Poultry
-
3,500 నాటు కోళ్లు మృతి
నర్సాపూర్ రూరల్: అంతుచిక్కని వ్యాధితో నాటు కోళ్లు మృతి చెందిన సంఘటన నర్సాపూర్ మండలం లింగాపూర్లో చోటు చేసుకుంది. లింగాపూర్ తండాకు చెందిన పాతులోత్ ప్రసాద్కు చెందిన 3,500 నాటు కోళ్లు అంతు చిక్కని వ్యాధితో మృత్యువాత పడ్డాయి. కొన్ని రోజులుగా నాటు కోళ్ల పెంపకంతో ఉపాధి పొందుతున్న ప్రసాద్ తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడు. అప్పులు చేసి రూ. 8 లక్షల వరకు పెట్టుబడి పెట్టి నాటు కోళ్లను పెంచుతున్నట్లు బాధితుడు తెలిపాడు. ఇటీవల నా షెడ్డు దగ్గరలో ఉన్న బాయిలర్ పౌల్ట్రీ షెడ్డులో కోళ్లు చనిపోయాయని, అదే వ్యాధి నాటు కోళ్లకు వ్యాపించి చనిపోయని ఆరోపించాడు. ప్రైవేట్ బాయిలర్ కోళ్ల కంపెనీ, లేదా ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు. ఈ విషయమై పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి సౌమిత్ను వివరణ కోరగా.. అతి ఉష్ణోగ్రత కారణంగా కోళ్లు చనిపోయి ఉంటాయని, లేదా ఇంకా ఏదైనా వ్యాధితో మృతి చెంది ఉంటాయన్నారు. బర్డ్ప్లూ అని మాత్రం నిర్ధారించలేమన్నారు. మృతి చెందిన కోళ్లను ల్యాబ్కు పంపుదామంటే బాధితుడు కోళ్లను గోతిలో పాతి పెట్టడంతో ల్యాబ్కు పంపలేకపోయినట్లు చెప్పారు. పౌల్ట్రీ షెడ్డులు నిర్వహించే రైతులు కోళ్లకు ఏదైనా సమస్య వచి్చనట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖ వైద్య అధికారులను సంప్రదించాలని సూచించారు. -
ఉపాధికి 'బర్డ్ ఫ్లూ' దెబ్బ
-
సర్కారు పాపం.. ‘పౌల్ట్రీ’కి శాపం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పౌల్ట్రీ రంగం గుడ్లు తేలేస్తోంది. జనవరి మొదటి వారంలోనే పెద్ద సంఖ్యలో నాటు కోళ్లు, పందెం కోళ్ల మరణాలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలోనే అధికార యంత్రాంగం అప్రమత్తమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. ఏపీ సరిహద్దులోని ఖమ్మం జిల్లాతో పాటు.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనవరి మూడో వారంలో ఒకేసారి లక్షల సంఖ్యలో కోళ్ల మరణాలు సంభవించాయి. ఇందుకు కారణాలను అన్వేషించకుండా, ఈ మరణాలన్నీ చలికాలం వల్లే సంభవిస్తున్నాయని, ఉష్ణోగ్రతలు పెరిగితే ఎలాంటి ప్రభావం ఉండదని ప్రభుత్వం కొట్టిపారేసింది. అదే సమయంలో కోళ్లు గుడ్లు తేలేస్తున్నాయంటూ ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగానే ఆగమేఘాల మీద ఆయా పౌల్ట్రీ ఫారాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షకు భోపాల్ పంపారు. ఈ నెల 10న వచ్చిన రిపోర్టులో ఈ మరణాలకు కారణం బర్డ్ ఫ్లూ అని తేలడంతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు ఏర్పాటు చేసి జీవభద్రతా చర్యలు చేపట్టింది. ముందుగానే స్పందించి ఉంటే తామిలా నష్టాల ఊబిలో కూరుకుపోయి ఉండే వారం కాదని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైబీరియన్ పక్షులపై నెపం! దాదాపు 40 లక్షల కోళ్లు మృత్యువాత పడినట్టుగా పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. అయితే ఐదున్నర లక్షల కోళ్లు మాత్రమే చనిపోయాయని అధికార యంత్రాంగం వెల్లడించింది. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ భయోందోళన వల్ల రోజువారీ చికెన్, గుడ్ల వినియోగం పడిపోయింది. ఎగుమతులు తగ్గిపోయాయి. ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్ల పంపిణీని సైతం నిలిపివేశారు. చాలా వరకు చికెన్ షాపులు మూతపడ్డాయి. హోటళ్లలో, ఇళ్లలో చికెన్ వంటకాలపై వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. వెరసి ఫౌల్ట్రీ రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సైబీరియన్ పక్షులపై నెపం మోపుతుండటం గమనార్హం. విదేశాల నుంచి ఈ పక్షులు వలస వచ్చినందునే బర్డ్ ఫ్లూ ప్రబలిందని ప్రభుత్వం కుంటి సాకులు చెబుతుండటాన్ని ఆ రంగం నిపుణులు తప్పు పడుతున్నారు. అలాగైతే ఈ పక్షులు ప్రతి సంవత్సరం వలస రావడం మామూలేనని, ఈ లెక్కన ప్రతి ఏటా బర్డ్ ఫ్లూ వచ్చిందా.. అని నిలదీస్తున్నారు.శాస్త్రీయ అధ్యయనం లేకుండా సైబీరియన్ పక్షులను సాకుగా చూపి ప్రభుత్వం తప్పుకుంటుండటం సరికాదంటున్నారు. పౌల్ట్రీ మార్కెట్ పడిపోకుండా ఎలాంటి చర్యలకు ఉపక్రమించక పోవడం చర్చనీయాంశమైంది. చికెన్, గుడ్లు బాగా ఉడికించి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ఓ వైపు చెబుతూనే.. మరోవైపు విద్యా సంస్థలకు ప్రభుత్వమే గుడ్ల సరఫరా బంద్ చేయించడం గమనార్హం. పర్యవేక్షణకు కాల్సెంటర్బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి ప్రజలు, కోళ్ల పెంపకదారుల కోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కాల్సెంటర్ ఏర్పాటు చేసినట్టు పశుసంవర్థకశాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదరనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 0866–2472543, 9491168699 ఫోన్ నంబర్లతో ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కాల్ సెంటర్ ద్వారా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు. ఎగుమతులపై తీవ్ర ప్రభావం‘బర్డ్ ఫ్లూ’ పూర్తిగా తగ్గుముఖం పట్టిందని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ మరో వైపు వేగంగా జిల్లాలు దాటి విస్తరిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల అమ్మకాలు, ఎగుమతులు అనూహ్యంగా పడిపోయాయి. దాదాపు 50–60 శాతం మేర అమ్మకాలు పడిపోవడంతో ధరలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఏపీ నుంచి పొరుగు రాష్ట్రాలతో పాటు విదేశాలకు కోడి గుడ్ల ఎగుమతులపై బర్డ్ ఫ్లూ తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో 1200కు పైగా కోళ్ల ఫారాలు ఉండగా, వాటిలో 5.60 కోట్లకు పైగా కోళ్లున్నాయి. వెయ్యికి పైగా ఫారాలు ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, ప్రస్తుతం రోజుకు 4.75 కోట్ల గుడ్లకు మించి ఉత్పత్తి జరగడం లేదు. రాష్ట్ర పరిధిలో 2.50 కోట్ల నుంచి 3 కోట్ల గుడ్లు వినియోగమవుతున్నాయి. మిగిలిన గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, అసోం, మణిపూర్ తదితర రాష్ట్రాలతో పాటు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. గతేడాది కురిసిన వర్షాలు, వరదలతో దాదాపు 2 లక్షల కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఆ సమయంలోనే క్రానిక్ రెస్పటరీ డిసీజ్, ఇన్ఫెక్షన్ బ్రాంకటైస్, కొక్కెర తెగుళ్లు విజృంభించాయి. దీనికి తోడు ఈ ఏడాది సకాలంలో కోళ్లకు వ్యాక్సినేషన్ వెయ్యలేదనే విమర్శలు కూడా విన్పించాయి. -
అంతుచిక్కని లక్షణాలతో.. గుడ్లు తేలేస్తున్న కోళ్లు
సాక్షి, భీమవరం/పెరవలి: ఏపీ పౌల్ట్రీల్లో కోళ్ల మృత్యువాత కలకలం రేపుతోంది. అంతుచిక్కని వైరస్తో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతుండటం కలవరపెడుతోంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ప్రతి పౌల్ట్రీలో నిత్యం రోజుకు వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. గత 15 రోజుల్లో సుమారు 40 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్టు అంచనా. డిసెంబర్లోనే మొదలైన అంతుచిక్కని వైరస్ సంక్రాంతి తర్వాత మరింత విజృంభించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని ఓ పౌల్ట్రీలో ఇప్పటికే 1.60 లక్షల కోళ్లు మరణించాయి. ఆరోగ్యంగానే ఉన్నా క్షణాల్లో మరణం అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించిన కోడి అంతలోనే మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ నిర్వాహకులను కలవరపెడుతోంది. సాధారణ మరణాలకు భిన్నంగా వేలాది కోళ్లు చనిపోతుండటం వారికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అంతుచిక్కని వైరస్ చాపకింద నీరులా పౌల్ట్రీలకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు 200 పౌల్ట్రీలు ఉన్నాయి. వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.30 కోట్ల వరకు ఉండగా.. రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 245 షెడ్లలో 1.35 కోట్ల కోళ్లు ఉండగా.. వీటిని 245 షెడ్లలో పెంచుతున్నారు. ఈ జిల్లాలో నిత్యం 1.08 కోట్ల వరకు గుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. మొత్తంగా రెండు జిల్లాల్లో గుడ్లు పెట్టే కోళ్లు 2.65 కోట్ల వరకు ఉండగా.. నిత్యం 2.13 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి, నిడదవోలు, నల్లజర్ల, గోపాలపురం, కొవ్వూరు, కడియం ప్రాంతాల్లో పౌల్ట్రీలు ఉన్నాయి. ఇవేకాకుండా మాంసానికి వినియోగించే బ్రాయిలర్ కోళ్లను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నెలకు 12 లక్షలకు పైగా పెంచుతున్నారు. వీటి సంఖ్య ప్రతి 40 రోజులకు మారిపోతుంటుంది. ఊహించని రీతిలో మరణాలు సాధారణంగా డిసెంబర్, జనవరి మాసాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువై కొరైజా, సీఆర్డీ (క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్), రానికెట్ వంటి ఊపిరితిత్తుల సంబంధిత వైరస్లు వ్యాపిస్తుంటాయి. సాధారణంగా ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో పౌల్ట్రీలోని కోళ్ల సంఖ్యలో రోజుకు 0.05 శాతం లోపు కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీలో రోజుకు 20 నుంచి 50 వరకు కోళ్లు చనిపోతుంటే పరిగణనలోకి తీసుకోరు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. కొద్దిరోజుల క్రితం నాటు కోళ్లలో కనిపించిన వింత లక్షణాలు ఇప్పుడు లేయర్, బ్రాయిలర్ కోళ్లకు వ్యాపించాయి. నాటు కోళ్లతో పోలిస్తే లేయర్ కోళ్లకు వ్యాక్సినేషన్ విషయంలో పౌల్ట్రీ వర్గాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. కోడికి 20 వారాల వయసు వచ్చేనాటికి ఐ డ్రాప్స్, నీటిద్వారా, ఇంజెక్షన్ రూపంలో దాదాపు 23 వరకు వ్యాక్సిన్లు వేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లు అంతుచిక్కని లక్షణాలతో మృత్యువాత పడుతుండటం పౌల్ట్రీ వర్గాలను కలవరపరుస్తోంది. కొన్ని పౌల్ట్రీల్లో అసాధారణ రీతిలో కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి. లక్ష కోళ్లు ఉంటే రోజుకు 3వేల నుంచి 4వేల వరకు చనిపోతున్నాయి. మూడు లక్షల కోళ్లు ఉన్న ఒక పౌల్ట్రీలో వారం రోజులుగా రోజుకు 13 వేల నుంచి 14 వేల వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు ఉంగుటూరు మండలానికి చెందిన రైతు ఒకరు చెప్పారు. బర్డ్ఫ్లూ తరహాలోనే.. బర్డ్ఫ్లూ తరహాలోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. శీతాకాలంలో వచ్చే వ్యాధులకు భిన్నంగా ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. తెల్లారేసరికి ఎన్ని కోళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది వారాల క్రితం కృష్ణా జిల్లాలో అక్కడకక్కడా కనిపించిన ఈ వైరస్ లక్షణాలు తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు విస్తరించినట్టు తెలుస్తోంది. గతంలో బర్డ్ప్లూ వచ్చినప్పుడు కోళ్లను పూడ్చిపెట్టిన తరహాలోనే ఇప్పుడు చనిపోయిన కోళ్లను భారీ గోతులు తీసి సున్నం, బ్లీచింగ్, ఉప్పు వేసి పూడ్చిపెడుతున్నారు. పౌల్ట్రీల వద్ద ఫార్మాలిన్ ద్రావణంతో సిబ్బంది కాళ్లు, వాహనాల టైర్లు శుభ్రపరచిన తరువాత మాత్రమే లోపలికి అనుమతిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పతనమవుతున్న గుడ్డు ధర శీతల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకుని డిసెంబర్లో ఫామ్ గేట్ వద్ద రూ.6.30కి అమ్ముడైన గుడ్డు ధర ఎండలు ముదురుతుండటంతో తిరోగమనం బాట పట్టాయి. ప్రస్తుతం ఫామ్ గేట్ వద్ద గుడ్డు ధర రూ.4.62కు చేరింది. ఓ వైపు గుడ్డు ధర పతనమవుతుంటే మరోపక్క అధిక సంఖ్యలో కోళ్ల మరణాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒక కోడి చనిపోతే రైతుకు రూ.300 నష్టం వస్తుంది. ఈ మేరకు ఎన్ని కోళ్లు చనిపోతే అంత నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. బ్యాంకు రుణాలు, అమ్మకాలు తగ్గిపోతాయన్న ఆందోళనతో పౌల్ట్రీ వర్గాలు వీటిపై నోరుమెదపని పరిస్థితి నెలకొంది. స్పష్టత ఇవ్వలేకపోతున్న పశు సంవర్థక శాఖ కోళ్ల ఆకస్మిక మరణాలపై పశు సంవర్థక శాఖ పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ను ల్యాబ్కు పంపామని, నివేదికలు రావాల్సి ఉందని పశుసంవర్ధక శాఖ ఏలూరు జిల్లా ఇన్చార్జి జేడీ టి.గోవిందరాజు తెలిపారు. ప్రస్తుతం హైలీ వైరల్డ్ ఆర్డీగా భావించి పౌల్ట్రీల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెడుతూ.. మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ముందుజాగ్రత్తలే నివారణ కోళ్లకు సోకుతున్న వైరస్లకు మందులు లేవు. ముందుజాగ్రత్తలతోనే నివారణ సాధ్యం. వైరస్ సోకిన కోళ్లు గంటల వ్యవధిలోనే మృత్యువాత పడతాయి. ఒక కోడికి వైరస్ సోకిన నిమిషాల్లోనే మిగిలిన కోళ్లకు వ్యాపిస్తుంది. దీని నివారణకు వైరస్ సోకిన కోళ్లను వేరు చేయటం ఒక్కటే మార్గం. ముందస్తు టీకాలు వేయటం ద్వారానే అరికట్టాలి. కోళ్లలో వ్యాధి నిరోదక శక్తి పెంచేలా చర్యలు తీసుకోవాలి. – చరణ్, పశువైద్యాధికారి, పెరవలి -
లోన్ ఆశ చూపి.. రూ.39 వేల నాటు కోళ్లు తిన్న బ్యాంక్ మేనేజర్!
చత్తీస్గఢ్లో ఓ వింత ఘటన వెలుగుచసింది. నాటు కోడి కూర అంటే తెగ ఇష్టపడే ఓ బ్యాంక్ మేనేజర్.. ఓ రైతును బకరాలాగా ఉపయోగించుకున్నాడు. అతడికి లోన్ ఇప్పిస్తానని ఆశ చూపి ఏకంగా వేల విలువైన నాటు కోళ్లను అమాంతం తినేశాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలోని మస్తూరి పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. మస్తూరి పట్టణానికి చెందిన రైతు మన్హర్కు కోళ్ల ఫారమ్ ఉంది. తన పొలంలో ఏర్పాటు చేసిన ఆ కోళ్ల ఫారాన్ని మరింత విస్తరించాలని రైతు భావించాడు. అందుకు లోన్ తీసుకోవాలని నిర్ణయించుకుని స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ను కలిశాడు. లోన్ ఇస్తానని చెప్పిన మేనేజర్ తనకు నాటు కోడి కూర అంటే ఇష్టమని, తనకు ప్రతి శనివారం నాటు కోడి తెచ్చివ్వాలని కోరాడు. లోన్ వస్తుందన్న ఆశతో రైతు మన్హర్ బ్యాంకు మేనేజర్ చెప్పినట్టే చేశాడు. అప్పటి నుంచి మొదలు లోన్ పేరు చెప్పి తరచూ అతడు మన్హర్ ద్వారా నాటు కోళ్లు తెప్పించుకుని తిన్నాడు.ఇలా రెండు నెలల వ్యవధిలో అతడు మొత్తం రూ.39 వేల విలువ చేసే నాటుకోళ్లు తిన్నాడు. పైగా రైతు నుంచి లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా డిమాండ్ చేశాడు. దాంతో అతను తన ఫారమ్లోని కోళ్లను అమ్మి రూ.10 లక్షల లోన్ కోసం 10 శాతం కమిషన్ కూడా ఇచ్చాడు. అయినా బ్యాంకు మేనేజర్ లోన్ మంజూరు చేయకుండా ఇంకా నాటు కోళ్ల కోసం డిమాండ్ చేశాడు. దాంతో బ్యాంకు మేనేజర్ తనకు లోన్ ఇవ్వదల్చుకోలేదని, తనను మోసం చేశాడని గ్రహించిన మన్హర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కొనుగోలు చేసి మేనేజర్కి ఇచ్చిన కోళ్ల బిల్లులు కూడా తన వద్ద ఉన్నాయని, మేనేజర్ తిన్న కోళ్లకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేనేజర్పై చర్య తీసుకోవాలని లేదంటే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనకు న్యాయం చేయకపోతే నిరహార దీక్షకు కూర్చుంటానని, మస్తూరి ఎస్బీఐ బ్రాంచ్ ముందే తాను చచ్చిపోతానని హెచ్చరించాడు. దాంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
‘ఎగ్’బాకుతున్న ధర
సాక్షి, భీమవరం/ నెల్లూరు(సెంట్రల్): రాష్ట్రంలో కొద్ది రోజులుగా నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, పప్పులు, నూనెలు ఏవీ కొనేటట్టు లేవు. కూరగాయలు కూడా కిలో 60కి తక్కువ ఏదీ లేదు. కాస్తో కూస్తో కోడి గుడ్డే చవగ్గా ఉందనుకుంటే ఇప్పుడు అదీ కొండెక్కి కూర్చుంటోంది. రిటైల్గా ఒక్కో గుడ్డు రూ.7కి తక్కువ లేదు. కొన్ని జిల్లాల్లో రూ.8.00కి ఎగబాకేసింది. ఈ సీజన్లోనూ గుడ్డు ధర ఫాం గేటు వద్దే పరుగులు పెడుతోంది. ప్రస్తుతం రూ.6.20తో పాత ధరను చేరుకొంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. హోల్సేల్లో ధరే వంద గుడ్లు ధర రూ.700కు చేరింది. రిటైల్ మార్కెట్లోకి వచ్చే సరికి మరో రూపాయి పెరిగి రూ.8కి చేరడంతో సామాన్యులు కొనలేకపోతున్నారు. ఫాం గేటు వద్ద ధర పెరిగితే రిటైల్ ధర కూడా ఇంకా పెరుగుతుందని మార్కెట్వర్గాలు చెబుతున్నాయి. ఇంత ధర పెట్టి కొనలేమని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు 4.4 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి 60 శాతం గుడ్లు పశి్చమ బెంగాల్, బీహార్, అసోం, ఒడిశా, యూపీ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటే మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉత్పత్తయ్యే గుడ్లలో అధిక శాతం స్థానికంగానే వినియోగమవుతున్నాయి.శీతాకాలం కావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువై, ఎగుమతులు పెరిగి ఫాం గేటు ధర పెరుగుతోంది. గత డిసెంబరు 27న ఫాం గేట్ వద్ద రూ.6.20తో అత్యధిక ధర నమోదయింది. ఆ తర్వాత తగ్గినా.. మళ్లీ క్రమేపీ పెరిగి గురువారం రూ.6.20కి చేరింది. మరోపక్క రైతులకు కూడా మేత ధరలు, రవాణా ఖర్చులూ పెరిగిపోయాయి. ధరలు పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. రైతులకు ఎటువంటి సహాయం చేయడంలేదు. దీని ప్రభావం ధరలపై పడుతోంది. రైతుకేమీ లాభం లేదంటున్న పౌల్ట్రీ వర్గాలు ప్రస్తుతం గుడ్డు ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీ, పెరిగిన మేత ధరలతో రైతుకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని పౌల్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కొద్దికాలంగా పౌల్ట్రీలు విస్తరించి, రోజుకు 2.5 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో కోస్తా గుడ్లకు డిమాండ్ తగ్గింది. పైగా, ఇక్కడి నుంచి వెళ్లే ఒక్కో గుడ్డుపై రూపాయి వరకు రవాణాకు ఖర్చవుతుండగా అక్కడి గుడ్లపై 25 పైసల లోపే ఉంటోంది. దీంతో అక్కడి మార్కెట్ ధరకు తగ్గించి అమ్మడం వల్ల నష్టపోతున్నామని కోళ్ల రైతులు అంటున్నారు. మరోపక్క కోళ్ల మేతలో ఎక్కువగా వాడే మొక్కజొన్న ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువ సాగవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి రవాణా చార్జీల భారం పెరిగిపోతోంది. దీనికితోడు ఇథనాల్, ఆల్కహాల్ పరిశ్రమలు మొక్కజొన్నతో పాటు కోళ్ల మేతలో వాడే పాడైన బియ్యం నూకలను కూడా భారీగా కొనేస్తుండటంతో ఇవి రైతాంగానికి దొరకడంలేదు. గతంలో పంట వచ్చిన సమయంలో కిలో రూ.18 ఉండే మొక్కజొన్న ఇప్పుడు రూ.27 ఉంది. దీంతో నిర్వహణ భారంగా మారిందని రైతులు చెబుతున్నారు. ఏడాది సగటు రైతు ధర రూ.5.75 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని, ఈ ఏడాది రూ.5 లోపే ఉండటంతో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది సీజన్..చలి ఎక్కువగా ఉండే నవంబరు నుంచి ఫిబ్రవరి నెల వరకు పౌల్ట్రీకి సీజన్గా భావిస్తారు. ఏటా ఈ కాలంలో రైతు ధర పెరుగుతూ ఉంటుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో చలికాలంలో చేపల లభ్యత తగ్గుతుంది. దీంతో అక్కడ గుడ్ల వినియోగం పెరుగుతుంది. రాష్ట్రంలోనూ చలి కాలంలో గుడ్ల వినియోగం ఎక్కువగానే ఉంటుంది. కార్తీక మాసమూ ముగిసింది. పైపెచ్చు క్రిస్మస్, నూతన సంవత్సరం వస్తుండడంతో కేక్లకు డిమాండ్ ఉంటుంది. కేకులలో కోడిగుడ్లు తప్పనిసరిగా వాడతారు. సంక్రాంతికి కూడా గుడ్లకు డిమాండ్ ఎక్కువే. అందువల్ల ఇప్పటి నుంచే గుడ్లు ధర పెంచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.ప్రభుత్వం ఆదుకుంటేనే పౌల్ట్రీలకు మనుగడ మేత ధరలు, నిర్వహణ భారం విపరీతంగా పెరిగిపోయి గుడ్డు ధర గిట్టుబాటు అవ్వక కొన్నేళ్లుగా కోళ్ల పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉంది. మొక్కజొన్న, నూకలను ఇథనాయిల్, ఆల్కహాల్ కంపెనీలు ముందుగానే టోకుగా కొనేస్తుండటంతో కోళ్లకు మేత దొరకడం కష్టమవుతోంది. మొక్కజొన్న, ఎఫ్సీఐలో పాడైన బియ్యం, నూకలను సబ్సిడీపై అందించి ప్రభుత్వం ఆదుకోవాలి. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి,అర్తమూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లారేట్లు ఎక్కువగా ఉన్నాయి కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎప్పుడు ఎంత పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. పెరగడమే తప్ప తగ్గడం అనేది లేదు. గుడ్డు తిందామన్నా రేట్లు చూసి మానుకోవాల్సి వస్తోంది. – వినయ్, స్టౌన్హౌస్పేట, నెల్లూరు జిల్లాఅన్ని రేట్లు పెరిగాయి ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరిగిపోయాయి. కనీసం గుడ్డు తిందామన్నా రేట్లు చూస్తే భయమేస్తోంది. కొందరు వ్యాపారులు కావాలనే రేట్లు పెంచుతున్నారనే ఆనుమానాలు కలుగుతున్నాయి.– బ్రహ్మరెడ్డి, డీసీ పల్లి, నెల్లూరు జిల్లా -
గాజాలో పంటలు నాశనం... పశువుల మృత్యువాత!
గాజా–ఇజ్రాయెల్ మధ్య ఎడతెగని యుధ్ధం గాజాలోని అనేక పదుల సంఖ్యలో మనుషులను బలిగొంది. అంతేకాదు, అక్కడి రైతులు, పశుపోషకుల జీవితాలను యుద్ధం ఛిద్రం చేసింది. కొనసాగుతున్న యుద్ధం స్థానిక ఆహారోత్పత్తి అడుగంటడంతో గాజాలో ఆహార భద్రత వేగంగా క్షీణించింది. గాజాలో దాదాపు 86 శాతం జనాభా (18.4 లక్షల) మంది ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. యావత్ గాజా స్ట్రిప్లో తిండి దొరకని తీవ్ర క్షామ పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది.ఎఫ్.ఎ.ఓ. ఉపగ్రహ కేంద్రం ఇటీవల సేకరించిన ఒక అధ్యయనంలో ఉపగ్రహ డేటా ప్రకారం.. గాజాలోని పంట భూమిలో మూడింట రెండొంతుల భూమి నాశనమైంది. గాజా వాసులకు చెందిన దాదాపు 15 వేల (95 శాతం) పశువులు చనిపోయాయి. దాదాపు దూడలన్నీ వధించబడ్డాయి. సుమారు 25 వేల గొర్రెలు (సుమారు 43 శాతం), కేవలం 3 వేల మేకలు (సుమారు 37 శాతం) మాత్రమే సజీవంగా మిగిలాయి. పౌల్ట్రీ రంగానికి కూడా అపార నష్టం జరిగింది. 99% కోళ్లు చనిపోయాయి. కేవలం 34 (1 శాతం) వేలు మాత్రమే మిగిలాయి.సగానికి సగం జీవాలు మృతిభయానక యుద్ధం వల్ల గాజాకు చెందిన పశుపోషకురాలు హక్మా ఎల్–హమీది తన కుటుంబ జీవనాధారమైన గొర్రెలు, మేకలు సహా దక్షిణ భాగాంలోకి వలస పోయింది. ఈ కుటుంబం కనీసం సగం జీవాలను కోల్పోయింది. పశువుల పనులు ఆమెకు చిన్నప్పటి నుండి అలవాటే. రోజుకు మూడు పూటలా వాటి బాగోగులు చూసుకుంటుంది. ‘యుద్ధ కాలంలో ఆహారం లేదు, బార్లీ లేదు, మేత లేదు, నీరు కూడా లేదు. మాకు నలభైకి పైగా పశువులు ఉండేవి. ఇప్పుడు ఇరవై కంటే తక్కువే మిగిలాయి’అని సెంట్రల్ గాజా స్ట్రిప్లోని అల్–జువైదా నివాసి హక్మా చెప్పారు.ఈ నష్టాలు ఆమె కుటుంబ జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగించాయి. ‘ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) మాకు పశువుల మేతను అందించి చాలా సహాయం చేసింది. దేవునికి ధన్యవాదాలు. ఈ జీవాలైనా చనిపోకుండా మిగిలాయి. ఆరోగ్యంగా ఉన్నాయి..’ అన్నారామె. ఎఫ్.ఎ.ఓ. అందించిన వెటర్నరీ కిట్ కూడా ‘నాకు చాలా సహాయపడింది. విటమిన్లతో కూడిన దాణాతో పాటు దోమలు/ ఈగల బాధ లేకుండా చేసే స్ప్రే ఆ కిట్లో ఉన్నాయి. జీవాలను ఈగలు కుట్టకుండా దీన్ని పిచికారీ చేస్తున్నాను. ఇది నిజంగా బాగుంది’ అన్నారామె.పశుగ్రాసం, వెటర్నరీ కిట్ల పంపిణీభద్రత, ప్రయాణ సంబంధ సవాళ్లను అధిగమించి గాజా ప్రజలకు అనేక సంస్థలు మానవతా సహాయాన్ని అందించాయి. గాజాలోని డెయిర్ అల్–బలా, ఖాన్ యూనిస్, రఫా గవర్నరేట్లలోని 4,400కు పైగా పశు పోషణే జీవనాధారంగా గల కుటుంబాలకు ఎఫ్.ఎ.ఓ. పశుగ్రాసాన్ని పంపిణీ చేసింది. జంతువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, గాజా అంతటా జీవనోపాధులను కాపాడేందుకు దాదాపు 2,400 కుటుంబాలకు వెటర్నరీ కిట్లు అదనంగా అందించారు. మల్టీవిటమిన్లు, క్రిమిసంహారకాలు, సాల్ట్ బ్లాక్లు, అయోడిన్ గాయం స్ప్రేలు వంటి జంతువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు చాలా అవసరమైన వస్తువులను అందించటం విశేషం. వాస్తవానికి, హక్మా వంటి పశుపోషకులకు ఈ మహా సంక్షోభ కాలంలో ఈ సహాయం సరిపోదు. తన జంతువులను రక్షించుకోవడానికి ఇంకా ఎక్కువ మేత, మరిన్ని మందులు, మరిన్ని గుడారాలు అవసరమని ఆమె చెప్పారు.ఈ సాయం చాలదుబాధాకరమైన గత సంవత్సర కాలంలో అపారమైన నష్టాన్ని చవిచూసిన మరొక పశు పోషకుడు వార్డ్ సయీద్. వాస్తవానికి గాజాలోని పాత నగరంలో ఎల్–జెటూన్స్ కు చెందిన మహిళా పశుపోషకురాలు. యుద్ధం నుంచి ప్రాణాన్ని కాపాడుకోవడానికి డెయిర్ అల్–బలాహ్కు వలస వెళ్లి ఆశ్రయం పొందారు. ‘యుద్ధం కారణంగా మేం దక్షిణాదికి తరలివచ్చాం. మా పశువులను కూడా తోలుకొచ్చాం. సగానికి సగాన్ని కోల్పోయాం. వాటిలో చాలా వరకు దారిలోనే చనిపోయాయి. ఈ మిగిలిన జీవాలే మాకు ఏకైక జీవనాధారం’ అన్నారామె. క్షిపణులు తరచూ పడే యుద్ధ ప్రాంతంలో ఆమె తన కుటుంబానికి ఆహారం, పశువులకు మేత కోసం ప్రాణాలను పణంగా పెట్టి మరీ శ్రమిస్తున్నారు. ‘ఎఫ్.ఎ.ఓ. పశువుల మేత, వెటర్నరీ కిట్ ఇచ్చింది. ఈ సాయం సరిపోదు. పశువుల మేత, భద్రత కలిగిన గూడు, ఆహారం ఇంకా కావాలి’ అన్నారామె. యుద్ధం అక్టోబర్ 7న ప్రారంభం కాక ముందు దాదాపు 650 ట్రక్కుల మేత ప్రతి నెలా గాజా స్ట్రిప్లోకి తెప్పించుకునేవారు. ఎఫ్.ఎ.ఓ., బెల్జియం, ఇటలీ, మాల్టా, నార్వే ప్రభుత్వాల మద్దతుతో పాలస్తీనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రభుత్వేతర సంస్థలతో కలిసి గాజా పశువుల సంరక్షకులకు మేత, వెటర్నరీ కిట్లను పంపిణీ చేస్తుంది. అయినా, అది అరకొరగానే మిగిలింది. యుద్ధం వల్ల ఆహారం, దాణా తదితరాలను రవాణా చేయటంలో సహాయక సంస్థలు అష్టకష్టాలను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితులు మెరుగుపడితే ఫీడ్ కాన్స్ సెంట్రేట్, గ్రీన్స్ హౌస్ ప్లాస్టిక్ షీట్లు, ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులు, వ్యాక్సిన్స్ లు, ఎనర్జీ బ్లాక్లు, ప్లాస్టిక్ షెడ్లు, జంతు షెల్టర్లు, మరిన్ని వెటర్నరీ కిట్లను అందించడానికి సిద్ధమని ఎఫ్.ఎ.ఓ. చెబుతోంది. గాజా నుంచి ప్రాణాలు అరచేత పట్టుకొని వలస పోయిన హక్మా, వార్డ్ వంటి పశు పోషక కుటుంబాలకు మరింత మెరుగైన సహాయం అందే రోజు కోసం వారు ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు.గ్రీన్హౌస్లు ద్వంసంగాజా స్ట్రిప్ ప్రాంతంలో గల పంట పొలాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి 68 శాతం, అంటే 10,183 హెక్టార్లలో పంట పొలాలు యుద్ధం వల్ల నాశనమయ్యాయని ఎఫ్.ఎ.ఓ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 43% పొలాలు నాశనం కాగా, మే నాటికి అది 57%కి పెరిగింది. 71% తోటలు, చెట్లు, 67% స్వల్పకాలిక పంటలు, 59% వరకు కూరగాయ పంటలు నాశనమయ్యాయి. యుద్ధం వల్ల గాజాలోని వ్యవసాయ మౌలిక సదుపాయాలు సర్వనాశనం అయ్యాయి. 1,188 (52%) వ్యవసాయ బావులు దెబ్బతిన్నాయి. 578 హెక్టార్ల (44%)లోని గ్రీన్ హౌస్లు నేలమట్టం అయినట్లు అంచనా.∙గాజా స్ట్రిప్ నుంచి దక్షిణాదికి వలస వచ్చి జీవనోపాధి కోల్పోయిన హక్మా, వార్డ్ వంటి పశుపోషకులకు పశుగ్రాసం, వెటర్నరీ కిట్లు ఎఫ్.ఎ.ఓ. పంపిణీ చేసింది. మరిన్ని జంతువులు చనిపోకుండా కాపాడుకోవడానికి, వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి సహాయపడ్డాయి. -
గుడ్డు రైతుకు గడ్డు కాలం!
పౌల్ట్రీ రంగంలో నాలుగు దశాబ్దాల అపార అనుభవం ఉన్న రెడ్డిబత్తుల సత్యనారాయణరెడ్డి 2 వేల కోళ్లతో మొదలు పెట్టి 2.32 లక్షల కోళ్ల ఫారం నిర్వహించే స్థాయికి ఎదిగారు. పదేళ్ల పాటు కృష్ణా జిల్లా లేయర్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సేవలందించారు. అలాంటి రైతు కూడా చివరకు నష్టాలు భరించలేక నూజివీడు మండలం అన్నవరం వద్ద తనకున్న కోళ్ల ఫారాలను అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తమ ప్రాంతంలో ఇటీవల ఐదు కోళ్ల ఫారాలను విక్రయించారని, మిట్టగూడెం వద్ద ఓ కోళ్లఫారాన్ని కూలగొట్టి భూమి విక్రయానికి పెట్టారని, ప్రభుత్వం ఆదుకోకుంటే పౌల్ట్రీ రంగం కోలుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఏటా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు తోడు ఫామ్ గేటు వద్ద గుడ్డుకు గిట్టుబాటు ధర లేకపోవడం, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాలతో అక్కడ పౌల్ట్రీ పరిశ్రమ బలంగా వేళ్లూనుకోవడం లాంటిæ కారణాల వల్ల రాష్ట్రంలో పౌల్ట్రీ రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. పలు జిల్లాల్లో ఫామ్స్ను విక్రయిస్తుండగా మరికొన్ని చోట్ల కార్పొరేట్ సంస్థలకు అప్పగించేస్తున్నారు. – సాక్షి, అమరావతిగతేడాది రికార్డు స్థాయిలో గుడ్డు ధర..రాష్ట్రంలో 1,200 కోళ్ల ఫారాలు ఉండగా రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఏపీలో 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు వినియోగమవుతుండగా 2 కోట్లకు పైగా గుడ్లు పశి్చమ బెంగాల్, ఒడిశా, బిహార్, అసోం, మణిపూర్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. మొన్నటి వరకు శ్రీలంక, గల్ఫ్ దేశాలకు ఏపీ నుంచి పెద్ద ఎత్తున గుడ్లు ఎగుమతి అయ్యేవి. పౌల్ట్రీ రంగ చరిత్రలో 2023లో ఫామ్ గేటు వద్ద గుడ్డుకు రికార్డు స్థాయిలో రూ.5.75కుపైగా ధర లభించడం, అదే సమయంలో పౌల్ట్రీరంగ అభ్యున్నతి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏపీ పౌల్ట్రీ డెవలప్మెంట్ పాలసీ తెచ్చే దిశగా అడుగులు వేయడంతో తమ వెతలు తీరుతాయని రైతులు భావించారు. మేత ఖర్చులు తడిసి మోపెడు... ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో దాదాపు 2 లక్షల కోళ్లు మృత్యువాత పడగా ఆ ప్రభావంతో కోళ్లు పెద్దఎత్తున జబ్బుల పాలవుతున్నాయి. పౌల్ట్రీ రంగంలో విరివిగా వినియోగించే మొక్కజొన్న, బ్రోకెన్ రైస్ తదితరాలు ఇథనాల్ ఫ్యాక్టరీలకు మళ్లించడంతో బహిరంగ మార్కెట్లో వాటి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. సోయా మినహా మిగిలిన మేతæ ఖర్చులు రైతులకు భారంగా మారిపోయాయి. సాధారణంగా జూన్ తర్వాత ఫామ్ గేటు వద్ద గుడ్డు రేటు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఫామ్ గేటు వద్ద రూ.4.50 నుంచి రూ.4.75కి మించి రావడం లేదు. ప్రస్తుతం ఫామ్ గేటు వద్ద లేయర్ లైవ్ ధర కిలో రూ.78, బాయిలర్ రూ.102 చొప్పున ధర లభిస్తోంది. 40–50 శాతానికి పడిపోయిన ఉత్పత్తి సాధారణంగా ఫామ్లో 70–80 వారాల పాటు కోడి సగటున రూ.1,300 విలువైన మేత తింటుంది. సగటున 330 వరకు గుడ్లు పెడుతుంది. అత్యధికంగా 20–40 వారాల మధ్య గరిష్టంగా 96 గుడ్లు వరకు పెడుతుంటాయి. వర్షాలు, వరదల వల్ల దాదాపు 8–10 శాతం కోళ్లు వైరస్ల బారిన పడడంతో 40–50 శాతానికి ఉత్పత్తి తగ్గిపోయింది. పెట్టుబడి ఖర్చులు తట్టుకోలేక కొత్త బ్యాచ్లు పెట్టేందుకు రైతులు సాహసించడం లేదు. ప్రస్తుతం 75 శాతం కెపాసిటీతోనే ఫామ్స్ నడిచే పరిస్థితి నెలకొంది. గతేడాది ఇదే సమయంలో 4.75 కోట్ల నుంచి 5 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవగా ప్రస్తుతం 3.75 కోట్లకు మించి ఉత్పత్తి కావడం లేదు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఏపీ నుంచి వచ్చే గుడ్లకు ధర లేకుండా చేయడం, తమిళనాడు నుంచి కూడా ఏపీకి సరఫరా పెరగడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహకాల ఫలితంగా యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో కోళ్ల ఫారాలు గణనీయంగా పెరుగుతుండడంకూడా ఏపీ పౌల్ట్రీ రంగానికి అశనిపాతంగా మారింది.సిండికేట్తో ధరలు పతనం గతేడాది రికార్డు స్థాయిలో ధర లభించడంతో పౌల్ట్రీ రంగం కాస్త కుదుటపడుతుందని రైతులు ఆశించారు. వైరస్ల ప్రభావంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు సిండికేట్గా మారి ఫామ్ గేటు వద్ద మన రైతుకు ధర లేకుండా చేస్తున్నారు. – తుమ్మల కుటుంబరావు, నెక్ మాజీ చైర్మన్ మేత ఖర్చులు భారం.. ఇథనాల్ ఫ్యాక్టరీలు పెరిగిపోయాయి. మొక్కజొన్న, బ్రోకెన్ రైస్ ఈ ఫ్యాక్టరీలకు మళ్లిస్తున్నారు. ఫలితంగా మార్కెట్లో వీటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కోళ్ల ఫారమ్ల నిర్వహణ చాలా భారంగా మారింది. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ కార్యదర్శి -
తక్కువ పెట్టుబడి అధిక లాభాలు
-
కోడిగుడ్డు.. ఏపీ రికార్డు.. మొదటి 5 స్థానాలు ఈ రాష్ట్రాలవే..
సాక్షి, అమరావతి: కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత దేశంలో మూడో స్థానంలో ఉంది. మన దేశంలో కోడిగుడ్ల లభ్యత, ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ సర్వే–2022 వెల్లడించింది. దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్లో తలసరి గుడ్ల లభ్యత అత్యధికంగా ఉందని.. ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఏడాదికి తలసరి 501 గుడ్ల లభ్యతతో నంబర్–1 స్థానంలో ఉందని సర్వే వెల్లడించింది. గుడ్ల లభ్యతలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని సర్వే పేర్కొంది. తెలంగాణలో తలసరి గుడ్ల లభ్యత 442 కాగా.. దేశవ్యాప్తంగా ఏడాదికి సగటు తలసరి గుడ్ల లభ్యత కేవలం 95 మాత్రమే ఉందని సర్వే పేర్కొంది. 1950లో ఏడాదికి 5 గుడ్లే 1950–51 కాలంలో ఏడాదికి తలసరి కోడిగుడ్ల లభ్యత మన దేశంలో కేవలం ఐదు మాత్రమే ఉండగా.. 1960–61లో కేవలం 7 మాత్రమే ఉంది. తొలిసారిగా 1968–69లో జాతీయ స్థాయిలో సగటు తలసరి గుడ్ల లభ్యత 10కి చేరిందని సర్వే పేర్కొంది. 2020–21లో జాతీయ స్థాయిలో ఏడాదికి తలసరి గుడ్ల లభ్యత 90 ఉండగా 2021–22లో 95కు చేరినట్టు వెల్లడించింది. మొదటి 5 స్థానాలు ఈ రాష్ట్రాలవే కాగా.. కోడిగుడ్ల ఉత్పత్తి విషయంలోనూ దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కోడిగుడ్ల లభ్యతలో నాలుగో స్థానంలో ఉన్న తమిళనాడు గుడ్ల ఉత్పత్తిలో మాత్రం రెండో స్థానంలోను.. గుడ్ల లభ్యతలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ ఉత్పత్తిలో మాత్రం మూడో స్థానంలోనూ ఉన్నాయని సర్వే విశ్లేషించింది. దేశంలో కోడిగుడ్ల ఉత్పత్తిలో టాప్ ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లోనే 64.56 శాతం గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని సర్వే వెల్లడించింది. దేశంలో 2021–22లో 129.60 బిలియన్ కోడిగుడ్లు ఉత్పత్తి కాగా.. వాణిజ్య పౌల్ట్రీల ద్వారా 109.93 బిలియన్ గుడ్లు ఉత్పత్తి అయినట్టు, పెరటి పౌల్ట్రీల ద్వారా 19.67 బిలియన్ గుడ్లు ఉత్పత్తి అయినట్టు సర్వే పేర్కొంది. రాష్ట్రంలో మూడేళ్లుగా (2019–20 నుంచి 2021–22) వరకు కోడిగుడ్ల ఉత్పత్తి పెరుగుతోందని సర్వే వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో పెరటి కోళ్ల సంఖ్య కూడా రెండేళ్లుగా పెరిగిందని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 2020–21లో పెరటి కోళ్ల సంఖ్య 1,23,70,740 ఉండగా.. 2021–22లో 1,31,69,200కు పెరిగినట్టు సర్వే స్పష్టం చేసింది. -
వామ్మో ఏమా చికెన్ ధరలు.. నెల క్రితం రూ.200, ఇప్పుడు ఏకంగా..!
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): చికెన్ ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. శుభకార్యాల వేళ ధర పెరగడంతో ప్రజలు తప్పనిసరిగా చికెన్ కొనుగోలు చేస్తున్నారు. ధరలతోపాటు వేసవి తీవ్రత పెరిగినా చికెన్ కొనుగోళ్లు ఏమాత్రం తగ్గటం లేదు. సరిగ్గా నెల రోజుల క్రితం చికెన్ కిలో ధర రూ.200 పలికింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.300 చొప్పున విక్రయిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో కిలోకు రూ.100 పెరిగిపోయింది. విజయవాడలోని పాతబస్తీ తదితర ప్రాంతాల్లో ఉన్న చేపల మార్కెట్ వంటి పెద్ద ప్రాంగణాల్లో స్కిన్ రూ.290 స్కిన్లెస్ రూ.300 చొప్పున విక్రయిస్తుండగా.. సాధారణ మార్కెట్లలో మాత్రం రూ.300లకు తగ్గకుండా విక్రయాలు చేస్తున్నారు. వేసవి.. ఆపై శుభకార్యాలు వేసవి సీజన్లో సాధారణంగా చికెన్ ధర పెరగటం సహజం. ఈ ఏడాది సాధారణ స్థాయి కంటే అధికంగా పెరుగుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల వందల కొద్దీ కోళ్లు చనిపోతుండటంతో పౌల్ట్రీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆ నష్టాన్ని తట్టుకునేందుకు ధరలను పెంచాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. దానికి తోడు వైశాఖ, జ్యేష్ట మాసాల్లో వివాహ ముహూర్తాలు ఉండటం వల్ల డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవటం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు వివరిస్తున్నారు. గుడ్డు ధరలూ పెరిగాయ్ కోడిగుడ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కోడిగుడ్లు అమ్మే దుకాణాల వద్ద భారీగా క్యూలైన్లు కనిపిస్తున్నాయి. గత నెలలో పాతిక గుడ్లు సుమారు రూ.100 నుంచి రూ.110 వరకూ విక్రయించారు. ఇప్పుడు 25 కోడిగుడ్లు రూ.135కు హోల్సేల్ వ్యాపారులు విక్రయిస్తుండగా.. రిటైల్గా ఒక్కొక్కటి రూ.6, రూ.6.50 చొప్పున విక్రయిస్తున్నారు. రైతు బజార్లో ఆదివారం 25 గుడ్లు రూ.127 ధర పలికాయి. -
Egg Prices: కొండెక్కిన కోడిగుడ్డు.. సామాన్యుల బెంబేలు
సాక్షి, తూర్పుగోదావరి(మండపేట): కోడి గుడ్డు ధర కొండెక్కింది. రైతు ధర రూ.5.44 ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.ఏడుకు చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. శీతల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు పుంజుకున్నాయి. మరోపక్క కార్తిక మాసం ముగియడంతో స్థానిక వినియోగం పెరగడంతో గుడ్డు ధరకు రెక్కలొచ్చాయి. కాగా సీజన్లో రైతు ధర నిలకడగా ఉంటేనే నష్టాలు కొంత భర్తీ అవుతాయని పరిశ్రమ వర్గాలంటున్నాయి. తక్కువ ధరలో పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్లను సామాన్య మధ్య తరగతి ప్రజలు అధికంగా వినియోగిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 200 పౌల్ట్రీలు ఉండగా వాటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.4 కోట్లు వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 60 శాతం గుడ్లు పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుండగా మిగిలినవి స్థానికంగా వినియోగిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో శీతాకాలంలో చేపల లభ్యత తక్కువగా ఉండటం వల్ల గుడ్ల వినియోగం పెరిగి ఎగుమతులకు డిమాండ్ ఉంటుంది. శీతల ప్రభావం అధికంగా ఉండే అక్టోబర్ చివరి నుంచి ఫిబ్రవరి వరకు పౌల్ట్రీకి సీజన్గా భావిస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో రైతు ధర పౌల్ట్రీకి ఆశాజనకంగా ఉంటుంది. పౌల్ట్రీ వర్గాల ఆందోళన మంగళవారం నాటికి రైతు ధర రూ. 5.44కు చేరింది. కాగా రిటైల్ మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7 పలుకుతుండటంతో సామాన్య వర్గాల వారు వాటిని కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా రైతు ధరకు 40 నుంచి 50 పైసల వరకు అదనంగా బహిరంగ మార్కెట్లో వ్యాపారులు అమ్మకాలు చేయడం పరిపాటి. అందుకు భిన్నంగా రూపాయి నుంచి రెండు రూపాయల వరకు పెంచి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమ విస్తరించి ఉన్న మండపేట, అనపర్తి, పెద్దాపురం, రాజానగరం పరిసర ప్రాంతాల్లో రూ 6.50కు అమ్మకాలు చేస్తుండగా రామచంద్రపురం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, తుని, జగ్గంపేట తదితర చోట్ల ఏడు రూపాయల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.7.50కు అమ్మకాలు జరుగుతున్నట్టు వ్యాపారులు అంటున్నారు. చదవండి: (వైఎస్సార్సీపీ నేత హత్యపై సీఎం జగన్ ఆరా.. ధర్మానకు కీలక ఆదేశాలు) రెండు వారాల క్రితం రూ.5 ఉన్న గుడ్డు ధరను ఏడు రూపాయలు వరకు పెంచేశారని వినియోగదారులు అంటున్నారు. డ్యామేజీ అయిన గుడ్ల నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ధర పెంచకతప్పడం లేదని వ్యాపారులు అంటున్నారు. కాగా రిటైల్ మార్కెట్లో ధర బాగా పెరిగిపోవడం పౌల్ట్రీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అధిక ధరతో వినియోగం తగ్గితే ఆ ప్రభావం పరిశ్రమపై పడుతుందంటున్నారు. పెరిగిన మేతలు, మందుల ధరలు, నిర్వహణ భారంతో గుడ్డు ఏడాది సగటు రైతు ధర ఐదు రూపాయలు ఉంటేనే గిట్టుబాటు కాదని కోళ్ల రైతులు అంటున్నారు. ఈ ఏడాది సగటు ధర నాలుగు రూపాయలు మాత్రమే ఉండటంతో ఆ మేరకు నష్టపోవాల్సి వస్తోందంటున్నారు. సీజన్లో రైతు ధర రూ. 5.50 దాటి నిలకడగా ఉంటేనే పాత నష్టాలను భర్తీ చేసుకునేందుకు వీలుంటుందన్నారు. రైతు ధర నిలకడగా ఉండాలి మేత ధరలు విపరీతంగా పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవ్వక కోళ్ల పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉంది. ఏడాది సగటు రైతు ధర రూ. ఐదు ఉంటేనే కాని గిట్టుబాటు కాదు. ప్రస్తుత రైతు ధర సీజన్లో నిలకడగా ఉంటే పాత నష్టాలు కొంతమేర భర్తీ అవుతాయి. ఎంతోమందికి జీవనాధారంగా ఉన్న పౌల్ట్రీ పరిశ్రమను నష్టాల్లోంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వపరంగా సాయం కోరుతున్నాం. – పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
స్కిన్లెస్ చికెన్ ధర కేజీ రూ.320.. మరోవైపు కళ్లు తేలేస్తున్న కోళ్లు
సాక్షి, కోనసీమ: మండుతున్న ఎండలకు కోళ్లు విలవిలలాడుతున్నాయి. వేడిగాలులకు తాళలేక మరణిస్తున్నాయి. పది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి. 42 నుంచి 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి వేడిగాలుల తీవ్ర త తోడవుతోంది. ఉష్ణతాపం నుంచి కోళ్లకు ఉపశమ నం కలిగించేందుకు కోళ్ల రైతులు అనేక చర్యలు చేప డుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా ప్రత్యేక మందులు ఇస్తున్నారు. షెడ్లలోకి వేడిగాలులు రాకుండా చుట్టూ గోనె సంచులు కట్టి, స్ప్రింక్లర్లతో తడుపుతున్నారు. లోపలి వేడిగాలి బయటకు పోయే విధంగా పైకప్పులో ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికి రికార్డు స్థాయిలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.3 కోట్ల వరకూ, మిగిలిన దశల్లోని కోళ్లు 80 లక్షల వరకూ ఉన్నాయి, సాధారణ పరిస్థితుల్లో రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, 25 వేల నుంచి 30 వేల వరకూ కోళ్లు చనిపోతుంటాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మునుపెన్నడూ లేని విధంగా కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 3 లక్షల వరకూ కోళ్లు మృత్యువాత పడుతున్నాయంటున్నారు. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వలన సుమారు రూ.200 మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. ఈ లెక్కన కోళ్ల మరణాల రూపంలో రోజుకు రూ.6 కోట్ల నష్టం వాటిల్లుతోంది. పైకప్పు చల్లబర్చేందుకు స్ప్రింక్లర్లతో నీటిని చల్లుతున్న దృశ్యం మరోపక్క గుడ్ల ఉత్పత్తి 20 శా తం మేర తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు 88 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. 22 లక్షల గుడ్లు ఉత్పత్తి తగ్గిపోవడంతో నెక్ ప్రకటిత రైతు ధర రూ.4.60 చొప్పున రోజుకు రూ.1.01 కోట్ల వరకూ రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇలా కోళ్ల మరణాలు, గుడ్లు డ్రాపింగ్ రూపాల్లో మూడు జిల్లాల్లోని పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు రూ.7.01 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీవర్గాలు చెబుతున్నాయి. దిగిరాని చికెన్ ధర తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు.. కోనసీమ జిల్లా అమలాపురం, రావులపాలెం.. కాకినాడ జిల్లా తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫారాల వరకూ ఉండగా 7 లక్షల కోళ్ల పెంపకం జరుగుతోంది. కోళ్ల మరణాలు ఎక్కువగా ఉండటంతో ఎండలకు జడిసి రైతులు కొత్త బ్యాచ్లు వేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధిక శాతం ఫారాలు కంపెనీల అధీనంలోనే ఉండటంతో బ్రాయిలర్ చికెన్ ధర కొన్నాళ్లుగా దిగి రావడం లేదు. రెండు నెలలుగా స్కిన్లెస్ చికెన్ కిలో రూ.320 నుంచి రూ.350 వరకూ పలుకుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధర ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. వాతావరణం చల్లబడాలి ఎండల తీవ్రత పెరిగిపోవడంతో కోళ్ల మరణాలు పెరిగిపోయాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఆయా కారణాలతో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. వర్షాలు కురిసి వాతావరణం చల్లబడితే మరణాలు తగ్గి, ఉత్పత్తి పెరుగుతుంది. – పడాల సుబ్బారెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
రెండు నెలలుగా దిగిరాని చికెన్ ధర
మండపేట: రెండు నెలలుగా చికెన్ ధర దిగిరానంటోంది. స్కిన్లెస్ కిలో రూ.300ల నుంచి రూ.320లతో వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. మేత ధరలు విపరీతంగా పెరగడం, ఎండలు ముదురుతుండటంతో నష్టాలు తాళలేక కొత్త బ్యాచ్లు వేయడానికి రైతులు వెనుకంజ వేస్తున్నారు. అవసరమైన మేర కోళ్లు లేక ధర తగ్గడం లేదని వ్యాపారులు అంటున్నారు. రంజాన్ నెల మొదలుకావడంతో వినియోగం మరింత పెరగనుంది. మాంసాహార ప్రియులు అధికంగా ఇష్టపడేది చికెన్. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో రోజుకు సాధారణంగా మూడు 3.2 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండుగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతుంటాయి. వేసవి ప్రభావం తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, కోనసీమలోని అమలాపురం, రావులపాలెం, కాకినాడలోని తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫామ్లు వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్లు పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీలు వరకు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్లు వేస్తుంటారు. ఎండలు తీవ్రమయ్యే కొద్ది కోళ్ల మరణాలు పెరిగి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కారణంతో వేసవిలో కొత్త బ్యాచ్లు వేయడానికి రైతులు ఆసక్తి చూపించరు. దీనికితోడు గత మూడు నెలల్లో కోడిమేత ధరలు గణనీయంగా పెరగడం కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపింది. మొక్కజొన్న కిలో రూ. 14లు నుంచి రూ. 25లకు పెరుగ్గా, సోయా రూ. 40లు నుంచి రూ. 90లకు పెరిగిపోయింది. అన్ని మేతలు మిక్స్చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ. 30 నుంచి రూ. 50 వరకు పెరిగిపోయినట్టు కోళ్ల రైతులు అంటున్నారు. కోడిపిల్ల ధర రూ. 35లకు పెరిగిపోయింది. కిలో కోడి తయారయ్యేందుకు రెండు కిలోల మేత అవసరమవుతుండగా, ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడి తయారవ్వడానికి రూ. 110లు వరకు వ్యయమవుతోందని వారంటున్నారు. పెరిగిన ధరలతో సొంతంగా నిర్వహణ చేయలేక అధికశాతం మంది బ్రాయిలర్ కోళ్ల రైతులు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కమీషన్పై కేవలం కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి అప్పగించే విధంగా ఫామ్లు నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా అదే ధర స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధికశాతం పామ్లు కంపెనీల అధీనంలోనే ఉండటం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో స్కిన్లెస్ చికెన్ కిలో రూ.200లు వరకు ఉండగా క్రమంగా పెరుగుతూ రూ.300లకు, లైవ్ కిలో రూ. 100ల నుంచి 150లకు చేరుకున్నాయి. మారుమూల గ్రామాల్లో రూ.320 నుంచి రూ.350లు వరకు కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. రంజాన్ ఉపవాస దీక్షలు నేపథ్యంలో ముస్లింలు చికెన్ వినియోగానికి ప్రాధాన్యమిస్తుంటారు. సాధారణ రోజులతో పోలిస్తే రంజాన్ నెలలో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాల అంచనా. నిర్వహణ పెరిగిపోయింది ఎప్పుడు లేనంతగా కోడి మేత ధరలు, కోడిపిల్లల ధరలు పెరిగిపోయాయి. గతంలో పోలిస్తే నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతోంది. సొంతంగా పెంచలేక చాలామంది రైతులు కంపెనీ కోళ్లనే పెంచుతున్నారు. అవసరానికి తగ్గట్టుగా కోళ్లు లేకపోవడం వలన ధర పెరుగుతోంది. – బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం -
పశుగ్రాసం, ఎరువులుగా ఈకల వ్యర్థాలు
సాక్షి, న్యూఢిల్లీ: మానవ జుట్టు, ఉన్ని , పౌల్ట్రీ ఈకలవంటి కెరాటిన్ వ్యర్థాలను ఎరువులు, జంతువుల ఫీడ్లుగా తక్కువ ఖర్చులో మార్చేందుకు నూతన విధానాన్ని మన దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దేశంలో ప్రతి సంవత్సరం భారీ మొత్తంలో మానవ జుట్టు, పౌల్ట్రీ ఈకల వ్యర్థాలు, ఉన్ని వ్యర్థాలు వెలువడతాయి. ఈ వ్యర్ధాలను డంప్ చేయడం, పాతిపెట్టడం, ల్యాండ్ఫిల్లింగ్ కోసం ఉపయోగించడం లేదా దహనం చేయడం ద్వారా పర్యావరణ ప్రమాదాలు, కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు, గ్రీన్హౌజ్ వాయు ఉద్గారాలు పెరుగుతున్నాయని గుర్తించారు. అంతేగాక ఈ వ్యర్థాల్లో ఉన్న అమైనో ఆమ్లాలు, ప్రోటీన్ వంటి వనరులను జంతువుల దాణాతో పాటు ఎరువుగా ఉపయోగించగలిగే సామర్థ్యం ఉందని నిపుణులు తెలిపారు. ముంబైకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఎ. బి.పండిట్ తన విద్యార్థులతో కలిసి, కెరాటిన్ వ్యర్థాలను పెంపుడు జంతువుల ఆహారంగా, మొక్కలకు ఎరువులుగా వాడే సాంకేతికతను అభివృద్ధి చేశారు. వ్యర్థాలను విక్రయించదగిన ఎరువులు, పశుగ్రాసంగా మార్చేందుకు వారు అధునాతన ఆక్సీకరణ విధానాన్ని ఉపయోగించారు. -
బాబోయ్.. ఈ చికెన్ చిక్కనంటోంది
సాక్షి, పరిగి( హైదరాబాద్): కోడి మాసం ధరలు కొండెక్కాయి. శ్రావణమాసంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో మాంసాహార ప్రియులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మార్కెట్లో కిలో స్కిన్లెస్ చికెన్ ప్రస్తుత ధర రూ.270 పలుకుతోంది. దీంతో ముక్క గొంతు దాటని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వ్యవధిలో ధరలు రెండింతలు పెరిగాయి. దాణా రేట్లు సైతం ఇదే స్థాయిలో పెరిగాయని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. స్థానికంగా దాణా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దీంతో ఖర్చు తడిసి మోపెడవుతోందని పేర్కొంటున్నారు. పండుగ రోజుల్లో కూడా.. జిల్లా వ్యాప్తంగా నిత్యం సుమారు 1.7 లక్షల కిలోల చికెన్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఆదివారం, ఏదైనా పండగ ఉంటే ఆయా రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ ఫారాలలో కోళ్ల పెంపకం ముమ్మరంగా సాగుతోంది. కోడి పిల్లలు వేసిన 40 రోజుల్లో కోళ్లు ఎదిగి అమ్మకానికి వస్తాయి. దీంతో కోళ్ల పెంపకందారులు రెండు నెలలకో బ్యాచ్ తీస్తున్నారు. ఏడాది పొడువునా చికెన్కు డిమాండ్ ఉంటున్నా.. గతంలో ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు విక్రయాలు బాగా తగ్గేవి. వరలక్ష్మీ వ్రతం, శ్రావణమాసం, వినాయక చవితి, దేవీ నవరాత్రి ఉత్సవాలు, అయ్యప్ప మాలధారణ, కార్తీకమాసం పూజల నేపథ్యంలో శ్రావణ మాసం నుంచి కార్తీకమాసం ముగిసే వరకు చికెన్ వినియోగం తగ్గుతుంది. దీంతో రేట్లు కూడా తగ్గుముఖం పడుతుంటాయి. ఈఏడాది శ్రావణమాసం ముగుస్తున్నా చికెన్ ధరలు మాత్రం పైపైకే వెళ్తున్నాయి. వ్యాపారులంతా సిండికేట్గా మారి ఇష్టారీతిన ధరలు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారణాలు ఇవే.. కోవిడ్ కారణంగా ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో కోళ్ల దాణా ధరలు పెరిగాయి. ఆంక్షలు సడలించినా అదుపులోకి రావడం లేదు. దాణాలో ప్రధానమైన సోయాబీన్ అమాంతం ఎగబాకింది. గతంలో కిలో రూ.33 ఉండగా మూడు నెలలుగా రూ.100 పలుకుతోంది. మొక్కజొన్న రూ.14 నుంచి రూ.25 వరకు పెరిగిందని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. శ్రావణమాసం కావడంతో చాలా మంది రైతులు ఫారాల్లో కొత్త బ్యాచ్లు వేయలేదు. దీంతో ఉత్పత్తి తగ్గి డిమాండ్ పెరిగింది. అలాగే కోవిడ్ను ఎదుర్కొనేందుకు చికెన్ను ఎక్కువగా తింటున్నారు. వీటి ప్రభావం ధరలపై పడుతోంది. చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
డెయిరీ, పౌల్ట్రీల యజమానులకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డెయిరీ, పౌల్ట్రీల యజమానులకు శుభవార్త. పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నం దున రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీలు, మినహాయింపులను ఇచ్చింది. కరెంటు బిల్లుల్లో ఒక్కో యూనిట్కు రూ.2 రాయితీని, ఆస్తి పన్నుల చెల్లింపుల నుంచి మినహాయింపు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ, పంచాయతీరాజ్, ఇంధన శాఖలు బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే.. డెయిరీ, పౌల్ట్రీలకు 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి విద్యుత్ రాయితీలు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, యూనిట్ విద్యుత్కు రూ.2 చొప్పున రాయితీ ఇస్తుందని పేర్కొంటూ ఇంధన శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుత్ రాయితీల అందజేతకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని పశుసంవర్థక, డెయిరీ, మత్స్యశాఖ కార్యదర్శిని కోరారు. వీటి ప్రకారం రాయితీలివ్వడానికి ట్రాన్స్కో, జెన్కో సీఎండీ చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.100 చెల్లిస్తే చాలు పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఆస్తి పన్ను మినహాయింపు కోసం ‘తెలంగాణ మున్సిపాలిటీల ఆస్తి పన్నుల మదింపు నిబంధనలు–2020’కు సవరణ చేశారు. ‘పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లను ఆస్తి పన్నుల చెల్లింపు నుంచి మినహాయించారు. పురపాలికల్లోని ఆస్తి పన్నుల రికార్డుల నవీకరణ కోసం ఏటా నామమాత్రంగా రూ.100 చెల్లించి ఈ మినహాయింపును పొందవచ్చు’అన్న నిబంధనను కొత్తగా చేర్చారు. ఈమేరకు పురపాలక శాఖ కార్యదర్శి సి.సుదర్శన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు సైతం ఈ మినహాయింపును జీహెచ్సీఎం చట్టంలోని సెక్షన్ 679ఈ కింద అమల్లోకి తెస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. -
కోళ్ల 'మేత' కూత
సాక్షి, అమరావతి బ్యూరో: కోళ్ల దాణా ధర కొండెక్కింది. దీన్లో అధికంగా వినియోగించే సోయా రేటు పెరగడంతో ఆ ప్రభావం ఈ దాణాపై పడింది. అది చికెన్, కోడిగుడ్లపై ప్రభావం చూపుతోంది. సోయా ధర 4 నెలల్లో రెట్టింపయింది. ప్రస్తుతం చికెన్, గుడ్ల ధరలు కోళ్ల పెంపకందార్లకు ఊరటనిస్తున్నా పెరిగిన కోళ్ల మేత ధర భారంగా మారింది. కోళ్ల మేతను సోయా, మొక్కజొన్న, తవుడు, సజ్జలు, రాగులు, వరి నూక, వేరుశనగ చెక్కలతో తయారుచేస్తారు. వీటిలో సోయా, మొక్కజొన్నలను ఎక్కువగా వినియోగిస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో సోయా ధర టన్ను రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఉండేది. ప్రస్తుతం అది రూ.70 వేల నుంచి రూ.75 వేల మధ్య పలుకుతోంది. ఫలితంగా దాణా ధర నాలుగు నెలల్లో రూ.17 వేల నుంచి రూ.27 వేలకు చేరింది. డిసెంబర్, జనవరిల్లో సోయా ధర టన్ను రూ.30 వేల నుంచి రూ.35 వేల మధ్య ఉన్నప్పుడు మన దేశం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది రూ.2 వేల కోట్ల విలువైన సోయా ఎగుమతులు జరగ్గా, ఈ ఏడాది నాలుగు రెట్లు అధికంగా అంటే రూ.8 వేల కోట్ల ఎగుమతులు జరిగినట్టు పౌల్ట్రీ వర్తకులు చెబుతున్నారు. ఎగుమతులు ఎక్కువగా చేయడం వల్ల దేశీయంగా సోయా కొరత ఏర్పడింది. దీంతో దాణా ధర పెరిగింది. కోడి పూర్తిస్థాయిలో ఎదగడానికి 6 వారాలు పడుతుంది. ఈ 6 వారాల్లో ఒక బ్రాయిలర్ (చికెన్) కోడి 4 కిలోలకుపైగా, గుడ్ల (లేయర్) కోడి గుడ్లుపెట్టే దశకు వచ్చే సరికి 8 కిలోల వరకు మేత తింటాయి. 4 నెలల కిందటి ధరతో పోల్చుకుంటే కిలోకు రూ.10 చొప్పున మేత ధర పెరిగింది. అంటే బ్రాయిలర్ కోడిపై రూ.40, లేయర్ కోడిపై రూ.80 మేత ఖర్చు పెరిగింది. కోళ్ల మేత ధరల పెరుగుదల ఇంతలా ఊహించలేదని, ఇవే ధరలు కొనసాగితే పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతింటుందని కృష్ణా, గుంటూరు బ్రాయిలర్ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుచ్చారావు ‘సాక్షి’తో చెప్పారు. కోళ్ల మేత వినియోగంలో 2వ స్థానం ఇండియా పౌల్ట్రీ ఫీడ్ మార్కెట్ అంచనా ప్రకారం.. కోళ్ల మేత వినియోగంలో దేశంలోకెల్లా తమిళనాడు మొదటి స్థానంలోను, ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలోను ఉన్నాయి. రాష్ట్రంలో ఏటా బ్రాయిలర్ కోళ్లకు సుమారు 1.50 మిలియన్ టన్నులు, లేయర్ కోళ్లకు 3.40 మిలియన్ టన్నుల మేత అవసరమవుతోంది. ఏటా చికెన్, గుడ్ల వినియోగం పెరుగుతుండడంతో ఆ మేరకు మేత అవసరం కూడా పెరుగుతూ వస్తోంది. పౌల్ట్రీ రంగంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వృద్ధిలో ఉన్నాయి. దీంతో మన రాష్ట్రంపై కోళ్ల మేత ఉత్పత్తి సంస్థలు దృష్టి సారించాయి. పెరిగిన గుడ్లు,చికెన్ వినియోగం కోవిడ్ ఉధృతి సమయంలో కోడిగుడ్లు, చికెన్ వినియోగం పెరిగింది. కోడిగుడ్డు తింటే వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుందన్న డాక్టర్లు, న్యూట్రిషనిస్టుల సూచనలతో ఎక్కువమంది వీటిని తినడానికి మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో రోజుకు 4.50 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. సాధారణ రోజుల్లో రాష్ట్రంలో రోజుకు సగటున 3 కోట్ల గుడ్లు వినియోగం అవుతుంటాయి. ప్రస్తుతం కోవిడ్ ప్రభావంతో రోజుకు అదనంగా 50 లక్షల గుడ్ల వినియోగం పెరిగింది. అదే సమయంలో గుడ్ల ధరలు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఈనెల 5న విజయవాడలో 100 గుడ్ల ధర హోల్సేల్లో రూ.370 ఉండగా 27 నాటికి రూ.541కి, విశాఖపట్నంలో రూ.360 నుంచి రూ.557కి పెరిగింది. మరోవైపు చికెన్ వినియోగం కూడా ఆశాజనకంగానే ఉంది. రాష్ట్రంలో రోజుకు సగటున 8 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. రెండేళ్ల కిందటితో పోల్చుకుంటే చికెన్ కొనుగోళ్లు పెరిగాయని వర్తకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల కిలో చికెన్ ధర రూ.200కు అటుఇటుగా ఉంది. -
బ్లాక్ఫంగస్ దానివల్ల రాదు.. ఇది అసలు విషయం!
ఆదివారం వచ్చింది. ముక్క నోట్లోకి పోనిద్దాం అని ఆశతో చాలామంది పొద్దున్నే సంచులతో బయలుదేరుతారు. ఇంతలో ‘కోళ్లకు బ్లాక్ ఫంగస్.. తస్మాత్ జాగ్రత్త!’ అని ఎక్కడో వాట్సాప్లోనో, ఎవరో చెప్పడంతోనే ఆలోచనల్లో పడతారు. కానీ, చికెన్తో ఆ భయం అక్కర్లేదని డాక్టర్లు, సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు. ఇంతకీ వాట్సాప్లో వైరల్ అవుతున్న ఆ వార్త వెనుక అసలు విషయం ఏంటో చూద్దాం. న్యూఢిల్లీ: కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ దేశాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో కోళ్ల కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తోందని, కాబట్టి, కొన్ని రోజుల పాటు చికెన్కి దూరంగా ఉండడమే మంచిదని వాట్సాప్ల్లో ఈమధ్య వైరల్ అవుతోంది. దీనికి తోడు ఓ ప్రముఖ న్యూస్ వెబ్సైట్ పేరు మీద అది పబ్లిష్ కావడం, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయని కథనాలు వైరల్ అవుతుండడంతో చాలామంది నమ్మేస్తున్నారు. అయితే వాతావరణంలో అంతటా ఉండే బ్లాక్ ఫంగస్.. కోళ్లకి కూడా వస్తుందని, కానీ, ఆ కోళ్ల ద్వారా, చికెన్ ద్వారా మనుషులకు బ్లాక్ఫంగస్ వ్యాపిస్తుందన్న వాదనలో అర్థం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ అపర్ణ ముఖర్జీ చెప్తున్నారు. అసలు బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని, అలాంటప్పుడు జంతువులు, మనుషుల్లో ఒకరి ద్వారా మరొకరికి సోకుతుందన్న వాదనలో నిజం లేదని ఆమె స్ఫస్టత ఇచ్చారు. కాబట్టి చికెన్కి భయపడాల్సిన అవసరం లేదని ఆమె అంటున్నారు. వీటికితోడు నల్లగా ఉండే ఉల్లిగడ్డల ద్వారా బ్లాక్ఫంగస్ వస్తోందని ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త ప్రచారమవుతోంది. ఫ్రిజ్లో నల్లగా పేరుకుపోయిన ఫంగస్ వల్ల కూడా సోకే అవకాశముందని వాట్సాప్ లో మెస్సేజ్లు సర్కులేట్ అవుతున్నాయి. ఉల్లిగడ్డలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్ వల్ల వస్తుంది. కట్ చేసేటప్పుడు దానిని కడిగి తినడం మంచిది. ఇక ఈ కరోనా టైంలో వైరస్ నుంచి వ్యాక్సిస్ దాకా.. వేరియెంట్ల నుంచి ట్రీట్మెంట్ దాకా అన్నింటి గురించి వాట్సాప్లో పుకార్లు జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, లేకపోతే ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు చెప్తున్నారు. కోళ్లకు సోకినా.. అయితే ఒకవేళ ఏదైనా జంతువుకి ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకితే వాటి నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది. ఆ కుళ్లిన వాసనతో కోళ్లకు ఫంగస్ సోకినట్లు గుర్తించవచ్చని ఐసీఎఆర్ సైంటిస్ట్ డాక్టర్ ఎంఆర్ రెడ్డి చెప్తున్నారు. ఆ వాసన వచ్చిన మాంసాన్ని తినలేరు కదా. అయితే ఇప్పటివరకు జంతువులకు బ్లాక్ఫంగస్ సోకిన కేసులు నిర్ధారణ కాలేదని, దానిపై ఎలాంటి అధ్యయనాలు జరగలేదని ఎంఆర్రెడ్డి చెప్తున్నారు. అయితే కోళ్లను, బాతులను ముద్దు చేయడం ద్వారా సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ సోకుతుందని, ఇది సాధారణమైన ఇన్ఫెక్షన్ కలుగజేస్తుందని అన్నారు. అంటువ్యాధి కాదు బ్లాక్ ఫంగస్ అంటువ్యాధి కాదని ఎయిమ్స్ డైరెక్టర్, పల్మనాలజిస్ట్ అయిన రణ్దీప్ గులేరియా ఇది వరకే స్పష్టం చేశారు. మ్యూకర్ అనే ఫంగస్ కారణంగా ఈ మ్యుకర్మైకోసెస్ వస్తుందని చెబుతూనే.. అపోహలపై క్లారిటీ ఇచ్చారాయన. ఇక యునైటెడ్ స్టేట్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇది చాలా ప్రాణాంతకమైన ఫంగస్ ఇన్ఫెక్షన్ అని చెప్పింది. ఈ వైరస్ కారణంగా చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. ఇమ్యూనిటి పవర్ తక్కువగా ఉండటం, స్టెరాయిడ్స్ అధికంగా వాడటం, షుగర్ పేషెంట్లకు ఫంగస్ల వల్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. A clear and important thread on Mucor: What they are, how they cause infections, how to treat the infection, how to lower chances of infection, prevent infection, by controlling diabetes, steroid use. Finally, reduce possibilities of getting COVID: Masks, distance, ventilation! https://t.co/wVgEYaaBl7 — Principal Scientific Adviser, Govt. of India (@PrinSciAdvGoI) May 26, 2021 -
వింత వ్యాధితో 4వేల కోళ్లు మృతి!
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వింతవ్యాధి సోకి 4వేల కోళ్లు మృతి చెందిన సంఘటన కాల్వశ్రీరాంపూర్లో మంగళవారం చోటు చేసుకుంది. కాల్వశ్రీరాంపూర్లో పెద్దంపేట మాజీ సర్పంచ్ దాసరి స్వామి నాటుకోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. మార్కెట్లో అమ్మేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో వింత వ్యాధి సోకి చనిపోతున్నట్లు బాధితుడు తెలిపాడు. వీటి విలువ రూ.8 లక్షలు ఉంటుందని పేర్కొన్నాడు. ఈ విషయమై వైద్యాధికారి డాక్టర్ సురేశ్గౌడ్ను సంప్రదించాడు. కాగా కోళ్లకు రానిఖేట్ వ్యాధి సోకిందని, మృతి చెందిన కోళ్లను గుంత తీయించి పూడ్చి పెట్టాలని సూచించామని చెప్పారు. మృతి చెందిన కోళ్ల శ్యాంపిల్ను ల్యాబ్కు పంపించినట్లు వివరించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. చదవండి: తెలంగాణ సచివాలయంలో నాగుపాము కలకలం -
విషాదం: గ్రైండర్లో పడి నలిగిన మహిళ
మాస్కో : కోళ్ల ఫాంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ నిండు ప్రాణం బలైంది. ఫాంలోని గ్రైండర్లో పడి ఓ మహిళ మృత్యువాతపడింది. ఈ సంఘటన రష్యాలోని జుకోస్కిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బెలెవ్సోవోకు చెందిన ఓ మహిళ అక్కడి కోళ్ల ఫ్యాక్టరీలో ఉపాధి పొందుతోంది. కొద్దిరోజుల క్రితం ఫ్యాక్టరీలోని గ్రైండర్ దగ్గర పనిచేస్తోంది. కోళ్లను(మాంసం) ఒక కన్వేయర్నుంచి మరో కన్వేయర్కు మారుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె చెయ్యి గ్రైండర్లో ఇరుక్కుంది. ( మనుషులు లేని దీవిలో ఆ ముగ్గురు 33 రోజుల పాటు..) తీయటానికి ఎంత ప్రయత్నించినా రాలేదు. సెకన్లలో మహిళ మొత్తం గ్రైండర్లోకి వెళ్లిపోయింది. తోటి పనివాళ్లు ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోళ్ల ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవటానికి సిద్ధమయ్యారు. అధికారులు సంఘటనకు సంబంధించిన సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయిన వీడియోను తాజాగా విడుదల చేశారు. -
కుక్కుట చరితం
ప్రస్తుతం మనం పెంచుతున్న వివిధ రకాల కోళ్లన్నీ ఎర్ర అడవి కోడి జాతి నుంచి వచ్చినవేనని తాజా పరిశోధనలో వెల్లడైంది. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ, పర్యావరణ మార్పులతోపాటు సంక్రమణతో ఎర్ర అడవి కోడి పలు ప్రాంతాల్లో రకరకాలుగా మార్పు చెందినట్టు తేల్చారు. వేల సంవత్సరాల క్రితమే ఈ జాతులన్నీ వేరుపడినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. సాక్షి, అమరావతి: మాంసాహారంలో ప్రధాన భాగంగా మారిన కోడికి 10 వేల సంవత్సరాల చరిత్ర ఉందనే విషయం తెలిసిందే. అయితే, ప్రపంచంలో కోళ్ల పెంపకం ఎక్కడ మొదలైందనే దానిపై కొన్ని వందల సంవత్సరాలుగా వివాదం నడుస్తోంది. తాజాగా వివిధ దేశాల శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధన ఈ విషయమై ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. ప్రస్తుతం మనం పెంచుతున్న వివిధ రకాల కోళ్లన్నీ ఎర్ర అడవి కోడి జాతి నుంచి వచ్చినవేనని తాజా పరిశోధన స్పష్టం చేసింది. ఆగ్నేయ ఆసియా, దక్షిణాసియాలో ఉండే ఎర్ర అడవి కోళ్లు, వాటి ఉప జాతులు ఒక దానితో ఒకటి సంకరం చెంది ఇప్పుడున్న దశకు వచ్చాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న కోళ్లలో 80 శాతం వీటి నుంచే సంక్రమణ చెందినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్ ‘సెల్ రీసెర్చ్’ నేతృత్వంలో వివిధ దేశాల సైంటిస్టులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. మన దేశం నుంచి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ)కి చెందిన సైంటిస్టు ముఖేష్ ఠాకూర్ భాగం పంచుకున్నారు. 8 వేల నుంచి 10 వేల ఏళ్ల క్రితం చైనా,ఉత్తర థాయ్లాండ్, మయన్మార్లో కోళ్ల పెంపకం మొదలైనట్టు ఈ పరిశోధన వెల్లడించింది. ప్రాంతాన్ని బట్టి జాతులు మారాయి కోళ్ల పెంపకం మన ప్రాంతమైన సింధు లోయలో ప్రారంభమైనట్టు గతంలో జరిగిన అనేక పరిశోధనల్లో స్పష్టమైంది. నిరంతరంగా జరిగే పరిశోధనల్లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు జరిగిన సెల్ రీసెర్చ్ సర్వే కూడా ఆసక్తికరమైంది. కానీ.. దీనిపై భిన్న వాదనలున్నాయి. కోళ్ల జాతులు ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితుల్ని బట్టి చాలా రకాలుగా మారిపోయాయి. కోళ్ల చరిత్ర చాలా సుదీర్ఘమైనది. – డాక్టర్ కె.నాగరాజకుమారి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పౌల్ట్రీ, ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల, గన్నవరం 864 రకాల జన్యువుల్ని విశ్లేషించి.. ► పరిశోధనలో భాగంగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెంపకంలో ఉన్న కోడి జాతుల్లోని 864 రకాల జన్యువులను విశ్లేషించారు. ► సాంకేతిక పరిభాషలో ‘గినస్ గల్లస్’గా పిలిచే ఎర్ర అడవి కోడి, దానికి చెందిన ఐదు ఉప జాతులు, వివిధ దేశాల్లో పెంచుతున్న మరికొన్ని కోళ్ల జాతుల మైటోకాండ్రియల్ డీఎన్ఏలను విశ్లేషించారు. ► గతంలో ఇదే అంశంపై పరిశోధనకు వినియోగించిన 79 కోళ్ల జాతుల డీఎన్ఏలు కూడా ఇందులో ఉన్నాయి. గత పరిశోధనలకు భిన్నంగా.. ► తాజా పరిశోధన గత పరిశోధనలకు భిన్నంగా ఉండటంతో దానిపైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ► మొదట ఉత్తర చైనా, సింధు లోయ (ఇండస్ వ్యాలీ) ప్రాంతంలో కోళ్ల పెంపకం మొదలైనట్టు గత పరిశోధనలు తేల్చాయి. ► చార్లెస్ డార్విన్ సైతం కోళ్ల పెంపకం ఇండస్ వ్యాలీలో ఎర్ర అడవి కోళ్లతో మొదలైందని ప్రతిపాదించారు. ► కానీ సెల్ రీసెర్చ్ పరిశోధన దీనికి వ్యతిరేకంగా ఉండటంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ► కోళ్ల పెంపకంపై శాస్త్రవేత్తల్లో చాలా శతాబ్దాల నుంచి ఆసక్తి ఉందని జెడ్ఎస్ఐ సైంటిస్ట్ ముఖేష్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. ► తాజా పరిశోధన కోళ్ల పెంపకం చరిత్రకు సంబంధించిన కీలక అంశాలను కనుగొందని, ఈ సమాచారం భవిష్యత్ పరిశోధనలకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎర్ర అడవి కోడి జాతి నుంచి.. భౌగోళిక పరిస్థితులు, వాతావరణ, పర్యావరణ మార్పులతోపాటు సంక్రమణతో ఎర్ర అడవి కోడి వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా మార్పు చెందినట్టు తేల్చారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ జాతులన్నీ వేరుపడినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆగ్నేయ ఆసియా అడవుల్లో ఈ కోళ్లు పైకి ఎగిరి పోట్లాడుకోవడాన్ని చూసిన మానవులు వాటిని మచ్చిక చేసుకున్నారని భావిస్తున్నారు. ఆ తర్వాత వాటిని పెంచుకోవడం, వాటి మాంసం, గుడ్లను ఆహారంగా ఉపయోగించడం మొదలైంది. ఇప్పుడు అదే ప్రధాన ఆహారంలో ఒకటైంది. -
మిడతల దాణా మంచిదేనా?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యం, హార్న్ ఆఫ్రికా దేశాలతోపాటు భారత్ సహా పలు దక్షిణాసియా దేశాలు నేడు అనూహ్య సంఖ్యలో మిడతల దాడులను ఎదుర్కొంటున్నాయి. భారత్కన్నా ముందుగా మిడత దాడులను ఎదుర్కొన్న పాకిస్థాన్ వాటిని నిర్వీర్యం చేయడం కోసం మూడు లక్షల లీటర్ల క్రిమిసంహారక మందులను వాడడమే కాకుండా మరో కొత్త ప్రయోగానికి తెరతీసింది. క్రిమిసంహారక మందులు వాడని పొలాల్లో వాలిన మిడతలను కూలీల ద్వారా సేకరించి వాటిని కోడి దాణాగా మార్చి కోళ్ల ఫారమ్లకు పంపించింది. 45 శాతం ప్రొటీన్లు ఉండే సోయాబీన్ కిలో పాకిస్థాన్లో 90 రూపాయలు పలకుతుండగా, 70 శాతం ప్రొటీన్లు ఉండే మిడతలను కిలోకు 20 రూపాయలు చెల్లించి కూలీల ద్వారా సేకరించింది. మిడతలను కోడి దాణాకా మార్చేందుకు కిలోకు 30 రూపాయలు ఖర్చు అవుతుందని, సేకరణ ఖర్చుతో కలిపితో కోళ్ల ఫారాలకు కిలోకు 50 లేదా 55 రూపాయల చొప్పున సరఫరా చేయవచ్చని పాక్లోని ఓక్రా జిల్లోలో ఈ ప్రయోగం నిర్వహించిన ‘పాకిస్థాన్ అగ్రికల్చరల్ రిసర్చ్ కౌన్సిల్కు చెందిన బయోటెక్నాలజిస్ట్ జోహర్ అలీ తెలిపారు. మిడతలను చంపేందుకు క్రిమి సంహారక మందులను వాడినట్లయితే వాతావరణ కాలుష్యం పెరగుతుందని, వాటిని తిన్నట్లయితే మనుషులకూ ప్రమాదమని, వాటిని సేకరించి కోడి దాణాగా ఉపయోగించడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆయన మాటలతో ఏకీభవించిన పలువురు పర్యావరణ వేత్తలు భారత్ కూడా పాక్ అనుసరించిన కొత్త విధానాన్నే అనుసరించాలంటూ సూచనలు కూడా చేశారు. వాస్తవానికి ఇది కొత్తగా కనిపిస్తోన్న పాత విధానం. గతంలో రైతులు వ్యవసాయ బావుల వద్ద కోళ్లను, బాతులను పెంచేవారు. అవి మిడతలను ఎక్కువగా తిని బలంగా తయారయ్యేవి. ప్రకృతిసిద్ధంగా పిచ్చుకలు, కాకులు కూడా మిడతలను ఎక్కువగా తింటాయి. పిచ్చుకలు కనిపించడమే కష్టంకాగా కాకుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. గతంలో పలు దేశాల ఆదిమ జాతులు కూడా మిడతలను తినేవి. ఇక్కడ క్రిమిసంహారక మందులు వాడని పొలాల్లో తాము ప్రయోగం చేసినట్లు జోహర్ అలీ తెలిపారు. క్రిమిసంహారక మందులు వాడుతున్న పొలాల సంగతి ఏమిటి? వాటిపై మిడతల దాడిని ఎలా ఆపాలి? భారత్లో 80 శాతాకిపైగా క్రిమిసంహారక మందులతో వ్యవసాయం జరుగుతోంది. పంటలపై చల్లే క్రిమి సంహారక మందుల ప్రభావం మిడతలపై ఎక్కువగా ఉంటుంది కనుక ఆ మందులు వాడని పొలాలపై మాత్రమే తాము ప్రయోగం చేసినట్లు అలీ చెప్పారు. (ఇవి అత్యంత వినాశకారి 'మిడతలు') మిడతల కోసం భారత వ్యవసాయదారులు క్రిమిసంహారక మందుల వాడకాన్ని వదిలేయాలా? సేంద్రీయ వ్యవసాయం వైపు మల్లండంటూ పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు ఇస్తామంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినా పెద్దగా ఫలితాలు రాలేదు. మిడతలను నిర్మూలించేందుకు సాధారణంగా ‘ఆర్గనోఫాస్ఫేట్, కార్బమేట్, పైర్థ్రాయిడ్’ క్రిమిసంహారక మందులను వినియోగిస్తున్నారు. ఇవి అత్యంత విష పూరితమైనవి. వీటి ప్రభావం మిడతలపై చనిపోయిన తర్వాత కూడా ఉంటుందని రుజువైంది. కనుక ఈ మందుల వల్ల చనిపోయిన మిడతలను మనుషులుగానీ పక్షులుగానీ తినకూడదు. తిన్నట్లయితే మనుషుల్లో కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండె చెడిపోయే అవకాశం, ఎముకలు పెలసవుతాయి. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అందుకని మనుషులెవరూ మిడతలను తినరాదంటూ అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మనుషులు లేదా జంతువులకు ఆహారంగా మిడతలు పనికి రావని దక్షిణ కొరియాలోని యాన్డాంగ్ నేషనల్ యూనివర్శిటీ, పోస్ట్ డాక్టోరల్ రిసర్చర్ జూస్ట్ వాన్ ఇట్టర్ బీక్ హెచ్చరిస్తున్నారు. (మిడతలపై దాడికి చైనా ‘డక్ ఆర్మీ’) -
కోడి కొండెక్కింది
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): చికెన్ ధరలు రోజురోజుకూ ఎగబాకుతున్నాయి. పెరుగుతున్న ధరలతో కిలో చికెన్ కొనాలంటే సామాన్యుడు కళ్లు తేలేసే పరిస్థితి నెలకొంది. రికార్డు స్థాయిలో ప్రస్తుతం చికెన్ ధరలు పెరుగుతుండటం నాన్వెజ్ ప్రియులను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రస్తుతం నగర మార్కెట్లో మటన్ కిలో రూ.600 పలుకుతున్నా ధర నిలకడగా ఉంటోంది. కానీ చికెన్ ధరలో మాత్రం భారీ పెరుగుదల కనిపిస్తోంది. బాయిలన్ చికెన్ కిలో రూ.250 నుంచి రూ.260 వరకు ఉండగా.. లైవ్ ధర రూ.150 నమోదు చేసింది. ఫారం కోడి ధర కిలో రూ.170, శొంఠ్యాం కోడి కిలో ధర రూ.250 పలుకుతోంది. దీంతో ఈ ధరలకు సామాన్య వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. 4 రెట్ల పెంపు ఏప్రిల్లో లాక్డౌన్ ప్రారంభంలో చికెన్ ధర బాగా దిగజారింది. బాయిలర్ ధర కేవలం కిలో రూ.60 ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వినియోగదారులు చికెన్ వైపు మొగ్గు చూపకపోవడంతో ధరలు భారీగా పతనమయ్యాయి. లాక్డౌన్ ప్రారంభమైన రెండు వారాల వరకు చికెన్ ధర సాధారణ స్థాయిలోనే కొనసాగింది. రూ.60 నుంచి రూ.80, రూ.120 , రూ.160 గా ధరల్లో క్రమంగా పెరుగుదల చోటు చేసుకుంది. ఆ సమయంలో మటన్ ధర అమాంతం కిలో రూ.800కు పెరిగినా చికెన్ మాత్రం నిలకడగానే పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో పౌల్ట్రీలు సైతం ఉత్పతిన్తి భారీగా తగ్గించాయి. దీంతో కిలో రూ.160, రూ.180 మధ్య కుదురుకుంటుందని వినియోగదారులు భావించారు. అయితే మే నెల 15 నుంచి పరిస్థితిలో భారీ మార్పులు వచ్చాయి. 15 తరువాత రోజుకో విధంగా ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా చికెన్ ధర రూ.200 మార్కును దాటింది. రోజు రోజుకూ ధరలో పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం కిలో రూ.250 చేరుకొని ఆల్టైం రికార్డును నెలకొలి్పంది. దీంతో ధరలపై సామాన్య వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉత్పత్తి తగ్గడం వల్లే.. కరోనా కారణంగా మాంసాహారంపై వినియోగదారులు దృష్టి సారించకపోవడంతో చికెన్ ధర రూ.60కి పడిపోయింది. ఆ సమయంలో పౌల్ట్రీలు తీవ్రంగా నష్టపోయి, ఉత్పత్తిని పెద్ద ఎత్తున తగ్గించుకున్నాయి. అన్ని పౌల్ట్రీలు నష్టనివారణ చర్యలు చేపట్టాయి. వినియోగం తగ్గడం, ఎండలు ముదరడంతో కోళ్ల పెంపకాన్ని తగ్గించాయి. దీంతో ఉత్పత్తి భారీగా తగ్గి ధరలు రోజు రోజుకు పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగే పరిస్థితి ఉంది. పౌల్ట్రీల్లో ఉత్పత్తి సాధారణ స్థాయికి చేరుకునే వరకు ధరలు తగ్గకపోవచ్చు. – సుబ్బారావు, పౌల్ట్రీ, చికెన్ వ్యాపారి -
మిడతలు మిక్సీ.. కోడికి మస్తీ!
సాక్షి, హైదరాబాద్: కరోనాకుతోడు ఇప్పుడు దేశాన్ని భయపెడుతున్న ప్రమాదం పంటలపై మిడతల దాడి. ఈ దండు దాడి చేసిందంటే సెకన్లు, నిమిషాలు, గంటల్లోనే పంటలన్నీ ఖాళీ అయిపోతాయి. దీంతో ఏ క్షణాన మిడతలు పంటలపై దాడి చేస్తాయోనన్న భయం రాష్ట్రాలను వెంటాడుతోంది. ఇదే పరిస్థితి మనకన్నా ముందు పాకిస్తాన్కూ ఎదురైంది. అక్కడి ప్రభుత్వం ఈ దండయాత్రను అడ్డుకొనేందుకు రసాయనాలపై ఆధారపడగా ఓ పరిశోధన బృందం మాత్రం సమస్య పరిష్కారానికి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. నిశీధిలో ఓ వెలుగు.. పాకిస్తాన్లోని సింధ్, బలూచిస్తాన్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాలు ఈ మిడతలను చంపేందుకు వాడిన రసాయనాల కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ జాతీయ ఆహార భద్రత పరిశోధన మంత్రిత్వశాఖలో సివిల్ సర్వెంట్గా పనిచేసే మహ్మద్ ఖుర్షీద్, తన స్నేహితుడు, పాక్ వ్యవసాయ పరిశోధన మండలిలో బయోటెక్నాలజిస్టుగా పనిచేసే జోహార్ అలీతో కలసి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. మిడతలపై రసాయనాలు చల్లి చంపే బదులు వాటిని సజీవంగా పట్టుకొని బ్రాయిలర్ కోళ్లకు ఆహారంగా మారిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఓ ప్రయోగం చేయాలనుకున్నారు. ఇందుకోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకారా జిల్లాలోని అటవీప్రాంత సమీపంలో ఉన్న దీపల్పూర్లో (రసాయనాలు పిచికారీ చేయని ప్రాంతం కావడంతో దీన్ని ఎంచుకున్నారు) మూడు రోజులపాటు పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. సోయాబీన్ కంటే చౌక పాకిస్తాన్లో పౌల్ట్రీ పరిశ్రమ కోళ్లకు అహారంగా సోయాబీన్ను ఉపయోగిస్తోంది. దాదాపు 3 లక్షల టన్నుల సోయాబీన్ను దిగుమతి చేసుకుని నూనె తీసిన అనంతరం వచ్చే పీచును అక్కడి కోళ్ల పరిశ్రమలో వినియోగిస్తున్నారు. ‘సోయాబీన్లో 45 శాతం ప్రోటీన్లు ఉంటే క్రిమిసంహారక మందుల ప్రభావంలేని మిడతల్లో అది 70 శాతం ఉంటుంది. కోళ్లకు పెట్టే సోయాబీన్ ఆహారం కిలో 90 రూపాయలుంటే మిడతలు ఉచితంగా వస్తున్నాయి. వాటిని పట్టుకునేందుకు ఖర్చు పెడితే చాలు. సోయాబీన్ కంటే బలవర్ధకమైన ఆహారం మా కోళ్లకు పెట్టొచ్చు’అని పాకిస్తాన్లో అతిపెద్ద పౌల్ట్రీ కంపెనీ అయిన హైటెక్ గ్రూప్ జీఎం మహ్మద్ అథర్ వెల్లడించారు. కోళ్లకే కాదు చేపలు, డెయిరీ పరిశ్రమకు కూడా ఇది ఆహారంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మిడతల్ని బస్తాలలో మూటలు గట్టిన దృశ్యం కిలో మిడతలకు 20 పాక్ రూపాయలు.. ‘మిడతలను పట్టుకోండి.. డబ్బు సంపాదించండి.. పంటలు కాపాడుకోండి’అనే నినాదంతో ఖుర్షీద్ బృందం స్థానికులను ఆకర్షించింది. కిలో మిడతలను పట్టిస్తే 20 పాక్ రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది.. రాత్రివేళ చెట్లపై సేదతీరే మిడతలను వలలతో పట్టుకొనేందుకు జనం పోటీపడ్డారు. ఒక్క రాత్రిలో ప్రజలంతా కలిపి సగటున ఏడు టన్నుల మిడతలను పట్టేసుకొని భారీగా సొమ్ము చేసుకున్నారు. ఒక్కో వ్యక్తి 20 వేల పాకిస్తానీ రూపాయలు సంపాదించారు. అంటే ఒక్కో వ్యక్తి వెయ్యి కిలోల మిడతలు పట్టుకున్నాడన్న మాట. స్థానికులు పట్టి తెచ్చిన మిడతలను ఖుర్షీద్ బృందం స్థానికంగా ఉండే కోళ్ల ఫీడ్ తయారు చేసే ప్లాంట్లకు విక్రయించింది. -
పౌల్ట్రీకి మంచి రోజులు
సాక్షి, అమరావతి: లాక్డౌన్, కరోనా వైరస్పై వెల్లువెత్తిన వదంతుల వల్ల తీవ్రంగా నష్టపోయిన కోళ్ల పెంపకందారులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నెమ్మదిగా కోలుకుంటున్నారు. నెల రోజుల వ్యవధిలో దెబ్బమీద దెబ్బ తగలడంతో పౌల్ట్రీ రంగం తీవ్రంగా నష్టపోయింది. కోడి మాంసం, గుడ్లు తినడం వల్ల కరోనా వ్యాపిస్తుందనే పుకార్లు పౌల్ట్రీ రంగాన్ని కుంగదీస్తే లాక్డౌన్ వల్ల దాణా, ముడిపదార్ధాలు రైతులకు సకాలంలో అందలేదు. కోళ్లు, గుడ్లను కొనేవారు లేక పౌల్ట్రీ అనుబంధ సంస్ధలు, కార్మికుల ఆర్ధిక పరిస్ధితులు ఛిన్నాభిన్నం అయ్యాయి. ఈ తరుణంలో ఒకవైపు కోవిడ్–19 నియంత్రణకు చర్యలు తీసుకుంటూనే పౌల్ట్రీ రంగానికి చేయూత నిచ్చేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తుండటంతో గుడ్లు, మాంసం విక్రయాలు క్రమంగా పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6.6 కోట్ల గుడ్లను పెట్టే కోళ్లు, 23 కోట్ల బ్రాయిలర్ కోళ్లున్నాయి. ఏటా 1,975 కోట్ల గుడ్లు, 444 వేల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. కోడి మాంసం, గుడ్లు తినడం వలన కరోనా వైరస్ వస్తుందనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో జనవరి, ఫిబ్రవరిలో వీటి వినియోగం పూర్తిగా పడిపోయింది. ► కోడి మాంసం, గుడ్లను తినడం వలన కరోనా సోకదని ప్రచార మాధ్యమాల ద్వారా వివిధ రూపాల్లో ప్రభుత్వం అవగాహన కల్పించింది. ► అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని పిల్లలు, గర్భిణీ, మహిళలకు ఇంటికి సరఫరా చేస్తున్న రేషన్లో కూరగాయలకు బదులు గుడ్లను అందిస్తూ వీటి వినియోగాన్ని పెంచింది. రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో 2.80 లక్షల మంది గర్భిణీ స్త్రీలు, 3.70 లక్షల మంది బాలింతలు, 8.70 లక్షల మంది పిల్లలున్నారు. వీరందరికీ రోజుకు 2 గుడ్ల చొప్పున 30.60 లక్షల గుడ్లను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ► కోళ్లు, గుడ్ల రవాణాలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిరంతరం పనిచేసే మానిటరింగ్ వ్యవస్ధను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ► లాక్డౌన్ నేపథ్యంలో పౌల్ట్రీ పరిశ్రమల్లో పనిచేసే 1,100 మంది కార్మికులు, 165 వాహనాలకు ఇబ్బంది లేకుండా గుడ్లు, దాణా రవాణా చేసేందుకు పాస్ల ద్వారా అనుమతి ఇచ్చింది. ► పశు సంవర్ధకశాఖ 8500001963 నంబరుతో హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం 13 జిల్లాల్లో పశు సంవర్ధశాఖ జాయింట్ డైరెక్టర్లను నోడల్ అధికారులుగా నియమించింది. -
వెరీ'గుడ్డు'
సాక్షి, అమరావతి: కోడిగుడ్డుకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. కరోనా నేపథ్యంలో అపోహలతో వినియోగం తగ్గి ధరలు పడిపోవడం, తర్వాత లాక్డౌన్తో రవాణా ఆగిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన పౌల్ట్రీ రైతులు ఇప్పుడిప్పుడే ఊరట చెందుతున్నారు. కోడిమాంసం, గుడ్లు వల్ల కరోనా వైరస్ సోకదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పడం, కరోనా వైరస్ బారిన పడిన వారికి సైతం చికెన్ సూప్, గుడ్డు ఇవ్వొచ్చని కేంద్రప్రభుత్వ పశు సంవర్థక శాఖ అడ్వయిజరీ ప్రకటించడంతో అపోహలు తొలగిపోయాయి. అలాగే లాక్డౌన్ నుంచి కోడిగుడ్లను మినహాయించి నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చడం వల్ల నాలుగైదు రోజులుగా రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాలకు కోడిగుడ్లు ఎగుమతి అవుతున్నాయి. దీంతో ధరలు మళ్లీ పుంజుకున్నాయి. మంగళవారం మార్కెట్ ధరలతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. ఇబ్బందులు ఇలా... ► కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలో ద్వితీయ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడో వంతు ఇతర రాష్ట్రానికి ఎగుమతి చేయాలి. ► కరోనా నేపథ్యంలో స్థానిక వినియోగం తగ్గడంతో గుడ్లు మిగిలిపోవడం మొదలైంది. ఆ వెనువెంటనే వెలువడిన లాక్డౌన్తో ఎగుమతులపైనా ప్రభావం పడింది. ► ఎండ పడకపోతే 15 రోజుల వరకు గుడ్లను నిల్వ చేయవచ్చు. ఎండ పడితే వారానికే మురిగిపోతాయి. ► ఒక దశలో ఒక్కో గుడ్డును రూపాయిన్నరకు కూడా కొనే పరిస్థితి లేకపోయింది. ఫలితంగా నష్టాలు తీవ్రమయ్యాయి. లాక్డౌన్ నుంచి మినహాయింపుతో.. ► జిల్లాల సరిహద్దుల వద్ద, చెక్పోస్టుల వద్ద కోడిగుడ్ల వాహనాలను ప్రస్తుతం ఆపడం లేదు. స్థానిక మార్కెట్లకు తరలించుకునే అవకాశం వచ్చింది. ► అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద సైతం తనిఖీ చేసి పంపిస్తున్నారు. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం తదితర రాష్ట్రాలకు మళ్లీ రవాణా ఊపందుకుంది. ► లాక్డౌన్ ప్రారంభంలో మాదిరిగా రెండు మూడు రోజులు చెక్పోస్టుల వద్ద ఆగిపోయే పరిస్థితి ఇప్పుడు లేదు. -
కోడిని తింటే ‘కోవిడ్’ రాదు..
సాక్షి, అమరావతి బ్యూరో: కోడి మాంసం తింటే కరోనా (కోవిడ్) వైరస్ రాదని పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. దీనిపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించింది. కరోనా వైరస్ ప్రచారంతో ఆందోళన చెందిన మాంసంప్రియులు చికెన్ తినడం భారీగా తగ్గించేశారు. దీంతో ధరలు పాతాళానికి పడిపోయి కోళ్ల పరిశ్రమ కకావికలమైపోతోంది. ఈ పరిశ్రమ యజమానులు ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. దీంతో పశుసంవర్ధక శాఖ స్పందించింది.. - కోడి మాంసం, కోడిగుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ సోకదన్న విషయం శాస్త్రీయంగా నిరూపణ అయిందని.. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ శాఖ సిబ్బందికి ఆదేశాలిచ్చింది. - పౌల్ట్రీ ఫెడరేషన్ల సహకారంతో అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు.. ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్లు, సంబంధిత అధికారులకు సూచించింది. - పుకార్ల కారణంగా కోళ్ల సంఖ్య తగ్గిపోయి భవిష్యత్తులో చికెన్, కోడిగుడ్ల ధరలు అమాంతంగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది. - కోళ్ల దాణాలో వాడే ముడి సరకులైన మొక్కజొన్న, సోయాల ధరలు దెబ్బతిని రైతులూ నష్టపోయే అవకాశం ఉంది. -
అలా పెరిగే కోళ్లతో డేంజర్
సాక్షి, న్యూఢిల్లీ : కోళ్ల పరిశ్రమలో లాభాపేక్ష కొక్కరొకో! అంటోంది. స్వల్ప కాల వ్యవధిలో అధిక లాభాలను ఆర్జించాలనే అత్యాశతో కొందరు కోళ్ల పెంపకం దారులు పెడదారులు తొక్కుతున్నారు. జన్యుపరమైన ఇంజక్షన్లు ఇవ్వడం ద్వారా 50, 60 రోజుల్లో పెరగాల్సిన కోడి పిల్లలను 35 రోజుల్లో పెరిగేలా చేస్తున్నారు. పర్యవసానంగా కోళ్ల కాళ్లు, గుండె, ఊపిరితిత్తులు తగిన రీతిలో ఎదగకుండా దెబ్బతింటున్నాయి. వీటివల్ల కోళ్లలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మరణం సంభవించకపోయిన కోళ్ల కాళ్లల్లో కురుపులు వస్తున్నాయి. వాటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలా అనవసరంగా కోళ్లను వేగంగా పెరగనిచ్చి వాటిని కొంత చౌక ధరలకు విక్రయిస్తుండడం వల్ల వాటినే కొనుగోలు చేసేందుకు రెస్టారెంట్లు, హోటళ్లు ప్రాధాన్యతనిస్తున్నాయని, ప్రస్తుతం లండన్ మార్కెట్లో ఇదే జరుగుతోందని ‘రాయల్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ (ఆర్ఎస్పీసీఏ)’ వెల్లడించింది. ‘వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్’, ‘ఫామ్ యానిమల్ వెల్ఫేర్ ఫోరమ్’లతో కలిసి అతి వేగంగా పెంచుతున్న మూడు రకాల కోళ్ల బ్రీడింగ్పై ఆర్ఎస్పీసీఏ అధ్యయనం జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1950లో కోడి పిల్లలు కోతకొచ్చే కోళ్లుగా ఎదిగేందుకు 70 రోజులు పట్టగా ప్రస్తుతం 35 రోజుల్లో ఆ స్థాయికి జన్యు ఇంజెక్షన్ల ద్వారా పెంచేసి విక్రయిస్తున్నారని ఆ చారిటీ సంస్థ తెలియజేసింది. ఇలాంటి కోళ్ల కొనుగోలుకు దూరంగా ఉండాలంటూ తామిచ్చిన పిలుపునకు కెఎఫ్సీ, మార్క్స్ అండ్ స్పెన్సర్, వెయిట్రోస్ సంస్థలు సానుకూలంగా స్పందించినట్లు ఆ చారిటీ సంస్థ తెలియజేసింది. ఇలా అతి వేగంగా పెంచుతున్న కోళ్లు అనారోగ్యం బారిన పడి చనిపోయే అవకాశం సాధారణంకన్నా రెట్టింపు ఉంటోందని అధ్యయనంలో తేలింది. వీటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎంత హానికరమన్న విషయంలో ఈ అధ్యయనం జరగలేదని, ఇలా వేగంగా పెంచడం వల్ల కోళ్లు ఎంత నరక యాతన అనుభవించాల్సి వస్తోందన్న విషయంలోనే ఈ అధ్యయనం కొనసాగిందని అధ్యయన సంస్థ పేర్కొంది. ఇలా జన్యుపరంగా వేగంగా పెంచిన కోళ్లు అనారోగ్యం, అనవసరమైన బాధతోని అర్ధాయుషు మాత్రమే బతుకుతున్నాయని వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ బ్రిటన్ చీఫ్ జేమ్స్ మాక్కోల్ ఆందోళన వ్యక్తం చేశారు. -
28న ‘చికెన్ అండ్ ఎగ్ మేళా’
సాక్షి, పంజగుట్ట: చికెన్ తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ప్రజలకు వివరించేందుకు ఈ నెల 28న సాయంత్రం 4 గంటల నుంచి నెక్లస్ రోడ్డులో ‘చికెన్ అండ్ ఎగ్ మేళా’నిర్వహిస్తున్నట్లు వివిధ పౌల్ట్రీ సంఘాల ప్రతినిధులు తెలిపారు. కోవిడ్ వైరస్కు చికెన్కు ఎలాంటి సంబంధంలేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిలు హాజరై చికెన్ తినడం వల్ల ఎలాంటి నష్టం లేదని ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. ఎర్రమంజిల్లోని హోటల్ ఎన్కెఎం గ్రాండ్లో గురువారం విలేకరుల సమావేశంలో వివిధ కోళ్ల పరిశ్రమ సంఘాల ప్రతినిధులు రాంరెడ్డి, రమేశ్బాబు, కె.జి ఆనంద్లు మాట్లాడుతూ..కోవిడ్ వైరస్ వచ్చిన మొదటి 2 నుంచి 3 వారాలు చికెన్ అమ్మకాలు తగ్గాయని, ప్రస్తుతం ప్రజల్లో అవగాహన వచ్చి కొద్దిమేర పుంజుకుందన్నారు. -
పొన్నాలకు పౌల్ట్రీ లెజెండ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, తిరుమల హేచరీస్ ఫౌండర్ చైర్మన్ పొన్నాల లక్ష్మయ్యకు పౌల్ట్రీ లెజెం డ్ అవార్డు దక్కింది. పౌల్ట్రీ రంగానికి చేసిన సేవలను గుర్తించిన పౌల్ట్రీ ఇండియా సంస్థ ఈ అవార్డుకు ఆయన ను ఎంపిక చేసింది. మంగళవారం హైదరాబాద్లో జరిగే పౌల్ట్రీ ఇండియా 13వ ఎడిషన్ కార్యక్రమంలో అవార్డు అందుకోనున్నారు. -
కొండెక్కిన ‘కోడి’
సాక్షి, అమరావతి: కోడి మాంసం ధర కొండెక్కి కూర్చుని సామాన్యుడికి అందకుండా ఊరిస్తోంది. డిసెంబర్ నెల ప్రారంభం నుంచి మొదలైన పెరుగుదల నెలాఖరు నాటికి కిలో స్కిన్లెస్ చికెన్ రూ.210 నుంచి 230 వరకూ పలికింది. నూతన సంవత్సరం రోజున కొద్దిగా తగ్గినా మళ్లీ పెరిగే సూచనలే కనిపిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ముక్కలేనిదే ముద్ద దిగని చికెన్ ప్రియులు ఆవేదన చెందుతున్నారు. నెలన్నర క్రితం వరకూ కిలో రూ.150 నుంచి రూ.170 మధ్య ఉన్న బ్రాయిలర్ చికెన్ (స్కిన్లెస్) ధర 20 రోజులుగా బాగా పెరిగింది. పది రోజులపాటు కిలో రూ.210 – 230 మధ్య (చికెన్ కంపెనీలు, నాణ్యత, ప్రాంతాన్ని బట్టి రూ.15 నుంచి రూ.20 వరకూ తేడా ఉంటుంది) స్థిరపడింది. రెండు మూడు రోజుల్లో తగ్గుముఖం పట్టి రూ.180–200కి దిగివచ్చింది. గత రెండు మూడు రోజుల్లో తగ్గడానికి అయ్యప్ప, భవానీ దీక్షలు, కొత్త సంవత్సరం, సెంటిమెంటు కారణాలని చికెన్ వ్యాపారులు, బ్రాయిలర్ పౌల్ట్రీ ఫారాల వారు విశ్లేషిస్తున్నారు. రెండు రోజుల్లో భవానీ దీక్షలు ముగియనున్నాయి. అలాగే అయ్యప్ప భక్తుల్లో కూడా అత్యధిక మంది (మఖరజ్యోతి దర్శనం కోసం ఆగేవారు మినహా) వారం పది రోజుల్లో మాలలు తీసేస్తారు. వీటికి తోడు సంక్రాంతి సందర్భంగా కోళ్లకు డిమాండు పెరుగుతుందని వ్యాపారవర్గాల అంచనాగా ఉంది. వీటికి తోడు గతంతో పోల్చుకుంటే మందు వినియోగం కూడా బాగా పెరగడంతో అదే స్థాయిలో చికెన్ అమ్మకాలూ పెరిగాయి. ‘ చెప్పడానికి బాగున్నా బాగులేకపోయినా మందుప్రియులవల్లే ఎక్కువగా చికెన్ అమ్ముడుపోతోందన్నది మాత్రం నిజం. చికెన్ విక్రయించే షాపు నిర్వాహకుడిగా ఇది నేను గ్రహించిన వాస్తవం...’ అని విజయవాడకు చెందిన ఒక దుకాణం యజమాని ‘సాక్షి’కి వివరించారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే విజయవాడలో చికెన్ వినియోగమే కాదు ధర కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటుందని ఒక హోటల్ యజమాని అభిప్రాయపడ్డారు. ముక్కలేనిదే ముద్ద దిగనివారెందరో... పొట్టేలి మాంసంతో పోల్చితే ధర తక్కువగా ఉండటం కూడా కోడికూరకు డిమాండు పెరగడానికి కారణం. మటన్ కొనలేని వారంతా చికెన్వైపే మొగ్గుచూపుతున్నారు. హోటళ్లలో సైతం మటన్ కంటే చికెన్ వినియోగమే ఎక్కువగా ఉండటం ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో ప్రతి నెలా మూడు కోట్లకు పైగా బ్రాయిలర్ కోళ్ల ఫారాల నుంచి బయటకు వస్తున్నాయి. సీజన్ను బట్టి కొంచెం అటు ఇటుగా అదే స్థాయిలో కోడి పిల్లలు పెంపకం కోసం పౌల్ట్రీలకు చేరుతున్నాయి. వచ్చే వేసవిలో చికెన్ ధరలు పెరగవచ్చని బ్రాయిలర్ రంగ నిపుణులు చెబుతున్నారు. ‘ఈఏడాది ఖరీఫ్లోనూ, రబీలోనూ వర్షాభావం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోవడం వల్ల కోళ్లకు దాణాగా వాడే మొక్కజొన్న, తౌడు, సజ్జలు తదితరాల ధర పెరుగుతుంది. కరువువల్ల నీటి సమస్య ఏర్పడుతుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. వేడి పెరిగి భూతాపంవల్ల కోళ్లు చనిపోయి మాంసం ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ కారణాలవల్ల చికెన్ ధర పెరిగితే తప్ప గిట్టుబాటు కాని పరిస్థితి వస్తుందని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. ధరల్లో నాటుకోడి పొట్టేలు మాంసంతో పోటీ పడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో పొట్టేలి మాసం రూ.550 ఉంటే నాటుకోడి రూ.500 ఉంది. పెద్ద పెద్ద హోటళ్లలో సైతం నాటుకోడి పులుసు, సంగటి మెనూకు క్రేజి ఏర్పడింది. నాటుకోళ్ల పెంపకం ఖర్చు కూడా ఎక్కువే ఉంటుందని పౌల్ట్రీల యజమానులు చెబుతున్నారు. -
అనుమానాస్పద స్థితిలో నలుగురు యువకులు మృతి
శామీర్పేట్/తొర్రూరు రూరల్ (పాలకుర్తి): తమ కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలనుకున్న నలుగురు యువకుల లక్ష్యం నెరవేరకుండానే జీవితాన్ని చాలించారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మెదక్ జిల్లాకు వలస వచ్చి తాము లీజుకు తీసుకున్న ఫౌల్ట్రీ ఫామ్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అందరి హృదయాల్ని కలచివేస్తోంది. స్వయం ఉపాధి ద్వారా నలుగురుకీ ఊరి లో ఆదర్శంగా నిలుస్తారనుకున్న ఆ యువకుల అకాల మరణం గ్రామస్తుల్ని విషాదంలో నింపింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని బొమ్మరాశిపేట శివారు కేజీఎల్ పౌల్ట్రీఫామ్లో శుక్రవారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం, వెంకటాపూర్కు చెందిన గాదగాని వెంకన్న, అరుణ దంపతుల రెండో కుమారుడు అరవింద్గౌడ్(23), మొగుళ్ల వెంకన్న, సోమనర్సమ్మ దంపతుల కుమారుడు శివశంకర్గౌడ్(21)లు శామీర్పేట మండలం బొమ్మరాశిపేటలో నెల క్రితం సుధాకర్రెడ్డికి చెందిన పౌల్ట్రీఫామ్ను లీజుకు తీసుకుని కోళ్ల పెంపకం చేపట్టారు. వీరికి తోడుగా ఉండేందుకు వారి స్వగ్రామానికి చెందిన చెన్నబోయిన శ్రీను, సుభద్ర దంపతుల కుమారుడు మహేశ్ ముదిరాజ్(22)ను వారం రోజుల క్రితం తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నారు. కాగా, ఈ ముగ్గురినీ కలిసేందుకు వీరి స్నేహితుడు పోరెడ్డి మహేందర్రెడ్డి(25) వెంకటాపురం నుంచి గురువారం బొమ్మరాశిపేటకు వచ్చాడు. రాత్రి సుమారు 1 గంట వరకు వీరంతా కోడిపిల్లలకు వాక్సిన్ వేశారు. అనంతరం భోజనం చేసి పక్కనే ఉన్న గదిలో పడుకున్నారు. ఉదయం 11 గంటలకు కేజీఎల్(అభ్యుదయ) కంపెనీ సూపర్వైజర్ సతీశ్ కోడిపిల్లల పరిశీలనకు పౌల్ట్రీఫామ్ దగ్గరకు వచ్చాడు. కోడిపిల్లలకు నీరు కూడా పెట్టలేదని గమనించిన సతీశ్ యువకులు నిద్రించిన గది వద్దకు వెళ్ళి వారిని పిలవగా ఎవరూ స్పందించలేదు. దీంతో సతీశ్ తలుపు నెట్టుకుని లోపలికి వెళ్లగా నలుగురు యువకులు మృతిచెందినట్టు కన్పించారు. వెంటనే పోలీసులకు, బంధువులకు సమాచారం అందించాడు. పేట్బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాసరావు, శామీర్పేట సీఐ నవీన్రెడ్డిలు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్స్క్వాడ్తో ఆధారాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. చలికాచుకునేందుకు ఏర్పాటు చేసుకున్న బొగ్గుల కుంపటే వీరి మృతికి కారణమై ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకులు మరణించడంతో తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు గాంధీ ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. నివేదిక అనంతరమే.. ఈ యువకుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొగ్గుల కుంపటి వల్లే ఊపిరాడక చనిపోయి ఉంటారని కొందరు, కోడి పిల్లలకిచ్చే వ్యాక్సిన్ ద్రావణం ఆహారంలో కలవడం వల్లేనని, వీరంటే గిట్టని వారెవరో ఆహారంలో విషం కలిపి ఉంటారన్న మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వీరి మృతికి విషాహారమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది పోస్టుమార్టం నివేదిక అనంతరం తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. -
కాసుల కోడి ఐడియా
ఉత్తర కర్ణాటకలోని ఒక గ్రామం ఇప్పుడు పల్లె విజయాలకు ప్రతీకగా నిలుస్తోంది. వ్యవసాయంలో నష్టాలు మూటగట్టుకుని దిగాలుగా ఉన్న పల్లెలో ఒక కోడి కొత్త వెలుగులు నింపింది. గిరిరాజ కోళ్ల పెంపకంతో వందల కుటుంబాలు ఉపాధి పొందడం విశేషం. ఒకరితో ఆరంభమైన ఈ విజయం గ్రామం తలరాతను మార్చేసింది. దొడ్డబళ్లాపురం: ధార్వాడ జిల్లాలోని ఆ గ్రామంలో గ్రామస్తులు చాలా ఏళ్ల నుండి బాయిలర్ కోళ్ల పెంపకంతోనే జీవితం నెట్టుకొస్తున్నారు. చాలామంది తమ పొలాల వద్ద వ్యవసాయంతో పాటు కోళ్లఫారాలు నిర్మించుకుని బాయిలర్ కోళ్లు పెంచుతూ ఆదాయం గడిస్తున్నారు. వారికి వ్యవసాయం కన్నా కోళ్ల పెంపకంతోనే ఆదాయం ఎక్కువట. అబ్దుల్ ఆరంభించాడు ధార్వాడ జిల్లా మిశ్రికోటి అనే గ్రామంలో ఇప్పుడు గిరిరాజ కోళ్లు, రాజశ్రీ కోళ్లు పెంపకందారుల పాలిట బంగారు గుడ్లు అంతటి లాభాలనిస్తున్నాయి. గ్రామవాసులు కోళ్ల పెంపకంతో లబ్ధి పొందడం వెనుక అబ్దుల్ అనే పౌల్ట్రీ రైతు కృషి ఉంది. అబ్దుల్ సంవత్సరం క్రితం పశుపాలన శాఖ నిర్వహించిన సదస్సులో గిరిరాజ కోళ్ల పెంపకంపై శిక్షణ తీసుకున్నాడు. మొదట అనుమానంతోనే అబ్దుల్ 20 గిరిరాజ కోళ్లను కొని పెంచడం ప్రారంభించాడు. పెద్దగా జాగ్రత్తలు తీసుకోకుండానే అవి సులభంగా పెరిగి ఊహించినదాని కంటే ఎక్కువగా ఆదాయం తెచ్చిపెట్టసాగాయి. దీంతో ఆయన మరో 50 కోడి పిల్లలను ఖరీదుచేసి పెంచసాగాడు. అప్పటి వరకూ కేవలం బాయ్లర్ కోళ్లను మాత్రమే చూసిన గ్రామస్తులు గిరిరాజ కోళ్ల ఫలితాలను చూసి ఆశ్చర్యపోయారు. వారు కూడా ఆ కోళ్లను లబ్దుల్ వద్దే ఖరీదు చేయడం ప్రారంభించారు. అబ్దుల్ ఇప్పుడు పెద్ద ప్రమాణంలో గిరిరాజ కోళ్లు పెంచేందుకుగాను పెద్ద ఫారం కూడా నిర్మించాడు. అతి తక్కువ కాలంలోనే గిరిరాజ కోళ్లు 10 – 15 కేజీల వరకూ బరువు పెరుగుతాయి. ఎక్కువ మాంసం, గుడ్లు...ఎక్కువ లాభాలు మాంసం, గుడ్లు రెండూ ధర ఎక్కువయినా జనం వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా వీటి పోషణ చాలా సులభం. పెద్దగా జాగ్రత్తలు పాటించకపోయినా నాటు కోళ్లకు మల్లే ఆహారాన్ని బయటే సేకరించి తింటాయి. 5 నెలల తరువాత ఇవి గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి.ఒక విడతకు 100 నుండి 150 గుడ్లు పెడతాయి.అబ్దుల్ సమాచారం ప్రకారం 7 కేజీలు ఉండే పుంజు రూ.800లు పలుకుతుందట. గిరిరాజ జాతి పెట్ట కోడి 40 వారాలలో 3 నుండి 4 కేజీలు, పుంజు 4 నుండి 5 కేజీలు పెరుగుతుందట. వీటి గుడ్డు కూడా ఒక్కోటి 55 గ్రాముల బరువు ఉండి రూ.10 ధర పలుకుతుందట. అబ్దుల్ ప్రస్తుతం హైదరాబాద్ నుండి రాజశ్రీ అనే జాతి కోళ్ల నుకూడా వీటితో పాటు పెంచుతున్నారు. -
కుళ్లబెట్టి..ఉడకబెట్టి!
చేపలు మంచి పోషకాహారం. వైద్యులు సైతం చేపలు తినాలని సూచిస్తుంటారు. మాంసాహారులు చేపలను ఇష్టంగా తింటారు. అదే కొల్లేరు చేపలంటే మరింత మక్కువ చూపుతారు. అయితే కొందరు ఆక్వా రైతులు సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు తక్కువ ధరకు లభించే కోళ్ల వ్యర్థాలను చేపలకు మేతగా వాడుతున్నారు. ఆ చేపలను తింటే పోషకాల మాట అటుంచి అనారోగ్యం తప్పదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కైకలూరు: చేపల సాగుకు కైకలూరు నియోజకవర్గం పెట్టింది పేరు. ఆ పేరుకు కొంత మంది రైతులు చెడ్డపేరు తీసుకొస్తున్నారు. సాగు ఖర్చును తగ్గించుకునేందుకు పిల్లెట్ మేతకు బదులు, కోళ్ల వ్యర్థాలను అందిస్తున్నారు. జిల్లాలో లక్షా 60 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. అత్యధికంగా కొల్లేరు ప్రాంతంలో 80 వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు జరుగుతోంది. అనధికారికంగా ఇంకా ఎక్కువ విస్తీర్ణంలోనే ఆక్వా సాగవుతోంది. నిత్యం రోజు కొల్లేరు ప్రాంతం నుంచి 30 లారీల చేపలు పశ్చిమబెంగాల్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు.. కైకలూరు నియోజకవర్గంలో బొచ్చ, శీలావతి వంటి తెల్లజాతి చేపలు కాకుండా ఫంగేషియన్ (ఫంగస్) చేపల సాగు 1100 ఎకరాల్లో జరుగుతోంది. ఈ రకం చేపలు ఎటువంటి ఆహారమైనా జీర్ణించుకుంటాయి. ఈ నేపథ్యంలో కొందరు రైతులు ఫంగస్ చేపలకు కోళ్ల వ్యర్థాలను మేతగా వాడుతున్నారు. గతంలో క్యాట్ఫిష్ చేపలకు మాత్రమే కుళ్లిన మాంసం వ్యర్ధాలను వినియోగించేవారు. ఇప్పుడు క్యాట్ఫిష్ సాగు జరగడం లేదు. దీంతో ఫంగస్ చేపలను సాగు చేసే చిన్నచిన్న చెరువుల్లో కోళ్ల వ్యర్థాలను మేతగా అందిసున్నారు. సాధారణంగా నీటిలో తేలియాడే పిల్లెట్ మేత కిలో రూ.35 నుంచి రూ.40 ధర పలుకుతోంది. ఎకరా చెరువులో 7 వేల చేప పిల్లలను వదిలి ఆరు నెలలు సాగు చేసేందుకు పిల్లెట్మేత వాడితే రూ.3.05 లక్షల ఖర్చువుతుంది. అదే కోళ్ల వ్యర్థాలను వినియోగిస్తే రూ.లక్ష లోపే ఖర్చవుతుంది. 30 కిలోల వ్యర్థాల టిన్ను రూ.300లకే లభిస్తుంది. పట్టుబడికి కొన్ని రోజుల ముందు తువడును మేతగా అందిస్తారు. దీంతో చేపలు మంచి సైజుకు పెరుగుతాయి. కాసులు కురిపిస్తున్న కోళ్ల వ్యర్థాల రవాణా కోళ్ల వ్యర్థాల రవాణా అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. వ్యర్థాలు రవాణాచేసే వారు కొల్లేరుతోపాటు గుడివాడ, విజయవాడ వంటి ప్రాంతాల్లోని మాంసం విక్రేతలకు నెలకు రూ.5 వేల చొప్పున ముందుగానే చెల్లిస్తారు. మాంసం దుకాణాల్లో మిగిలే వ్యర్థాలను అర్ధరాత్రివేళ ఆటోలు, ట్రక్కుల్లో చెరువుల వద్దకు చేరుస్తారు. టిన్ను రూ.300 చొప్పున విక్రయిస్తారు. ఆటోలు రాగానే చేపల రైతులు వ్యర్థాలను చెరువులో విసేరిస్తున్నారు. మరికొందరు ఉడకబెట్టిన తరువాత చెరువుల్లో మేతగా వాడుతున్నారు. విజయవాడ నుంచి గుడివాడ, కైకలూరు మీదుగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు కోళ్లు వ్యర్థపదార్థాల రవాణా జరుగుతోంది. గత శనివారం రాత్రి మండవల్లి మండలం ప్రత్తిపాడులో ఫింగేషియన్ చేపల చెరువు వద్ద కోళ్లు వ్యర్థాలతో వచ్చిన ఆటో మీడియాకు చిక్కింది. జీఓ అమలు ప్రశ్నార్థకం.. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి చేటుచేస్తున్న వ్యర్థాల రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేస్తూ 2016 డిసెంబర్ 4న జీఓ 56ను ప్రభుత్వం విడుదల చేసింది. మండల స్థాయిలో తహసీల్దారు చైర్మన్గా, వీఆర్వో, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, పోలీసు అధికారి సభ్యులుగా, మెంబరు కన్వీనరుగా ఫిషరీస్ అధికారి వ్యవహరిస్తారు. ఈ కమిటీలపై పర్యవేక్షణ అధికారం కలెక్టరుకు ఉంటుంది. వ్యర్థాలు రవాణాచేస్తూ వాహనాలు పట్టుబడితే డ్రైవర్ల లైసెన్సు, రవాణా పర్మిట్లు రద్దు చేసి, వాహన యజమాని, డ్రైవర్లపై ఐపీసీ కేసులు నమోదుచేస్తారు. చేపల చెరువు లైసెన్సు రద్దు, రూ.10 వేల జరిమానా విధించొచ్చు. మండవల్లి మండలం ప్రత్తిపాడులో శనివారం రాత్రి వ్యర్థాలతో ఆటో దొరికినా ఇప్పటి వరకు చర్యలు లేవు. తహసీల్దార్ మధుసూదనరావును వివరణ కోరగా విచారణ చేస్తున్నామని సమాధానం చెప్పారు. ఆరోగ్యానికి చేటు కుళ్లిన మాంసం వ్యర్థాలు అత్యంత ప్రమాదకరం. వ్యర్థాలను ఆహారంగా తీసుకున్న చేపలను తినకూడదు. ఆ చేపలను తిన్న వారికి ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలుషిత ఆహారం వల్ల నులుపురుగులు పెరిగే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు వహించాలి. – డాక్టరు కె.శ్రీలత, మండవల్లి పరిశ్రమను పాడుచేయొద్దు చేపల పరిశ్రమపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కొందరు రైతులు చేసే తప్పు మొత్తం పరిశ్రమపైనే పడుతుంది. వ్యర్థాల నియంత్రణకు మా పోరాటం ఫలితంగా ప్రభుత్వం జీఓ 56 విడుదల చేసింది. వ్యర్థాలను ఉపయోగించే రైతులపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – ముదునూరి సీతారామరాజు,రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు, భుజబలపట్నం -
నిబంధనలు కాలరాసి.. చేపలు పెంచేసి..!
భీమడోలు: చేపల కూర మాంసప్రియులను చెవులూరిస్తుంది. చేపలు శరీరానికి ఆరో గ్యంతో పాటు మాంసకృత్తులు, విట మిన్లు, ఫాస్పరస్ వంటి ఖనిజాలు అందిస్తాయి. అయితే ప్రస్తుతం చేపలు తినాలంటేనే భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మార్కెట్లో దొరికే ఏ చేప పడితే ఆ చేపను కూర వండుకుని తింటే ఆరోగ్యం మాట అటుంచితే దుష్పరి ణామాలు చోటుచేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే చేపల సాగులో కోళ్ల వ్యర్థాలను, ఆరోగ్యానికి హాని కలిగించే వాటిని వినియోగించడమే కారణం. దీంతో పాటు పట్టణాల్లోని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో కోళ్ల వ్యర్థాలను తిని పెరిగే ఫంగస్, క్యాట్ఫిష్ను రుచికరంగా వండి వడ్డిస్తున్నారు. ఇటువంటి వాటిపై అధికారులు దృష్టిపెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో ఆక్వా సా గవుతోంది. దీనిలో సుమారు 1.10 లక్షల ఎకరాల్లో చేపలు సాగుచేస్తున్నారు. అ యితే వేలాది ఎకరాల్లో ఫంగస్ (తెల్ల క్యాట్ఫిష్)ను సాగుచేస్తున్నారు. ప్రధానంగా కొల్లేరుతో పాటు డెల్టా మండలాల్లో నిషేధిత ఆఫ్రికన్ క్యాట్ఫిష్ సాగవుతోంది. మేత ధరలు పెరగడంతో సాగుదారులు కోళ్లవ్యర్థాలను చెరువుల్లో వేసి ఫంగస్, క్యాట్ఫిష్లను పెంచుతున్నారు. కోళ్లవ్యర్థాలు.. పశు కళేబరాలు కోళ్ల వ్యర్థాలు, పశు కళేబరాలను తిని పెరిగే ఫంగస్, ఆఫ్రికన్ క్యాట్ఫిష్ తింటే దుష్పరిణామాలు తప్పవని వైద్యులు చెబుతున్నారు. వీటిపై సరైన అవగాహన లేకపోవడంతో యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. నగరా ల్లోని పలు హోటళ్లలో క్యాట్ఫిష్ కర్రీ, ఫ్రైలను విక్రయిస్తున్నారు. పదేళ్ల క్రితం నిషేధం కోరమేను, మార్పు, ఇంగిలాయి తది తర రకాలు మన దేశానికి చెందిన సహజసిద్ధ క్యాట్ఫిష్ చేపలు. దీని శాస్త్రీయనామం క్లారియాస్గారీపినస్. విదేశాలకు చెందిన ఆఫ్రికన్ క్యాట్ఫిష్ను ఇక్కడ సాగు చేస్తుండటంతో సంప్రదాయక క్యాట్ఫిష్ రకాలు అంతరించిపోతున్నాయి. ఈనేపథ్యంలో పదేళ్ల కితం ఆఫ్రికన్ క్యాట్ఫిష్ను ప్రభుత్వం నిషేధిస్తూ జీఓ జారీచేసింది. ఫంగస్, ఆఫ్రికన్ క్యాట్ఫిష్లు మాంసా హార జీవులు. ఇవి మొండిజాతులు. వీటితో అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. నిరోధక కమిటీ సభ్యులు వీరే ఫంగస్, క్యాట్ఫిష్ పెంపకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నిరోధక క మిటీలను ఏర్పాటుచేసింది. కమిటీలో తహసీల్దార్, ఎస్సై, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, వీఆర్వోలు సభ్యులుగా ఉంటారు. మత్స్యశాఖాధికారి కన్వీనర్గా వ్యవహరిస్తారు. వీరు చెరువులను తనిఖీ చేసి పట్టుకున్న కోళ్ల వ్యర్థాలు, క్యాట్ఫిష్ను గ్రామానికి దూరంగా గొయ్యి తీసి పాతి పెట్టడం, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం వంటివి చేయాలి. అనర్థాలు ఎన్నో.. సాధారణంగా చేపల చెరువుల్లో తడి మేత వేయరాదు. దీని వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. ఫంగస్, క్యాట్ఫిష్ సాగు చేస్తున్న చెరువుల్లో కోళ్ల వ్యర్థాలు వేయడంతో వచ్చే దుర్గంధం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. కోళ్ల ఎదుగుదలకు వినియోగించే యాంటీబయోటిక్స్ కోళ్ల వ్యర్థాల ద్వారా చేపలకు చేరి వాటిని తింటే మానవ శరీరంలోకి చేరతాయి. రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. ఆయా చెరువుల్లోని మురుగు నీరు పంట బోదెల ద్వారా తాగునీటి కలుషితానికి కారణమవుతోంది. ఈ నీటిని తాగితే విరేచనాలు, వాంతులు వస్తాయి. గర్భిణులు, బాలింతల ద్వారా పుట్టబోయే బిడ్డలకు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. గాలి, నీరు, పర్యావరణం కలుషితమవుతాయి. వీరమ్మకుంటలో చర్మవ్యాధులు ఫంగస్, క్యాట్ఫిష్ సాగు వల్ల పెదపాడు మండలం వీరమ్మకుంట ప్రాంతంలో పలువురికి చర్మవ్యాధులు సోకాయి. నీరు కలుషితమై దురద, దద్దర్లు వచ్చాయి. పెదపాడు మండలంలో చేపల మేతగా వేసేందుకు సిద్ధం చేసిన ఉడికించిన కోళ్ల వ్యర్థాలను పరిశీలిస్తున్న అధికారులు, కోళ్ల వ్యర్థాలతో సాగు చేస్తున్న చెరువు -
బండ్ల గణేష్పై అట్రాసిటీ కేసు నమోదు
-
బండ్ల గణేష్పై అట్రాసిటీ కేసు నమోదు
ఇటీవల వరుస వివాదాలతో హల్చల్ చేస్తున్న టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్లగణేష్, అతని సోదరుడు శివబాబులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్కు చెందిన డాక్టర్ దిలీప్ చంద్రకు భూమిని కొనుగోలు చేసేందుకు బండ్ల గణేష్ గతంలో ఒప్పందం చేసుకున్నారు. ఫరూఖ్ నగర్ మండలం, బూర్గుల శివారులో ఉన్న ఈ పౌల్ట్రీ ఫామ్లను ఒప్పందం ప్రకారం బ్యాంకు రుణాలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అయితే బ్యాంక్ ఇచ్చిన గడువులోగా రుణాలను గణేష్ తిరిగి చెల్లించకపోవటంతో ఆ పౌల్ట్రీ ఫామ్లతో పాటు దిలీప్ చంద్రకు చెందిన ఇంటిని కూడా బ్యాంకు అధికారులు సీజ్ చేసి, వారి ద్వారానే ఆ ఆస్తులను సీజ్ చేశారు. తరువాత తమకు రావాల్సిన డబ్బుల కోసం దిలీప్ చంద్ర, ఆయన భార్య, కౌన్సిలర్ కృష్ణవేణితో కలిసి గణేష్ పౌల్ట్రీ ఫామ్ ఆఫీసుకు వెళ్లారు. ఆసమయంలో గణేష్, అతని సోదరుడు శివబాబు కులం పేరుతో తమను దూషించారంటు కౌన్సిలర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిరువురిపై అట్రాసిటీ కేసు నమోదైంది. -
కోళ్ల పరిశ్రమకు భగీరథ నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథలో 10 శాతం నీటిని పరిశ్రమల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని, ముఖ్యమంత్రి తో మాట్లాడి కోళ్ల పరిశ్రమకు కూడా అందేలా చూస్తానని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేం దర్ హామీ ఇచ్చారు. పౌల్ట్రీ ఇండియా–2017 ప్రదర్శనను బుధవారం ఆయన హైటెక్స్లో ప్రారంభించారు. ఈ ప్రదర్శన 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈటల మాట్లాడుతూ, కోళ్ల పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. చిన్న రాష్ట్రమే అయినా ఏడాదికి 110 కోట్ల గుడ్లను ప్రభుత్వపరంగా విద్యార్థులు, చిన్న పిల్లలకు, అంగన్వాడీలకు అందిస్తున్నామని తెలిపారు. త్వరలో మధ్యా హ్నం భోజనంలో చికెన్ పెట్టాలని సీఎం యోచిస్తున్నారని చెప్పారు. జీఎస్డీపీలో రూ.10 వేల కోట్లు కోళ్ల పరిశ్రమ నుంచే వస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎండాకాలంలో ఒక్క రోజు కరెంటు పోతే లక్షలాది కోళ్లు చనిపోయేవని, ఇప్పుడు కేసీఆర్ ముందుచూపు వల్ల 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని, దీంతో పరిశ్రమలకు ఉపశమ నం లభించింద న్నారు. పౌల్ట్రీని వ్యవసాయ పరిశ్రమ గా పరిగణించాలని కేంద్రాని కి లేఖ రాసిన తొలి రాష్ట్రం తెలం గాణనే అని తెలిపారు. కరెంట్ యూనిట్కి రూ.2 సబ్సిడీ ఇచ్చి రైతులకు సీఎం చేయుతని చ్చారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి రాష్ట్రాన్ని నిరుద్యోగ సమస్య వేధిస్తున్నదని, చిన్న పరిశ్రమలు గ్రామస్థాయిలో పెట్టిం చడం ద్వారా గ్రామాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని ఈటల అన్నారు. ఐటీ, పరిశ్రమల ద్వారా కేవలం 2–3 శాతం మాత్రమే ఉపాధి లభిస్తుందని, కోళ్ల పరిశ్రమ ద్వారా 1–2 శాతం ఉపాధి లభి స్తుందని చెప్పారు. గుడ్డు ధర పెరిగిందని, సామాన్యుడికి దూరమైందని అంటున్నారే కానీ.. ఈ పరిశ్రమతో అనుబంధం ఉన్న వారి సాధక బాధకాలు కూడా తెలుసు కోవాలని వ్యాఖ్యానించారు. గుడ్డు సాధా రణ ధర 2016–17లో రూ.3.43 ఉంటే, 2017–18లో రూ.3.23 ఉందని చెప్పారు. ఓ చాయ్ రూ.10, ఓ గుట్కా, ఓ సిగరెట్ రూ.10 ఉన్నాయని పేర్కొన్నారు. కోళ్ల పరిశ్రమ కోసం పెడుతున్న పెట్టుబడి, మానవ వనరులు, దాణా, మందుల ఖర్చు ఏ స్థాయిలో పెరిగిందో గుడ్డు ధర ఆ స్థాయిలో పెరగలేదని, కాబట్టి దీనికి ప్రభు త్వాల మద్దతు అవసరమని చెప్పారు. ఈ ప్రదర్శనలో 40 దేశాలకు చెందిన కోళ్ల పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. 305 స్టాళ్లు ఏర్పాటు చేశారని కోళ్ల సంఘం ప్రతినిధులు తెలిపారు. సేవ పోల్చమ్ లిమిటెడ్ కంపెనీ ‘ట్రాన్స్మూన్ ఐబీడీ’, ‘వెక్టార్మూన్ ఎన్డీ’ వ్యాక్సిన్లను ఆవిష్క రించింది. కార్యక్రమంలో పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఆంక్షల సెగ
కొనుగోళ్లకు వెనుకడుగేస్తున్న ట్రేడర్లు, చిరు వ్యాపారులు స్థానిక ఎగుమతులపై ప్రభావం పౌల్ట్రీల్లో పేరుకుపోతున్న గుడ్లు రూ.2.55కు పతనమైన రైతు ధర రోజుకు రూ.77 లక్షల మేర నష్టం ఆందోళనలో కోళ్ల రైతులు మండపేట : మూలిగే నక్కపై తాటికాయ పడిన చందాన తయారైంది జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి. సీజ¯ŒSలో గుడ్డు ధర తీవ్రంగా నిరాశపరచగా.. తాజాగా ఆర్థిక ఆంక్షలు పరిశ్రమను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. వేసవి ఎండలకు తోడు ఆర్థిక ఆంక్షలతో గుడ్ల కొనుగోళ్లకు, ఎగుమతులకు ట్రేడర్లు, చిరు వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా పౌల్ట్రీల్లో గుడ్లు పేరుకుపోతుండగా.. రైతు వద్ద ధర నానాటికీ పతనమవుతోంది. ఇప్పటికే రూ.2.55కు తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు రోజుకు రూ.77 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. మున్ముందు మరింతగా పెరగనున్న ఎండలతో పరిశ్రమకు మరిన్ని కష్టాలు తప్పవని కోళ్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 1.30 కోట్ల కోళ్లుండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి. 40 శాతం గుడ్లు స్థానికంగా వినియోగమవుతుండగా, మిగిలినవి పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. చలి ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల ఎగుమతులకు డిమాండ్ పెరిగి, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు గుడ్డు ధర ఆశాజనకంగా ఉంటుంది. అయితే నవంబర్లో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడంతో ఈ ఏడాది సీజ¯ŒSలో రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయింది. పరిశ్రమకు కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఇటీవల లారీల సమ్మెతో గుడ్ల ఎగుమతి స్తంభించిపోయింది. ఆ సమ్మె ముగిసినా, ఆర్థిక ఆంక్షలు, ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగుతోంది. నగదు రహిత లావాదేవీలు, ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో లావాదేవీలన్నీ చెక్కుల రూపంలోనే నిర్వహించాల్సి రావడం వ్యాపారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. చెల్లింపులు జరిపిన చెక్కులకు సమాధానం చెప్పాల్సి రావడం, ఆర్థిక ఆంక్షలకు సంబంధించి వ్యాపారులు, కోళ్ల రైతులకు సరైన అవగాహన లేకపోవడం సమస్యగా మారింది. లావాదేవీల్లో ఏ చిన్నపాటి లోపం చోటుచేసుకున్నా రూ.లక్షల్లో జరిమానాలు చెల్లించాల్సి రావడంతో ట్రేడర్స్తో పాటు స్థానిక వ్యాపారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు ఎండల ప్రభావంతో ఇతర రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం తగ్గుముఖం పడుతోంది. ఈ కారణాలతో పది రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులు, స్థానిక వినియోగం సగం వరకు తగ్గిపోగా పౌల్ట్రీల్లో గుడ్లు పేరుకుపోతున్నాయి. సాధారణంగా జిల్లా నుంచి రోజుకు సుమారు 50 లారీల గుడ్లు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం అది 25 లారీలకు పడిపోయింది. స్థానిక వినియోగం కూడా తగ్గిపోవడంతో పౌల్ట్రీల్లో గుడ్ల నిల్వలు పెరిగిపోతున్నాయని కోళ్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. నెక్ ప్రకటిత ధర కూడా అందని దుస్థితిలో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. మేత, కూలీల ఖర్చులు పెరిగిపోవడం, వేసవి ఉపశమన చర్యలు తదితర కారణాలతో గుడ్డు రైతు ధర రూ.3.25 ఉంటే తప్ప గిట్టుబాటు కాదని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రస్తుత రైతు ధర రూ.2.55 ఉండగా, రోజుకు ఒక్కో గుడ్డు రూపంలో 70 పైసల వరకూ కోళ్ల రైతులు కోల్పోవాల్సి వస్తోంది. దీని ప్రకారం పరిశ్రమకు రోజుకు సుమారు రూ.77 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు చెబుతున్నారు. మున్ముందు వేసవి ఎండలు, వడగాలుల తీవ్రతతో గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గిపోతుందని, దీంతోపాటు కోళ్ల మరణాలు పెరిగి గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్ర రుణాల్లో సగం పంట రుణాలే
2017–18 రుణ ప్రణాళిక విడుదల చేసిన నాబార్డు మొత్తం రాష్ట్ర రుణ ప్రణాళిక రూ. 65,590 కోట్లు అందులో వ్యవసాయ రుణాలు రూ. 32,830 కోట్లు సాక్షి, హైదరాబాద్: 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాలపై నాబార్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రుణాల్లో సగ భాగం పంట రుణాలకే కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర రుణ ప్రణాళిక ఫోకస్ పేపర్ను విడుదల చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రుణ ప్రణాళిక లక్ష్యం రూ. 65,590.61 కోట్లుగా నాబార్డు అంచనా వేసింది. 2016–17తో పోలిస్తే 17 శాతం రుణాలు అధికమని స్పష్టం చేసింది. అందులో వ్యవసాయ పంట రుణాలే ఏకంగా సగం ఉండటం గమనార్హం. మొత్తం రుణ ప్రణాళికలో పంట రుణాలు రూ. 32,830.44 కోట్లుగా నిర్ధారించింది. దీర్ఘకాలిక, వ్యవసాయ అనుబంధ రుణాలు రూ. 14,116 కోట్లుగా నాబార్డు పేర్కొంది. ఈ రెండూ కలిపి వ్యవసాయ పంట, దీర్ఘకాలిక అనుబంధ రుణాలన్నీ రూ.46,946.98 కోట్లుగా ఉండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఈ రుణ ప్రణాళిక తయారు చేసినట్లు నాబార్డు వెల్లడించింది. చేపల పెంపకం, ఉద్యాన, పశు సంవర్ధకశాఖల అభివృద్ధి ప్రాధాన్యాలుగా దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.2,088 కోట్లు దీర్ఘకాలిక, వ్యవసాయ అనుబంధ రుణాలకు రూ. 14,116 కోట్లు కేటాయించగా... అందులో వ్యవసాయ యాంత్రీకరణ కోసం రైతులకు విరివిగా రుణాలు ఇచ్చేందుకు రూ.2,087.67 కోట్లు కేటాయించింది. పశుసంవర్ధకశాఖలో భాగమైన డెయిరీ అభివృద్ధి కోసం రూ. 1737.59 కోట్లు కేటాయించింది. కోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 647.17 కోట్లు రుణంగా ఇవ్వాలని నిర్ణయించింది. గోదాములు, మార్కెట్ యార్డుల కోసం రూ.801.89 కోట్లు రుణంగా ప్రకటించింది. గృహ రుణాలకు రూ. 3,577 కోట్లు గృహ రుణాలకు రూ. 3,577.57 కోట్లు కేటాయించాలని నాబార్డు నిర్ణయించింది. విద్యా రుణాల కోసం రూ.1661.64 కోట్లు లక్ష్యంగా ప్రకటించింది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల రంగానికి రూ. 9,241.24 కోట్లు రుణాలు ఇవ్వాలని వెల్లడించింది. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు దిశగా... కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా తన రుణ ప్రణాళిక లక్ష్యం ఉందని నాబార్డు వెల్లడించింది. అందుకు అనుగుణంగా రుణ ప్రణాళిక తీర్చిదిద్దినట్లు వివరించింది. -
జీఎస్టీలో పౌల్ట్రీని మినహాయించాలి
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ నుంచి కోళ్ల పరిశ్రమ (పౌల్ట్రీ)ని మినహారుుంచాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. బుధవారం హైదరాబాద్లో భారత కోళ్ల ప్రదర్శన (పౌల్ట్రీ ఇండియా-2016) ప్రారంభమైంది. ఇందులో ఈటల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కోళ్ల పరిశ్రమను వ్యవసాయరంగంలో భాగంగా గుర్తించాలని.. వడ్డీ మాఫీ సహా ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై ఇప్పటికే ప్రధాని, కేంద్ర ఆర్థికమంత్రులకు విన్నవించామన్నారు. కోళ్ల పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని, 24 గంట ల విద్యుత్తో పాటు రారుుతీ ఇస్తున్నామన్నారు. మొక్కజొన్నతోపాటు సోయా పంటను ప్రోత్సహించడం వల్ల కోళ్ల పరిశ్రమలకు ఊపు వస్తుందన్నారు. నోట్ల రద్దుతో కోళ్ల పరిశ్రమ తీవ్రంగా నష్టపోరుుందని.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. నోట్ల రద్దుతో నష్టాలు.. నోట్ల రద్దు ప్రభావంతో గుడ్లు, చికెన్ ధరలు పడిపోతున్నాయని మంత్రి తలసాని పేర్కొన్నారు. కోళ్ల పరిశ్రమను మరింత వృద్ధిలోకి తీసుకురావడానికి సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని పశు సంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్చందా పేర్కొన్నారు. జీఎస్టీ నుంచి కోళ్ల పరిశ్రమను, వ్యవసాయరంగాన్ని మినహారుుంచాలని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంజిత్రెడ్డి కోరారు. రాష్ట్ర కోళ్ల సంఘం అధ్యక్షుడు ఎరబ్రెల్లి ప్రదీప్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా..3 రోజుల పాటు జరిగే కోళ్ల ప్రదర్శనలో 32 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 49 విదేశీ కంపెనీలు, 199 భారతీయ కంపెనీలు స్టాళ్లను ఏర్పాటు చేశారుు. -
మూడు వేల కోళ్లు మృత్యువాత
హైదరాబాద్ : ఎండల తీవ్రత కోళ్లఫారాల యజమానులను తీవ్ర నష్టాల పాలు చేస్తోంది. ఎండ వేడిమికి హయత్నగర్ మండలం గడిచెరువు సమీపంలో ఓ కోళ్ల ఫారంలో శనివారం మూడు వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ పరిణామంతో ఫారం నిర్వాహకుడు శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
వడదెబ్బకు వెయ్యి కోళ్లు మృతి
ఎండతీవ్రతకు తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం లక్ష్మారావుగూడలోని ఓ ఫారంలో వేయి కోళ్లు చనిపోయాయి. గ్రామానికి చెందిన వెంకటయ్య అనే తనకున్న చేనులో రెండు షెడ్లను అప్పుచేసి వేశాడు. ఒక్కో షెడ్డులో మూడు వేల కోళ్లను పెంచే వీలుంది. రెండు రోజులుగా ఎండ తీవ్రత పెరగటంతో రెండు షెడ్లలోని కోళ్లకు చల్లదనం కోసం ఏర్పాట్లు కూడా చేశాడు. అయినప్పటికీ గురువారం వెయ్యి కోళ్లు చనిపోయాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈనెల ఆరంభం నుంచి ఎండ వేడిమికి కోళ్లు మృత్యువాత పడుతుండటంతో ఇప్పటి వరకు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని చెప్పాడు. -
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి!
రైతుకు నష్టం.. వినియోగదార్లకు భారం వ్యాపారుల ఇష్టారాజ్యం మార్కెట్లో చికెన్, గుడ్ల పరిస్థితి పట్టించుకోని యంత్రాంగం విశాఖపట్నం:ఎక్కడైనా డిమాండ్ తగ్గినా, ఉత్పత్తి పెరిగినా సరకు ధర తగ్గుతుంది.దీంతో వినియోగదారుడికి ప్రయోజనం చేకూరుతుంది. కానీ పౌల్ట్రీ పరిశ్రమలో మాత్రం ఈ సూత్రం వర్తించడం లేదు. ధర ఎగబాకితే వ్యాపారులు వినియోగదారుడిపై వెనువెంటనే పెంచేస్తున్నారు. రేటు పడిపోతే నామమాత్రంగా తగ్గిస్తున్నారు. ఫలితంగా వ్యాపారికే తప్ప అటు రైతుకు, ఇటు వినియోగదారుడికి మేలు జరగడం లేదు. కొన్నాళ్లుగా జిల్లాలో ఇదే జరుగుతోంది. వేసవి సీజన్ జూన్, జులై నెలల్లో కోళ్ల పరిశ్రమ ఒకింత లాభదాయకంగా నడిచింది. ఆగస్టు నుంచి సంక్షోభంలో పడింది. రైతులు, ఇంటిగ్రేటెడ్ కంపెనీలు కోళ్ల పెంపకాన్ని చేపడుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ కంపెనీల రాకతో కోళ్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఫలితంగా వాటి ధర కూడా తగ్గుముఖం పట్టింది. అయితే ధరలు తగ్గినప్పుడు రైతులు, ఇంటిగ్రేటెడ్ కంపెనీల నుంచి తక్కువ ధర కే కొనుగోళ్లు జరిపే వ్యాపారులు ఆ మేరకు వినియోగదార్లకు తగ్గించి అమ్మడం లేదు. ఏదో నామమాత్రపు తగ్గింపుతో అమ్మకాలు సాగిస్తున్నారు. వాస్తవానికి నెల రోజుల నుంచి ఫారం రేటు (రైతు ధర) కిలో రూ.45-52లు, స్కిన్తో రూ.100 నుంచి 110లు, స్కిన్లెస్ 118-128ల వరకు ఉంది. కానీ చాలాచోట్ల చికెన్ వ్యాపారులు స్కిన్, స్కిన్లెస్ ధరలపై రూ.20లకు పైగా పెంచి విక్రయిస్తున్నారు. దీనివల్ల వినియోగదారునికి అదనపు భారమవుతోంది. ఇప్పటికే కోళ్ల రైతులు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఫారం ధర కనీసం రూ.65లకు పైగా ఉంటేనే వారు నష్టాల నుంచి బయటపడతారు. కానీ కిలోకు సరాసరి రూ.15ల వరకు నష్టాన్ని భరించాల్సి వస్తోంది. ఇందులో సగం మొత్తాన్ని పెంచినా రైతు కోలుకునే అవకాశం ఉంటుంది. లేదా యాజమాన్యాలు నిర్ణయించిన ధరకే విక్రయిస్తే వినియోగదారునికి ఊరట లభిస్తుంది. ఇప్పుడు ఆ రెండూ అమలు చేసేవారు లేరు. చికెన్ వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి నిర్ధిష్ట ధరలకే చికెన్ విక్రయాలు జరిగేలా ప్రయత్నిస్తున్నామని బ్రాయిలర్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ విశాఖ (బ్యాగ్) అధ్యక్షుడు ఆదినారాయణ ‘సాక్షి’కి చెప్పారు. కోడిగుడ్లదీ అదే దారి.. మరోవైపు కోడిగుడ్లదీ అదే పరిస్థితి. కోళ్ల దాణా ధర విపరీతంగా పెరగడంతో కొన్నాళ్లుగా కోడిగుడ్ల పరిశ్రమ కూడా పల్టీలు కొడుతోంది. ఒక్కో గుడ్డుకు సగటున రూ.3.30ల నుంచి 3.50ల వరకు ఉత్పత్తి వ్యయం అవుతోంది. కానీ రైతు ధర మాత్రం రూ.3లకు మించడం లేదు. గతంలో రూ.16-17లున్న కిలో దాణా ధర ఏడాదిగా రూ.22లు ఉంది. కోడికి ఒక గుడ్డు పెట్టడానికి 150 గ్రాముల దాణా అవసరం. ఈ లెక్కన రూ.3లు దాణాకు, మిగిలింది ఇతరత్రా ఖర్చవుతోందని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (నెక్) జాతీయ కార్యవర్గ సభ్యుడు భరణికాన రామారావు ‘సాక్షి’కి తెలిపారు. కాగా రైతు నుంచి వ్యాపారులు రూ.3ల లోపే కొనుగోలు చేసి రిటైల్ మార్కెట్లో రూ.4ల వరకు అమ్మకాలు చేస్తున్నారు. అంటే రైతుకు గుడ్డు దగ్గర 50 పైసలు నష్టం వస్తుంటే, వ్యాపారికి రూపాయి లాభం చేకూరుతోంది. కానీ గుడ్డు ధర పతనమైనా వినియోగదారునికి మాత్రం ప్రయోజనం ఏమీ ఉండడం లేదు. ఇలా ఇటు చికెన్, అటు కోడిగుడ్ల ధరలు పతనమవుతున్నప్పుడు అటు రైతు నష్టపోతుండగా, ఇటు వినియోగదారునికి ఏమంత ఊరట దక్కడం లేదు. -
కోళ్ల పరిశ్రమకు రాయితీ కావాలి: ఎన్ఈసీసీ
హైదరాబాద్: కోళ్ల పరిశ్రమ తీవ్ర గడ్డు స్థితిలో ఉందని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (నెక్) ఆవేదన వ్యక్తం చేసింది. బ్యాంకింగ్ రుణాలు, వడ్డీ పునః చెల్లింపులపై ఏడాది పాటు మారటోరియం విధించాలని ప్రభుత్వానికి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. కనీసం 6 శాతం వడ్డీ సబ్వెర్షన్ మూడేళ్ల పాటు అమలు చేయాలని కోరింది. ఉత్పత్తి వ్యయం పెరిగిన నేపథ్యంలో అదనపు వర్కింగ్ కేపిటల్ రుణాలను ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఎగుమతులు, స్పెక్యులేషన్, కనీస మద్దతు ధరల పెంపు వంటి పలు కారణాల వల్ల గడచిన నాలుగేళ్లుగా మొక్కజొన్న, సొయా వంటి కోళ్ల దాణా వ్యయం భారీగా పెరిగిందని పేర్కొంది. ఆయా కారణాల వల్ల గత ఏడాది రూ.2.60 ఉన్న గుడ్డురేటు ప్రస్తుతం రూ.3.50 స్థాయికి పెరిగిందని వివరించింది. అయితే సగటున ఫామ్గేట్ రేటు గుడ్డుకు రూ.3.00 నుంచి రూ.3.25 వరకూ పడుతోందని తెలిపింది. ఈ నేపథ్యంలో గుడ్డుకు రైతుకు 50 పైసల నష్టం వస్తోందని తెలిపింది. అలాగే బ్రాయిలర్స్ (లైవ్ వెయిట్) విషయంలోనూ నికరంగా రూ.10 నష్టం వస్తున్నట్లు పేర్కొంది. -
కోళ్ల పరిశ్రమ రుణాల రీషెడ్యూల్!
బ్యాంకర్లతో సర్కారు సమాలోచనలు బర్డ్ఫ్లూతో చితికిపోయిన పౌల్ట్రీ రైతులు రూ.2,000 కోట్ల రుణభారం.. రీషెడ్యూలుకు విజ్ఞప్తి హైదరాబాద్: బర్డ్ఫ్లూతో కుదేలైన కోళ్ల పరిశ్రమను ఆదుకునేందుకు రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాధ్యాసాధ్యాలపై బ్యాంకర్లతో సంప్రదింపులు ప్రారంభించింది. తెలంగాణలో ఉన్న కోళ్ల పరిశ్రమలపై దాదాపు రూ. 2,000 కోట్ల బ్యాంకు రుణాలున్నాయి. ఇప్పుడున్న సంక్షోభ పరిస్థితుల్లో వీటిని తిరిగి చెల్లించ డం గుదిబండగా మారిందని పౌల్ట్రీ రైతులు తల్లడిల్లుతున్నారు. నష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమాలోచనలు జరిపారు. పౌల్ట్రీ రంగ ప్రతినిధులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు, గుడ్లు, చికెన్ ధర పడిపోయిందని.. ఒక్కసారిగా అమ్మకాలు పడిపోవటంతో అపార నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మూడేళ్లుగా కోళ్ల పరిశ్రమ నష్టాల బాటలోనే ఉంది. రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది రైతులు పౌల్ట్రీని నమ్ముకున్నారు. వీరిలో ఎనభై శాతం మంది రైతులు వరుస నష్టాలతో చితికిపోయారు. ఇటీవలి బర్డ్ ఫ్లూ దెబ్బకు చిన్న రైతులు మరింత విలవిలలాడిపోయారు.. కొత్త రుణాలు అందించి కుదేలైన పరిశ్రమకు చేయూతను అందించాలి’అని పౌల్ట్రీ ప్రతినిధులు బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తీసుకున్న బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి లేనందున.. పాత రుణాలను రీషెడ్యూలు చేయటంతో పాటు కొత్త రుణాలు ఇప్పించాలని కోరారు. స్పందించిన ఆర్థిక మంత్రి సాధ్యాసాధ్యాలపై బ్యాంకర్లతో చర్చించారు. 2008లో పశ్చి మ బెంగాల్లో బర్డ్ ఫ్లూ సోకినప్పుడు అక్కడి పౌల్ట్రీ రుణాలను రీషెడ్యూలు చేసేందుకు ఆర్బీఐ అనుమతించింది. ఒక ఏడాది పాటు మారటోరియం విధించటంతో పాటు తదుపరి మూడేళ్లు రుణాలను చెల్లించేం దుకు వెసులుబాటు కల్పించిం ది. కొత్త రుణాల మంజూరీకి అనుమతించింది. రాష్ట్రంలోనూ కోళ్ల పరిశ్రమ విపత్కర పరిస్థితుల్లో ఉన్నందున అదే తీరుగా రుణ భారం నుంచి ఉపశమనం కల్పించేందుకు చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు. -
బర్డ్ఫ్లూతో భయాందోళన వద్దు
చికెన్, గుడ్లు నిరభ్యంతరంగా తినొచ్చు ప్రపంచంలో ఏ ఒక్కరికీ బర్డ్ఫ్లూ సోకిన దాఖలాలు లేవు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దే వైరస్ చనిపోతుంది టీఆర్ఎస్ ప్లీనరీకి 4 వేల కేజీల చికెన్, 8 వేల గుడ్లు ఆర్డర్ కోళ్ల పరిశ్రమ వ్యాపారులు, సంఘాల నేతల వెల్లడి సాక్షి, హైదరాబాద్: బర్డ్ఫ్లూతో భయాందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని.. చికెన్, గుడ్లు నిర భ్యంతరంగా తినొచ్చని కోళ్ల పరిశ్రమ ప్రతినిధులు చెప్పారు. మంగళవారమిక్కడ జరిగిన సమావేశంలో తెలంగాణ కోళ్ల సమాఖ్య అధ్యక్షుడు ఇ.ప్రదీప్కుమార్ రావు, కోళ్ల బ్రీడర్స్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జి.రంజిత్రెడ్డి, జాతీయ గుడ్ల పర్యవేక్షణ కమిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.జి.ఆనంద్, హైదరాబాద్ లేయర్ రైతుల సంఘం అధ్యక్షుడు కె.మోహన్రెడ్డి, అఖిల భారత కోళ్ల అభివృద్ధి సేవల జీఎం బాలసుబ్రమణ్యం మాట్లాడారు. బర్డ్ఫ్లూ వల్ల కోళ్ల ఫారాల్లో పనిచేసే వారికే కాస్తోకూస్తో సోకే ప్రమాదం ఉందని... అయితే చికెన్ తిన్నవారికి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్ రంజిత్రెడ్డి స్పష్టంచేశారు. ఈ వైరస్ 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్దే చనిపోతుందన్నారు. మన దేశంలో గుడ్లు, చికెన్ వంటకాలను 100 నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉడికిస్తామని... అందువల్ల బర్డ్ఫ్లూ వైరస్ ఉన్న చికెన్ తిన్నా ఏమాత్రం ప్రమాదం ఉండదని భరోసా ఇచ్చారు. త్వరలో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా 4 వేల కేజీల చికెన్, 8 వేల గుడ్లు ఆర్డర్ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బర్డ్ఫ్లూ మనిషికి సోకిన కేసులు ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా నమోదు కాలేదన్నారు. దేశంలోనే తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ మొదటిస్థానంలో ఉందన్నారు. 2006 నుంచి ఇప్పటివరకు అనేకసార్లు బర్డ్ఫ్లూ ప్రకటించారని... అయితే రాష్ట్రంలో ఇప్పుడు మూడు రోజుల్లోనే పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంతి కేసీఆర్, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చొరవ తీసుకున్నారన్నారు. హయత్నగర్ మండలం తొర్రూరు కోళ్ల ఫారా ల్లో కోళ్లకు బర్డ్ఫ్లూ సోకిన మూడు రోజుల్లోనే మళ్లీ సాధారణ స్థితికి వచ్చిందని, దీనివల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు. సాధారణంగా కోళ్లు చనిపోతే బర్డ్ఫ్లూ అనుకోవద్దు సాధారణంగా వేసవిలో వేడికి కోళ్లు చనిపోతుంటాయని, వాటిని బర్డ్ఫ్లూ అని ప్రచారం చేయడం శోచనీయమని ప్రదీప్కుమార్ రావు చెప్పారు. నిజామాబాద్లో బర్డ్ఫ్లూ లేదన్నారు. పశుసంవర్థక శాఖ అధికారులు శాంపిళ్లు సేకరించి బెంగళూరు, భోపాల్ ల్యాబ్లకు పంపిన తర్వాత నిర్ధారణ జరుగుతుందన్నారు. ఈ ప్రచారం వల్ల హైదరాబాద్లో 20 శాతం వరకు పౌల్ట్రీ అమ్మకాలు పడిపోయాయని, జిల్లాల్లో మాత్రం ఎలాంటి ప్రభావం లేదన్నారు. కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చి పరిశీలించి ప్రభుత్వ చర్యలకు సంతృప్తి వ్యక్తంచేసిందన్నారు. పౌల్ట్రీ పరిశ్రమపై 5 లక్షల కుటుంబాలు ఆధారపడ్డాయని కె.జి.ఆనంద్ తెలిపారు. -
రంగుల కోళ్లు
‘‘నవ్వు నలభై విధాల రైటు...మీ నవ్వుల కోసమీ ఫీటు’’ అంటున్నాడు అమెరికాలోని పోర్ట్ల్యాండ్లో నివసించే బ్రూస్ విట్మాన్. నలుగురినీ నవ్వించాలని కోరుకునే విట్మ్యాన్ ఒక రోజున కాయగూరల రంగులను కలిపి తన రెండు పెంపుడు కోళ్లకు పూసేసి, పొద్దున్నే తీసుకెళ్లి ఓ పార్క్లో వదిలేశాడు. ఈ రంగుల కోళ్లు అందర్నీ ఆకట్టుకున్నాయి. వాటిని చూడడం, ఫొటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. ‘‘వింత మీకు వార్త మాకు’’ అన్నట్టు రెడీగా ఉండే మీడియాలో ఏవో వింత పక్షులు సిటీకి విహారానికి వచ్చినట్లు వార్తలు కూడా వచ్చేశాయి. కాసేపట్లోనే సదరు కోళ్లు సెలబ్రిటీలైపోవడం వరకూ ఓకెగాని, స్థానిక ముల్తానోమా కౌంటీ యానిమల్ సర్వీసెస్ వాళ్లు వచ్చేసి ఆ కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వాళ్లని సంప్రదించిన వైట్మాన్... అవి తన కోళ్లేనని లబోదిబోమన్నాడట. వాటికి రంగులు పూయడం వెనుక ఉన్న నవ్వించే ఆలోచన మంచిదే అయినా... అలా పెంపుడు కోళ్లను గాలికొదిలేయడం సరైంది కాదని మందలించిన యానిమల్ సర్వీసెస్ వాళ్లు... వాటిని కాసేపు సంరక్షించినందుకు కోడికి 16 డాలర్ల చొప్పున వసూలు చేసి మరీ వాటిని తిరిగి ఇచ్చారట! -
కోళ్ల పరిశ్రమకు విద్యుత్ రాయితీ
* యూనిట్కు రూ. 2.20 ఇవ్వాలని టీ సర్కారు నిర్ణయం * మార్గదర్శకాల తయారీలో పశుసంవర్థక శాఖ అధికారులు * బడ్జెట్ సమావేశాల అనంతరం జీవో జారీ * 8,250 పరిశ్రమలకు ప్రయోజనం * ప్రభుత్వంపై నెలకు 4 కోట్ల భారం సాక్షి, హైదరాబాద్: కోళ్ల పరిశ్రమకు యూనిట్కు రూ.2.20 విద్యుత్ రాయితీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై శాసనసభ సమావేశాల అనంతరం జీవో వెలువడుతుందని ఉన్నతాధికార వర్గాలు చెప్పాయి. కోళ్ల పరిశ్రమకు విద్యుత్ రాయితీ ఇచ్చేందుకు పశుసంవర్థక శాఖ అధికారులు మార్గదర్శకాలు తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కోళ్ల పరిశ్రమ వ్యాపారులు విద్యుత్ చార్జీల కింద యూనిట్కు రూ.6.08 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం యూనిట్కు రూ.2.20 రాయితీ ఇస్తే వ్యాపారులు రూ.3.88 చెల్లిస్తే సరిపోతుంది. దీంతో ప్రభుత్వంపై నెలకు రూ.4 కోట్ల భారం పడనుందని అధికారులు తెలిపారు. జీవో జారీ అనంతరం నవంబర్ బిల్లు నుంచే ఈ రాయితీ వర్తింపజేస్తామని పశుసంవర్థకశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే రాయితీ సొమ్మును ఎలా ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. సబ్సిడీని ఆర్థికశాఖ నేరుగా సంబంధిత విద్యుత్ శాఖకు పంపిస్తుందా? లేక పశుసంవర్థక శాఖ పంపుతుందా అనేది స్పష్టత రాలేదని అంటున్నారు. బడ్జెట్లో మాత్రం కోళ్ల పరిశ్రమకు కేటాయించిన రూ.20 కోట్లను పశుసంవర్థక శాఖ పద్దులోనే చూపించారు. 6 వేల బాయిలర్, 2 వేల లేయర్ కోళ్ల పరిశ్రమలు తెలంగాణలో 2 వేల లేయర్ కోళ్ల పరిశ్రమలున్నాయి. వాటిల్లో నాలుగున్నర కోట్ల గుడ్లు పెట్టే కోళ్లుంటాయి. అలాగే 6 వేల బాయిలర్ కోళ్ల ఫారాలున్నాయి. వీటిల్లో వెయ్యి నుంచి మొదలు 2 లక్షల కోళ్ల వరకు ఉండే ఫారాలున్నాయి. ఇంకా 250 బ్రీడర్ ఫారాలున్నాయి. మొత్తం 8,250 కోళ్ల పరిశ్రమలు ఉన్నాయి. వీటి టర్నోవర్ రూ.12 వేల కోట్లు. రాష్ట్రంలో పండించే మొక్కజొన్న ఉత్పత్తిలో 70 శాతం (21 లక్షల టన్నులు) ఈ పరిశ్రమకే సరఫరా చేస్తారు. 6 లక్షల టన్నుల సోయా చెక్కను ఈ పరిశ్రమే వినియోగిస్తుంటుంది. ఇంత భారీ పరిశ్రమ కావడంతో ప్రభుత్వం వ్యవసాయ హోదా ఇస్తానని ప్రకటించింది. విద్యుత్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం పట్ల ఆ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం కోళ్ల పరిశ్రమకు రాయితీపై నోరు మెదపలేదు. తాము ఆ రాష్ట్రాన్ని కూడా విద్యుత్ రాయితీ కోరినట్లు జాతీయ కోడిగుడ్ల సమన్వయ సంఘం బిజినెస్ మేనేజర్ సంజీవ్ చింతావార్ చెప్పారు. -
కోళ్ల పరిశ్రమకు ప్రోత్సాహకాలు
⇒ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి ⇒ పౌల్ట్రీ ఎక్స్పో-2014ను ప్రారంభించిన సీఎం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కోళ్ల పరిశ్రమకు అన్ని విధాలా ప్రోత్సాహకాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. భూమి సహా ఎలాంటి సహకారం ఇవ్వడానికైనా సిద్ధమని హామీయిచ్చారు. బుధవారం హైటెక్స్లో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఎక్స్పో-2014ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో కోళ్ల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. బడ్జెట్లో పౌల్ట్రీ రంగానికి నిధులను రూ. 90 కోట్ల నుంచి రూ. 220 కోట్లకు పెంచామని వివరించారు. ఈ రంగానికి ఊతం లభించేలా ఐసీడీఎస్ కేంద్రాలకు గుడ్ల పంపిణీని 3 కోట్ల నుంచి 5.25 కోట్లకు పెంచామన్నారు.హాస్టల్ విద్యార్థులకు ఇంతకుముందు వారానికి రెండు గుడ్లు ఇస్తే... ఇప్పుడు వారానికి మూడు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు ఇస్తామన్నారు. చికెన్, గుడ్లు మంచి పౌష్టిక ఆహారం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కోళ్ల పరిశ్రమకు అపారమైన అవకాశాలున్న దృష్ట్యా దేశవిదేశీ పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు రావాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వ్యాట్పై ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేనని... ఆ తర్వాత పౌల్ట్రీ ప్రతినిధులు తనను కలిస్తే గంట లోగానే వ్యాట్పై ప్రకటన చేస్తానని వెల్లడించా రు. కోళ్ల పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అమెరికా నుంచి ‘చికెన్ లెగ్స్’ దిగుమతులపై నియంత్రణ పాటించాలని సీఎం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కోళ పరిశ్రమ అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి సంజీవ్కుమార్ తెలిపారు. 12వ పంచవర్ష ప్రణాళికలో కోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 2,800 కోట్లు కేటాయించామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగంలో కోళ్ల పరిశ్రమే వేగంగా దూసుకుపోతుందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో పలు పౌల్ట్రీ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజుకు రెండు గుడ్లు తింటా: పోచారం తాను రోజూ ఉదయం అల్పాహారం కింద రెండు గుడ్లు తింటానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పౌల్ట్రీ సదస్సులో ఆయన మాట్లాడుతూ గుడ్డు మంచి పౌష్టికాహారం అని అన్నారు. ఇది మాంసాహారం కాదన్నారు. గుడ్ల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో ఉందన్నారు. కాగా పాడి రైతులకు ప్రోత్సాహం కింద లీటరు పాలకు రూ. 4 ఇస్తున్నామన్నా రు. విజయ డెయిరీ పాల ఉత్పత్తి సామర్థ్యం 5 లక్షల లీటర్లు ఉందన్నారు. మరో డెయిరీ ఏర్పాటుకు రూ. 240 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పేద మహిళలకు ఒక్కొక్కరికి రెండు గేదెలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. 50 వేల కుటుంబాలకు గేదెలు ఇచ్చి పాల ఉత్పత్తి పెంచుతామన్నారు. -
కోళ్ల రైతు కుదేలు
బాన్సువాడ: కోళ్ల పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. భారీగా పెరిగిన మేతల ధరలతో కోడిని పెంచాలంటేనే కష్టంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బాన్సువాడ, ఆర్మూర్, మోర్తాడ్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలతో పాటు, జిల్లాలోని పలు చోట్ల పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు లక్షకు పైగా గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఏటా పౌల్ట్రీ పరిశ్రమ విస్తరిస్తూనే ఉంది. కాగా. గతేడాది మూడు రూపాయలు ఉన్న గుడ్డు ధర ప్రసు ్తతం నాలుగు రూపాయలకు పెరిగింది. అయినా రైతులకు మాత్రం లాభం చేకూరడం లేదు. గతంలో కంటే ప్రస్తుతం మేత ధరలలో భారీగా వ్యత్యాసం రావడమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. పౌల్ట్రీలో మేతకు ఉపయోగించే సోయా కిలోకు 45 రూపాయలకు పలుకుతోంది. వేరుశనగ కిలోకు 36 రూపాయలు, పొద్దు తిరుగుడు పిండి 29 రూపాయలు, డీఓబీ పది రూపా యలు ఉంది. మేతలో మొక్కజొన్న, నూకలు, సోయా, ఎండు చేప, మీట్ మిల్, డీఓబీవంటి ధాన్యాలు ఎక్కువగా వాడుతారు. కోళ్లకు అవసరమైన విటమన్ బి కాంప్లె క్స్ వంటివి మేతలోనే కలిపి ఇస్తారు. గుడ్లు పెట్టే కోడి రోజుకు 120 నుంచి 130 గ్రాములు వరకు మేత తింటుంది. కోళ్ల అనారోగ్య స్థితిని బట్టి నీటిలో మందులు వాడతారు. ప్రభుత్వం సోయా, మొక్కజొన్నవంటి ధాన్యాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో వీటి కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని రైతులు ఆరోపి స్తున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి సోయాతోపాటు మొక్కజొన్న వంటి ధాన్యాలు అందుబాటులోకి రావని అంటున్నారు. పౌల్ట్రీ ఫారంలో వెయ్యి కోళ్ళు ఉంటే ఉం టే 800 గుడ్లు ఉత్పత్తి అవుతాయి. హోల్ సెల్ ధరలో గుడ్డు మూడు రూపాయల చొప్పున రూ. 2,400 ఆదాయం వస్తుంది. మేత కోసం వెయ్యి కోళ్లకు 2,200 వెచ్చిస్తే మిగిలేది రూ. 200 మాత్రమే. గుడ్డు పెట్టే కోళ్ల తయారీకి అవసరమైన పిల్లలను పెంచడానికి అవసరమైన పెట్టుబడిని రైతులు అదనంగా భరించాల్సిన పరిస్థితి ఉంది. ఐదు వేల మంది కార్మికుల జీవనాధారం జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమపై సుమారుగా ఐదు వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ధరల పెరుగుదలతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ప్రస్తుత ధరలను బట్టి కూలీల ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు ఇతరేతర ఖర్చులు అదనంగా భరించే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు బ్యాంకు రుణాలు సైతం భరించా ల్సిందే. కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితుల్లో మేతలు ఆడడానికి కూలీలకు అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. దీని వల్ల ఇద్దరు కూలీలకు 500 రూపాయలు ఇచ్చే పరస్థితి ఏర్పడింది. ఒక పక్క విద్యుత్తు కోత, మరో పక్క మేత ధరలతో పౌల్ట్రీ రంగం కోటుకోలేని నష్టాలను భరించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పౌల్ట్రీ రైతులకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
పౌల్ట్రీ..పల్టీ..
ఈ ఏడాది భానుడి చండ ప్రచండ గాడ్పులకు చెట్టంత మనుషులే పిట్టల్లా రాలిపోతున్నారు. మరిక కోళ్ల సంగతో... రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన పరిశ్రమగా గుర్తింపు పొంది, కోట్లాది రూపాయల టర్నోవరు జరుగుతున్న పౌల్ట్రీ పరిశ్రమ ఈ ఎండలకు గుడ్లు తేలేస్తోంది. ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నా...జూన్ రెండోవారంలో సైతం కనీవినీ ఎరుగని రీతిలో కాస్తున్న ఎండలు, వీస్తున్న వడగాడ్పులకు ఓ పక్క కోళ్లు టపటపా రాలిపోతున్నాయి. మరోపక్క ఎండల ప్రభావంతో గుడ్ల ఉత్పత్తి కూడా తగ్గిపోతోంది. కొల్లిపర తెనాలి డివిజన్లో గుదిబండివారిపాలెం గ్రామానికి ఓ విశిష్టత ఉంది. ఈ గ్రామంలో రైతులంతా సమష్టి వ్యవసాయం తరహాలో సమష్టిగా కోళ్లఫారాలను నడుపుతుంటారు. రైతుకు గతంలో పాడి పరిశ్రమ ఎలా ఉండేదో, అలా ఇక్కడ పౌల్ట్రీ పరిశ్రమ నడుస్తోంది. కుటీర పరిశ్రమల తరహాలో ఐదారుగురు రైతులు కలసి ఒక కోళ్లఫారం యూనిట్ నడుపుకుంటుంటారు. ఈ విధంగా గ్రామంలో సుమారు 120 మంది రైతులు 34 కోళ్లఫారం యూనిట్లు నిర్వహిస్తున్నారు. దాదాపు 30 ఏళ్లుగా గ్రామంలో కోళ్లఫారాలను నడుపుతూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పౌల్ట్రీఫారాలు పెట్టడానికి కారణం... డెల్టా ప్రాంతమైన కొల్లిపర మండలంలో దివిసీమ ఉప్పెన అనంతరం పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టాల పాలయ్యారు. ఈ ప్రాంతంలో ప్రధానంగా వరితో పాటు వాణిజ్య పంటలైన పసుపు, అరటి పండిస్తారు. వాణిజ్య పంటలకు పెట్టుబడి ఎక్కువ పెట్టాల్సిరావడంతో చిన్నా,చితకా రైతులు పెట్టుబడి పెట్టలేక ప్రత్యామ్నాయంగా కోళ్లఫారాల వైపు మళ్లారు. వాటికి కూడా ఒక్కరే ఎక్కువ పెట్టుబడి పెట్టలేక... తలా ఒక రెండు వేల కోళ్ల చొప్పున ఐదారుగురు రైతులు కలసి 10 లేదా 12 వేల కోళ్లతో ఒక కోళ్లఫారం యూనిట్ పెట్టుకుని సమష్టిగా నడుపుకోవడం ప్రారంభించారు. అలా గ్రామంలో ఒకరిని చూసి మరొకరు... మొత్తం 34 కోళ్లఫారం యూనిట్లు పెట్టారు. గత మూడు దశాబ్దాలుగా ఫారాలు నడుపుకుంటూ రైతులు ఒకవేళ ఒక ఏడాది పంటలు పండకపోయినా ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటుచేసుకోగలిగారు. మండలంలో గుదిబండివారిపాలెంతో పాటు హనుమాన్పాలెం, మున్నంగి గ్రామాల్లో కూడా కోళ్లఫారాలు ఉన్నాయి. ఎండలకు డంగైపోతున్న కోళ్లు... ఈ ఏడాది మండే ఎండలతో పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు కుదేలైపోతున్నారు. మండలంలో దాదాపు 50 కోళ్ల ఫారాల్లో సుమారుగా 3 లక్షల కోళ్లను పెంచుతున్నారు. రోజుకు 2.50 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. గుడ్లను ఇక్కడనుంచి అస్సాం, బీహర్, సిక్కిం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడాది వేసవి కాలంలో ఎండలు, ఈదురుగాలులు తీవ్రంగా ఉండడం వల్ల వేడికి తట్టుకోలేక ఇప్పటికి 10 శాతం కోళ్లు మృతి చెందినట్టు పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. గుడ్ల ఉత్పత్తి కూడా 30 శాతం తగ్గినట్టు, పెరిగిన దాణా, ఇతర ఖర్చులు, వ్యాధుల కారణంగా గత ఏడాదికంటే ఈ ఏడాది 40 వేల కోళ్ల పెంపకాన్ని తగ్గించినట్టు పౌల్ట్రీ యజమానులు తెలిపారు. పెరిగిన దాణా ధరలు.. రెండేళ్ల క్రితం కిలో సోయా కేక్ ధర రూ.17 ఉండగా ఇప్పుడు రూ.45 ఉంది. సోయాకు తోడు సన్ఫ్లవర్, వేరుశెనగ చెక్క రేట్లు కూడా పెరగడంతో దాణా ఖర్చు విపరీతంగా పెరిగింది. ఒక్కరోజు కోడిపిల్ల నుంచి 150 రోజుల వరకు ఒక్కొక్క కోడికి దాణా ఖర్చు రూ.200 అవుతుంది. కోడి పిల్ల ధర రూ.28 ఉంది. కోడి గుడ్డు పెట్టడం మొదలు పెట్టిన తరువాత 365 రోజు లకు గాను 310 గుడ్లు పెడుతున్నాయి. మొదటి నెల చిన్న గుడ్లు మూలంగా ఏడాదికి ఒక్కో కోడికి వ్యాపారులు నాలుగు రూపాయిలు తగ్గిస్తారు. తగ్గిన గుడ్ల ధరలు.. రిటైల్గా కోడిగుడ్డు రూ.4 అమ్ముతుండగా వ్యాపారస్తులు కోళ్ల ఫారాల వద్ద రూ.2.50 పైసలకే కొనుగోలు చేస్తున్నారు. నెక్ ధరల ప్రకారం రూ.2.80 ఉంటుంది. ఒక్కో గుడ్డుకు కనీసం రూ.3.50 ఉంటే గాని గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. మండే ఎండలతో మృతిచెందుతున్న కోళ్లు గత 10 రోజులుగా ఈదురుగాలులకు, ఎండలకు కోళ్లను సురక్షితంగా ఉంచడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, కొన్ని కోళ్లు మృతి చెందుతున్నాయి. షెడ్డులపై స్ప్రింకర్లు ఏర్పాటు చేసి నీళ్లు పెడుతున్నా ఉపయోగం లేకుండా పోతోంది. రోజు ఎన్నో కొన్ని కోళ్లు మృతి చెందుతూనే ఉన్నాయని కోళ్ల ఫారం యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కోతల వల్ల నీళ్లు పెట్టడానికి కూడా ఇబ్బంది పడాల్సివస్తోందని వాపోతున్నారు. రుతుపవనాలు వచ్చి వర్షాలు పడితే గాని, ఈ పరిస్థితిలో మార్పు ఉండదని భావిస్తున్నారు. సబ్సిడీపై విద్యుత్ అందించాలి మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్ రెడ్డి గత ఏడాది నవంబర్లో పౌల్ట్రీలకు సబ్సిడీపై విద్యుత్ను అందజేస్తామన్నారు. కానీ ఇంతవరకు అమలుకాలేదు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వమైనా పౌల్ట్రీ యజమానులను ఆదుకోవాలి. పౌష్టికాహారమైన గుడ్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటే రైతులు, కోళ్లఫారం యజమానులు, కోళ్ల ఫారాలపై ఆధారపడి జీవించేవారికి మెరుగైన జీవనోపాధి లభిస్తుంది. - గుదిబండి శ్రీనివాసరెడ్డి పౌల్ట్రీ పరిశ్రమను ప్రభుత్వం ఈ ఏడాది పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. ఎండ తీవ్రతకు కోళ్లు అధిక సంఖ్యలో చనిపోతున్నాయి. దీంతో పెంపకందారులు నష్టాల బారినపడుతున్నారు. ప్రభుత్వం పరిశ్రమకు ఆర్థిక చేయూత ఇచ్చి ప్రోత్సహించాలి. కోళ్ల దాణా సబ్సిడీపై అందించాలి. పరిశ్రమకు అవసరమైన విద్యుత్ను ఉచితంగా అందించాలి. - కూరపాటి రవిశేఖర్రెడ్డి, కొల్లిపర -
సంక్షేమం, సాగునీరు, బ్రాండ్ హైదరాబాద్
ఇవే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాధాన్యతలు! - హైదరాబాద్-వరంగల్ మార్గంలో ప్రత్యేక కారిడార్ - ఫార్మా, పౌల్ట్రీ, టూరిజం హబ్గా మార్చేందుకు ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ర్టంలో సంక్షేమం, సాగునీరు, బ్రాండ్ హైదరాబాద్ అంశాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. రాష్ట్ర జనాభాలో 85 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలే ఉన్నందున వారి కోసం సంక్షేమ శాఖలను తన వద్దే పెట్టుకున్నట్లు కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం అసెంబ్లీ లాబీలో కేసీఆర్ సన్నిహిత మంత్రి ఒకరు మీడియాతో ఇష్టాగోష్టిగా ముచ్చటిస్తూ ముఖ్యమంత్రి విజన్ను వివరించారు. ‘ఉద్యమాలు ముగిశాయి. ఇక కేసీఆర్ తన దృష్టిని పూర్తిగా తెలంగాణ అభివృద్ధిపైనే కేంద్రీకరించారు. చంద్రబాబు మాదిరిగా ప్రచారం పొందాలని చూడటం లేదు. సాగునీరు, సంక్షేమం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు’ అని ఆయన చెప్పారు. ‘తమిళనాడు తరహాలో పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలను అందించాలని కేసీఆర్ భావిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తానంటున్నారు. 125 గజాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు’ అని పేర్కొన్నారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఏఐబీపీ నిధులను తెచ్చుకుని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తెలంగాణలో చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్-వరంగల్ హైవేలో ప్రత్యేక కారిడార్ను ఏర్పాటు చేసి ఫార్మా, టూరిజం, పౌల్ట్రీ హబ్గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ రహదారి పొడవునా 36 ఫార్మా కళాశాలలు, వందలాది పౌల్ట్రీ ఫారాలతోపాటు ప్రస్తుతమున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సదరు మంత్రి వెల్లడించారు.