plots
-
కేపీహెచ్బీలో ప్లాట్ల వేలంపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్బీలో ప్లాట్ల వేలంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. లేఅవుట్లో 54.29 ఎకరాల స్థలంలో ఉందన్న న్యాయమూర్తి.. అందులో 10 శాతం గ్రీనరీ కోసం వదిలేయాలి కదా అని ప్రశ్నించారు. గ్రీనరీ కోసం కేటాయించిన స్థలాన్ని ప్లాట్లుగా విక్రయిస్తున్నారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, 10 శాతం ఖాళీ స్థలాన్ని ఇప్పటికే జీహెచ్ఎంసీకి అప్పగించామని ఏజీ సమాధానమిచ్చారు.ఆసియాలోనే అతిపెద్ద, పాతదైన లేఅవుట్ కేపీహెచ్బీ కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వేలం పాటలో ప్లాట్లు దక్కించుకున్న వాళ్లకు కేటాయింపులు చేయొద్దన్న హైకోర్టు.. లేఅవుట్కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది. -
బిల్డర్ ప్లాట్ స్కీమ్లో 8,000 ఫ్లాట్లు!
గ్రేటర్ నోయిడా అథారిటీ ఐదు బిల్డర్ ప్లాట్ల కేటాయింపు కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా నగరంలో కనీస ఆదాయం రూ. 500 కోట్లు వస్తుందని, 8,000 కొత్త ఫ్లాట్ల నిర్మాణం నిర్మాణం జరుగుతుందని అంచనా వేస్తోంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో ఈ-వేలం ద్వారా కేటాయింపు జరుగుతుందని అధికారిక ప్రకటనలో అథారిటీ తెలిపింది.గ్రేటర్ నోయిడా అథారిటీ బిల్డర్ విభాగం ఈ పథకాన్ని ప్రారంభించింది. దీని కోసం మొత్తం 99,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వన్ ఎ, ఎంయూ, సిగ్మా 3, ఆల్ఫా 2, పై వన్ సెక్టార్లలో ప్లాట్లు ఉన్నాయి. గ్రేటర్ నోయిడాను ఆగ్రా, మథురలతో కలిపే యమునా ఎక్స్ప్రెస్ వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే (ఈపీఈ)తో ఈ సెక్టార్లకు మంచి కనెక్టివిటీ ఉందని అధికారులు తెలిపారు. ఈ సెక్టార్లు జెవార్లో రాబోయే నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంతో కూడా అనుసంధానం కానున్నాయి.ప్లాట్ పరిమాణం, స్థలాన్ని బట్టి చదరపు మీటరుకు రూ.48,438 నుంచి రూ.54,493 వరకు ధర నిర్ణయించారు. రిజర్వ్ ధర ప్రకారం ఈ ఐదు భూముల మొత్తం ధర సుమారు రూ.500 కోట్లు. ప్లాట్ల కేటాయింపు ఈ-వేలం ద్వారా జరుగుతుంది. దీని తేదీని ఇంకా ప్రకటించలేదన్నారు. ఈ పథకానికి రిజిస్ట్రేషన్ జూలై 2న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 23. ఆసక్తి గలవారు జూలై 29లోగా తమ డాక్యుమెంట్లను సమర్పించవచ్చు. -
ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 25 లక్షల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ఆరోపించారు. ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్లు, లే అవుట్లను క్రమబద్దికరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్తో కలిసి కేటీఆర్ మాట్లాడారు. గతంలో ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలు, ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు.ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే ... ‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్, భట్టి విక్రమార్క సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు ఎల్ఆర్ఎస్ను తప్పుపట్టారు. తాము అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. ప్రజల దగ్గర ఎలాంటి చార్జీలు వసూ లు చేయకుండానే రెగ్యులరైజ్ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగుతున్నారంటూ భట్టి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రిజిస్ట్రేషన్ అయిన స్థలాలకు మళ్లీ ఎందుకు డబ్బులు కట్టాలని కూడా అడిగారు. నాడు భట్టి విక్రమార్క చేసిన డిమాండ్నే నేను పునరుద్ఘాటిస్తున్నా. రాష్ట్ర ప్రజల జేబుల నుంచి రూ.20 వేల కోట్లు దోచుకోవడానికి కాంగ్రెస్ సర్కారు ఎల్ఆర్ఎస్ స్కీం అమలు చేస్తుంటే భట్టి ఎందుకు మాట్లాడడం లేదు? ఆగమేఘాల మీద మార్చి 31వ తేదీ లోపల ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాలని దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ఇది రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగడం కాదా? ప్రజలెవరూ ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టవద్దు. ఆ మాటలేవీ గుర్తులేవా? తమ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తే.. ‘నో ఎల్ఆర్ఎస్ – నో బీఆర్ఎస్’అన్న ఉత్తమ్కుమార్రెడ్డి ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రజలు నో కాంగ్రెస్ అంటున్నారనే విషయం తెలియడం లేదా? అప్పుడు ఉచితంగా క్రమబద్దికరిస్తామ న్న ఉత్తమ్కుమార్ రెడ్డి.. రాష్ట్ర ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ పేరుతో సర్కారు డబ్బులు లాక్కోవడంపై స్పందించాలి. ఎల్ఆర్ఎస్ అంటే డబ్బులు దోచుకోవడానికేనని ప్రస్తుత మంత్రి సీతక్క అప్పట్లో మాట్లాడారు. మరి ఈరోజు ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఎల్ఆర్ఎస్పైన మంత్రి కోమటిరెడ్డి అప్పట్లో కోర్టులో కేసువేశారు. ఆ కేసును వెనక్కి తీసుకున్నారా? లేక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి కేసు వేస్తారా?..’’అని కేటీఆర్ ప్రశ్నించారు. మార్చి 31 కల్లా డబ్బులు కట్టి తీరాలని ప్రజల మెడమీద కత్తి పెట్టారని, ప్రభుత్వ ఖజానా నింపడానికే ఈ కార్యక్రమం తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 6, 7 తేదీలలో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాలని అడుగుతున్న అధికారులను నిలదీయాలన్నారు. ఎమ్మెల్సీ మనదే.. రెండు ఎంపీ సీట్లూ మనవే ‘స్థానిక’ఎమ్మెల్సీతోపాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు లోక్సభ సీట్లను గెలుచుకునేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశమై.. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై, మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చించారు. ఎమ్మెల్సీ, లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒకట్రెండు రోజుల్లోనే ఈ రెండు లోక్సభ నియోజకవర్గాలపైన పార్టీ అధినేత కేసీఆర్ విస్తృతస్థాయి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్సీతోపాటు రెండు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కే విజయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రూ.20 వేల కోట్లు దోచుకునే పన్నాగం ఎల్ఆర్ఎస్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న 25 లక్షల 44 వేలమంది లబ్ధిదారుల్లో ఒక్కొక్కరిపై కనీసం రూ.లక్ష చొప్పున భారాన్ని మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 31వ తేదీలోగా రాష్ట్ర ప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.20 వేల కోట్లు దోచుకునేలా పన్నాగం పన్నారు. ఎల్ఆర్ఎస్ను ఎలాంటి చార్జీలు తీసుకోకుండా అమలు చేయాలి. ఈ డిమాండ్తో ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలను చేపడతాం. 7న ప్రతి జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేస్తాం. హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతాం. – కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ -
ఓపెన్ ప్లాట్లే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: 1991లో ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం 320 మంది ఉద్యోగులకు ఓపెన్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్లాట్లను ఫ్లాట్లు మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 32ను కొట్టివేసింది. ఏపీ హౌసింగ్ బోర్డు ఉద్యోగులకు హైదరాబాద్ కూకట్పల్లి సర్వే నంబర్ 964, 1009లో 13 ఎకరాలను ప్రభుత్వం 1991లో కేటాయించింది. గజం రూ.45 చొప్పున కేటాయించాలని చెబుతూ ప్లాట్లను సిద్ధం చేసే బాధ్యతను హౌసింగ్ బోర్డుకు అప్పగించింది. అయితే లేఅవుట్ సిద్ధమయ్యాక ఆ మొత్తాన్ని రూ.116కు పెంచింది. దీనిపై చర్చ కొనసాగుతుండగానే కేటాయింపును నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్లకు బదులు ఫ్లాట్లను కేటాయించాలంటూ జీవో 32ను విడుదల చేసింది. దీన్ని ఉద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రభుత్వం పేర్కొన్న విధంగా రూ.116 చెల్లించిన 107 మందికి ప్లాట్లను అప్పగించాలని తీర్పునిచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం, హౌసింగ్బోర్డు, మరికొందరు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. ప్రభుత్వం ఉద్యోగుల నుంచి సొమ్ము వసూలు చేసినందున ఆ భూమిపై వారికే హక్కులు ఉంటాయని పేర్కొంది. ఉద్యోగులకు ప్లాట్లు కేటాయించడం కొత్తకాదని, జీవో 32ను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. మొత్తం 320 మందికి ప్లాట్లను 4 నెలల్లో రిజి్రస్టేషన్ చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. -
సీఎం జగన్ను కలిసిన జర్నలిస్టులు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్ జర్నలిస్టులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిశారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత సీఎం వైఎస్సార్ ఇళ్ల స్థలాలు ఇచ్చారని గుర్తుచేశారు. అప్పుడు ఇళ్ల స్థలాలు పొందిన జర్నలిస్టులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత మీ ప్రభుత్వం మాత్రమే ఇళ్ల స్థలాలు ఇస్తోందన్నారు. దీనికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముఖ్యమంత్రితో అన్నారు. కొందరికే కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టుకీ రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లస్థలాలు ఇవ్వడం జర్నలిస్టులందరికీ సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ నిర్ణయం ద్వారా మేనిఫెస్టోలో ఉన్న హామీని నిలబెట్టుకున్నామని సీఎం జర్నలిస్టులతో అన్నారు. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న 99.5 శాతం హామీలను నెరవేర్చామన్నారు. జర్నలిస్టుల ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయమని సీఎం అధికారులను అక్కడే ఆదేశించారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల విషయంలో ఎప్పటికప్పుడు పురోగతిని తనకు నివేదించాలన్నారు. జాప్యానికి తావులేకుండా, భూముల గుర్తింపు సహా తదితర అంశాలపై నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటుచేసుకుని ముందుకువెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీఎంని కలిసిన వారిలో ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు( జాతీయ మీడియా) దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజెఎఫ్ యూనియన్ నేతలు జి.ఆంజనేయలు, ఎస్.వెంకటరావు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీవీఆర్ కృష్ణంరాజు తదితరులు ఉన్నారు. చదవండి: మనసున్న మారాజు సీఎం జగన్ -
ప్లాట్ల కేటాయింపు వెనుక వాస్తవాలకు ఈనాడు తూట్లు
సాక్షి, అమరావతి: అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు వ్యవహారంపై ‘ఈనాడు’ దినపత్రిక మరోసారి తన దివాళాకోరు తనాన్ని బయటపెట్టింది. గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే తట్టుకోలేక బురద జల్లేందుకు పూనుకుంది. ‘ప్లాట్లు రద్దు చేసుకోవాలంటూ రైతులకు లేఖలు’ శీర్షికన వాస్తవాలను దాచేసి పూర్తిగా వక్రీకరణకు దిగింది. వాస్తవానికి అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో గత ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 34,400 ఎకరాలను సమీకరించింది. ఈ భూములిచ్చిన రైతులకు 63,462 నివాస/వాణిజ్య ప్లాట్లు కేటాయించింది. అయితే.. కొందరు రైతులు భూ సమీకరణకు భూములిచ్చేందుకు నిరాకరించగా, ఇలాంటి చోటా గత ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆ ప్రాంత రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నారు. ఈ వివాదాలు పరిష్కారం కాకుండానే ఆ భూముల్లోనూ ప్లాట్లను కేటాయించేశారు. గత ప్రభుత్వం భూసేకరణను, ప్లాట్ల కేటాయింపు ఎంత అస్తవ్యస్తం చేశారో చెప్పడానికి ఇదో నిదర్శనం. రైతులకు మేలు చేస్తుంటే తప్పుడు రాతలు సీఆర్డీఏ ప్రాంతంలో భూములిచ్చిన వారికి కేటాయించిన ప్లాట్లలో 3,356 ప్లాట్లు ఈ విధంగా భూ సేకరణ ప్రక్రియలో, కోర్టు తగాదాలతో రైతులకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు లేకున్నా 953 ప్లాట్లను రిజిస్టర్ చేసేశారు. అంటే భూమి లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఈ సమస్యను సరిదిద్ది, ల్యాండ్ పూలింగ్కు భూములిచ్చిన వారికి మేలుచేసే ఉద్దేశంతో భూ సేకరణ, కోర్టు వివాదాల్లో ఉన్న ప్లాట్లకు ప్రత్యామ్నాయంగా వేరే ప్లాట్లను కేటాయించేందుకు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్ల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వుల్లోని 3వ నిబంధన మేరకు కేటాయించిన ప్లాటు విషయంలో ఏదైనా సమస్య ఉంటే నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు లేదా ప్రత్యామ్నాయ ప్లాటు కేటాయించేందుకు ఏపీ సీఆర్డీఏ బాధ్యత తీసుకుంది. అందుకు అనుగుణంగానే పూలింగ్కు భూములిచ్చిన యజమానుల అంగీకారం కోసం వారికి కేటాయించిన ప్లాట్లలో భూసేకరణ/కోర్టు వివాదాల సమస్య ఉన్నందున ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు వారికి సమాచారం ఇచ్చి అంగీకారం తీసుకుంటోంది. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ఈ ప్రక్రియ చేపడితే ఎల్లో మీడియా వక్రీకరించి ప్రభుత్వంపై బురద జల్లుతూ దిగజారుడు కథనాన్ని ప్రచురించింది. -
రీసేల్.. రివర్స్
సిటీకి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదాశివపేటలో ఓ నిర్మాణ సంస్థ భారీ వెంచర్ చేసింది. ఇది నిమ్జ్కు అతి సమీపంలో ఉండడంతో రెట్టింపు ధర పక్కాగా వస్తుందని ఓ ప్రైవేట్ ఉద్యోగి ఆశపడ్డాడు. గజానికి రూ. 8 వేలు చెల్లించి 150 గజాల ప్లాట్ కొన్నాడు. మూడేళ్ల తర్వాత ఇప్పుడు సదరు ఉద్యోగి తన కొడుకు చదువుకని ప్లాట్ అమ్మకానికి పెట్టాడు.. రెట్టింపు ధర సంగతి దేవుడెరుగు.. కనీసం బ్యాంకు వడ్డీ కూడా వచ్చే పరిస్థితి లేదు. గ్రేటర్ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం ఐదు మాసాల్లో సుమారు 3.5 లక్షల దస్తావేజులు నమోదు కాగా, ఈసారి మాత్రం 2.2 లక్షలకు డాక్యుమెంట్లు కూడా దాటలేదు. రియల్ వ్యాపారం పూర్తిగా మందగించడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. సాక్షి, హైదరాబాద్: ఎవరైనా సరే భూమి ఎందుకు కొంటారు..? పిల్లల చదువుకోసమో.. అమ్మాయి పెళ్లి కోసమో.. ఇతరత్రా భవిష్యత్ అవసరాలకు అక్కరకొస్తుందనే కదా! కానీ, ప్రస్తుతం రీసేల్ ప్లాట్లకు అస్సలు గిరాకీ లేదు. కుప్పలుతెప్పలుగా వెంచర్లు, స్థానిక సంస్థల నుంచి అనుమతులు లేకపోవటం, మౌలిక వసతులు కల్పించకపోవటంతో పాటు ఎన్నికల వాతావరణం కావడంతో రీసేల్ ప్లాట్లకు గిరాకీ లేకుండా పోయింది. నగరం చుట్టూ ఇదే పరిస్థితి రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్), యాదాద్రి, నిమ్జ్, ఫార్మా సిటీ, టెక్స్టైల్స్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ హబ్లు, మెట్రో రైలు విస్తరణ.. ఇలా అనేక ప్రాజెక్టులు వచ్చేస్తున్నా యంటూ హైదరాబాద్ నుంచి వంద కిలో మీటర్ల వరకూ రియల్ ఎస్టేట్ సంస్థలు భారీ వెంచర్లు చేస్తున్నారు. యాదాద్రి, జనగాం, సదాశివపేట, షాద్నగర్, సంగారెడ్డి, చౌటుప్పల్, చేవెళ్ల తదితర ప్రాంతాలలో ఫామ్ ప్లాట్లు, విల్లా ప్లాట్లు, వీకెండ్ హోమ్స్ అని రకరకాల పేర్లతో విక్రయిస్తున్నారు. స్థలం కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఉంటాయని అందమైన బ్రోచర్లతో ఊదరగొడుతున్నారు. వీటిని నమ్మి కొన్నవారికి నిరాశే ఎదురవుతోంది. తెల్ల కాగితాల మీద గీతలు గీసేసి, ప్లాట్లు విక్రయించే బిల్డర్లు సైతం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రెరాలో నమోదు లేకుండానే నిబంధనల ప్రకారం స్థిరాస్తి సంస్థల ఏజెంట్లు కూడా టీఎస్–రెరాలో నమోదు చేసుకోవాలి. కానీ, నిర్మాణ సంస్థలు ఇవేవీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున మార్కెటింగ్ ప్రతినిధులను నియమించుకుంటున్నాయి. ఏజెంట్లకు ఒక్క ప్లాట్ విక్రయిస్తే రూ.2 లక్షలకు పైగానే కమీషన్ అందిస్తున్నాయి. ఎక్కువ ప్లాట్లు విక్రయిస్తే ఏజెంట్లకు బంగారం, కార్లు గిఫ్ట్లుగా ఇవ్వడంతో పాటు గోవా, మలేíసియా, దుబా య్, బ్యాంకాక్ హాలీడే ట్రిప్పులకు తీసుకెళుతున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూ టివ్లతో గొలుసుకట్టు వ్యాపారం చేస్తు న్నాయి. ప్రతి ఆదివారం బస్సులు, కార్లలో కొనుగోలుదారులను వెంచర్ల వద్దకు తీసుకెళుతున్నారు. రెండు మూడేళ్లుగా.. జనరద్దీ లేని చోట... అటవీ ప్రాంతాలకు సమీపంగా కూడా వెంచర్లు వేశారు. కనీసం అక్కడ ఊరు ఆనవాళ్లు కూడా కనిపించవు. ఆయా ప్రాంతాల్లో ప్లాట్లను కొనుగోలు చేసిన వారు అత్యవసరమైతే అమ్ముకోలేక అగచాట్లు పడుతు న్నారు. వెంచర్లు చేసిన సంస్థ విక్రయించిన ధరకు ప్లాట్ను తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్లాట్పై పెట్టుబడి పెడితే ఎప్పటికైనా ధర పెరుగుతుందనే ధీమాతో చాలా మంది కొనుగోలు చేశారు. వారంతా రెండుమూడేళ్లుగా విక్రయించడానికి ప్రయత్నించినా కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. అభివృద్ధి జరిగే ప్రాంతంలోనే కొనాలి అభివృద్ధికి ఆస్కారం ఉండే ప్రాంతాల్లోనే ప్లాట్లు కొనుగోలు చేయాలి. వెంచర్లలో రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు వంటి అన్ని రకాల మౌలిక వసతులు ఉంటేనే భవిష్యత్లో విక్రయించినా మంచి ధర వస్తుంది. అనుమతులు ఉన్న వెంచర్లలో కొనడమే ఉత్తమం.– సీహెచ్ వెంకట సుబ్రహ్మణ్యం, సీఎండీ, భువన్తేజ ఇన్ఫ్రా -
నాల్గో రోజూ మోకిలలో అదే జోరు.. గజం రూ.66 వేలు
హైదరాబాద్: మోకిల హెచ్ఎండీఏ వెంచర్ ప్లాట్ల వేలానికి నాల్గో రోజు సోమవారం మంచి రేట్లతో ఆదరణ లభించింది. తొలి మూడు రోజుల్లో లేఅవుట్లో ముందు వరుసలో ఉన్న ప్లాట్లకు గజం ధర రూ.70 వేల నుంచి రూ.1,05,000 వరకు ధర పలికిన విషయం తెలిసిందే. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్లో ఫేజ్–1లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా, ఫేజ్–2లో 300 ప్లాట్లకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టీ.సీ. వేలం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 30 ప్లాట్లు, మధ్యాహ్నం 30ప్లాట్లు కలిపి మొత్తం 60 ప్లాట్లకు అప్సెట్ వ్యాల్యూ రూ.46.50 కోట్లు కాగా, ప్లాట్ల అమ్మకాల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.105.16 కోట్లు కావడం గమనార్హం. మొదటిరోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల రెవెన్యూ, రెండవ రోజు రూ.131.72 కోట్లు, మూడో రోజు రూ.132.974 కోట్ల రెవెన్యూ వచ్చింది. మోకిల హెచ్ఎండీఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీస్ లేఅవుట్ దగ్గరలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయానికి అందుబాటులో ఉండటం వల్ల ఇక్కడ ప్లాట్ల కొనుగోలుకు ఎంతో మంది పోటీ పడుతున్నారు. -
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలపై హైకోర్టులో విచారణ
సాక్షి, విజయవాడ: అమరావతిలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం.. తీర్పు రిజర్వ్ చేసింది. జీవో 45పై హైకోర్టు, సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదని.. కాబట్టి నిర్మాణాలు చేసుకోవచ్చని అర్థం అని ప్రభుత్వ న్యాయవాదులు తమ వాదనలు ధర్మాసనానికి వినిపించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను కొంతమంది అడ్డుకుంటున్నారు.. చంద్రబాబు 1656 ఎకరాలను సంస్థలకు అమ్మేస్తే ఎందుకు స్పందించలేదు? మాస్టర్ ప్లాన్ తప్పు కాబట్టే సవరించామని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. చదవండి: అలాంటి క్యారెక్టర్ ఉన్నోడా వలంటీర్లను అనేది!: సీఎం జగన్ ఫైర్ సీఆర్డీఏ చట్టంలో 5 శాతం భూమిని నిరుపేదలకు ఇవ్వాలని ఉంది. సీఆర్డీఏ చట్ట ప్రకారమే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. -
టీడీపీ హయాంలో కాళ్ళరిగేలా తిరిగినా ఇవ్వని ఇళ్ళు
-
ఏపీలో ఇళ్ల పండగ
-
‘జగనన్నకు చెబుదాం’తో దిగొస్తున్న అధికారులు
పెనుకొండ/హనుమాన్జంక్షన్ రూరల్ : ‘జగనన్నకు చెబుదాం’కు ఫిర్యాదు చేసిన బాధితుల కోసం అధికారులు, పోలీసులు దిగొస్తున్నారు. ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించి, ఆధారాలు తీసుకుని న్యాయం చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతిలో మోసపోయిన ఇద్దరు బాధితులు, వీఆర్వో నిర్లక్ష్యంతో ఇబ్బందిపడుతున్న మరో బాధితుడు 1902 నంబర్కు ఫోన్ చేయడంతో అధికారులు ఫిర్యాదుదారులను సంప్రదించి వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. మూడేళ్లుగా ముప్పుతిప్పలు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రానికి చెందిన దిలీప్రెడ్డి మండలంలోని గొల్లపల్లి–చంద్రగిరి మధ్య రోడ్డు పక్కన ప్లాట్లు వేశాడు. తన వద్ద ప్లాట్లు కొనేవారికి బ్యాంకులోను కూడా తానే ఇప్పిస్తానని ప్రచారం చేశాడు. దీంతో పెనుకొండకు చెందిన గొల్ల గోపాల్, ఓబుళరెడ్డిలు ఆయన వద్ద ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వెళ్లగా, ఒక్కో ప్లాట్ రూ.16 లక్షలుగా చెప్పాడు. ఒక్కో ప్లాట్కు రూ.4 లక్షల చొప్పున అడ్వాన్స్ ఇస్తే.. మిగతా మొత్తం తానే బ్యాంకు ద్వారా లోను ఇప్పిస్తానన్నాడు. దీంతో వారిద్దరూ 2020, జనవరిలో చెరో ప్లాట్ కోసం రూ.4 లక్షల చొప్పున దిలీప్రెడ్డికి ఇచ్చారు. ఆ తర్వాత దిలీప్రెడ్డి ముఖం చాటేశాడు. లోన్ సంగతి తర్వాత కనీసం తాము చెల్లించిన డబ్బులన్నా వెనక్కి ఇవ్వాలని కోరగా.. చెక్కులిచ్చాడు. వాటిని బ్యాంకులో వేయగా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించి నోటీసులు పంపగా.. దిలీప్రెడ్డి వాటిని తీసుకోలేదు. ఇలా మూడేళ్ల పాటు పోరాటం చేస్తున్న బాధితులు రెండు రోజుల కిందట ‘జగనన్నకు చెబుదాం’కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. 1902 కాల్ సెంటర్ వారు వివరాలన్నీ నమోదు చేసుకుని, సమీప పోలీస్స్టేషన్కు వివరాలు పంపారు. దీంతో బుధవారం ‘కియా’ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వెంకటరమణ బాధితులకు ఫోన్ చేయగా గొల్ల గోపాల్ అందుబాటులోకి వచ్చాడు. అతన్ని స్టేషన్కు పిలిపించి వివరాలపై ఆరా తీసి, ఆధారాలు తీసుకున్నారు. అనంతరం దిలీప్పై కేసు నమోదు చేశారు. మరో బాధితుడు ఓబుళరెడ్డిని కూడా స్టేషన్కు పిలిపించి ఫిర్యాదు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. మూడేళ్లుగా కనీసం కేసు కూడా నమోదు కాలేదని, 1902కు ఫోన్ చేయగానే పోలీసులే కేసు నమోదు చేశారని బాధితుడు గొల్ల గోపాల్ చెప్పారు. అర్జీదారు ఇంటికి ఆర్డీవో ఏలూరు జిల్లా నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన గోళ్ల రాణికి బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలోని ఆర్ఎస్ నంబర్ 110–2లో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పట్టా భూమి అయినప్పటికీ కొన్నేళ్లుగా రెవెన్యూ అధికారులు 22ఏ కేటగిరీ కింద ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. అప్పటి నుంచి రాణితో పాటు ఆమె కుటుంబ సభ్యులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వీఆర్వో సరిగ్గా స్పందించకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. విసుగుచెందిన గోళ్ల రాణి కుటుంబ సభ్యులు ఈ నెల 13వ తేదీన ‘జగనన్నకు చెబుదాం’లో ఫిర్యాదు చేశారు. స్పందించిన గుడివాడ ఆర్డీవో పి.పద్మావతి, బాపులపాడు తహసీల్దార్ సీహెచ్ నరసింహారావు, మల్లవల్లి వీఆర్వో ప్రసాద్ను వెంటపెట్టుకుని బుధవారం మీర్జాపురంలోని గోళ్ల రాణి ఇంటికి వెళ్లారు. మల్లవల్లి వ్యవసాయ భూములకు సంబంధించిన ప్రభుత్వ రికార్డులను తనిఖీ చేయడంతో పాటుగా, గోళ్ల రాణి వద్ద ఉన్న పత్రాలను కూడా ఆర్డీవో పద్మావతి పరిశీలించారు. సమస్య పరిష్కరించకుండా పదే పదే అర్జీదారులను తిప్పుకోవడం తగదని వీఆర్వో ప్రసాద్ను ఆర్డీవో మందలించారు. దీర్ఘకాలంగా ఉన్న మల్లవల్లి ఆర్ఎస్ నంబర్ 110–2 సెక్షన్ 22ఏ సమస్యను తక్షణమే పరిష్కరించి న్యాయం చేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. -
కోకాపేట్ తరహాలో.. మరో భారీ వెంచర్కు హెచ్ఎండీఏ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: మరో భారీ వెంచర్కు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఔటర్ రింగ్రోడ్డుకు సమీపంలో, ఎయిర్పోర్టు మెట్రో మార్గానికి దగ్గరలో రాజేంద్రనగర్ బుద్వేల్ వద్ద సుమారు 200 ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. మధ్యతగతి, ఉన్నత ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ఈ లేఅవుట్ అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ రెండు రోజుల క్రితం టెండర్లను సైతం ఆహ్వానించింది. 200 ఎకరాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలతో పాటు విల్లాల కోసం 2 నుంచి 3 ఎకరాల ప్లాట్లు, మధ్యతరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకొని 500 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల ప్లాట్ల చొప్పున ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు కార్యాచరణ సిద్థం చేశారు. రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్ వరకు నగరానికి దక్షిణం వైపు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న దృష్ట్యా ఈ లేఅవుట్కు భారీ డిమాండ్ ఉండే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లేఅవుట్ ఔటర్ రింగురోడ్డుకు దగ్గర్లో ఉండడం, రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్మించనున్న ఎయిర్పోర్టు మెట్రో మార్గానికి చేరువలో ఉండడంతో బుద్వేల్ లేఅవుట్ హాట్కేక్లా అమ్ముడవుతుందని అధికారులు భావిస్తున్నారు. కోకాపేట్ తరహాలో.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ ఎక్కడ లే అవుట్లను అభివృద్ధి చేసినా కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. హెచ్ఎండీఏ స్థలాల్లో ఎలాంటి వివాదాలు లేకపోవడం, ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేసి ఇవ్వడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇటీవల మేడ్చల్, ఘట్కేసర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో చేపట్టిన హెచ్ఎండీఏ స్థలాల విక్రయాలకు కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. బాచుపల్లిలో చదరపు గజం అత్యధికంగా రూ.68 వేల వరకు డిమాండ్ రావడం గమనార్హం. గతంలో ఉప్పల్లోనూ బిల్డర్లు, రియల్టర్లు, వ్యాపారవర్గాలు, మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. నగర శివారు ప్రాంతాల్లో, ఔటర్ రింగ్ రోడ్కు అందుబాటులో అభివృద్ధి చేస్తున్న వెంచర్ల పట్ల నగరవాసులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సుమారు 500 ఎకరాల్లో కోకాపేట్లో అభివృద్ధి చేస్తోన్న నియో పోలీస్ లేఅవుట్ కు సైతం కొనుగోలుదారుల నుంచి ఆసక్తి కనిపిస్తోంది. నియో పోలీస్ లే అవుట్ అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయి. కోకోపేట తరువాత బుద్వేల్లో చేపట్టనున్న ప్రాజెక్టు అతిపెద్ద లేఅవుట్ అవుతుందని హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం 200 ఎకరాల్లో దీన్ని చేపట్టి విస్తరిస్తారు. అక్కడ ప్రభుత్వభూమి అందుబాటులో ఉండడం వల్ల 350 ఎకరాల వరకు కూడా విస్తరించేందుకు అవకాశం ఉంది. కాగా.. జంట జలాశయాలకు సమీపంలో ఉన్న బుద్వేల్ లే అవుట్కు అన్నీ అనుకూలమైన అంశాలే ఉన్నాయి. చదవండి: సాత్విక్ మృతిపై కమిటీ రిపోర్ట్ ఇదే.. శ్రీచైతన్యకు షాక్! -
అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే?
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాల్లోని హెచ్ఎండీఏ స్థలాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. అందుబాటు ధరల్లో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎమ్మెస్టీసీ ఈ వేలం ప్రక్రియను నిర్వహించనుంది. మధ్యతరగతి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డెవలపర్లు ఈ ల్యాండ్ పార్సిళ్లను కొనుగోలు చేసేందుకు అనుగుణంగా స్థలాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఔటర్రింగ్ రోడ్డుకు దగ్గరలో 39 ల్యాండ్ పార్సిళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6 ప్లాట్లు, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిళ్లు ఉన్నట్లు వారు పేర్కొన్నారు. ఈ స్థలాల వివరాలను కేఎంఎల్ ఫైల్ ద్వారా చూసుకునే సదుపాయం ఉంది. 121 నుంచి 10,164 గజాల వరకు ఈ స్థలాలు ఉన్నాయి. గండిపేట వద్ద 3 ప్లాట్లు, శేరిలింగంపల్లిలో 5, ఇబ్రహీంపట్నంలో 2 ప్లాట్లు, అమ్మకానికి ఉన్నాయి. మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లిలో 4, ఘట్కేసర్లో 1, బాచుపల్లిలో 1 చొప్పున ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో 16, ఆర్సీపురంలో 6 ప్లాట్లు, జిన్నారంలో ఒకటి చొప్పున స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఆన్లైన్ వేలం.. 39 స్థలాలను వచ్చే నెల మార్చి 1న ఎమ్మెస్టీసీ ఆధ్వర్యంలో ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా క్లియర్ టైటిల్ కలిగిన ఈ స్థలాలను కొనుగోలు చేసిన వారు సత్వరమే భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు అవకాశం ఉంది. ఆన్లైన్ వేలంలో పాల్గొనడానికి వీలుగా ఈ నెల 27న సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెస్టీసీలో నమోదు చేసుకోవాలి. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 28న సాయంత్రం 5 గంటలలోపు నిర్దేశించిన ఈఎండీ (ధరావత్తు) రుసుమును చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 21న రంగారెడ్డి జిల్లా పరిధిలోని స్థలాలకు శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసులో, 22వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని స్థలాలకు ఆర్సీపురంలోని లక్ష్మీ గార్డెన్స్లో 23న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్థలాలపై ఉప్పల్ సర్కిల్ ఆఫీసులో ప్రీ బిడ్ సమావేశాలను నిర్వహించనున్నారు. చదవండి: ధర తక్కువ.. డిమాండ్ ఎక్కువ..హైదరాబాద్లో మాకు ఆ ఏరియాలోనే ఇల్లు కావాలి! -
ఇంటికి హక్కు.. ఖజానాకు కిక్కు.. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలను క్రమబద్దీకరించడంతోపాటు.. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఇళ్లు, నిర్మాణాలను ఎలా క్రమబద్ధీకరించాలి, ఇందుకోసం ఎలాంటి విధానాన్ని అనుసరించాలన్న దానిపై వారం రోజులుగా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సేకరించిన వివరాలను పరిశీలించేందుకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు తదితరులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘం (కేబినెట్ సబ్ కమిటీ) సోమవారం సమావేశం కానుంది. ఇళ్లు, నిర్మాణాల క్రమబద్ధీకరణతోపాటు ఈ హక్కుల కల్పన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునే దిశగా చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నట్టు తెలిసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలపై ఆదాయార్జన శాఖల అధికారులతోనూ సోమవారమే కేబినెట్ సబ్ కమిటీ విడిగా సమావేశం కానుంది. రెండు కీలక అంశాలపై ఒకేరోజు సబ్ కమిటీ భేటీలు జరుగుతుండటంతో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ స్థలాల నుంచి సాదాబైనామాల దాకా.. ఈ నెల 13న జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరించడంతోపాటు.. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై చర్చించారు. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఇంటి పన్ను రశీదులు లేని ఇళ్లు, నిర్మాణాల వివరాలను మొత్తం 12 కేటగిరీల్లో రెవెన్యూ శాఖ సేకరించింది. ఇందులో ప్రభుత్వ స్థలాలు, సాంఘిక సంక్షేమశాఖ సేకరించిన భూములు, సీలింగ్ భూములు, ఆబాదీ/గ్రామకంఠం, దేవాదాయ, వక్ఫ్, శిఖం/ఎఫ్టీఎల్, పలు శాఖలకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలు, పలు సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వం లీజుకిచ్చిన భూములు, నోటరీలు మాత్రమే ఉన్న భూములు, సాదాబైనామా లావాదేవీలు జరిగిన భూములు, ఇతర కేటగిరీల స్థలాలు ఉన్నాయి. ఈ కేటగిరీల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతోపాటు గ్రామాల నుంచీ వివరాలను పంపాలని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్దేశిత ఫార్మాట్ పంపగా.. తహసీల్దార్లు ఆ వివరాలను సేకరించి అందజేశారు. 12.5 లక్షల నిర్మాణాలు? కొన్నిరోజులుగా రెవెన్యూ యంత్రాంగం సేకరించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలు 12.5 లక్షల వరకు ఉన్నట్టు తేల్చారు. రెవెన్యూ డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. ఒక్కో రెవెన్యూ డివిజన్లో 15వేల నుంచి 17 వేల వరకు ఇలాంటి నిర్మాణాలు ఉంటాయని క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం అంచనా వేసింది. మొత్తంగా 60శాతానికి పైగా నిర్మాణాలు గ్రామ కంఠాలు, ఆబాదీ భూముల్లోనే ఉన్నాయని.. అలా ఉన్నవాటి సంఖ్య ఏడున్నర లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇక గ్రామాలు, పట్టణాల్లో కలిపి ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు, ఇతర నిర్మాణాలు కలిపి మరో రెండున్నర లక్షలు (16–20 శాతం) ఉండవచ్చని.. మిగిలిన కేటగిరీల్లో మరో 2–3 లక్షల వరకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు లేని ఇళ్లు, నిర్మాణాలు ఉన్నాయని అంచనా. ప్రస్తుతానికి తమ దగ్గర ఉన్న సమాచారం మేరకు ఈ లెక్కలు వేశామని.. సమగ్రంగా పరిశీలన చేస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. గత సోమవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఈ డేటా సేకరణకు నిర్ణయం తీసుకున్నారని.. ఈ వారం రోజుల్లో 20 జిల్లాల నుంచే పూర్తి సమాచారం వచ్చిందని, మరికొన్ని జిల్లాల నుంచి అందాల్సి ఉందని అంటున్నాయి. రెగ్యులరైజ్ చేసేదెలా? దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్న ఇళ్లు, ఇతర నిర్మాణాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుంటే.. వాటిని క్రమబదీ్ధకరించడం ఎలాగన్న దానిపై సోమవారం జరిగే కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రమబద్దీకరించాల్సిన ఇళ్లు, నిర్మాణాలు ఎన్ని ఉంటాయి? వాటిని క్రమబద్ధీకరించేందుకు ఉన్న అవకాశాలేమిటన్న వివరాలను ఇప్పటికే సేకరించినట్టు తెలిసింది. దీనిపై రెవెన్యూ ఉన్నతాధికారులతో చర్చించనున్న కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం. అయితే జీవో 58, 59 (పట్టణాల్లోని ప్రభుత్వ స్థలాల్లో కట్టుకున్న నివాసాల క్రమబదీ్ధకరణ) మాదిరిగా స్థలాల ప్రభుత్వ విలువ ఆధారంగా సీలింగ్ నిర్ణయించి.. చదరపు గజాల లెక్కన ఫీజు వసూలు చేసి క్రమబద్దీకరించాలా? లేక ప్రతి ఇల్లు/ నిర్మాణానికి గ్రామాలు/పట్టణాల వారీగా గంపగుత్తగా రుసుము నిర్ణయించి క్రమబదీ్ధకరించాలా? అన్న దానిపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. సాదాబైనామాలు, నోటరీ (జీహెచ్ఎంసీ పరిధిలో) భూముల విషయంలోనూ క్రమబదీ్ధకరణకు అవకాశాలను పరిశీలించనున్నట్టు సమాచారం. ఈ అన్ని అంశాలపై సబ్ కమిటీ తీసుకునే నిర్ణయాలను సిఫార్సుల రూపంలో ప్రభుత్వానికి నివేదికగా అందించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఆ సిఫార్సులను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యక్తిగతంగా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని.. క్రమబదీ్ధకరణ కటాఫ్ తేదీని, దరఖాస్తు గడువును త్వరలో ప్రకటించవచ్చని అంటున్నాయి. బూమరాంగ్ అవుతుందా? ప్రభుత్వ స్థలాలు, గ్రామ కంఠాలు, ఇతర భూముల్లోని ఇళ్లు, నిర్మాణాల క్రమబద్దీకరణ అంశం బూమరాంగ్ అవుతుందా అనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. గతంలో పట్టణాలు, గ్రామాల్లోని ఓపెన్ ప్లాట్లు, నిర్మాణాల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను ప్రకటించింది. రూ.1,000 చెల్లించి వ్యక్తిగతంగా దరఖాస్తులు చేసుకోవాలని.. తర్వాత నిర్దేశిత ఫీజు చెల్లించి స్థలాలు, భవనాలను క్రమబదీ్ధకరించుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ ప్రకటనతో లక్షల్లో దరఖాస్తులు వచ్చినా.. తమ భూములు, భవనాలపై ప్రభుత్వానికి మళ్లీ ఫీజు ఎందుకు చెల్లించాలని ప్రజల నుంచి ప్రతికూల అభిప్రాయం వ్యక్తమైంది. ఈ క్రమంలో ఆ దరఖాస్తులను ఎటూ తేల్చకుండా ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు మళ్లీ ఇళ్లు, నిర్మాణాల క్రమబదీ్ధకరణ చేపడితే.. ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే చర్చ జరుగుతోంది. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా క్రమబదీ్ధకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి, అదే సమయంలో ఆదాయం సమకూర్చుకోవడానికి గల అవకాశాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించనున్నట్టు తెలిసింది. ఆదాయ వనరులపెంపుపైనా నజర్ సోమవారమే మరో ప్రధాన అంశంపై రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయ వనరుల పెంపుపై కేబినెట్ సబ్కమిటీ భేటీ కానుంది. పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయం పెంపునకు మార్గాలపై ఆర్థిక, జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, మైనింగ్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేకంగా చర్చించనుంది.ఇందులో ప్రభుత్వ భూముల వేలం, విలువైన అసైన్డ్ భూముల సేకరణ, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, దిల్ వంటి సంస్థల చేతుల్లో ఉన్న ఆస్తుల అమ్మకాలు తదితర అంశాలను పరిశీలించి.. ఆదాయం పెంచుకునే మార్గాలపై ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. -
హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్న ఈ ఏరియా ఓపెన్ ప్లాట్లు!
సాక్షి, హైదరాబాద్: కూతురు పెళ్లి కోసమో, కొడుకు చదువుల కోసమో, భవిష్యత్తు అవసరాల కోసమో కారణమేదైనా సామాన్య, మధ్యతరగతి ప్రజలు ప్లాట్లను కొనేందుకే ఇష్టపడుతుంటారు. సొంతంగా ఉండేందుకు ఇల్లు మొదటి ప్రాధాన్యత పూర్తయితే ఇక వారి లక్ష్యం శివారు ప్రాంతమైనా సరే ఎంతో కొంత స్థలం కొనుగోలు చేయటమే. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ వెలిసిన వెంచర్లలో ప్లాట్లు హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 2018 నుంచి హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నై, గుర్గావ్ నగరాలలో ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని హౌసింగ్.కామ్ సర్వే వెల్లడించింది. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని తెలిపింది. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్త్రైమాసికాలలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని సర్వే అంచనా వేసింది. కరోనాతో బూస్ట్..: సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్మెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటూ పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ వసతులు ఉంటాయని అపార్ట్మెంట్ కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కామన్ వసతులు వినియోగం, అపార్ట్మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవటమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలుకు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. -
పేదలందరికీ ఇళ్ల స్థలాలివ్వాలి.. లేకపోతే ఉద్యమమే: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని అడుగుతానని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తానని చెప్పారు. బుధవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట, సిద్ధాపూర్లలోని పేదలకు 5వేల ప్లాట్లు, కొండాపూర్, ఆలియాబాద్లలో 4వేల ప్లాట్లు ఇచ్చామని, అయితే అక్కడ స్థలాలు ఉన్నాయి కానీ పేదలను మాత్రం పంపించి వేశారని చెప్పారు. వెంటనే వారికి పొజిషన్ ఇవ్వాలని, ఇదే విషయమై సీఎం కేసీఆర్కు లేఖ రాశానని వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయం అంతా గందరగోళంగా ఉందని, అన్నీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రలో ఉంది కానీ కాంగ్రెస్ లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ రావడం వల్ల ప్రజలకు ఏం లాభం జరిగిందో అర్థం కాదు కానీ కాంగ్రెస్ను మాత్రం ఔట్ చేయాలని చూస్తున్నారని చెప్పారు. పడుకున్న కేసీఆర్ను లేపి మా వాళ్లు తన్నించుకున్నారు పడుకున్న కేసీఆర్ను లేపి తన్నించుకున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్లేనని అన్న జగ్గారెడ్డి బీజేపీకి రాజకీయం తప్ప సమస్యలపై పోరాటం చేయడం తెలియదని విమర్శించారు. వైఎస్ షర్మిల పాదయాత్రను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. చదవండి: కేసీఆర్.. అసెంబ్లీలో లెంపలేసుకో.. బండి సంజయ్ ధ్వజం.. -
ఆకాశమే హద్దురా.. అక్కడి ప్లాటు ధరలకు రెక్కలు.. ఏకంగా 5 రెట్లు పెరగడంతో..
ముంబై: రియల్ ఎస్టేట్ రంగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ప్రాపర్టీ డిమాండ్ బట్టి కోట్లు సంపాదిస్తారు, ఒక్కో సారి కొనేవాళ్లు లేక అదే స్థాయిలో నష్టపోతూ ఉంటారు.అయితే ఇటీవల ప్రజలు సొంత ఇళ్లు లేదా ఫ్లాట్ కొనుగోలుపై ఆసక్తి చూపడంతో రియల్టర్ల పంట పండుతోంది. తాజాగా నేవీ ముంబైలోని ఫ్లాట్ల ధరలకు రెక్కలు రావడంతో అవి ఒక్క సారిగా ప్రారంభ ధర కంటే 5 రేటు పెరిగి అందరనీ ఆశ్చరపరిచింది. బాబోయ్.. ప్లాటు ధరలకు రెక్కలు సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) నవీ ముంబైలోని ఓ ప్రాంతానికి సంబంధించిన 28 ప్లాట్లను బ్లాక్లో ఉంచింది. అయితే ఊహించని విధంగా ఆ ప్లాటు ఒక చదరపు మీటరుకు రూ. 5.54 లక్షలు వసూలు చేసింది. ఇ-వేలం ఈ ఇరవై ఎనిమిది ప్లాట్లు గాను సిడ్కో దాదాపు రూ.1,365 కోట్లను ఆర్జించనుంది. గతంలో దీని ప్రారంభ ధర రూ.1.14 లక్షలుగా నిర్ణయించగా ప్రస్తుతం రయ్ అంటూ దూసుకుపోయి ఐదు రెట్లు ఎక్కువగా పలుకుతోంది. సెక్టార్ 20, పామ్ బీచ్ రోడ్, సన్పాద వద్ద ఉన్న సుమారు 1.3 ఎకరాల ప్లాట్ (5,526 చదరపు మీ) రూ. 306 కోట్లు బిడ్ను దక్కించుకుంది. ఈ బిడ్ను గెలుచుకున్న బిల్డర్ డీపీవీజి వెంచర్స్కి చెందిన యజమానులు మాట్లాడుతూ.. పామ్ బీచ్ రోడ్లో సముద్రానికి ఎదురుగా ఉన్న ప్రధాన ప్లాట్లలో ఇది చివరిది. అందుకే ఇది రికార్డు ధర పలికిందన్నారు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. వాటికి చెక్, ఈ–కామర్స్ కంపెనీలు ఇలా చేయాల్సిందే! -
బాబోయ్, హైదరాబాద్లో పెరిగిన ఇళ్ల ధరలు.. కారణం ఎంటంటే!
న్యూఢిల్లీ: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల ధరలు సెప్టెంబర్ త్రైమాసికంలో 8 శాతం పెరిగాయి. చరదపు అడుగు ధర రూ.9,266కు చేరుకుంది. దేశంలో అత్యధికంగా ఢిల్లీ–ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల ధరలు 14 శాతం పెరిగాయి. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.7,741గా ఉంది. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల రియల్టీ ధరల వివరాలతో క్రెడాయ్–కొలియర్స్, లియాసెస్ ఫొరాస్ నివేదిక విడుదలైంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు సగటున 6 శాతం పెరిగాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో అత్యధికంగా గోల్ఫ్కోర్స్ రోడ్డులో ఇళ్ల ధరలు 21 శాతం పెరిగాయి. ► కోల్కతాలో సగటున 12 శాతం అధికమై, చదరపు అడుగు ధర రూ.6,954గా ఉంది. ► అహ్మదాబాద్ పట్టణంలో 11 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.6,077గా ఉంది. ► పుణెలో 9 శాతం వృద్ధితో చదరపు అడుగు ధర రూ.8,013కు చేరింది. ► బెంగళూరులో 6% పెరిగి రూ.8,035గా ఉంది. ► చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ధరల్లో పెద్ద మార్పు లేదు. చెన్నైలో చదరపు అడుగు రూ.7,222గా, ఎంఎంఆర్లో రూ.19,485 చొప్పున ఉంది. ► 2022 ఆరంభం నుంచి డిమాండ్ బలంగా ఉండడం, నిర్మాణ వ్యయాలు అధికం కావడంతో ఇళ్ల ధరలు పెరుగుతూ వచ్చినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘కే’ షేప్డ్ రికవరీ ‘‘దేశవ్యాప్తంగా రియల్ఎస్టేట్ మార్కెట్ ధరల పరంగా ‘కే’ ఆకారపు రికవరీ తీసుకుంది. వినియోగదారుల కొనుగోలు సెంటిమెంట్ బలంగా కొనసాగింది. అద్దె ఇంటి కంటే సొంతిల్లు అవసరమనే ప్రాధాన్యత కరోనా తర్వాత ఏర్పడింది’’అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ హర్ష వర్ధన్ పటోడియా చెప్పారు. డిమాండ్ ఉన్నందున అమ్ముడుపోని మిగులు ఇళ్ల నిల్వలు ఇక ముందు తగ్గుతాయని అంచనా వేశారు. ఇళ్ల ధరల పెరుగుదల అంతర్జాతీయంగా నెలకొన్న ద్రవ్యోల్బణ ధోరణలకు అనుగుణంగానే ఉందన్నారు. డిమాండ్ బలంగా ఉండడంతో ఇళ్ల ధరల పెరుగుదల ఇంక ముందూ కొనసాగొచ్చని అంచనా వేశారు. చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
Hyderabad: మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో స్థలాలు
సాక్షి, సిటీబ్యూరో: సర్కారు భూముల వేలానికి సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రీబిడ్ సమావేశాలకు ఆసక్తిగల కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. హెచ్ఎండీఏ పరిధిలోని బహదూర్పల్లి, కుర్మల్గూడ, తుర్కయంజాల్, తొర్రూరులతో పాటు, మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని అమిస్తాపూర్లో ప్రభుత్వ స్థలాలను ఈ– వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో గతంలో నిర్వహించిన ఈ– వేలం ద్వారా కొన్ని ప్లాట్లను విక్రయించగా మిగిలిన వాటిని రెండో దశలో విక్రయించేందుకు అధికారులు తాజాగా చర్యలు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న స్థలాలు కావడంతో సాధారణ, మధ్యతరగతి వర్గాల నుంచి రియల్టర్లు, బడా బిల్డర్ల వరకు కూడా ప్రభుత్వ స్థలాల కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకొనే మధ్యతరగతి వర్గాలకు బహదూర్పల్లి, తొర్రూరులలో 197 చదరపు గజాల నుంచి 267 చదరపు గజాల విస్తీర్ణం వరకు కూడా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బహదూర్పల్లి, తుర్కయంజాల్, కుర్మల్గూడ, తొర్రూరు, తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల కోసం 325 చదరపు గజాల నుంచి గరిష్టంగా 1,145 చదరపు గజాల వరకూ గరిష్ట విస్తీర్ణంలో కొన్ని ప్లాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి 23 వరకు ప్లాట్లకు ఈ– వేలం నిర్వహించనున్నారు. ఆదాయ మార్గాల అన్వేషణలో.. ► ఆదాయ సముపార్జన కోసం ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. హైదరాబాద్తో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల విక్రయానికి చర్యలు చేపట్టింది. హెచ్ఎండీఏ పరిధిలోని స్థలాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఈసారి సుమారు రూ.500 కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు అంచనా. కుర్మల్గూడ, తొర్రూర్లలో చదరపు గజానికి రూ.10 వేల చొప్పున కనీస ధర నిర్ణయించగా, తుర్కయంజాల్లో కనీస ధర రూ.40 వేలుగా నిర్ణయింంచారు. బహదూర్పల్లిలో కనీస ధర రూ.25వేల చొప్పున ఉంటుంది. అన్నిచోట్లా ఈసారి భారీ డిమాండ్ ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ► ఒకవైపు భూముల విక్రయం ద్వారా ఆదాయం కోసం చర్యలు తీసుకొంటూనే మరోవైపు గతంలో నిలిచిపోయిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా కూడా ఫీజుల రూపంలో ఖజానా నింపుకొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని సుమారు 633 వెంచర్లను అధికారులు గుర్తించారు. వీటికి ఎల్ఆర్ఎస్ జారీ చేస్తే మరో రూ.500 కోట్ల వరకు ఫీజుల రూపంలో లభించే అవకాశం ఉంది. (క్లిక్ చేయండి: హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్.. ఎయిర్పోర్ట్కు సాఫీగా జర్నీ) -
అపార్ట్మెంట్లతో పోలిస్తే ఓపెన్ ప్లాట్లే ముద్దు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని హౌసింగ్.కామ్ తెలిపింది. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని రీసెర్చ్ హెడ్ అంకితా సూద్ పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13-21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్మెంట్ల ధరలలో మాత్రం 2-6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. (ప్రాపర్టీలకు డిమాండ్. రూ 2 కోట్లు అయినా ఓకే!) 2018-21 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్నగర్ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. కాగా.. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్కబల్లాపూర్, హోస్కేట్, కొంబల్గోడు ప్రాంతాల్లోని నివాస ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. 2018-21 మధ్య ఢిల్లీ-ఎన్సీఆర్లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. (ఉడాన్లో రెండో రౌండ్ కోతలు, భారీగా ఉద్యోగులపై వేటు) -
AP: మంగళగిరి టౌన్షిప్లో ప్లాట్లకు ఈ–వేలం.. వారికి 20 శాతం రాయితీ
సాక్షి, అమరావతి: మధ్య ఆదాయ వర్గాలకు అనువుగా మంగళగిరిలో అభివృద్ధి చేసిన జగనన్న స్మార్ట్ టౌన్షిప్లోని ప్లాట్లను ఈ–వేలం వేయనున్నట్టు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సులభ వాయిదాల్లో నగదు చెల్లించే సౌలభ్యం కల్పించినట్టు పేర్కొన్నారు. ఎంఐజీ లే అవుట్–2లో మొత్తం 267 ప్లాట్లు ఉన్నాయని, వీటిలో 200 చదరపు గజాల్లో 68, 240 చదరపు గజాల్లో 199 ఉన్నాయన్నారు. చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు లే–అవుట్లోని 10 శాతం ప్లాట్లు రిజర్వు చేయడంతో పాటు 20 శాతం రాయితీ కల్పించామని, విశ్రాంత ఉద్యోగులకు 5 శాతం ప్లాట్లను రిజర్వు చేసినట్టు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ప్లాట్ ధరలో 10 శాతం మొత్తం చెల్లించి ప్లాట్ బుక్ చేసుకోవచ్చన్నారు. అందిన దరఖాస్తులకు ఈ–లాటరీ నిర్వహిస్తామని, అందులో ఎంపికైనవారు ప్లాట్ కేటాయించిన నెలలోపు ఒప్పందం చేసుకుని ధరలో 30 శాతం సొమ్ము చెల్లించాలన్నారు. అనంతరం 6 నెలల్లో మరో 30 శాతం మొత్తం, ఏడాదిలోపు మిగిలిన 30 శాతం మొత్తం ధర చెల్లించవచ్చన్నారు. ప్లాట్కు మొత్తం ధర చెల్లించిన అనంతరం రిజిస్ట్రేషన్ చేయనున్నట్టు ప్రకటించారు. 40 శాతం మినహాయింపు ఎంఐజీలో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం నికర అమ్మకపు ధరలో 60 శాతం మీద మాత్రమే రిజిస్ట్రేషన్ చార్జీలు ఉంటాయని, మిగిలిన 40 శాతంపై రిజి స్ట్రేషన్ చార్జీలను మినహాయింపు ఇచ్చిందని వివేక్యాదవ్ తెలిపారు. ప్లాట్ పొందిన వారు ధర మొత్తం ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తున్నట్టు వివరించారు. అన్నిరకాల ప్రభుత్వ అనుమతులు ఉన్న ఈ ప్లాట్లకు సమీపంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్లాట్లు పొందాలనుకునే వారు పది శాతం ప్రారంభ ధర చెల్లించి నవంబర్ 19వ తేదీ లోగా https://migapdtcp.ap.gov.in లేదా https://crda.ap.gov.in వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు 0866–2527124 నంబర్లో సంప్రదించాలని సూచించారు. చదవండి: ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి! -
ప్లాట్ల కొనుగోలుదారులూ అదంతా మాయ.. కొంటే నిండా మునిగినట్టే!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: లేఅవుట్లో ఉన్న భూములకు కన్వర్షన్ జరిగిందా? ప్లాన్ అప్రూవల్ వచ్చిందా? వాస్తవంగా ప్లాట్లు వేశారా? రోడ్లు, సామాజిక అవసరాలకు భూమిని మినహాయించారా? ప్రభుత్వ భూములు, సాగునీటి కాలువలున్నాయా..? సొంతింటి కల సాకారం చేసుకోవాలనే ఆతృతతో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రజలు ఇప్పుడవేవీ తెలుసుకోవడం లేదు. స్థలం దొరికిందని ఆదరాబాదరాగా చెల్లింపులు చేసేస్తున్నారు. లొసుగును బయటపెట్టాల్సిన అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా చెక్ పెట్టడం లేదు. దీంతో చివరికి కొనుగోలుదారులు మోసపోవాల్సి వస్తోంది. రణస్థలం మండలం వరిశాంలో ఉన్న రామ్నగర్ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న వారి పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. అంతా మాయ.. వరిశాంలోని రామ్నగర్ లే అవుట్లో సర్వే నంబర్.23–7ఎ, 23–11, 23–12, 23–13, 23–14, 23–15లో గల ఏడెకరాల భూమిలో లేఅవుట్ వేసినట్టుగా నిర్వాహకులు కాగితాల్లో చూపిస్తున్నారు. ఎన్ని ప్లాట్లు వేశారో ఎవరికీ తెలియడం లేదు. అక్కడ ల్యాండ్ పొజిషన్ లేదు. దానికి కారణం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్ చేయించలేదు. లేఅవుట్ వేసేందుకు అనుమతి తీసుకోలేదు. అంతా కాగితాల్లోనే మాయాజాలం ప్రదర్శించి రణస్థలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ముందస్తు ఒప్పందమో మరేమిటో తెలియదు గానీ అధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. తమకు డాక్యుమెంట్ వచ్చిందని రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. పక్కాగా ఉన్న ప్లాట్లపై జరిగే క్రయ, విక్రయాలకు అనేక ప్రశ్నలు, అభ్యంతరాలు తెలిపే రిజిస్ట్రేషన్ అధికారులు.. వరిశాంలోని రామ్నగర్ లేఅవుట్కు సంబంధించి వస్తున్న అక్రమ డాక్యుమెంట్లపై కనీసం అడగడం లేదు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్ వచ్చీ రాగానే రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. దీనివెనక ఉన్న లాలూచీ ఏంటో వారికే తెలియాలి. ల్యాండ్ కన్వర్షన్, ప్లాన్ అప్రూవల్ లేని రామ్నగర్ లేఅవుట్లోని నంబర్.74 ప్లాట్ క్రయ, విక్రయాలకు సంబంధించి జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కొనుగోలుదారులు మునిగినట్టే.. వ్యవసాయ భూమిని లేఅవుట్గా వేయాలంటే ముందుగా ల్యాండ్ కన్వర్షన్ చేయాలి. దాని కోసం రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వానికి భూమి విలువలో 5శాతం చెల్లించి ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవాలి. దీని తర్వాత లేఅవుట్ వేసేందుకు వుడా లేదంటే సుడా నుంచి ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలి. ఇందుకు భూమి విలువలో 12శాతం చెల్లింపులు చేయాలి. తదననుగుణంగా వచ్చిన అనుమతుల మేరకు రోడ్లు, సామాజిక అవసరాల కోసం స్థలం మినహాయించి మిగతా స్థలాన్ని ప్లాట్లుగా విభజన చేయాలి. కానీ వరిశాంలోని రామ్నగర్ లేఅవుట్ భూమికి కన్వర్షన్ గాని, ప్లాన్ అప్రూవల్ గాని తీసుకోలేదు. ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించకుండానే కాగితాల్లో లేఅవుట్ సృష్టించారు. అందమైన బ్రోచర్లతో ప్లాట్లను అమ్మేస్తున్నారు. వారికి నమ్మకం కలిగేలా కొనుగోలుదారు పేరున సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించేస్తున్నారు. అంతే తప్ప వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం లేదు. లేఅవుట్లో విద్యుత్ సౌక ర్యం గాని, కాలువలు గాని ఉండడం లేదు. రోడ్లు, సామాజిక అవసరాల కోసం ఖాళీగా స్థలాన్ని మినహాయించిన పరిస్థితి లేదు. అసలు కొనుగోలుదారుల ప్లాట్ ఎక్కడో భౌతికంగా తెలియదు. దీనివల్ల కొనుగోలు చేసిన స్థలంలో భవిష్యత్లో ఇళ్లు కట్టుకోవాలంటే అనుమతి రాదు. ప్లాన్ ఇచ్చేందుకు అవకాశం ఉండదు. ఇవన్నీ రెగ్యులర్ చేస్తే తప్ప ఇంటి నిర్మాణానికి అనుమతి రాదు. కన్వర్షన్, ప్లాన్ అప్రూవల్కు మళ్లీ డబ్బులు చెల్లించాలి. రోడ్లు, సామాజిక అవసరాల కోసం కొనుగోలు చేసిన స్థలాల నుంచే కేటాయించాల్సి వస్తోంది. ఫలితంగా కొనుగోలు చేసే స్థలం విస్తీర్ణం కూడా తగ్గిపోనుంది. ఈ పరిస్థితి రాకుండా ముందుగా లేఅవుట్కున్న అనుమతులు పరిశీలించాలి. ప్లాన్ అప్రూవల్తో ఉన్న ప్లాట్లను గుర్తించి కొనుగోలు చేయాలి. ఇలా జరగకపోవడం వల్ల కొనుగోలుదారులు నిండా మునిగిపోతున్నారు. మరో వైపు ఇలాంటి వ్యవహారాలతో ప్రభుత్వ పరంగా ఆదాయానికి గండిపడుతోంది. రెండు తేదీల్లో తొమ్మిది ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు.. వరిశాంలోని అనధికారికంగా వేసిన రామ్నగర్ లేఅవుట్లో రెండు తేదీల్లో ఏకంగా తొమ్మిది ప్లాట్లకు రణస్థలం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. సర్వే నంబర్ 23–7ఎలో 60, 64, 65, 66, 74, 75, సర్వే నంబర్ 23–14లో 8, 23–14,23–15లో 6 నెంబర్ల గల ప్లాట్లకు గత నెల 25న రిజిస్ట్రేషన్లు చేశారు. సర్వే నంబర్ 23–14, 23–15లో గల 23వ ప్లాట్ను ఆగస్టు 3న రిజిస్ట్రేషన్ చేశారు. ఇదంతా పక్కా పథకం ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది. -
పట్నంలో 50 గజాలు .. పల్లెల్లో 75 గజాలు!
సాక్షి, హైదరాబాద్: సొంత జాగాల్లో ఇళ్లను నిర్మించుకునేవారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించే సరికొత్త గృహ నిర్మాణ పథకానికి రాష్ట్ర సర్కారు విధివిధానాలను ఖరారు చేయనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న రెండు పడక గదుల (డబుల్ బెడ్రూమ్) ఇళ్ల నిర్మాణ పథకం పూర్తిస్థాయి సవరణలతో, దానితో ఏ మాత్రం పోలిక లేకుండా కొత్త రూపుతో ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించుకునే ఇంటికి కనీసం 75 గజాల స్థలం ఉండాలి. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 50 గజాల నుంచి 75 గజాల మధ్య ఉండాలి. అయితే కింద ఒక గది, పైన మరొక గది నిర్మించుకునేందుకు అనుమతించే పక్షంలో కనీస స్థలం 35 గజాలు అయినా సరిపోతుంది. వీటితో పాటు ఇతర విధివిధానాలను సీఎం కేసీఆర్ పరిశీలించి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకాన్ని భారీగా సవరించి చేపడుతున్న నేపథ్యంలో..కొత్త పథకంలో సీఎం కేసీఆర్ మార్పులు, చేర్పులు చేస్తారని భావిస్తున్నారు. యావత్తు దేశం దృష్టినీ ఆకర్షించిన రెండు పడక గదుల ఇళ్ల పథకం విఫలమైందన్న ప్రచారానికి అవకాశం కల్పించకుండా, దీన్ని కూడా ప్రత్యేకంగా కనిపించేలా ఆయన మార్పులు చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్కు రాగానే దీనిపై దృష్టి సారించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే మార్పులు చేర్పుల ఆధారంగా తుది విధివిధానాలు రూపొందించి అధికారికంగా వెల్లడించనున్నారు. లేదంటే ప్రాథమిక అంశాలే తుది విధివిధానాలుగా ఖరారు కానున్నాయి. ఆదినుంచీ అవాంతరాలే.. రెండు పడక గదుల ఇళ్ల పథకానికి ఆది నుంచి ఎదురవుతున్న అవాంతరాలు దాన్ని సాఫీగా ముందుకు సాగనీయటం లేదు. మొత్తం 2.27 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచి ప్రారంభించారు. అయితే 1.10 లక్షల ఇళ్లే పూర్తి చేశారు. కానీ ఇప్పటివరకు కనీసం 20 వేల ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించలేదు. మిగతా వాటికి సంబంధించి అసలు లబ్ధిదారుల జాబితాలనే రూపొందించలేదు. దీన్ని తప్పుబడుతున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిధులు విడుదల చేసేందుకు ససేమిరా అంటోంది. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది. మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సొంత ఇంటి పథకం మార్పు వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు రూ.12 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా ప్రాథమికంగా విధివిధానాలు ఖరారు చేసింది. ప్రాథమికంగా ఇలా.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పథకానికి సంబంధించిన విధివిధానాలను ప్రాథమికంగా రూపొందించారు. ►ఈ ఇళ్లను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి (బీపీఎల్) మాత్రమే మంజూరు చేస్తారు. ►ఈ ఇళ్ల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్ ఉంటుంది. గతంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం ఇళ్లు కేటాయించిన దాఖలాలున్నాయి. సొంత స్థలాలున్న వారి సంఖ్య అందుకు సరిపడా లేదనుకున్నప్పుడు జనాభాలో వారి శాతం ఆధారంగా రిజర్వేషన్ ఉండాలి. ►పట్టణ ప్రాంతాల్లో మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉన్నందున అక్కడ వారికి 12 శాతం ఇళ్లు కేటాయించాలి. ►ఇళ్ల కేటాయింపు ప్రక్రియను రెండు గ్రామ సభల ద్వారా చేపట్టాలి. తొలి గ్రామ సభలో దరఖాస్తులు స్వీకరించాలి. తహసీల్దార్ ఆధ్వర్యంలో వాటి పరిశీలన పూర్తి చేసి అర్హుల జాబితా రూపొందించి రెండో సభలో వివరాలు వెల్లడించాలి. అభ్యంతరాలకు కూడా అవకాశం కల్పించాలి. ►ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లను కేటాయిస్తారు. మరికొన్ని ఇళ్లు ముఖ్యమంత్రి విచక్షణాధికారం పరిధిలో ఉంటాయి. వెరసి 4 లక్షల ఇళ్లను మంజూరు చేస్తారు. ►ఒక్కో ఇంటికి గరిష్టంగా రూ.3 లక్షలు కేటాయిస్తారు. వాటిని ఇళ్ల నిర్మాణం జరిగే కొద్దీ విడతల వారీగా విడుదల చేస్తారు. ►కబ్జాలో ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు 58, 59 జీవోల ద్వారా కల్పించిన వెసులుబాటు పరిధిలో ఉన్నవారు ఈ ఇళ్లు పొందేందుకు అనర్హులు. -
మధ్యతరగతి వర్గాలకు భరోసా జగనన్న స్మార్ట్ టౌన్షిప్
సాక్షి,గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మధ్యతరగతి ఆదాయ వర్గాల ప్రజల అభ్యున్నతికి జగనన్న స్మార్ట్ టౌన్షిప్ చక్కటి భరోసాను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్డీఏ) కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో తాడేపల్లి–మంగళగిరి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని నవులూరు ఎంఐజీ లేఔట్లో ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకున్నవారికి శనివారం విజయవాడలో ఈ–లాటరీ నిర్వహించారు. వివేక్ యాదవ్ మాట్లాడుతూ.. ఎంఐజీ ప్లాట్లకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మున్ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లేఔట్లో 60, 80 అడుగుల అనుసంధాన రహదార్లతోపాటు 40 అడుగులతో అంతర్గత సీసీ రహదార్లను కూడా నిర్మిస్తున్నామన్నారు. కాగా, నవులూరు ఎంఐజీ లేఔట్లో మొత్తం 147 మంది ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. 104 మందిని అర్హులుగా ఎంపిక చేశామని చెప్పారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఆన్లైన్ ర్యాండమ్ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు పత్రాలను అందజేశారు. చదవండి: ఎనీ డౌట్? కలామ్ పేరును చంద్రబాబు సూచించారనేది కేవలం భ్రమ -
101 మంది పేద కళాకారులకు ఉచితంగా రూ. 6 కోట్ల భూమి..
V Vijay Kumar Gives 101 Plots To Poor Artist: టెలివిజన్లోని 24 క్రాఫ్ట్స్ లో ఉండే వెనుకబడిన పేద కళాకారులకు 101 ఫ్లాట్స్ను విజన్ వి.విజయ్ కుమార్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గోపీనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విజన్ వి. విజయ్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పత్రాలను తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేశారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ 'చాలా మంది కోట్ల విలువజేసే భూమిని ఎందుకు ఇవ్వడం అన్నారు. అయితే నా దృష్టిలో మన పిల్లలకు మనం కోట్ల ఆస్తిని ఇవ్వడం ముఖ్యం కాదు. మన చుట్టూ ఉన్న పేద కార్మికులకు సహాయం చేస్తే మనకంటూ ఒక దైవ శక్తి వస్తుంది. ఆ దైవ శక్తి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అదే విధంగా మన పిల్లకు మంచి నాలెడ్జ్, ఆలోచనలు ఇస్తే వారు కూడా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారనేది నా అభిప్రాయం.' అని తెలిపారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 'టెలివిజన్లోని ఒక్కొక్క క్రాఫ్ట్ నుంచి ఐదుగురు కళాకారులను సెలెక్ట్ చేసుకొని విజయ్ కుమార్ 101 ఫ్లాట్స్ ఇవ్వడం మంచి విషయం. సుమారు రూ. 6 కోట్ల విలువ చేసే భూమిని ఇవ్వడం గొప్ప విషయం. పేదవాడి ఆశీర్వాదాలు మనకు జీవితకాలం తోడుగా ఉంటాయి. విజయ్కు వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటూ వారి బిజినెస్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.' అని పేర్కొన్నారు. -
31న అమరావతి టౌన్షిప్ ప్లాట్లకు ఈ–వేలం
సాక్షి,అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి–నవులూరు వద్ద అభివృద్ధి చేసిన అమరావతి టౌన్షిప్లోని మిగిలిన ప్లాట్లకు కూడా ఈ–వేలం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) నిర్ణయించింది. ఈ ప్రాంతంలో మొత్తం 285.17 ఎకరాల్లో 1,327 ప్లాట్లను అభివృద్ధి చేయగా.. దాదాపు 931 ప్లాట్లను గతంలో విక్రయించారు. మరో 331 ప్లాట్లను వివిధ లాట్లుగా విభజించిన సీఆర్డీఏ.. ఇందులో 29 ప్లాట్లను వేలం వేసేందుకు సిద్ధమైంది. ఈ వివరాలను సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. 200 చదరపు గజాల చొప్పున 23 ప్లాట్లు, 1,000 చదరపు గజాల చొప్పున ఉన్న ఆరు ప్లాట్లకు ఆన్లైన్లో వేలం నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం చదరపు గజానికి రూ.17,800గా ధర నిర్ణయించిందని, ఆసక్తి గలవారు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 31వ తేదీ ఉదయం నుంచి ఆన్లైన్లో వేలం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వివరాలకు https:// konugolu. ap. gov. in Ìôæ§é https:// crda. ap. gov. in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. క్రికెట్ స్టేడియం, ఎయిమ్స్కు అతి దగ్గరలో.. నవులూరు వద్ద జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న ఈ లే అవుట్లోని ప్లాట్లకు ప్రభుత్వ అనుమతులన్నీ ఉన్నాయని.. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ చెప్పారు. ప్లాట్లకు అతి దగ్గరలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అకాడమీ, ఎయిమ్స్ ఆస్పత్రితో పాటు మంగళగిరి రైల్వేస్టేషన్ తదితర సదుపాయాలు ఉన్నాయని, త్వరలో మరికొన్ని జాతీయ విద్యా సంస్థలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.1,180 ఫీజు చెల్లించి ‘కొనుగోలు’ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అమరావతి టౌన్షిప్ ప్లాట్లను వేలంలో ఎవరైనా దక్కించుకోవచ్చని చెప్పారు. వివరాలకు 0866–246370/71/72/73/74 నంబర్లను సంప్రదించాలన్నారు. -
ఇళ్ల స్థలాల పై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
-
‘శ్రీలక్ష్మి’ నీ మహిమలూ..! తప్పు అధికారులది.. శిక్ష కొనుగోలుదారులకు
సాక్షి,హైదరాబాద్: ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన సొమ్ముతో ఓ వ్యక్తి విల్లా కొనాలనుకున్నాడు. మల్లంపేటలో ఓ ప్రాజెక్ట్ను చూశాడు. నిర్మాణ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాడు. బ్యాంక్ రుణం వస్తుందా అని ఆరా తీశాడు. తక్కువ ధర, నచ్చిన చోటు కావటంతో కొనుగోలు చేసేశాడు. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. బ్యాంక్కు రెండు ఈఎంఐలు కూడా చెల్లించేశాడు. ఇక గృహ ప్రవేశం చేయడమే తరువాయి! కానీ అకస్మాత్తుగా మున్సిపల్ అధికారులు వచ్చి తన విల్లాకు ‘ఇది అక్రమ నిర్మాణం’ అని ఫ్లెక్సీ తగిలించిపోయారు. అసలేం జరుగుతుందో బాధితుడికి అర్థం కాలేదు. అనుమతి పత్రాలున్నాయి.. రిజిస్ట్రేషన్ అయిపోయింది.. బ్యాంక్లోనూ మంజూరు చేసింది కదా అని నెత్తీ నోరూ బాదుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పోనీ, సదరు యజమాని దగ్గరికి వెళ్దామంటే.. ఆ బిల్డర్ విదేశాలకు చెక్కేశాడు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఓ విల్లా యజమానిది.. ఇలా ఒకరో ఇద్దరో కాదు మల్లంపేటలోని శ్రీ లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లా ప్రాజెక్ట్ బాధితులు వందల సంఖ్యలోనే ఉన్నారు. ఆక్రమించి.. రహదారిగా చేసి.. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట రెవెన్యూ పరిధిలోని 170/3,170/4,170/5 సర్వే నంబర్లలోని 15 ఎకరాల భూమిని పాతికేళ్ల క్రితం ముగ్గురు స్వాతంత్ర సమరయోధులకు ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత భూమి పలువురి చేతులు మారి.. కొన్నేళ్ల క్రితం శ్రీ లక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ సంస్థకు చేరింది. మూడేళ్ల క్రితం 3.20 ఎకరాల స్థలంలో విల్లాల నిర్మాణం కోసం ఆ సంస్థ.. 6,418 చదరపు గజాలలో 35 విల్లాలు, 5,394 చదరపు గజాలలో మరో 30 విల్లాల నిర్మాణ అనుమతుల కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకుంది. ఆశ్చర్యకర విషయమేంటంటే.. సదరు భూమి మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోన్లోనే లేదు. అయినా సరే హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చేసింది. పైపెచ్చు ఈ వెంచర్కు రహదారి కూడా లేదు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి రహదారిగా మలచడం గమనార్హం. నకిలీ అనుమతులు సృష్టించి.. 2018లో మల్లంపేట గ్రామపంచాయతీగా ఉండేది. దీన్నే అవకాశంగా మలుచుకున్న నిర్మాణ సంస్థ.. గ్రామ పంచాయతీ అనుమతి పత్రాలు సృష్టించి అక్రమంగా 260 విల్లాలను నిర్మించింది. హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చిన 65 విల్లాలకు పక్కనే మరో 15 ఎకరాల స్థలం ఉంది. దీన్ని ఆనుకొని కొత్త చెరువు ఉంది. ఆ 15 ఎకరాల్లో అప్పటి మల్లంపేట పంచాయతీ కార్యదర్శులు 260 విల్లాలకు నిర్మాణ అనుమతులు ఇచ్చినట్లు పత్రాలను సృష్టించారు. ఇందులో 40 విల్లాలు చెరువు బఫర్జోన్లో ఉన్నాయి. చెరువు హద్దుల నిర్ధారణకు రెవెన్యూ, నీటిపారుదలశాఖ సంయుక్త సర్వే చేసినప్పటికీ, ఈ నివేదికను స్థానికంగా రెవెన్యూ అధికారులకు ఇరిగేషన్ అధికారులు ఇవ్వకపోవడం గమనార్హం. చెరువులోకి మురుగు చెరువుకు ఆనుకుని ఉన్న 16 గుంటల ఎఫ్టీఎల్, మూడు ఎకరాల బఫర్ జోన్లో విల్లాలతో పాటు నిర్మాణ వ్యర్థాలతో ఏకంగా రోడ్డును ఏర్పాటు చేసింది. చెరువులో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడి విల్లా నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. విల్లాల మధ్య అంతర్గత రోడ్లు 30 అడుగుల వెడల్పు లేవు. పైగా మురుగు నీరంతా కొత్త చెరువులో కలిసే విధంగా డ్రైయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్కు విద్యుత్ శాఖ అధికారులు భూగర్భ కేబుల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంత వ్యవహారం జరుగుతున్నా నాలుగేళ్లుగా ఏ ఒక్క అధికారి నోరుమెదపలేందంటే ఈ వ్యవహారం వెనుక ఉన్న ‘పెద్దలు’ ఏ స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గుట్టు రట్టయిందిలా.. విల్లాల అక్రమ నిర్మాణాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో జిల్లా కలెక్టర్ హరీష్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు డీపీఓ రమణ మూర్తి, డీఎల్పీఓ స్మిత క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 260 విల్లాలకు అనుమతులు లేవని నిర్ధారించారు. దీంతో ఆయా విల్లాలను దుండిగల్ మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. బఫర్ జోన్లో ఉన్న విల్లాలను కూల్చివేసేందుకు పురపాలక అధికారులు ఉపక్రమించగా.. నిర్మాణ సంస్థ కోర్టును ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకోవటం కొసమెరుపు. -
ఆస్తి పన్ను స్వీయ మదింపు అక్రమాలకు చెక్ ?
సాక్షి, హైదరాబాద్: అనధికార/అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం కొందరు అక్రమార్కులు ఆస్తి పన్నుల స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) ప్రక్రియను దుర్వినియోగపరుస్తుండడాన్ని రాష్ట్ర పురపాలక శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ అక్రమాలను అడ్డుకునే దిశగా చర్యలు చేపట్టింది. ఆస్తిపన్ను పేరు చెప్పి అక్రమ లేఅవుట్లు/ ప్లాట్లకు చెక్ పెట్టేందుకు కనీసం ఒకసారి రిజిస్టర్ అయిన ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అనుమతి లేని ప్లాట్లను కొందరు అక్రమార్కులు గృహాలు/భవనాలుగా పేర్కొంటూ, వాటికి ఆస్తి పన్నుల స్వీయ మదింపు నిర్వహిస్తున్నారు. తద్వారా వచ్చిన ఆస్తి పన్ను నంబర్ ఆధారంగా వాటికి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. దీనిపై పురపాలక శాఖకు ఫిర్యాదులు కూడా అందాయి. వాస్తవానికి ఆన్లైన్లో ఆస్తి పన్ను స్వీయ మదింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఆటోమెటిక్గా ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్తో కూడిన ఆస్తి పన్ను డిమాండ్ నోటీసును ప్రింట్ చేసుకోవడానికి పురపాలక శాఖే అవకాశం కల్పించింది. అయితే ఈ డిమాండ్ నోటీసులోని ఆస్తి పన్ను నంబర్ ఆధారంగా అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో పురపాలక శాఖ గుర్తించింది. 15 రోజుల తర్వాతే ప్రింట్ అక్రమాలకు చెక్ పెట్టేలా ఇకపై ఆస్తి పన్నుల స్వీయ మదింపు పూర్తి చేసిన 15 రోజుల తర్వాతే డిమాండ్ నోటీస్ ప్రింట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆ 15 రోజుల్లోగా సంబంధిత పురపాలికల అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి వాస్తవ స్థితిని నిర్థారించుకోనున్నారు. అలా నిర్ధారించుకున్న తర్వాతే ఆస్తి పన్ను డిమాండ్ నోటీస్ను ప్రింట్ చేసుకునేలా అవకాశం కల్పించనున్నామని పురపాలకశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు మార్గదర్శకాలను త్వరలోనే అన్ని పురపాలికలకు జారీ చేయనున్నామని చెప్పారు. -
ప్లాట్ల పేరుతో మోసం.. రూ.5 కోట్లు వసూలు
సాక్షి, హైదరాబాద్: ప్లాట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని చాంద్రాయణగుట్ట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ప్లాట్ రిజిస్ట్రేషన్ పేరుతో కోట్లలో మోసాలకు పాల్పడిన ఘరానా మోసగాడు అబ్దుల్ రషీద్ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అబ్దుల్ రషీద్ 15 మందికి ప్లాట్స్ ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి 5 కోట్లు వసూలు చేశాడు. ఆ డబ్బు తీసుకుని ప్లాట్స్ ఇప్పించకుండా సొంత ఖర్చులకు వాడుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు.. చాంద్రాయగుట్ట పోలీసులు రషీద్ మీద కేసు నమోదు చేశారు. శనివారం అదుపులోకి తీసుకున్నారు. -
బిల్డర్స్ లాబీని అడ్డుకోండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘భవన నిర్మాణ వ్యయంలో సిమెంటు పాత్ర అతి స్వల్పం. బిల్డర్లు 100 శాతానికిపైగా మార్జిన్లను ఉంచుకుని ఇళ్ల ధరలను నిర్ణయిస్తున్నారు. పైగా పెరిగిన ఇళ్ల ధరలకు సిమెంటు కంపెనీలను బాధ్యులను చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బిల్డర్లు ఇలా ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ సిమెంటు తయారీ సంస్థల ప్రతినిధులు ఘాటుగా స్పందించారు. కొత్తగా ఏర్పాటైన దక్షిణ భారత సిమెంట్ తయారీదారుల సంఘం మంగళవారం వర్చువల్గా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. బిల్డర్స్ లాబీని అడ్డుకోవడానికి ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని వారు వెల్లడించారు. ‘ప్రతి బిల్డర్ ధర విషయంలో పారదర్శకంగా ముందుకు రావడంతో పాటుగా ఇళ్ల ధరలను కనీసం 50% తగ్గించాల్సిందిగా కోరాలి. అదే రీతిలో చెక్ ద్వారా లావాదేవీలు జరపకపోతే తగిన చర్యలు తీసుకోవాలి’ అని లేఖ ద్వారా ప్రధానికి విన్నవించామన్నారు. సంఘం ప్రెసిడెంట్, ఇండియా సిమెంట్స్ వీసీ, ఎండీ ఎన్.శ్రీనివాసన్, వైస్ ప్రెసిడెంట్, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, సెక్రటరీ, పెన్నా సిమెంట్స్ డైరెక్టర్ కృష్ణ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడారు. లేఖలో వెల్లడించిన అంశాలు వారి మాటల్లోనే... సిమెంట్ తయారీ కేంద్రంగా..: అసలైన ఆత్మనిర్భర్ సాధించిన పరిశ్రమలలో సిమెంట్ రంగం ఒకటి. పరిమాణం పరంగా 500 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో భారత్ రెండవ స్థానంలో ఉంది. చైనా 2.5 బిలియన్ టన్నులతో అగ్రస్ధానంలో, యుఎస్ 70 మిలియ న్ టన్నులతో 3వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లోని కంపెనీల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 200 మిలియన్ టన్నులకు చేరుకుంది. లైమ్స్టోన్ డిపాజిట్లతో కేవలం 7 రాష్ట్రాల్లోనే సిమెంట్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. భారత్ లైమ్స్టోన్ నిల్వల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడింట ఒకవంతు కలిగి ఉన్నా యి. భారత్తోపాటు ఎగుమతుల పరంగానూ భవిష్యత్లో సిమెంట్ కేంద్రంగా నిలిచే సామర్థ్యం దక్షిణాదికి ఉంది. కృత్రిమ ధరలతో విక్రయాలు..: సిమెంట్ పరిశ్రమకు తదనుగుణంగా భారతదేశపు వృద్ధికి సమస్యగా పరిణమిస్తున్నది గృహ రంగంలో వృద్ధి సానుకూలంగా లేకపోవడం. ఇందుకు ఏకైక కారణమేమిటంటే కృత్రిమంగా ఫ్లాట్స్, గృహాలను అధిక ధరలకు విక్రయిస్తుండటమే. క్రెడాయ్ మరియు బిల్డర్స్ అసోసియేషన్ పేరిట స్పష్టంగా బిల్డర్లతో కూడిన బృందం దీని కోసం పనిచేస్తోంది. వీరు ఏకంగా 100%కు పైగా మార్జిన్లును ఉంచుకుని ధరలను నిర్ణయిస్తున్నారు. ఎబిటా మార్జిన్ నిర్మాణ సంస్థలకు 35–50 శాతం ఉంటే, సిమెంటు కంపెనీలకు 15 శాతంలోపే ఉంది. దురదృష్టవశాత్తు అధికార యంత్రాంగ లాభదాయక విధానాల కోసమే పాటుపడుతున్న వీరిపై ఎలాంటి కఠినచర్యలనూ తీసుకోలేదు. కొనుగోలుదార్లకు ఫ్లాట్స్, గృహాలను సహేతుక ధరలో విక్రయిస్తే మనీ సర్క్యులేషన్ గణనీయంగా వృద్ధి చెందుతుంది. తద్వారా భారతీయ ఆర్ధిక వ్యవస్థ సైతం వృద్ధి చెంది ఉపాధి కల్పనకూ దోహద పడుతుంది. నిర్మాణ రంగం బాగుంటే సిమెంట్కు డిమాండ్ సైతం పెరుగుతుంది. నిర్మాణ వ్యయం కంటే అధికంగా.. ఓ ఫ్లాట్ ధరలో అత్యంత కీలకపాత్ర పోషించేది భూమి. చెన్నైలో అత్యధిక రేటు కలిగిన ప్రాంతంలో భూముల ధరలకు సంబంధించిన మార్గదర్శకాలను మేము పరిశీలించాము. అది చదరపు అడుగుకు రూ.10 వేలు. 2/2.4 ఎఫ్ఎస్ఐను తీసుకుంటే.. ఓ ఫ్లాట్లో అది చదరపు అడుగుకు సుమారు రూ.4,200 అవుతుంది. దీనికి నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.2,000–2,500 జోడిస్తే ఫ్లాట్ ఖర్చు గరిష్టంగా చదరపు అడుగుకు రూ.6,700 అవుతుంది. అయితే ఇక్కడ విక్రయ ధర చదరపు అడుగుకు రూ.15–20 వేలు ఉంది. అమ్ముడు కాకుండా అసాధారణ ఇన్వెంటరీ ఉంది. కానీ బిల్డర్స్ లాబీ మాత్రం ధరలను కొద్దిగా కూడా తగ్గడానికి అనుమతించడం లేదు. లక్షల్లో ఇన్వెంటరీ ఉన్నా.. దేశ వ్యాప్తంగా 9 ప్రధాన మార్కెట్లలోనే 75 లక్షల ఫ్లాట్స్ అమ్ముడు కాకుండా ఉన్నట్లు అంచనా. దీనిలో అసంపూర్తిగా నిర్మితమైన ఫ్లాట్స్ను మినహాయించడం జరిగింది. ఒకవేళ బిల్డర్లు తమ ధరలను తగ్గించుకుంటే ఈ మొత్తం అమ్ముడవుతుంది. రియల్టీ డిమాండ్ కూడా పెరుగుతుంది. మధ్య తరగతి, అల్పాదాయ వర్గాలకు ఓ గూడు కూడా లభ్యమవుతుంది. బిల్డర్లు ఇప్పుడు ప్రధానమంత్రి అందుబాటు గృహ పథక ప్రయోజనాలను పొందడమే కాదు.. ప్రజలకు ఈ లబ్ధి అందించేందుకు సైతం నిరాకరిస్తున్నారు. ఎవరైనా దీని గురించి ప్రశ్నిస్తే పెరిగిన ఇన్పుట్ ధరలు మరీ ముఖ్యంగా సిమెంట్ గురించి చెబుతుంటారు. కానీ ఒక చదరపు అడుగు నిర్మించడానికి అరబ్యాగు సిమెంట్ మాత్రమే ఖర్చవుతుంది. విక్రయ ధరలో సిమెంట్ వాటా కేవలం 1.5–2 శాతం మాత్రమే. ఒకవేళ బస్తాకు రూ.100 సిమెంట్ ధర పెరిగినా నిర్మాణ ఖర్చు అడుగుకు రూ.50 మాత్రమే అధికం అవుతుంది. -
జోరందుకున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. మరింత రద్దీ
సాక్షి, ఖమ్మం : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించడంతో రిజిస్టేషన్ల ప్రక్రియ జోరందుకుంది. మొన్నటి వరకు స్తబ్దుగా నడిచిన రిజిస్టేషన్ల ప్రక్రియ తాజా ప్రభుత్వ నిర్ణయంతో పుంజుకుంది. ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండా పాత పద్దతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. పాత వాటికి లింకు డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుందని, అయితే కొత్తవాటికి మాత్రం ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్టేషన్ చేస్తున్నామని సబ్ రిజిస్టార్ అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. చదవండి: హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం ఎల్ఆర్ఎస్ రద్దుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 11సబ్ రిజిస్ట్రార్ కార్యాయాల పరిధిలో రోజువారి రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే కొంత ఆలస్యమైన ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని క్రయవిక్రయాలకు సంబందించి రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చేవారు చెప్పుకొస్తున్నారు. న్యూ ఇయర్కు ఒక మంచి గిఫ్ట్గా భావిస్తున్నామని చెబుతున్నారు. కాగా రిజిస్టేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ధరణి పోర్టల్తోపాటు ఎల్ఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గతంలో అన్ని రకాల ఆస్తుల రిజిస్టేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిర్వహించేవారు. అయితే కొత్త పద్దతిలో మాత్రం వ్యవసాయ ఆస్తుల రిజిస్టేషన్లను తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించాలని, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
అమ్ముడుపోని 4 లక్షల ఫ్లాట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 9 పట్ట ణాల్లో రియల్ ఎస్టేట్ డెవలపర్ల వద్ద అమ్ముడుకాని అందుబాటు ధరల ఫ్లాట్లు 4.12 లక్షలు ఉన్నట్టు ప్రాప్ టైగర్ డాట్ కామ్ తెలిపింది. ఇవన్నీ కూడా రూ.45 లక్షల ధరల్లోపువేనని పేర్కొంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్, ముంబై, కోల్కతా, నోయిడా, గుర్గ్రామ్లో అమ్ముడు కాకుండా డెవలపర్ల వద్ద మొత్తం 7,97,623 గృహ యూనిట్లు ఉన్నాయి. ఇందులో అందుబాటు ధరల్లోనివి (రూ.45 లక్షల్లోపు) 4,12,930. హైదరాబాద్లో అమ్ముడవకుండా ఉన్న అందుబాటు ధరల ఫ్లాట్లు 4,881. అత్యధికంగా ముంబైలో 1,39,984 యూనిట్లు ఉన్నాయి. -
ఎందుకో.. ఏమో?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు ఉప్పల్ భగాయత్ వరంగా మారింది. ఇప్పటికే ఏప్రిల్లో ఈ–వేలం వేసిన 67 ప్లాట్లతో రూ.677 కోట్లు ఆదాయం వచ్చింది. అయితే అవి పోగా ఇంకా లక్ష గజాల విస్తీర్ణంలో ప్లాట్లు ఉండగా... వాటిపై హెచ్ఎండీఏ ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే రోడ్లు, మురుగునీటి వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు తదితర సౌకర్యాల కల్పన కూడా పూర్తయింది. కానీ అధికారులు మాత్రం ఈ–వేలంలో జాప్యం చేస్తున్నారు. ఈ ప్లాట్లను విక్రయిస్తే గజానికి రూ.40వేల నుంచి రూ.60వేల వరకు పలికినా సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముంది. ఈ నిధులతో శివారు ప్రాంతాల అభివృద్ధి వేగిరమయ్యే చాన్స్ ఉంది. ఇప్పటికే హెచ్ఎండీఏకు ఎల్ఆర్ఎస్ ద్వారా సమకూరిన రూ.వెయ్యి కోట్లతో పాటు ఉప్పల్ భగాయత్లోని 67 ప్లాట్ల విక్రయం ద్వారా వచ్చిన రూ.677 కోట్లను దశల వారీగా శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు గ్రోత్ కారిడార్లో రేడియల్ రోడ్లు, స్పైక్ రోడ్ల అభివృద్ధికి రూ.వందల కోట్లు అవసరం ఉండడంతో ఈ ప్లాట్లను వేలం వేస్తే మంచిదని హెచ్ఎండీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ముగిశాకే ఈ–వేలం నిర్వహించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. మెట్రో రాకతో డిమాండ్... 2005లో ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్ కన్జర్వేషన్ అండ్ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్లో భాగంగా ల్యాండ్పూలింగ్ కింద ఉప్పల్ భగాయత్ రైతుల నుంచి 733 ఎకరాలను సేకరించింది. ఇందులో మెట్రో రైలు డిపో, జలమండలి మురుగు శుద్ధి నీటి కేంద్రం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కొంత కేటాయించింది. మిగిలిన 413.32 ఎకరాల్లో 20,00,468 చదరపు గజాల్లో ఉప్పల్ భగాయత్ పేరుతో లేఅవుట్ను అభివృద్ధి చేసింది. రాష్ట్ర విభజన, కోర్టు కేసులు, యూఎల్సీ భూములు ఉండడంతో భూములు కోల్పోయిన రైతులకు ఆలస్యంగానైనా 2017 మార్చిలో 1,520 మందికి లాటరీ రూపంలో ప్లాట్లు కేటాయించారు. ఎకరం భూమి కోల్పోయిన వారికి వేయి గజాల చొప్పున కేటాయించారు. 8,84,205 చదరపు గజాల్లో లేఅవుట్ వేస్తే 7,58,242 చదరపు గజాలను 1,520 మందికి ప్లాట్లుగా ఇచ్చారు. వీరికిపోను అభివృద్ధి చేసిన 1,25,963 చదరపు అడుగుల్లో ఉన్న 67 ప్లాట్లను ఈ ఏడాది ఏప్రిల్లో ఆన్లైన్ వేలం వేయగా రూ.667 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఇందులో రెండు ప్లాట్ల బిడ్డర్లు హెచ్ఎండీఏ నియమ నిబంధనల ప్రకారం అసలులో 25 శాతం డబ్బును చెల్లించకపోవడంతో రద్దు చేశారు. అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న లక్ష గజాల విస్తీర్ణం ప్లాట్లలో ఎక్కువగా 200 నుంచి రెండు వేల గజాల మధ్య ఉన్నవే అత్యధికంగా ఉన్నాయి. ప్లాట్ సైజు, లొకేషన్ బట్టి గజానికి ధరను రూ.30వేల నుంచి రూ.35 వేల వరకు నిర్ణయించే అవకాశముందని హెచ్ఎండీఏ వర్గాలు అంటున్నాయి. ఇదికాకుండా ఉప్పల్ భగాయత్కు సమీపంలోనే మరో 120 ఎకరాల భూమి అందుబాటులో ఉండటంతో సాధ్యమైనంత తొందరగా వీటిని కూడా ప్లాట్లు చేస్తే సంస్థకు కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. -
కల నిజమాయె!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ప్రజలు సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. నిర్మాణం పూర్తయిన ఫ్లాట్లు, ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో నిర్మాణ రంగం జెట్ స్పీడుతో దూసుకెళుతోంది. ఫ్లాట్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గడంతో కొత్తగా ప్రారంభమవుతున్న నిర్మాణాలకు గిరాకీ పెరుగుతోందని అనరాక్ ప్రాపర్టీస్ సంస్థ చేసిన తాజా అధ్యయనంలో తేలింది. ప్రధానంగా అన్ని హంగులతో నిర్మాణం పూర్తయి, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లపై కొనుగోలుదార్లు ఎక్కువగా ఆకర్షితులవుతున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. గతంతో పోలిస్తే ఈ సెగ్మెంట్లో ఇళ్లకు డిమాండ్ 5 నుంచి 18 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసేవారిలో 58 శాతం మంది తాము నివాసం ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. మరో 42 శాతం మంది సమీప భవిష్యత్లో మంచి ధర పలకుతుందని, తమ పెట్టుబడికి మంచి లాభదాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతో కొనుగోలు చేస్తుండడం విశేషం. జీఎస్టీ తగ్గింపే అసలు కారణం స్థిరాస్తి నియంత్రణ చట్టం (రెరా) అమల్లోకి రావడం, జీఎస్టీ రేట్లు తగ్గడంతో కొత్త నిర్మాణాలపై కొనుగోలుదార్లకు నమ్మకం పెరుగుతోందని ఈ సర్వేలో ప్రకటించారు. నగరంలో ప్రధానంగా అధిక శాతం మధ్యతరగతి వేతనజీవులు రూ.80 లక్షల లోపు స్థిరాస్తులను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి అందుబాటు ధరల గృహాలపై జీఎస్టీ రేటు 8 శాతం నుంచి 1 శాతానికి తగ్గింది. అదే సమయంలో ఈ విభాగంలోకి రాని నిర్మాణాలపై 12 శాతం ఉన్న జీఎస్టీ 5 శాతానికి చేరడంతో అమ్మకాలు, కొనుగోళ్లు ఊపందుకున్నాయి. తాజా పరిణామం ఫ్లాట్ల కొనుగోలుదారులకు భారం తగ్గించిందని, గిరాకీ పెరగడానికి దోహదం చేసిందని అనరాక్ సంస్థ తెలిపింది. పన్ను పరంగా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో పాటు, మార్కెట్ పరిస్థితులు కూడా కలిసి వస్తుండటంతో నగరంలో స్థిరాస్తి రంగం వేగం పుంజుకుందని తెలిపింది. శివార్లలో రియల్ భూమ్ గ్రేటర్ శివార్లలో రియల్ భూములకు రెక్కలొచ్చాయి. ప్రధానంగా నిర్మాణ రంగానికి శివార్లు కొంగుబంగారంగా మారాయి. అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు అధికంగా కొనుగోలుచేసే గృహ సముదాయాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు స్థాయిలో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులకు పలు నిర్మాణ రంగ సంస్థలు శ్రీకారం చుట్టి వేంగా ప్రజెక్టులను పూర్తి చేస్తుండడం విశేషం. ఈ ప్రాంతాలు అదరహో.. నిర్మాణ రంగం వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో ప్రధానంగా కొండాపూర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ జిల్లా, షేక్పేట్, నార్సింగి, పుప్పాలగూడ, బాచుపల్లి, కొంపల్లి, బొల్లారం, ఎల్బీనగర్, హయత్నగర్, యాంజాల్ తదితర ప్రాంతాల్లో నూతన నిర్మాణ రంగ ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో రూ.40–80 లక్షల సెగ్మెంట్లో నివాస గృహాలతో పాటు సువిశాలమైన, విలాసవంతమైన ఫ్లాట్లు, విల్లాల కొనుగోళ్లు ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్నట్లు రియల్టీ వ్యాపారులు చెబుతున్నారు. ఇక విలాసవంతమైన(లగ్జరీ) ఇళ్ల విభాగంలో తెల్లాపూర్, కొల్లూరు, గోపన్పల్లి, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో బుకింగ్స్ అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. గతంతో పోలిస్తే అత్యధికం నగర శివార్లలో 2017లో సుమారు ఆరు వేల నిర్మాణ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఇక 2018లో ఏడువేల నూతన ప్రాజెక్టులు సాకారంకాగా.. ఈ ఏడాదిలో సుమారు 15 వేల ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాంటే గ్రేటర్లో ఇళ్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పొరుగు రాష్ట్రాల వారు సైతం.. ఐటీ, బీపీఓ, కేపీఓ, ఫార్మా, బల్క్డ్రగ్ పరిశ్రమలకు గ్రేటర్ కేంద్రంగా మారింది. దీంతో విద్య, ఉద్యోగం, ఉపాధి, వాణిజ్యాల కోసం పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి భారీగా వలస వస్తున్నారు. వీరంతా నగర శివార్లలో వారి స్తోమతను బట్టి అపార్ట్మెంట్లు, విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది పలు నిర్మాణ సంస్థలు నూతన ప్రాజెక్టులను ప్రారంభించాయి. వీటిలో అపర్ణ, రాజపుష్ప, వాసవి, బ్రిగేడ్, సుమధుర వంటి సంస్థలు నూతన ప్రాజెక్టులను చేపట్టాయి. ఈ ఏడాది చివరినాటికి ఇవి పూర్తి కానున్నట్లు ‘రియల్’ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇళ్ల ధరలు ఇలా.. అల్పాదాయ, మధ్యాదాయ, వేతన జీవులు ప్రధానంగా రూ.40లక్షల నుంచి రూ.80 లక్షల విలువచేసే అపార్ట్మెంట్లు, స్వతంత్ర గృహాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇక ఎగువ మధ్యతరగతి వర్గం కొనుగోలు చేసే ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాల ధరలు చదరపు అడుగుకు రూ.4000–6500 మధ్య ఉన్నాయి. సంపన్న శ్రేణి కొనుగోలుచేసే సువిశాలమైన లగ్జరీ విల్లాలు, ప్లాట్లు చదరపు అడుగుకు సుమారు రూ.7500– రూ.13000 వరకు ధర పలుకుతుండడం విశేషం. -
ప్లాట్.. ప్లాన్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మరోసారి ప్లాట్ల వేలానికి సిద్ధమైంది. మొత్తం 95 ప్లాట్ల వేలానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన తొమ్మిది లేఅవుట్లలోని 82 ప్లాట్లు, హెచ్ఎండీఏ అనుమతి పొందిన నాలుగు ప్రైవేట్ లేఅవుట్లలోని 13 ప్లాట్లు ఉన్నాయి. వీటి ఈ–వేలానికి సంబంధించిన బ్రోచర్ను బేగంపేట్ క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్... హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు, కార్యదర్శి బీఎస్ లత, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ నరేందర్, ఎస్టేట్ అధికారి గంగాధర్, సీఐవో సుబ్రమణ్యంలతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో కమిషనర్ చిరంజీవులు వేలం వివరాలను మీడియాకు తెలిపారు. ఈ–వేలం ద్వారా 1,44,500.19 చదరపు గజాల విస్తీర్ణంలోని 95 ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఏప్రిల్లో 229 ప్లాట్లను పారదర్శకంగా విక్రయించామని, అదే విధానంలో ఈసారీ వేలం వేస్తున్నామన్నారు. ప్రస్తుత ప్లాట్లలో అత్యధికంగా ‘ది ప్రైడ్ ఆఫ్ హెచ్ఎండీఏ’ నినాదంతో ఉప్పల్ భగాయత్లో అభివృద్ధి చేసిన 67 ఉన్నాయని.. వీటి విక్రయం ద్వారానే దాదాపు రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. మిగిలిన 28 ప్లాట్ల విక్రయాలతో మరో రూ.100 కోట్లు వస్తాయని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న భూమి విలువకు ఒకటిన్నర నుంచి మూడున్నర రేట్లు ఎక్కువగా ధర నిర్ణయించినట్లు చెప్పారు. అయితే వేలంలో ఒకే బిడ్డరు పాల్గొంటే.. దాన్ని రద్దు చేసి రెండోసారి నిర్వహిస్తామన్నారు. ఏ దశలోనైనా వేలాన్ని రద్దు చేసే అధికారం హెచ్ఎండీఏకు ఉందన్నారు. ఆన్లైన్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్కుసెప్టెంబర్ 6 ఆఖరని, అదే నెల 8న ఉప్పల్ భగాయత్లోని ప్లాట్లు, 9న మిగిలిన ప్లాట్లు విక్రయిస్తామన్నారు. గజం రూ.28 వేలు... 2005లో మూసీ డెవలప్మెంట్లో భాగంగా ప్రభుత్వం ఉప్పల్ భగాయత్ రైతుల నుంచి 733 ఎకరాలు సేకరించింది. ఇందులో మెట్రో రైలు డిపో, మురుగు నీటి శుద్ధి కేంద్రం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కొంత కేటాయించింది. మిగిలిన 413.32 ఎకరాల్లో ‘ఉప్పల్ భగాయత్’ పేరుతో లేఅవుట్ అభివృద్ధి చేసింది. భూములు కోల్పోయిన 1,520 మంది రైతులకు గతేడాది ప్లాట్లు కేటాయించింది. మిగిలిన 67 ప్లాట్లను ఇప్పుడు విక్రయిస్తోంది. గజానికి రూ.28వేలు ధర నిర్ణయించారు. వీటి ద్వారా రూ.500 కోట్ల ఆదాయం రానుంది. అలాగే ఇక్కడి ఫేజ్–2, ఫేజ్–3 ప్లాట్లను కూడా విక్రయిస్తే మరో రూ.500 కోట్ల ఆదాయం వస్తుంది. ఎక్కడెక్కడ..? హెచ్ఎండీఏ లేఅవుట్లలో 82 ప్లాట్లు ప్రధాన ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో ఉప్పల్ భగాయత్లోని 67, గత ఏప్రిల్లో విక్రయించిన ప్రాంతాల్లో మిగిలిన 15 ప్లాట్లు ఉన్నాయి. వీటిలో అత్తాపూర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని రెండు ప్లాట్లు, ముష్క్మహల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని ఒక ప్లాట్, చందానగర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని ఒక ప్లాట్, మైలార్దేవ్పల్లి మధుబన్ రెసిడెన్షియల్ కాలనీలోని ఆరు ప్లాట్లు, నల్లగండ్ల రెసిడెన్సియల్ కాంప్లెక్స్లోని ఒక ప్లాట్, వనస్థలిపురం రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని ఒక ప్లాట్, నెక్నాంపూర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని రెండు ప్లాట్లు, తెల్లాపూర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని ఒక ప్లాట్ ఉన్నాయి. అదేవిధంగా హెచ్ఎండీఏ అనుమతి పొందిన బాచుపల్లి, దూలపల్లి, జల్పల్లి గ్రామాల్లోని ప్రైవేట్ లేఅవుట్లలోని 13 గిఫ్ట్ డీడీ ప్లాట్లు కూడా విక్రయానికి ఉంచారు. రిజిస్ట్రేషన్ ఫీజు మళ్లీనా.? హెచ్ఎండీఏ ఏప్రిల్లో నిర్వహించిన 229 ప్లాట్ల ఆన్లైన్ విక్రయాలను థర్డ్ పార్టీగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్టీసీ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది. రూ.10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏడాది పాటు ఏ వేలంలోనైనా పాల్గొనే వీలుండేలా నిబంధనలు పొందుపరిచారు. అయితే ఇది పెద్ద మొత్తంతో కూడుకున్నది కావడంతో కమిషనర్ కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకొని రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1,000 వరకు తగ్గించగలిగారు. దీంతో వేలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరోసారి హెచ్ఎండీఏ వేలం నిర్వహిస్తే అవకాశం ఉంటుందనుకున్నారు. ఈసారి ఎంఎస్టీసీ లిమిటెడ్ కాకుండా ఐసీఐసీఐ బ్యాంక్కు ఈ–వేలం ప్రక్రియను అప్పగించారు. దీంతో ఎంఎస్టీసీ లిమిటెడ్లో ఈ–వేలం కోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి వేలంలో ఉచిత రిజిస్ట్రేషన్కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై హెచ్ఎండీఏ అధికారులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రిజిస్ట్రేషన్ ఇలా... ఈ వేలంలో పాల్గొనాలకునేవారు hmda.auctiontiger.net వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. హెచ్ఎండీఏ వెబ్సైట్లో ‘ఉప్పల్ భగాయత్ ఈ–అక్షన్’ లింక్పై క్లిక్ చేస్తే నేరుగా పైన పేర్కొన్న వెబ్సైట్లోకి వెళ్లొచ్చు. అందులో కుడివైపునుండే రిజిస్టర్ ఆప్షన్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. సెప్టెంబర్ 6 సాయంత్రం 5గంటల్లోపు రూ.500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ వేలం జరిగే సెప్టెంబర్ 8, 9తేదీల్లో తమకు కేటాయించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్లతో జిఝఛ్చీhmda.auctiontiger.net వెబ్సైట్లోకి లాగిన్ అయి, హెచ్ఎండీఏ నిర్ధరించిన ధరలో 10శాతం ఈఎండీ రూపంలో చెల్లించాలి. బిడ్డరు వేలంలో పాల్గొనేటప్పుడు కనీసం రూ.100 ఎక్కువగా కోట్ చేయాలి. అత్యధిక ధర కోట్ చేసిన వారికి ఈ–వేలం ప్రక్రియ ముగిసిన వెంటన సమాచారం పంపిస్తారు. ఇందులో సక్సెస్ఫుల్ బిడ్డర్ ప్లాట్ నిర్ధరిత ధరలో 25 శాతం డబ్బులు వారంలోగా చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే మిగిలిన 75 శాతం డబ్బును రెండు నెలల్లోగా హెచ్ఎండీఏకు చెల్లించాలి. లేని పక్షంలో ఇన్స్టాల్మెంట్ల వారీగా వడ్డీతో సహా కట్టాలి. బ్యాంక్ ద్వారా రుణసదుపాయం పొందేందుకు కొనుగోలుదారులకు అవసరమైన ప్రమాణ పత్రాన్ని కూడా హెచ్ఎండీఏ జారీ చేస్తుంది. -
కొండవాలు ఫర్ సేల్!
సాక్షి, విశాఖపట్నం: క్రమబద్ధీకరించేందుకు అవకాశం లేకున్నప్పటికీ ఎక్కడైనా కొండవాలు ప్రాంతం కనిపిస్తే చాలు కబ్జా చేయడం... ప్లాట్లు వేసి అమ్మేయడం... సొమ్ము చేసుకోవడం అధికార టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యలా మారింది. గడిచిన మూడేళ్లలో 296, 118జీవోల ప్రకారం క్రమబద్ధీకరించిన వాటిలో అత్యధికం కొండవాలు ప్రాంతాల్లోని ఆక్రమణలే. ఇవన్నీ అభ్యంతరకర భూముల్లో ఉన్నవే. వీటిని క్రమబద్ధీకరించే అవకాశం లేకున్నప్పటికీ అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేసేశారు. అంతటితో ఆగకుండా సిటీ పరిధిలోని కొండలపై నిర్మాణానికి అనువుగా ఉండే ప్రాంతాలను కబ్జా చేయడం.. అమ్మేసుకోవడం.. ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మించేసుకోవడం అధికార పార్టీ నేతలకు అలవాటుగా మారి పోయింది. ఎవరైనా పొరపాటున పొరుగు జిల్లాల నుంచి వలస వచ్చి కొండవాలు ప్రాంతాల్లో కాసింత జాగాలో పూరిపాక వేసుకుంటే చాలు అధికారుల ద్వారా వాటిని పునాదులతో సహా కూలగొట్టే వరకు వదలడం లేదు. ఈ తరహా కబ్జాలు.. ఆక్రమణలు విశాఖ తూర్పు, పశ్చిమ, గాజువాక నియోజకవర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. గాజువాక పరిధిలో... గాజువాక నియోజకవర్గ పరిధిలోని పెదగంట్యాడ ప్రాంతంలోని రెవెన్యూ కొండపై ఏకంగా ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిని స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో టీడీపీ నేతలు కబ్జా చేసి గుట్టుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఆ స్థలాల్లో అనుమతుల్లేకున్నప్పటికీ దగ్గరుండి మరీ నిర్మాణాలు సాగిస్తున్నారు. అశోక్నగర్లో సర్వే నంబర్ 274లో ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు, అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఇక్కడ సాగుతున్న ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై స్థానికులు ఫిర్యాదు చేయగా లోకాయుక్తలో సైతం 2016 సెప్టెంబర్ 22న కేసు నమోదైంది. లోకాయుక్త ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కొంతమేర ఆక్రమణలు తొలగించారు. తాజాగా టీడీపీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు, పెద గంట్యాడ తహసీల్దార్ ప్రోద్బలంతో కొంతమంది వ్యక్తులు మళ్లీ ఆక్రమణలు... అక్రమ కట్టడాలకు తెరతీశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా విభజించి మరీ అమ్మేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపిస్తున్నారు. ఇటీవల ఈ నిర్మాణాలకు అనుమతులున్నాయా? లేదో తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే కనీస సమాచారం ఇచ్చిన పాపన పోలేదు. దీంతో స్థానికులతో కలిసి ఈ ఆక్రమణలు, అక్రమకట్టడాలపై గడిచిన మూడు నెలల్లో మూడుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఉన్నప్పుడు ఫిర్యాదు చేయగా.. వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్ను ఆదేశించారు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను జీవో నంబర్ 388 ద్వారా క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉండడం అధికార టీడీపీ నేతలకు వరంగా మారింది. ఈ జీవో ద్వారా క్రమబద్ధీకరిస్తామని నమ్మజూపుతూ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇదే తరహాలో సర్వే నంబర్ 274లో సుమారు 1.50ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా వేసి అమ్మేస్తున్నారు. 388 జీవో ప్రకారం క్రమబద్ధీకరించేస్తామంటూ నమ్మ జూపుతున్నారు. పైగా అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేసుకునేందుకు నేతలే అధికారిక అనుమతులు ఇచ్చేస్తు న్నారు. తహసీల్దార్ అండదండలతోనే అమ్మకాలు సర్వే నంబర్ 274లో ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా వేసి అమ్మేయడంతోపాటు అక్రమ నిర్మాణాల వెనుక రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. స్థానిక తహసీల్దార్ ప్రోద్భలంతోనే ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. తక్షణమే నిర్మాణాలను నిలుపుదుల చేసి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. – కింతాడి రాజశేఖర్, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి అక్రమ నిర్మాణాలు నా దృష్టికి రాలేదు అవి ప్రభుత్వ భూములే..కానీ అక్కడ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నా దృష్టికి రాలేదు. ఎవరు తీసుకురాలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. –పార్వతీశ్వరరావు, తహసీల్దార్, పెదగంట్యాడ -
హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం తేదీల మార్పు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్లాట్ల వేలం తేదీలు మారాయి. ఈ ప్లాట్ల కొనుగోలుకు అనూహ్య స్పందనతో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు, ప్రవాస భారతీయుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగాల్సిన ఈ–వేలంను 20, 21, 22 తేదీల్లోకి మార్చినట్టు హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు గురువారం తెలిపారు. ఈ–వేలంలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 18వ తేదీ వరకు గడువు పొడిగించామన్నారు. అలాగే ప్లాట్లను ఈ–టెండర్ ద్వారా కాకుండా కేవలం ఆన్లైన్ వేలం ద్వారానే విక్రయించనున్నట్టు తెలిపారు. మరింత సమాచారం కోసం తార్నాక హెచ్ఎండీఏ కార్యాలయంలోని హెల్ప్డెస్క్ను ఫోన్ ద్వారా, లేదంటే వ్యక్తిగతంగా సంప్రదించవచ్చని చెప్పారు. అలాగే ఈ–వేలంలో ప్లాట్లు కొనుగోలు చేయాలనుకున్నవారి అవగాహన కోసం ఈ నెల ఏడున తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో అవగాహన సదస్సు ఉంటుందని తెలిపారు. ఈ–వేలం ద్వారానే... హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన 19 లే అవుట్లలోని 141 ప్లాట్లు, హెచ్ఎండీఏ అనుమతి పొందిన లే అవుట్లలోని 88 గిఫ్ట్ డీడ్ ప్లాట్ల అమ్మకాలు ఈ–వేలంలోనే నిర్వహించనున్నారు. వివాదాలకు తావులేకుండా అమ్మకాలను థర్డ్ పార్టీ.. కేంద్రానికి చెందిన ఎంఎస్టీసీ లిమిటెడ్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్నారు. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన 19 లే అవుట్లలో మిగిలి ఉన్న 80,556.36 చదరపు గజాల్లో ఉన్న 141 ప్లాట్లు ప్రధాన ప్రాంతాల్లో ఉన్నాయి. అత్తాపూర్ రెసిడెన్షియల్ లే అవుట్, అత్తాపూర్ ముష్క్ మహల్ రెసిడెన్సియల్ కాంప్లెక్స్, చందానగర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, గోపన్పల్లి హుడా టౌన్ షిప్, మాదాపూర్ సెక్టర్–1, మాదాపూర్ సెక్టర్–3 , మైలార్ దేవ్పల్లి మధుబన్ రెసిడెన్సియల్ కాలనీ, మియాపూర్ రెసిడె న్షియల్ కాంప్లెక్స్, నల్లగండ్ల రెసిడెన్షియల్ కాంప్లెక్స్, నెక్నాంపూర్, సరూర్నగర్ చిత్ర లేఅవుట్, సరూర్నగర్ హుడా ఎం ప్లాయీస్, సరూర్నగర్ రెసిడెన్షియల్, సరూర్నగర్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్, షేక్పేట హుడా హైట్స్, హుడా ఎన్క్లేవ్, జూబ్లీహిల్స్లోని నందగిరి లేఅవుట్, తెల్లాపూర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్, సాహెబ్నగర్ కలాన్ (వనస్థలిపురం)ల్లో హెచ్ఎం డీఏ ప్లాట్లు ఉన్నాయి. హెచ్ఎండీఏ అనుమతినిచ్చిన పోచారం, అంతారం, దూలపల్లి, మంకల్, మామిడిపల్లి, భువన గిరి, బాచుపల్లి, జాలపల్లి, శంకర్పల్లి, ఘటకేసర్, అమీన్పూ ర్ల్లో ప్రైవేట్ లే–అవుట్లలో 81 గిఫ్ట్ డీడ్ ప్లాట్లు ఉన్నాయి. -
గృహ ప్రవేశానికి రెడీగా 34,700 ఫ్లాట్లు
సాక్షి, హైదరాబాద్ : 2017 ముగింపు నాటికి హైదరాబాద్లో 28,000 ఫ్లాట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ జోన్స్ లాంగ్ లాసెల్లె (జేఎల్ఎల్) తెలిపింది. గతేడాది నగరంలో నివాస సముదాయం కంటే కార్యాలయాల విభాగం గణనీయమైన వృద్ధిని సాధించిందని పేర్కొంది. వచ్చే ఆరేడు నెలలు నివాస విభాగం డిమాండ్ బాట పడుతుందని.. స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహం, మెట్రో రైలు, రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల ఏర్పాట్లు వంటి వాటితో ఫ్లాట్లకు డిమాండ్ పెరుగుతుందని వివరించింది. గతేడాది డిసెంబర్ ముగింపు నాటికి హైదరాబాద్, కోల్కతా, పుణె, ఎన్సీఆర్, చెన్నై, ముంబై, బెంగళూరు ఏడు నగరాల్లో 4.4 లక్షల ఫ్లాట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయని జేఎల్ఎల్ నివేదిక వెల్లడించింది. ఏడు ప్రధాన నగరాల్లో నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశానికి సిద్ధంగా 34,700 ఫ్లాట్లున్నాయని పేర్కొంది. ఢిల్లీ–ఎన్సీఆర్లోనే ఎక్కువ మొత్తం అమ్ముడుపోకుండా ఉన్న ఫ్లాట్లలో 60% ఢిల్లీ–ఎన్సీఆర్లోనే ఉన్నాయి. ఇక్కడ 1,50,654 ఫ్లాట్లు న్నాయి. అత్యల్పంగా కోల్కతాలో 26 వేల యూనిట్లు విక్రయానికి ఉన్నాయి. చెన్నైలో 42,500 అమ్ముడుపోకుండా ఉంటే, 8,500 యూనిట్లు గృహ ప్రవేశానికి రెడీగా ఉన్నాయి. బెంగళూరులో 70 వేల యూనిట్లు విక్రయానికి నోచుకోకుండా ఉంటే, 10 వేల యూనిట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. ముంబైలో 86 వేలు, ఫుణేలో 36 వేల యూనిట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయి. -
రీసేల్ ఫ్లాట్ కొంటున్నారా?!
నిడమర్రు : కొత్త ఫ్లాట్ అందుబాటు ధరలో లేకపోవడం, పెట్టుబడి తగ్గించుకుని తిరిగి అమ్మే ఉద్దేశం ఉన్న సమయంలో, తక్షణం గృహ ప్రవేశం చేయలనుకున్నప్పుడు లేదా మార్కెట్ విలువలో తక్కువ ధరకు లభిస్తున్నపుడు కారణం ఏదైనా రీసేల్ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారా..? అయితే రీసేల్ ఫ్లాట్ విషయంలో ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. ఆ వివరాలు తెలుసుకుందాం. ’రీసేల్ అంటే పాతదే కాదు రీసేల్ యూనిట్స్ అంటే పాతవే కాకుండా, కొత్తగా నిర్మాణంలో ఉన్న ఫ్లాట్ను ఓ వ్మక్తి కొనుగోలు చేసి అది పూర్తయిన తర్వాత విక్రయానికి పెట్టినా అది రీసేల్ ప్లాటే అవుతుంది. అలాగే నిర్మాణంలో ఉన్నవీ కావచ్చు. బిల్డర్ వద్ద ఒకరు కొని తిరిగి ఫ్లాట్ నిర్మాణం పూర్తవకపోయినా, విక్రయానికి పెట్టినా అది రీసేల్ ప్లాటే అవుతుంది. చట్టబద్ధత, పత్రాలు కొనుగోలు చేస్తున్న ఫ్లాట్/ఇంటికి సంబంధించి చట్టబద్ధమైన హక్కుల విషయంలో ముందుగా అన్ని వివరాలు తెలుసుకోవాలి. న్యాయ నిపుణులను సంప్రదించాలి. పాత అపార్ట్మెంట్ కొనేముందు చట్టపరమైన ప్రక్రియలను కూడా పూర్తి చేసుకోవాలి. ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ రికార్డుల్లో సరిగ్గా నమోదు చేశారా, పేరు, ఇతర వివరాలు సరిగానే ఉన్నాయా? అన్నవి పరిశీలించాలి. రీసేల్ ఫ్లాట్ టైటిల్ డీడ్ను చాలా స్పష్టంగా రాసుకోవాలి. కొనుగోలు ఒప్పందం, సేల్డీడ్, అపార్ట్మెంట్ సొసైటీ నుంచి నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ), బిల్డర్–బయ్యర్ అగ్రిమెంట్ కాపీ అప్పటివరకు ఆ ఫ్లాట్కు యజమానులుగా వ్యవహరించిన వారి వివరాలు తెలియజేసే డాక్యుమెంట్లు అన్ని అవసరం అవుతాయి. ఎందుకు అమ్ముతున్నారో ఆరా తీయాలి ఆ ఫ్లాట్ను యజమాని ఎందుకు విక్రయిస్తున్నారన్న అంశాన్ని విచారించుకోవాలి. చట్టపరమైన సమస్యలేవైనా ఉంటే వదిలించుకునేందుకు ఆ ఫ్లాట్ను విక్రయిస్తున్నారా..? దానిపై మరెవరికైనా ఉమ్మడి హక్కులున్నాయా..? అన్నవి చూడాలి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులో ఫ్లాట్ బుక్ చేసుకుని అది పూర్తి కాకముందే విక్రయిస్తుంటే కారణాలు అన్వేషించాలి. ఫ్లాట్పై రుణ బకాయిలు కొనుగోలు చేయబోతున్న ఫ్లాట్ లేదా ఇంటిపైన రుణాలు ఏవైనా ఉన్నాయా, లేదా..? అన్న అంశం కూడా చూడాలి. బ్యాంకు నుంచి తీసుకున్న ఎన్వోసీ పత్రాన్ని తీసుకోవాలి. ఒకవేళ కొనుగోలు చేస్తున్న ఫ్లాట్ బ్యాంకు తనఖాలో ఉంటే మాత్రం.. దానిపై ఉన్న రుణం మొత్తాన్ని తీర్చేసిన తర్వాత ఫ్లాట్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసేందుకు సమ్మతేనని బ్యాంకు నుంచి ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది. కొనుగోలుకు రుణం.. రీసేల్ ఫ్లాట్/ఇంటికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలిస్తున్నాయి. రుణాన్ని ఇచ్చే ముందు సాంకేతికపరంగా ఆ భవనం నాణ్యతను పరిశీలిస్తారు. భవనం స్థితిగతులను పరిశీలించిన తర్వాత సంబంధిత ఆస్తి కొనుగోలుకు ఎంత ఇవ్వాలన్నది బ్యాంక్ అధికారులు నిర్ణయిస్తారు. ఈ రుణం సేల్ డీడ్ విలువ కంటే మించకుండా ఉంటుంది. ఏ అంతస్తు నయం..? 0–15 ఏళ్ల వయసున్న రీసేల్ ఫ్లాట్ను కొనుగోలు చేస్తున్నట్టయితే పై అంతస్తునే ఎంచుకోవడమే నయం. అపార్ట్మెంట్ను నిర్మించి కొన్నేళ్లయితే డ్రైనేజీపరంగా లీకేజీలు చోటు చేసుకోవచ్చు. కింద ఫ్లోర్ నిర్మాణంలో మార్పులు జరగవచ్చు. పై అంతస్తులో కింద అంతస్తు మీద వెలుతురు వచ్చే అవకాశం ఉంది. ఏడాది నుంచి ఐదేళ్ల వయసున్న ఫ్లాట్ను కొనడం వల్ల ధర, విలువపరంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గరిష్టంగా పదేళ్ల వయస్సు ఫ్లాట్ వరకూ లాభసాటిగా ఉంటుంది. నిర్వహణ రీసేల్ ఫ్లాట్ విషయంలో మెయింటెనెన్స్ చార్జీలు గురించి వాకబు చేయాలి. నిర్మాణపరమైన నాణ్యత కూడా కీలకమే. ఎక్కడైనా నిర్మాణంలో నెర్రులు బారి ఉన్నాయేమో చూడాలి. రిజిస్టర్ డాక్యుమెంట్లలో ఉన్న ప్లాన్ ప్రకారమే ఫ్లాట్ నిర్మించారా లేదా..? అన్నది చెక్ చేయాలి. పాతది అయితే ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్ వంటి అంశాలు పరిశీలించుకోవాలి. నిర్మాణపరమైన మార్పులు చేయించాల్సి ఉంటే ఆ బడ్జెట్ను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక అపార్ట్మెంట్ సొసైటీ నిబంధనలు ఏంటన్నదీ తెలుసుకోవాలి. పన్ను ప్రయోజనాలు రీసేల్ ఫ్లాట్పైనా పన్నుపరమైన ప్రయోజనా లున్నాయి. రుణం తీసుకుని రీసేల్ ఫ్లాట్ కొనుగోలు చేస్తే (మొదటిసారి సొంతింటి కొనుగోలు), తిరిగి చేసే వాయిదాల చెల్లింపులో సెక్షన్ 80సీ కింద ఏడాదిలో రూ.లక్ష మినహాయింపు, వడ్డీ రూపంలో చెల్లింపులపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ ఆదాయ పన్ను చెల్లించే పనిలేదు. రీసేల్ వల్ల ప్రయోజనాలు మొదటిసారి విక్రయమవుతున్న ఫ్లాట్తో పాలిస్తే ధర తక్కువగా ఉంటుంది. వెంటనే ఇంట్లోకి చేరిపోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. నెలనెలా అద్దె ఇంటికి చేసే చెల్లింపులు మిగులుతాయి. కనిపించని చార్జీల భారం ఉండదు. వెంటనే ఇంట్లో చేరిపోతాం గనుక అప్పటి నుంచే పన్ను ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది. నిర్మాణంలో ఉన్నది కొనుగోలు చేస్తే లేబర్, మెయింటెనెన్స్ పన్ను, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, ఇంటి పన్ను ఇతరత్రా చార్జీలపై స్పష్టత ఉండదు. రీసేల్ ఫ్లాట్కు సంబంధించి అన్ని చార్జీలు ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. -
కబ్జా చేసేయ్.. రూ.కోట్లు మింగేయ్!
రాయచోటి పట్టణ పరిధిలోని రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు అక్రమార్కుల పాలవుతున్నాయి. పెద్దపెద్ద బండరాళ్లను సైతం పెకలించి వాటినే లోతైన వాగులలో వేసి యథేచ్ఛగా సొంతం చేసుకునే పనిలో పడ్డారు. ఆక్రమించిన భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు. ఆక్రమణలకు గురికాకుండా చూడాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునిగితేలుతున్నారన్న ఆరోపణలున్నాయి. రాయచోటి/రాయచోటి టౌన్: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు..ఇది పాత నానుడి. అధికారుల అండ, సహకారం లేనిదే రూ.కోట్ల విలువ చేసే భూములు ఆక్రమణకు గురికావన్నది తాజా వాదన. ఇందుకు నిదర్శనంగా రాయచోటిలో ఆక్రమణల పాలవుతున్న భూములే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కంచాలమ్మగండి చెరువు నుంచి పంట పొలాలకు నీటిని అందించే ఎడమ కాల్వ రెండు కిలోమీటర్ల మేర కనిపించకుండా పోయింది. పెద్దపెద్ద రాతి గుట్టలను సైతం పేల్చివేస్తూ చదును చేస్తున్నా అడిగే నా«థుడు లేరు. ఇలా జరుగుతున్న ఆక్రమణలను చూస్తుంటే రెవెన్యూ అధికారులకు వాటాలు ముట్టాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. నకిలీ రికార్డుల తయారు ఆక్రమించిన భూములకు రికార్డులను కూడా ఎవ్వరికి అనుమానం రాని రీతిలో మార్చేస్తున్నారు. పక్కనే ఉన్న భూముల సర్వే నంబర్ల పేరుతో ఆక్రమించిన భూములకు రికార్డులు తయారుచేస్తున్నట్లు సమాచారం. ఇందుకు కొందరు రెవెన్యూ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే మ్యాపులతో సహా పట్టాలను తయారు చేయించి రూ.కోట్లను దోచుకుంటున్నారు. వాగులు, వంకలు చ దును చేసి ఎకరా రూ.కోటి నుంచి రూ.4కోట్ల వరకు ధరను నిర్ణయించి విక్రయిస్తున్నారు. వంకలు కనిపించకుండా పోతున్నాయ్ పట్టణం చుట్టుపక్కల ఉన్న వాగులు, వంకలు రియల్ఎస్టేట్ దెబ్బకు కనిపించకుండా పోతున్నాయి. ప్రస్తుతం మదనపల్లె–చిత్తూరు రింగ్రోడ్డు నుంచి ప్రారంభమై రవ్వగుంట, ఎరుకుల కాలనీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా ఎస్టీ కాలనీ వరకు ఉన్న వాగుపై ఆక్రమణదారుల కన్నుపడింది. వాగుకు ఇరుపక్కల ఉన్న ప్రభుత్వ భూమిని సైతం చదును చేస్తూ వాగులో పెద్దపెద్ద బండరాళ్లతో నింపేస్తున్నారు. రాత్రింబవళ్లు జేసీబీలు, ట్రాక్టర్ల సాయంతో బండరాళ్లతో నింపి చదును చేస్తున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అటువైపు చూసిన పాపాన పోలేదు. వాగులపైనే పునాదులు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వాగులను పూడ్చి వాటిపైనే పునాదులు వేసి నిర్మాణాలు చేపడుతున్నారు. రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేస్తే వారికి నోటీసులు ఇచ్చాం.. చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే తప్పా ఆక్రమణ దారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రవ్వలగుట్ట, ఎరుకుల కాలనీ సమీపంలోని ప్రభుత్వ భూములలో 4వ తరగతి ఉద్యోగులకు 3 సెంట్ల వంతున ప్రభుత్వం పట్టాలను ఇచ్చింది. వాటిని సైతం ఆక్రమణదారులు వదలకుండా ఆక్రమిస్తూ వారికి తోచిన విధంగా రహదారుల యత్నానికి సిద్ధపడుతున్నారు. తప్పక చర్యలు తీసుకుంటాం: –గంగాధర్, వీఆర్వో, రాయచోటి మదనపల్లె రింగురోడ్డు నుంచి ఎరుకల కాలనీ వరకు వాగును, ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చాం. పనులు చేపడుతున్న ట్రాక్టర్లు, జేసీబీలను సీజ్ చేస్తాం. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం: నరసింహ కుమార్, ఇన్చార్జి తహసీల్దార్(డి.టి), రాయచోటి మదనపల్లె రింగురోడ్డు సమీపంలోని 1003 సర్వే నంబరు సమీపంలోని వాగు ఆక్రమణ దారులపై చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వస్థలాలను ఎవరు ఆక్రమించినా ఊరుకోం. సెలవుల్లో వీటి ఆక్రమణలకు పాల్పడినట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే వీఆర్వోలను పంపి పనులను నిలుపుదల చేయించి నోటీసులను జారీ చేస్తాం. రెండు మూడు రోజుల్లో ఆ స్థలాల్లో సర్వే చేయించి వాగులు, వంకలు యథావిధిగా ఉండేలా చూస్తాం. -
ఈ భూమాయకు ఫ్లాట్ అవ్వాల్సిందే
అధికార పక్ష నాయకుడొకరు ప్రభుత్వ భూమిని కాజేశారు. నిబంధనలు పక్కన బెట్టి అధికారులూ సహకరించారు. విలువైన భూమి సదరు నాయకుడికిప్పుడు కాసులు కురిపిస్తోంది. మండల కేంద్రానికి సమీప భూమి సర్కారు విక్రయించకూడదు. ఈ నిబంధన ఉల్లంగించడమే కాదు.. వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకోడానికి వడివడిగా పచ్చ జెండా ఊపేయడం అక్రమ భూ బాగోతానికి దర్పణం పడుతోంది. చిత్తూరు, సాక్షి: శ్రీరంగరాజపురం మండలంలో విస్తుగొలిపే భూ దోపిడీ వెలుగులోకి వచ్చింది. వ్యవసాయానికి అనుకూలమైన భూమిని గుర్తించడం.. ప్రభుత్వ ధరల ప్రకారం కొనుగోలు చేసినట్లు.. నకిలీ ఛలానాలు సమర్పించడం.. వ్యవసాయేతర భూములుగా మార్చి ప్లాట్లు వేసి అమ్ముకోవడం.. ఇదీ దోపిడీ వరస. దీనికి సూత్రధారి మండలానికి చెందిన తెలుగుదేశం నాయకుడు భాస్కర్ నాయుడు. ఎస్సార్ పురం గ్రామ పంచాయతీకి కూతవేటు దూరంలో 28వ సర్వే నెంబర్ 17.36లో ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మండల కేంద్రంలోని విలువైన భూమి కావాలంటూ 2010లో భాస్కర్ నాయుడు మరో నలుగురు కలిసి దరఖాస్తు చేసుకున్నారు. 2013లో రూ.17.36 లక్షలు చెల్లించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సమయంలో భాస్కర్ నాయుడు మిగతా ముగ్గురినీ కాదని భార్య, అక్క కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధం.. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూమి ఉంటే ప్రై వేటు వ్యక్తులకు ఇవ్వకూడదని 2007లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జీవో జారీ చేసింది. భాస్కర్ నాయుడుకు కట్టబెట్టిన భూమి మండల కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉంది. అప్పటి కలెక్టర్లు వీ. శేషాద్రి, సాల్మాన్ ఆరోఖ్యరాజ్ భూమిని ఇవ్వడానికి నిరాకరించారు. రాంగోపాల్ కలెక్టర్గా ఉన్న సమయంలో వీరికి భూమి కట్టబెట్టారు. 2014లో టీడీపీ అధికార పీఠం ఎక్కడంతో చాలా సులువుగా వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తప్పుడు ఛలానా నెంబరు తప్పుడు ఛలానాలతో.. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి రూ.2,42,750 లక్షలు 2014 డిసెంబర్లో ప్రభుత్వ ఖజనాకు జమ చేశామని చెప్పడంతో అప్పటి ఆర్డీవో పెంచల కిశోర్ భూ మార్పిడికి అనుమతి ఇచ్చారు. వాస్తవానికి ఈ సొమ్ము చెల్లించలేదని సాక్షి పరిశీలనలో బయటపడింది. భాస్కర్ నాయుడు చెల్లించినట్లు చెబుతున్న ఛలానా నెంబరు 2014 జూలై 23వ తేదీది. ఆర్డీఓ ఉత్తర్వులో 2014 డిసెంబర్ 26న చెల్లించినట్లు చెప్పుకున్నారు. ఆ ఛలానా నెంబరుపై రూ.2 లక్షలు వేరే వ్యక్తి చెల్లించనట్టుగా ఖజానా శాఖ పరిశీలనలో తెలిసింది. వ్యవసాయేతర భూమిగా మార్పి డికి సీసీఎల్ఏ అనుమతి కావాలని నిబంధన ఉంది. దీన్ని తుంగలో తొక్కి అనుమతులు మంజూరు చేశారు. 2015లో 28–2ఏ,3ఏ సర్వే నెంబర్లలోని 8.71 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేసుకున్నారు. ప్లాట్లు వేశారు.. కోట్లు కొల్లగొట్టారు.. చిత్తూరుకు ఎస్సార్ పురం సమీపంలో ఉండటంతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వ్యవసాయేతర భూమిగా అనుమతి వచ్చిన తరువాత 8.71 ఎకరాల ను 200 ప్లాట్లుగా వేసి అమ్మకానికి పెట్టారు. గజం రూ.4500 నుంచి రూ.4700 వరకు అమ్ముకుంటున్నారు. ఇలా ఇప్పటి వరకు రూ.12 కోట్ల వరకు ఆర్జించినట్లు తెలుస్తోం ది. ఇందులో అడుగడుగునా అధికారుల ప్ర మేయం ఉందనే విమర్శలు వినిపిస్తున్నా యి. మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములను అమ్మకూడదని నిబంధనలున్నా దీన్ని బేఖాతరు చేస్తూ భూములు కట్టబెట్టడంలో అధికారులే కీలకపాత్ర పోషించారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటే సీసీఎల్ఏ అనుమతి ఉండాలి. అదేంలేకుండా అనుమతులు మంజూరు చేశారు. నిబంధనలను అతిక్రమించలేదు.. నిబంధనలు అతిక్రమించలేదు. రూల్స్ ప్రకారమే భూమిని తీసుకున్నాను. డబ్బు కట్టలేదనడం అబద్ధం. ఛలానా తీసుకున్న తరువాతే భూమార్పిడి చేశారు. ఛలానా నెంబరు తప్పుకాదు. ఎక్కడో పొరపాటు జరిగింది. – భాస్కర్ నాయుడు, టీడీపీ నాయకుడు, ఎస్సార్పురం -
6 నెలల్లో 100 ఎకరాల అభివృద్ధి
⇔ షామీర్పేట, పటాన్చెరు, శంకర్పల్లిలో.. ⇔ యూఎస్ఎం మై సిటీ ఎండీ నివాస్. కె సాక్షి, హైదరాబాద్: పిల్లల చదువుకో లేక పెళ్లికో ఉపయోగపడుతుందనో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్లాట్లు కొనడం సాధారణం. అలా అని ఏదో ఒక చోట కొనడం కాదు.. అందుబాటు ధరల్లో, అభివృద్ధికి ఆస్కారముండే చోట, సమీప భవిష్యత్తులో రెట్టింపు ధర పలికే ప్రాంతాలను ఎంచుకోవాలని యూఎస్ఎం మై సిటీ ఎండీ నివాస్. కె సూచిస్తున్నారు. ఇతర డెవలపర్ల వెంచర్లు అనుమతులొచ్చాక ప్రారంభమైతే.. మా ప్రాజెక్ట్లు మాత్రం అనుమతులతో పాటూ వెంచర్ చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి ఆ తర్వాతే అభివృద్ధి, అమ్మకాల పనులు మొదలవుతాయని వివరించారు. ⇔ సామాన్య, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని సిటీతో కనెక్టివిటీ ఉండి అభివృద్ధికి ఆస్కారముండే ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో వెంచర్లను చేయడం మా ప్రత్యేకత. ఓపెన్ ప్లాట్లయితే కొనుగోలుదారులకు యాజమాన్య హక్కులూ ఉంటాయి. హైదరాబాద్– వరంగల్ హైవే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ముందే గ్రహించి 2013లో బీబీనగర్లో 25 ఎకరాల్లో మై సిటీ పేరిట తొలి ప్రాజెక్ట్ను ప్రారంభించాం. ఆ తర్వాత షామీర్పేట, ఆదిభట్ల వంటి పలు ప్రాంతాల్లో మొత్తం 10 వెంచర్లలో 300 ఎకరాలను అభివృద్ధి చేశాం. అన్నీ హెచ్ఎండీఏ అనుమతి పొందిన ప్రాజెక్ట్లే. ⇔ వచ్చే 6 నెలల్లో 100 ఎకరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పలు వెంచర్లు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. శంకర్పల్లిలో 18 ఎకరాలు, పటాన్చెరులో 50 ఎకరాల్లో 2 వెంచర్లు, షామీర్పేట మార్గంలోని వర్గల్లో 30 ఎకరాల్లో మరో వెంచర్ను చేయనున్నాం. ⇔ ప్రస్తుతం బీబీనగర్లో 30 ఎకరాల్లో మై సిటీ ఫేజ్–2ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 150–300 గజాల్లో మొత్తం 350 ప్లాట్లుంటాయి. ధర గజం రూ.3,500. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్లైన్స్, బీటీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ వైర్లు, ప్లాంటేషన్ వంటి ఏర్పాట్లుంటాయి. వెంచర్ లొకేషన్ విషయానికొస్తే.. హైదరాబాద్–వరంగల్ హైవేకు రెండున్నర కి.మీ. దూరంలో, నిమ్స్, ఏయిమ్స్లకు దగ్గర్లో, రహేజా ఐటీ పార్క్, ఇన్ఫోసిస్ క్యాంపస్లకు 15 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలో ఉంది ఈ వెంచర్. ⇔ కరీంనగర్ జాతీయ రహదారిలో షామీర్పేటలోని సెలబ్రిటీ క్లబ్ ఎదురుగా 22 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. 200–300 గజాల ప్లాట్లుంటాయి. ధర గజం రూ.10 వేలు. రోడ్లు, విద్యుత్, మంచినీరు, మురుగునీటి వ్యవస్థ, పార్కు వంటి సదుపాయాలను కల్పిస్తాం. వెంచర్ లొకేషన్ చూస్తే.. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో ఐసీఐసీఐ నాలెడ్జ్ పార్క్, బిట్స్ పిలానీ, నల్సార్ లా వర్సిటీ, జెన్ప్యాక్ట్ సెజ్లకు చేరువలో ఉంది. -
రాజధాని రైతులకు ప్లాట్ల కష్టాలు
-
తుళ్లూరులో ప్లాట్ల పంపిణీ రసాభాస
* సవరణలు పూర్తయ్యాక లాటరీ తీయాలని రైతుల డిమాండ్ * వారి మొర ఆలకించని అధికారులు * సభ నుంచి వెళ్లిపోయిన బోరుపాలెం రైతులు తుళ్లూరు: స్థానిక సీఆర్డీఏ కార్యాలయం వద్ద బుధవారం చేపట్టిన ప్లాట్ల పంపిణీ రసాభాసగా మారింది. మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైనకార్యక్రమానికి తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, కమిషనర్ శ్రీధర్, ఐటీ డైరెక్టర్ ప్రభాకర్రెడ్డి హాజరయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాకే ప్లాట్లు పంపిణీ చేయాలని రైతులు మొర పెట్టుకున్నారు. అధికారులు వినకపోవడంతో రైతులు వేదికపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రైతులు మీకు ఇష్టమొచ్చినట్లు ఇచ్చే ప్లాట్లు మాకొద్దని నిరసన తెలిపారు. అధికారులు ఇవేమీ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు స¿¶ æనుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. కొండమరాజు పాలేనికి చెందిన రైతులు జరీబు కింద పొలాలు తీసుకుని నేలపాడు సమీపంలోని గుంటల్లో ప్లాట్లు ఇస్తున్నారని ఏకరవు పెట్టారు. ఇప్పుడే ఇలా వేధిస్తుంటే అన్నీ మీ చేతుల్లోకి వచ్చాక మా బతుకులు ఏమి కావాలంటూ మండిపడ్డారు. అధికారులు మాత్రం కొండమరాజుపాలెం గ్రామానికి చెందిన 568 మంది రైతులకు 763 ఎకరాలకుగాను 494 రెసిడెన్షియల్, 497 కమర్షియల్, బోరుపాలేనికి సంబంధించి 346 మంది రైతుల నుంచి 349 ఎకరాలకు 494 నివాస, 497 కమర్షియల్ ప్లాట్లు కేటాయించారు. -
రైతులు కోరుకుంటే పక్కపక్కనే ప్లాట్లు
* ప్రయోగాత్మకంగా అబ్బురాజుపాలెం, బోరుపాలెంలో పంపిణీ చేసిన అధికారులు తుళ్లూరు: రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు సీఆర్డీఏ తిరిగి ప్లాట్లు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాల రైతులు అనేక అనుమానాలున్నాయి. దీంతో ఐదారెకాలు పొలం ఉన్న రైతులు వారికిచ్చే ప్లాట్లు వేర్వేరు ప్రదేశాల్లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని అధికారుల వద్ద అనేకసార్లు రైతులు విన్నవించారు. దీనిపై ఎట్టకేలకు సీఆర్డీఏ ఐటీ విభాగం అధికారి ఎన్.ప్రభాకర్రెడ్డి నేతృత్వంలో వంద గజాలు, ఆపైబడి ప్లాట్లు పొందే రైతులకు పక్క పక్కనే ఏర్పాటు చేసేలా సీఆర్డీఏ అధికారులు డిజైన్ను సిద్ధం చేశారు. గురువారం ప్రభాకర్రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రాజధాని గ్రామాల రైతులు వంద గజాల ప్లాట్లకు పైబడి అలాగే ఒకటి, లేదా మరికొన్ని ప్లాట్లు పొందే అవకాశం ఉన్న రైతులు వారి ప్లాట్లను పక్కన పక్కనే పొందవచ్చని, ఈ మేరకు సీఆర్డీఏ లే అవుట్ను సిద్ధం చేసిందని వివరించారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా బోరుపాలెం, అబ్బురాజుపాలెం రైతులకు వర్తింపజేసినట్లు వెల్లడించారు. బోరుపాలెంలో 37 మంది రైతుల్లో 36 మంది రైతులకు పక్కపక్కనే ప్లాట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. గతంలో ప్లాట్లు పొందినవారైనా, ఇకపై ప్లాట్లు పొందే వారైనా పక్కపక్కనే ప్లాట్లు పొందే విధంగా డిజైన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరింత సమగ్రమైన సమాచారం కోసం తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో ఐటీ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. -
నెలాఖరుకు రైతుల చేతికి ప్లాటు
అప్పటికి భూయాజమాన్య హక్కూ కల్పిస్తాం ‘సాక్షి’తో సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ సాక్షి, అమరావతి : రాజధాని గ్రామాల్లోని రైతులందరికీ సెప్టెంబర్ నెలాఖరుకల్లా వారి వాటా ప్లాట్లు పంపిణీ చేస్తామని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్ చెరుకూరి శ్రీధర్ చెప్పారు. ఆ సమయానికి ప్లాట్ల కేటాయింపుతోపాటు వారికి భూసమీకరణ యాజమాన్య హక్కు పత్రాలు కూడా ఇస్తామని తెలిపారు. దీనివల్ల ప్లాట్లను అమ్ముకునే హక్కు రైతులకు ఉంటుందని వివరించారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఇప్పటికే తుళ్లూరు మండలం నేలపాడు రైతులకు ప్లాట్లు కేటాయించామని, త్వరలో వారికి యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తామని తెలిపారు. ఈ గ్రామంతోపాటు మరో ఏడు గ్రామాలకు ప్లాట్ల కేటాయింపు ముసాయిదా నోటిఫికేషన్లు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీన నాలుగు గ్రామాలు, 20వ తేదీన మరో నాలుగు గ్రామాలు, 26వ తేదీన ఎనిమిది గ్రామాలకు ముసాయిదా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఆయా గ్రామాల రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నెలరోజుల సమయం ఇస్తామన్నారు. వచ్చిన అభ్యంతరాలను బట్టి తుది ప్లాట్ల కేటాయింపు చేపడతామన్నారు. సెప్టెంబర్ నెలాఖరుకల్లా విడతల వారీగా 29 గ్రామాలకు ప్లాట్ల కేటాయింపుతోపాటు భూయాజమాన్య హక్కు పత్రాలు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. రైతులకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా యాజమాన్య హక్కు పత్రాలను ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని వివరించారు. ఇందుకోసం ఎనిమిది భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని తెలిపారు. భూమి లేని పేదలకు ఇస్తున్న పెన్షన్లను ఇకపై ఆన్లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి బ్యాంకు అకౌంట్లు సరిగా ఉన్నాయో లేదో పరిశీలన చేయిస్తున్నామని చెప్పారు. జూన్, జూలై పెన్షన్ మొత్తాలు ఒకేసారి వారి ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. -
10 వేల ఎకరాలు.. 36 వేల ప్లాట్లు
-
10 వేల ఎకరాలు.. 36 వేల ప్లాట్లు
- 7,244 ఎకరాలు మెట్ట భూముల్లోనివే - జరీబు ప్రాంతంలో 3,720 ఎకరాలు - రాజధానిలో రైతులకిచ్చే ప్లాట్ల లెక్కతేల్చిన సీఆర్డీఏ - 5 కేటగిరీలుగా ఇచ్చేందుకు కసరత్తు సాక్షి, విజయవాడ బ్యూరో : రాజధాని కోసం సమీకరించిన 34 వేల ఎకరాల్లో 10,964.87 ఎకరాలను తిరిగి రైతులకు ప్లాట్లుగా ఇవ్వాల్సి ఉంటుందని సీఆర్డీఏ లెక్కతేల్చింది. ఇలా ఇచ్చే ప్లాట్ల భూమిలో 7,244 ఎకరాలు మెట్ట ప్రాంతంలో ఉండగా 3,720 ఎకరాలు జరీబు ప్రాంతంలో ఉంది. జరీబు, మెట్ట భూముల్లో ఎన్ని ఎకరాలు, ఎన్ని ప్లాట్లు రైతులకు తిరిగి ఇవ్వాలనే దానిపై సీఆర్డీఏ కసరత్తు పూర్తి చేసింది. తుళ్లూరు మండలం నేలపాడులో ప్రయోగాత్మకంగా ప్లాట్ల కేటాయింపు జరిపినట్లే మిగిలిన 28 గ్రామాల్లోని రైతులకు కేటాయింపు జరపనుంది. మెట్ట ప్రాంతంలో 6049.62 ఎకరాల్లో 23,667 నివాస ప్లాట్లు, 1194.85 ఎకరాల్లో 23,667 వాణిజ్య ప్లాట్లను రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు. జరీబు ప్రాంతంలో 2,564.52 ఎకరాల్లో 12,490 నివాస ప్లాట్లు, 1155.88 ఎకరాల్లో 12,490 వాణిజ్య ప్లాట్లు రైతులకు దక్కనున్నాయి. మొత్తంగా 36,157 నివాస ప్లాట్లు 29 గ్రామాల్లోని రైతులకు పంపిణీ చేయాల్సివుంది. నివాస ప్లాట్లతోపాటే వాణిజ్య ప్లాట్లూ ఇవ్వాల్సి ఉండడంతో అదే సంఖ్యలో ఆ ప్లాట్లనూ రైతులకు కేటాయించనున్నారు. నివాస, వాణిజ్య ప్లాట్లను కలిపి లెక్కేస్తే 72,314 ప్లాట్లుగా లెక్కతేలుతుంది. ఐదు కేటగిరీలుగా ప్లాట్లు ప్లాట్లను ఐదు కేటగిరీలుగా విభజించి రైతులకు ఇవ్వనున్నారు. ఏ కేటగిరీలో 120 నుంచి 210 గజాలు, బీ కేటగిరీలో 250 నుంచి 450 గజాలు, సీ కేటగిరీలో 480 నుంచి 1910 గజాలు, డీ కేటగిరీలో 1440 నుంచి 5940 గజాలు, ఇ కేటగిరీలో ఆరు వేల నుంచి 7,500 గజాల విస్తీర్ణంలో ప్లాట్లు ఉంటాయి. ఈ విభజన ప్రకారం సీ కేటగిరీలో అత్యధికంగా డీ కేటగిరీలో 4552.79 ఎకరాలు రైతులకు ఇవ్వాల్సివుండగా ఆ తర్వాత సీ కేటగిరీలో 3785.34 ఎకరాలు, బీ కేటగిరీలో 913.15, ఈ కేటగిరీలో 721.63 ఎకరాలు, ఎ కేటగిరీలో 336.38 ఎకరాలను నివాస, వాణిజ్య ప్లాట్లుగా రైతులకు ఇవ్వాలని తేల్చారు. దీన్నిబట్టి ఎక్కువ మంది రైతులకు 1400 గజాల కంటె ఎక్కువ విస్తీర్ణం ఉన్న స్థలాలు ఇచ్చే పరిస్థితి నెలకొంది. మెజారిటీ మెట్ట ప్లాట్లే కేటాయింపు సీఆర్డీఏ తేల్చిన ప్లాట్ల కేటాయింపు లెక్కల్లో రైతులకు మెట్ట ప్లాట్లు మెజారిటీగా దక్కనున్నాయి. 7224 ఎకరాల్లో మెట్ట ప్రాంతంలోనే ఇస్తుండడం గమనార్హం. జరీబు ప్రాంతంలో 3,720 ప్లాట్లను మాత్రమే ఇవ్వనున్నారు. నిజానికి 29 గ్రామాల్లో జరీబు, మెట్ట భూములు సమానంగానే ఉన్నాయి. కానీ పంపిణీలో మాత్రం మెట్ట భూములే రైతులకు ప్లాట్ల రూపంలో ఎక్కువగా తిరిగి వస్తుండడం విశేషం. -
పట్టాలిచ్చారు కానీ.. స్థలాలు చూపించడంలేదు
కదిరి అర్బన్: ఇంటి పట్టాలు ఇచ్చి స్థలాలు చూపడం లేదని అనంతపురం జిల్లా కదిరి పట్టణ మహిళలు శుక్రవారం స్థానిక రోడ్డు భవనాల అతిథి గృహానికి వచ్చిన జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కాంతాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటిపట్టాలు 2009లో ఇచ్చారని, ఇంతవరకూ రెవెన్యూ అధికారులు వాటికి సంబంధించిన స్థలాలను చూపలేదన్నారు. అధికారపార్టీ నాయకులు స్థలాలు చూపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమకు స్థలాలు చూపేలా రెవెన్యూ అధికారులను ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో నాలుగురోజుల్లోగా ఎవరి స్థలాలు వారికి చూపించి రిజిస్టర్ను తనకు పంపాలని ఆర్డీఓ రాజశేఖర్, తహశీల్దార్ నాగరాజులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు జిఎల్ నరిసంహులు, హరి, వేమనారాయణతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. -
ఇళ్ల స్థలాల కోసం రోడ్డెక్కిన మహిళలు
కదిరి : అనంతపురం జిల్లా కదిరికి చెందిన పలువురు మహిళలు.. తమకు 2009లో ఇంటిపట్టాలు ఇచ్చారని, కానీ ఇంతవరకూ స్థలాలు చూపలేదని గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో బైఠాయించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తమకు ఇళ్ల స్థలాలు చూపాలంటే ఒక్కొక్కరూ రూ. 3000 ఇవ్వాలని అధికారపార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. పట్టాలు ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నా ఇంతవరకూ స్థలాలు ఎందుకు చూపడం లేదని వారు వాపోయారు. ఇదివరకు కూడా ఇంటిస్థలాలు చూపాలని చాలాసార్లు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలిపామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ఇంటిస్థలాల సర్వేయర్ను పంపించి, స్థలాలు చూపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు జిఎల్ నరసింహులు, హరి, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
నమ్మి కొంటే.. నట్టేట ముంచారు!
కందవాడ (చేవెళ్లరూరల్): వె ంచర్ యజమానులు గ్రామస్తులే కదా అని నమ్మి ప్లాట్లు కొన్న ఇద్దరు నట్టేట మునిగిపోయారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రియల్ వ్యాపారులు తమ రాజకీయ పలుకుబడితో కేసు నమోదు కాకుండా చూస్తున్నారని బాధితులు విలేకరుల ఎదుట వాపోయారు. బాధితులు తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మండల పరిధిలోని కందవాడ గ్రామంలో సర్వేనెంబర్ 284లో రెండు ఎకరాల భూమిని 2012లో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పెంటారెడ్డి, అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి మల్లేశ్తో కలిసి వెంచర్ చేశాడు. సుమారు 50 ప్లాట్లతో లేఅవుట్ చేశారు. వెంచర్ యజమానులు తమ గ్రామానికి చెందిన వారే కదా అని నమ్మిన కందవాడకు చెందిన కావలి శ్రీశైలం, కావలి శ్రీనివాస్లు తమ భార్యల పేరుమీద 150 గజాల చొప్పున రూ. 1.5 లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇటీవల వాని ప్లాట్లు ట్రాక్టర్ దున్ని వెంచర్ యజమానులు ఇతర వ్యక్తులకు అమ్మేందుకు యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు వెంచర్ యజమానులు ప్రశ్నించగా ప్లాట్లతో మీకు ఎలాంటి సంబంధం లేదని బెదిరించారు. దీంతో చేసేదిలేక బాధితులు ఈనెల 19న పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఇరువర్గాలు రాజీ కుదుర్చుకుంటామని చెప్పడంతో కేసు నమోదు చే యలేదు. కాగా తమపైనే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తారా..? అంటూ రియల్ వ్యాపారులు తమను బెదిరిస్తున్నారని బాధితులు విలేకరుల ఎదుట సోమవారం వాపోయారు. తాము రెక్కలుముక్కలు చేసుకొని పైసాపైసా కూడబెట్టుకుంటే ఇలా మోసం చేయడం ఎంతవరకు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంచర్ యజమానులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెబితే నమ్మి కొనుగోలు చేశామని.. ఇప్పుడు మోసం చేస్తున్నారని చెప్పారు. ఈవిషయమై ఎస్ఐ లక్ష్మీరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగాా.. ఫిర్యాదు అందిన విషయం వాస్తవమేనని చెప్పారు. ఇరువర్గాల వారు రాజీ కుదుర్చుకుంటామని చెబితే కేసు నమోదు చేయలేదు. బాధితులు తమ వద్ద ఉన్న పత్రాలతో కేసు నమోదు చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని తెలిపారు. ఈ విషయమై వెంచర్ యజమాని పెంటారెడ్డి మాట్లాడుతూ.. బాధితు లకు తాము తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. తాము ఎవరినీ బెదిరించలేదని తెలియ జేశారు. రాజకీయంగా తమను ప్రత్యర్థులు దెబ్బతీసేందుకు యత్నిస్త్త్త్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. -
వుడా భూమాయపై నోటిఫికేషన్
సాక్షి, విశాఖపట్నం: ల్యాండ్ పూలింగ్ పథకం కింద నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన స్థలాలపై వుడా అధికారులు శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు. కలెక్టర్, జీవీ ఎంసీ, సబ్రిజిస్ట్రార్, పంచాయతీలకు నోటిఫికేషన్ కాపీలు పంపారు. అడ్డగోలుగా ప్లాట్లు దక్కించుకున్న వారికి షో కాజ్ నోటీసులు జారీ చేశారు. వారి నుం చి వచ్చిన సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ల్యాండ్పూలింగ్లో నిబంధనలను పక్కనపెట్టి ఎటువంటి షరతులు విధించకుండా అడ్డగోలుగా ప్రత్యామ్నాయ భూములు కేటాయించారు. ప్రభుత్వ భూములనే ప్రైవే టు వ్యక్తుల నుంచి సేకరించినట్లు చూ పించి ప్రత్యామ్నాయంగా వారికి విలువైన భూములు కట్టబెట్టారు. భూములు కోల్పోయిన వారికి అదే ప్రాంతంలో అభివృద్ధి చేసిన స్థలాలు ఇవ్వాల్సి ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా విలువ ఎక్కు వ ఉన్న ఎంవీపీ కాలనీ, సాగర్నగర్, రుషికొండ భూములు ముట్టజెప్పారు. అసలు నిజమైన లబ్ధిదారులో కాదో అన్నది రెవెన్యూ అధికారుల ధ్రువీకరణ లేకుండా ఇష్టానుసారంగా ప్రత్యామ్నాయంగా భూములు ఇచ్చారు. లబ్ధిపొం దిన రైతులకు కొంచెం స్థలాన్ని ఇచ్చి కేటాయించిన భూముల్ని మూడో పార్టీ రిజిస్ట్రేషన్ కింద తమ బినామీలకు అప్ప టి అధికారులు బదలాయించారు. ఈ అక్రమాలన్నింటినీ వుడా అధికారులు గుర్తించడమేకాకుండా వాటి జాబితాను తయారు చేశారు. 92 ఫైళ్ల ద్వారా 306 మంది నిబంధనలకు విరుద్ధంగా స్థలా లు పొందినట్టు తేల్చారు. సర్వే నంబర్లు, స్థలం, లబ్ధిదారుల పేర్లతో శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ ప్రతులను కలెక్టర్, జీవీఎంసీ, మధురవాడ, భీమిలి సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు పంపారు. అక్రమాలు జరిగిన మధురవాడ, రుషికొండ, పరదేశిపాలెం, ఎండాడ పంచాయతీలకు పం పించారు. బహిరంగంగా చూసేందుకు ఆయా కార్యాలయాల్లో అతికించనున్నా రు. అంతేకాకుండా అక్రమంగా స్థలాలు పొందిన వారికి ఎందుకు చర్య తీసుకోకూడదో తెలియజేయాలని కోరారు.