబ్సైట్:www.icts.res.in. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్- కల్పక్కం. వెబ్సైట్: ఠీఠీఠీ.జీజఛ్చిట.జౌఠి.జీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్- బెంగళూరు. వెబ్సైట్: www.igcar.gov.in ఐఐఎస్సీ-బెంగళూరు. వెబ్సైట్: www.iisc.ernet.in ఐఐఎస్ఈఆర్- మొహాలి, పుణే, తిరువనంతపురం. వెబ్సైట్: www.iisermohali.ac.in, www.iiserpune.ac.in, www.iisertvm.ac.in ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్- చెన్నై. వెబ్సైట్: www.imsc.res.in. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్- భువనేశ్వర్. వెబ్సైట్: www.iopb.res.in ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్-గాంధీనగర్. వెబ్సైట్: www.ipr.res.in. ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్- పుణే. వెబ్సైట్: www.iucaa.ernet.in. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్- బెంగళూరు. వెబ్సైట్: www.jncasr.ac.in. నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్-టీఐఎఫ్ఆర్ - పుణే. వెబ్సైట్:www.ncra.tifr.res.in. నైసర్- భువనేశ్వర్. వెబ్సైట్: www.niser.ac.in. ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ - అహ్మదాబాద్. వెబ్సైట్: www.prl.res.in రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ - ఇండోర్. వెబ్సైట్: ఠీఠీఠీ.టటఛ్చ్టి.జౌఠి.జీ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- బెంగళూరు. వెబ్సైట్:www.rrcat.gov.in సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్- కోల్కతా. వెబ్సైట్: www.rri.res.in సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సెన్సైస్ - కోల్కతా. వెబ్సైట్: www.bose.res.in టీఐఎఫ్ఆర్-టీసీఐఎస్- హైదరాబాద్. వెబ్సైట్: www.tifrh.res.in యూజీసీ-డీఏఈ సీఎస్ఆర్-ఇండోర్ వెబ్సైట్: www.csr.res.in వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్- కోల్కతా. వెబ్సైట్: www.vecc.gov.in ప్రిపరేషన్ ఇలా జెస్ట్ సిలబస్లో ప్రధానంగా క్లాసికల్ మెకానిక్స్, ఈఎం థియరీ అండ్ ఆప్టిక్స్, క్వాంటం మెకానిక్స్, థర్మో డైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ మెకానిక్స్, మ్యాథమెటికల్ మెథడ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ డేటా అండ్ ఎర్రర్ ఎనాలిసిస్, అడ్వాన్స్డ్ టాపిక్స్ (అటామిక్, మాలిక్యులర్, న్యూక్లియర్ ఫిజిక్స్ మొదలైనవి) ముఖ్యమైనవి. ముందుగా గతేడాది జెస్ట్ పేపర్ను విశ్లేషిస్తే ఎక్కువ శాతం ప్రశ్నలు మ్యాథమెటికల్ ఫిజిక్స్, క్లాసికల్ మెకానిక్స్, క్వాంటం మెకానిక్స్ అండ్ ఈఎం థియరీలపై ఇచ్చారు. మొత్తం 50 ప్రశ్నల్లో 37 ప్రశ్నలు ఈ నాలుగు చాప్టర్ల నుంచే అడిగారు. స్టాటిస్టికల్ మెకానిక్స్, థర్మో డైనమిక్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి ఆరు నుంచి ఎనిమిది ప్రశ్నలు వచ్చాయి. ఐదు నుంచి ఆరు ప్రశ్నలు అటామిక్ ఫిజిక్స్, ఆప్టిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్లపై ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. 2012 జెస్ట్లో మాత్రం ఎలక్ట్రానిక్స్, ఎక్స్పెరిమెంటల్ డేటా, ఎర్రర్ ఎనాలిసిస్ నుంచి నాలుగు నుంచి ఆరు ప్రశ్నలు ఉన్నాయి. ఎక్కువ శాతం ప్రశ్నలు 2013లో మాదిరిగానే మ్యాథమెటికల్ ఫిజిక్స్, క్లాసికల్ మెకానిక్స్, క్వాంటం మెకానిక్స్ అండ్ ఈఎం థియరీలపై అడిగారు. 2012, 2013 జెస్ట్ పాత ప్రశ్నపత్రాలను దృష్టిలో ఉంచుకుని 2014కు సిద్ధమవ్వాలి. వచ్చే జెస్ట్లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలంటే ప్రధానంగా ఐదింటిపై పట్టు సాధించాలి. అవి.. మ్యాథమెటికల్ ఫిజిక్స్ క్వాంటం మెకానిక్స్ క్లాసికల్ మెకానిక్స్ ఈఎం థియరీ స్టాటిస్టికల్ మెకానిక్స్ అండ్ థర్మో డైనమిక్స్ ఫిజిక్స్లో వివిధ విభాగాల్లో మ్యాథమెటికల్ మెథడ్స్పై 15 శాతం నుంచి 20 శాతం ప్రశ్నలడుగుతారు. ప్రాథమిక భావనలపై 10 నుంచి 15 శాతం ప్రశ్నలుంటాయి. కానీ గత ప్రశ్నపత్రాలను విశ్లేషించినప్పుడు ఎక్కువ శాతం ప్రశ్నలు అప్లికేషన్ ఓరియెంటెడ్ విధానంలో ఉన్నాయి. అంతేకాకుండా అభ్యర్థి విశ్లేషణాత్మక నైపుణ్యాలను, కాన్సెప్ట్లపై స్పష్టతను పరీక్షించేలా ప్రశ్నలడిగారు. కాబట్టి విద్యార్థులు ముందు ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్లను బాగా చదవాలి. ప్రామాణిక పాఠ్యపుస్తకాల్లో ప్రాథమిక భావనలను నేర్చుకుంటూ, వాటిని అప్లికేషన్ ఓరియెంటేషన్ విధానంలో ఎలా వాడాలో తెలుసుకోవాలి. వీటితోపాటు కాన్సెప్ట్లపై మరింత దృష్టిసారించాలి. అదేవిధంగా కొన్ని ప్రశ్నలు అభ్యర్థి ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ను తెలుసుకునేలా ఉంటాయి. ఉదా.. 1. A flat surface is covered with non overlapping disks of same size. What is the largest fraction of the area that can be covered? 2. There are on Average 20 buses per hour at a point, but at random times. The probability that there are no buses in five minutes is closed to? రిఫరెన్స్ బుక్స్: క్వాంటం మెకానిక్స్ - సకురాయ్, మెర్జ్బెకర్ ఈఎం థియరీ - జేడీ జాక్సన్, డీజే గ్రిఫిత్స్ స్టాటిస్టికల్ థర్మో డైనమిక్స్ - పాత్రియా, శాలినాస్ మ్యాథమెటికల్ మెథడ్స్ ఇన్ ఫిజిక్స్ - ఆర్ఫకెన్ అండ్ వెబర్, బోస్ క్లాసికల్ మెకానిక్స్ - గోల్డ్ స్టెయిన్, రానా అండ్ జోగ్ సీరియస్ రీసెర్చ్తోనే కెరీర్ ఫిజిక్స్లో పరిశోధన పరంగా కెరీర్కు పునాది వేసుకునేందుకు ‘జెస్ట్’ మంచి అవకాశం. అయితే సీరియస్గా దృష్టిసారించే విద్యార్థులు మాత్రమే ఈ మార్గం ఎంచుకోవాలని నా సూచన. జెస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల్లో పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీలలో ఫిజిక్స్లో సీటు పొందే అవకాశం ఉంది. ముందు నుంచీ దీనిపై అవగాహన పెంచుకుంటే లక్ష్యసాధన చాలా సులువు. సీటు సాధిస్తే ఫెలోషిప్ కూడా ఉంటుంది. జెస్ట్ ద్వారా ప్రవేశం కల్పించే పరిశోధన సంస్థలన్నీ అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నవే. వీటిల్లో విజయవంతంగా పీహెచ్డీ పూర్తిచేస్తే బయట మంచి అవకాశాలున్నాయి. కోర్సులో చేరిన మొదటిరోజు నుంచి సీరియస్గా పరిశోధనలపైనే దృష్టి కేంద్రీకరించాలి. బయో, నానో, ఆస్ట్రోఫిజిక్స్, రేడియోలజీ ఇలా ఎంచుకున్న ఏ విభాగమైనా పరిశోధనల్లో పట్టుసాధిస్తే దేశ, విదేశాల్లో అపారమైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్నాయి. ఏ కోర్సు చేసినా విద్యార్థుల పరిజ్ఞానం, దాన్ని క్షేత్రస్థాయిలో సద్వినియోగం చేయగల నేర్పు ఉన్నప్పుడు మాత్రమే అవకాశాలు తలుపు తడతాయి. దీనికోసం ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఆప్టిట్యూడ్ తరహాలో పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి క్లాసురూంలో పాఠాలు వినడంతోపాటు పాఠ్యపుస్తకాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తే సులువుగా విజయం సాధించొచ్చు. - ఆచార్య డాక్టర్ జి.ప్రసాద్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ భవిష్యత్తంతా ఫిజిక్స్దే సోలార్ ఎనర్జీపై ప్రయోగాలు చేయాలన్నది నా లక్ష్యం. ఇప్పటికే సూర్యశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కొత్త ఆవిష్కరణలు జరగాలి. దీనికి ఫిజిక్స్ ఒక్కటే మార్గం. మున్ముందు జరగబోయే ప్రయోగాలు, పరిశోధనలన్నీ భౌతికశాస్త్రంపైనే ఆధారపడి ఉన్నాయి. కొంచెం కష్టపడితే జెస్ట్లో ర్యాంకు సాధించవచ్చు. ఫిజిక్స్లో పరిశోధనలు చేసేందుకు జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్(జెస్ట్) ఉం టుందనే విషయం చాలా మందికి తెలియదు. దీని ద్వారా దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఫెలోషిప్ పొందే అవకాశం ఉంది. నా స్నేహితుడు బార్క్లో సీటు సంపాదించాడు. అదే స్ఫూర్తితో నేనూ జెస్ట్కు ప్రిపేరవుతున్నా. తప్పకుండా విజయం సాధిస్తాననే ఆత్మవిశ్వాసం ఉంది. -ఎన్.ఎం.ఎస్. కృష్ణకాంత్, ఎంఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి, ఓయూ, హైదరాబాద్. -
దైవకణ శోధకులకు నోబెల్
బ్రిటన్, బెల్జియం భౌతిక శాస్త్రవేత్తలకు అవార్డు స్టాక్హోం: విశ్వంలో అన్ని రకాల పదార్థాలకూ ద్రవ్యరాశిని సమకూరుస్తోందని భావిస్తున్న దైవకణం (హిగ్స్ బోసాన్)పై కీలక పరిశోధనలు చేసినందుకుగాను ఈ ఏడాది ఇద్దరు శాస్త్రవేత్తలను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. బ్రిటన్కు చెందిన పీటర్ హిగ్స్(84), బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఎంగ్లెర్ట్(80) ఈ ఏడాది భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారని మంగళవారం నోబెల్ జ్యూరీ ప్రకటించింది. దైవకణం ఉనికి గురించి సుమారు ఆరు దశాబ్దాలుగా సిద్ధాంతాలు, అంచనాలు ఉన్నప్పటికీ.. అది నిజంగా ఉనికిలో ఉన్నట్లు గతేడాదే లార్జ్ హ్యాడ్రన్ కొల్లాయిడర్ ప్రయోగం ద్వారా ‘సెర్న్’ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిశోధనకే ఈసారి భౌతికశాస్త్ర నోబెల్ వస్తుందన్న విశ్లేషకుల అంచనాలు నిజమయ్యాయి. ‘దైవకణాలు లేనిదే విశ్వంలో అణువులు, మనం కూడా లేం. విశ్వమంతా శూన్యంగా కనిపిస్తున్నప్పటికీ అందులో ఒక అదృశ్య క్షేత్రం ఆవరించి ఉంది. ఆ క్షేత్రంలో హిగ్స్బోసాన్లు ఉన్నందువల్లే అన్ని పదార్థాలకూ ద్రవ్యరాశి సమకూరుతోంది. ఈ దైవకణాల ఉనికిని కనుగొనే దిశగా వీరు చేసిన పరిశోధనలు కీలకంగా తోడ్పడ్డాయి’ అని నోబెల్ జ్యూరీ తన ప్రకటనలో పేర్కొంది. అత్యున్నతమైన ఈ అవార్డు తనకు దక్కడం పట్ల హిగ్స్ ఆనందం వ్యక్తంచేశారు. దైవకణ పరిశోధనకు ఈ అవార్డు దక్కడం వల్ల విశ్వానికి సంబంధించిన ప్రామాణిక అంశాలపై అవగాహన పెరుగుతుందన్నారు. మరో శాస్త్రవేత్త ఎంగ్లెర్ట్ కూడా నోబెల్ దక్కడంపై హర్షం వ్యక్తంచేశారు. వీరికి డిసెంబర్ 10న స్టాక్హోంలో బహుమతి ప్రదానం చేస్తారు. అవార్డు కింద ఇద్దరూ 8 మిలియన్ స్వీడిష్ క్రోనార్ల నగదు(రూ.7.73 కోట్లు)ను పంచుకోనున్నారు. పీటర్హిగ్స్ ఎడిన్బరో యూనివర్సిటీలో, ఎంగ్లెర్ట్ యూనివర్సైట్ లిబర్ డీ బ్రక్సెల్స్లో గౌరవ ప్రొఫెసర్లుగా ఉన్నారు. విశ్వంలో కణా లు ద్రవ్యరాశిని ఎలా పొందుతున్నాయన్న దానిపై వీరితోసహా ఆరుగురు శాస్త్రవేత్తలు 1964లో సిద్ధాంతం ప్రతిపాదించారు. హిగ్స్ బోసాన్ అంటే...: లియోన్ లాడర్మ్యాన్ అనే భౌతికశాస్త్రవేత్త 1993లో ‘ది గాడ్ పార్టికల్.. ఇఫ్ ది యూనివర్స్ ఈజ్ ద ఆన్సర్ వాటీజ్ ద క్వశ్చన్’ అనే పుస్తకంలో హిగ్స్ బోసాన్ పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు. ఇందులో హిగ్స్ అంటే విశ్వంలో అదృశ్యంగా ఉన్న క్షేత్రం కాగా, బోసాన్ అంటే అన్ని ప్రాథమిక కణాలకు ద్రవ్యరాశిని ఇచ్చే కణం. వీటిలో పీటర్ హిగ్స్ పేరు మీద హిగ్స్, కణభౌతిక శాస్త్రంలో కీలక ఆవిష్కరణలు చేసిన భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జ్ఞాపకార్థం బోసాన్ అనే పదాలను తీసుకున్నారు. -
నైపుణ్యాల పరీక్ష.. ఒలింపియాడ్స్
దేశంలోని ప్రీ యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థుల్లో బేసిక్ సెన్సైస్ పట్ల ఆసక్తిని పెంచడంతోపాటు.. ఆయా సబ్జెక్టుల్లో ప్రావీణ్యతను పరీక్షించేందుకు ఉద్దేశించినవి ఒలింపియాడ్స్. విద్యార్థుల్లో ఆయా సబ్జెక్ట్లలో అన్వయం, విశ్లేషణ, సునిశిత పరిశీలన, సృజనాత్మకత, నిర్ణయాత్మక సామర్థ్యం వంటి నైపుణ్యాలను పరీక్షించే లక్ష్యంతో ఒలింపియాడ్స్కు అంకురార్పణ జరిగింది. ఒలింపియాడ్స్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అంతర్జాతీయంగా ఆయా సబ్జెక్ట్లలో నిర్వహించే ఒలింపియాడ్స్కు హాజరుకావాలంటే మన దేశంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ), హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్బీసీఎస్ఈ) నిర్వహించే ఒలింపియాడ్స్లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. మొత్తం ఐదు దశలుగా ఒలింపియాడ్స్ను నిర్వహిస్తారు. అవి.. నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్, ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్, ఓరియెంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్, ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ (ప్రీ డిపార్చర్ కమ్ ట్రైనింగ్ క్యాంప్), ఇంటర్నేషనల్ ఒలింపియాడ్. ఐదు సబ్జెక్ట్లు: మొత్తం ఐదు సబ్జెక్ట్ల్లో ఒలింపియాడ్స్ను నిర్వహిస్తారు. అవి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్. ఇందులో మొదటి దశ నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ (ఎన్ఎస్ఈ)ను ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఐఏపీటీ) నిర్వహిస్తుంది. మిగతావిభాగాలను మాత్రం హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్బీసీఎస్ఈ) పర్యవేక్షిస్తుంది. ఎన్ఎస్ఈ ఇలా: సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ (ఎన్ఎస్ఈ)ను నిర్వహిస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ సబ్జెక్ట్లలో ప్రశ్నల క్లిష్టత సీబీఎస్ఈ 12వ తరగతి స్థాయిలో ఉంటుంది. సీబీఎస్ఈ పదో తరగతి సిలబస్ ఆధారంగా జూనియర్ ఒలింపియాడ్ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. ఫిజిక్స్ ప్రశ్నపత్రం మాత్రమే హిందీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో ఉంటుంది. అది కూడా 300 మంది విద్యార్థులు ఎంచుకుంటే మినహా మిగతా అన్ని సబ్జెక్ట్లకు ఇంగ్లిష్ భాషలోనే ఉంటుంది. 240 మార్కులు: జూనియర్ ఒలింపియాడ్తో సహా అన్ని విభాగాలకు ప్రశ్నపత్రం 240 మార్కులకు ఉంటుంది. సబ్జెక్ట్లను అనుసరించి పరీక్షా విధానం వేర్వేరుగా ఉంటుంది. ఫిజిక్స్ పేపర్ లో పార్ట్-ఏ, బీ రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏ కు 180 మార్కులు కేటాయించారు. పార్ట్-ఏ ను తిరిగి ఏ1, ఏ2గా విభజించారు. ఇందులో ఏ1లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఇవి సింగిల్ కరెక్ట్ ఆప్షన్ ప్రశ్నలు (మల్టిపుల్ చాయిస్). ఏ2లో 10 ప్రశ్నలు వస్తాయి. వీటికి ఇచ్చిన ఆప్షన్స్ల్లో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. ఇందులో సరైన సమాధానాలన్నిటినీ గుర్తించాలి. పార్ట్-బీలో 5-6 షార్ట్ ఆన్సర్ టైప్ కొశ్చన్స్/ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికి 60 మార్కులు కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ ఒలింపియాడ్ విభాగాలకు మాత్రం 80 ప్రశ్నలు ఇస్తారు. ఇవి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు. ఆస్ట్రానమీ విభాగంలో మాత్రం అధిక శాతం ప్రశ్నలు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నుంచి వస్తాయి. 20 శాతం ప్రశ్నలు బేసిక్ ఆస్ట్రానమీ నుంచి ఇస్తారు. జూనియర్ ఒలింపియాడ్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆయా సబ్జెక్ట్లకు సమ ప్రాధాన్యత ఉంటుంది. రెండో దశకు అర్హత సాధించే క్రమంలో సంబంధిత సబ్జెక్ట్లో ప్రతి విద్యార్థి 40 శాతం కనీసం స్కోర్ (మినిమమ్ అడ్మిసబుల్ స్కోర్) సాధించాలి. నమోదు ఇలా: మీరు చదివే స్కూల్/కాలేజీ ద్వారా నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ (ఎన్ఎస్ఈ)కు పేరును నమోదు చేసుకోవచ్చు. లేదా ఐఏపీటీ వెబ్సైట్లో ఎన్ఎస్ఈ పరీక్షా కేంద్రాలు, సంప్రదించాల్సిన అధికారుల సమాచారం అందుబాటులో ఉంది. తద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు. నేషనల్స్: నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్లో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను తర్వాతి దశ ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్స్ (ఐఎన్ఓఎస్)కు ఎంపిక చేస్తారు. వీటిని ఆయా సబ్జెక్ట్లను అనుసరించి ఇండియన్ నేషనల్ ఫిజిక్స్/కెమిస్ట్రీ/ బయాలజీ/ ఆస్ట్రానమీ/ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్గా వ్యవహరిస్తారు. ప్రతి సబ్జెక్ట్ నుంచి 300 మందికి రెండో దశలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ఏదైనా ఒక సబ్జెక్ట్లో రాష్ట్రం/ కేంద్ర పాలిత ప్రాంతానికి కేటాయించిన పరీక్షా కేంద్రాలు, ఆ సబ్జెక్ట్లో దేశ వ్యాప్తంగా హాజరైన విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రెండో దశకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో అన్ని విభాగాలకు సంబంధించి 309 మంది మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ల వారీగా: ఫిజిక్స్-49; కెమిస్ట్రీ-55; బయాలజీ-11; ఆస్ట్రానమీ-72; జూనియర్ సైన్స్- 122; మొదటి దశలో అనుసరించిన సిలబస్నే ఈదశలోనూ వినియోగిస్తారు. ప్రశ్నలు నాన్-కన్వెన్షన్ పద్ధతిలో ఉంటాయి. ప్రశ్నల క్లిష్టత అంతర్జాతీయ ఒలింపియాడ్ స్థాయిలో ఉంటుంది. బయాలజీ మినహా మిగతా విభాగాల్లో సమాధానాలను గుర్తించడానికి కేటాయించిన సమయం మూడు గంటలు. బయాలజీకి మాత్రం రెండు గంట ల్లోనే జవాబులను గుర్తించాలి. సైద్ధాంతిక + ప్రయోగాత్మక: ఇంటర్నేషనల్ ఒలింపియాడ్కు హాజరయ్యే క్రమంలో ఈ మూడో దశ.. ఓరియెంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ (ఓసీఎస్సీ)ను కీలకమైందిగా భావించవచ్చు. రెండో దశ ఐఎన్ఓఎస్లో చూపిన ప్రతిభ ఆధారంగా మూడో దశకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో ప్రతి సబ్జెక్ట్ నుంచి 35 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. జూనియర్ సైన్స్ విభాగం నుంచి 45 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఓసీఎస్సీకి ఎంపికైన విద్యార్థులకు హెచ్బీసీఎస్ఈలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య రెండు నుంచి నాలుగు వారాల పాటు ఓరియెంటేషన్ క్యాంప్ ఉంటుంది. ఇందులో విద్యార్థులకు తమ సబ్జెక్టుల్లో సైద్ధాంతిక, ప్రయోగాత్మక శిక్షణనిస్తారు. వివిధ ప్రయోగాలను సొంతంగా చేసే అవకాశం కల్పిస్తారు. సంబంధిత సబ్జెక్టుల్లో ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి తర్వాత దశకు అర్హత కల్పిస్తారు. సైద్ధాంతిక, ప్రయోగాత్మక అనే రెండు నైపుణ్యాలాధారంగా విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తారు. ఇందులో సైద్ధాంతిక నైపుణ్యానికి 60 శాతం, ప్రయోగాత్మక నైపుణ్యానికి 40 శాతం వెయిటేజీ ఉంటుంది. ఈ మెరిట్ ఆధారంగా ఫిజిక్స్, ఆస్ట్రానమీ నుంచి ఐదుగురు చొప్పున, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి నలుగురు చొప్పున, జూనియర్ సైన్స్ నుంచి 12 మంది విద్యార్థులను తర్వాత దశకు ఎంపిక చేస్తారు. వీరికి పుస్తకాలు, క్యాష్ రూపంలో రూ.5 వేల మెరిట్ అవార్డులు ఇస్తారు. అంతేకాకుండా వీరికి ఆయా సబ్జెక్టుల్లో భారత్ తరపున అంతర్జాతీయ ఒలింపియాడ్స్లో పాల్గొనే అవకాశం లిభిస్తుంది. వీరికేకాకుండా థియరీ, ఎక్స్పెరిమెంటల్ పరంగా ప్రతిభ చూపిన ఇతర విద్యార్థులకు బహుమతులను కూడా అందజేస్తారు. ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్: అంతర్జాతీయ ఒలింపియాడ్స్కు ఎంపికైన విద్యార్థుల శిక్షణకు ఉద్దేశించిన దశ.. ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్. ఈ దశలో అంతర్జాతీయ ఒలింపియాడ్స్కు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు హెచ్బీసీఎస్ఈలో శిక్షణనిస్తారు. ఇందులో హెచ్బీసీఎస్ఈ ఫ్యాకల్టీ, శాస్త్రవేత్తలతోపాటు ఆయా సబ్జెక్టులకు సంబంధించి ప్రముఖ సంస్థల డెరైక్టర్లు, నిపుణులు కూడా పాల్గొంటారు. ఇందుకోసం ప్రత్యేక ల్యాబొరేటరీలను కూడా ఏర్పాటు చేస్తారు. కెమిస్ట్రీ, బయాలజీకి రెండు వారాలపాటు, ఫిజిక్స్కు రెండు వారాల కంటే ఎక్కువ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్ విభాగాలకు వారం రోజులు శిక్షణనిస్తారు. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్: అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల విద్యార్థుల ముందు తమ ప్రతిభాపాటవాలను నిరూపించుకోవడానికి భారతీయ విద్యార్థులకు ఇది చక్కని అవకాశం. విద్యార్థులతోపాటు ఒలింపియాడ్స్కు వెళ్లే టీమ్లో మార్గదర్శకం చేయడానికి ఉపాధ్యాయులు, సైంటిఫిక్ అబ్జర్వర్ ఉంటారు. ఫిజిక్స్, ఆస్ట్రానమీలలో ప్రతి జట్టు నుంచి ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, సైంటిఫిక్ అబ్జర్వర్ ఉంటారు. బయాలజీ, కెమిస్ట్రీ ప్రతి జట్టు నుంచి నలుగురు విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, సైంటిఫిక్ అబ్జర్వర్ ఉంటారు. జూనియర్ సైన్స్ విభాగంలో 12 మంది విద్యార్థులు (6 గురు చొప్పున రెండు జట్లు), ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఒలింపియాడ్స్ను రెండు రోజులపాటు నిర్వహిస్తారు. మొదటి రోజు థియరటికల్ ప్రాబ్లమ్స్, రెండో రోజు ఎక్స్పెరిమెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సమాధానాల కోసం ఐదు గంటల సమయం కేటాయిస్తారు. కెమిస్ట్రీ ఒలింపియాడ్ కూడా థియరటికల్, ఎక్స్పెరిమెంటల్ ప్రశ్నల కలయికగా రెండు రోజుల పాటు ఉంటుంది. ఆస్ట్రానమీలో మాత్రం నాలుగు విభాగాలు ఉంటాయి. అవి.. థియరటికల్ ఎగ్జామ్ (15 స్వల్ప సమాధాన ప్రశ్నలు, 2-3 దీర్ఘ సమాధాన ప్రశ్నలు, సమయం ఐదు గంటలు), డేటా అనాలిసిస్ ఎగ్జామ్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించాలి, సమయం నాలుగు గంటలు), అబ్జర్వేషనల్ ఎగ్జామ్ (ఆకాశం/ప్లానిటోరియంలో.. నక్షత్రాలు, వివిధ అంశాలను పరిశీలిస్తూ సమాధానం ఇవ్వడం తరహా), టీమ్ కాంపిటీషన్. జూనియర్ సైన్స్ ఒలింపియాడ్లో మూడు విభాగాలు ఉంటాయి. అవి.. టెక్ట్స్ ఎగ్జామ్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్ట్ల నుంచి 10 ప్రశ్నల చొప్పున మొత్తం 30 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి, సమయం మూడు గంటలు), థియరటికల్ ఎగ్జామ్ (సమయం మూడు గంటలు), ఎక్స్పెరిమెంటల్ ఎగ్జామినేషన్ (సమయం మూడు గంటలు). మన రాష్ట్రం నుంచే అత్యధిక మంది మన రాష్ట్రం నుంచి దాదాపు 24,000 మంది విద్యార్థులు ఈ ఒలింపియాడ్స్కు హాజరవుతున్నారు. జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ పరీక్షను దాదాపు 10 వేల మంది విద్యార్థులు రాస్తున్నారు. దేశం మొత్తం మీద మన రాష్ట్రం నుంచే అత్యధిక మంది విద్యార్థులు ఈ ఒలింపియాడ్స్కు హాజరువుతున్నారు. ఇందుకోసం 2012-13 విద్యా సంవత్సరంలో 351 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక విద్యార్థి సంబంధిత సబ్జెక్ట్లో తన అవగాహన స్థాయిని తెలుసుకోవడంతోపాటు జాతీయ స్థాయిలో ప్రతిభను అంచనా వేసుకోవడానికి ఉపకరిస్తాయి. ఇందులో ప్రశ్నలు అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. ఒక సమస్యకు సంబంధించి సూత్రాన్ని గుర్తుతెచ్చుకోవడానికి జ్ఞాపక శక్తి సరిపోతుంది. కానీ దాన్ని సమస్యకు అన్వయించి, సాధించడానికి మాత్రం మూల భావనలపై పట్టు అవసరం. ఇదే అంశం ఆధారంగా ఒలింపియాడ్స్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక రకంగా జ్ఞాపక శక్తి కంటే నైపుణ్యాలను ఒలింపియాడ్స్లో పరీక్షిస్తారు. వివిధ రకాల ప్రయోగాలతో సైన్స్ను ఒక కొత్త కోణంలో, ఆసక్తికరంగా నేర్చుకునే విధంగా హెచ్బీసీఎస్ శిక్షణ ఉంటుంది. సునిశిత పరిశీలన, ప్రయోగాత్మకంగా, అనువర్తనం వంటి స్కిల్స్ పెంపొందించేలా ఈ శిక్షణ ఉంటుంది. ఆ సబ్జెక్ట్కు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక బెంచ్మార్క్ ఎగ్జామ్గా ఒలింపియాడ్స్ను పరిగణించవచ్చు. -ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ, ప్రొఫెసర్ ఇన్చార్జ్ నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్, ఆంధ్రప్రదేశ్. ఎన్ఎస్ఈ అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ: 12వ తరగతి/ దిగువ తరగతులు చదువుతుండాలి. వయసు: 1994 జూలై 1న లేదా తర్వాత జన్మించి ఉండాలి (ఆస్ట్రానమీ విద్యార్థులకు వయసు: 1995, జనవరి 1న లేదా తర్వాత జన్మించి ఉండాలి). జూనియర్ సైన్స్: పదో తరగతి/దిగువ తరగతి వయసు: 1999,జనవరి 1న/తర్వాత జన్మించినవారు షెడ్యూల్: నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్: నవంబర్ 24, 2013. ఎన్రోల్మెంట్కు చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2013. నేషనల్ ఒలింపియాడ్స్: ఫిబ్రవరి 1-2, 2014. ఫలితాల వె ల్లడి: మార్చి 1, 2014 ఓసీఎస్సీ షెడ్యూల్: ఏప్రిల్-జూన్, 2014. వివరాలకు:www.olympiads.hbcse.tifr.res.in, www.iapt.org.in రిఫరెన్స్ బుక్స్ Indian National Physics Olympiad Theory Problems and Solutions (2006 - 2009) Biological Sciences D.J. Taylor, N.P.O. Green and G.W. Stout. Principles of Bio-chemistry A.L. Lehninger, D.L.Nelson and M.M.Cox The Nature of Life John Postlethwait and Janet Hopson Textbooks of Physics and Mathematics by NCERT, upto Class XII. Concepts of Physics H.C.Verma Astronomy: Principles and Practice M.N. Roy and R.C. Clark Indian National Chemistry Olympiad Theory Examination Papers (2002 - 2007), Savita Ladage and Swapna Narvekar. Challenge and Thrill of PreCollege Mathematics Author: V Krishnamurthy, C R Pranesachar, K.N. Ranganathan, and B J Venkatachala. Experimental Problems in Chemistry, Savita Ladage, Swapna Narvekar and Indrani Sen. అవార్డులు ప్రతి సెంటర్లో టాప్ 10 శాతం మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తారు. ప్రతి రాష్ట్రం/సబ్జెక్ట్ నుంచి టాప్ ఒక శాతం మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తారు. ప్రతి సబ్జెక్ట్లో జాతీయ స్థాయిలో టాప్ ఒక శాతంలో ఉన్న విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లతోపాటు బహుమతులను కూడా ప్రదానం చేస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్లో టాప్ 35లో నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు. ఐదు సబ్జెక్ట్లు.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, జూనియర్ సైన్స్లలో ఐదు దశలుగా ఒలింపియాడ్స్ను నిర్వహిస్తారు. అవి.. నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్(240మార్కులు) ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్స్ ఓరియెంటేషన్ కమ్ సెలక్షన్ క్యాంప్ ట్రైనింగ్ ఇండియన్ టీమ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ -
ఫిజిక్స్
గ్రహాలు గురుత్వత్వరణం: ఒక స్వేచ్ఛాయుత వస్తువుకు భూమి గురుత్వాకర్షణ బలం వల్ల కలిగిన త్వరణాన్ని భూమి గురుత్వత్వరణం అంటారు. దీని సగటు విలువ g = 9.8 m/s2 స్వేచ్ఛగా కిందికి పడుతున్న వస్తువు వేగం పెరగడం వల్ల దానికి ధన త్వరణం ఉంటుంది. ఈ సందర్భంలో భూమి గురుత్వత్వరణ విలువను ధనాత్మకంగా (+g) గా తీసుకుంటారు. నిట్టనిలువుగా పైకి విసిరిన వస్తువు వేగం క్రమంగా తగ్గడం వల్ల దానికి రుణ త్వరణం ఉంటుంది. ఈ సందర్భంలో భూమి త్వరణాన్ని -జ గా తీసుకుంటారు. I. భూమి ఆకారాన్ని బట్టి గురుత్వత్వరణ విలువలో మార్పు: భూమిపై ఏదైనా ఒక ప్రదేశం వద్ద గురుత్వ త్వరణం విలువ G = విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం M= భూమి ద్రవ్యరాశి R= భూమి వ్యాసార్ధం (లేదా) భూమి తనచుట్టూ తాను పరిభ్రమించడం వల్ల ధ్రువాల వద్ద వాలుగా ఉండి భూమి వ్యాసార్ధం తక్కువగా ఉంటుంది. అందు వల్ల అక్కడ భూమి గురుత్వత్వరణ విలువ ఎక్కువ. ఈ కారణం వల్ల ఏదైనా వస్తువు భారం (W = mg) ధ్రువాల వద్ద ఎక్కువ. భూమధ్యరేఖ వద్ద భూమి ఉబ్బెత్తుగా ఉంటుంది. దాని వ్యాసార్ధం పెరగడం వల్ల గురుత్వత్వరణ విలువ తక్కువగా ఉంటుంది. అందువల్ల భూమధ్యరేఖ వద్ద వస్తువు భారం కూడా తక్కువ. II. భూమి ఉపరితలం నుంచి వస్తువు పొందిన ఎత్తుతో పాటు భూమి గురుత్వత్వరణ విలువలో మార్పు: ఒక వస్తువును భూమి ఉపరితలం నుంచి కొంత ఎత్తుకు తీసుకొని వెళ్లినప్పుడు దానిపై ఉన్న గురుత్వత్వరణం కాబట్టి భూమి ఉపరితలం నుంచి వస్తువు పొందిన ఎత్తు పెరిగితే, దాని గురుత్వ త్వరణం విలువ తగ్గుతుంది. భూమి వ్యాసార్ధంలో సగం విలువకు సమానమైన ఎత్తుకు ఒక వస్తువును తీసుకెళ్లినప్పుడు శూన్యం కాబట్టి శూన్యంలో ఒక వస్తువు భారం దీన్ని భారరహిత స్థితి అని అంటారు. విశ్వాంతరాళంలోకి వెళ్లిన ఏ వస్తువు భారమైనా శూన్యం అవుతుంది. III. భూమి ఉపరితలం నుంచి వస్తువు వెళ్లిన లోతును బట్టి గురుత్వత్వరణ విలువలో మార్పు: ఒక వస్తువును భూమి ఉపరితలం నుంచి కొంత లోతుకు తీసుకెళ్లినప్పుడు అక్కడి గురుత్వ త్వరణం d = వెళ్లిన లోతు వస్తువు వెళ్లిన లోతు పెరిగితే దాని గురుత్వత్వరణ విలువ తగ్గుతుంది. ఒకవేళ వస్తువును భూమి ఉపరితలం నుంచి దాని కేంద్రం వద్దకు తీసుకెళ్లినప్పుడు అది వెళ్లిన లోతు... భూమి వ్యాసార్ధానికి సమానంగా ఉంటుంది. అంటే d=R, కాబట్టి కాబట్టి వస్తువు భారం భూమి కేంద్రం వద్ద వస్తువు భారరహిత స్థితిని పొందుతుంది. ఒక లఘు లోలకాన్ని భూమి కేంద్రం వద్దకు (లేదా) విశ్వాంతరాళంలోకి తీసుకెళ్లినప్పుడు దాని ఆవర్తన కాలం కానీ ఇక్కడ g=0 (అనంతం) లఘులోలకం పౌనఃపున్యం అక్షాంశాలు, స్థానిక పరిస్థితులను బట్టి భూమి గురుత్వత్వరణ విలువలో మార్పు వస్తుంది. చంద్రుడిపై గురుత్వత్వరణ విలువ... భూమి గురుత్వత్వరణ విలువలో ఆరో వంతు(g/6) మాత్రమే ఉంటుంది. కాబట్టి వస్తువు భారం అనేది 6వ వంతు మాత్రమే ఉంటుంది. భూమిపై వస్తువు భారం కానీ చంద్రుడిపై ఒక ప్రదేశంలో భూమి గురుత్వత్వరణాన్ని కనుక్కోవడానికి లఘులోలకం, ఎట్వినాస్ బ్యాలెన్స అనే సాధనాలను ఉపయోగిస్తారు. గురుత్వత్వరణ విలువలు సమానంగా ఉన్న ప్రాంతాలను ప్రపంచపటంలో ఊహాత్మక రేఖలతో కలిపారు. వీటిని ఐసోగ్రామ్లు అంటారు. ఒక్క వస్తువు భూమి ఆకర్షణ పరిధిని దాటి శాశ్వతంగా విశ్వాంతరాళంలోకి వెళ్లడానికి కావల్సిన కనీస వేగాన్ని పలాయన వేగం అని అంటారు. పలాయన వేగం లేదా కానీ భూమి వ్యాసార్ధం R= 6400km g= 9.8m/s2 భూమి ద్రవ్యరాశి m= 6×1024kg ఈ విలువలను పై సమీకరణాల్లో రాస్తే... ఇంతటి వేగాన్ని రాకెట్లు, ఉపగ్రహాలు మాత్రమే సమకూర్చుతాయి. రాకెట్ ద్రవ్యరాశి, ఉపగ్రహం ద్రవ్యరాశి, రాకెట్ ప్రయోగ కోణంపై పలాయన వేగం ఆధారపడి ఉండదు. కక్ష్యావేగం: ఒక వస్తువు భూమి చుట్టూ నిర్దిష్ట కక్ష్యలో పరిభ్రమించేందుకు కావాల్సిన కనీస వేగాన్ని కక్ష్యావేగం అని అంటారు. లేదా అన్ని భౌతిక రాశుల విలువలను పై సమీకరణంలో రాస్తే... (భూమి విషయంలో) ఉపగ్రహాలు: విశ్వంలో పెద్ద వస్తువుల చుట్టూ పరిభ్రమిస్తున్న వస్తువులను ఉపగ్రహాలు అని అంటారు. వీటిని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 1. సహజ ఉపగ్రహాలు: ఉదాహరణ: చంద్రుడు సౌరకుటుంబంలో ఇప్పటివరకూ కనుగొ న్న సహజ ఉపగ్రహాల్లో గనిమెడా అనేది అతిపెద్ద ఉపగ్రహం. ఇది బృహస్పతి (గురు) గ్రహానికి ఉపగ్రహం. 2. కృత్రిమ ఉపగ్రహాలు: మానవుడు రాకెట్ల సహాయంతో అంతరి క్షంలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలు అంటారు. ఉదా: మనదేశం ప్రయోగించిన కొన్ని ముఖ్య కృత్రిమ ఉపగ్రహాలు 1. ఆర్యభట్ట 2. భాస్కర-1 3. భాస్కర-2 4. ఐఆర్ఎస్ 5. ఇన్శాట్ ఒక ఉపగ్రహాన్ని భూమి ఉపరితలం నుంచి 36,000 కిలోమీటర్ల కక్ష్యలో ప్రయోగిస్తే... అది భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం 24 గంట లు (లేదా) ఒక రోజు. ఈ ఉప గ్రహాన్ని క మ్యూనికేషన్ల ఉపగ్రహం (లేదా) పార్కింగ్ ఉపగ్రహం అంటారు. భూమి కేంద్రం నుంచి భూస్థిర ఉపగ్రహం ఎత్తు ఉదా: మనదేశం ప్రయోగిస్తున్న ఇన్శాట్ శ్రేణి ఉపగ్రహాలన్నీ భూస్థిర ఉపగ్రహాలే. వీటి సేవలను టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారాలు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్రసారం మొదలైన వాటికోసం ఉపయోగిస్తున్నారు. భూమికి అతి సమీపంలో పరిభ్రమిస్తున్న ఉపగ్రహం ఆవర్తన కాలం సుమారు T= 84.6 నిమిషాలు (లేదా) 5000 సెకన్లు.